-
రోహిత్ శర్మ ఫ్లైయింగ్ కిస్.. ఫొటోలు డిలీట్ చేసిన సన్రైజర్స్
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ సహచర ఆటగాళ్లతో ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కీలక సమయంలో కాస్త గట్టిగానే సలహాలు, సూచనలు ఇచ్చే హిట్మ్యాన్.. అప్పుడప్పుడూ చిలిపి చేష్టలతో వారిని ఆటపట్టిస్తుంటాడు కూడా! తాజాగా రోహిత్ శర్మ ‘బాధితుల’ జాబితాలో సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చేరాడు. కాగా ఐపీఎల్-2024లో తమ రెండో మ్యాచ్లో భాగంగా ముంబై ఇండియన్స్ సన్రైజర్స్తో తలపడనుంది. ఉప్పల్ వేదికగా ఇరు జట్ల మధ్య బుధవారం రాత్రి మ్యాచ్ జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న సందర్భంగా రోహిత్ శర్మ.. మయాంక్ అగర్వాల్ను టీజ్ చేశాడు. మయాంక్కు ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ అల్లరి చేశాడు. కోల్కతా నైట్ రైడర్స్ హర్షిత్ రాణాను ఇమిటేట్ చేస్తూ అతడిని ఆటపట్టించాడు. దీంతో మయాంక్ నవ్వు ఆపుకోలేకపోయాడు. ‘‘ఇక చాల్లే’’ అన్నట్లుగా రోహిత్కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సన్రైజర్స్ హైదరాబాద్ ఎక్స్లో షేర్ చేసింది. ‘‘ఫ్లైయింగ్ కిస్సులు.. స్నేహపూర్వక శత్రుత్వాలు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. కాసేపటికే డిలీట్ చేసింది. మయాంక్ పట్ల హర్షిత్ రాణా ప్రవర్తించిన తీరును కూడా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. Rohit Sharma things 😄#RohitSharma𓃵 #MayankAgarwal #MIvsSRH pic.twitter.com/o1C7l2OrGF — RSSB_BEROJGAR (@rssb_berojgar) March 27, 2024 కాగా ఐపీఎల్ పదిహేడో ఎడిషన్లో తమ ఆరంభ మ్యాచ్లో సన్రైజర్స్.. కేకేఆర్తో తలపడ్డ విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో మయాంక్ తొలి ఓవర్ నుంచే హర్షిత్ రాణాను టార్గెట్ చేస్తూ వరుస బౌండరీలు బాదాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 అయితే, అనూహ్యంగా అతడి బౌలింగ్లోనే భారీ షాట్కు యత్నించి వెనుదిరిగాడు. ఈ క్రమంలో కోపంగా.. మయాంక్ను చూస్తూ ఫ్లైయింగ్ కిస్ ఇస్తూ వికెట్ సెలబ్రేట్ చేసుకున్నాడు హర్షిత్. ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ విషయంలోనూ దూకుడుగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో హర్షిత్ రాణా అతి చేష్టలను తీవ్రంగా పరిగణించిన ఐపీఎల్ నిర్వాహకులు.. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కారణంగా మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించారు. అదీ సంగతి! -
IPL 2024 ఓవరాక్షన్కు తగిన మూల్యం చెల్లించుకున్న హర్షిత్ రాణా
కేకేఆర్ పేస్ సంచలనం హర్షిత్ రాణా తాను చేసిన ఓవరాక్షన్కు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. సన్రైజర్స్తో నిన్న జరిగిన మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన రాణా.. మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసిన అనంతరం కోపంగా ఫ్లయింగ్ కిస్ ఇస్తూ సెండాఫ్ ఇచ్చాడు. A flying kiss by Harshit Rana to Mayank Agarwal as a send off.pic.twitter.com/LVkQYKmisZ — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ అతి చేష్ఠలను తీవ్రంగా పరిగణించిన మ్యాచ్ రిఫరీ మను నయ్యర్ రాణా మ్యాచ్ ఫీజ్లో 60 శాతం కోత విధించాడు. ఇదే మ్యాచ్లో రాణా హెన్రిచ్ క్లాసెన్ పట్ల కూడా దురుసుగా ప్రవర్తించాడు. ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకున్న రిఫరీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆర్టికల్ 2.5 నిబంధన ఉల్లంఘన కింద జరిమానా విధించాడు. Harshit Rana fined 60% of his match fees for giving Mayank Agarwal a send off. pic.twitter.com/kTXDBOXUtB — Mufaddal Vohra (@mufaddal_vohra) March 24, 2024 కాగా, నిన్నటి మ్యాచ్లో సన్రైజర్స్ గెలుపుకు చివరి ఓవర్లో 13 పరుగులు కావాల్సి ఉండగా రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. షాబాజ్ అహ్మద్తో పాటు అప్పటికే శివాలెత్తిపోయిన ఉన్న క్లాసెన్ను ఔట్ చేసి కేకేఆర్ను గెలిపించాడు. ఓవర్ తొలి బంతికే క్లాసెన్ సిక్సర్ బాదినప్పటికీ.. సన్రైజర్స్ మిగిలిన ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన రాణా 33 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. HARSHIT RANA, THE HERO OF KKR. SRH needed 13 in 6 balls - 6 on the first ball then 1,W,1,W,0 to win it for KKR. 🤯 pic.twitter.com/oXlzpAEJLV — Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024 ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. సాల్ట్ (54; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రసెల్ (64; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్దసెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగా.. ఛేదనలో క్లాసెన్ (63; 8 సిక్సర్లు) చెలరేగినప్పటికీ సన్రైజర్స్ 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. సన్రైజర్స్ ఈ మ్యాచ్ చేజార్చుకున్నప్పటికీ.. క్లాసెన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో అభిమానుల మనసుల్ని దోచుకున్నాడు. -
IPL 2024: ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకో! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కేకేఆర్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రానా ఓవరాక్షన్ చేశాడు. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను ఔట్ చేసిన అనంతరం రానా సెలబ్రేషన్స్ శృతిమించాయి. ఏమి జరిగిందంటే? 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి అరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో ఫస్ట్ స్పెల్ వేసిన హర్షిత్ రానాను అగర్వాల్ టార్గెట్ చేశాడు. తొలి ఓవర్ నుంచే బౌండరీలు బాదుతూ రానాను మయాంక్ ఒత్తడిలోకి నెట్టాడు. రానా తన తొలి రెండు ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ కెప్టెన్ అయ్యర్ మాత్రం పవర్ ప్లేలో మరో ఓవర్ వేసే అవకాశమిచ్చాడు. ఈ క్రమంలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన రానా బౌలింగ్లో మయాంక్ భారీ షాట్కు ప్రయత్నించి రింకూ సింగ్ చేతికి చిక్కాడు. అయితే వికెట్ తీసిన సంతోషంలో రానా.. మయాంక్ దగ్గరకు వెళ్లి సీరియస్గా చూస్తూ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. మయాంక్ కూడా అతడి వైపు సీరియస్గా చూశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఎందుకంత ఓవరాక్షన్ బ్రో.. కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఓవరాల్గా రానా తన నాలుగు ఓవర్ల కోటాలో 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. Full on Aggression from Harshit Rana Delhi Boy for a reason 🥵💥pic.twitter.com/aXDlqavRr6 — Aditya (@switch_hit18) March 23, 2024 A heated send-off to Mayank Agarwal 🔥#IPL2024 pic.twitter.com/tzbDLgyDNL — OneCricket (@OneCricketApp) March 23, 2024 -
మెరిసిన పృథ్వీ షా.. పోరాటం చేస్తున్న మయాంక్ అగర్వాల్
రంజీ ట్రోఫీ 2024 ఎడిషన్ చివరి దశకు చేరుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెమీస్ బెర్త్లు ఖరారు కాగా.. మరో రెండు బెర్త్ల భవితవ్యం రేపటి లోగా తేలిపోనుంది. సౌరాష్ట్రపై గెలిచి తమిళనాడు.. ఆంధ్రప్రదేశ్పై గెలిచి మధ్యప్రదేశ్ సెమీస్కు అర్హత సాధించగా.. మిగతా క్వార్టర్ ఫైనల్స్లో విదర్భ-కర్ణాటక, ముంబై-బరోడా అమీతుమీ తేల్చుకుంటున్నాయి. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ ఆథిక్యం సాధించి పటిష్ట స్థితిలో ఉండగా.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక పోరాడుతుంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల లీడ్లో ఉండగా.. 371 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కర్ణాటకకు గెలుపు ఛాలెంజ్లా మారింది. మరో రోజు ఆట మిగిలుండగా.. కర్ణాటక లక్ష్యానికి ఇంకా 268 పరుగుల దూరంలో ఉంది. కర్ణాటకను గెలిపించేందుకు కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పోరాటం చేస్తున్నాడు. మెరిసిన పృథ్వీ షా.. బరోడాతో జరుగుతున్న మ్యాచ్లో (సెకెండ్ ఇన్నింగ్స్) హార్దిక్ తామోర్ (114), పృథ్వీ షా (87) సత్తా చాటడంతో ముంబై పటిష్ట స్థితికి చేరింది. ముంబై తొలి ఇన్నింగ్స్ 384 (ముషీర్ ఖాన్ 203 నాటౌట్, భార్గవ్ భట్ 7/112) బరోడా తొలి ఇన్నింగ్స్ 348 (షశ్వత్ రావత్ (124, సోలంకి 136, షమ్స్ ములానీ 4/121) ముంబై సెకెండ్ ఇన్నింగ్స్ 379/9 (హార్దిక్ తామోర్ 114, పృథ్వీ షా 87, భార్గవ్ భట్ 7/142) నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 415 పరుగుల ఆధిక్యంలో ఉంది పోరాడుతున్న మయాంక్.. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగార్వల్ పోరాటం చేస్తున్నాడు. విదర్భ తొలి ఇన్నింగ్స్ 460 (అథర్వ తైడే 109, కావేరప్ప 4/99) కర్ణాటక తొలి ఇన్నింగ్స్ 286 (నికిన్ జోస్ 82, యాశ్ ఠాకూర్ 3/48) విదర్భ రెండో ఇన్నింగ్స్ 196 (దృవ్ షోరే 57, కావేరప్ప 6/61) కర్ణాటక రెండో ఇన్నింగ్స్ 103/1 (మయాంక్ అగర్వాల్ 61 నాటౌట్, సర్వటే 1/10) ఈ మ్యాచ్లో కర్ణాటక విజయం సాధించాలంటే మరో 268 పరుగులు చేయాలి -
#Mayank Agarwal: ఆసుపత్రి నుంచి మయాంక్ డిశ్చార్జి..
అగర్తలా: కర్ణాటక రంజీ జట్టు కెప్టెన్, భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. శుక్రవారం నుంచి రైల్వేస్తో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ కోసం మంగళవారం సాయంత్రం అగర్తలా నుంచి సూరత్ బయలుదేరేందుకు మయాంక్ విమానం ఎక్కాడు. తాను కూర్చున్న సీటు ముందు ప్లాస్టిక్ కవర్లో ఉంచిన హానికారక ద్రవ్యాన్ని నీళ్లనుకొని మయాంక్ తాగాడు. ఆ వెంటనే అతని నోరు వాచిపోయి బొబ్బలు రావడంతో మాట్లాడలేకపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దాంతో వెంటనే విమానాన్ని ఆపి అతడిని ఆసుపత్రికి తరలించారు. రోజంతా ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మయాంక్ బుధవారం సాయంత్రంకల్లా కోలుకోవడంతో అతడిని డిశ్చార్జి చేశారు. -
ఆ బాటిల్ తీసి తాగగానే వాంతులు: అప్పుడు మయాంక్ పరిస్థితి ఇదీ!
Mayank Agarwal Shares Update on his health: టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కర్ణాటక జట్టు మేనేజర్ స్పష్టం చేశాడు. మయాంక్కు ప్రమాదం తప్పిందని.. విమానంలో జరిగిన ఘటన గురించి అతడు ఇచ్చిన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారని తెలిపాడు. కాగా రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో కర్ణాటక కెప్టెన్గా వ్యవహరిస్తున్న మయాంక్ అగర్వాల్.. జట్టుతో పాటు మంగళవారం త్రిపుర నుంచి న్యూఢిల్లీకి బయల్దేరాడు. అయితే, విమానంలో కూర్చున్న కాసేపటికే గొంతులో నొప్పి, మంటతో బాధపడుతున్నట్లు సహచర ఆటగాళ్లకు చెప్పాడు. ఆ తర్వాత వాంతులు కూడా చేసుకున్నాడు. ఈ క్రమంలో ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అగర్తల(త్రిపుర రాజధాని)లోనే నిలిచిపోగా.. మయాంక్ స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. ప్రస్తుతం అతడు ఆరోగ్యంగానే ఉన్నాడు. మయాంక్కు దాహం వేసింది... అప్పుడు ఈ విషయంపై స్పందించిన కర్ణాటక జట్టు మేనేజర్ ఇండియా టుడేతో మాట్లాడుతూ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించాడు. ‘‘కాసేపట్లో విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా.. మయాంక్కు దాహం వేసింది. దాంతో.. తాను కూర్చున్న సీటు పాకెట్లో ఉన్న బాటిల్ తీసి తాగాడు. వాంతి చేసుకున్నాడు కొన్ని నిమిషాల తర్వాత తన గొంతులో నొప్పి తీవ్రమైందంటూ.. వాష్రూమ్కి పరిగెత్తుకువెళ్లాడు. కాక్పిట్కు సమీపంలోనే ఉన్న వాష్రూమ్లో వాంతి చేసుకున్నాడు. తనకు అస్వస్థతగా ఉందని ఎయిర్ హోస్టెస్కు చెప్పడంతో ఆమె వెంటనే ఎమర్జెన్సీ బెల్ కొట్టింది. ప్రథమ చికిత్స అక్కడ కుదరదన్నారు విమానంలో ఎవరైనా డాక్టర్ ఉన్నారేమోనని ఆరా తీశారు. కానీ దురదృష్టవశాత్తూ అక్కడ ఒక్క డాక్టర్ కూడా లేరు. దీంతో పైలట్కు మెసేజ్ అందించగా.. ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్పోర్టులో ఉన్న వైద్యులు మయాంక్ను పరీక్షించి.. ఇక్కడ ప్రథమ చికిత్స అందించడం కుదరదని.. ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అంబులెన్స్ను పిలిపించగా.. హుటాహుటిన మయాంక్కు హాస్పిటల్కు తీసుకువెళ్లాం’’ అంటూ కొన్ని నిమిషాల పాటు తమకు ఏం అర్థం కాలేదని వాపోయాడు. విచారణ జరపండి ఏదేమైనా మయాంక్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడని.. అందుకు సంతోషిస్తున్నామని తెలిపాడు. కాగా మయాంక్ ఇండిగో ఫ్లైట్ 6E 5177లో ఉండగా ఈ ప్రమాదం బారిన పడగా.. ఎయిర్లైన్స్ సంస్థ కూడా స్పందించింది. తమ విమానంలో ఉన్న ప్యాసింజర్ అనారోగ్యం పాలైన కారణంగా మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఫ్లైట్ కాస్త ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై పోలీసులు మయాంక్ అగర్వాల్ వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపి.. ఇందుకు గల కారణాలేమిటో తెలుసుకోవాలని కర్ణాటక జట్టు మేనేజర్ మయాంక్ తరఫున విజ్ఞప్తి చేసినట్లు ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో వెల్లడించింది. నేను బాగున్నాను.. థాంక్యూ ‘‘ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుటపడింది. త్వరలోనే తిరిగి వస్తా. నా కోసం ప్రార్థించిన, నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అని మయాంక్ అగర్వాల్ బుధవారం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. టీమిండియా తరఫున 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన కర్ణాటక బ్యాటర్ మయాంక్ అగర్వాల్ 21 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 1488, 86 పరుగులు చేశాడీ ఓపెనర్. ప్రస్తుతం రంజీ టోర్నీతో బిజీగా ఉన్న ఈ కర్ణాటక సారథి ఇప్పటికే రెండు సెంచరీలు, ఓ అర్ధ శతకం సాధించాడు. ఇక మయాంక్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ నికిన్ జోస్ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. చదవండి: Ind vs Eng: వ్యక్తిగత కారణాలతో కోహ్లి దూరం.. క్లారిటీ ఇచ్చిన సోదరుడు -
ఐసీయూలో టీమిండియా క్రికెటర్.. ఏం జరిగిందంటే?
టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తోన్న మయాంక్.. అగర్తల నుంచి న్యూఢిల్లీకి వెళ్లే విమానంలో అనారోగ్యం బారిన పడ్డాడు. విమానంలో కూర్చున్న తర్వాత మయాంక్ విపరీతమైన గొంతు నొప్పి, మంటతో బాధపడినట్లు తెలుస్తోంది. అదే విధంగా వాంతులు కూడా చేసుకున్నట్లు సమాచారం. అయితే విమానం టేకాఫ్ కాకముందే ఈ ఘటన జరగడంతో హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరిలించారు. మా ప్రస్తుతం అగర్తలలోని ఐఎల్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అగర్వాల్కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. కాగా విమానంలో మయాంక్కు ఇలా జరగడానికి గల స్పష్టమైన కారణాలైతే ఇంకా తెలియలేదు. నిలకడగా మయాంక్ ఆరోగ్యం.. అయితే ప్రస్తుతం మయాంక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. మయాంక్కు పెద్దగా ప్రమాదం లేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే విషయంపై ర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ షావీర్ తారాపూర్ స్పందించారు. షావీర్ మాట్లాడుతూ.. "మయాంక్ అగర్వాల్ను అగర్తలలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆకస్మిక అస్వస్థతకు కారణం ఇంకా తెలియలేదు. ప్రస్తుతం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ఈ ఘటనపై మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తోందని" చెప్పుకొచ్చాడు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్లో మయాంక్తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
రియాన్ పరాగ్ మెరుపులు వృథా.. దేవధర్ ట్రోఫీ విజేత సౌత్జోన్
దేశవాళీ జోనల్ వన్డే క్రికెట్ టోర్నీ దేవధర్ ట్రోఫీలో మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని సౌత్జోన్ జట్టు అజేయ విజేతగా నిలిచింది. పుదుచ్చేరిలో గురువారం జరిగిన ఫైనల్లో సౌత్జోన్ 45 పరుగుల తేడాతో ఈస్ట్జోన్ జట్టును ఓడించి తొమ్మిదోసారి దేవధర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 328 పరుగులు చేసింది. రోహన్ (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్స్లు) సెంచరీ సాధించాడు. మయాంక్ (63; 4 ఫోర్లు), జగదీశన్ (54; 2 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్జోన్ 46.1 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటైంది. రియాన్ పరాగ్ (95; 8 ఫోర్లు, 5 సిక్స్లు) మెరిపించినా మిగతావాళ్లు రాణించడంలో విఫలమయ్యారు. సౌత్జోన్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీయగా... వైశాఖ్, కౌశిక్, విద్వత్ రెండు వికెట్ల చొప్పున పడగొట్టారు. టోర్నీలో 354 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీసిన రియాన్ పరాగ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. 𝗦𝗢𝗨𝗧𝗛 𝗭𝗢𝗡𝗘 are WINNERS of the #DeodharTrophy 2023-24! 🙌 Congratulations to the @mayankcricket-led unit 👏👏 East Zone fought hard in a high-scoring battle here in Puducherry 👌👌 Scorecard - https://t.co/afLGJxp77b#Final | #SZvEZ pic.twitter.com/x6PEjFp5Pr — BCCI Domestic (@BCCIdomestic) August 3, 2023 చదవండి: IND vs WI: టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్గా -
శతక్కొట్టిన రోహన్.. మరోసారి మెరిసిన మాయాంక్ అగర్వాల్
ఈస్ట్ జోన్తో జరుగుతున్న దియోదర్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ ఓపెనర్లు రోహన్ కున్నుమ్మల్, మయాంక్ అగర్వాల్ రెచ్చిపోయారు. కున్నుమ్మల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 68 బంతుల్లో శతక్కొట్టగా (75 బంతుల్లో 107; 11 ఫోర్లు, 4 సిక్సర్లు).. మాయంక్ అగర్వాల్ టోర్నీలో నాలుగో అర్ధసెంచరీతో (83 బంతుల్లో 63; 4 ఫోర్లు) మెరిశాడు. ఫలితంగా సౌత్ జోన్ భారీ స్కోర్ సాధించింది. కున్నుమ్మల్, మయాంక్లతో పాటు జగదీశన్ (54), ఆఖర్లో సాయి కిషోర్ (24 నాటౌట్) రాణించడంతో సౌత్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఈస్ట్ జోన్ బౌలర్లలో ఉత్కర్ష్ సింగ్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో 3 వికెట్లు, మణిశంకర్, ఆకాశ్దీప్ చెరో వికెట్ పడగొట్టారు. That celebration 🔥pic.twitter.com/v5gqNKB90i — CricTracker (@Cricketracker) August 3, 2023 సూపర్ ఫామ్లో మయాంక్.. దియోదర్ ట్రోఫీ 2023 ఎడిషన్లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో అతను ఏకంగా 6 మ్యాచ్ల్లో 4 అర్ధసెంచరీలు సాధించాడు. తొలి మ్యాచ్లో నార్త్ జోన్పై 64 పరుగులు చేసిన మయాంక్.. ఆతర్వాత మ్యాచ్లో వెస్ట్ జోన్పై 98 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం నార్త్ ఈస్ట్ జోన్పై 32 పరుగులతో పర్వాలేదనిపించిన మయాంక్.. ఆతర్వాత ఈస్ట్ జోన్పై మరో అర్ధసెంచరీతో (84) మెరిశాడు. ఆ తర్వాత సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకే రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగిన మయాంక్.. తాజాగా ఈస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో మరో అర్ధశతకంతో (63) రాణించాడు. -
రెచ్చిపోయిన మయాంక్ అగర్వాల్.. సత్తా చాటిన సాయి సుదర్శన్
దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ టోర్నీలో 3 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలు సహా 194 పరుగులు (64, 98, 32) చేసిన మయాంక్.. ఇవాళ (జులై 30) ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో మరో మ్యాచ్ విన్నింగ్ హాఫ్సెంచరీతో (88 బంతుల్లో 84; 6 ఫోర్లు, సిక్స్) ఇరగదీశాడు. మయాంక్కు ఐపీఎల్ హీరో సాయి సుదర్శన్ (53) తోడవ్వడంతో ఈస్ట్ జోన్పై సౌత్ జోన్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, ఫైనల్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. కౌశిక్ (8-1-37-3), సాయి కిషోర్ (10-0-45-3), విధ్వత్ కావేరప్ప (9-2-40-2), విజయ్కుమార్ వైశాఖ్ (1/62), వాషింగ్టన్ సుందర్ (1/41) ధాటికి 46 ఓవర్లలో 229 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ విరాట్ సింగ్ (49) టాప్ స్కోరర్గా నిలువగా.. సుభ్రాంషు సేనాపతి (44), 9, 10వ నంబర్ ఆటగాళ్లు ఆకాశదీప్ సింగ్ (44), ముక్తర్ హుస్సేన్ (33) రాణించారు. గుర్తింపు కలిగిన ఆటగాళ్లు అభిమన్యు ఈశ్వరన్ (12), రియాన్ పరాగ్ (13) చేతులెత్తేశారు. అనంతరం బరిలోకి దిగిన సౌత్ జోన్.. 44.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మయాంక్ అగర్వాల్, సాయి సుదర్శన్ అర్ధసెంచరీలతో రాణించగా.. జగదీశన్ (32) పర్వాలేదనిపించాడు. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ (18), అరుణ్ కార్తీక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరగగా.. రోహిత్ రాయుడు (24 నాటౌట్).. వాషింగ్టన్ సుందర్ (8 నాటౌట్) సాయంతో సౌత్ జోన్ను విజయతీరాలకు చేర్చాడు. ఈస్ట్ జోన్ బౌలర్లలో అవినోవ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ దీప్, రియాన్ పరాగ్, షాబాజ్ అహ్మద్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో నార్త్ ఈస్ట్ జోన్పై సెంట్రల్ జోన్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఈస్ట్ జోన్.. సర్వటే (10-2-19-3), యశ్ కొఠారీ (2-1-4-2), సరాన్ష్ జైన్ (10-0-39-2) ధాటికి 49 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ కాగా.. శివమ్ చౌదరీ (85 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), యశ్ దూబే (72; 7 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీలతో రాణించడంతో సెంట్రల్ జోన్ 33 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
తృటిలో సెంచరీ చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. నితీశ్ రాణా ఆల్రౌండర్ షో
దియోదర్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో సౌత్ జోన్ జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. వెస్ట్ జోన్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సౌత్ జోన్ 12 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా సౌత్ జట్టు 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) రెండు పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. వెస్ట్ బౌలర్లలో పార్థ్ మూడు వికెట్లు తీయగా, రాజ్వర్ధన్, షమ్స్ ములానీలకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగని వెస్ట్ జట్టు 36.2 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ ఖాన్ (42; 5 ఫోర్లు, 2 సిక్స్లు), అతీత్ షేథ్ (40; 6 ఫోర్లు) రాణించారు. సౌత్ జోన్ స్పిన్నర్లు సాయికిశోర్ (3/44), వాషింగ్టన్ సుందర్ (2/34) వెస్ట్ జోన్ జట్టును దెబ్బ తీశారు. శతక్కొట్టిన ప్రభ్సిమ్రన్.. నితీశ్ రాణా ఆల్రౌండర్ షో ఇతర మ్యాచ్ల్లో నార్త్ జోన్ 48 పరుగులతో సెంట్రల్ జోన్పై, ఈస్ట్ జోన్ ఎనిమిది వికెట్లతో నార్త్ ఈస్ట్జోన్పై గెలిచాయి. సెంట్రల్ జోన్తో జరిగిన మ్యాచ్లో నార్త్ జోన్ ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్ 92 బంతుల్లో శతక్కొట్టాడు. ఈ ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్సిమ్రన్ .. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన సెంట్రల్ జోన్.. నితీశ్ రాణా (4/48), మయాంక్ యాదవ్ (3/47) బంతితో ఇరగదీయడంతో 47.4 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది.సెంట్రల్ జోన్ ఇన్నింగ్స్లో శివమ్ చౌదరీ (51), యశ్ దూబే (78), ఉపేంద్ర యాదవ్ (52) అర్ధసెంచరీలతో రాణించారు. సెంచరీతో కదంతొక్కిన అభిమన్యు ఈశ్వరన్.. నార్త్ఈస్ట్ జోన్తో జరిగిన మ్యాచ్లో ఈస్ట్ జోన్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (100) అజేయమైన సెంచరీతో మెరిశాడు. ఫలితంగా నార్త్ఈస్ట్ జోన్ నిర్ధేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని ఈస్ట్ జోన్ 31.3 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ఈస్ట్ జోన్ను రియాన్ పరాగ్ (10-2-30-4) దారుణంగా దెబ్బకొట్టాడు. నార్త్ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్లో రెక్స్ సేన్ (65 నాటౌట్) ఒక్కడే రాణించాడు. -
ఐపీఎల్ ఫామ్ను కొనసాగిస్తున్న ప్రభ్సిమ్రన్ సింగ్.. మరో మెరుపు సెంచరీ
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ తరఫున ఏకైక సెంచరీ చేసిన యువ ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రస్తుతం జరుగుతున్న దియోదర్ ట్రోఫీలోనూ తన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. గత ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 65 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో సుడిగాలి శతకం (103) బాదిన ప్రభ్సిమ్రన్.. దియోదర్ ట్రోఫీలో సెంట్రల్ జోన్తో ఇవాళ (జులై 26) జరుగుతున్న మ్యాచ్లో 92 బంతుల్లో శతక్కొట్టాడు. Relive that special 💯 moment here 🔽#TATAIPL | #DCvPBKS https://t.co/eBGUL8gkVh pic.twitter.com/uWI2uW8vB8 — IndianPremierLeague (@IPL) May 13, 2023 ఈ ఇన్నింగ్స్లో 107 బంతులు ఎదుర్కొన్న ప్రభ్సిమ్రన్ (నార్త్ జోన్).. 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 121 పరుగులు చేశాడు. అతనికి కెప్టెన్ నితీశ్ రాణా (51), మన్దీప్ సింగ్ (43) తోడవ్వడంతో నార్త్ జోన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఎమర్జింగ్ ఏసియా కప్ హీరోలు అభిషేక్ శర్మ (19), నిషాంత్ సింధు (18), హర్షిత్ రాణా (5), వివ్రాంత్ శర్మ (1) నిరశపర్చగా.. హిమాన్షు రాణా (24) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో యశ్ ఠాకూర్, వెంకటేశ్ అయ్యర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. శివమ్ మావి, కర్ణ్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు. దియోదర్ ట్రోఫీ-2023లో ప్రభ్సిమ్రన్దే తొలి సెంచరీ కావడం విశేషం. తృటిలో సెంచరీని చేజార్చుకున్న మయాంక్ అగర్వాల్.. ఇవాళే జరిగిన మరో మ్యాచ్లో సౌత్ జోన్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (115 బంతుల్లో 98; 9 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మయాంక్, అరుణ్ కార్తీక్ (23), విజయ్కుమార్ వైశాఖ్ (20 నాటౌట్), కావేరప్ప (19) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోర్లు కూడా చేయకపోవడంతో వెస్ట్ జోన్తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ జోన్ 46.4 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. వెస్ట్ జోన్ బౌలర్లలో పార్థ్ భట్ 3, షమ్స్ ములానీ, హంగార్గేకర్ చెరో 2 వికెట్లు, నగ్వస్వల్లా, అతీథ్ సేథ్, శివమ్ దూబే తలో వికెట్ పడగొట్టారు. -
రాణించిన మయాంక్ అగర్వాల్.. నిప్పులు చెరిగిన కావేరప్ప.. ప్రత్యర్ధి 60కే ఆలౌట్
దేశవాలీ వన్డే టోర్నీ దియోదర్ ట్రోఫీ-2023లో సౌత్ జోన్ జట్టు భారీ విజయం సాధించింది. వి జయదేవన్ (డక్వర్త్ లూయిస్కు ప్రత్యామ్నాయం) పద్ధతిలో ఆ జట్టు 185 పరుగుల భారీ తేడాతో నార్త్ జోన్పై గెలుపొందింది. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (64; 7 ఫోర్లు)తో పాటు ఓపెనర్ కున్నుమ్మల్ (70; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎన్ జగదీశన్ (72; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్జోన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 303 పరుగులు చేసింది. సౌత్జోన్ ఇన్నింగ్స్లో పడిక్కల్ (17), వాషింగ్టన్ సుందర్ (5) విఫలం కాగా.. రికీ భుయ్ (31), అరుణ్ కార్తీక్ (21) పర్వాలేదనిపించారు. నార్త్ జోన్ బౌలర్లలో రిషి ధవన్, మయాంక్ మార్కండే చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ, మయాంక్ యాదవ్, మయాంక్ డాగర్, నితీశ్ రాణా తలో వికెట్ దక్కించుకున్నారు. సౌత్ జోన్ ఇన్నింగ్స్ తర్వాత వర్షం అడ్డుతగలడంతో విజేడీ (వి జయదేవన్) పద్ధతిన నార్త్ జోన్ లక్ష్యాన్ని 246 పరుగులకు కుదించారు. అయితే విధ్వత్ కావేరప్ప (5/17), విజయ్కుమార్ వైశాఖ్ (2/12), వాసుకి కౌశిక్ (1/11), నిప్పులు చెరగడంతో నార్త్ జోన్ 23 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. గుర్తింపు పొందిన ప్లేయర్లు అభిషేక్ శర్మ (1), గత ఐపీఎల్లో సెంచరీ చేసిన ప్రభ్సిమ్రన్సింగ్ (2), నితీశ్ రాణా (4), రిషి ధవన్ (6) దారుణంగా విఫలమయ్యారు. నార్త్ జోన్ ఇన్నింగ్స్లో శుభమ్ ఖజూరియా (10), మన్దీప్ సింగ్ (18 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సౌత్ జోన్ బౌలర్లలో పేసర్లు కాకుండా రవిశ్రీనివాసన్ సాయికిషోర్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు. విజేడీ పద్ధతి అంటే.. వి జయదేవన్ పద్ధతి.. క్రికెట్లో డక్వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా రూపొందించబడిన పద్ధతి. 2007లో సునీల్ గవాస్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సాంకేతిక కమిటీ భారతదేశంలోని అన్ని పరిమిత ఓవర్ల దేశీయ మ్యాచ్లకు ఈ పద్ధతిని ఆమోదించింది. వర్షం ప్రభావిత వన్డే, టీ20 మ్యాచ్లలో లక్ష్య స్కోర్లను లెక్కించడానికి ఈ పద్దతి ఉపయోగించబడుతుంది. కేరళకు చెందిన భారతీయ ఇంజనీర్ జయదేవన్ రూపొందించిన ఈ పద్ధతిని అంతర్జాతీయ మ్యాచ్ల్లో డక్వర్త్ లూయిస్ పద్ధతికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించేందుకు 2012లో బీసీసీఐ ప్రతిపాదించింది. అయితే క్లయివ్ లాయిడ్ నేతృత్వంలోని ఐసీసీ కమిటీ ఇందుకు ఒప్పుకోలేదు. విజేడీ పద్ధతిని తమిళనాడు ప్రీమియర్ లీగ్, కర్ణాటక ప్రీమియర్ లీగ్, గతంలో ఇండియన్ క్రికెట్ లీగ్ల్లో ఉపయోగించారు. -
నిరాశపరచిన తిలక్ వర్మ.. చేతులెత్తేసిన పుజారా, సూర్యకుమార్, సర్ఫరాజ్ ఖాన్
వెస్ట్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2023 ఫైనల్లో సౌత్ జోన్ జట్టు పట్టు బిగిస్తుంది. మూడో రోజు ఆట సమయానికి ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో లభించిన 67 పరుగుల లీడ్తో కలుపుకుని మొత్తంగా 248 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. సెకెండ్ ఇన్నింగ్స్లో సౌత్ జోన్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి, ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది. వాషింగ్టన్ సుందర్ (10), విజయ్కుమార్ వైశాఖ్ (1) క్రీజ్లో ఉన్నారు. సౌత్ జోన్ సెకెండ్ ఇన్నింగ్స్లో తిలక్ వర్మ (3) నిరాశపరచగా.. మయాంక్ అగర్వాల్ (35), హనుమ విహారి (42), రికీ భుయ్ (27) పర్వాలేదనిపించారు. కావేరప్ప దెబ్బకు కుప్పకూలిన వెస్ట్ జోన్.. ఈ మ్యాచ్లో కర్ణాటక పేసర్ విధ్వత్ కావేరప్ప (7/53) దెబ్బకు వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 146 పరుగులకే కుప్పకూలింది. వెస్ట్ జోన్ బ్యాటర్లలో పృథ్వీ షా (65) ఒక్కడే అర్ధసెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. టీమిండియా స్టార్ ప్లేయర్లు ఛతేశ్వర్ పుజారా (9), సూర్యకుమార్ యాదవ్ (8) దారుణంగా విఫలం కాగా.. అప్కమింగ్ హీరో అంటూ ఊదరగొట్టబడుతున్న సర్ఫరాజ్ ఖాన్ డకౌటై నిరాశపరిచాడు. కావేరప్పతో పాటు విజయకుమార్ వైశాఖ్ (2/33), కౌశిక్ (1/26) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులకు ఆలౌటైంది. హనుమ విహారి (63) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (40), మయాంక్ అగర్వాల్ (28), వాషింగ్టన్ సుందర్ (22 నాటౌట్) పర్వాలేదనిపించారు. షమ్స్ ములానీ (3/29), నగవస్వల్లా (2/62), చింతన్ గజా (2/27), డి జడేజా (2/33), సేథ్ (1/47) సౌత్ జోన్ను దెబ్బకొట్టారు. -
అర్జున్ టెండూల్కర్కు గోల్డెన్ చాన్స్
దేవధర్ ట్రోఫీ ఇంటర్ జోనల్ వన్డే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్ జోన్ జట్టును ప్రకటించారు. సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్కు మంచి గోల్డెన్ చాన్స్ లభించింది. దేవధర్ ట్రోఫీలో భాగంగా అర్జున్ సౌత్ జోన్ జట్టులోకి ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్లో అర్జున్ గోవా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 15 మంది సభ్యులతో కూడిన సౌత్ జోన్ జట్టులో హైదరాబాద్కు చెందిన రోహిత్ రాయుడు, ఆంధ్ర క్రికెటర్ రికీ భుయ్లకు స్థానం లభించింది. మయాంక్ అగర్వాల్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. దేవధర్ ట్రోఫీ ఈనెల 24 నుంచి ఆగస్టు 3 వరకు పుదుచ్చేరిలో జరుగుతుంది. సౌత్ జోన్ జట్టు: మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), రోహన్ కున్నుమ్మల్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీషన్ (వికెట్ కీపర్), రోహిత్ రాయడు, కెబి అరుణ్ కార్తీక్, దేవదత్ పడిక్కల్, రికీ భుయ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, వి కావరప్ప, వి విక్షక్ వి, మోహిత్ రెడ్కర్, సిజోమోన్ జోసెఫ్, అర్జున్ టెండూల్కర్, సాయి కిషోర్. చదవండి: #BrijBhushanSharan: 'చుప్'.. మైక్ విరగ్గొట్టి రిపోర్టర్తో దురుసు ప్రవర్తన Duleep Trophy 2023: ఇవాళ్టి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్.. 2011లో చివరిసారిగా -
Duleep Trophy: ఆదుకున్న మయాంక్, తిలక్..
Duleep Trophy 2023- South Zone vs North Zone, 2nd Semi-Final- బెంగళూరు: కష్టాల్లో ఎదురీదుతున్న సౌత్జోన్ జట్టును హైదరాబాద్ రైజింగ్ స్టార్ ఠాకూర్ తిలక్ వర్మ (46; 5 ఫోర్లు, 1 సిక్స్), సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76; 10 ఫోర్లు)తో కలిసి గట్టెక్కించాడు. దీంతో దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్లో 195 పరుగులకు ఆలౌటైంది. నార్త్జోన్ 3 పరుగుల ఆధిక్యంతోనే సరిపెట్టుకుంది. ఓవర్నైట్ స్కోరు 63/4తో రెండో రోజు ఆట కొనసాగించిన సౌత్జోన్ను మయాంక్, తిలక్ నడిపించారు. ఐదో వికెట్కు ఇద్దరు 110 పరుగులు జోడించారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నార్త్జోన్ ఆట నిలిచే సమయానికి 11 ఓవర్లలో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది. క్రికెట్కు తమీమ్ గుడ్బై చిట్టోగ్రామ్: వన్డే ప్రపంచకప్కు మూడు నెలల ముందు బంగ్లాదేశ్ జట్టు సీనియర్ ప్లేయర్, కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ సంచలన ప్రకటన చేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెంటనే తప్పుకుంటున్నట్లు భావోద్వేగంతో ప్రకటించాడు. బుధవారం అఫ్గానిస్తాన్తో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ ఓడగా ...తర్వాతి రోజే ఈ ప్రకటన వచ్చింది. 16 ఏళ్ల కెరీర్ లో 34 ఏళ్ల తమీమ్ ఇక్బాల్... 241 వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధ సెంచరీలతో 8313 పరుగులు... 70 టెస్టుల్లో 10 సెంచరీలతో 5134 పరుగులు... 78 టి20 మ్యాచ్ల్లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో కలిపి 1758 పరుగులు సాధించాడు. చదవండి: ఒక్క బంతి ఎక్కువ తీసుకున్నా గోవిందా! నాడు తండ్రి సచిన్ వికెట్ తీసి.. ఇప్పుడేమో -
సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. తెరమీదకు మయాంక్ అగర్వాల్ పేరు! కారణం?
Mayank Agarwal- CBI director Praveen Sood: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్గా ఐపీఎస్ ఆఫీసర్ ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టిన వేళ టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్ పేరు తెరమీదకు తీసుకువచ్చారు అభిమానులు. ఇందుకు ఓ కారణం ఉంది.. అదేంటంటే.. టీమిండియా ఓపెనర్గా కర్ణాటకకు చెందిన మయాంక్.. 2018లో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. 2020లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. టీమిండియా ఓపెనర్గా మంచి గుర్తింపు సంపాదించిన ఈ రైట్హ్యాండ్ బ్యాటర్ ఇప్పటి వరకు కెరీర్లో మొత్తంగా 21 టెస్టులు ఆడాడు. 36 ఇన్నింగ్స్లలో కలిపి 1488 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, రెండు ద్విశతకాలు ఉండటం విశేషం. ఇక కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడే అవకాశం దక్కించుకున్న మయాంక్.. 86 పరుగులకే పరిమితమయ్యాడు. మయాంక్- ఆషితా ప్రేమకథ అలా మొదలైంది ఇక మయాంక్ అగర్వాల్ కెరీర్ సంగతులు ఇలా ఉంటే.. అతడి వ్యక్తిగత జీవితం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మయాంక్ అగర్వాల్ది ప్రేమ వివాహం. అతడి భార్య పేరు ఆషితా సూద్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు తొలుత స్నేహితులుగా దగ్గరయ్యారు. కాలక్రమంలో స్నేహం ప్రేమగా మారింది. ఆషితాకు తన మనసులో మాట చెప్పేందుకు సిద్దమైన మయాంక్.. లండన్లో రొమాంటిక్ స్టైల్లో ఆమె ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచాడు. ఇందుకు ఆషితా సానుకూలంగా స్పందించడంతో 2018 జనవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. మయాంక్కు స్వయానా మామగారు అదే ఏడాది జూన్ 4న మయాంక్- ఆషితాల పెళ్లి జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వివాహ వేడుకకు మయాంక్ బెస్ట్ ఫ్రెండ్ కేఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. మయాంక్ ప్రేమించి పెళ్లాడిన ఆషితా మరెవరో కాదు.. ప్రస్తుతం సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్ కుమార్తె. కర్ణాటక మాజీ డీజీపీ ప్రవీణ్ సూద్ కూతురైన ఆషితా.. వృత్తి రిత్యా లాయర్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాలో ఆమె మాస్టర్స్ చేశారు. అదీ విషయం.. టీమిండియా క్రికెటర్ మయాంక్ అగర్వాల్.. ప్రవీణ్ సూద్కు స్వయానా అల్లుడు. మామగారు ఉన్నత పదవి చేపట్టడంతో అభిమానులు ఇలా మయాంక్ పేరును వార్తల్లోకి తెచ్చారు. ఇక మయాంక్- ఆషితాలకు ఓ కుమార్తె ఉంది. ఇదిలా ఉంటే.. 2011లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టిన మయాంక్ ప్రస్తుత సీజన్ ఐపీఎల్-2023లో సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహించాడు. మినీ వేలంలో 8.25 కోట్ల రూపాయల భారీ ధరకు రైజర్స్ అతడిని కొనుగోలు చేసింది. అయితే, ఈ ఎడిషన్లో ఈ కర్ణాటక బ్యాటర్ అంచనాలు అందుకోలేకపోయాడు. 10 మ్యాచ్లు ఆడి కేవలం 270 పరుగులే చేశాడు. చదవండి: BCCI: అవసరమా?.. ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ రిక్వెస్ట్.. ట్వీట్తో.. ఆర్సీబీలో నెట్బౌలర్గా ఉన్నా... ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు.. -
MI VS SRH: ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..!
గత రెండు సీజన్లుగా ఘోరంగా విఫలమవుతూ, అభిమానుల ఆగ్రహానికి గురవుతున్న మయాంక్ అగర్వాల్ ఎట్టకేలకు జూలు విదిల్చాడు. ముంబై ఇండియన్స్తో ఇవాళ (మే 21) జరుగుతున్న మ్యాచ్లో మనోడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 83 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇటీవలి కాలంలో మయాంక్ ఈ స్థాయిలో రెచ్చిపోవడం ఇదే తొలిసారి. మయాంక్కు జతగా మరో ఓపెనర్ వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ 5 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై అంటే చాలు మనోడికి పూనకం వస్తుంది..! గతేడాది పంజాబ్ కెప్టెన్గా వ్యవహరించి ఈ సీజన్లో సన్రైజర్స్ పంచన చేరిన మయాంక్కు ముంబై ఇండియన్స్ అంటే పూనకం వస్తుంది. ఈ సీజన్లో మొత్తం 10 మ్యాచ్లు ఆడిన అతను 9 మ్యాచ్ల్లో 187 పరుగులు చేస్తే.. ముంబైతో ఇవాళ్టి మ్యాచ్లో 83 పరుగులు చేశాడు. 17 పరుగుల తేడాతో ఐపీఎల్లో రెండో సెంచరీ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న మయాంక్.. 2022 సీజన్ నుంచి ముంబైపై విరుచుకుపడుతున్నాడు. ఈ మధ్యలో ముంబైతో 3 మ్యాచ్లు ఆడిన అతను 153.78 స్ట్రయిక్ రేట్తో 61 సగటున 183 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇదే సమయంలో (గత రెండు ఐపీఎల్ సీజన్లు) ఇతర జట్లతో 19 మ్యాచ్లు ఆడిన మయాంక్.. 112.75 స్ట్రయిక్ రేట్తో కేవలం 14.89 సగటున 283 పరుగులు చేశాడు. ఇందులో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఈ గణాంకాలు చూస్తే ఒక్క విషయం స్పష్టమవుతుంది. ముంబై అంటే మయాంక్ ఏ రేంజ్లో రెచ్చిపోతాడో. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్.. నామమాత్రపు మ్యాచ్లో ఇవాళ ముంబైతో తలపడుతుంది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ సాధించింది. మరోవైపు ఈ మ్యాచ్ అడుతున్న ముంబైకు ఈ మ్యాచ్ చాలా కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్కు చేరుకునే అవకాశాలు ఉంటాయి. గుజరాత్ (18),సీఎస్కే (17), లక్నో (17) ఇదివరకే ప్లే ఆఫ్స్కు చేరుకోగా.. నాలుగో ప్లేస్ కోసం ముంబై, రాజస్థాన్, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది. చదవండి: SRH VS MI: రికార్డులు కొల్లగొట్టిన సన్రైజర్స్ యువ ఓపెనర్ -
ఆర్సీబీకి డీకే, రాజస్థాన్కు పరాగ్, సన్రైజర్స్కు మయాంక్.. మరి ఢిల్లీకి..?
ఐపీఎల్-2023లో సగానికిపైగా మ్యాచ్లు పూర్తయినా ఇప్పటికీ కొందరు బ్యాటర్లు గాడిలో పడకపోవడంతో సంబంధిత ఫ్రాంచైజీలు కలవరపడుతున్నాయి. భారీ మొత్తం వెచ్చించి సొంత చేసుకున్న కొందరు ఆటగాళ్లు పదేపదే అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారారు. తమ చెత్త బ్యాటింగ్తో ఫ్రాంచైజీలకు భారంగా మారిన ఆటగాళ్లెవరో ఓసారి పరిశీలిద్దాం. ప్రస్తుత సీజన్లో జట్టుకు భారంగా మారిన ఆటగాళ్ల జాబితాలో రాజస్థాన్ రియాన్ పరాగ్ ముందువరుసలో ఉంటాడు. వేలంలో 3.8 కోట్లు దక్కించుకున్న ఈ ఓవరాక్షన్ ఆటగాడు.. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ల్లో 20 అత్యధిక స్కోర్తో కేవలం 58 పరుగులు మాత్రమే చేశాడు. పరాగ్ తర్వాత చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్న ఆటగాడు ఆర్సీబీ దినేశ్ కార్తీక్. ఫినిషర్గా ఇరగదీస్తాడని భారీ అంచనాల నడుమ ఈ సీజన్ బరిలోకి దిగిన డీకే (5.5 కోట్లు).. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో 28 అత్యధిక స్కోర్తో కేవలం 99 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటర్గా దారుణంగా విఫలమైన డీకే.. వికెట్కీపింగ్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. క్యాచ్లు మిస్ చేయడం, స్టంపింగ్, రనౌట్లు చేయలేకపోవడం, చేతిలోకి వచ్చిన బాల్స్ను జారవిడచడం.. ఇలా వికెట్కీపింగ్లోనూ డీకే అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇంతటితో ఇతని ఆగడాలు ఆగలేదు. బ్యాటింగ్ సమయంలో ఇతను పరుగులు చేయలేకపోగా.. బాగా ఆడుతున్న వారిని పలు సందర్భాల్లో రనౌటయ్యేలా చేశాడు. కార్తీక్తో పాటు మరో ఆటగాడు కూడా ఆర్సీబీకి చాలా భారంగా మారాడు. స్పిన్ ఆల్రౌండర్ అని చెప్పుకునే షాబాజ్ అహ్మద్ కూడా ఆడిన ప్రతి మ్యాచ్లోనూ విఫలమై జట్టు ఓటములకు కారకుడయ్యాడు. సన్రైజర్స్ విషయానికొస్తే.. ఈ జట్టులో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్తో పాటు జట్టు మొత్తం బ్యాటింగ్ విభాగంలో దారుణంగా నిరాశపరుస్తుంది. బ్రూక్ ఒకే ఒక మ్యాచ్లో సెంచరీ చేసి, ఆతర్వాత వరుసగా విఫలమవుతున్నాడు. మయాంక్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. చించేస్తాడనుకున్న కెప్టెన్ మార్క్రమ్ కూడా తేలిపోతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్కు దీపక్ హుడా.. సీఎస్కేకు అంబటి రాయుడు.. ఢిల్లీ క్యాపిటల్స్కు పృథ్వీ షాలు పెద్ద తలనొప్పిగా మారారు. వీరిని సంబంధిత ఫ్రాంచైజీలు తదుపరి జరుగబోయే మ్యాచ్ల్లో ఆడిస్తారో లేక సాహసం చేసి పక్కకు కూర్చోబెడతారో వేచి చూడాలి. చదవండి: ముంబైతో మ్యాచ్.. జూనియర్ మలింగ అద్భుత గణాంకాలు -
ఐపీఎల్-2023లో చెత్తగా ఆడుతుంది వీరే.. వీరితో ఓ జట్టు తయారు చేస్తే ఇలా ..!
ఐపీఎల్-2023లో స్వదేశీ విదేశీ ఆటగాళ్లు అన్న తేడా లేకుండా భారీ అంచనాలు పెట్టుకున్న చాలామంది ఉసూరుమనిపించారు. వీరి చెత్త ప్రదర్శనతో ఫ్రాంచైజీలతో పాటు అభిమానులు సైతం విసిగివేసారిపోయారు. ఇప్పటివరకు (ఏప్రిల్ 30) జరిగిన 42 మ్యాచ్ల్లో ఏయే ఆటగాళ్లు దారుణంగా నిరాశపరిచారో, వారందరిని కలిపి ఓ జట్టుగా తయారు చేస్తే ఇలా ఉంటుంది. ఓపెనర్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా (8 కోట్లు, 6 మ్యాచ్ల్లో 47 పరుగులు), ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (16 కోట్లు, 8 మ్యాచ్ల్లో 184 పరుగులు, ఒక్క హాఫ్సెంచరీ), వన్ డౌన్లో సన్రైజర్స్ మయాంక్ అగర్వాల్ (8.25 కోట్లు, 8 మ్యాచ్ల్లో 169 పరుగులు), నాలుగో స్థానంలో లక్నో దీపక్ హుడా (5.75 కోట్లు, 8 మ్యాచ్ల్లో 52 పరుగులు), ఐదులో రాజస్థాన్ రియాన్ పరాగ్ (3.80 కోట్లు, 5 మ్యాచ్ల్లో 54 పరుగులు), ఆరులో ఆర్సీబీ దినేశ్ కార్తీక్ (5.5 కోట్లు, 8 మ్యాచ్ల్లో 83), ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు, 7 మ్యాచ్ల్లో 60 పరుగులు, 3 వికట్లు), ఎనిమిదో ప్లేస్లో ఆర్సీబీ షాబాజ్ అహ్మద్ (2.4 కోట్లు, 8 మ్యాచ్ల్లో 42 పరుగులు, 0 వికెట్లు), 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ జోఫ్రా ఆర్చర్ (8 కోట్లు, 3 మ్యాచ్ల్లో ఒక్క పరుగు, 2 వికెట్లు), 10లో కేకేఆర్ ఉమేశ్ యాదవ్ (2 కోట్లు, 8 మ్యాచ్ల్లో ఒక్క వికెట్, 19 పరుగులు), 11వ స్థానంలో కేకేఆర్ లోకి ఫెర్గూసన్ (10 కోట్లు, 3 మ్యాచ్ల్లో 12.52 ఎకానమీతో ఒక్క వికెట్). వీరు కాక ఇంకా ఎవరైనా చెత్త ప్రదర్శన (కనీసం ఒక్క మ్యాచ్లో కూడా రాణించని వారు) చేసిన ఆటగాళ్లు ఉంటే కామెంట్ చేయండి. -
SRH: ఏదో పొడిచేస్తాడనుకుంటే!.. అతడొక్కడేనా?! నాకు నమ్మకం ఉంది!
IPL 2023 DC Vs SRH: వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ హ్యారీ బ్రూక్కు ఆ జట్టు బ్యాటింగ్ కోచ్ హేమంగ్ బదాని మద్దతుగా నిలిచాడు. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగల సత్తా ఉన్న ఆటగాడంటూ కొనియాడాడు. ప్రస్తుతం తన ఆట తీరు బాగా లేకపోయినా.. త్వరలోనే తిరిగి పుంజుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్-2023 వేలంలో 13.25 కోట్ల భారీ ధరకు సన్రైజర్స్ ఫ్రాంఛైజీ ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గడ్డపై టెస్టుల్లో సెంచరీలు బాదిన ఈ 24 ఏళ్ల రైట్ హ్యాండర్ బ్యాటర్పై అదే స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. అంచనాలు అందుకోలేక కానీ బ్రూక్ మాత్రం స్థాయికి తగ్గట్లు రాణించలేకచతికిలపడ్డాడు. కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో 55 బంతుల్లో అజేయ సెంచరీతో మెరిసిన బ్రూక్.. మిగతా మ్యాచ్లలో మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. ఫ్రాంఛైజీ తనపై వెచ్చించిన భారీ మొత్తానికి న్యాయం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన ఈ టాపార్డర్ బ్యాటర్ మొత్తంగా సాధించిన పరుగులు 163. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. ఇందులో ఓ శతకం. ఈ గణాంకాలను బట్టి అతడి ప్రదర్శన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో హ్యారీ బ్రూక్ ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో శనివారం నాటి మ్యాచ్లో డకౌట్ అయిన బ్రూక్పై ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సైతం గుర్రుగా ఉన్నారు. ఏదో పొడిచేస్తాడనుకుంటే.. సెంచరీతో మురిపించి రోజురోజుకూ దిగజారి పోతున్నాడంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్గా.. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్పై సన్రైజర్స్ విజయానంతరం కోచ్ హేమంగ్ బదాని మాట్లాడుతూ తమ బ్యాటర్ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. లోపాలు సరిచేసుకోవాల్సి ఉంది. ఒక్క ఇన్నింగ్స్ చాలు తిరిగి పుంజుకోవడానికి. కచ్చితంగా మా ఆటగాళ్లు ఫామ్లోకి వస్తారని నమ్మకం ఉంది. ముఖ్యంగా హ్యారీ బ్రూక్... తను ప్రపంచంలోని ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఎదుగుతాడని నేను గట్టిగా నమ్ముతున్నాను’’ అని బదాని పేర్కొన్నాడు. అదే విధంగా మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడని.. టచ్లోకి వస్తే అతడిని ఆపడం ఎవరితరం కాదని చెప్పుకొచ్చాడు. కాగా ఢిల్లీ మ్యాచ్లో సన్రైజర్స్ 9 పరుగుల తేడాతో గెలుపొంది ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసింది. అతడొక్కడేనా! వాళ్లు కూడా ఇక బ్రూక్తో పాటు రాహుల్ త్రిపాఠి(8 మ్యాచ్లలో 170 పరుగులు), మయాంక్ అగర్వాల్ (8 మ్యాచ్లలో 169 పరుగులు) కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేక విమర్శలు మూటగట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే వికెట్ కీపర్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ మాత్రం ఆడిన 5 ఇన్నింగ్స్లో 153 పరుగులతో మెరిశాడు. ఢిల్లీతో మ్యాచ్లో కీలక సమయంలో విలువైన అజేయ అర్ధ శతకం(53) సాధించాడు. చదవండి: ఏంటి బ్రో టెస్టు మ్యాచ్ అనుకున్నావా.. జట్టులో ఇంకా ఎవరూ లేరా? సిక్సర్ల వర్షం.. ఆట కట్టించిన అకీల్! కొంచెం కూడా తెలివి లేదు! The Delhi Capitals came close to the target but it's @SunRisers who emerge victorious in Delhi 👏🏻👏🏻#SRH register a 9-run victory over #DC 👌🏻👌🏻 Scorecard ▶️ https://t.co/iOYYyw2zca #TATAIPL | #DCvSRH pic.twitter.com/S5METD41pF — IndianPremierLeague (@IPL) April 29, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఢిల్లీతో మ్యాచ్.. సన్రైజర్స్ జట్టులో కీలక మార్పులు! 8 కోట్ల ఆటగాడికి నో ఛాన్స్!
IPL 2023- SRH Vs DC: ఐపీఎల్-2023లో సీఎస్కే చేతిలో ఘోర ఓటమి చవి చూసిన సన్రైజర్స్ హైదరాబాద్ మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉప్పల్ వేదికగా సోమవారం ఢిల్లీ క్యాపిటల్స్తో ఎస్ఆర్హెచ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలని ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది. వాళ్లిద్దరు అవుట్ అయితే ఈ మ్యాచ్లో సన్రైజర్స్ రెండు మార్పులతో బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. వరుస మ్యాచ్ల్లో విఫలమవుతున్న మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్ను పక్కన పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా 8.25 కోట్ల భారీ మొత్తాన్ని తీసుకున్న అగర్వాల్.. తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో మయాంక్ స్ధానంలో సమర్థ్ వ్యాస్, సుందర్ ప్లేస్లో మయాంక్ దాగర్కు అవకాశం ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ మేనెజ్మెంట్ నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీళ్లకు ఛాన్స్ సౌరాష్ట్రకు చెందిన వ్యాస్కు దేశీవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉంది. లిస్ట్-ఏ క్రికెట్లో 41 మ్యాచ్లు ఆడిన వ్యాస్ 1365 పరుగులు సాధించాడు. అదే విధంగా సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన మయాంక్ దాగర్.. వికెట్లు తీయకపోయినప్పటికీ పర్వాలేదనపించాడు. 3 ఓవర్లు వేసిన దాగర్ 21 పరుగులిచ్చాడు. ఇక కేకేఆర్తో గెలిచి మంచి ఊపు మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ను ఎస్ఆర్హెచ్ ఎంతవరకు అడ్డుకుంటుందో వేచి చూడాలి. ఎస్ఆర్హెచ్ తుది జట్టు(అంచనా) హ్యారీ బ్రూక్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్) వ్యాస్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, మయాంక్ దాగర్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్ఖండే, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Mohammed Siraj: మహిపాల్ను దూషించిన సిరాజ్! ఇప్పటికే రెండుసార్లు సారీ చెప్పాను.. పర్లేదు భాయ్! ఇలాంటివి. -
Mayank Agarwal: మారని ఆటతీరు.. ఏ స్థానంలో ఆడించినా అంతే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ దారుణ ఆటతీరు కొనసాగుతూనే ఉంది. తాజాగా శుక్రవారం సీఎస్కేతో మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ ఓపెనర్గా కాకుండా ఐదో స్థానంలో వచ్చాడు. కానీ ఏ స్థానంలో వచ్చినా తన ఆటతీరు మారదని మరోసారి నిరూపించాడు మయాంక్. నాలుగు బంతులెదుర్కొని కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి జడేజా బౌలింగ్లో స్టంపౌట్గా వెనుదిరిగాడు. అసలు వికెట్ టు వికెట్ బౌలింగ్ చేసి జడేజా బౌలింగ్లో ఫ్రంట్ఫుట్ రావడమే తప్పు.. అలాంటి ధోని కీపర్గా ఉన్నప్పుడు అలా చేయడం ఇంకా పెద్ద తప్పు. క్షణం కూడా ఆలస్యం చేయని ధోని వికెట్లను ఎగురగొట్టేశాడు. కనీసం అంచనా లేకుండా ఫ్రంట్ఫుట్ షాట్కు యత్నించడం మయాంక్ ఆట ఎంత పేలవంగా ఉందనేది చూపించింది. ఓపెనర్గా విఫలమయ్యాడని ఫినిషర్ రోల్లో పంపిస్తే దానికి న్యాయం చేయలేకపోయాడు. వాస్తవానికి 2022 సీజన్లో పంజాబ్ కింగ్స్కు కెప్టెన్ అయిన తర్వాత మయాంక్ అగర్వాల్ ఆట పూర్తిగా మసకబారుతూ వచ్చింది. పంజాబ్ కింగ్స్లో ఉన్నప్పుడు పరుగులు చేసిన మయాంక్ ఎస్ఆర్హెచ్లోకి వచ్చాకా తన బ్యాటింగ్నే పూర్తిగా మరిచిపోయాడు. అలాంటి మయాంక్పై ఎస్ఆర్హెచ్ కూడా రూ. 8.5 కోట్లు చెల్లించి తీసుకున్నప్పటికి ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటివరకు మయాంక్ ఆరు మ్యాచ్లాడి 115 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్తో మ్యాచ్లో 48 పరుగులు చేసినప్పటికి చాలా బంతులు వృథా చేశాడు. అసలు ముందు మయాంక్ను కాదు అనాల్సింది.. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ను. తలా తోక లేకుండా జట్టును తయారు చేసింది. గత్యంతరం లేకనే మయాంక్ అగర్వాల్కు అవకాశం ఇస్తున్నారు. అయితే కనీసం రానున్న మ్యాచ్ల్లో ఆఖర్లో బ్యాటింగ్కు వస్తున్న అబ్దుల్ సమద్కు ప్రమోషన్ ఇచ్చి బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపితే బాగుంటుందేమో. ఇక మయాంక్ ఆటతీరుపై సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్స్తో రెచ్చిపోయారు. మీరు ఒకసారి లుక్కేయండి. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Ayindhi edho ayindhi oka vandha unchukoni migatha auction dabbulu icheyi @mayankcricket pic.twitter.com/Ve1EsOLfoL — వేటగాడు (@rao_4005) April 21, 2023 Bus lo iddharu rajinikanth lu undaga crease ela daatav ra @mayankcricket — King of the jungle (@tigersathhii) April 21, 2023 Every one down contender of Indian team is in academy these days... Tripathi and Hooda❤️🔥 Whereas Mayank Agarwal today came as finisher, finished his innings with 2 runs off 4 balls, consistency at its peak😍🔥 #CSKvSRH — TukTuk Academy (@TukTuk_Academy) April 21, 2023 చదవండి: సుందరానికి తొందరెక్కువ.. తప్పించుకోవడం కష్టం! -
క్లాసెన్ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా సీఎస్కేతో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. 92 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ జడేజా వేశాడు. ఓవర్ తొలి బంతిని మయాంక్ స్ట్రెయిట్ షాట్ ఆడాడు. Photo: IPL Twitter అయితే జడ్డూ క్యాచ్ తీసుకునే అవకాశం వచ్చింది. కానీ ఇదే సమయానికి నాన్స్ట్రైక్ ఎండ్లో ఉన్న క్లాసెన్ జడ్డూ క్యాచ్ అందుకునే క్రమంలో అతనికి అడ్డుగా వచ్చాడు. దీంతో జడ్డూ ఫ్లోర్పై పడిపోయాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందా లేక క్లాసెన్ కావాలనే అడ్డుకున్నాడా అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంలో జడేజా క్లాసెన్వైపు ''ఇదేంటి'' అన్నట్లుగా సీరియస్ లుక్ ఇచ్చాడు. Photo: IPL Twitter అయితే క్లాసెన్ తనకు వచ్చిన లైఫ్ను మయాంక్ కాపాడుకోలేకపోయాడు. అదే ఓవర్లో ఐదో బంతికి స్టంపౌట్గా వెనుదిరిగాడు. ఔట్సైడ్ ఆఫ్ దిశగా వేసిన బంతిని ఆడేందుకు మయాంక్ ఫ్రంట్ఫుట్ వచ్చాడు. అయితే బంతి మిస్ అయి ధోని చేతుల్లో పడింది. కీపింగ్లో సూపర్ టైమింగ్ కనబరిచే ధోని క్షణం ఆలస్యం చేయకుండా స్టంపింగ్ చేశాడు. దీంతో మయాంక్ పెవిలియన్ బాట పట్టాడు. మయాంక్ ఔటైన అనంతరం క్లాసెన్వైపు సీరియస్ లుక్ ఇచ్చిన జడేజా.. బాగుందా అన్నట్లుగా ఎక్స్ప్రెషన్ ఇవ్వడం హైలెట్గా నిలిచింది. Speeds in #Chennai today: Duronto Express ⚡ Jaddu's sword⚡⚡ Dhoni's gloves ⚡⚡⚡#CSKvSRH #IPLonJioCinema #TATAIPL #IPL2023 | @msdhoni pic.twitter.com/p7qtuEe9AI — JioCinema (@JioCinema) April 21, 2023 Jaddu😈pic.twitter.com/SOxL82wFdi — Karthik™ (@im_karthik777) April 21, 2023
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
పచ్చ మేనిఫెస్టోలో పచ్చి మోసాలు
స్టార్ హీరోయిన్కి హైకోర్టు నుంచి నోటీసులు.. కారణం ఏంటంటే?
తగ్గుతున్న పంట దిగుబడి.. ఆరెంజ్ జ్యూస్ ఫ్యూచర్లపై ప్రభావం
నా స్నేహితుడు: అల్లు అర్జున్
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్.. ఆర్జేడీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
మంచికి చెడుకు మధ్య యుద్ధం: వైఎస్ జగన్
మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
కైకలూరులో సీఎం జగన్ కాన్వాయ్ ర్యాలీ కిక్కిరిసిన జనం
తప్పక చదవండి
- పాక్కు మోదీ బుల్లెట్తో సమాధానం చెప్తారు.. అమిత్ షా
- ‘ఫోర్లు, సిక్స్లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
- ‘మిమ్మల్ని ప్రాధేయ పడుతున్న’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
- టీడీపీ, పవన్కు మంత్రి బొత్స కౌంటర్
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- బాబును సీఎం చేసేందుకే ఈ లేనిపోని పెంట వార్తలు: పోసాని
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement