-
ఏపీ పోలీస్ అబ్జర్వర్ పై మెరుగు నాగార్జున ఫైర్
-
పోలీస్ ఫెయిల్యూర్.. బాబు, పురందేశ్వరి మేనేజ్..
-
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
-
వెనుకబడిన వర్గాలను గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి వైఎస్ జగన్
-
2019 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది
-
2023 అక్టోబర్-డిసెంబర్ లో వివాహం చేసుకున్న జంటలకు పెళ్లి కానుక
-
చీమకుర్తి మండలంలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి
-
తల్లిదండ్రులు పిల్లల్ని చూసి గర్వపడేలా సీఎం జగన్ విద్యారంగం అభివృద్ధి
-
‘సాధికారత’తో మురిసిన మంగళగిరి
సాక్షి ప్రతినిధి, గుంటూరు: బడుగు, బలహీన వర్గాల సాధికారతతో గుంటూరు జిల్లా మంగళగిరి మురిసింది. బుధవారం పట్టణంలో ఘనంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా పాల్గొన్నారు. సీఎం జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను సగర్వంగా ప్రదర్శించారు. యువత నుంచి వృద్ధుల వరకు ఈ యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ‘మళ్లీ నీవే ముఖ్యమంత్రివి కావాలి జగన్’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి అధ్యక్షతన మిద్దె సెంటర్లో జరిగిన భారీ బహిరంగ సభలో వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన నేతలు సీఎం వైఎస్ జగన్ సారథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన అభివృద్ధిని వివరించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మంగళగిరే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి సీటును అగ్రకులానికి చెందిన అభ్యర్థి నుంచి మార్చి బీసీలకు కేటాయించడమే బీసీలకు సీఎం జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను తెలుపుతుందని అన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన తొలి సీఎం జగన్ దేశంలో సామాజిక కులాల గురించి ఆలోచించి, సామాజికి విప్లవాన్ని తెచ్చిన తొలి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అందలం ఎక్కించారని, ఈరోజు ఇలా తలెత్తుకొని తిరగడానికి సీఎం జగనే కారణమని చెప్పారు. చంద్రబాబు ఆణగారిన వర్గాలను అవమానించేవారని, ఈ వర్గాలను ఓటు బ్యాంకులా మాత్రమే తప్ప ఏనాడూ సాటి మనిషిగా చూడలేదని అన్నారు. మంగళగిరిలో స్థానికుడిగా ఉన్న గంజి చిరంజీవిని గెలిపించుకోవాలని, హైదరాబాదులో ఉండే టీడీపీ అభ్యర్థిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అగ్రస్థానం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్ జగన్ అన్నింటా అగ్రస్థానం ఇస్తున్నారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, నామినేటెడ్ పదవుల్లోనూ ఈ వర్గాలకే పెద్ద పీట వేసిన తొలి సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. అగ్రవర్ణ అభ్యర్థులు గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నిలబెడుతున్నారని, సీఎం జగన్ సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మంగళగిరి అని స్పష్టంగా పలకటం రాని లోకేశ్కి మంగళగిరి ఎందుకు అని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని, బడుగు వర్గాలకు ఆయన చేసిన మేలు మరెవరూ చేయలేరని పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్ అన్నా రు. రెండుసార్లు రెడ్డి సామాజిక వర్గం గెలిచిన మంగళగిరిలో బీసీ అభ్యర్ధిని రంగంలోకి దింపే సాహసం ఒక్క జగన్ మాత్రమే చేయగలరని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. మంగళగిరిలో బీసీ నేతను గెలిపించుకొనే అవకాశాన్ని వదులుకోవద్దని పిలుపునిచ్చారు. పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ఖాన్, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, బీసీ విభాగం ఉపాధ్యక్షులు చిల్లపల్లి మోహనరావు పాల్గొన్నారు. -
ఈనాడు, చంద్రబాబుపై మంత్రి మెరుగు నాగార్జున ఫైర్
-
రామోజీ.. నీ నీచపు రాతలు చూస్తే జాలేస్తోంది
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో ప్రపంచంలోనే అతి పెద్ద డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరిస్తుంటే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా అధిపతులు ఓర్వలేకపోతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. అంబేడ్కర్ విగ్రహావిష్కరణ వేడుకపై విషం చిమ్ముతూ శుక్రవారం ఈనాడు పత్రిక కథనం ప్రచురించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కైలే అనిల్కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద ఈనాడు పేపర్ను చించివేసి, పత్రిక ప్రతులను కాల్చివేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. దళితుల భూములను ఆక్రమించి ఫిల్మ్ సిటీ కట్టుకున్న నీచుడు రామోజీరావని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన రామోజీరావు దళిత బంధువైన సీఎం వైఎస్ జగన్పై విషం చిమ్మటం గర్హనీయమన్నారు. రామోజీరావు ఈనాడు పేపర్ను చంద్రబాబుకు తాకట్టుపెట్టి, పత్రిక విలువలు మంటగలిపారన్నారు. ఆయన కులపోడు సీఎంగా లేడన్న కారణంతోనే రాష్ట్రంపై రామోజీ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రామో‘ఛీ’.. నీ నీచపు రాతలపై జాలేస్తోందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్పై ఈనాడులో రాసిన చెత్త రాతలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. రామోజీ వయసుకు తగినట్టు నడుచుకోవాలని హితవు పలికారు. అంబేడ్కర్ విగ్రహం స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసినప్పటి నుంచే పచ్చ మీడియా ఏడుపే ఏడుపు అని అన్నారు. సీఎం జగన్ దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని చెప్పారు. దశాబ్దాలుగా దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ ఒక బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. దళితులకు మేలు చేయటం అంటే రామోజీ, చంద్రబాబు, రాధాకృష్ణలకు నచ్చదని చెప్పారు. కాటికి కాలుచాచిన వయసులో కూడా రామోజీ విషం కక్కటం మానలేదని వ్యాఖ్యానించారు. దళితులు వారి ఇళ్లలో పాచి పనులు చేయటానికే బతకాలనేది రామోజీ, చంద్రబాబుల నైజమన్నారు. అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగించేవారిలో దేశంలోనే సీఎం జగన్ ముందున్నారని చెప్పారు. ఈ విగ్రహం సీఎం జగన్కి బడుగు బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ, అభిమానాలను ప్రతిబింబిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని అన్నారు. ఇది తట్టుకోలేక రామోజీ, చంద్రబాబు ఏడుస్తున్నారన్నారు. -
అది మా దేవుడి విగ్రహం మీరెందుకు ఏడుస్తున్నారు..!
-
‘అంబేద్కర్ విగ్రహంపై అవమానకరంగా మాట్లాడుతున్నారు’
సాక్షి, విజయవాడ: ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అంబేద్కర్ మహా శిల్పం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు గతంలో 100 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతానని పెట్టలేదన్నారు. అంబేద్కర్ స్మారక చిహ్నన్ని సీఎం జగన్ ఏర్పాటు చేస్తే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎల్లో మీడియాలో పనులు పూర్తవ్వలేదంటూ తప్పుడు వార్తలు రాస్తున్నారని, ఎల్లో మీడియా, చంద్రబాబు ఇక్కడికి వస్తే పనులు చూపిస్తానన్నారు. రూ. 400 కోట్లు పెడితే ఎందుకంత ఖర్చు అని టీడీపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు చేసిన రాజకీయాన్ని ప్రజల్లో ఎండగడతామని మంత్రి పేర్కొన్నారు. రేపు విజయవాడలో డా.బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. తొలుత ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమతా సంకల్ప సభకు హాజరు కానున్న సీఎం.. అనంతరం స్వరాజ్ మైదానంలో సామాజిక న్యాయ మహా శిల్పాన్ని ఆవిష్కరించనున్నారు. వెలుగుల నడుమ బడుగు బాంధవుడు (ఫొటోలు).. క్లిక్ చేయండి -
అంబేద్కర్ విగ్రహంపై చంద్రబాబు మోసం చేశారు: మంత్రి మేరుగ
సాక్షి, విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మయన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్.. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకుని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మేరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావితరాల భవిషత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. ‘‘అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు.. అవహేళనలు.. దాడులు.. చూశాం. సీఎం జగన్ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్లుగానే రూ. 425 కోట్లతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన: మంత్రి ఆదిమూలపు పేదరికం విద్యకు అడ్డు కాకూడదని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందన్నారు. బడుగు, బలహీన,అణగారిన,దళిత వర్గాలకు సీఎం పెద్ద పీట వేశారు. చిట్టచివరి వారికి సైతం సంక్షేమం అందాలనే లక్ష్యంతో ఆయన పనిచేస్తున్నారు. అవినీతి లేని పాలన.. పారదర్శకత.. జవాబుదారీ తనం మా ప్రభుత్వం ఎంచుకున్న ప్రధాన లక్ష్యాలు. నేను ఉన్నాను...నేను విన్నానని పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో సీఎం జగన్ అండగా నిలిచారు’’ అని మంత్రి అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెడుతుంటే తెలుగు భాషను చంపేస్తున్నారని నానా యాగీ చేశారు. సీఎం జగన్ ధైర్యంగా పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నారు. ఈ రోజు మావంటి వారు క్యాబినెట్లో ఉన్నారంటే సీఎం జగనే కారణమని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర: మల్లాది విష్ణు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఒక చరిత్ర అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సీఎం జగన్ ఆలోచన అభినందనీయమని.. భారతదేశంలో ఏపీ అగ్రగామిగా నడవాలంటే అంబేద్కర్ ఆలోచనలతోనే సాధ్యమన్నారు. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించే ప్రభుత్వం.. వైఎస్ జగన్ ప్రభుత్వమని విష్ణు అన్నారు. -
పేదవాడి జీవితాల్లో వెలుగులు నింపిన నాయకుడు జగన్
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేరుగు నాగార్జున
-
చంద్రబాబుపై మంత్రి మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు
-
పేదలను చంద్రబాబు ఏనాడైనా పట్టించుకున్నారా..?
-
క్రైస్తవ ఆస్తులను కొల్లగొట్టింది తెలుగు తమ్ముళ్లే బాబూ!
కర్నూలు (సెంట్రల్): రాష్ట్రంలో క్రైస్తవ మిషనరీ ఆస్తులను కొల్లగొట్టింది, అమ్ముకున్నది టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుచరులేనని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. చంద్రబాబు తమతో గుంటూరు, విజయవాడ వస్తే నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడికి వచ్చి టీడీపీ నాయకులు ఆక్రమించిన క్రైస్తవ ఆస్తుల వివరాలు ఇస్తామని, దీనిపై బహిరంగ చర్చకు రావాలని మంత్రి సవాల్ విసిరారు. శుక్రవారం కర్నూలులో ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో చంద్రబాబు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత సీఎం జగన్దని చెప్పారు. అమరావతిలో దళితుల అసైన్మెంట్ భూములను చంద్రబాబు భయపెట్టి బలవంతంగా గుంజుకున్నాడన్నారు. రేపల్లెలో 400 దళిత కుటుంబాలను వెలివేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. చివరికి దళిత కుటుంబాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి అవమానించిన వ్యక్తి ఆయన కాదా... అని ప్రశ్నించారు. దళితుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం జగన్ను మరోసారి గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం జగన్ దళితులపై అక్రమ కేసులు ఎత్తివేస్తే బాబుకు భయమెందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, వైఎస్సార్సీపీ నాయకులు యాట ఓబులేసు, సత్తిరాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ మనుగడ కోసమే చంద్రబాబు కొత్త నాటకాలు: మంత్రి మేరుగ
సాక్షి, కర్నూలు: టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి మేరుగు నాగార్జున. తమ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఓ గజదొంగ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాగా, మంత్రి మేరుగు నాగార్జున శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మతిస్థిమితంలేదని మేము ఎప్పటి నుంచో చెబుతున్నాం. ఇతరులు ఆస్తులు కాజేస్తున్నామని మాపై ఆరోపణలు చేశారు. మా గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఇతరుల ఆస్తుల కోసం వెంపర్లడింది చంద్రబాబు, టీడీపీ నాయకులు. రాజకీయంగా తమ మనుగడ కోసం చంద్రబాబు మాట్లాడుతున్నారు. గుంటూరు, విజయవాడలో ఎన్ని ఆస్తులు అమ్ముకున్నారో రండి మేము చూపిస్తాం. ఎన్నికలు వస్తున్నాయని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఓ గజదొంగ. మా మీద దాడులు, అఘాయిత్యాలు చేయించారు. చంద్రబాబు హయాంలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి. దళితులపై అమానుషంగా కేసులు పెట్టారు. కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం వారిపై కేసులు ఎత్తివేశారు. చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?. చంద్రబాబు కుట్రలు, కుతంత్రలు పన్నుతున్నారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల ఇస్తామంటే కేసులు పెట్టారు. నాడు-నేడు కింద స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ బాగుచేసిన చరిత్ర వైఎస్ జగన్ది. వైఎస్సార్సీపీకి దళితుల సంపూర్ణ మద్దతు ఉంది అని వ్యాఖ్యలు చేశారు. దళితులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంది. ఇది కూడా చదవండి: బాలయ్య మిస్సింగ్.. ‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న ఫ్యాన్స్ -
పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్
-
ప్రజా సంక్షేమ రథ సారథి!
ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే ఉన్న వ్యవస్థలను అత్యంత ప్రభావవంతం చేయడంతో పాటు, ప్రజల కోసం నూతన వ్యవస్థలను ప్రవేశపెట్టారు. ముఖ్యంగా సంక్షేమ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలూ, ప్రజలకు సంక్షేమ ఫలాలను చేరవేస్తున్న తీరూ విప్లవాత్మకం. అందుకే సంక్షేమ రంగానికి సంబంధించినంత వరకూ ప్రగతి గురించి చెప్పుకోవాలంటే జగన్కు ముందు, జగన్ తర్వాత అని చెప్పుకోవాలి. ఈ కారణంగానే యావత్ భారత దేశం ఈరోజున ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. జగన్ తన నాలుగేళ్ల పదవీ కాలంలోనే ఎవరూ పూర్తిగా గుర్తు పెట్టుకోలేనన్ని ఎక్కువ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అప్పటి వరకూ ఉన్న వ్యవస్థల పని తీరును ప్రభావితం చేస్తూ వాటిని ప్రజలకు మరింత చేరువ చేయగలిగారు. ఉదాహరణకు వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెన్షన్లు ఇచ్చే పథకాలు గత ప్రభుత్వాల హయాంలోనూ ఉన్నాయి. అయితే అప్పట్లో పెన్షన్ మంజూరు కావడం, పెన్షన్ మొత్తాలు చేతికి అందడం పెద్ద ప్రహసనంగా ఉండేది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అర్హత కలిగిన వారికి పెన్షన్ల మంజూరు చాలా సులభతరంగా మారింది. కచ్చితంగా ఒకటవ తేదీన సూర్యోదయానికి ముందే ఇంటి కొచ్చి తలుపుతట్టి పెన్షన్ మొత్తాలను అందించే సరికొత్త వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడింది. పెన్షన్లను మాత్రమే కాదు రాష్ట్రంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు అందించే బియ్యం తదితర చౌక వస్తువుల కోసం దుకాణాల వరకూ వెళ్లాల్సిన పని లేకుండా ఇంటి ముంగిటకే రేషన్ వాహనాలను తెచ్చి పెట్టారు. అలాగే ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడానికి ‘దిశ యాప్’ను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అందరి మన్ననలూ పొందుతోంది. గతంలోనూ సంక్షేమ పథకాలు ఉన్నా... లబ్ధిదారులకు ఆ ఫలాలు చేరడానికి దళారీ వ్యవస్థ వాహకంగా ఉండేది. ‘కులం చూడం, మతం చూడం, పార్టీలు అసలే చూడం.. పేదరికం ఒక్కటే అర్హతకు ప్రామాణికం’ అన్నదే సంక్షేమ పథకాల అజెండాగా జగన్ పెట్టుకున్నారు. ఒక్క బటన్ నొక్కడం ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్న ‘డీబీటీ’ (డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్) విధానం సీఎంగా జగన్ రాకతోనే వచ్చింది. ఈ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయ డంలో ఎక్కడైనా పొరపాట్లు దొర్లి దాని కారణంగా ఎవరైనా అర్హులు నష్టపోయే పరిస్థితి ఏర్పడితే అలాంటివారు ఎప్పుడైనా ఆ పథకాల కోసం దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే వెసులుబాటు కలిగించారు. గతంలో కుల, ఆదాయ సర్టిఫికెట్లు లాంటివి తీసుకోవాలంటే పెద్ద తతంగమే ఉండేది. లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ గ్రామ, వార్డు సచివాలయాల వ్యవ స్థకు రూపకల్పన చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కం సర్టిఫికెట్, ఈడబ్లు్యఎస్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లాంటి ముఖ్యమైన సర్టిఫికెట్లను ఈ రోజున ప్రజలు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, ఎవ రినీ కలవాల్సిన అవసరం లేకుండా సచివాలయాల ద్వారా సులభంగా అందుకోగలుగుతున్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుపేదలకు ఎలాంటి వివాదాల్లేకుండా ఇళ్ల స్థలాలను అందించడం కూడా సచివాలయాల ద్వారా మత్రమే సాధ్యమైంది. సచివాలయాలకు అనుబంధంగా సీఎం జగన్ సృష్టించిన 2.56 లక్షల మంది ‘వాలంటీర్ల’ వ్యవస్థ... సిఫార్సులు, పైరవీలను పాతరేసింది. వ్యవసాయానికి వెన్ను దన్నుగా రైతుకు విత్తనాలు అందించడం దగ్గర నుంచి వ్యవసాయోత్పత్తుల అమ్మకాల దాకా ఆసరాగా నిలిచే ‘రైతు భరోసా కేంద్రాలు’ (ఆర్బీకే) కూడా ఈ రోజున దేశ, విదేశీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సామాజిక న్యాయం కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే, బాబూ జగ్జీవన్ రామ్, మౌలానా ఆజాద్, కొమురం భీం, అల్లూరి సీతారామరాజు కోరుకున్న సమాజం దిశగా ప్రభుత్వ ఫలాలు అట్టడుగువర్గాల వారికి చేరాలంటే పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి అత్యధిక ప్రాధా న్యత ఇవ్వాలన్నది జగన్ ప్రభుత్వం నమ్మిన సిద్ధాంతం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని మాటల్లో చెప్పకుండా చేతల్లో చేసి చూపిస్తున్న ఘనత ముఖ్యమంత్రిది. ఏ వర్గాలైతే ఇంత కాలం అణచి వేయబడ్డాయో, ఏ వర్గాలైతే ఇంత కాలం రాజకీయ పదవులకు దూరంగా ఉన్నాయో ఆ వర్గాలకు రాజ్యాధికారం దక్కుతోంది. శాసనసభ స్పీకర్గా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం, శాసనమండలి ఛైర్మన్గా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజు, మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్గా మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానవ్ుకు అవకాశం ఇచ్చారు. ఇది కాకుండా శాశ్వత ప్రాతిపదికన ‘బీసీ కమిషన్’తో పాటుగా ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేశారు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి, దాన్ని అమలు చేసిన తొలి ప్రభుత్వం జగన్దే. అందులోనూ 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనతా జగన్ సర్కార్దే. గత మూడేళ్ల కాలంలోనే రెగ్యులర్, ఔట్ సోర్సింగ్లతో కలిపి ఇప్పటి వరకూ 2.61 లక్షల ఉద్యో గాలను బీసీ వర్గాల వారికి ఇవ్వడం, గ్రామ వార్డు సచివాలయాల్లో ఇచ్చిన 1.30 లక్షల శాశ్వత ఉద్యో గాలలో 83 శాతం ఉద్యోగాలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయమే. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వర్గాల వారికి జగనన్న ప్రభుత్వం అందిస్తున్న చేయూతను చూసి ‘మేము కూడా ఈ సామాజిక వర్గాల్లో పుట్టి ఉంటే బాగుండేద’నే భావన ఈ రోజున అగ్రవర్ణాల వారిలో కలుగుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న జగన్ కలకాలం ఆయురారోగ్యాలతో విలసిల్లాలి! డా‘‘ మేరుగు నాగార్జున వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి -
రాజంపేట.. జనంతోట
సాక్షి రాయచోటి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేయూతతో ఆర్థికంగా, సామాజికంగా నిలదొక్కుకొన్న బడుగు, బలహీన వర్గాలు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో సాధికారతను ప్రదర్శించాయి. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు మంగళవారం రాజంపేటకు తరలివచ్చారు. వేలాది మంది జై జగన్ నినాదాలు చేస్తుండగా వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర సాగింది. మధ్యాహ్నం మన్నూరు వద్దగల యల్లమ్మ ఆలయంలో నేతలు పూజలు చేసి ర్యాలీని ప్రారంభించారు. అక్కడి నుంచి యాత్ర పాత బస్టాండ్ వరకు సాగింది. వేలాది ప్రజలు హాజరైన సభలో నేతలు ప్రసంగించారు. బడుగు, బలహీనవర్గాలను వెన్ను తట్టి నడిపించిన నాయకుడు జగన్: డిప్యూటీ సీఎం అంజాద్బాష రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచి వారిని వెన్నుతట్టి నడిపించిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని డిప్యూటీ సీఎం అంజాద్బాష చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపించి, సామాజిక న్యాయంతో సాధికారత సాధించిన సీఎం దేశంలో వైఎస్ జగన్ ఒక్కరేనని అన్నారు. కేవలం మాటలతో సరిపెట్టక, ఆలోచనలతో ఆగిపోకుండా, ఆచరణలో అనేక పథకాలతో పేదల ఆర్థికస్థాయిని పెంచారని, రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి సామాజిక సాధికారతకు అసలైన అర్థం చెప్పారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేబినెట్లో 17 పదవులిచ్చారని, ఇతర పదవులు, నామినేటెడ్ పదవుల్లోనే అధికశాతం ఈ వర్గాలకే ఇచ్చారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరింతగా అభివృద్ధి సాధించాలంటే జగన్ను మరోసారి సీఎంను చేసుకోవాలన్నారు. మనకు, పిల్లల భవిష్యత్తుకు వైఎస్ జగన్ అవసరం: మంత్రి మేరుగు మనతోపాటు మన పిల్లల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరికొంత కాలం సీఎంగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో బడుగులకు అండగా నిలుస్తున్న నాయకునికి మద్దతు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుండెల మీద చేయి వేసుకుని బతుకుతున్నారంటే అది సీఎం జగన్ చలవేనని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలను అడుగడుగునా అవహేళన చేసి, అవమానించిన చంద్రబాబు ఓ దురహంకారి అని అభివర్ణించారు. రాష్ట్రంలో బడుగులకే పెద్దపీట: మాజీ ఎంపీ బుట్టా రేణుక రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకే సీఎం జగన్ పెద్దపీట వేసి, వారిని అన్ని రంగాలలో అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా బీసీలను ఉన్నత స్థానాల్లో నిలుపుతోందని తెలిపారు. ప్రతి హామీని నెరవేర్చారు సీఎం జగన్ : ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ ఈ వర్గాలన్నింటినీ అక్కున చేర్చుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగనన్న ఒక్కరేనని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ కొనియాడారు. విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చేసి, బడుగు బలహీనవర్గాల పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నారన్నారు. ఇంగ్లిష్ చదువులతో పేద, వెనుకబడిన వర్గాల పిల్లలు అంతర్జాతీయస్థాయిలో పోటీపడాలని తపిస్తున్న జగనన్నను 2024లో మరోమారు ముఖ్యమంత్రిని చేసుకొనేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాయలసీమ జిల్లాల సమన్వయకర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురే‹Ùబాబు, ఎమ్మెల్సీ రమే‹Ùయాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ అశ్వర్థనాయక్ పాల్గొన్నారు. -
మళ్లీ జగనే కావాలి... మళ్లీ జగనే రావాలని
-
కమలాపురం.. జనసంద్రం
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన సామాజిక సాధికార యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పోటెత్తారు. చెన్నూరులో నిర్వహించిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. వివిధ గ్రామాల నుంచి డప్పుల దరువులు, ఆటపాటలతో ప్రజానీకం ర్యాలీగా ప్రాంగణం వద్దకు చేరుకున్నారు. ఇలా వేలాది మంది తరలి రావడంతో సభాస్థలిలో అందరూ కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది. వెరసి చెన్నూరులో ఎటు చూసినా, ఏ వీధిలో చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వైఎస్సార్సీపీ జెండాలను రెపరెపలాడిస్తూ కనిపించారు. కమలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు తమ ప్రసంగాల్లో సీఎం జగన్ పేరును ఉచ్ఛరించగా.. సభికులు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. అంబేడ్కర్ ఆలోచన విధానాలు అమలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావ్ పూలే, కొమురం బీమ్ వంటి మహానీయుల ఆలోచనలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డేనని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. అణగారిన వర్గాలకు అండగా, భావి తరాల ఉన్నతికి దూరదృష్టితో పెద్దపీట వేస్తున్న వైఎస్ జగన్ను మరోమారు మన కోసం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కామెడీ యాక్టర్ పవన్, నయవంచకుడు చంద్రబాబు కలిసికట్టుగా వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సామాజిక సాధికారత మా విధానం : డిప్యూటీ సీఎం అంజద్బాషా స్వతంత్ర భారతదేశంలో సామాజిక సాధికారత అనేది ఒక నినాదంగానే మిగిలిపోయిందని, అయితే వైఎస్సార్సీపీ సామాజిక సాధికారతను తన విధానంగా మార్చుకుందని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్బీ అంజాద్బాషా చెప్పారు. 2014–19 వరకు సాగిన టీడీపీ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించలేదని, వైఎస్సార్సీపీ.. నలుగురు మైనార్టీలను ఎమ్మెల్యేలుగా చేసిందని, మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించిందన్నారు. తనకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారని చెప్పారు. ఏపీలోనే సామాజిక విప్లవం: మంత్రి మేరుగు సామాజిక న్యాయం అనేది ఏపీలోనే, వైఎస్ జగన్ నాయకత్వంలోనే సాకారమైందని సాంఘిన సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా బడుగులకు రావాల్సిన హక్కులు సంక్రమిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు హయాంలో దళితులపై, బీసీలపై దాడులు చూశామని, దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అన్న నాడే చంద్రబాబు దళితద్రోహి అని తేలిపోయిందని, బీసీల తోకలు కత్తిరిస్తానన్న నాడే బీసీ వ్యతిరేకి అని వారు పసిగట్టారని చెప్పారు. సన్నిధి గొల్ల కొనసాగింపు: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తిరుమల సన్నిధి గొల్లను తిరిగి కొనసాగించి రాష్ట్రంలోని యాదవుల ఆత్మగౌరవాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిపారని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాయలసీమలో తొలిసారి యాదవులకు ఎమ్మెల్సీ దక్కిందని, మేయర్ పదవులను యాదవులకు అప్పగించి గౌరవించిన చరిత్ర సీఎం జగన్దేనన్నారు. ఆచరణలో చూపిన సీఎం: ఎంపీ అవినాష్రెడ్డి సామాజిక సాధికారిత కాగితాలకే పరిమితమయ్యేదని.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే దానిని ఆచరణలో చూపారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చెప్పారు. కేబినెట్ కూర్పు నుంచి నామినేటెడ్ పదవులు.. చివరకు ఆలయాల పాలక మండళ్లలో సైతం చిత్తశుద్ధి ప్రదర్శించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు సమన్యాయం పాటించిన చరిత్ర జగనన్నదేనని మాజీ ఎంపీ బుట్టా రేణుకా అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్యాదవ్, రామచంద్రారెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ యానాదయ్య తదితరులు పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
డ్రాపౌట్స్ నివారణకు చర్యలు
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఓటు ప్రజాస్వామ్యానికి బలం
అమలాభట్టలో న్యాయ సచేతన శిబిరం
మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నలుగురు బీజేడీ ఎమ్మెల్యేలకు అనర్హత తాఖీదులు
భక్తులకు పండ్లు వితరణ
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
తప్పక చదవండి
- కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement