-
11 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు.. విడిపోతున్నట్లు ప్రకటించిన సినీ ఇండస్ట్రీ కపుల్ (ఫొటోలు)
-
అభిమానుల దెబ్బకు ఇన్స్టాను తొలగించేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. అయితే ఈ సాంగ్ వల్ల మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా దారుణమైన ట్రోల్స్ను ఎదుర్కొంటున్నాడు. యూట్యూబ్లో విజిల్ పోడు పాటను మిలియన్ల కొద్ది ప్రేక్షకులు చూశారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాటకు మంచి ఆదరణ లభించినప్పటికీ, కొందరి నుంచి నెగటివ్ కామెంట్లు వచ్చాయి. పాటలో మ్యూజిక్ పరమచెత్తగా ఉందని యువన్ శంకర్ రాజాపై దుమ్మెత్తిపోశారు. ముఖ్యంగా అనిరుద్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాటపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. అనిరుధ్ను పొగుడుతూ యువన్ను తక్కవ చేసి కామెట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో వారందరూ కూడా యువన్ శంకర్ రాజాను ట్యాగ్ చేసి కామెంట్ చేస్తున్నారు. దీంతో ఆందోళన చెందిన యువన్ శంకర్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి తప్పుకున్నారు. తన అకౌంట్ను తొలగించేశారు. కొందరి అభిమానుల వల్లే యువన్ శంకర్ రాజా ఈ నిర్ణయం తీసుకున్నారని యువన్ ఫ్యాన్స్ పోస్ట్ చేశారు. అంతే కాకుండా విజిల్ పోడు పాట విజయ్ పార్టీ ఎన్నికల ప్రచార గీతమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. యువన్ నుంచి ఇలాంటి పాట వస్తుందని ఊహించలేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలో, యువన్ శంకర్ రాజా తన ఎక్స్ పేజీలో ఒక కామెంట్ చేశారు. 'నా ఇన్స్టాగ్రామ్ పేజీలో సాంకేతిక లోపం కారణంగా, నా పోస్ట్లు తొలగించబడ్డాయి. అభిమానుల ఆందోళన చెందాల్సిన పనిలేదు. ధన్యవాదాలు, నేను నా ఇన్స్టాగ్రామ్ పేజీని సరిచేయడానికి ప్రయత్నిస్తున్నాను' అంటూ వివాదానికి ముగింపు పలికారు. ప్రస్తుతం అయితే యువన్ శంకర్ రాజా ఇన్స్టాగ్రామ్ ఖాతా వినియోగంలో లేదు. -
అప్పట్నుంచి కీరవాణి ఫ్యాన్ని!
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. -
తిరుమలలో ఓంకార్ సోదరుడు అశ్విన్, తమన్ సందడి (ఫోటోలు)
-
ఆ తమన్ అన్నీ అబద్ధాలే చెప్తాడు: మణి శర్మ
మాస్ పాటైనా, క్లాస్ పాటైనా, భక్తి గీతమైనా.. అన్ని రకాల ట్యూన్స్తో అద్భుతాలు సృష్టిస్తాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఈయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్న ఈయన ఇప్పుడు చేతినిండా అవకాశాలు లేవని బాధపడుతున్నాడు. తనకు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులిస్తే బాగుండని ఆశపడుతున్నాడు. తాజాగా అతడు ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మణి శర్మ మాట్లాడుతూ.. 'నేను మొదట వయొలిన్ నేర్చుకున్నాను. తర్వాత పెద్దదిగా కనిపించిందని కీబోర్డు నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇంతలో అనంత శ్రీరామ్.. 'మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్సులు పగలగొడతారంట కదా!' అని అడిగేశాడు. వెంటనే మణిశర్మ స్పందిస్తూ.. 'ఆ తమన్గాడు అబద్ధం చెప్పాడు. నా జీవితంలో ఒక్కసారే అలా చేశానులే' అని నవ్వేశాడు. తన కెరీర్లో ఎంతోమంది గొప్ప సెలబ్రిటీలతో కలిసి పని చేయడం అదృష్టమంటూ ఎమోషనలయ్యాడు. షో చివర్లో ఆయనకు సగౌరవంగా సన్మానం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత
చెన్నై: సీనియర్ సంగీత దర్శకుడు విజయ్ ఆనంద్ (71) మంగళవారం చైన్నెలో వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో కన్నుమూశారు. విసు దర్శకత్వం వహించిన నాణయం ఇల్లాద నాణయం చిత్రం ద్వారా విజయ్ ఆనంద్ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన 'నాన్ అడిమై ఇల్లై' చిత్రం ఈయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఆ చిత్రంలోని 'ఒరు జీవన్ దాన్ ఉన్ పాడల్దాన్..' పాట చాలా పాపులర్ అయ్యింది. తమిళంలో 'కొరుక్కు ఉపదేశం', 'రాసాతి వరుం నాళ్' తదితర 10 చిత్రాలకు పని చేసిన విజయ్ ఆనంద్ కన్నడంలో 100కు పైగా సినిమాలకు సంగీతం అందించడం విశేషం. కాగా విజయ్ఆనంద్ భౌతిక కాయానికి బుధవారం నాడు చైన్నెలో అంత్యక్రియలు జరిగాయి. ఈయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, సంగీత కళాకారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
‘ఈగల్’లో మ్యూజిక్ కూడా కథ చెబుతుంది
రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్’. కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం విలేకర్ల సమావేశంలో ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాంద్ మాట్లాడుతూ– ‘‘నా పదో తరగతి నుంచే మ్యూజిక్ జర్నీ స్టార్ట్ చేశాను. పియానో, గిటార్, డ్రమ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాను. కొన్ని వీడియో గేమ్స్కి మ్యూజిక్ ఇచ్చాను. సంగీత దర్శకుడిగా ‘ఈగల్’ నాకు తొలి చిత్రం. కాలేజీలో నేను, హీరో శ్రీవిష్ణు క్లాస్మేట్స్. అలా కార్తీక్ నాకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు తనతో నా జర్నీ మొదలైంది. రవితేజగారితో సినిమా ఫిక్స్ అయ్యాక ఆయన ఓకే చెబితే, మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చాన్స్ ఇస్తానన్నాడు కార్తీక్. రవితేజగారు నా మ్యూజిక్ ట్రాక్స్ విని, నచ్చి ఓకే చేశారు. రవితేజగారి సినిమాకు మ్యూజిక్ చేయడం నా లక్. ఈ సినిమాలో మ్యూజిక్, ఆర్ఆర్లకు మంచి స్కోప్ ఉంది. మ్యూజిక్ కూడా కథ చెబుతున్నట్లుగా ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు ΄ాటలు ఉన్నాయి. ఇక కార్తీక్ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా చేస్తున్న ఓ సినిమాకు, దర్శకుడు నక్కిన త్రినాథరావుగారిప్రోడక్షన్లోని ఓ మూవీకి మ్యూజిక్ ఇస్తున్నాను. మరో రెండు ్ర΄ాజెక్ట్స్ ఉన్నాయి’’ అని చెప్పుకొచ్చారు. -
హీరోగా ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్.. రిలీజ్ ఎప్పుడంటే?
సంగీతదర్శకుడిగా, కథానాయకుడిగా సక్సెస్ఫుల్ పయనం చేస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి జీవీ.ప్రకాశ్కుమార్. తాజాగా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాల్లో రెబల్ ఒకటి. నూతన దర్శకుడు నికేశ్ ఆర్ఎస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. జీవీ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో జీవీ ప్రకాశ్కుమార్ విద్యార్థిగా చాలా పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ సినిమాలో సంభాషణలు, జీవీ.ప్రకాశ్కుమార్ యాక్షన్ సన్నివేశాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక రెబల్ చిత్ర టీజర్ను ఇటీవల విడుదల చేయగా మిలియన్ల సంఖ్యలో ప్రేక్షకులు వీక్షించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా షూటింగ్ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రాన్ని మార్చి 22న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా.. ఈ చిత్రంలో మమతా బైజూ, కరుణాస్ సుబ్రమణియ శివ, షాలూ రహీమ్, వెంకటేశ్. వీపీ, ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, ఆదిరా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
చిరంజీవి, నాగార్జున కి మ్యూజిక్ సెన్స్ చాలా ఉంటుంది
-
అలా జడ్జ్ చేయడం బాధగా ఉంది
‘‘మంచి మ్యూజిక్ ఇవ్వడానికి ఖరీదైన మ్యూజిక్ పరికరాలు అవసరం లేదు. ‘క్షణం’, ‘మేజర్’లో కొన్ని సీన్లకు మేం ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్నే వాడాం. ఇక ఇప్పుడు యూ ట్యూబ్ వ్యూస్, ఇన్స్టా రీల్ వ్యూస్తో మ్యూజిక్ డైరెక్టర్స్ను జడ్జ్ చేయడం కాస్త బాధగా ఉంది. అందుకే ఇప్పుడు నేను సినిమాలు తగ్గించుకున్నాను. ఇండిపెండెంట్ మ్యూజిక్, ఆల్బమ్స్పై ఎక్కువ దృష్టి పెడుతున్నాను’’ అని అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. రోషన్ కనకాల, మానస జంటగా రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రూ΄÷ందిన సినిమా ‘బబుల్గమ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరీ మూవీస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ– ‘‘గడిచిన పదేళ్లలో నేను చేయాల్సింది చేశాను. ఇక నన్ను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా. ‘బబుల్గమ్’తో ఈ ప్రయత్నం మొదలైంది. ఈ సినిమాలో హీరోది డీజే రోల్. నా ఫ్రెండ్స్లో ఎక్కువమంది డీజేలు ఉండటంవల్ల ఎలక్ట్రానిక్ మ్యూజిక్పై అవగాహన ఉంది. ట్యూన్ కంటే లిరిక్స్ ముఖ్యమని నమ్ముతాను. ‘బబుల్గమ్’ చూశాను. రోషన్ మంచి నటుడు, డ్యాన్సర్. డబ్బింగ్ కూడా బాగా చెప్పాడు. ప్రస్తుతం ‘సత్యభామ’, ‘గూఢచారి 2’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘ప్రతి రంగంలోనూ సాంకేతిక విప్లవం వచ్చింది. ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వల్ల మ్యూజిక్ కం΄ోజర్స్కు ప్రమాదం ఉండొచ్చు. కానీ ‘ఏఐ’ని అప్లై చేయడానికీ హ్యూమన్ టచ్ కావాలి. సప్తస్వరాలు ఏడే. సౌండింగ్ ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం. ‘గూఢచారి’ వల్ల కాదు.. ‘కృష్ణ అండ్ హీజ్ లీల’ సినిమాలోని మ్యూజిక్ నచ్చి నాకు చాన్స్లు ఇచ్చినట్లుగా కొందరు నాతో చెప్పారు. నాకదో హ్యాపీ సర్ప్రైజ్’’ అని చెప్పుకొచ్చారు. -
నాలుగోసారి ప్రేమలో పడ్డ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!
ప్రముఖ సంగీత దర్శకుడు గోపి సుందర్ వ్యక్తిగత విషయాలతోనే తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా గోపి.. అతడి భార్య, సింగర్ అమృత సురేశ్ విడివిడిగానే జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. గోపి సుందర్ ఈ మధ్య యూరప్లో సంగీత విభావరి (కన్సర్ట్)కి వెళ్లాడు. ఈ సందర్భంగా అక్కడ దిగిన పలు ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ ఫోటోల్లో మయోని అలియాస్ ప్రియ నాయర్తో సన్నిహితంగా కనిపించాడు. న్యూజిలాండ్ ట్రిప్కు కూడా తనను వెంటేసుకుని వెళ్లాడు. దీపావళి కూడా ఆమెతోనే సెలబ్రేట్ చేసుకున్నాడు. గోపి సుందర్- ప్రియ నాయర్ భార్యకు బదులుగా మరో అమ్మాయితో.. ఈ ఫోటోలను ప్రియ నాయర్ సైతం తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 'ఎలా ప్రేమించాలి? ఎలా జీవించాలి? అనే విషయాలను నేర్పిన వ్యక్తితో సంతోషకర క్షణాలు' అని సదరు పోస్ట్కు క్యాప్షన్ జోడించింది. దీంతో వీరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ జరుగుతోందని అభిమానులు అనుమానిస్తున్నారు. కాగా గోపి సుందర్ గతంలో ప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి మాధవ్, యాదవ్ అని ఇద్దరు సంతానం. అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో ఇద్దరూ విడిపోయారు. తర్వాత సింగర్ అభయ హిరణ్మయితో తొమ్మిదేళ్లకుపైగా సహజీవనం చేశాడు. కానీ ఈ రిలేషన్ కూడా ముక్కలైపోయింది. గోపి సుందర్- అమృత సురేశ్ ఏడాదికే ముక్కలైన రిలేషన్.. గతేడాది సింగర్ అమృత సురేశ్ను పెళ్లి చేసుకున్నట్లు ప్రకటించాడు గోపి సుందర్. కానీ ఏడాది గడిచేలోపు పరిస్థితులు తారుమారయ్యాయి. వీరిద్దరూ సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ఫాలో చేసుకున్నారు. బయట కూడా ఎక్కడా కలిసి కనిపించలేదు. ఇద్దరూ విడివిడిగానే ట్రిప్పులకు వెళ్తున్నారు. దీంతో వీరు విడిపోయారని నెటిజన్లు ఫిక్సయిపోయారు. అటు విడాకుల వార్తలపై గోపి, అమృత సైతం ఇంతవరకు స్పందించనేలేదు. తాజాగా మరో అమ్మాయితో గోపి సుందర్ క్లోజ్గా కనిపించడంతో అతడు నాలుగోసారి లవ్లో పడ్డాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కెరీర్.. గోపి సుందర్.. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు. ఈయన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమాతో తెలుగు చలనచిత్రపరిశ్రమకు పరిచయమయ్యాడు. భలే భలే మగాడివోయ్, ఊపిరి, మజ్ను, బ్రహ్మోత్సవం, ప్రేమమ్, నిన్ను కోరి, గీతా గోవిందం, మజిలి, 18 పేజెస్.. ఇలా ఎన్నో సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు. View this post on Instagram A post shared by Priya Nair (@_.mayoni._) View this post on Instagram A post shared by Priya Nair (@_.mayoni._) చదవండి: 21 ఏళ్ల కుమారుడున్న బాలీవుడ్ బ్యూటీతో రిలేషన్.. ట్రోలింగ్పై హీరో రియాక్షన్ ఇదే! -
మళ్లీ ఎందుకు?.. సంచలనంగా మారిన ఇళయరాజా కామెంట్స్!
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా, దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు, సంగీత దర్శకుడు దీనా మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్లో అవుననే సమాధానమే వినిపిస్తోంది. సంగీత రంగంలో అపర చాణుక్యులుగా ముద్ర వేసుకున్న ఇళయరాజాను వ్యతిరేకించి ఇక్కడ మనుగడ సాగించటం సాధ్యమేనా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఆయన్ని ఎదుర్కోవడానికే మరో సంగీత దర్శకుడు దీనా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘానికి రెండుసార్లు అధ్యక్షుడిగా ఎంపికయ్యా రు. కాగా ఈ సంఘానికి ప్రస్తు త కార్యవర్గ పదవీ బాధ్యతలు ముగియనున్నాయి. దీంతో ఈ సంఘానికి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే సంగీత దర్శకుడు దీనా మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ విషయంలోనే ఇళయరాజాకు, ఆయనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుత దక్షిణ భారత సంగీత కళాకారుల సంఘం అధ్యక్షుడు దీనాతో ఇళయరాజా మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అందులో సినీ రంగంలో మొట్టమొదటిసారిగా సంగీత కళాకారుల సంఘం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ సంఘాన్ని ప్రారంభించింది ఎంపీ శ్రీనివాసన్ అని తెలిపారు. సంఘానికి రెండేళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని అన్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు మాత్రమే సంఘానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాలనే నిబంధన కూడా ఉందన్నారు. అందువల్ల నువ్వు ఇప్పటికే రెండుసార్లు సంఘం అధ్యక్షత బాధ్యతలను నిర్వహించావని.. మూడోసారి ఎందుకు పోటీ చేస్తున్నావని ఇళయ రాజా ప్రశ్నించారు. ఈసారి కొత్త తరానికి అవకాశం కల్పించాలని ఆయన సూచించారు. ఈ సంఘంలో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. అయితే తాను ఆ విషయం గురించి లోతుగా పోదలచుకోలేదని.. సంఘం సభ్యులు కోరిక మేరకే అధ్యక్షుడిగా అంగీకరించాలని అంటున్నారు. అయితే దీన్ని ఇళయరాజా వ్యతిరేకించారు. దీనిపై స్పందించిన దీనా కాలానుగుణంగా సంఘం నిబంధనలు మారుతాయని అన్నారు. ఇళయరాజా అన్నయ్యను ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను ఇళయరాజాను కలిసి వాస్తవ పరిస్థితులు వివరిస్తానని దీనా స్పష్టం చేశారు. -
'మీ అభిమానిగా మేం సిగ్గుపడుతున్నాం.' ఏఆర్ రెహమాన్పై ఫ్యాన్స్ ఫైర్!
బాలీవుడ్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆదివారం చెన్నైలో పర్యటించారు. ఓ సంగీత కచేరీలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ఆదిత్యరామ్ ప్యాలెస్లో 'మరాకుమా నెంజమ్' అనే పేరుతో సంగీత కచేరీ నిర్వహించారు. అయితే కచేరీకి ఒక్కసారిగా ఊహించని రీతిలో ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ కచేరీకి దాదాపు 50,000 మంది వచ్చినట్లు సమాచారం. దీంతో తొక్కిసలాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్గనైజర్స్ తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో మహిళలు, పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇది రెహమాన్ కెరీర్లోనే అత్యంత చెత్త కచేరీ అని అభిమానులు మండిపడుతున్నారు. ఆర్గనెజర్స్ పరిమితికి మించి టికెట్స్ విక్రయించారని అభిమానులు ఆరోపిస్తున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొంటే తీవ్ర నిరాశకు గురయ్యామని వెల్లడించారు. ఈవెంట్ నిర్వహించే తీరు ఇదేనా అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రూ.5 వేల రూపాయలు పెట్టి టికెట్స్ కొన్నామని వాపోయారు. ఇది ఒక ఫేక్ ఈవెంట్ అంటూ మండిపడ్డారు. ఈ కచేరీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ తెగ అవుతున్నాయి. తమ టికెట్ డబ్బులు తిరిగి చెల్లించాలని నిర్వాహకులను డిమాండ్ చేస్తున్నారు. ఇదొక పెద్దస్కామ్ అంటూ ఆరోపిస్తున్నారు. స్పందించిన రెహమాన్ ప్రియమైన చెన్నై అభిమానులారా.. మీలో టిక్కెట్లు కొనుగోలు చేసి.. దురదృష్టకర పరిస్థితుల కారణంగా ఈవెంట్లో పాల్గొనలేకపోయారు. దయచేసి మీ టిక్కెట్ కొనుగోలు కాపీని మీ ఫిర్యాదులతో పాటు మెయిల్కి షేర్ చేయండి. మా బృందం వీలైనంత త్వరగా పరిష్కరిస్తుంది అంటూ ట్వీట్ చేశారు. Dearest Chennai Makkale, those of you who purchased tickets and weren’t able to enter owing to unfortunate circumstances, please do share a copy of your ticket purchase to arr4chennai@btos.in along with your grievances. Our team will respond asap🙏@BToSproductions @actcevents — A.R.Rahman (@arrahman) September 11, 2023 ఇన్స్టాగ్రామ్లో తన ట్వీట్ స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ ఏఆర్ రెహమాన్ రాస్తూ..'కొంతమంది నన్ను G.O.A.T(గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అని పిలుస్తున్నారు. ఈసారి నన్ను త్యాగం చేసే మేకగానే ఉండనివ్వండి . చెన్నై ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో వర్ధిల్లాలి. టూరిజంలో పెరుగుదల, నిబంధనలను పాటించేలా ప్రేక్షకులను మెరుగుపరచడం .. పిల్లలు, మహిళలకు సురక్షితమైన నగరంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా' అంటూ పోస్ట్ చేశారు. People are saying #ARRahmanConcert is scam of the year, listen to this gentleman.#ARRahman | #ARRConcert | #MarakkumaNenjam pic.twitter.com/3VybS9eEsN — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 11, 2023 మండిపడుతున్న నెటిజన్స్ అయితే రెహమాన్ ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. మీ పోస్ట్లో క్షమాపణ ఎక్కడ ఉంది? సిగ్గుపడండి సార్.. ప్రజలు మిమ్మల్ని చూడటానికి వస్తారు. మీరు క్షమాపణ చెప్పడం మీకు నిజంగానే కష్టంగా కనిపిస్తోంది.' అంటూ విమర్శించారు. మరొకరు రాస్తూ.. “మేము ఎల్లప్పుడూ మీ అభిమానులమే...కానీ దీనికి చెన్నై మౌలిక సదుపాయాలను నిందించవద్దు... ఇది పెద్ద స్కామ్... కెపాసిటీ కంటే 10 రెట్లు ఎక్కువ టికెట్స్ అమ్ముకున్నారంటూ రాసుకొచ్చారు. మరో అభిమాని రాస్తూ..'ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించడానికి చెన్నై అద్భుతమైన మౌలిక సదుపాయాలున్నాయి. ఆర్గనైజింగ్ టీమ్ ఈవెంట్ సామర్థ్యం గురించి పట్టించుకోలేదు. నిన్నటి దాకా మీ అభిమానులం అయినందుకు మేం బలి మేకలం. మీ పోస్ట్ చదివిన తర్వాత నేను మీ అభిమాని అని చెప్పడానికి సిగ్గుపడుతున్నా.' అంటూ రెహమాన్పై మండిపడుతున్నారు. It was worst concert ever in the History #ARRahman #Scam2023 by #ACTC. Respect Humanity. 30 Years of the Fan in me died today Mr. #ARRAHMAN. #MarakkumaNenjam Marakkavey Mudiyathu, . A performer in the stage can’t never see what’s happening at other areas just watch it. pic.twitter.com/AkDqrlNrLD — Navaneeth Nagarajan (@NavzTweet) September 10, 2023 HORROR Story of a family who paid 30K RS for #ARRahmanConcert : “If I had stood for 2 more min, they would have squeezed & killed my child, we would have died, Are they even human beings” - Affected Family#ARRahman #marakumanenjam #Arr pic.twitter.com/nAaqREoFtx — Aryabhata | ஆர்யபட்டா 🕉️ (@Aryabhata99) September 10, 2023 -
యాక్టింగ్ ఛాన్సులు వచ్చినా వదులుకుంది.. కేతకి ఇంట్రెస్ట్ అదేనట
ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది...అన్నట్లు సంగీతకారుల కుటుంబంలో జన్మించిన కేతకి మతేంగోకర్కు చిన్నప్పటి నుంచే పాట అంటే ఇష్టం. తండ్రి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. తల్లి సువర్ణ సింగర్. నటిగా కూడా మెప్పించింది కేతకి. ‘షాల’ ఆమె డెబ్యూ ఫిల్మ్. ఈ సినిమా కోసం అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. దర్శకుడు సుజిత్ ఒక టెలివిజన్ మ్యూజిక్ షోలో కేతకిని చూసి తన సినిమాలోని పాత్రకు ఎంపిక చేశాడు. నటనలో మంచి మార్కులు తెచ్చుకున్నప్పటికీ ‘నటన’ కంటే సంగీతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానంటోంది కేతకి. రోజుకు నాలుగు గంటల పాటు సంగీత సాధన చేస్తుంది. ‘మహేష్ మంజ్రేకర్ సినిమాలో నటించిన తరువాత ఎన్నో అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా సంగీతానికే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మంచి సింగర్గా పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. క్లాసిక్ నుంచి కాంటెంపరరీ మ్యూజిక్ వరకు నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను’. గత సంవత్సరం ‘మాయి’ ఆల్బమ్తో మ్యూజిక్ కంపోజర్గా కూడా తన ప్రతిభ చాటుకుంది కేతకి. ఈ ఆల్బమ్లోని తొమ్మిది పాటలను శంకర్ మహాదేవన్, మహాలక్ష్మీ అయ్యర్లాంటి ప్రసిద్ధ గాయకులు పాడారు. ‘మన దగ్గర ఉమెన్ మ్యూజిక్ కంపోజర్లు తక్కువగా ఉన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. మంచి మ్యూజిక్ను ప్రేక్షకులు ఆదరిస్తారు. చాలామందికి మ్యూజిక్ కంపోజిషన్లో అద్భుత ప్రతిభ ఉన్నా ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల దూరంగా ఉంటున్నారు’ అంటుంది కేతకి. -
ఈ ఘనత సాధించిన తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్గా రికార్డ్
పంజాబ్కు చెందిన జస్లీన్ రాయల్.. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్గా తనదైన ప్రతిభ చాటుకుంటోంది. పంజాబీ, హిందీ, బెంగాలీ, గుజరాతీలతో పాటు ఇంగ్లీష్లోనూ పాటలు పాడింది. ఫిల్మ్ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్గా చరిత్ర సృష్టించింది. లుథియానాలో హైస్కూల్ చదువు పూర్తయిన తరువాత పై చదువుల కోసం దిల్లీ వచ్చింది జస్లీన్. హిందూ కాలేజ్లో బి.కామ్ పూర్తి చేసింది. సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. తాను సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్. ఒకే టైమ్లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను ప్లే చేయడం తన ప్రత్యేకత. పిల్లలకు సంగీత పాఠాలు చెప్పడం వల్ల పాకెట్ మనీ కోసం తల్లిదండ్రుల మీద ఆధారపడే అవసరం ఉండేది కాదు. ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ ఫస్ట్ సీజన్లో సెమీ ఫైనలిస్ట్లలో ఒకరిగా అందరి దృష్టిని ఆకర్షించింది జస్లీన్. తన సంగీత ప్రతిభతో ‘వన్ ఉమెన్ బ్యాండ్’గా పేరు తెచ్చుకుంది. ‘బాలీవుడ్లోకి రావాలనేది నా చిన్నప్పటి కల. అయితే అది అంత సులభంగా నెరవేరలేదు. ఇక వెనక్కి వెళ్లిపోదాం అనుకునే సందర్భాలు అందరిలాగే నాకూ ఎదురయ్యాయి. పరీక్ష సమయంలో గట్టిగా నిలబడితే విజయం మన సొంతం అవుతుంది. నా విషయంలోనూ అదే జరిగింది’ అంటున్న జస్లీన్ రాయల్ రకరకాల ప్రాజెక్ట్లతో ముంబైలో బిజీబిజీగా ఉంది. -
సెంచరీ కొట్టిన మ్యూజిక్ డైరెక్టర్, హీరోగా కొత్త సినిమా
సంగీత దర్శకుడిగా, నటుడుగా, గాయకుడిగా, నిర్మాతగా రాణిస్తున్న బహుముఖ ప్రతిభాశాలి జీవీ ప్రకాష్ కుమార్. ఈయన అతి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా రంగ ప్రవేశం చేశారు. అలా 25 ఏళ్ల వయసులోనే 25 చిత్రాలకు పనిచేసిన సంగీత దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు. వెయిల్ చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్గా చిత్రం రంగప్రవేశం చేసి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తమిళంలో డార్లింగ్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన జీవీ ప్రకాష్ కుమార్ మదయానై కూట్టం చిత్రం ద్వారా నిర్మాతగాను అవతారం ఎత్తారు. అలా సంగీత దర్శకుడిగా సెంచరీ కొట్టిన ఈయన కథానాయకుడిగా 25 చిత్రానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ నెలలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పరిచయం పరిచయం అవుతున్నట్లు తెలిసింది. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ నిర్మాతగా కూడా వ్యవహరించనట్లు సమాచారం. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. కాగా జీవీ ప్రకాష్ కుమార్ 2013లో నిర్మాతగా మారి మదయానై కూట్టం చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆయన మళ్లీ నిర్మాతగా చేస్తున్న చిత్రం ఇదే అవుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. చదవండి: జైలర్కు తెలుగు సెంటిమెంట్.. రజనీకాంత్కు అసూయ ఎందుకు? -
నమ్మాను... ఆఫర్లు వచ్చాయి
ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్కేఎన్ నిర్మించిన చిత్రం ‘బేబీ’. ఈ సినిమా రూ. 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ను సాధించిందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ– ‘‘బింబిసార’ దర్శకుడు వశిష్ఠ ద్వారా సాయిరాజేష్ పరిచయం అయ్యారు. అలా ‘బేబీ’కి సంగీతం ఇచ్చాను. ‘బేబీ’ విజయం సాధిస్తుందని నేను బలంగా నమ్మాను. అందుకే రెండున్నరేళ్లుగా ఏ ్రపాజెక్ట్ ఒప్పుకోలేదు. ఈ సినిమా పాటలు రిలీజ్ కాగానే చాలా ఆఫర్స్ వచ్చాయి’’ అన్నారు. -
చిన్నతనంలోనే నాన్న మరణం.. తొలి సినిమాకు రూపాయి తీసుకోలే!
కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గులాబీ చిత్రం ద్వారా శశి ప్రీతమ్ సంగీత దర్శకుడిగా తెలుగు చిత్రసీమకు పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలోని సంగీతం ఎంతలా ఆకట్టుకుందో అందరికీ తెలిసిందే! తొలి చిత్రంతోనే మ్యూజికల్ హిట్ కొట్టిన ఈయన తర్వాత పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 'నేను పుట్టి పెరిగిందంతా కలకత్తాలోనే! తర్వాత హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్లే! మేము నలుగురం పిల్లలం. నా చిన్నతనంలోనే నాన్న చనిపోయారు. ఎన్నో కష్టాలు చూశాక ఈ స్థాయికి వచ్చాను. కాలేజీ పూర్తయిపోగానే స్టూడియో పెట్టుకుని కంపోజర్గా మారాను. జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని. నా తొలి పారితోషికం రూ.50. గులాబీ సినిమా చేసే సమయానికే జింగిల్స్తో మంచి పేరు సంపాదించాను. అప్పుడు ఒక్క జింగిల్కు రూ.50 వేలు తీసుకున్నాను. 1993లో నా పెళ్లయింది. మాది ప్రేమ వివాహం. మాకు ఒక పాప ఉంది. నా తొలి సినిమా గులాబీ చేసేటప్పుడు రాత్రిళ్లు పాపను ఎత్తుకుని పని చేసుకునేవాడిని. పెళ్లైన 10 ఏళ్ల తర్వాత భార్యతో విడిపోయాను. కూతురు నా దగ్గరే పెరిగింది. ప్రతి రోజు ఛాలెంజ్లను దాటుకుంటూనే ముందుకు సాగాను. తొలి సినిమా గులాబీకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. 1999 నుంచి 2019 వరకు దాదాపు 25 సినిమాలు చేశాను. మధ్యలో కృష్ణవంశీతో గొడవ కూడా అయింది. సముద్రం సినిమాతో మళ్లీ కలిసిపోయాం. ఆ తర్వాత బాలీవుడ్ కూడా వెళ్లాను. తెలుగులో కొన్ని సినిమాల్లో అంతకు ముందు వచ్చిన పాటల్లోని సంగీతాన్ని కాస్త అటూఇటూ మార్చమనేవారు. అది నాకు నచ్చేది కాదు. అదే సంగీతం కావాలనుకుంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికే వెళ్లండి, నన్నెందుకు అడుగుతున్నారు అని చెప్పి కొన్ని ప్రాజెక్టుల్లో నుంచి నేను బయటకు వచ్చేవాడిని. అది కొందరికి నచ్చలేదేమో.. అవకాశాలు ఇవ్వలేదు. అందుకే సినిమాలకు కాస్త దూరమయ్యాను' అని చెప్పుకొచ్చాడు శశి ప్రీతమ్. చదవండి: కట్టె కాలేవరకు మెగాస్టార్ అభిమానినే: అల్లు అర్జున్ చిరంజీవి, విజయ్ విషయంలో ఎక్కువ వాధపడ్డాను: రష్మిక -
'వాటిని కూడా తీసుకోవాల్సిందే'.. తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంగీత దర్శకుడిగా టాలీవుడ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్స్ అందించారు. అయితే సోషల్ మీడియాలో తక్కువగా కనిపించే తమన్.. అప్పట్లో నెగెటివిటీపై చేసిన కామెంట్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆయనను తక్కువ చేస్తూ కొందరు కామెంట్స్ చేయగా.. తనదైన శైలిలో కౌంటరిచ్చారు కూడా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్ సోషల్మీడియా నెగెటివిటీపై మాట్లాడారు. నెటిజన్లు ప్రశంసించినప్పుడు ఎలా తీసుకుంటామో.. విమర్శలు కూడా అలాగే తీసుకోవాలని అన్నారు. (ఇది చదవండి: ఆ నలుగురు స్టార్ హీరోయిన్స్.. సినిమాలే కాదు.. ఆ రంగంలోనూ తగ్గేదేలే!) ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తమన్ బదులిచ్చారు. 'మీరు చెప్పింది బాగానే ఉంది కానీ, ఈ మధ్య మీపై వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్నారు. క్రికెట్ మీద పెట్టిన శ్రద్ధ మ్యూజిక్పై పెట్టొచ్చుగా అని అంటున్నారు? అని అడిగారు. దీనికి కూడా తమన్ తనదైన శైలిలో స్పందించారు. తమన్ మాట్లాడుతూ.. 'నాకు ఎలాంటి వ్యసనాలూ లేవు. నాకు గర్ల్ఫ్రెండ్స్ కూడా లేరు. నాకు ఉన్న ఒకే ఒక్క ఎమోషన్ క్రికెట్. ప్రతిరోజూ నా ఫ్రెండ్స్తో రాత్రి 9 గంటల నుంచి 2 గంటల వరకూ క్రికెట్ ఆడి ఇంటికెళ్తా. నా టీమ్ పేరు తమన్ హిట్టర్స్. మా టీమ్లో మ్యూజిషియన్స్, డ్యాన్సర్స్ కూడా ఉన్నారు.. ఈ విషయంలో నేను ఎవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల నాపై ఒత్తిడి తగ్గుతుంది.' అని అన్నారు. కాగా.. తమన్ ప్రస్తుతం మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రానికి సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్!) -
మా స్నేహం చాలా గొప్పది..
-
గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు
టాలీవుడ్ మెచో స్టార్ గోపీచంద్ రీసెంట్గా వచ్చిన 'రామబాణం' గురితప్పింది. దీంతో చాలా రోజుల నుంచి కమ్ బ్యాక్ అయ్యేందుకు ఆయన ప్రయాత్నాలు చేస్తూనే ఉన్నాడు. రొటీన్ కథలతో వస్తున్నడంతో ఆయనకు ఏదీ సెట్ కాలేదనే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు ఆయన రూట్ మార్చినట్లు కనిపిస్తోంది! కన్నడ దర్శకుడు ఏ హర్షతో కలిసి ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు(జూన్ 12) తన పుట్టినరోజు కావడంతో ఫ్యాన్స్ కోసం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ చిత్రానికి భీమా అనే టైటిల్ను ఖరారు చేసి, పోస్టర్ను రిలీజ్ చేశాడు. పోస్టర్లో పొడవైన మీసకట్టుతో రగడ్ లుక్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా ఉన్నాడు. పోస్టర్తోనే భారీ అంచనాలు పెంచేశాడు. (ఇదీ చదవండి: Jr NTR: ఒక్క యాడ్ కోసం అన్ని కోట్లు.. ఇదీ తారక్ రేంజ్!) 2010లో పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన 'గోలీమార్' సినిమాలో ఆయన పోలీస్గా మెప్పించాడు. అప్పుడా సినిమా సూపర్ హిట్ కొట్టింది. అందులో 'గంగారామ్' రోల్లో మెప్పించాడు. శౌర్యం, ఆంధ్రుడులో కూడా పోలీసుగానే హిట్ట్ కొట్టాడు. ఈ కారణంతో 'భీమా'పై అంచనాలు పెరుగుతున్నాయి. కేజీయఫ్, సలార్ ఫేమ్ రవి బస్రూర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. #BHIMAA pic.twitter.com/a4R9gQb6mK — Gopichand (@YoursGopichand) June 12, 2023 (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
ట్రోల్స్పై ఎమోషనల్ అయిన తమన్ భార్య
సౌత్ ఇండియాలో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ప్రతి హీరోకు మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. సినిమాలకు సంగీతం అందిస్తూనే.. ఇండియన్ తెలుగు ఐడల్ షోకు జడ్జిగా వ్వవహరిస్తున్నాడు. తన వ్యక్తిగత విషయాలు ఎక్కడా చర్చించని తమన్. 'సర్కారు వారి పాట' సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా తన భార్య పేరు వర్దిని అని, ఆమె ఒక ప్లే బ్యాక్ సింగర్ అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. (ఇదీ చదవండి: కూతురి అన్నప్రాసన ఫోటో.. అభిమానులతో షేర్ చేసుకున్న హీరోయిన్) తాజాగా వర్దిని ఓ ఇంటర్వ్యూలో తమన్పై వస్తున్న ట్రోల్స్పై స్పందించింది. 'ఇంట్లో మా ఇద్దరి మధ్య ట్రోల్స్ గురించి చర్చ రాదు. ఆయన కూడా ఆలోచించడు. తమన్ ఇంటర్వ్యూలు నేనూ చూస్తాను.. కానీ వీడియో కింద వచ్చిన కామెంట్స్ మాత్రం చదవను.. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల వాటిని చదివితే ఒక భార్యగా బాధగానే ఉంటుంది. వాటి వల్ల మూడ్ ఆఫ్ అవుతాను కూడా.. అందువల్ల వాటిపై మా ఇంట్లో నో కామెంట్ అని అనుకుంటాం. తమన్ను అభిమానించే వారందరికి థ్యాంక్స్' అంటూ ఎమోషనల్ అయింది. తెలుగులో 'స్వరాభిషేకం' షో వల్ల సింగర్గా వర్దిని చాలా పాపులర్ అయింది. తర్వాత తెలుగు, తమిళంలో పలు పాటలు కూడా పాడింది. (ఇదీ చదవండి: అన్నా.. నేను అలాంటి దాన్ని కాదు: అనుపమ) -
'అమెరికాలో పూనకాలు లోడింగ్'.. మెగాస్టార్ ట్వీట్ వైరల్!
డీఎస్పీ అనగానే ఠక్కున గుర్తొచ్చేది పేరు దేవిశ్రీ ప్రసాద్. ఎందుకంటే తన మ్యూజిక్తో ఆడియన్స్ను ఊర్రూతలూగించడం ఆయన టాలెంట్. టాలీవుడ్లో మెగాస్టార్ నుంచి యంగ్ హీరోల సినిమాల దాకా తన మ్యూజిక్తో అభిమానులను అలరించాడు. అందుకే టాలీవుడ్లో అతన్ని ముద్దుగా డీఎస్పీ అని పిలుస్తారు. అయితే తాజాగా తన టాలెంట్ను అమెరికాలో ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు డీఎస్పీ. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి డీఎస్పీ బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'అమెరికాలో పూనకాలు లోడింగ్' అంటూ ఓ వీడియోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: ప్రేమికుల రోజున సీనియర్ హీరోకి అదితి ప్రపోజ్! సిద్ధార్థ్ రియాక్షన్ ఇదే..) అమెరికాలోని నాసా ఆధ్వర్యంలో నిర్వహించే రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజికల్ కన్సర్ట్కు సంబంధించిన మోషన్ పోస్టర్ను కూడా మెగాస్టార్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు. నాసా అధ్వర్యంలో దేవి శ్రీ ప్రసాద్తో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహించనున్నారు. జులై 2న డల్లాస్, జులై 8న ఫిలడెల్ఫియా, జులై 15న సియాటెల్, జులై 22న సాన్ జొస్ , జులై 29న చికాగోలో ఈవెంట్స్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ఈవెంట్స్లో సింగర్ ఇంద్రవతి , సాగర్, గీతా మాధురి , హేమ చంద్ర , రీటా , పృథ్వి , మౌనిక అలరించనున్నారు. ప్రముఖ యాంకర్ నటి అనసూయ ఈ షోస్ను హోస్ట్ చేయనున్నారు. గతంలో నార్త్ అమెరికా సీమాంధ్ర అసోసియేషన్ ఆర్ఆర్ఆర్ సినిమా ‘నాటు నాటు’ పాటకు 150 టెస్లా కార్లతో లైట్ షో నిర్వహించడం వంటి ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. టీజీ విశ్వప్రసాద్ గారి అధ్వర్యంలో నాసా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్వహించారు. ఇటీవలే సింగర్ రామ్ మిరియాలతో పలు చోట్ల మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించారు. ఈ షోస్ కి ఊహించని రీతిలో అనూహ్య స్పందన లభించింది. (ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్.. అసలు విషయం చెప్పేసిన హీరో!) ℒℴ𝓋ℯ 𝓎ℴ𝓊 𝓂𝓎 𝒷ℴ𝓎 𝐑𝐎𝐂𝐊 𝐓𝐇𝐄 𝐒𝐇𝐎𝐖𝐖𝐖𝐖 Just do KUMMUDU..🎶🕺 Wishing ROCKSTAR @ThisIsDSP & his TEAM All The Very Best for DSP-USA TOUR 2023 *#DSPOoAntavaTourUSA*https://t.co/c6jea4ILUe@sagar_singer @itsvedhem @PrudhviChandrap @geethasinger… pic.twitter.com/8AvvNUZKQi — Chiranjeevi Konidela (@KChiruTweets) June 10, 2023 -
30 ఏళ్ల తర్వాత సీక్వెల్.. సంగీత దర్శకునిగా ఆస్కార్ గ్రహీత!
1993లో విడుదలై జెంటిల్మెన్ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ దర్శకులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అర్జున్, మధుబాల జంటగా నటించిన ఈ బ్రహ్మాండ చిత్రానికి నిర్మాత కె.టి.కుంజుమోన్. ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. (ఇది చదవండి: రోజుకు రూ.4 లక్షలు.. దారుణంగా మోసపోయా: షకీలా) కాగా 30 ఏళ్ల తరువాత కేటీ కుంజుమోన్ జెంటిల్మెన్–2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిని ఎ.గోకుల్కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. టాలీవుడ్ నటుడు సేతన్ శీను కథానాయకుడిగా నటించనున్న ఇందులో నయనతార అనే నూతన నటి నాయకిగా పరిచయం కాబోతున్నారు. కాగా ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ జెంటిల్మెన్ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఇప్పటి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి జెంటిల్మెన్–2 చిత్రానికి సంగీతాన్ని అందించనుండం విశేషం. (ఇది చదవండి: ఎవరీ అండ లేకుండానే ఇండస్ట్రీలో ఎదిగా: హీరోయిన్) అవును తమిళంలో మరకతమణి పేరుతో ఇంతకుముందు కొన్ని చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఎం ఎం కీరవాణి చాలా గ్యాప్ తరువాత మళ్లీ జెంటిల్మెన్ –2 చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా ఈ చిత్ర దర్శకుడు గోకుల్కృష్ణ ఇటీవల హైదరాబాదుకు వెళ్లి కీరవాణికి కథను వినిపించారట. కథ అద్భుతంగా ఉందని కీరవాణి ఆయన్ని ప్రశంసించడంతో పాటు నిర్మాత కేటీ కుంజుమోన్కు ఫోన్ చేసి వచ్చే నెల నుంచి జెంటిల్మెన్–2 చిత్ర సంగీత కార్యక్రమాలు ప్రారంభిద్దామని తెలిపినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. కేటీ కుంజుమోన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడం మరో విశేషం. -
మహాప్రస్థానంలో సంగీత దర్శకుడు రాజ్ అంత్యక్రియలు
ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్(68) ఇక లేరు. ఆదివారం నాడు హైదరాబాద్లోని స్వగృహంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణంపై చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కాగా సోమవారం ఉదయం రాజ్ అంతిమ యాత్ర ప్రారంభమైంది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు నుంచి మహాప్రస్థానం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగింది. మహా ప్రస్థానంలో కోటి ,శివాజిరాజా , కాశీ విశ్వనాథ్ , జయంత్ , నల్లమల్లపు బుజ్జి తదితరులు రాజ్ మృతదేహాన్ని సందర్శించి ఆయనకు నివాళులు అర్పించారు. కాసేపటి క్రితమే మహాప్రస్థానంలో రాజ్ అంత్యక్రియలు ముగిశాయి. రాజ్ పెద్దల్లుడు కృష్ణంరాజు ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రాజ్ సినీప్రస్థానం మొదలైందిలా.. రాజ్ అసలు పేరు తోటకూర సోమరాజు. ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు, సావిత్రి దంపతుల రెండో సంతానమే రాజ్. 1954 జూలై 7న జన్మించారు. చిన్నప్పటి నుంచి సినీ వాతావరణంలో, ముఖ్యంగా సంగీత నేపథ్యంలో పెరగడంతో రాజ్కు సంగీతంపై ఓ అవగాహన ఉండేది. చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఓవైపు ఇంటర్ చదువుతూ మరోవైపు ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు వద్ద అసిస్టెంట్గా చేరారు. అ సమయంలో తన తండ్రి మరణించడంతో కొద్దిరోజులు ఏం చేయకుండా ఉండిపోయిన రాజ్ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి వద్ద అసిస్టెంట్గా చేరారు. ఓ ఏడాది అవగానే సాలూరి రాజేశ్వరరావు వద్ద అసిస్టెంట్గా చేరి ఆరేళ్లు పని చేశారు. సాలూరి రాజేశ్వరరావు కుమారుల్లో ఒకరైన కోటితో రాజ్కు మంచి స్నేహం ఏర్పడింది. ఆయనతో కలిసి ఎన్నో సినిమాలకు సంగీతం అందించి రాజ్-కోటి ద్వయంగా పేరు తెచ్చుకున్నారు.. సోలో మ్యూజిక్ డైరెక్టర్గానూ రాజ్ పలు చిత్రాలకు పని చేశారు. చదవండి: మమ్మల్ని కాలమే కలిపింది, కాలమే విడదీసింది: కోటి
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement