-
భారత్లో లాంచ్ అయిన జర్మన్ బ్రాండ్ కార్లు - వివరాలు
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి (Audi) భారతీయ మార్కెట్లో క్యూ3 SUV , క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్ వేరియంట్లను లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన కార్ల ధరలు వరుసగా రూ. 54.65 లక్షలు, రూ. 55.71 లక్షలు.కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త కార్లు అద్భుతమైన డిజైన్ పొందుతుంది. అయితే ఇంటీరియర్, పవర్ట్రెయిన్ విషయంలో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. బోల్డ్ ఎడిషన్ వేరియంట్లు ఎక్కువగా బ్లాక్ అవుట్ ఎలిమెంట్స్ పొందుతాయి. ఇందులోని గ్రిల్పై గ్లోస్ బ్లాక్ ట్రీట్మెంట్, ఫ్రంట్ బంపర్పై ఎయిర్ ఇన్టేక్ సరౌండ్లు, విండో లైన్ సరౌండ్, వింగ్ మిర్రర్ క్యాప్స్, రూఫ్ రైల్స్ మొదలైనవి చూడవచ్చు. ఈ కార్లు 18 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతాయి.స్టాండర్డ్ వెర్షన్ కార్ల ధరలతో పోలిస్తే.. బోల్డ్ ఎడిషన్ ధరలు వరుసగా రూ. 1.48 లక్షలు, రూ. 1.49 లక్షలు ఎక్కువ. ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో పనోరమిక్ సన్రూఫ్, ఫోర్-వే లంబార్ సపోర్ట్తో పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ-కలర్ యాంబియంట్ లైటింగ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్, రియర్ వ్యూ కెమెరా మొదలైనవి ఉన్నాయి.ఆడి క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్ బోల్డ్ ఎడిషన్లు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందుతాయి. ఇవి 190 హార్స్ పవర్, 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్స్ 7 స్పీడ్ డీసీటీ గేర్బాక్స్తో లభిస్తాయి.Make a bold statement with the Audi Q3 and Audi Q3 Sportback Bold Edition that come with the black styling package plus.*Terms and conditions apply.#AudiIndia #AudiQ3models #AudiBoldEdition pic.twitter.com/t6Yeq5CKT0— Audi India (@AudiIN) May 10, 2024 -
భారత్లో మోటరోలా ఎడ్జ్ 50 ప్రో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మోటరోలా భారత్లో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ప్రపంచంలో తొలి ట్రూ కలర్ కెమెరా, 3డీ కర్వ్డ్ డిస్ప్లే ఫోన్ ఇదేనని కంపెనీ చెబుతోంది. 6.7 అంగుళాల 1.5కే సూపర్ హెచ్డీ పీఓఎల్ఈడీ డిస్ప్లే, ఆన్డ్రాయిడ్ 14 ఓఎస్, 30 ఎక్స్ హైబ్రిడ్ జూమ్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్తో 50 ఎంపీ ప్రైమరీ ఏఐ కెమెరా, టర్బోపవర్ 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 125 వాట్ టర్బోపవర్ వైర్డ్ చార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. ధర రూ.27,999 నుంచి ప్రారంభం. -
కళ్ళముందే సరికొత్త ప్రపంచం.. మొదలైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' ఈవెంట్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న '2024 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్' (MWC 2024) ఈవెంట్ ఈ రోజు ప్రారంభమైంది. స్పెయిన్లోని బార్సిలోనాలో ప్రారంభమైన MWC 2024 ఈవెంట్ ఈ రోజు నుంచి గురువారం (ఫిబ్రవరి 26 నుంచి 29) వరకు జరుగుతుంది. ఇందులో అనేక స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు స్మార్ట్ఫోన్లను, యాక్సెసరీలను, ఏఐ టెక్నాలజీతో కూడిన ఆవిష్కరణలను ప్రవేశపెట్టనున్నాయి. ఈ ఈవెంట్లో శాంసంగ్, షావోమీ, రియల్మీ, వివో, మోటొరోలా, లెనోవో, ఇన్ఫీనిక్స్, టెక్నో వంటి అనేక టెక్ కంపెనీలు తమ సరికొత్త స్మార్ట్ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. ల్యాప్టాప్ల విషయానికి వస్తే.. ఇందులో హెచ్పీ, లెనోవో, డెల్, అసుస్ మొదలైన కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ఎక్కువగా ఏఐ బేస్డ్ మోడల్స్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పెరుగుతున్న ఏఐ టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని టెక్ కంపెనీలు చాలా వరకు తమ ఉత్పత్తులలో కూడా ఏఐ ఫీచర్స్ అందించాలని సంకల్పించాయి. ఇదీ చదవండి: కోడింగ్ అవసరమే లేదు!.. ఎన్విడియా సీఈఓ కీలక వ్యాఖ్యలు గత ఏడాది ఈ ఈవెంట్ సందర్శించడానికి ఏకంగా లక్షల మంది జనం వెళ్లినట్లు సమాచారం. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ ఈవెంట్లో లాంచ్ కావడానికి దిగ్గజ కంపెనీల ఉత్పత్తులు సిద్ధంగా ఉన్నాయి. 29వ తేదీ వరకు ఈ ఉత్పత్తులను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. -
భారత్లో లాంచ్ అయిన కొత్త బైకులు ఇవే..
గత కొన్ని రోజులుగా కొత్త వాహనాలు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఇందులో బైకులు, కార్లు ఉన్నాయి. ఈ కథనంలో ఈ మధ్య కాలంలో భారతీయ విఫణిలో లాంచ్ అయిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.కవాసకి జెడ్650ఆర్ఎస్జపాన్ బైక్ తయారీ సంస్థ కవాసకి దేశీయ మార్కెట్లో జెడ్650ఆర్ఎస్ బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). దీని ధర మునుపటి మోడల్ కంటే కూడా రూ. 7000 ఎక్కువ కావడం గమనార్హం. ఇది 649 సీసీ ఇంజిన్ కలిగి, 68 హార్స్ పవర్, 64 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.హీరో మావ్రిక్ 440హీరో మోటోకార్ప్ కూడా ఇటీవల మార్కెట్లో మావ్రిక్ 440 అనే కొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర 1.99 లక్షల నుంచి రూ. 2.24 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంది. ఈ బైక్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కలిగి 27 హార్స్ పవర్, 36 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ను పొందుతుంది.కవాసకి జెడ్900కవాసకి లాంచ్ చేసిన మరో బైక్ జెడ్900. దీని ధర రూ. 9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధర మాత్రం దాని కంటే రూ. 9000 ఎక్కువ. ఈ బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి, 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.కవాసకి నింజా 500మార్కెట్లో లాంచ్ అయిన మరో బైక్ కవాసకి నింజా 500. దీని ధర రూ. 5.24 లక్షలు (ఎక్స్ షోరూమ్). 451 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైక్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది భారతదేశానికి కంప్లైట్ బిల్డ్ (CBU) ద్వారా దిగుమతి అవుతుంది. -
మార్కెట్లో రూ.9.29 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
కవాసకి కంపెనీ ఎట్టకేలకు ఇండియన్ మార్కెట్లో జెడ్900 బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ ధర రూ.9.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా రూ. 9000 ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. కవాసకి జెడ్900 బైక్ 948 సీసీ ఇంజిన్ కలిగి 125 హార్స్ పవర్, 98.6 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో జత చేయబడింది. డిజైన్ పరంగా చూడటానికి 2023 మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు. ఈ బైకులో USD ఫోర్క్, మోనోషాక్ వంటివి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 300 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుకవైపు 250 మిమీ డిస్క్ ఉంటుంది. జెడ్900 బైక్ రెండు పవర్ మోడ్లు, మూడు రైడింగ్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్ వంటి వాటితో పాటు నాన్ స్విచ్బుల్ డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. ఇది దేశీయ మార్కెట్లో ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ బైకుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
అలా తీసి ఇలా పట్టుకెళ్లిపోవచ్చు.. ధర ఎంతంటే?
అమెరికన్ కంప్యూటర్స్ తయారీ సంస్థ 'హెచ్పీ' ఇటీవల భారతీయ మార్కెట్లో కొత్త 'ఎన్వీ మూవ్' (Envy Move) ఆల్ ఇన్ వన్ పీసీ లాంచ్ చేసింది. ఈ పీసీను మనతోపాటు తీసుకెళ్లడానికి అనుగుణంగా ఉండేందుకు కంపెనీ హ్యాండిల్, ఫీట్ వంటి వాటిని అందించింది. దీంతో మనం ఒక బ్రీఫ్కేస్ మాదిరిగా తీసుకెళ్లవచ్చు. కొత్త హెచ్పీ ఎన్వీ మూవ్ ప్రారంభ ధర రూ.124990. 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 అయిన ఈ కంప్యూటర్ టచ్ నావిగేషన్కు సపోర్ట్ చేసే 23.8 ఇంచెస్ క్యూహెచ్డీ డిస్ప్లే పొందుతుంది. ఆడియో కోసం బ్యాంగ్ & ఒలుఫ్సెన్ మేకర్స్ ఆడియో సిస్టమ్స్ పొందుపరిచారు. ఈ లేటెస్ట్ పర్సనల్ కంప్యూటర్ ఓన్ వైడ్ విజన్ టెక్నాలజీతో అడ్జస్టబుల్ 5 మెగా పిక్సెల్ కెమెరా పొందుతుంది. ఈ కంప్యూటర్ భద్రతను లేదా సేఫ్టీకి దృష్టిలో ఉంచుకుని సంస్థ మాన్యువల్ ప్రైవేట్ షట్టర్, వాక్ అవే లాక్ వంటి మరిన్ని ఫీచర్స్ అందిస్తోంది. డిస్ప్లే: 23.8 ఇంచెస్ QHD IPS డిస్ప్లే, టచ్, 300 నిట్స్ బ్రైట్నెస్ ప్రాసెసర్: 13వ జనరేషన్ ఇంటెల్ కోర్ i5 గ్రాఫిక్స్: ఇంటెల్ UHD గ్రాఫిక్స్ ర్యామ్: 16జీబీ LPDDR5 వరకు స్టోరేజ్: 1 టీబీ PCIe NVMe M.2 SSD కెమెరా: హెచ్పీ వైడ్ విజన్ 5ఎంపీ ఓఎస్: విండోస్ 11 హోమ్ పోర్ట్స్: 1 యూఎస్బీ టైప్-ఏ, 1 యూఎస్బీ టైప్-సీ, 1 HDMI పోర్ట్ కనెక్టివిటీ: Wi-Fi 6E, బ్లూటూత్ v5.3 ఛార్జింగ్: 90W బరువు: 4.1 కేజీలు హెచ్పీ కంపెనీ లాంచ్ చేసిన 'ఎన్వీ మూవ్' లాంటి కంప్యూటర్లు బహుశా ఇండియన్ మార్కెట్లో లేదనే చెప్పాలి, ఎందుకంటే పర్సనల్ కంప్యూటర్ మనతోపాటు తీసుకెళ్లడం అంటే కొంత కష్టమే, అయితే దీనికి హ్యాండిల్ ఉండటం వల్ల బ్రీఫ్కేస్ మాదిరిగా తీసుకెళ్లిపోవచ్చు. కాబట్టి ఇలాంటి కంప్యూటర్ దేశంలో ఇదే మొదటిదై ఉంటుందని భావిస్తున్నాము. అయితే ఎన్వీ మూవ్ కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న PCలు చాలానే అందుబాటులో ఉన్నాయని మాత్రం చెప్పవచ్చు. -
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్
సరికొత్త ఫీచర్లతో మహీంద్రా ఆల్ ఎలక్ట్రిక్ ఎక్స్యూవీ400 ప్రో రేంజ్ను మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్ ఇటీవల విడుదల చేసింది. మహీంద్రా ఎక్స్యూవీ400కి అప్డేటెడ్ వెర్షన్గా తీసుకొచ్చిన దీని ప్రారంభ ధర రూ. 15.49 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) కంపెనీ ప్రకటించింది. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో మూడు వేరియంట్లు ఉన్నాయి. అవి ఈసీ ప్రో (EC Pro), రెండు ఈఎల్ ప్రో (EL Pro) వర్షన్లు. మార్పుల విషయానికొస్తే, కొత్త వెర్షన్ల క్యాబిన్ రీడిజైన్ చేసిన డాష్బోర్డ్తో కొత్త బ్లాక్ అండ్ గ్రే ట్రీట్మెంట్తో వస్తోంది. కొత్త ఫీచర్ల విషయానికి వస్తే, టాప్-స్పెక్ ఈఎల్ ప్రో వేరియంట్లో ఫ్లోటింగ్ 10.25 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆల్-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ ఛార్జర్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, రివైజ్డ్ ఎయిర్కాన్ ప్యానెల్, రియర్ టైప్-సీ USB ఉన్నాయి. పోర్ట్, వెనుక మొబైల్ హోల్డర్, కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా ఎక్స్యూవీ400 ప్రో రేంజ్లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో 34.5kWh బ్యాటరీ ప్యాక్ ఒక్క సారి చార్జ్ చేస్తే 375 కిమీల డ్రైవింగ్ రేంజ్ను ఇస్తుందని, 39.4kWh యూనిట్ 456కిమీల డ్రైవింగ్ రేంజ్ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీటికి బుకింగ్స్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 నుంచి డెలివరీలను కూడా కంపెనీ ప్రారంభించింది. -
న్యూ ఇయర్లో లాంచ్ అయిన కొత్త వెహికల్స్ - వివరాలు
గత ఏడాది భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన వాహనాలు లాంచ్ అయ్యాయి, ఈ ఏడాది కూడా కొన్ని లాంచ్ అయ్యాయి.. లాంచ్ అవ్వడానికి సిద్దమవుతున్నాయి. ఈ కథనంలో న్యూ ఇయర్లో విడుదలైన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కవాసకి జెడ్ఎక్స్-6ఆర్ కవాసకి కంపెనీ 2024 ప్రారంభంలో రూ. 11.09 లక్షల 'జెడ్ఎక్స్-6ఆర్' బైక్ లాంచ్ చేసింది. బిఎస్6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్స్ పొందిన ఈ బైక్ డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇందులోని 636 సీసీ ఇంజిన్ 129 హార్స్ పవర్, 69 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కవాసకి ఎలిమినేటర్ 500 ఈ ఏడాది ప్రారంభంలోనే కవాసకి 'ఎలిమినేటర్ 500' అనే మరో బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 5.62 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా). ఇందులోని 451 సీసీ ఇంజిన్ 45 హార్స్ పవర్, 42.6 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్లిప్/అసిస్ట్ క్లచ్తో 6-స్పీడ్ గేర్బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి డెలివరీ చేస్తుంది. ఇదీ చదవండి: టిప్స్ అక్షరాలా రూ.97 లక్షలు - సీఈఓ రియాక్షన్ ఏంటంటే? బజాజ్ చేతక్ ప్రీమియం ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్.. సరికొత్త అప్డేట్లతో ప్రీమియం అనే పేరుతో లాంచ్ అయింది. రూ. 1.35 లక్షల ధర వద్ద విడుదలైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్ చార్జితో 157 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్ పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. నావిగేషన్ అప్డేట్లు, నోటిఫికేషన్ అలర్ట్ వంటి కొన్ని అప్డేటెడ్ ఫీచర్స్ ఇందులో గమనించవచ్చు. ఏథర్ 450 అపెక్స్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఇటీవల 450 అపెక్స్ అనే పేరుతో మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 1.89 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులోని 3.7 కిలోవాట్ బ్యాటరీ దాని మునుపటి మోడల్ కంటే కూడా ఎక్కువ రేంజ్ అందించేలా తయారైంది. ఈ స్కూటర్ రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్తో పాటు వేణు భాగం పనారదర్శకంగా ఉంటుంది. -
భారత్లో విడుదలైన ల్యాండ్ రోవర్ కొత్త కారు - ధర ఎంతంటే?
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'ల్యాండ్ రోవర్' ఎట్టకేలకు దేశీయ విఫణిలో సరికొత్త 'రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8' లాంచ్ చేసింది. రెండు వేరియంట్లలో లభించే ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 ధరలు రూ. 2.01 కోట్ల నుంచి రూ. 2.80 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 4.4-లీటర్, ట్విన్-టర్బోచార్జ్డ్, 3.0-లీటర్, 6-సిలిండర్ ఇంజన్తో 38.2kWh బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరుని అందిస్తాయి. డిజైన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త ఫ్రంట్ బంపర్, గ్రిల్ ట్రీట్మెంట్, సైడ్ స్కర్ట్స్, డ్యూయల్ ట్విన్ ఎగ్జాస్ట్లతో రియర్ బంపర్ వంటివి ఉన్నాయి. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడల్ డిజిటల్ ఎల్ఈడీ హెడ్లైట్లు, పనోరమిక్ సన్రూఫ్, 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, యాంబియంట్ లైటింగ్, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఓలా ఎలక్ట్రిక్ నష్టాలు ఇన్ని కోట్లా.. కారణం ఏంటంటే? రేంజ్ రోవర్ స్పోర్ట్ వీ8 అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది దేశీయ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న లంబోర్ఘిని ఉరుస్, ఆడి ఆర్ఎస్ క్యూ8, ఆస్టన్ మార్టిన్ డీబీఎక్స్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 160 కిమీ రేంజ్ అందించే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ 'సింపుల్ ఎనర్జీ' (Simple Energy) దేశీయ మార్కెట్లో సర్వ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ 'డాట్ వన్' (Dot One) లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు, ఆఫర్ వివరాలు వంటి వాటితో పాటు రేంజ్ గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'డాట్ వన్' ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 99,999 (ఎక్స్ షోరూమ్, బెంగళూరు). ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందస్తు డెలివరీలు ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. పరిచయ ధరలు ఈ నెల చివరి వరకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తరువాత ధరల పెరుగుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. నాలుగు కలర్ఆప్షన్లలో లభించే ఈ స్కూటర్ సింగిల్ ఛార్జ్తో గరిష్టంగా 160 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. వాస్తవ ప్రపంచంలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ స్కూటర్ రేంజ్ 151 కిమీ వరకు ఉంటుందని సమాచారం. ఇదీ చదవండి: అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా? 3.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన సింపుల్ ఎనర్జీ కొత్త స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని 8.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ 72 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. మొత్తం మీదే పనితీరు పరంగా ఇచ్చి చాలా ఉత్తమంగా ఉంటుంది. డాట్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ 35 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి.. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కొత్త స్కూటర్ భారతీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఉన్న ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
సింగిల్ ఛార్జ్తో 104 కిమీ రేంజ్ - ధర ఎంతంటే?
దేశీయ విఫణిలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుతున్న తరుణంలో 'కైనెటిక్ గ్రీన్' ఓ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. 'కైనెటిక్ జులు' పేరుతో విడుదలైన ఈ స్కూటర్ ధర రూ. 94,990 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరిస్తుంది. డెలివరీలు 2024 ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉంది. సుమారు 93 కేజీల బరువున్న కైనెటిక్ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ 2.1 కిలోవాట్ హబ్ మోటార్ కలిగి గంటకు 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులో ఉన్న 2.27 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్తో గరిష్టంగా 104 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది 15 ఏఎంపీ స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకుంటుంది. మంది డిజైన్ కలిగిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్లు, 10 ఇంచెస్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ డీఆర్ఎల్, డిజిటల్ స్పీడోమీటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ లైట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇదీ చదవండి: పతనమవుతున్న పసిడి.. మరింత తగ్గిన వెండి - నేటి కొత్త ధరలు ఇవే ఒక ఫుల్ చార్జితో 104 కిమీ రేంజ్ అందించే ఈ జులు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లో ఒకినావా ప్రైజ్ ప్రో, ఓలా ఎస్1 ఎక్స్+, ఏథర్ 450ఎస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఈ స్కూటర్ అమ్మకాల పరంగా గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్.. కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్లైట్, అనలాగ్ ఇన్స్ట్రుమెంటేషన్ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు. -
భారత్లో లాంచ్ అయిన ఇటాలియన్ సూపర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు తన కొత్త 'రెవెల్టో' (Revuelto) కారుని లాంచ్ చేసింది. రూ.8.89 కోట్ల ధర వద్ద విడుదలైన ఈ కారు డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈ కొత్త కారు డిజైన్, ఫీచర్స్, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ రెవెల్టో చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వై షేప్ హెడ్లైట్, ఎయిర్ ఇన్టేక్లు, టెయిల్ లైట్స్ వంటి వాటిని పొందుతుంది. వెనుక భాగంలో హెక్సా గోనల్ ఎగ్జాస్ట్ పోర్ట్లు చూడవచ్చు. ముందు భాగంలో 20 ఇంచెస్ వీల్స్, వెనుక భాగంలో 21 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 8.4 ఇంచెస్ ఫ్లోటింగ్ టచ్స్క్రీన్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ డిస్ప్లే, 9.1 ఇంచెస్ ప్యాసింజర్-సైడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. ఈ మూడు స్క్రీన్లు ఫిజికల్ కంట్రోల్స్ పొందుతుంది. స్టీరింగ్ వీల్ కూడా కంట్రోల్ బటన్స్ పొందుతుంది. సౌకర్యవంతమైన సీట్లు కలిగిన ఈ కారు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. ఇదీ చదవండి: షారుక్ ఖాన్ గ్యారేజిలో ఇదే ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు - ధర ఎంతో తెలుసా? లంబోర్ఘిని రెవెల్టో సూపర్ కారు మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో 1015 హార్స్ పవర్, 807 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 2.5 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ సూపర్ కారు టాప్ స్పీడ్ గంటకు 350 కిమీ కావడం గమనార్హం. ఇది ఇండియన్ మార్కెట్లో 'ఫెరారీ SF90 స్ట్రాడేల్'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఈ వారం భారత్లో విడుదలైన కొత్త బైకులు ఇవే!
పండుగ సీజన్ తరువాత కూడా భారతీయ మార్కెట్లో కొత్త బైకులు విడుదలవుతూనే ఉన్నాయి. బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయగా, చెన్నైకు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ రెండు కొత్త బైకులను లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ బైక్స్ ధరలు, ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రాయల్ ఎన్ఫీల్డ్ షాట్గన్ 650 దేశీయ బైక్ తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల 650 సీసీ విభాగంలో ఓ స్టైలిష్ బైక్ లాంచ్ చేసింది. రూ. 4.25 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ మంచి మీటియోర్ లాంటి డిజైన్ కలిగి 47 హార్స్ పవర్, 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుందని తెలుస్తోంది. 2024 హిమాలయన్ భారతదేశంలో ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పుడు సరోకొత్త మోడల్గా మార్కెట్లో విడుదలైంది. ఈ లేటెస్ట్ బైక్ ధరలు రూ.2.69 లక్షల నుంచి రూ.2.79 లక్షల మధ్య ఉంటాయి. ఈ ధరలు 2023 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లిబాటు అవుతాయి. ఆ తరువాత ధరలు పెరిగే అవకాశం ఉంది. 2024 హిమాలయన్ లిక్విడ్ కూల్డ్, 452 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 40 హార్స్ పవర్ మరియు 40 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్తో 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. కాబట్టి అద్భుతమైన పర్ఫామెన్స్ చూడవచ్చు. ఇదీ చదవండి: నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె.. ఓర్క్సా మాంటిస్ ఎలక్ట్రిక్ బైక్ బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'ఓర్క్సా ఎనర్జీ' (Orxa Energy).. దేశీయ విఫణిలో 'మాంటీస్ ఎలక్ట్రిక్' (Mantis Electric) బైక్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 3.6 లక్షలు (ఎక్స్-షోరూమ్, బెంగళూరు). కేవలం ఒకే వేరియంట్లో లభించే ఈ బైక్ 1.3 కిలోవాట్ ఛార్జర్ పొందుతుంది. కేవలం 8.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జ్తో 221 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అల్ట్రావయోలెట్ ఎలక్ట్రిక్ బైకులకు ప్రధాన ప్రత్యర్థిగా ఉండే 'మాంటీస్ ఎలక్ట్రిక్' 182 కేజీల బరువును కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది. చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్స్ కలిగి వినియోగదారులకు ఉత్తమ రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని సంస్థ తెలిపింది. -
భారత్లో కొత్త 'మ్యాక్బుక్ ప్రో, ఐమ్యాక్' లాంచ్ - ధరలు, వివరాలు
ప్రపంచ మార్కెట్లో యాపిల్ ఉత్పత్తులకు భారీ డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సంస్థ ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం కొత్త ఉత్పత్తులను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మ్యాక్బుక్ ప్రో, ఐ మ్యాక్ ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మ్యాక్బుక్ ప్రో ఎమ్3 ధరలు యాపిల్ మ్యాక్బుక్ ఎమ్3, ఎమ్3 ప్రో, ఎమ్3 ప్రో మ్యాక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ధరలు సైజ్, ర్యామ్ వంటి వాటిని మీద ఆధారపడి ఉంటాయి. మ్యాక్బుక్ ప్రో ఎమ్3 ప్రారంభ ధర రూ. 1,69,900 14 ఇంచెస్ ఎమ్3 ప్రో ప్రారంభ ధర రూ. 1,99,900 16 ఇంచెస్ మ్యాక్బుక్ ప్రో ప్రారంభ ధర రూ. 2,49,900 ఈ కొత్త యాపిల్ మ్యాక్బుక్ ప్రో కొనుగోలు చేయాలనుకునే వారు యాపిల్ స్టోర్లలో లేదా యాపిల్ స్టోర్ యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఐమ్యాక్ ధరలు యాపిల్ 8-కోర్ GPU కలిగిన iMac ధర రూ.1,34,900. ఇది గ్రీన్, పింక్, బ్లూ, సిల్వర్ కలర్లలో లభిస్తుంది. ఇది 8-కోర్ CPU, 8GB మెమరీ, 256GB SSD, రెండు థండర్బోల్ట్ పోర్ట్ వంటి ఫీచర్లతో మ్యాజిక్ కీబోర్డ్ అండ్ మ్యాజిక్ మౌస్తో వస్తుంది. ఇదీ చదవండి: 81.5 కోట్ల భారతీయుల ఆధార్ వివరాలు లీక్ - అమ్మడానికి సిద్దమైన హ్యాకర్! ఐమ్యాక్ కొనుగోలు చేయాలనుకువారు యాపిల్ ఆన్లైన్ స్టోర్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది ప్రపంచ వ్యాప్తంగా 27 దేశాల్లో అందుబాటులో ఉంటుంది. డెలివరీలు నవంబర్ 7 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి యాపిల్ స్టోర్లలో కూడా లభిస్తుంది. -
ఒకేసారి 13 కొత్త కాంట్రాక్టులు.. ఎన్ఎస్ఈ
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్స్లో మరింత విస్తరించే దిశగా ఎన్ఎస్ఈ కొత్త కాంట్రాక్టులను జోడిస్తోంది. సోమవారం ఒకేసారి 13 నూతన కాంట్రాక్టులను ప్రారంభించినట్టు ఎన్ఎస్ఈ ప్రకటించింది. కమోడిటీ డెరివేటివ్స్లో ఎన్ఎస్ఈ ఆఫర్ చేస్తున్న ఉత్పత్తుల సంఖ్య 28కి చేరింది. గోల్డ్ 1కేజీ ఫ్యూచర్స్, గోల్డ్ మినీ ఫ్యూచర్స్, సిల్వర్ మినీ ఫ్యూచర్స్, కాపర్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, గోల్డ్ గినియా (8గ్రాములు) ఫ్యూచర్స్, అల్యూమినియం ఫ్యూచర్స్, అల్యూమినియం మినీ ఫ్యూచర్స్, లెడ్ ఫ్యచర్స్, లెడ్ మినీ ఫ్యూచర్స్, నికెల్ ఫ్యూచర్స్, జింక్ ఫ్యూచర్స్, జింక్ మినీ ఫ్యూచర్స్లో ‘ఆప్షన్ ఆన్ ఫ్యూచర్స్’ను ఎన్ఎస్ఈ తాజాగా ప్రారంభించింది. ఇంధనం, బులియన్, బేస్ మెటల్స్లో అన్ని ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అందిస్తున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. దీంతో ఇన్వెస్టర్లు కమోడిటీ మార్కెట్లో రిస్క్ను సమర్థవంతంగా హెడ్జ్ చేసుకోవచ్చని ఎన్ఎస్ఈ చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు. గత కొన్ని రోజుల్లో ఎన్ఎన్ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, సిల్వర్కు సంబంధించి ఆరు నూతన డెరివేటివ్ కాంట్రాక్టులను ప్రారంభించడం గమనార్హం. నూతన ఉత్పత్తుల ఆవిష్కరణతో ఇన్వెస్టర్ల భాగస్వామ్యం పెరుగుతున్నట్టు ఎన్ఎస్ఈ తెలిపింది. -
ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కార్లు - కియా నుంచి లాంబోర్గినీ వరకు..
భారతదేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో చాలా వాహన తయారీ సంస్థలు కొత్త కార్లను & బైకులను మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ వారం మార్కెట్లో విడుదలైన లేటెస్ట్ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కియా కారెన్స్ ఎక్స్-లైన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందిన కియా కంపెనీకి చెందిన కారెన్స్ ఇప్పుడు ఎక్స్-లైన్ రూపంలో విడుదలైంది. ఈ కొత్త కారు ధరలు రూ. 18.94 లక్షల నుంచి రూ. 19.44 వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి, కావున డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఇందులో 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. పనితీరు చాలా ఉత్తమంగా ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ తాజాగా ఇండియన్ మార్కెట్లో అడుగెట్టిన నిస్సాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ ధరలు ఈ రోజు అధికారికంగా వెలువడ్డాయి. దీని ధర రూ. 8.27 లక్షలకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది పెట్రోల్ ఎమ్టీ, టర్బో పెట్రోల్ ఎమ్టీ, టర్బో-పెట్రోల్ సీవీటీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఫోక్స్వ్యాగన్ వర్టస్ జిటి ప్లస్ మ్యాట్ వర్టస్ వెర్షన్ ఇటీవల జిటి ప్లస్ మ్యాట్ ఎడిషన్ రూపంలో విడుదలైంది. దీని ధరలు రూ. 17.62 లక్షల నుంచి రూ. 19.29 లక్షల వరకు ఉంటుంది. బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. డెలివరీలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్ కేవలం 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మోటారుతో మాన్యువల్ అండ్ DSG ఆటోమేటిక్ గేర్బాక్స్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఎక్స్, యూట్యూబ్ & టెలిగ్రామ్లకు నోటీస్ - వాటిని వెంటనే తొలగించండి లాంబోర్గినీ రెవెల్టో ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ విఫణిలో 'రెవెల్టో' అనే కొత్త కారుని విడుదల చేసింది. దీని ధర రూ. 8.9 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఇది మూడు ఎలక్ట్రిక్ మోటార్లు & 3.8 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. ఇందులోని 6.5 లీటర్ వి12 ఇంజిన్ 825 హార్స్ పవర్, 725 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ పొందుతుంది. -
పండుగ సీజన్లో కొత్త కారు కొనాలా? ఎంచుకో ఓ బెస్ట్ ఆప్షన్..
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకి కొత్త కొత్త కార్లు విడుదలవుతూనే ఉన్నాయి. అయితే రానున్న పండుగ సీజన్ని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు మరిన్ని లేటెస్ట్ కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి. కాగా ఈ వారం మార్కెట్లో విడుదలైన కార్లు ఏవి? వాటి వివరాలేంటి? అనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. హోండా ఎలివేట్ (Honda Elevate) హోండా కంపెనీ గత కొంత కాలంలో దేశీయ విఫణిలో విడుదల చేయాలనుకున్న ఎలివేట్ కారుని ఈ వారం ప్రారంభంలో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఇది మొత్తం నాలుగు ట్రిమ్లలో మార్కెట్లో లభిస్తుంది. ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. హోండా ఎలివేట్ 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 121 హార్స్ పవర్ అండ్ 145 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ఆటోమేటిక్ పొందుతుంది. డిజైన్ అండ్ ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue ADAS) ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న హ్యుందాయ్ వెన్యూ ఇప్పుడు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టం (ADAS)తో విడుదలైంది. దీని ధర రూ. 10.33 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కారు ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్, లేన్ ఫాలోయింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్ అండ్ లీడింగ్ వెహికల్ డిపార్చర్ అలర్ట్ వంటి వాటితో మరింత సురక్షితమైన వాహనంగా నిలుస్తోంది. వోల్వో సీ40 రీఛార్జ్ (Volvo C40 Recharge) స్వీడిష్ కార్ల తయారీ సంస్థ దేశీయ మార్కెట్లో 'వోల్వో' రూ. 61.25 లక్షల (ఎక్స్-షోరూమ్) ఖరీదైన 'సీ40 రీఛార్జ్' లాంచ్ చేసింది. డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండే ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ మీద 530 కిమీ కంటే ఎక్కువ పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగవంతమవుతుంది. బీఎండబ్ల్యూ 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ (BMW 2 Series M Performance Edition) జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియన్ మార్కెట్లో కొత్త 2 సిరీస్ ఎమ్ పర్ఫామెన్స్ ఎడిషన్ లాంచ్ చేసింది. దీని ధర రూ. 46 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉంది. ఇందులోని 2.0 లీటర్, నాలుగు-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 179 హార్స్ పవర్, 280 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇదీ చదవండి: జీ20 సమ్మిట్ కోసం భారత్ ఇన్ని కోట్లు ఖర్చు చేసిందా? ఆసక్తికర విషయాలు! హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ (Hyundai i20 facelift) దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హ్యుందాయ్ ఐ20 ఫేస్లిఫ్ట్ ధరలు రూ. 6.99 లక్షల నుంచి రూ. 11.01 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంటుంది. ఇది అప్డేటెడ్ ఫ్రంట్ అండ్ రియర్ డిజైన్ కలిగి, కొత్త ఇంటీరియర్ కలర్ స్కీమ్తో ఆధునిక హంగులు పొందుతుంది. ఈ ఫేస్లిఫ్ట్ ఇప్పుడు 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే పొందుతుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT ట్రాన్స్మిషన్తో లభిస్తుంది. -
ఆధునిక హంగులతో కొత్త సెల్టోస్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
Kia Seltos Facelift Debut: సౌత్ కొరియా కార్ తయారీ సంస్థ 'కియా మోటార్స్' దేశీయ మార్కెట్లో 'సెల్టోస్' విడుదల చేసి మంచి అమ్మకాలను పొందుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇందులో ఫేస్లిఫ్ట్ ఆవిష్కరించింది. భారతీయ విఫణిలో విడుదలకానున్న కొత్త 'కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్' (Kia Seltos Facelift) గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బుకింగ్స్ కియా మోటార్స్ ప్రవేశపెట్టిన కొత్త 'సెల్టోస్ ఫేస్లిఫ్ట్' కోసం సంస్థ జులై 14 నుంచి బుకింగ్స్ స్వీకరించనున్నట్లు సమాచారం. 2019లో ప్రారంభమై దాదాపు నాలుగు సంవత్సరాల తరువాత 2022లో ప్రపంచ మార్కెట్లో అధికారికంగా విడుదలైంది. ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఐదు లక్షల యూనిట్ల సెల్టోస్ కార్లు విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఇప్పుడు కొత్త రూపంలో మార్కెట్లో అడుగుపెట్టింది. డిజైన్ సాధారణ మోడల్ కంటే కూడా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ కొంచెం పెద్ద బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్లో బాడీ కలర్ ఇన్సర్ట్లు, గ్రిల్లోకి విస్తరించే ఉండే కొత్త ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్లతో రీడిజైన్ హెడ్లైట్లు ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ 18 ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. వెనుక భాగంలో కొత్త ఇన్వర్టెడ్ ఎల్ షేప్ టెయిల్ లైట్లు ఉన్నాయి. ఫీచర్స్ కియా సెల్టోస్ ఫేస్లిఫ్ట్ ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇందులో రెండు 10.25 ఇంచెస్ డిస్ప్లేలతో డ్యూయల్ స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో ఒకటి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరొకటి టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. ఏసీ వెంట్స్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్రూఫ్, 8 ఇంచెస్ హెడ్స్-అప్ డిస్ప్లే, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, రెయిన్ సెన్సింగ్ వైపర్ వంటివి ఉన్నాయి. (ఇదీ చదవండి: హార్లే డేవిడ్సన్ బైక్ ధర ఇంత తక్కువంటే ఎవరైనా కొనేస్తారు - వివరాలు!) సేఫ్టీ ఫీచర్స్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కియా మోటార్స్ కొత్త సెల్టోస్ ఫేస్లిఫ్ట్లోఆరు ఎయిర్బ్యాగ్లను అందిస్తుంది. అంతే కాకుండా ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ వంటి 17 కంటే ఎక్కువ ADAS ఫీచర్స్ కలిగి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) పవర్ట్రెయిన్ 2023 సెల్టోస్ ఫేస్లిఫ్ట్ 115 hp పవర్ 144 Nm టార్క్ అందించే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ & 116 hp పవర్, 250 Nm టార్క్ అందించే 1.5-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ పొందుతుంది. పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVTని.. డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ iMT అండ్ 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్తో లభిస్తుంది. ఇవి కొత్త నిబంధలను అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. -
ఈ బైక్ ధర తెలిస్తే ఎగిరి గంతేస్తారు? మరీ ఇంత తక్కువా!
Harley Davidson X440: భారతీయ మార్కెట్లో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బైకులు ఎంత ఖరీదైనవో అందరికి తెలుసు. అయితే ఇప్పుడు కంపెనీ కనీవినీ ఎరుగని రీతిలో చాలా తక్కువ ధరకే ఎక్స్440 (X440) బైక్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & వేరియంట్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 మొత్తం మూడు వేరియంట్లలో విడుదలైంది. అవి 'డెనిమ్, వివిడ్, ఎస్' వేరియంట్లు. వీటి ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు, రూ. 2.49 లక్షలు, రూ.2.69 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ బైక్ ధర ఎవర్ గ్రీన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కంటే కేవలం రూ. 35,000 ఎక్కువ. డిజైన్ & ఫీచర్స్ హార్లే డేవిడ్సన్ ఎక్స్440 డిజైన్ పరంగా చాలా సింపుల్గా, స్టైలిష్గా చూడగానే ఆకర్శించే విధంగా ఉంది. బేస్ వేరియంట్ వైర్-స్పోక్ రిమ్స్, మినిమల్ బ్యాడ్జింగ్ కలిగి ఉంటుంది. మిడ్ వేరియంట్ అల్లాయ్ వీల్స్ కలిగి డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్లతో వస్తుంది. చివరగా టాప్ వేరియంట్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, మెషిన్డ్ ఇంజన్ కూలింగ్ ఫిన్స్, 3D బ్యాడ్జింగ్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీతో కలర్ TFT డాష్, నావిగేషన్ మొదలైన వాటిని పొందుతుంది. (ఇదీ చదవండి: ఆస్తులమ్మినా ఈ ఒక్క వైన్ బాటిల్ కొనలేరు.. ధర ఎన్ని కోట్లంటే?) ఇంజిన్ వివరాలు ఎక్స్440 ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 440 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి 6,000 rpm వద్ద 27 hp పవర్ & 4,000 rpm వద్ద 38 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్తో లభిస్తుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ వంటివి ఇండియన్ రోడ్లకు సరిపోయే విధంగా ఉంటాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) ప్రత్యర్థులు నిజానికి భారతీయ మార్కెట్లో హార్లే డేవిడ్సన్ ఇంత తక్కువ ధరకు ఎప్పుడు బైక్ చేయలేదు. కావున దేశీయ విఫణిలో తక్కువ ధరకు లభించే ఏకైన హార్లే డేవిడ్సన్ బైక్ ఎక్స్440 కావడం విశేషం. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకుకి ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. -
25 సంవత్సరాల చరిత్రకు నిదర్శనం ఈ బైక్ - ధర ఎంతంటే?
Suzuki Hayabusa Anniversary Edition: సుజుకి మోటార్సైకిల్ (Suzuki Motorcycle) మార్కెట్లో విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన బైక్ 'హయబుసా' (Hayabusa) అని అందరికి తెలుసు. అయితే సంస్థ ఇప్పుడు ఇందులో ఒక కొత్త ఎడిషన్ విడుదల చేయడానికి సర్వత్రా సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మార్కెట్లో 25 సంవత్సరాల నుంచి అమ్మకానికి ఉన్న హయబుసా గుర్తుగా కంపెనీ 25వ యానివెర్సరీ ఎడిషన్ విడుదల చేయడానికి తయారైంది. ఇందులో భాగంగానే హమామట్సు (Hamamatsu) ఆధారిత మార్క్యూ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఆవిష్కరించింది. సంస్థ ఈ బైక్ అమ్మకాలను ఈ నెల నుంచే ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించే అవకాశం ఉంది. దేశీయ విఫణిలో అందుబాటులోకి రానున్న కొత్త హయాబుసా స్పెషల్ ఎడిషన్ ఆరెంజ్/బ్లాక్ పెయింట్, డ్రైవ్ చైన్ అడ్జస్టర్ వంటి బిట్ల కోసం ప్రత్యేకమైన యానోడైజ్డ్ గోల్డ్ కలర్ పొందుతుంది. కంజి లోగో, ట్యాంక్ మీద త్రీ-డైమెన్షనల్ సుజుకి లోగో వంటివి చూడవచ్చు. సింగిల్ సీట్ కౌల్ ప్రామాణికంగా లభిస్తుంది. సుజుకి హయాబుసా పవర్ట్రెయిన్ & ఎలక్ట్రానిక్స్ హయబుసా స్పెషల్ ఎడిషన్ అదే లిక్విడ్ కూల్డ్ 1340సీసీ ఇన్లైన్-ఫోర్ ఇంజిన్ కలిగి 190 hp పవర్, 150 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ బై డైరెక్షనల్ క్విక్షిఫ్టర్తో లభిస్తుంది. రైడింగ్ మోడ్లు, పవర్ మోడ్లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఎలక్ట్రానిక్స్ కూడా చాలా అద్భుతమైన పనితీరుని అందిస్తాయి. (ఇదీ చదవండి: రైల్వే స్టేషన్లో ఇంత తక్కువ ధరకు రూమ్ లభిస్తుందని తెలుసా! ఎలా బుక్ చేసుకోవాలంటే?) అంచనా ధర & ప్రత్యర్థులు సుజుకి హయబుసా యానివెర్సరీ ఎడిషన్ అంతర్జాతీయ మార్కెట్లో త్వరలోనే విక్రయానికి రానుంది. భారతీయ మార్కెట్లో అధికారికంగా ఎప్పుడు విడుదలవుతుందనేది ప్రస్తుతానికి వెల్లడి కాలేదు, సాధారణ హయబుసా ధర రూ. 16.90 లక్షలు, కావున స్పెషల్ ఎడిషన్ ధర అంతకంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
500 మందికి మాత్రమే.. ఈ కారు - ధర ఎంతో తెలుసా?
Skoda Kushaq Matte Edition: చెక్ రిపబ్లిక్ కార్ తయారీ సంస్థ 'స్కోడా' (Skoda) భారతీయ మార్కెట్లో 'కుషాక్' (Kushaq) కారుని విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ తరుణంలో కంపెనీ ఇందులో ఓ కొత్త ఎడిషన్ విడుదల చేసింది. కుషాక్ కొత్త ఎడిషన్ ధర, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. ధర & వేరియంట్స్ స్కోడా ఇండియా విడుదల చేసిన కొత్త కారు పేరు 'కుషాక్ మ్యాట్ ఎడిషన్' (Kushaq Matte Edition). ధరల విషయానికి వస్తే, 1.0 టీఎస్ఐ మాన్యువల్ రూ. 16.19 లక్షలు, 1.0 టీఎస్ఐ ఆటోమేటిక్ రూ. 17.79 లక్షలు, 1.5 టీఎస్ఐ మాన్యువల్ రూ. 18.19 లక్షలు, టాప్ స్పెక్ 1.5 టీఎస్ఐ ఆటోమేటిక్ ధర రూ. 19.39 లక్షలు. ఈ కొత్త ఎడిషన్ ధర స్టాండర్డ్ కుషాక్ స్టైల్ వేరియంట్ కంటే రూ. 40,000 ఎక్కువ కావడం గమనార్హం. లిమిటెడ్ ఎడిషన్ స్కోడా కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని లైనప్లో స్టైల్ అండ్ మోంటే కార్లో వేరియంట్ల మధ్య ఉంటుంది. ఇది కేవలం 500 యూనిట్లకు మాత్రమే పరిమితమై ఉంటాయి. అంటే ఈ కొత్త కారుని కేవలం 500 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) మ్యాట్ ఎడిషన్ ప్యాకేజీలో భాగంగా, కంపెనీ కార్బన్ స్టీల్ ఎక్స్టీరియర్ పెయింట్ షేడ్ పొందుతుంది. డోర్ హ్యాండిల్స్పై గ్లోస్ బ్లాక్ ట్రిమ్, వింగ్ మిర్రర్స్, గ్రిల్పై క్రోమ్ బిట్లు చూడవచ్చు. కుషాక్ మోంటే కార్లో ఎడిషన్ విజయం పొందిన తరువాత కంపెనీ తన ఉనికిని మరింత విస్తరిస్తోంది. ఇందులో భాగంగానే మ్యాట్ ఎడిషన్ లాంచ్ చేసింది. (ఇదీ చదవండి: 750సీసీ విభాగంలో రాయల్ బండి.. ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఇంకో లెక్క!) ప్రత్యర్థులు కుషాక్ మ్యాట్ ఎడిషన్ దాని విభాగంలో ఫోక్స్వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున ఈ ఎడిషన్ ఎలాంటి అమ్మకాలను పొందుతుందనేది త్వరలోనే తెలుస్తుంది. -
750సీసీ విభాగంలో రాయల్ బండి.. ప్రత్యర్థులకు గట్టి షాక్!
Royal Enfield 750cc Bike: కుర్రకారుని ఉర్రూతలూగిస్తున్న 'రాయల్ ఎన్ఫీల్డ్' (Royal Enfield) ఇప్పటికే 350సీసీ, 650 సీసీ విభాగంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. అయితే ఇప్పుడు 750సీసీ విభాగంలో తన హవా నిరూపించుకోవడం కోసం సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఆధునిక కాలంలో వాహన వినియోగదారులు అధిక పనితీరు కలిగిన బైకులను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ 750 సీసీ విభాగంలో తన సత్తా చాటుకోవడమే కాకుండా, వినియోగదారులకు మరింత చేరువ కావడానికి దేశీయ దిగ్గజం ప్రయత్నిస్తోంది. కంపెనీ ఈ లేటెస్ట్ బైకుని 2025 నాటికి భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. కొత్త బైక్ కోడ్నేమ్ ట్విన్-సిలిండర్ ఇంటర్సెప్టర్ 650తో ఎంతోమందికి బైక్ ప్రేమికులను ఆకర్శించిన రాయల్ ఎన్ఫీల్డ్ 750సీసీ స్పేస్లోకి ప్రవేశించాలని యోచిస్తూ 'ఆర్' (R) కోడ్నేమ్తో ప్లాట్ఫామ్ అభివృద్ధి చేయనుంది. భారతదేశంలో మాత్రమే కాకుండా.. ఉత్తర అమెరికా, యూరప్, యునైటెడ్ కింగ్డమ్తో సహా వివిధ మార్కెట్లలో ప్రవేశించడానికి ఆసక్తి చూపుతోంది. ఇందులో R2G - 750cc బాబర్ మోటార్సైకిల్ అనే సంకేతనామం కలిగిన ప్రాజెక్ట్ మొదటిది. UKలోని లీసెస్టర్లోని టెక్ సెంటర్లో లీడ్ డెవలప్మెంట్ జరుగుతోంది. ఇది దశాబ్దాలుగా రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోలో అతిపెద్ద మోటార్సైకిల్గా అవతరించే అవకాశం ఉంది. (ఇదీ చదవండి: విడుదలకు ముందే అంచనాలు దాటేస్తున్న హోండా ఎలివేట్ - బుకింగ్స్) నిజానికి రాబోయే 750 సీసీ బైక్ ఇప్పటికే మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తున్న ట్విన్-సిలిండర్ 650 సీసీ ఇంజన్ పునరావృతం. అయితే ఇప్పుడు ఈ ఇంజిన్తో ఏ బైక్ వస్తుంది, దాని వివరాలు ఏమిటి అనే మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కానీ బహుశా 750 సీసీ విభాగంలో విడుదలయ్యే రాయల్ ఎన్ఫీల్డ్ 'బాబర్' అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న ఎలివేట్ - బుకింగ్స్ ఎప్పుడంటే?
Honda Elevate Bookings: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'హోండా ఇండియా' (Honda India) త్వరలోనే 'ఎలివేట్' (Elevate) ఎస్యువిని విడుదల చేయడానికి సిద్ధమైంది. కాగా ఇప్పుడు బుకింగ్స్ గురించి అధికారిక సమాచారం వెల్లడించింది. బుకింగ్స్ & లాంచ్ టైమ్ నివేదికల ప్రకారం, హోండా ఎలివేట్ బుకింగ్స్ 2023 జులై 03 నుంచి ప్రారంభమవుతాయి. రూ. 21,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ మిడ్ సైజ్ ఎస్యువి ధరలు ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే అప్పటికి ఈ కారు భారతీయ మార్కెట్లో అధికారికంగా విడుదలవుతుంది. అంతే కాకుండా ఈ నెల చివరి నాటికి డిస్ప్లే, ఆగష్టు చివరి నాటికి టెస్ట్ డ్రైవ్లు ప్రారంభమవుతాయి. వేరియంట్స్ & ఇంజిన్ డీటైల్స్ హోండా ఎలివేట్ నాలుగు ట్రిమ్లలో విడుదలయ్యే అవకాశం ఉందని డీలర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఖచ్చితమైన వివరాలు లాంచ్ నాటికి తెలుస్తాయి. ఎలివేట్ ఎస్యువి 1.5-లీటర్, ఫోర్ సిలిండర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి 121 హార్స్ పవర్, 145 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ సివిటీ గేర్బాక్స్ పొందనుంది. పవర్ట్రెయిన్ మాత్రం హోండా సిస్టయి మాదిరిగా ఉంటుందని భావిస్తున్నారు. డిజైన్ & ఫీచర్స్ డిజైన్ అండ్ ఫీచర్స్ విషయానికి వస్తే.. విశాలమైన ఫ్రంట్ గ్రిల్, మధ్యలో బ్రాండ్ లోగో, హెడ్ లైట్, ఫాగ్ లైట్స్, వంటివి ఇందులో గమనించవచ్చు. ఈ ఎస్యువి 4312 మిమీ పొడవు, 1790 మిమీ వెడల్పు, 1650 మిమీ ఎత్తు, 2650 మిమీ వీల్బేస్ కలిగి.. 220 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. కావున పరిమాణం పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది. (ఇదీ చదవండి: కనుమరుగవుతున్న 44 ఏళ్ల చరిత్ర.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో హెచ్డీఎఫ్సీ విలీనం!) హోండా ఎలివేట్ సాఫ్ట్ టచ్ ప్యానెల్స్, విశాలమైన సీటింగ్తో క్యాబిన్ చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ టచ్స్క్రీన్, 7 ఇంచెస్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, లేన్-వాచ్ కెమెరా, వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో/యాపిల్ కార్ప్లే, కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్తో కూడిన ADAS వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఇది సింగిల్-పేన్ సన్రూఫ్ను మాత్రమే పొందుతుంది. (ఇదీ చదవండి: ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్స్ - వివో వై36 నుంచి వన్ప్లస్ నార్డ్ వరకు..) ప్రత్యర్థులు కొత్త హోండా ఎలివేట్ దేశీయ మార్కెట్లో విడుదలైన తరువాత హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, ఫోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదలైన కార్లకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు ధరలు అధికారికంగా వెల్లడి కాలేదు, కానీ ఇది రూ. 12 లక్షల ధర వద్ద విడుదలయ్యే వెల్లడయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లు..అప్పుడు కొనలేకపోయారా? ఇప్పుడే కొనేయండి!
Best Smartphones In June 2023: ఎట్టకేలకు 2023 జూన్ నెల ముగిసింది. ఈ నెలలో అనేక కొత్త బైకులు, కార్లు మాత్రమే కాకుండా లెక్కకు మించిన స్మార్ట్ఫోన్స్ కూడా విడుదలయ్యాయి. ఇందులో ఖరీదైన మొబైల్స్ ఉన్నాయి, సరసమైన మొబైల్స్ కూడా ఉన్నాయి. దేశీయ మార్కెట్లో రూ. 20 వేలు లోపు ధరతో విడుదలైన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. వివో వై36 (Vivo Y36) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మొబైల్ బ్రాండ్లలో ఒకటి వివో. ఈ నెలలో కంపెనీ 'వై36' స్మార్ట్ఫోన్ లాంచ్ చేసింది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజితో వస్తుంది. దీని ధర రూ. 16,999. మీటియో బ్లాక్, వైబ్రంట్ గోల్డ్ కలర్ ఆప్షన్స్లో లభించే ఈ మొబైల్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 680 ఎస్ఓసీ చిప్ సెట్ కలిగి 6.68 ఇంచెస్ LCD డిస్ప్లే పొందుతుంది. ఫీచర్స్ అండ్ కెమెరా సెటప్ పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. రెడ్మీ నోట్ 12 (Redmi Note 12) ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న స్మార్ట్ఫోన్లలో రెడ్మీ బ్రాండ్ ఒకటి. ఈ సంస్థ నోట్ 12 లాంచ్ చేసింది. దీని ధర రూ. 16,999. ఇది స్నాప్డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్ కలిగి 1200 నిట్స్ బ్రైట్నెస్తో ఫుల్ HD డిస్ప్లే పొందుతుంది. ఇందులో 48 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ఉన్నాయి. ఇది 5000 mAh బ్యాటరీ కలిగి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ జెడ్7 (iQOO Z7) ఈ నెలలో విడుదలైన సరసమైన మొబైల్ ఫోన్లలో ఒకటి ఐక్యూ జెడ్7. దీని ధర రూ. 18,999. గేమింగ్ అండ్ మల్టి టాస్కింగ్ వంటి వాటికి ఇది బెస్ట్ ఫోన్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 90 Hz అమొలెడ్ డిస్ప్లే, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ, 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా పొందుతుంది. ఇందులోని 5000 mAh బ్యాటరీ 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. మోటో జీ73 (Moto G73) మోటో కంపెనీకి చెందిన జీ73 కూడా ఈ నెలలో విడుదలైన బెస్ట్ స్మార్ట్ఫోన్. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ కలిగిన ఈ మొబైల్ ఫోన్ ధర రూ. 18,999. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్ 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేటుతో 6.5 ఇంచెస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా దాని ప్రత్యర్థులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ (OnePlus Nord CE 3 Lite 5G) రూ. 19,999 వద్ద లభించే 'వన్ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ' కూడా ఈ నెలలోనే విడుదలైంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695జీ 5జీ ప్రాసెసర్ కలిగి 120 Hz రిఫ్రెష్ రేట్తో 6.7 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ 5000 mAh బ్యాటరీ కలిగి 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్, ఫీచర్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వంద కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
48 గంటల ముందు ప్రచారం నిలిపివేత
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
●తీరనున్న తాగునీటి సమస్య
పోలింగ్ స్టేషన్లను పరిశీలించిన జేసీ
పుష్పగిరిలో కనుల పండువగా కల్యాణోత్సవాలు
కోపంగా ఉంటే.. ఇక్కడికొచ్చి కేకలేయండి చాలు!
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పక్కాగా ఉండాలి
ప్రచారం.. పరిసమాప్తం!
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- AP: వ్యవసాయం పండగ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement