-
అక్టోబర్లో భారీగా ఉపాధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్లో భారీగా ఉపాధి కల్పన నమోదైంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) నిర్వహిస్తున్న ఈపీఎఫ్ పథకంలో 15.29 లక్షల మంది సభ్యులుగా చేరారు. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 18.2 శాతం మందికి అదనంగా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ నెలకు సంబంధించి పేరోల్ గణాంకాలను కేంద్ర కారి్మక శాఖ బుధవారం విడుదల చేసింది. 7.72 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా చేరినట్టు తెలుస్తోంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు ఇందులో 6 శాతం వృద్ధి నమోదైంది. నికర సభ్యుల చేరిక 15.29 లక్షలుగా ఉంది. కొత్తగా చేరిన వారిలో 58.60 శాతం మంది 18–25 ఏళ్ల వయసులోని వారు. అంటే సంఘటిత రంగంలో వీరంతా మొదటిసారి ఉపాధి పొందిన వారని తెలుస్తోంది. ఇక 11.10 లక్షల మంది ఒక సంస్థలో మానేసి మరో సంస్థలో చేరారు. వీరు ఆన్లైన్లో తమ ఈపీఎఫ్లను బదిలీ చేసుకున్నారు. ఈపీఎఫ్వో నుంచి వైదొలగిన సభ్యుల సంఖ్య గడిచిన 12 నెలల్లోనే తక్కువగా ఉంది. మహిళా సభ్యులు 3 లక్షలు: 7.72 లక్షల కొత్త సభ్యుల్లో 2.04 లక్షల మంది మహిళలు ఉన్నారు. అక్టోబర్ నెలకు నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.03 లక్షలుగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలో పోల్చి చూస్తే 15 శాతం వృద్ధి కనిపించింది. రాష్ట్రాల వారీగా చూస్తే అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 22 శాతం మంది సభ్యులు చేరారు. హోటళ్లు, టీ విక్రయ కేంద్రాలు, ట్రేడింగ్, షాపులు, కెమికల్స్ కంపెనీలు, జీవత బీమా సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఆటో పరిశ్రమకు టూవీలర్ల బ్రేక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అక్టోబర్లో రిటైల్లో అన్ని వాహన విభాగాల్లో 21,17,596 యూనిట్లు అమ్ముడయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 7.73 శాతం తగ్గుదల. 2022 అక్టోబర్తో పోలిస్తే గత నెలలో ద్విచక్ర వాహన విక్రయాలు ఏకంగా 12.6 శాతం క్షీణించడమే ఈ పరిస్థితికి కారణం. 2023 అక్టోబర్లో టూవీలర్లు దేశవ్యాప్తంగా 15,07,756 యూనిట్లు రోడ్డెక్కాయి. అక్టోబర్ 14 వరకు మంచి రోజులు లేకపోవడంతో ద్విచక్ర వాహన కొనుగోళ్లపై ప్రభావం చూపిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వెహికిల్స్ విక్రయాలు 1.35 శాతం తగ్గి గత నెలలో 3,53,990 యూనిట్లకు వచ్చి చేరింది. త్రిచక్ర వాహనాలు ఏకంగా 45.63 శాతం దూసుకెళ్లి 1,04,711 యూనిట్లను తాకాయి. ట్రాక్టర్లు 6.15 శాతం పెరిగి 62,440 యూనిట్లు రోడ్డెక్కాయి. వాణిజ్య వాహనాలు 10.26 శాతం ఎగసి 88,699 యూనిట్లను చేరుకున్నాయి. అన్ని వాహన విభాగాల్లో అక్టోబర్ తొలి అర్ధ భాగంలో 2022తో పోలిస్తే అమ్మకాలు 8 శాతం తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే గత నెలలో విక్రయాలు 13 శాతం పెరగడం విశేషం. నవరాత్రి కొత్త రికార్డు.. 2023 నవరాత్రి రిటైల్ అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 18 శాతం వృద్ధితో కొత్త మైలురాయిని చేరుకున్నాయని ఫెడరేషన్ తెలిపింది. 2017 నవరాత్రి గణాంకాలను అధిగమించాయని వెల్లడించింది. 8 శాతం క్షీణతను చూసిన ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాలు మెరుగైన వృద్ధిని కనబరిచాయి. టూ వీలర్లు 22 శాతం, త్రిచక్ర వాహనాలు 43, వాణిజ్య వాహనాలు 9, ప్యాసింజర్ వెహికిల్స్ 7 శాతం అధిక అమ్మకాలు సాధించాయి. ప్యాసింజర్ వాహనాల విభాగంలో కస్టమర్లు ఒక వైపు ఉత్సాహం, మరోవైపు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టమైంది. నవరాత్రి సమయంలో ప్రాంతీయ వైవిధ్యం ఉన్నప్పటికీ.. ప్యాసింజర్ వెహికిల్స్ విభాగంలో పరిశ్రమ బుకింగ్లలో పెరుగుదలను చూసింది. కొత్త మోడళ్ల పరిచయం, ముఖ్యంగా ఎస్యూవీల రాక, ఆకర్షణీయ ఆఫర్లు ఇందుకు దోహదం చేశాయని ఎఫ్ఏడీఏ తెలిపింది. విభిన్న పరిస్థితులు.. స్థానిక ఎన్నికల ప్రభావం, మార్కెట్ పరిపూర్ణత వల్ల పండుగ స్ఫూర్తి అన్ని ప్రాంతాల అమ్మకాల్లో ఒకే విధంగా లేదని ఫెడరేషన్ వివరించింది. ఊహించిన సులభ వాయిదా పథకాలతో కమర్షియల్ వెహికిల్ విభాగం బలమైన నవంబర్ను చూస్తోంది. పండుగ, నిర్మాణ కార్యకలాపాలు డిమాండ్ని పెంచుతున్నాయని ఎఫ్ఏడీఏ అభిప్రాయపడింది. ‘పండుగ రోజులు ప్యాసింజర్ వెహికిల్స్ బుకింగ్లను పెంచవచ్చు. అయినప్పటికీ తక్షణ అమ్మకాలపై సంవత్సరాంతపు తగ్గింపుల ఛాయ కనిపిస్తోంది. ప్యాసింజర్ వెహికిల్స్ నిల్వలు 63–66 రోజుల శ్రేణిలో ఉన్నాయి. దీపావళి అమ్మకాలు సందర్భానుసారంగా పెరగకపోతే నిల్వలు మరింత భారానికి దారితీయవచ్చు. ఇది పరిశ్రమ–వ్యాప్త పరిణామాలకు దారితీయవచ్చు. పొంచి ఉన్న ఆర్థిక భారం ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి తక్షణ, నిర్ణయాత్మక చర్య తప్పనిసరి’ అని ఫెడరేషన్ పేర్కొంది. -
మళ్లీ ‘ప్లస్’లోకి.. ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ వస్తు ఎగుమతులు అక్టోబర్లో (2022 ఇదే నెలతో పోల్చి) 6.21 శాతం పెరిగాయి. విలువలో 33.57 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెపె్టంబర్లో 2.6 శాతం క్షీణించాయి. తాజా సమీక్షా నెల అక్టోబర్లో మళ్లీ సానుకూల ఫలితం వెలువడింది. 2023లో ప్రపంచ వాణిజ్యవృద్ధి కేవలం 0.8 శాతంగా ఉంటుందన్న ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిరాశాపూరిత వాతావరణం, భారత్ విషయంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. వాణిజ్యలోటు 31.46 బిలియన్ డాలర్లు ఇక దేశ వస్తు దిగుమతుల విలువ ఎగువబాట పట్టింది. 2022 డిసెంబర్ నుంచి 2023 సెపె్టంబర్ వరకూ వరుసగా 10 నెలల క్షీణతలో ఉన్న దిగుమతుల విలువ అక్టోబర్లో 12.3 శాతం పెరిగి 65.03 బిలియన్ డాలర్లకు చేరింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు సమీక్షా నెల్లో 31.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇది కొత్త రికార్డు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► అక్టోబర్లో పసిడి దిగుమతులు 95.5 శాతం పెరిగి 7.23 బిలియన్ డాలర్లకు చేరాయి. ► చమురు దిగుమతుల బిల్లు 8 శాతం ఎగసి 17.66 బిలియన్ డాలర్లుగా ఉంది. ► మొత్తం 30 కీలక రంగాల్లో 22 రంగాల్లో ఎగుమతులు సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. వీటిలో ముడి ఇనుము, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ ఉత్పత్తులు, ఫార్మా, ఎల్రక్టానిక్ గూడ్స్, కార్పెట్, ప్లాస్టిక్, మెరైన్, ఇంజనీరింగ్ గూడ్స్ ఉన్నాయి. ఏప్రిల్–అక్టోబర్ మధ్య క్షీణ గణాంకాలే.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 7% క్షీణించి 244.89 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.95% క్షీణించి 391.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి వాణిజ్యలోటు ఈ 7 నెలల్లో 147.07 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక ఈ కాలంలో పసిడి దిగుమతులు 23% పెరిగి 29.5 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ దిగుమతుల బిల్లు మాత్రం 18.72% తగ్గి 100 బిలియన్ డాలర్లకు చేరింది. -
రిటైల్ ధరల ఉపశమనం
న్యూఢిల్లీ: రెండు నెలల నుంచి దిగివస్తున్న వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా మూడవనెల అక్టోబర్లోనూ మరింత తగ్గింది. తాజా సమీక్షా నెల్లో 4.87 శాతంగా (2022 అక్టోబర్ నెలతో పోల్చి) నమోదయ్యింది. అంతక్రితం నాలుగు నెలల్లో (జూన్లో 4.81 శాతం) ఇంత తక్కువ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 ప్లస్ లేదా మైనస్తో 4 శాతం వద్ద (మినహాయింపులకు లోబడి ఎగవముఖంగా 6 శాతం) ఉండాలన్నది సెంట్రల్ బ్యాంక్కు కేంద్రం నిర్దేశం. సెపె్టంబర్, అక్టోబర్లలో ఆర్బీఐకి నిర్దేశిత పరిధిలో రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ, తమ లక్ష్యం 4 శాతమేనని గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. 2022–2023 ఆర్థిక సంవత్సరంలో సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంకాగా, 2023–24లో రేటు 5.4 శాతానికి తగ్గుతుందన్నది ఆర్బీఐ అంచనా. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో ఆల్టైం రికార్డ్!
ముంబై: పండుగ సీజన్ డిమాండ్ కలిసిరావడంతో దేశీయ ఆటో పరిశ్రమ అక్టోబర్లో రికార్డు స్థాయిలో అత్యధిక వాహనాలు అమ్ముడయ్యాయి. మొత్తం 3,91,472 యూనిట్ల విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన 3,36,679 వాహనాలతో పోలిస్తే ఇవి 16% అధికం. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, దసరా సందర్భంగా నెలకొన్న కొనుగోళ్లు గత నెలలో రికార్డు అమ్మకాల వృద్ధికి తోడ్పడ్డాయని మారుతీ సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ ఏడాది తొలి 3 నెలలు మినహా ప్రతి నెలా అమ్మకాల వృద్ధి జరగడం పరిశ్రమకు సానుకూల సంకేతమన్నారు. క్షేత్ర స్థాయిలో డీలర్ల వద్ద నిల్వల స్థాయి ఇంకా అధికంగా ఉంది. ఈ నవంబర్ తొలి 15 రోజుల్లో రిటైల్ అమ్మకాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో హోల్సేల్ అమ్మకాలు జరగొచ్చన్నారు. -
కలిసొచ్చిన పండుగ సీజన్.. అమ్మకాల్లో కొత్త మైలురాయి చేరుకున్న ఫ్లిప్కార్ట్
Flipkart The Big Billion Days: భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటివి వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్స్ ప్రకటించాయి. అయితే ఈ పండుగ సీజన్ ఫ్లిప్కార్ట్కు (Flipkart) ఎలా కలిసొచ్చింది, ఎలాంటి లాభాలు వచ్చాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 ఫ్లిప్కార్ట్ యాన్యువల్ ఫ్లాగ్షిప్ ఈవెంట్ 'ది బిగ్ బిలియన్ డేస్' (TBBD) అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పటికే మిలియన్ల మంది కస్టమర్ల నుంచి గొప్ప రెస్పాన్స్ పొందింది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 10వ ఎడిషన్ కేవలం 7 రోజుల్లో 1.4 బిలియన్ కస్టమర్ సందర్శనలను సాధించింది. ఈ ఏడాది ఫ్లిప్కార్ట్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు & గృహోపకరణాల (Home Appliances) వంటి వాటిని కొనుగోలు చేసుకోవడానికి వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపినట్లు సమాచారం. థర్డ్ పార్టీ పార్టనర్లు, బ్యాంకుల సహకారంతో కొనుగోలుదారులందరికీ సంస్థ మంచి సువర్ణావకాశం అందించింది. మునుపటి కంటే ఎక్కువ అండమాన్, హయులియాంగ్ (అరుణాచల్ ప్రదేశ్), చోగ్లాంసర్ (లడఖ్), కచ్ (గుజరాత్) & లోంగేవాలా (రాజస్థాన్) ప్రాంతాలకు కూడా ఫ్లిప్కార్ట్ తన సేవలను విజయవంతంగా అందించింది. మునుపటి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కంటే కూడా ఈ ఏడాది కనీవినీ ఎరుగని రెస్పాన్స్ పొందినట్లు తెలుస్తోంది. కేవలం మొదటి నాలుగు రోజుల్లోనే 4 మిలియన్లకు పైగా ప్యాకేజీలను డెలివరీ చేయడం గమనార్హం. అమ్మకాల పరంగా గొప్ప వృద్ధిని సాధించిన ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మార్కెట్లో కొత్త శిఖరాలను అధిరోహించింది. హోమ్, ఫర్నిషింగ్ అండ్ లైఫ్స్టైల్ విభాగాల్లో ఏకంగా 3.5 లక్షల ఉత్పత్తులను అందిస్తోంది. పండుగకు ముందు కాలంతో పోలిస్తే ప్రస్తుతం అమ్మకాలు ఆరు రెట్లు ఎక్కువయ్యాయిన కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను.. బిగ్ బిలియన్ డేస్ 2023 సమయంలో సంస్థ అనేక రకాల ఉత్పత్తులను సరసమైన ధరలతో అందుబాటులోకి తెచ్చింది. ఇన్స్టంట్ సేవింగ్స్, అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ ఆఫర్ల ద్వారా కూడా అమ్మకాలు పరిగాయి. అంతే కాకుండా ఫ్లిప్కార్ట్ పే లేటర్ ద్వారా 4 రెట్లు, ప్రీ-ఫెస్టివ్ పీరియడ్తో పోలిస్తే ఈఎమ్ఐ ద్వారా 7 రెట్లు కొనుగోళ్లు పెరిగాయి. 60 శాతం మెంబర్షిప్ ఫ్లిప్కార్ట్ వీడియో కామర్స్ ఆఫర్ ఇప్పటి వరకు ఏకంగా 8 లక్షల గంటల వీక్షణను పొందినట్లు సమాచారం. ఇది గత TBBDతో పోల్చితే 16 రెట్లు ఎక్కువ. మెంబర్షిప్లలో కూడా 60 శాతం పెరుగుల రావడం గమనార్హం. అంతే కాకుండా ఈ పండుగ సీజన్లో భారతీయులు అంతర్జాతీయంగా దుబాయ్, బ్యాంకాక్, సింగపూర్, కొలంబో, ఫుకెట్లకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్లు తెలిసింది. భారతదేశంలో అయితే గోవా, కొచ్చి, జైపూర్ వంటివి ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఇదీ చదవండి: 16 ఏళ్ల అమ్మాయి.. చదువుకునే వయసులో బిజినెస్.. రూ.100 కోట్ల సామ్రాజ్యం! ది బిగ్ బిలియన్ డేస్ 10 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భమగా ఫ్లిప్కార్ట్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ 'కళ్యాణ్ కృష్ణమూర్తి' (Kalyan Krishnamurthy) మాట్లాడుతూ.. ఈ ఏడాది TBBD ఊహకందని ఆదరణ పొంది, అమ్మకాల్లో ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు తెలిపాడు. వినియోగదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, ఆన్ టైమ్ డెలివరీ చేయడానికి ఏకంగా ఒక లక్ష ఉద్యోగులను నియమించుకున్నట్లు వెల్లడించాడు. రానున్న రోజుల్లో సంస్థ మరిన్ని విజయాలు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
15 లేదా 16వ తేదీన బీజేపీ ఫస్ట్ లిస్ట్
సాక్షి , హైదరాబాద్: ఈ నెల 15 లేదా 16వ తేదీన 38 మంది అభ్యర్థులతో బీజేపీ తొలిజాబితాను ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ నెల 14న అమావాస్య కావడంతో పాటు పితృపక్షం ఉండటంతో, అవి ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ను విడుదల చేయాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శని వారం దిల్కుశ అతిథిగృహంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యనేతల భేటీలో 38 స్థానాలు, అభ్యర్థులపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఈ భేటీలో 21 స్థానాల్లో అభ్యర్థుల పేర్లపై స్పష్టత రాగా, త్వరలోనే మిగతా 17 సీట్లు, అభ్యర్థులపైనా కసరత్తు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి ప్రకాశ్ జవదేకర్, సహ ఇన్చార్జి సునీల్ బన్సల్, రాష్ట్ర ముఖ్యనేతలు డా.కె.లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతల నుంచి ఆయా స్థానాలకు వారు ప్రతిపాదించే పేర్లతో జాబితాలు తీసుకుని, ఇతర జాబితాలతో వాటిని సరిపోల్చి కామన్గా ఉన్న పేర్లపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకు గాను మూడు విడతల్లో అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారని ముఖ్యనేతల సమాచారం. లోక్సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రపార్టీకి చెందిన ముఖ్యనేతలతో కూడా ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేయించాలనే ఆలోచనతో జాతీయ, రాష్ట్ర నాయకత్వాలున్నాయని చెపుతున్నారు. అయితే కొందరు నేతలు కేవలం లోక్సభకు పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్టుగా ఇటీవల పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఇక్కడకు వచ్చిన సందర్భంగా ఆయనకు తెలియజేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు పోటీచేసే స్థానాల్లోనూ బీజేపీ నుంచి పేరున్న ముఖ్యనేతలను బరిలోకి దించాలనే ఆలోచనతోనూ నాయకత్వమున్నట్టు సమాచారం. దీనికి తగ్గట్టుగా ఆయా స్ధానాల నుంచి ఎవరెవరిని పోటీకి నిలిపితే మంచిదనే దానిపైనా రాష్ట్రపార్టీ కసరత్తు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పార్టీనేతల పేర్లు ఇప్పుడే బయటపెట్టకుండా కొంతకాలం పాటు వేచి చూసే ధోరణిని అవలంబించాలనే ఆలోచనతో ముఖ్యనేతలున్నట్టు తెలుస్తోంది. -
మళ్ళీ అదే రెపో రేటు.. ఆర్బీఐ కీలక నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ రెండు రోజుల సమీక్ష తర్వాత 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాల్గవ ద్రవ్య విధాన నిర్ణయాన్ని ఈ రోజు వెల్లడించారు. ఇందులో భాగంగానే కీలకమైన రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఆర్బీఐ ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) అక్టోబర్ 4 నుంచి 6 వరకు సమావేశమైన తర్వాత దాస్ ప్రకటన వెలువడింది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా కొనసాగించడం ఇది నాలుగోసారి. అయితే జూలైలో టొమాటో, ఇతర కూరగాయల ధరల కారణంగా ప్రధాన ద్రవ్యోల్బణం పెరిగింది. https://t.co/bjo3MjAYqs — ReserveBankOfIndia (@RBI) October 6, 2023 -
అక్టోబర్లో భారీగా బ్యాంక్ సెలవులు
రానున్న అక్టోబర్ నెలలో బ్యాంకులకు అత్యధికంగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల క్యాలెండర్ ప్రకారం అక్టోబర్లో 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. (RBI Penalty: బ్యాంకులకు షాకిచ్చిన ఆర్బీఐ.. భారీగా జరిమానా) అక్టోబర్ సెలవుల జాబితాలో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు 7 ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం.. పండుగ లేదా గెజిట్ హాలిడేస్ 11 ఉన్నాయి. వీటిలో కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. మరికొన్ని రాష్ట్రానికి రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు. (గడువు ముగియనున్న ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం పాలసీ) అక్టోబర్ నెల ప్రారంభంలోనే మొదటి రెండు రోజులు వరుసుగా సెలవులు ఉన్నాయి. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం కాగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. అక్టోబర్ 24న దసరా కారణంగా హైదరాబాద్, ఇంఫాల్ మినహా చాలా బ్యాంకులు మూతపడనున్నాయి. అక్టోబర్ సెలవుల జాబితా ఇది.. అక్టోబర్ 1: ఆదివారం అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ 8: ఆదివారం అక్టోబర్ 14: రెండవ శనివారం అక్టోబర్ 14: మహాలయ (కోల్కతా) అక్టోబర్ 15: ఆదివారం అక్టోబర్ 18: కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్కతా) అక్టోబర్ 21: దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్జాతా) అక్టోబర్ 22: ఆదివారం అక్టోబర్ 23: దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం). అక్టోబర్ 24: దసరా/దుర్గాపూజ (హైదరాబాద్ మరియు ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా) అక్టోబర్ 25: దుర్గాపూజ (గ్యాంగ్టక్) అక్టోబర్ 26: దుర్గాపూజ (గ్యాంగ్టక్, జమ్ము, శ్రీనగర్) అక్టోబర్ 27: దుర్గాపూజ (గ్యాంగ్టక్) అక్టోబర్ 28: లక్ష్మీ పూజ (కోల్కతా) అక్టోబర్ 28: నాల్గవ శనివారం అక్టోబర్ 29: ఆదివారం అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్) -
అక్టోబర్ నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఎందుకంటే!
ఆధునిక కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ యాప్ ఆధునిక అవసరాలను అనుకూలంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత కల్పిస్తూ.. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో బహుశా కొన్ని పాత మొబైల్స్లో వాట్సాప్ యాప్ పనిచేయక పోవచ్చు. ఈ కథనంలో ఏ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. 2023 అక్టోబర్ 24 తరువాత ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1, అంతకంటే అంతకు ముందు వెర్షన్లతో కూడిన ఫోన్లలో వాట్సాప్ పనిచేయదని కంపెనీ తెలిపింది. ఈ జాబితాలో ఏకంగా 20 కంటే ఎక్కువ స్మార్ట్ఫోన్లు ఉండటం గమనార్హం. సోనీ ఎక్స్పీరియా జెడ్ ఎల్జీ ఆప్టిమస్ జీ ప్రో శాంసంగ్ గ్యాలక్సీ ఎస్2 శాంసంగ్ గ్యాలక్సీ నెక్సస్ హెచ్టీసీ సెన్సేషన్ మోటోరోలా డ్రోయిడ్ రేజర్ (Motorola Droid Razr) సోనీ ఎక్స్పీరియా ఎస్2 మోటోరోలా జూమ్ శాంసంగ్ గ్యాలక్సీ టాబ్ 10.1 ఆసుస్ ఈ ప్యాడ్ ట్రాన్స్ఫార్మర్ (Asus Eee Pad Transformer) ఏసర్ ఐకానియా ట్యాబ్ ఏ5003 శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ హెచ్టీసీ డిజైర్ హెచ్డీ ఎల్జీ ఆప్టిమస్ 2ఎక్స్ సోనీ ఎరిక్సన్ ఎక్స్పీరియా Arc3 నెక్సస్ 7 (ఆండ్రాయిడ్ 4.2కి అప్గ్రేడబుల్) శాంసంగ్ గ్యాలక్సీ నోట్ 2 హెచ్టీసీ వన్ ఇదీ చదవండి: వందే భారత్లో 6 నెలలు అవన్నీ బ్యాన్.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం! ఈ జాబితాలోని మొబైల్స్ అన్నీ దాదాపు పాత మోడల్స్. కావున ఇవి చాలా తక్కువమంది వద్ద మాత్రమే ఉండొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగిస్తున్న వారు దీన్ని అప్డేట్ చేసుకోవాలి, లేకుంటే వాట్సాప్ ఆపరేటింగ్ సిస్టం ఆగిపోతుంది. మీ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ చెక్ చేయడం ఎలా? మీ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ OS వెర్షన్ 4.1 లేదా అంతకంటే పాత మొబైల్ అవునా కాదా అని చెక్ చేయాలంటే మీ మొబైల్లో సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి, అబౌట్ ఫోన్ (About Phone) క్లిక్ చేసి అందులో సాఫ్ట్వేర్ వివరాలు చూడవచ్చు. దీన్ని బట్టి మీ మొబైల్ వాట్సాప్ వినియోగానికి ఉపయోగపడుతుందా.. లేదా అనేది తెలిసిపోతుంది. -
పనులు.. నిధులు.. పథకాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ పదో తేదీలోపు వెలువడుతుందనే సంకేతాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రగతిభవన్, సచివాలయానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటుండడంతో.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావును కలుస్తూ వినతి పత్రాలు అందిస్తున్నారు. తమ నియోజకవర్గాలకు అభివృద్ధి పనులు మంజూరు చేయాలని, వివిధ పనులకు సంబంధించిన పెండింగు బిల్లులు ఇప్పించాలని కోరుతున్నారు. నిధుల అడ్డంకి ఉంటే తాము ప్రతిపాదించిన పనులకు కనీసం పాలనా పరమైన అనుమతులు అయినా ఇప్పించాలని విన్నవిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు సుమారు పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నందున తమ వినతులను సత్వరం పరిష్కరించాలంటూ లేఖలు సమర్పిస్తున్నారు. కేటీఆర్ సంతకాలతో కూడిన సిఫారసు లేఖలను తీసుకుని సచివాలయంలోని సంబంధిత శాఖల ఉన్నతాధి కారులు, జిల్లా అధికారుల వద్దకు పరుగులు పెడుతున్నారు. పనులు.. పోస్టింగులు ఎమ్మెల్యేల వినతుల్లో పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన పనులే ఎక్కువగా ఉంటున్నట్లు తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్జీలు తమ వద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్నందున వాటికి పరిష్కారం చూపాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న రెవెన్యూ, పోలీసు అధికారు లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. అయితే వీరిలో తమకు అనుకూలురైన పోలీసు, రెవెన్యూ అధికారుల పోస్టింగుల కోసం కొందరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికే పోస్టింగులు పూర్తయిన కొన్నిచోట్ల మార్పులకు ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే తక్షణం నిధుల విడుదలకు సంబంధం లేని పనులకు ఓకే చెప్తూ, ఇతర అంశాలను పరిశీలిస్తామని మాత్రమే కేటీఆర్ స్పష్టం చేస్తున్నట్లు తెలిసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు ఎన్నికలు సమీపిస్తుండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపై ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. వీటితో పాటు తుది దశలో ఉన్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు రావాల్సిందిగా సంబంధిత శాఖల మంత్రులను ఎమ్మెల్యేలు ఆహ్వానిస్తు న్నారు. ఇదిలా ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పెద్దపీట వేస్తూ నెల రోజుల క్రితం ఆగస్టు 21న సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది రెండేసి పర్యాయాలకు పైగా వరుస విజయాలు సాధించిన వారే ఉండటంతో వివిధ పథకాల ద్వారా లబ్ధి ఆశిస్తున్న వారి నుంచి వీరు ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. తమపై ఉన్న ప్రతికూలతను తొలగించుకునేందుకు, వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చే పనులపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బీసీబంధు, గృహలక్ష్మి ఒత్తిడి.. ఎన్నికల నేపథ్యంలో తమ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు.. తమకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలనే ఒత్తిడి ఎక్కువగా ఎదురవు తున్నట్లు సమాచారం. బీసీబంధు పథకం కింద రూ.లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి చెక్కులు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మూడు నెలల పాటు చెక్కుల పంపిణీ కొనసాగుతుందని ప్రకటించగా, ప్రస్తుతం లబ్ధిదారులకు తొలి విడత చెక్కుల పంపిణీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మిగతా రెండు విడ తలకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. మరో వైపు గృహలక్ష్మి పథకం లబ్ధిదారుల వడపోత కార్యక్రమం జరుగుతోంది. దీంతో ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు లబ్ధిదారుల జాబితా పై స్పష్టత వచ్చేలా ఎమ్మెల్యేలు ఒత్తిడి చేస్తు న్నారు. మరోవైపు సామాజిక పింఛన్ల కోసం కూడా ఎమ్మెల్యేలకు ఎక్కువ సంఖ్యలో దరఖా స్తులు అందుతున్నాయి. -
అక్టోబరులో 800
శ్రీలంకన్ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘800’. మురళీధరన్ పాత్రలో ‘స్లమ్డాగ్ మిలియనీర్’ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించగా, ఆయన భార్య మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ కనిపిస్తారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వివేక్ రంగాచారి ఈ బయోపిక్ను నిర్మించారు. ఈ సినిమా దేశవ్యాప్త థియేట్రికల్ రిలీజ్ హక్కులను నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సొంతం చేసుకున్నారు.ఈ సినిమాను అక్టోబరు 6న విడుదల చేస్తున్నట్లుగా గురువారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ– ‘‘తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ‘800’ సినిమాను వచ్చే నెల 6న విడుదల చేస్తున్నాం. ముత్తయ్య మురళీధరన్ జీవితంలోని క్రికెట్ అంశాలను గురించి మాత్రమే కాదు.. ఆయన బాల్యంలో జరిగిన ఘటనలను కూడా ఈ చిత్రంలో చూపిస్తాం. కేవలం క్రికెట్ ప్రేమికులనే కాదు.. ప్రేక్షకులందరినీ ఆకట్టుకునే భావోద్వేగాలు ఈ సినిమాలో ఉన్నాయి’’ అన్నారు. ‘‘ఈ సినిమా పట్ల శ్రీపతి అంకితభావం, పట్టుదల చూసి ఈ సినిమాకు ఓకే చెప్పాను. ప్రజలంతా ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు ముత్తయ్య మురళీధరన్. ఈ చిత్రానికి సంగీతం: జీబ్రాన్. -
ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం..
ఢిల్లీ: ఇండియా కూటమి సమన్వయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్లోని భోపాల్లో మొదటి బహిరంగ సభను నిర్వహించాలని ప్రకటించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది. నేడు ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమైంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని పేర్కొంది. లోక్ సభ సీటు షేరింగ్ ప్రక్రియ ప్రారంభమైందని స్పష్టం చేసింది. లోక్సభ సీట్ షేరింగ్ ప్రారంభమైందని, త్వరలో పూర్తి నిర్ణయం తీసుకుంటామని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తెలిపారు. జాయింట్ పబ్లిక్ ర్యాలీ భోపాల్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. #WATCH | AAP MP Raghav Chadha on INDIA bloc Coordination Committee meeting "It has been decided that member parties will start the process for seat-sharing and take a decision on it soon; a joint public rally will be held in Bhopal. It was also decided that the issue of caste… pic.twitter.com/smktxqoDBA — ANI (@ANI) September 13, 2023 సమన్వయ కమిటీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. సీట్ షేరింగ్ విధానం ప్రారంభమైందని చెప్పారు. పార్టీల చర్చలు జరిపి వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. #WATCH | On INDIA alliance Coordination Committee meeting, Congress General Secretary KC Venugopal says, "The Coordination Committee has decided to start the process for determining seat-sharing. It was decided that member parties would hold talks and decide at the earliest. The… pic.twitter.com/JnOmapYJ7Z — ANI (@ANI) September 13, 2023 కుల గణన అంశంపై నిర్ణయం.. జేడీయూ, ఆర్జేడీ ప్రతిపాదించిన కుల గణన సర్వే సమస్యను పరిగణలోకి తీసుకుంటామని ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు తీర్మానించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఈ రోజు 14 మంది సమన్వయ కమిటీ మీటింగ్కు 12 మంది హాజరయ్యారు. ఇందులో ప్రధానంగా టీఎంసీ అభ్యర్థి, ఎంపీ అభిషేక్ బెనర్జీ గౌర్హాజరయ్యారు. కుల గణన అంశాన్ని కూటమి చేపట్టడాన్ని టీఎంసీ ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ సభ్యులు మీటింగ్కు హాజరు కానప్పటికీ నేడు ఆ అంశాన్ని చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. కుల గణన అంశాన్ని బిహార్లోని జేడీయూ, ఆర్జేడీలు ముందుకు తీసుకువచ్చాయి. జులైలో జరిగిన ఇండియా కూటమి మీటింగ్లోనే ఈ అంశంపై పోరాడాలని కూటమికి అభ్యర్థనలు వచ్చాయి. కానీ కూటమిలోని టీఎంసీ దీనిని వ్యతిరేకించింది. అటు.. సీటు షేరింగ్ అంశంలోనూ టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో సీటు షేరింగ్ చేసే ప్రసక్తే లేదని అన్నారు. నేడు సాయంత్రం ఇండియా కూటమి సమన్వయ కమిటీ సమావేశమయింది. సమన్వయ కమిటీ ఢిల్లీలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్ , ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై చర్చించారు. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుమల: అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉన్నందున విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో గురువారం కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, టీటీడీలోని అన్నివిభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ 18 నుంచి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 18న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా శ్రీనివాస సేతు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాల హాస్టల్ భవనం, తిరుమలలో విశ్రాంతి గృహాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని, వారికి సంతృప్తికరంగా వాహనసేవల దర్శనంతోపాటు మూలమూర్తి దర్శనం కల్పిస్తామని చెప్పారు. బ్రేక్ దర్శనాలకు సిఫారసు లేఖలు స్వీకరించమని, స్వయంగా వచ్చే ప్రొటోకాల్ ప్రముఖులను మాత్రమే అనుమతిస్తామని వివరించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేసినట్టు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తామని తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ నాడు ఘాట్ రోడ్లలో ద్విచక్ర వాహనాల రాకపోకలు రద్దు చేస్తామన్నారు. సమావేశంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ హరిత, ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు, జేఈవోలు సదాభార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, డీఎల్వో వీర్రాజు, అదనపు ఎస్పీ మునిరామయ్య, ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఘోస్ట్.. డేట్ ఫిక్స్
కన్నడ స్టార్ శివ రాజ్కుమార్ అక్టోబర్లో ‘ఘోస్ట్’ సినిమాతో థియేటర్లకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఘోస్ట్’. శ్రీని (బీర్బల్) దర్శకత్వంలో సందేశ్ నాగరాజ్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా ‘ఘోస్ట్’ రూపొందింది. అక్టోబర్ రెండో వారం నుంచి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
అక్టోబర్ రెండో వారంలో గ్రూప్–3 పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–3 పరీక్షల నిర్వహణకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కసరత్తు ముమ్మరం చేసింది. గతేడాది డిసెంబర్లో గ్రూప్–3 కేటగిరీలో 1,363 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ, ఫిబ్రవరి 23వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 390 మంది పోటీ పడుతున్నారు. తాజాగా ఈ పరీక్షల నిర్వహణపై దృష్టిపెట్టిన కమిషన్.. అక్టోబర్ రెండో వారంలో నిర్వహించాలని భావిస్తోంది. గ్రూప్–1 ప్రిలిమ్స్, గ్రూప్–4 పరీక్షలను పూర్తి చేసిన టీఎస్పీఎస్సీ, గ్రూప్–2 పరీక్షలకు సంబంధించి ఇదివరకే తేదీని ప్రకటించింది. గ్రూప్–3 ఉద్యోగాలకు మూడు దశల్లో అర్హత పరీక్షలుంటాయి. పేపర్–1 జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, పేపర్–2 హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్–3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇందులో భాగంగా ఉంటాయి. ఒక్కో పరీక్షను రెండున్నర గంటల పాటు నిర్వహిస్తారు. అలాగే ఒక్కో పరీక్షకు గరిష్టంగా 150 మార్కులుంటాయి. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఇతర ఉద్యోగ పరీక్షలకు ఆటంకం లేకుండా గ్రూప్–3 తేదీలను నిర్ణయించే అంశాన్ని కమిషన్ పరిశీలిస్తోంది. ఈ కసరత్తు తర్వాత అతి త్వరలో పరీక్షల తేదీలను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
హైదరాబాద్ లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు డేట్ ఫిక్స్
-
ఈఎస్ఐసీ కిందకు 11.82 లక్షల కొత్త సభ్యులు
న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ నిర్వహించే సామాజిక భద్రతా పథకం కింద అక్టోబర్ నెలలో కొత్తగా 11.82 లక్షల మంది సభ్యులుగా చేరారు. అక్టోబర్ నెలకు సంబంధించిన గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్సీ) విడుదల చేసింది. 2017 సెప్టెంబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు చేరిన మొత్తం సభ్యుల సంఖ్య 7.49 కోట్లుగా ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22)లో 1.49 కోట్ల మంది సభ్యులు చేరగా, అంతకుముందు 2020–21లో చేరిన సభ్యుల సంఖ్య 1.15 కోట్లుగాను, 2019–20లో 1.51 కోట్లు, 2018–19లో 1.49 కోట్ల చొప్పున కొత్త సభ్యులు భాగస్వాములు అయ్యారు. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్వో పథకాల్లో నెలవారీగా సభ్యుల చేరిక గణాంకాలను ఎన్ఎస్వో విడుదల చేస్తుంటుంది. అక్టోబర్ నెలలో ఈపీఎఫ్వోలో కొత్తగా 12.94 లక్షల మంది సభ్యులు చేరినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు ఈపీఎఫ్వో కింద చేరిన కొత్త సభ్యులు 5.99 కోట్లుగా ఉన్నారు. -
5.62 లక్షల టన్నుల చక్కెర ఎగుమతులు!
న్యూఢిల్లీ: భారత్ అక్టోబర్లో ప్రారంభమైన ప్రస్తుత 2022–23 మార్కెటింగ్ సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీ వరకూ 5.62 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసిందని వాణిజ్య వేదిక– ఏఐఎస్టీఏ (ఆల్ ఇండియా షుగర్ ట్రేడ్ అసోసియేషన్) మంగళవారం తెలిపింది. ప్రస్తుత (2022–23) మార్కెటింగ్ సంవత్సరంలో (అక్టోబర్–సెప్టెంబర్) 60 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి నవంబర్లో ప్రభుత్వం అనుమతించింది. ఏఐఎస్టీఏ లెక్కల ప్రకారం, చక్కెర మిల్లుల నుండి ఎగుమతుల కోసం పంపిన పరిమాణం 12.19 లక్షల టన్నులు. దీనిలో భౌతిక రవాణా ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం డిసెంబర్ 9 వరకు 5.62 లక్షల టన్నులు. యునైటెడ్ ఆరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)కి గరిష్టంగా చక్కెర ఎగుమతయ్యింది. ఆ తర్వాత బంగ్లాదేశ్, ఇండోనేషియా, సోమాలియా, ఇతర దేశాలకు ఎగుమతులు జరిగాయి. దాదాపు 5.22 లక్షల టన్నుల చక్కెర లోడింగ్ లేదా లోడింగ్ కోసం సిద్ధంగా ఉంది. 2021–22 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశం రికార్డు స్థాయిలో 111 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేసింది. -
అక్టోబర్లో ఈపీఎఫ్వో పరిధిలోకి 12.94 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) కింద అక్టోబర్ నెలలో కొత్తగా 12.94 లక్షల మంది నమోదయ్యారు. 2021 అక్టోబర్తో పోలిస్తే 21,026 మంది అధికంగా వచ్చి చేరారు. కేంద్ర కార్మిక శాఖ ఈ గణాంకాలను విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ చట్టం, 1952 కింద 2,282 కొత్త సంస్థలు అక్టోబర్ నుంచి పని చేయడం మొదలు పెట్టాయి. కొత్త సభ్యుల్లో మొదటిసారి చేరిన వారు 7.28 లక్షల మంది ఉంటే, 5.66 లక్షల మంది సభ్యులు ఒక చోట మానేసి, మరో సంస్థలో చేరిన వారు. పాత సంస్థ నుంచి కొత్త సంస్థకు ఖాతాను బదలాయించుకున్నారు. ఇలాంటి ఖాతాలను కొత్తవిగానే పరిగణిస్తుంటారు. యువత ఎక్కువ.. నికర కొత్త సభ్యుల్లో 18–21 వయసులోని వారు 2.19 లక్షల మంది ఉంటే, 22–25 ఏళ్ల వయసు గ్రూపులోని వారు 1.97 లక్షల మంది ఉన్నారు. కొత్త సభ్యుల్లో 57.25 శాతం 18–25 ఏళ్లలోపు వారే. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 2.63 లక్షలుగా ఉంది. వీరిలో 1.91 లక్షల మంది మొదటిసారి ఈపీఎఫ్వో కిందకు వచ్చిన వారు కావడం గమనార్హం. కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో సెప్టెంబర్తో పోలిస్తే అక్టోబర్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. నికర సభ్యుల చేరికలో మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, హర్యానా 60 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ రాష్ట్రాల నుంచి 7.78 లక్షల మంది ఈపీఎఫ్వో కిందకు వచ్చారు. క్రితం నెలతో పోలిస్తే అక్టోబర్లో న్యూస్పేపర్ పరిశ్రమ, షుగర్, రైస్ మిల్లింగ్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. -
ఐఐపీ డేటా షాక్: పడిపోయిన పారిశ్రామికోత్పత్తి
న్యూఢిల్లీ: ఒకవైపు ద్రవ్యోల్బణం శాంతించగా, మరోవైపు పారిశ్రామికోత్పత్తి గణనీయంగా తగ్గి పోయింది. మైనస్ 4 శాతానికి అక్టోబర్లో క్షీణించింది. ప్రధానంగా తయారీ తగ్గడం, మైనింగ్, విద్యుత్ విభాగాల్లో వృద్ధి లేకపోవడం ఈ పరిస్థితికి దారితీసింది. ఈ వివరాలను ఎన్ఎస్వో విడుదల చేసింది. మైనింగ్ విభాగం కేవలం 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగా, తయారీ విభాగం మైనస్ 5.6 శాతానికి పడిపోయింది. (దగ్గు నివారణకు హెర్బల్ సిరప్: వాసా తులసి ప్లస్) విద్యుత్ ఉత్పత్తి 1.2 శాతం పెరిగింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 2.3 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగం 15 శాతం మేర, కన్జ్యూమర్ నాన్ డ్యూరబుల్స్లో 13.4 శాతం క్షీణత నమోదైంది. ఇంటర్ మీడియట్ గూడ్స్ ఉత్పత్తి 2.8 శాతం తగ్గగా, ప్రైమరీ గూడ్స్ 2 శాతం, ఇన్ఫ్రా/కన్స్ట్రక్షన్ గూడ్స్ ఉత్పత్తి 1 శాతం వృద్ధిని చూశాయి. అంతకుముందు సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 3.1 శాతం వృద్ధిని చూడగా, 2021 అక్టోబర్ నెలలోనూ 4.2 శాతం వృద్ధి నమోదు కావడాన్ని గమనించొచ్చు. మొత్తం మీద అక్టోబర్లో ఐఐపీ గణాంకాలు అంచనాల కంటే తక్కువగా రావడం గమనార్హం. 2020 ఆగస్ట్ నెలకు నమోదైన మైనస్ 7 తర్వాత, మళ్లీ ఇంత కనిష్టాలకు తయారీ రంగం పనితీరు పడి పోవడం ఇదే మొదటిసారి. (ఎట్టకేలకు..మూడు రంగుల్లో ట్విటర్ వెరిఫైడ్ మార్క్ షురూ) -
ఆఫీస్ స్పేస్ డిమాండ్ డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు స్థలాల లీజు అక్టోబర్ నెలలో 21 శాతం తక్కువగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ సేవల్లోని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. దేశవ్యాప్తంగా ఏడు పట్టణాల్లో మొత్తం 6.7 మిలియన్ చదరపు అడుగుల మేర కార్యాలయాల స్థలాల లీజు నమోదైనట్టు బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పుణె, కోల్కతాకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అన్ని రకాల ఆఫీసు లీజు వివరాలను పరిగణనలోకి తీసుకుంది. క్రితం ఏడాది అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజ్ పరిమాణం 8.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం. నెలవారీ లీజు పరిమాణంలో 65 శాతం వాటాతో ముంబై ముందుంది. ముంబై మార్కెట్లో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ బలంగా ఉండడానికి తోడు, కొన్ని రెన్యువల్స్ (గడువు తీరిన లీజు పునరుద్ధరణ) నమోదైనట్టు జేఎల్ఎల్ నివేదిక వివరించింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్, పుణె మార్కెట్లు అధిక వాటాతో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్ల వాటా అక్టోబర్ నెలకు సంబంధించి ఆఫీసు లీజు పరిమాణంలో 93 శాతంగా ఉంది. తయారీ రంగం నుంచి డిమాండ్ తయారీ రంగం నుంచి ఎక్కువ డిమాండ్ కనిపించింది. 22 శాతం ఆఫీస్ స్పేస్ను తయారీ కంపెనీలే లీజుకు తీసుకున్నాయి. కన్సల్టెన్సీ రంగం 18 శాతం, బీఎఫ్ఎస్ఐ రంగం ఇంతే చొప్పున లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ రంగ కంపెనీల వాటా 15 శాతంగా ఉంది. ఆఫీస్ స్పేస్ లీజు విషయంలో టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికీ నిదానంగా అడుగులు వేస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. జేఎల్ఎల్ ఇండియా డేటా ప్రకారం.. ఈ ఏడాది మార్చి నాటికి ఆఫీస్ గ్రేడ్ ఏ (ప్రీమియం) విస్తీర్ణం ఈ ఏడు పట్టణాల్లో 732 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇతర గ్రేడ్లలోని విస్తీర్ణం 370 మిలియన్ చదరపు అడుగుల మేర ఉంది. మొత్తం 1.1 బిలియన్ చదరపు అడుగులు ఉన్నట్టు ఈ నివేదిక తెలియజేసింది. -
గరిష్టానికి పీనోట్ పెట్టుబడులు,ఈ ఏడాదిలో హైయస్ట్
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్ల ద్వారా (పీ నోట్స్) పెట్టుబడులు అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఇవి గరిష్ట స్థాయి పెట్టుబడులు కావడం గమనించాలి. సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్పీఐలు) విదేశీ ఇన్వెస్టర్లకు పీనోట్స్ను జారీ చేస్తుంటారు. ఈ నోట్స్ ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు. (డిజిటల్ లోన్లపై అక్రమాలకు చెక్: కొత్త రూల్స్ నేటి నుంచే!) సెబీ వద్ద ఉన్న డేటా ప్రకారం.. సెప్టెంబర్ చివరికి పీనోట్స్ పెట్టుబడులు ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీల్లో కలిపి రూ.88,813 కోట్లుగా ఉంటే, అక్టోబర్ చివరికి రూ.97,784 కోట్లకు చేరాయి. సాధారణంగా ఎఫ్పీఐ పెట్టుబడుల ధోరణిని పీ నోట్ల పెట్టుబడులు అనుసరిస్తుంటాయి. అక్టోబర్ నాటికి వచ్చిన పీనోట్ల మొత్తం పెట్టుబడుల్లో రూ.88,490 కోట్లు ఈక్విటీల్లో, రూ.9,105 కోట్లు డెట్లో, రూ.190 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీల్లోకి వచ్చాయి. ‘‘ఈ ఏడాది, వచ్చే ఏడాది ప్రపంచంలో భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ అనే విషయంలో అంతటా ఏకాభిప్రాయం ఉంది. (శాంసంగ్ మరో గెలాక్సీ 5జీ స్మార్ట్ఫోన్ వచ్చేస్తోంది: ఫీచర్లు, ధర) అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నిదానించినప్పటికీ, భారత్ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ఇది విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. రూపాయి స్థిరంగా ఉండడం విదేశీ ఇన్వెస్టర్లలో నమ్మకం కలిగిస్తోంది’’అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్కుమార్ తెలిపారు. -
దేశంలో ఈవీల జోరు: ఏకంగా 185 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) రిటైల్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 2022 అక్టోబర్ నెలలో మొత్తం 1,11,971 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021 అక్టోబర్తో పోలిస్తే ఈ సంఖ్య ఏకంగా 185 శాతం అధికం కావడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. గత నెలలో ప్యాసింజర్ ఈవీలు 178 శాతం ఎగసి 3,745 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు 19,826 యూనిట్ల నుంచి 269 శాతం వృద్ధితో 73,169 యూనిట్లకు చేరాయి. ఈ-త్రీ వీలర్లు 93 శాతం దూసుకెళ్లి 34,793 యూనిట్లను తాకాయి. ఎలక్ట్రిక్ వాణిజ్య వాహనాలు 125 శాతం పెరిగి 274 యూనిట్లు అమ్ముడయ్యాయి. -
స్టాక్ మార్కెట్ కంటే రిస్క్ తక్కువ..సిప్లోకి రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
న్యూఢిల్లీ:ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (క్రమానుగత పెట్టుబడులు/సిప్)కు రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా అక్టోబర్ నెలలో ఆల్టైమ్ గరిష్ట స్థాయిలో రూ.13,040 కోట్లు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ నెలలో వచ్చిన రూ.12,976 కోట్లను అధిగమించాయి. సిప్ ద్వారా ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేయడం వల్ల.. మార్కెట్ ర్యాలీల్లో, పతనాల్లోనూ పెట్టుబడులు పెట్టడం సాధ్యపడుతుంది. దీనివల్ల కొనుగోలు ధర సగటుగా మారి రిస్క్ తగ్గుతుంది.దీర్ఘకాలంలో మంచి రాబడులకూ అవకాశం ఉంటుంది. పైగా నెలవారీ సంపాదనకు అనుగుణంగా ప్రణాళిక మేరకు, నిర్దేశిత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ సానుకూలతలపై రిటైల్ ఇన్వెస్టర్లలో అవగాహన విస్తృతం అవుతున్న కొద్దీ, దీని రూపంలో వచ్చే పెట్టుబడులు కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఫండ్స్ పెట్టుబడుల వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ ‘యాంఫీ’ గురువారం విడుదల చేసింది. ఈ ఏడాది మే నుంచి సిప్ పెట్టుబడులు ప్రతి నెలా రూ.12వేల కోట్లకు పైనే నమోదవుతున్నాయి. మే నెలలో రూ.12,286 కోట్లు, జూన్ లో రూ.12,276 కోట్లు, జూలైలో రూ.12,140 కోట్లు చొప్పున వచ్చాయి. ఏప్రిల్ నెలకు రూ.11,863 కోట్లుగా ఉన్నాయి. ఏడు నెలల్లో రూ.87,000 కోట్లు ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఏడు నెలల్లో సిప్ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చిన మొత్తం పెట్టుబడులు రూ.87,000 కోట్లుగా ఉన్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద రూ.1.24 లక్షల కోట్లు సిప్ రూపంలో వచ్చాయి. ‘‘మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాలకు, స్థానిక రేట్ల పెంపునకు స్పందిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు తమ నమ్మకాన్ని ప్రదర్శిస్తూ, సిప్ రూపంలో ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు’’అని యాంఫీ సీఈవో ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. ఈక్విటీ నిర్వహణ ఆస్తులు, ఫోలియోల్లోనూ వృద్ధి ఉన్నట్టు చెప్పారు. అక్టోబర్ నెలలో కొత్తగా 9.52 లక్షల సిప్ ఖాతాలు నమోదయ్యాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే నంబర్ను ఫోలియోగా పేర్కొంటారు. దీంతో మొత్తం సిప్ ఖాతాల సంఖ్య అక్టోబర్ చివరికి 5.93 కోట్లకు చేరింది. సిప్ రూపంలో స్థిరమైన పెట్టుబడుల రాక మన ఈక్విటీ మార్కెట్లలో కొంత స్థిరత్వానికి సాయపడుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీల్లోకి రూ.9,390 కోట్లు ఇక అక్టోబర్ నెలకు ఈక్విటీ పథకాల్లోకి నికరంగా వచ్చిన పెట్టుబడులు రూ.9,390 కోట్లుగా ఉన్నాయి. దీంతో వరుసగా 20వ నెలలోనూ (2021 మార్చి నుంచి) ఈక్విటీ పథకాల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చినట్టయింది. కాకపోతే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈక్విటీ పథకాల్లోకి వచ్చిన రూ.14,100 కోట్లతో పోలిస్తే చెప్పుకోతగ్గ స్థాయిలో తగ్గాయి. మార్కెట్లలో అస్థిరతలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. గోల్డ్ ఈటీఎఫ్ల్లోకి రూ.147 కోట్లు వచ్చాయి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.2,818 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. అన్ని రకాల విభాగాలు కలిపి చూస్తే ఫండ్స్ పరిశ్రమలోకి అక్టోబర్లో రూ.14,047 కోట్లు వచ్చాయి. దీంతో ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.39.5 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్ చివరికి ఇది రూ.38.4 కోట్లుగా ఉంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
- నాగోలులో లిఫ్ట్ ప్రమాదం.. 8 మందికి తీవ్ర గాయాలు
- SRH: అందుకే ఓడిపోయాం.. మా వాళ్లు మాత్రం సూపర్: కమిన్స్
- ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్తో చూసుకోండిలా..
- అసలు ‘రేవ్’ రచ్చ గురించి తెలుసా?
- రఫాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అర్ధరాత్రి ఆర్తనాదాలు..
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
Advertisement