-
చంద్రబాబుకు తగ్గట్టే.. టీడీపీ అభ్యర్దుల నోటి జారుడు!
వాలంటీర్ల వ్యవస్థ మీద, వాలంటీర్ల మీద తెలుగుదేశం లీడర్లు చేస్తున్న కామెంట్లు, అనుసరిస్తోన్న ధోరణి తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోంది. చంద్రబాబు తగ్గట్టే కొందరు టీడీపీ అభ్యర్దులు కూడా నోటికి ఎంత మాట వస్తే అంతా మాట్లాడి వివాదాస్పదులవుతున్నారు. వలంటీర్లను స్లీపర్ సెల్స్ అని, టెర్రరిస్టులని శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్ది బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం దారుణంగా ఉంది. దీనిపై వలంటీర్లు మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ వలంటీర్లపై ద్వేషంతో ప్రవర్తిస్తోంది. తొలుత చంద్రబాబు కూడా ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసినా, ఆ తర్వాత వారి ప్రాముఖ్యత, ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను గుర్తించక తప్పలేదు. మొదట వలంటీర్లు అంటే మూటలు మోసే ఉద్యోగమని చంద్రబాబు అవహేళన చేశారు. ఇళ్లలో మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు కొడుతున్నారని నీచంగా ఆరోపించారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి, తాను కూడా వలంటీర్ల వ్యవస్తను కొనసాగిస్తానని ప్రకటించారు. పైగా 'వలంటీర్లకు ఏభై వేల రూపాయల వరకు వచ్చే ఏర్పాటు చేస్తారట. అదెలాగో ఎవరికి తెలియదు'. వలంటీర్లకు ఆయన తాయిలాలు వేసే దశకు వచ్చారంటే ఆ వ్యవస్థ ఎంత బలంగా నాటుకుంది అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికు ప్లస్ అవుతున్నదన్నదే ఆయన బాధ. టీడీపీ నేతలలో వలంటీర్లు అంటే భయం ఏర్పడింది. దానికి తోడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు చేసిన అనుచిత వ్యాఖ్యల ప్రభావం తమమీద పడుతుందేమోనన్న సందేహం వారిలో ఉంది. 'పవన్ కల్యాణ్ అయితే ఏకంగా వలంటీర్లను కిడ్నాపర్లతో పోల్చారు. నిజానికి వలంటీర్లలో అరవై నుంచి డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు. అయినా వీరిద్దరూ దారుణంగా మాట్లాడారు. వారికంటే తానేమీ తక్కువ తీసిపోలేదన్నట్లు సుధీర్ రెడ్డి వంటి వారు మరీ మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురి అవుతున్నారు'. కరోనా కష్టకాలంలో ఏపీలో ప్రజలకు అండగా ఉండి వలంటీర్లు చేసిన సేవలను ఇప్పుడు అంతా గుర్తు చేసుకుంటున్నారు. సొంత కుటుంబ సభ్యులే పలకరించడానికి భయపడిన రోజుల్లో కరోనా సోకిన వారిని ఆస్పత్రులలో చేర్చి, వారికి చికిత్స జరిగేదాక శ్రద్ద తీసుకున్న వలంటీర్లను ఉగ్రవాదులతో పోల్చారంటే వారి సంస్కారం ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వలంటీర్ల వ్యవస్త సఫలం అవుతుందని తెలుగుదేశం, జనసేన నేతలు ఊహించలేదు. అందుకే ఇష్టారీతిన మాట్లాడి నోరుపారేసుకున్నారు. ఆ తర్వాత తప్పును గుర్తించినా లాభం లేని పరిస్థితి ఏర్పడింది. ఒక్కో వలంటీరు వందల మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మంతులయ్యారన్నది వీరి అనుమానం. వలంటీర్లు సేవలందిస్తున్న ఆ వ్యవస్థను నెలకొల్పి ప్రజల ఇళ్ల వద్దకే పాలనను తీసుకువెళ్లిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్రెడ్డిది. ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతోంది. కులం, ప్రాంతం, పార్టీ.. ఇలాంటి వాటితో నిమిత్తం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఏపీలో మొదటిసారిగా ఇలా స్కీములు అమలు అవుతున్నాయి. 'గతంలో చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీలు అరాచకాలు చేస్తే, అవినీతి విశృంఖలంగా చేస్తే టీడీపీ గబ్బు పట్టిపోయింది'. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వలంటీర్ల సేవలు ప్రజలకు బ్రహ్మాండంగా అందుతుండడంతో పూర్వకాలంలో టీడీపీకి ఓటు వేసినవారు సైతం ఇప్పుడు వైఎస్సార్సీపీ వైపు మొగ్గుతున్నారు. దాంతో కంగారు పుట్టిన టీడీపీ నేతలు అనుచితంగా మాట్లాడి మరింత అప్రతిష్టపాలవుతున్నారు. ప్రస్తుతం ఏపీలో రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వీరి సేవలకు సంతోషపడి ఒక్కో వలంటీర్కు పది మంది చొప్పున టీడీపీ వారు మారినా, పాతిక లక్షల మంది వైఎస్సార్సీపీకి అనుకూలం అవుతారన్నది వీరి అంచనా. అందుకే వలంటీర్ల వ్యవస్థను అవుననాలో, లేక కాదానలో తేల్చుకోలేక, ఒక్కోసారి ఒక్కో రకంగా మాట్లాడి మరింతగా పలచన అవుతున్నారు. 'గతంలో రోజుల తరబడి వృద్ధులు తమ పెన్షన్ల కోసం ఆఫీస్ల చుట్టూ తిరగవలసి వచ్చేది. అలాంటిది ఇప్పుడు ఇళ్లకే వలంటీర్లు వచ్చి ఇస్తుండడంతో వృద్ధులంతా పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్మోహన్రెడ్డిను తమ బిడ్డగా చూసుకుంటున్నారు. ఆ విషయాన్ని వారు బహిరంగంగానే చెబుతున్నారు. సహజంగానే అది టీడీపీవారికి గంగవెర్రిలెత్తిస్తుంటుంది'. 'చిత్రం ఏమిటంటే ప్రధాని మోదీని చంద్రబాబు టెర్రరిస్టు అని వ్యాఖ్యానిస్తే, టీడీపీ నేతలు బొజ్జల వంటివారు వలంటీర్లను టెర్రరిస్టులతో పోల్చుతున్నారు'. చంద్రబాబు ఇప్పుడు మోదీని పొగుడుతున్నట్లే వీరు కూడా వలంటీర్లను ప్రశంసించక తప్పని స్థితి ఏర్పడింది. 'వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏభై ఇళ్లకు ఒక వలంటీర్ను నియమిస్తే, ఇప్పుడు చంద్రబాబు ప్రతి ఇరవై కుటుంబాలకు ఒక వలంటీర్ను పెడతానని చెబుతున్నారు. ఇంటి వద్దకే పెన్షన్ పంపిస్తానని అంటున్నారు'. జనం వీటిని నమ్ముతారా? కచ్చితంగా నమ్మరు. వలంటీర్లను తెగతిట్టి, ఇప్పుడు ఇంకా ఎక్కువ మందిని పెడతామంటే అన్నిటిలోను యుటర్న్ తీసుకున్నట్లు దీనిలో కూడా మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి పాట్లు పడుతున్నారని తెలియడం లేదా! – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
రానున్న లోక్సభ ఎన్నికలపై.. బీజేపీ నేతల గురి!
సాక్షి, పెద్దపల్లి: రానున్న లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ అంశాలతో ప్రభావితమయ్యే నియోజకవర్గమవడం, ఎస్సీ స్థానం కావడంతో ఇక్కడ గెలుపును ఆ పార్టీ నిర్దేశించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ఓట్లు సాధించకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు జాతీయ అంశాల ఆధారంగా తమకు మద్దతు పలుకుతారని బీజేపీ అధిష్టానం అంచనా వేస్తుంది. ఇందులో భాగంగా రాబోయే ఎన్నికల్లో పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అంతర్గతంగా అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమవుతోన్న నేతలు నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీ దృష్టిలో పడేందుకు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో వాల్రైటింగ్స్ చేయిస్తూ, ఫ్లెక్సీలు కూడా కట్టిస్తున్నారు. వికసిత్ సంకల్ప్ భారత్ వంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. టీడీపీ, బీజేపీ పోత్తులో గెలుపు! పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా నిలుస్తోంది. అలాగే బీజేపీ సైతం ప్రత్యక్షంగా పోరులో నిలవక, పోత్తులో భాగంగా టీడీపీకి పలుమార్లు సీటు కేటాయించింది. అందులో భాగంగా 2004లో టీడీపీ తరుఫున డాక్టర్ సుగుణకుమారి పోటీ చేసి గెలిచారు. 2019లో బీజేపీ తరుఫున ఎస్.కుమార్ నిలవగా 92,606 ఓట్లు సాధించారు. పార్లమెంట్ పరిధిలో గతంలో కంటే ఓటు బ్యాంకు స్థిరంగా పెరగడాన్ని గమనిస్తోన్న అధిష్టానం గతంలో వైఫల్యాలకు గల కారణాలను విశ్లేషించుకుంటుంది. పొత్తులో టీడీపీ గెలిచిందని, ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతవరణం నెలకొన్న నేపథ్యంలో సరైన అభ్యర్థిని దింపి పక్కా ప్రణాళికతో గెలవవచ్చని భావిస్తుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అభ్యర్థులకు గట్టి పోటీనిచ్చే అభ్యర్థులను బరిలో దింపేలా అధిష్టానం ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఇదే నియోజకవర్గంలోని మాజీ ఎంపీ, మాజీ మంత్రిని పార్టీలో చేర్చుకొని టిక్కెట్ ఇచ్చేందుకు సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. ఎంపీ టికెట్ రేసులో వీరే.. పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు పలువురు నాయకులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పాలకుర్తి మండలానికి చెందిన ఐఏఎస్ నరహరి క్లాస్మేట్, అతను స్థాపించిన ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేందర్కుమార్, విశ్వహిందూ పరిషత్ నాయకుడు అయోధ్య రవి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగాల కుమార్, కరీంనగర్కు చెందిన బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి, క్యాతం వెంకటరమణ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వీరిలో ముగ్గురి పేర్లతో కూడిన షార్ట్ లిస్టు బీజేపీ అధిష్టానానికి చేరింది. అయితే పార్టీ టికెట్ వీరిలో ఎవరికై నా ఇస్తారా, చివరి నిమిషంలో మరెవరినైనా రంగంలోకి దింపుతారా అనే అంశం ఆసక్తిగా మారింది. ఇవి చదవండి: కేసీఆర్ హామీతో.. ఆ స్థానం పదిలమేనా!? -
తెలంగాణలో తీన్ మార్..
-
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్ -
చంద్రబాబు నాన్చుడి ధోరణి.. డౌటెవరు?, ఔటెవరు?
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరుగులు పెట్టిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు పెద్ద పీట వేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతోంది. ప్రతిపక్ష టీడీపీలో మాత్రం ఈ విషయంలో గందరగోళం నెలకొంది. గెలుపు గుర్రాలేవో, కుంటి గుర్రాలేవో తేల్చుకోలేక సతమతమవుతోంది. సీట్లు ఎవరికి ఇవ్వాలో తెలీక తలపట్టుకుంటోంది. ఈ నాలుగున్నరేళ్లూ చురుకై న పాత్ర పోషించడంలో సీనియర్ నాయకులు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో మళ్లీ వారికి టికెట్లిస్తే పుట్టి మునుగుతుందేమోనన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. వీళ్లకు ఈసారి డౌటే..? కొంతమంది సీనియర్ నాయకులకు ఈసారి టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం నిరాకరిస్తోంది. ఇందులో తొలివరసలోకి రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు ఉన్నట్టు తెలిసింది. కాలవ శ్రీనివాసులు రాయదుర్గంలో కచ్చితంగా ఓడిపోతారని, అందుకే పార్లమెంటుకు పంపించాలని ఆలోచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథిని కూడా పెనుకొండ అసెంబ్లీ కాకుండా హిందూపురం పార్లమెంటుకు పోటీ చేయించాలన్న యోచనలో ఉన్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను కృష్ణా జిల్లాకు పంపాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్లకు హుళక్కేనా? గుంతకల్లులో జితేందర్గౌడ్ను తప్పించి మరొకరికి టికెట్ ఇవ్వాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇక.. శింగనమలలో బండారు శ్రావణికి టికెట్ అనుమానంగా ఉంది. ధర్మవరం టికెట్ రేసులో ఉన్న పరిటాల శ్రీరామ్కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో టీడీపీ తరఫున పోటీచేసి ఓడిపోయి, బీజేపీలో చేరిన వరదాపురం సూరిని తిరిగి పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని ఉన్నారు. కళ్యాణదుర్గంలోనూ గతంలో పోటీచేసిన అభ్యర్థిని నిలపడం లేదు. అనంతపురం అర్బన్ టికెట్ ఈసారి ప్రభాకర్ చౌదరికి లేదని కరాఖండీగా చెప్పినట్టు తెలుస్తోంది. కదిరిలో కందికుంట ప్రసాద్కు నకిలీ డీడీల కేసులో శిక్ష ఖరారైన నేపథ్యంలో ఆయన భార్యకు టికెట్ ఇస్తే గెలుస్తుందా అన్న అనుమానంలో అధినాయకత్వం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపిక గందరగోళంగా ఉందని ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు నాన్చుడు ధోరణి తమ మెడకు చుట్టుకుంటోందంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. రూ.20 కోట్లు ఎక్కడ తేవాలి? ఇటీవల జిల్లాలోని టీడీపీ ఓ నియోజకవర్గ నేత టికెట్ కోసం ప్రయత్నించగా రూ.20 కోట్లు ఉంటే చూపించు టికెట్ ఆలోచిస్తాం అని అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. రూ.20 కోట్లు రెడీ చేసుకుంటేనే టికెట్ ఇస్తామని, లేదంటే వేరే ఆలోచిస్తామని తెగేసి చెప్పడంతో చాలామంది నాయకులు బెంబేలెత్తుతున్నారు. రిజర్వుడు నియోజకవర్గ అభ్యర్థులకు కూడా డబ్బు రెడీ చేసుకుంటేనే టికెట్ ఉంటుందని చెబుతుండడంతో పోటీకి ముందుకొచ్చే అభ్యర్థులు కూడా వెనకడుగు వేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీని వైఎస్సార్సీపీ చావుదెబ్బ కొట్టింది. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తుండడంతో ఇప్పటికీ కోలుకోలేదు. ఈ క్రమంలోనే చంద్రబాబు వైఖరితో పార్టీ పరిస్థితి పూర్తిగా కనుమరుగైపోయే దశకు చేరుకుంటోందని ఆ పార్టీ కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు నిట్టూరుస్తున్నారు. ఇవి చదవండి: టీడీపీలో ట్విస్ట్.. కేశినేని నానికి షాకిచ్చిన చంద్రబాబు -
తెలుగు తమ్ముళ్ల డిష్యుం డిష్యుం! తన్నుకున్నారిలా..
తూర్పుగోదావరి: కొత్త సంవత్సరం ఆరంభం రోజునే తునిలో తెలుగు తమ్ముళ్లు తన్నులాటలకు దిగారు. యనమల బ్రదర్స్ అనుచరులు రెండు వర్గాలుగా విడిపోయి.. డిష్యుం డిష్యుం అంటూ పిడిగుద్దులు కురిపించుకున్నారు.. తన కళ్ల ముందే తెలుగు ‘తమ్ముళ్లు’ అరుపులు, కేకలతో.. ముష్టిఘాతాలతో ఫైటింగ్కు దిగినా.. ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు సైలెంటుగా ఉండిపోవడం చూపరులను విస్మయపరచింది. తన వరకూ వస్తేనే కానీ తత్త్వం బోధపడదంటారు పెద్దలు. ప్రజాదరణ కోల్పోయి, అధికారానికి దూరమై ఏళ్లు గడుస్తున్నా పార్టీలో గ్రూపులను కట్టడి చేయలేని దుస్థితిని తెలుగుదేశం అగ్ర నేతలు ఎదుర్కొంటున్నారు. టీడీపీలో గ్రూపు రాజకీయాలకు ఆది గురువుగా విమర్శలు ఎదుర్కొనే శాసనమండలి ప్రతిపక్ష నేత, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుకు ఇప్పుడు దాదాపు అటువంటి పరిస్థితే ఎదురైంది. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన ఆయన.. టీడీపీ ఆవిర్భావం నుంచీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై ఆధిపత్యం కోసం.. ఇటు కాకినాడ మెట్ట ప్రాంతం, అటు కోనసీమలో గ్రూపులను పెంచి పోషిస్తూ వచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, దివంగత నేతలు మెట్ల సత్యనారాయణరావు, బొడ్డు భాస్కర రామారావులను గ్రూపులుగా చేసి, ఉమ్మడి జిల్లాపై పెత్తనాన్ని చెలాయించిన చరిత్ర రామకృష్ణుడు సొంతమనే వారు ఆ పార్టీలో కోకొల్లలు. ఇన్నేళ్ల పాటు తాను పెంచి పోషించిన గ్రూపు రాజకీయాలు.. తీరా సొంత నియోజకవర్గం తునిలో భగ్గుమనేసరికి రామకృష్ణుడికి దిక్కుతోచడం లేదనే చర్చ టీడీపీ వర్గాల్లో నడుస్తోంది. రగులుతున్న కృష్ణుడి వర్గం సొంత కుమార్తె దివ్యను తన రాజకీయ వారసురాలిగా చేసేందుకు.. మూడు దశాబ్దాలుగా తన వెంట నడిచిన వరుసకు సోదరుడైన యనమల కృష్ణుడిని బలవంతంగా టీడీపీ తుని నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి రామకృష్ణుడు తప్పించారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను దివ్యకు అప్పగించారు. ఆమెకు పార్టీలో ఎదురుండకూడదనే ఉద్దేశంతో కృష్ణుడిని వ్యూహాత్మకంగానే తప్పించారని ఆయన వర్గం కొంత కాలంగా రగిలిపోతోంది. దివ్యకు పార్టీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించడంపై కినుక వహించిన కృష్ణుడు.. కొంత కాలం అలకబూనారు. రాజకీయంగా పక్క చూపులు చూశారు. ఆ సమయంలో నియోజకవర్గ బాధ్యతలను రామకృష్ణుడి సొంత సోదరుని కుమారుడు రాజేష్ తన భుజాన వేసుకున్నారు. విధి లేని పరిస్థితుల్లో కృష్ణుడు టీడీపీలో తిరిగి క్రియాశీలకంగా మారారు. పార్టీపై పెత్తనం కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. అప్పటికే దివ్య కనుసన్నల్లో నియోజకవర్గ బాధ్యతలను కృష్ణుడు చూస్తున్నా.. టీడీపీ తొండంగి మండల బాధ్యతలు మాత్రం రాజేష్ చేతుల్లోనే ఉన్నాయి. ఒకప్పుడు నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న కృష్ణుడి వర్గానికి ఇది అవమానంగానే అనిపించింది. దీంతో ఆ వర్గం సమయం కోసం వేచి చూస్తోంది. ముందస్తు వ్యూహమేనా..! రాజేష్ను ఎంత మాత్రం భరించలేని కృష్ణుడు నయాన భయాన ఆయనను పార్టీకి దూరం చేసేందుకు కొంతకాలం నుంచి ఎత్తుగడలు వేస్తున్నారు. దీనిలో భాగంగానే తొలి ప్రయత్నంగా సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలను వేదికగా చేసుకున్నారు. రామకృష్ణుడు కళ్లెదుటే రచ్చరచ్చ చేశారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే కృష్ణుడు తన అనుచరులతో రాజేష్పై దాడి చేయించారని టీడీపీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. తన్నుకున్నారిలా.. తుని మండలం ఎస్.అన్నవరం శివారు గెడ్లబీడు వద్ద సాయి వేదికలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఇందులో యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు పలు గ్రామాల నుంచి తెలుగు తమ్ముళ్లు వచ్చారు. వారు వరుస క్రమంలో వెళ్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడి సొంత అన్న కుమారుడు రాజేష్ అక్కడకు చేరుకున్నారు. రామకృష్ణుడిని, దివ్యను కలిసేందుకు క్యూతో ప్రమేయం లేకుండా వెళ్లేందుకు ప్రయత్నించారు. అదను కోసం వేచి ఉన్న కృష్ణుడి వర్గీయులు దీనిని అవకాశంగా మలచుకున్నారు. అందరూ క్యూలోనే రావాలంటూ అక్కడున్న వారిని అప్పటికే వారు కట్టడి చేస్తున్నారు. ఈ సమయంలో రాజేష్ క్యూలో కాకుండా నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిని కృష్ణుడి వర్గం లక్ష్యంగా చేసుకుని ఒక్కసారిగా దాడులకు దిగింది. రాజేష్పై ఆయన సొంత చిన్నాన్న రామకృష్ణుడు, దివ్య సమక్షంలోనే పిడిగుద్దులతో ఈ దాడి జరిగింది. అయినప్పటికీ రామకృష్ణుడి అనుచరులు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇరు వర్గాలకూ సర్ది చెప్పలేక, వారిని కట్టడి చేయలేక నిర్లిప్తంగా చూస్తూ ఊరుకుండిపోయారు. ఆయన సైలెంటుగా ఉండిపోవడానికి కృష్ణుడు దూరమైతే రాజకీయంగా ఇబ్బంది పడతామనే భయం తప్ప మరొకటి కారణం కాదని పలువురు అంటున్నారు. కుమార్తె దివ్య ఇన్చార్జిగా ఉన్న సొంత నియోజకవర్గం తునిలోనే కళ్లెదుటే ఇంత జరిగినా.. చివరకు ఇరువర్గాలను సముదాయించడానికి తలప్రాణం తోకకొచ్చినట్టయ్యిందని అంటున్నారు. ఇన్నేళ్లూ పార్టీలో గ్రూపులను ప్రోత్సహించిన యనమల.. రక్త సంబంధీకులు, దాయాదుల పోరు, గ్రూపు రాజకీయాలు భగ్గుమనడంతో.. వాటి ప్రభావాన్ని స్వయంగా రుచి చూశారని టీడీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఇవి చదవండి: దిగజారుతున్న టీడీపీ గ్రాఫ్.. 'పరిటాల' ఓవరాక్షన్కు బ్రేక్..! -
నా ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారణం!
కరీంనగర్: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. ఇందుకు ఆ ముగ్గురే కారణం..’ అంటూ ఓ యువకుడి సూసైడ్నోట్ సిరిసిల్లలో సోమవారం కలకలం సృష్టించింది. బాధితుడు మీడియా ప్రతినిధులకు నేరుగా వాట్సాప్లో పంపించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిరిసిల్లకు చెందిన ఓ ప్రముఖుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేశాడు. ఎన్నికల్లో అతని విజయం కోసం ఆ యువకుడితోపాటు అతని స్నేహితులు పనిచేసేందుకు రూ.లక్ష పారితోషికం మాట్లాడుకున్నట్లు తెలిపారు. అయితే ఎన్నికల్లో అతను.. లేదంటే ఓ జాతీయ పార్టీ ప్రతినిధి గెలుస్తారని.. మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పుకొచ్చాడని పేర్కొన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత డబ్బులు ఇవ్వమంటే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సదరు యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనపైనే కేసు పెడతామని బెదిరించినట్లు వాపోయాడు. చేసిన పనికి డబ్బులు రాక తనతోపాటు స్నేహితులు కూడా ఇబ్బందుల పడుతున్నారని పేర్కొన్నాడు. ఎమ్మెల్యేగా పోటీచేసిన సదరు అభ్యర్థి, అతని సడ్డకుడు, పద్మశాలి వర్గానికి చెందిన మరో నాయకుడు కలిసి మోసం చేశారని, తన ఆత్మహత్యకు వారే కారణం అంటూ ఆ నోట్ రాసుకొచ్చాడు. ఈ విషయంపై సిరిసిల్ల పోలీసులు విచారణ చేపడుతున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం! -
‘ఖద్దరు గుండె’ల్లో కలవరం!
సాక్షి, కామారెడ్డి: పదవుల మీద వ్యామోహంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన వాళ్లలో చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో బీపీ, షుగర్ వంటి సమస్యలతో సతమతమవుతూ హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లకు గురవుతున్నారు. అలాంటి వారిలో కొందరు సమయానికి వైద్యం అంది ప్రాణాలతో బయట పడుతుండగా, మరికొందరు తనువు చాలిస్తున్నారు. కాలం కలిసిరాక పదవులు దరిచేరలేదనే వేదనకు గురై కొందరు, దర్పం కోసం అడ్డగోలు ఖర్చులు చేసి అప్పులపాలై అవస్థలు పడి మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా మంది నాయకులు, ప్రజాప్రతినిధులు బీపీ, షుగర్ లెవల్స్ పెరిగిపోయి హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లకు గురవుతున్నారు. ఒక్కోసారి తీవ్ర ఒత్తిడితో గుండెనాళాల్లో రక్తప్రసరణ నిలిచిపోయి, బ్రెయిన్లో నరాలు చిట్లిపోయి సకాలంలో వైద్యం అందక ప్రాణా లు కోల్పోతున్నారు. రాజకీయంగా ఎదిగినవారే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. మెజారిటీ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో బీపీ, షుగర్ సమస్య కామన్గా కనబడుతోంది. ట్యాబె ట్స్ వాడేవాళ్లు కొందరైతే, ఇన్సులిన్ తీసుకుంటున్నవారూ కొందరున్నారు. బీపీ, షుగర్ను కంట్రోల్ చేసుకునేందుకు కొందరు నాయకులు, ప్రజాప్రతినిధులు నిత్యం వ్యాయామం, యోగా చేస్తుండగా, ఇంకొందరు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ఏదైనా సమ స్య ఎదురైనపుడు తీవ్ర ఒత్తిడికి గురై హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చి తనువు చాలిస్తున్నారు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఈగ గంగారెడ్డి తనకు ఏదైనా నామినేటె డ్ పదవి వస్తుందేమోనని ఆశపడ్డారు. ఏదీ దక్కలే దు. నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవ డంతో మానసిక వేదనతో పక్షవాతానికి గురై ఆస్ప త్రిపాలయ్యారు. అదృష్టం కొద్దీ బయటపడినా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోయారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి జెడ్పీటీసీ మిన్కూ రి రాంరెడ్డికి ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత జెడ్పీ వైస్ చైర్మన్ పదవి రావాలి. కానీ పదవి రాకపోవడంతో ఆయన మనోవేదనకు గురవగా, గుండె నాళాలు బ్లాక్ అయ్యాయి. సమయానికి ఆ స్పత్రికి వెళ్లడంతో స్టంట్లు వేశారు. దీంతో కోలుకున్నాడు. భిక్కనూరు జెడ్పీటీ సీ సభ్యురాలి భర్త, మాజీ స ర్పంచ్ నాగభూషణంగౌడ్ ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్తో పక్షవాతానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భిక్కనూరులో మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న హన్మంత్రెడ్డి ఇటీవల కిడ్నీ సమస్యతో ఆస్పత్రిపాలై చికిత్స పొందుతున్నారు.భిక్కనూరు మార్కెట్ కమిటీ మా జీ చైర్మన్ బాణాల అమృతరెడ్డి కిడ్నీలు దెబ్బతినడంతో ఆయన భార్య కిడ్నీ ఇవ్వగా కోలుకున్నారు. ఇక్కడే మార్కెట్ చైర్మన్గా పనిచేసిన చిట్టెడి భగవంతరెడ్డి రెండున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో తిరిగి ఆర్థికంగా చితికిపోయి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారెందరో.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలువురు నాయకులు హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్లతో ప్రాణాలు కోల్పోయారు. కామారెడ్డి జిల్లాలో అయితే గ్రామ, మండల స్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు గా పనిచేసిన వాళ్లు పలువురు ప్రాణాలు కో ల్పోయారు. గాంధారి మండలం గౌరారం సర్పంచ్గా పనిచేసిన మహేందర్ రెండేళ్ల కింద గుండెపోటుతో చనిపోయాడు. ఇటీవల జనగామ జిల్లా పరిషత్ చైర్మన్ సంపత్రెడ్డి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కొంత కా లం కిందటే ములుగు జెడ్పీ చైర్మన్ జగదీశ్ గుండెపోటుతో చనిపోయారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్గా పనిచేసిన పాలమూరు జిల్లాకు చెందిన గాయకుడు సాయిచంద్ ఇటీవల గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఒత్తిడిని అధిగమిస్తేనే.. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లలో కొందరు అవకాశాలు అందింపుచ్చుకుని తక్కువ కాలంలో ఎదుగుతున్నారు. వాళ్లను చూసి తాము కూడా స్థాయికి మించిన ఆలోచనలు చేస్తున్నారు. కొందరు దశాబ్దాలు కష్టపడినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు. అలాగని అందరిదీ అదే పరిస్థితి అని కాదు. కానీ కొందరు ఒక్కసారిగా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆరాటంతో అడ్డగోలుగా ఖర్చు చేసి అప్పుల పాలవుతున్నారు. తాము పెట్టుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఆందోళనకు గురై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. అత్యాశకు పోకుండా, స్థాయికి మించి ఆలోచనలు చేయకుండా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్, యోగా, వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పలువురు సూచిస్తున్నారు. -
ఎన్నికల గ్యారంటీలు ‘జుమ్లా’లేనా?
దేశంలోని దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు తరచుగా చెప్పే మాట తమకు అధికారం ఇస్తే ప్రజలను సాధికారులుగా చేస్తాం అన్నది. అసలు సాధికారత (ఎంప వర్మెంట్) అంటే అర్థం ఏమిటి? దీనికి విస్తృతమైన అర్థాలు ఉన్నాయి. ముందుగా శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి లేదా అతని కుటుంబాన్ని బలోపేతం చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాన్ని సామాజికంగా బలోపేతం చేయడం అన్నది సాధికారతలో ఓ భాగం. కుటుంబాన్ని బలోపేతం చేయడ మనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ప్రతిరోజూ బలవర్ధకమైన ఆహారాన్ని వ్యక్తికి లేదా అతని కుటుంబానికి అందించాలి. వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూడాలి. అలా ఎంతకాలం చేయాలి? జీవితకాలంపాటు ఈ ప్రక్రియ కొనసాగాలి. కానీ, ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉండేది ఐదేళ్లపాటు మాత్రమే. ఐదేళ్లు ఉండే ప్రభుత్వం ఏ వ్యక్తినైనా, కుటుంబా న్నైనా, వర్గాన్నైనా జీవితకాలం పాటు పోషించలేదు కదా? అటువంటప్పుడు వారు సాధికారులు ఎలా అవుతారు?! ఆధునిక చైనా పితామహుడిగా చెప్పుకొనే డెంగ్ జియావో పింగ్ దీనినే ఓ ఉదాహరణ ద్వారా వివరించారు. ఆకలి గొన్న వ్యక్తికి రోజూ ఓ చేప చొప్పున ఇస్తూపోతే... అది ఇచ్చినంత కాలమే అతని ఆకలి తీరుతుంది. అదే అతనికి చేపలు పట్టే విద్య నేర్పించి, ఓ వలను ఇవ్వగలిగితే అతడు తన జీవితకాలం తన పొట్టను తానే పోషించుకొంటాడు. పైగా తన కుటుంబాన్ని సైతం ఆదుకోగలుగుతాడు. ప్రభు త్వాలు ప్రజలకు సంక్షేమం ఎలా ఇవ్వాలో సూక్ష్మంగా చెప్పాడు డెంగ్ ఈ ఉదాహరణ ద్వారా. ఇదే సిద్ధాంతాన్ని నమ్మి ఆచరణలో పెట్టడం ద్వారానే డెంగ్ తన పాలనలో చైనాను ప్రపంచంలో ఓ బలమైన ఆర్థిక శక్తిగా రూపొందించగలిగాడు. ప్రజల సమస్త వ్యక్తిగత, సామాజిక అవసరాలన్నింటినీ తామే తీర్చగలమన్న భ్రమల్ని వారిలో కల్పిస్తూ కొన్ని రాజకీయ పార్టీలు పబ్బం గడుపుకొంటున్నాయి. ఓట్ల కోసం హామీలు గుప్పించడం రాజకీయ పార్టీలకు రివాజుగా మారింది. అది ఇటీవలి కాలంలో మరింత వెర్రితలలు వేస్తోంది. వ్యవసాయరంగం మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణ; విద్య, వైద్యం వంటివి సామాన్యులకు అందుబాటులోకి తేవడం, శాంతి భద్రత లను పటిష్టపర్చి పారిశ్రామిక పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా నిరుద్యోగాన్ని పారద్రోలడం వంటి చర్యలు ఏ ప్రభుత్వానికైనా ప్రాధాన్యం కావాలి. మహిళలు, బాలలు, వృద్ధులకు తగిన సామాజిక సంరక్షణ కల్పించడం ప్రభు త్వాల బాధ్యత. వీటిపైన దృష్టి పెట్టగలిగితే ప్రజలను సాధికారుల్ని చేసినట్లే. భారతదేశం నిద్రపోతున్న ఓ ఆర్థిక దిగ్గజం (స్లీపింగ్ జెయింట్) అని 70వ దశకంలోనే నాటి సింగపూర్ అధ్యక్షుడు ‘లీ కువాన్ యు’ అన్నారు. 1991లో పీవీ నర సింహారావు దేశ ప్రధాని అయిన తర్వాత గానీ దేశానికి పట్టిన స్తబ్ధత వదలలేదు. దశాబ్దాలపాటు పట్టి పీడించిన కొన్ని జాడ్యాలను వదిలించుకొని ఆర్థిక వ్యవస్థ వడి వడిగా అడుగులు వేస్తూ... పీవీ – డా‘‘ మన్మోహన్ సింగ్ల ద్వయం చూపిన సంస్కరణల బాటలో ముందుకు సాగిన ప్రస్థానానికి దాదాపు 3 దశాబ్దాల వయస్సు. ఈ కాలంలో దేశం చాలా రంగాలలో అభివృద్ధి చెందిన మాట నిజం. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతున్నది అన్నది కూడా ఓ వాస్తవం. అయితే, ఈ ప్రస్థానం ఏ దిశగా సాగుతోంది? దేశంలోని సహజ వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా చెందాలన్న రాజ్యాంగ లక్ష్యాలకు, రాజ్యాంగ నిర్మాత డా‘‘ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు భిన్నంగా దేశ సంపద కొంత మంది పారిశ్రామిక వేత్తలకు దఖలు పడింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారత్కు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు మొదటి వరుసలో ఉండగా, మరో 10 మంది రెండో వరుసలో కనిపిస్తారు. అదే సమయంలో... ప్రపంచ ఆకలి సూచీలో 180 దేశాల జాబితాలో ఇండియా 165 –170 స్థానాల మధ్య ఊగిసలాడుతోంది. మనకంటే పొరుగునున్న ఆసియా దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్ ఆకలి సూచీలో మెరుగైన స్థానంలో ఉన్నాయి. ఆర్థిక దిగ్గజమైన భారత్కు ఇంతకంటే అవమానం మరొకటి ఉంటుందా? ఈ 3 దశాబ్దాలలో దేశ సంపద బాగా పెరిగింది. దేశ స్థూల ఉత్పత్తి 40 లక్షల కోట్లు దాటింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక అంతరాలు విపరీతంగా పెరిగిపోయినట్లు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. దేశంలో పేదలు మరింత పేదలయ్యారు. సంపన్నులు పైపైకి ఎగబాకుతున్నారు. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన సోషలిజం స్థానంలో చాలాకాలంగా ‘పాపులిజం’ వచ్చి చేరింది. ‘అన్ని వర్గాలకూ అన్నీ’ అన్నదే పాపులిజం మూల సూత్రం. ఓట్లు రాల్చే ఈ ‘ఇజం’ చుట్టూనే నేటి రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. ఈ పాపులిజం ఇటీవలి కాలంలో వెర్రితలలు వేయడమే నేటి విషాదం! దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు ‘జాకబ్ జుమా’ పాపులిస్ట్గా మారి దేశాన్ని అప్పుల ఊబిలో నెట్టివేశారు. ఆ దేశ జీడిపీలో అప్పుల నిష్పత్తి 50 శాతం దాటిన నేపథ్యంలో... సొంత పార్టీ వారే ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి పదవి నుంచి దించి వేశారు. ‘జాకబ్ జుమా’ ఉదంతం ప్రపంచంలో అనేక దేశాలకు గుణపాఠం నేర్పింది. మొత్తం జీడీపీలో అప్పుల శాతం 24 శాతం మించరాదనీ, అదికూడా వృద్ధిరేటు 7 శాతం దాటినప్పుడే అది ఆమోదయోగ్యం కాగలదనీ ప్రముఖ ఆర్థికవేత్తలు నిగ్గు తేల్చారు. అయితే, భారత్లో కొన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి లెక్కల్ని పరిగణనలోకి తీసుకోవడం లేదు. అధికారం కోసం మొదట కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు, ఇతర హామీల విలువ కనీసం రెండు రాష్ట్రాల బడ్జెట్తో సమానం. ఇవి నెరవేర్చాలంటే ప్రజలపై అధికంగా పన్నులు వేయాలి, ఎఫ్.ఆర్.బి.ఎం.ను మించి అప్పులు తేవాలి. అవీ చాలక పోతే ప్రభుత్వ భూములు అమ్మాలి. ఇప్పటికే విలువైన ప్రభుత్వ భూములు చాలావరకు వేలంలో పోయాయి. భవి ష్యత్ అవసరాలకోసం తిరిగి భూములు కొనాల్సిన దుఃస్థితి ఇకపై రావొచ్చు. ఇక ఎటొచ్చీ, కొన్ని పథకాలను అమలు చేయకుండా మంగళం పాడొచ్చు. అలాగే ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారంటీలను సైతం ఎత్తివేయవచ్చు. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడమే ఎడాపెడా హామీలు ప్రకటించడానికి కారణం అవుతోంది. మన దేశంలో రాజకీయ పార్టీల హామీల అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకో వడానికి నిరాకరిస్తున్నాయి. అందువల్ల ఆకాశమే హద్దుగా కొన్ని రాజకీయ పార్టీలు హామీల సునామీ సృష్టిస్తున్నాయి. 2014లో బీజేపీ తన మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అందిస్తామని చెప్పింది. విదేశాల్లో పోగుపడిన నల్ల ధనాన్ని వెనక్కి రప్పించి అందరి ఖాతాల్లో 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామని బీజేపీ అగ్రనేతలు నమ్మకంగా చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ హామీల సంగతేమిటని కేంద్రమంతి ‘అమిత్ షా’ను నిలదీస్తే, అవన్నీ ‘ఎన్నికల జుమ్లా’ అని ఆయన ఒక్క మాటతో తేల్చేశారు. అంటే, ఎన్నికల సందర్భంలో ఎన్నో గాలి వాగ్దానాలు చేస్తుంటాం. వాటిని మీరు సీరియస్గా తీసుకొంటే ఎలా? అనే అర్థంలో కొందరు రాజకీయ నాయకులు అంటున్నారు. ప్రజలు ఈ ‘జుమ్లా’ మాటలు నమ్మడం లేదనే కారణంగానే ఇపుడు గ్యారెంటీలు ఇస్తున్నారు. సదరు గ్యారెంటీలు అమలు జరుగుతాయన్న గ్యారెంటీ కూడా లేదు. ఇదొక చేదు వాస్తవం. వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు -
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు!
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు! -
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!!
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!! -
అమ్మ నుంచి చాలా నేర్చుకున్నా
సాక్షి, హైదరాబాద్: అమ్మ నుంచి ఎంతో నేర్చు కున్నానని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు వెల్లడించారు. ఆది వారం బేగంపేట్లోని గ్రాండ్ కాకతీయ హోటల్లో ఫ్యూచర్ ఫార్వార్డ్ తెలంగాణలో భాగంగా ‘విమెన్ ఆస్క్ కేటీఆర్’ ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉండటంతో తన తండ్రితో తక్కువ సమయం గడిపానన్నారు. ‘మా అమ్మని చూసి చాలా నేర్చుకున్నా. నా భార్య కూడా చాలా ఓపికగా ఉంటుంది. నా చెల్లి కవిత చాలా డైనమిక్. మా కుటుంబంలోనే తనంత ధైర్యవంతులు లేరు. నా కూతురు ఇంత చిన్న వయసులోనే చాలా బాగా ఆలోచిస్తుంది. కూతురు పుట్టాక నా జీవితం చాలా మారింది’అని వివరించారు. మహిళలు మానసికంగా చాలా బలవంతులు.. హైదరాబాద్ నుంచి వచ్చిన క్రీడాకారుల్లో ఎక్కువ మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. కోవిడ్ సమయంలో సుచిత్రా ఎల్లా, మహిమా దాట్ల వంటివారు ఆదర్శంగా నిలిచారని చెప్పారు. మహిళలు మానసికంగా చాలా బలంగా వుంటారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతీ ఇంటికి మంచినీళ్లు అందించామని, మైనారిటీ పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు ప్రారంభించామని చెప్పారు. ప్రతి చిన్నారిపై రూ.10 వేలకు పైగా ఖర్చు చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు 61 శాతానికి పెరిగాయని తెలిపారు. స్త్రీనిధి కింద స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. తెలంగాణ, ఏపీలో మహిళలు స్త్రీనిధి రుణాలను 99 శాతం తిరిగి చెల్లిస్తున్నారని చెప్పారు. తాము మేనిఫెస్టోలో మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల్లో కొన్నింటిని పూర్తి చేశామని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని తెలిపారు. మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, కల్యాణ లక్ష్మి, అమ్మఒడి వంటి సేవలను తెచ్చామని వివరించారు. నెగెటివ్బ్లడ్ గ్రూప్ ఉన్న మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేటీఆర్ చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు చాలా తక్కువ వడ్డీతో రుణాలిస్తామన్నారు. డీప్ ఫేక్తో రాజకీయ నేతలకూ ప్రమాదమే.. కాగా, డీప్ ఫేక్.. మహిళలకు మాత్రమే కాదు.. రాజకీయ నేతలకు సైతం ప్రమాదమేనని చెప్పారు. తమ ప్రత్యర్థులు డీప్ ఫేక్ వాడి దుష్ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఒక్కోసారి టాక్సిక్గా తయారవుతోందని, ప్రతిపక్షాలు సోషల్ మీడియాని వాడుకుని తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. మాట్లాడే హక్కుని ఎదుటివారిని దూషించడానికి వాడకూడదని స్పష్టంచేశారు. మహిళకు సంబంధించిన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామని చెప్పారు. ప్రతి పక్షాలకు కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని తెలుసని, కానీ వాళ్లు నటిస్తున్నారని అన్నారు. విద్యావంతులైన మహిళలు రాజకీయంగా కూడా అడుగులు వేయాలని కేటీఆర్ సూచించారు. -
పొలిటికల్ నేతలపై క్రిమినల్ కేసులు.. సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని(క్రిమినల్ కేసులకు సంబంధించి) కోరుతూ వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను సుప్రీంకోర్టు.. హైకోర్టులకు అప్పగించింది. వివరాల ప్రకారం.. దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించే విషయంలో, ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది. ఇదే సమయంలో అటువంటి కేసులను సమర్థవంతంగా పర్యవేక్షించడానికి చర్యలు తీసుకునే బాధ్యతను హైకోర్టులకు అప్పగించింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న కేసులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బెంచ్ను ఏర్పాటు చేయాలని, ఈ కేసులను ఏడాదిలోగా పరిష్కరించేలా చూడాలని అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్, న్యాయవాది అశ్విన్ ఉపాధ్యాయ్ తెలిపారు. Supreme Court issues directions for speedy disposal of criminal cases against MP/MLAs. Supreme Court says it would be difficult for it to form a uniform guideline for trial courts relating to speedy disposal of cases against MP/MLAs. Supreme Court asks High Courts to register a… pic.twitter.com/O2izpfV3Nl— ANI (@ANI) November 9, 2023 సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవే.. ►ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారాన్ని పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలి. ►కేసులు త్వరగా పరిష్కరించడాన్ని, పర్యవేక్షించడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తప్పనిసరిగా ప్రత్యేక టైటిల్ ఏర్పాటు చేయాలి ►అవసరాన్ని బట్టి ప్రత్యేక బెంచ్ క్రమ వ్యవధిలో కేసులు లిస్ట్ చేయాలి ►కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు హైకోర్టు తగిన ఆదేశాలు ఇవ్వాలి. VIDEO | "Today, the Supreme Court has given a historic verdict. The Supreme Court judgment has come with regard to our first prayer. The court has directed all the high courts to constitute a special bench to monitor cases of MPs, MLAs and ensure that these cases are decided… pic.twitter.com/WgcLerxIoR— Press Trust of India (@PTI_News) November 9, 2023 -
కేసీఆర్ని మట్టికరిపించిన ఏకైక నేత
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను తొలినాళ్లలో ఎన్నికల్లో ఓ నేత మట్టికరిపించారు. 1983లో కేసీఆర్ టీడీపీ నుంచి పోటీ చేయగా, ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి అనుంతుల మదన్ మోహన్ పోటీ చేశారు. నాటి ఎన్నికల్లో మదన్ మోహన్ కేసీఆర్పై 887 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కేసీఆర్కు ఇదే మొదటి ఓటమి కావడం విశేషం. ఆ తర్వాత కేసీఆర్ 13 సార్లు వరుసగా విజయం సాధించారు. ఇందులో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తే, ఐదుసార్లు ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు కేసీఆర్. కాగా తనను ఓడించిన మదన్ మోహన్ను కేసీఆర్ 1989, 1994లలో వరుసగా ఓడించారు. కొంతకాలానికి రాజకీయాలకు దూరమైన మదన్ మోహన్ 2004లో కన్నుమూశారు. -
పరమ పదవి సోపానం
మేకల కళ్యాణ్ చక్రవర్తి : ఎవరికి ఏం రాసిపెట్టి ఉంటుందో ఎవరికి తెలుసు అంటారు పెద్దలు. రాజకీయాల్లో అయితే ఈ నానుడి సరిగ్గా సరిపోతుంది. ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు ఎప్పుడు ఎలాంటి పదవులు చేపడతారో, ఏ హోదాలో ప్రజల సేవకు అంకితమవుతారో ఊహించలేని పరిస్థితి. వారికి దేశ ప్రధాని మొదలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్లుగా, శాసనమండలి చైర్మన్లుగా, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా వివిధ హోదాల్లో పనిచేసే అవకాశం దక్కుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో ఏది దక్కినా రాజకీయ నాయకుడిగా విజయవంతమైనట్టే. ఇక మంత్రి హోదాలు అదనం. ఇలాంటి రాజకీయ నేతల జాబితా తెలంగాణలో చాంతాడు కంటే పొడవుగానే ఉందని చరిత్రను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. పీవీది ప్రత్యేక స్థానం రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న పీవీ నర్సింహారావు దేశంలో అత్యున్నత రాజకీయ పదవులు అనుభవించారు. తన రాజకీయ భవిష్యత్తుకు పునాది వేసిన మంథని నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పీవీ.. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహా్మనందరెడ్డి కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్ర మంత్రిగా, ప్రధాన మంత్రిగా కూడా పనిచేసిన ఘనత దక్కించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని హనుమకొండ, నంద్యాలతోపాటు మహారాష్ట్రలోని రాంటెక్, ఒడిశాలోని బరంపురం లోక్సభ స్థానాల నుంచీ పీవీ గెలుపొందారు. ఇక, ఆ తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా పలు హోదాల్లో రాష్ట్ర, దేశ ప్రజలకు సేవచేసిన జాబితాలో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయన కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్ ఎంపీగా, సిద్ధిపేట, గజ్వేల్ ఎమ్మెల్యేగా, కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో మంత్రిగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన ఆయన రెండోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్నారు. జాబితా చాలా పెద్దదే.. పలు చట్టసభల్లోకి ప్రవేశించిన నేతల్లో తెలంగాణకు చెందిన చాలా మంది ఉన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో చురుగ్గా ఉన్నవారిని ఒక్కసారి పరిశీలిస్తే కిషన్రెడ్డి (ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర కేబినెట్ మంత్రి), ధర్మపురి శ్రీనివాస్ (ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి), సురేశ్òÙట్కార్ (జహీరాబాద్ ఎంపీ, నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే), సత్యవతి రాథోడ్ (డోర్నకల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి), మాలోతు కవిత (మహబూబాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీ)లు పలు పదవుల్లో పనిచేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత నిజామాబాద్ ఎంపీతోపాటు అదే జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచారు. సోయం బాపూరావు, గెడం నగేశ్, రమేశ్ రాథోడ్లు కూడా ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే, ఎంపీగా గెలుపొందారు. గుత్తా సుఖేందర్రెడ్డి (మిర్యాలగూడ ఎంపీ, ఎమ్మెల్సీ, శాసనమండలి చైర్మన్గా), అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా, పాతబస్తీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తమ్మినేని వీరభద్రం (ఎంపీ, ఎమ్మెల్యే) పువ్వాడ నాగేశ్వరరావు (ఎంపీ, ఎమ్మెల్సీ), భట్టి విక్రమార్క (ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే), టి. జీవన్రెడ్డి (జగిత్యాల ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా), కె.ఆర్.సురేశ్రెడ్డి (ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్, రాజ్యసభ ఎంపీ), షబ్బీర్అలీ (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి), బాలాగౌడ్ (నిజామాబాద్ ఎంపీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్), ఆకుల లలిత (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ), జువ్వాది చొక్కారావు (ఎమ్మెల్యే, ఎంపీ), చెన్నమనేని విద్యాసాగర్రావు (ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి), కెప్టెన్ లక్ష్మీకాంతరావు (ఎమ్మెల్యే, ఎంపీ), బాగారెడ్డి (ఎమ్మెల్యే, ఎంపీ, రాష్ట్రమంత్రి), సోలిపేట రాంచంద్రారెడ్డి (ఎమ్మెల్యే, రాజ్యసభ ఎంపీ), దేవేందర్గౌడ్ (ఎమ్మెల్యే, మంత్రి, రాజ్యసభ ఎంపీ), పట్నం మహేందర్రెడ్డి (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి), డాక్టర్ కె.లక్ష్మణ్ (ఎంపీ, ఎమ్మెల్యే), వి.హనుమంతరావు (ఎమ్మెల్యే, ఎంపీ), సలావుద్దీన్ ఒవైసీ (ఎంపీ, ఎమ్మెల్యే), మల్లురవి (ఎంపీ, ఎమ్మెల్యే)లు కూడా పలు హోదాల్లో రాజకీయాల్లో సేవలందించారు. గత చరిత్రను తరచిచూస్తే జి.వెంకటస్వామి ఒకసారి ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా గెలుపొందారు. కాంగ్రెస్ నేత చకిలం శ్రీనివాసరావు, పాల్వాయి గోవర్ధన్రెడ్డి, కమ్యూనిస్టు దిగ్గజాలు భీంరెడ్డి నర్సింహారెడ్డి, ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి,లు కూడా ఎమ్మెల్యే, ఎంపీలుగా పనిచేశారు. మూడు, నాలుగు హోదాల్లో.. రాష్ట్ర స్థాయిలోని ఉభయసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కొందరు దక్కించుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక సభ, దేశ స్థాయిలో మరో సభలోకి ప్రవేశించారు మరికొందరు. రాష్ట్రస్థాయిలోని రెండు సభలు, జాతీయ స్థాయిలోని మరో సభలో అడుగుపెట్టారు ఇంకొందరు. కడియం శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, రేవంత్రెడ్డి, ఎల్.రమణలు మూడు సభల్లో (అసెంబ్లీ, శాసన మండలి, పార్లమెంట్) ప్రవేశించిన అదృష్టజాతకులుగా నిలిచిపోతారు. కడియం, ఎల్.రమణ రాష్ట్ర మంత్రిగానూ పనిచేశారు. ఇక, ఎమ్మెల్యే, ఎంపీ కేటగిరీలో ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న పలువురు నాయకులు మంత్రి హోదాలో కూడా పనిచేశారు. మల్లారెడ్డి (మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీ, రాష్ట్రమంత్రి), కోమటిరెడ్డి వెంకట్రెడ్డి (నల్లగొండ ఎమ్మెల్యే, భువనగిరి ఎంపీ, మంత్రి), ఉత్తమ్కుమార్రెడ్డి (కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యే, నల్లగొండ ఎంపీ, మంత్రి), ఎర్రబెల్లి దయాకర్రావు (పాలకుర్తి, వర్ధన్నపేట ఎమ్మెల్యే, వరంగల్ ఎంపీ, మంత్రి), ఎన్. ఇంద్రకరణ్రెడ్డి (ఆదిలాబాద్ ఎంపీ, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి), వేణుగోపాలాచారి (ఆదిలాబాద్ ఎంపీ, నిర్మల్ ఎమ్మెల్యే, మంత్రి)లు ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. -
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా!
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా! -
ఆ లీడర్లను నమ్మొద్దు.. ఏపీ పాలిటిక్స్పై పూనమ్ కౌర్ సంచలన ట్వీట్
నటి పూనమ్ కౌర్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. నటిగా కంటే కూడా సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పలు వ్యాఖ్యలతో ఎక్కువగా పాపులర్ అయ్యారు. సమాజంలో జరిగే సంఘటనలు, రాజకీయ వ్యవహరాలపై స్పందిస్తూ ఆమె చేసే వ్యాఖ్యలు ఒక్కోసారి భారీగానే దుమారం రేపుతూ ఉంటాయి. వాటి వల్ల ఆమె కూడా ట్రోలింగ్కు కూడా గురవుతుంటారు కూడా.. తాజాగా పూనమ్ ఏపీ పాలిటిక్స్పై ఇలా ట్వీట్ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. (ఇదీ చదవండి: లిప్లాక్,బోల్డ్ సీన్స్పై మా ఇంట్లో ఏమన్నారంటే: బేబీ హీరోయిన్) ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య కొందరు ఫేక్ లీడర్లు మహిళల మీద ఎక్కడా లేని అభిమానాన్ని చూపుతూ రోడ్లపైకి వస్తున్నారు. అలాంటి వాళ్లను నమ్మోద్దు. మహిళలకు ఎదో జరిగిపోతుందని వారికి అంతగా అందోళన ఉంటే ఢిల్లీలో రెజ్లర్లు చాలా రోజుల పాటు నిరసన దీక్ష చేశారు. కనీసం వారికి అనుకూలంగా ఒక్కమాటైనా వీరు మాట్లడలేకపోయారే. వాళ్ల సొంత ప్రయోజనాల కోసం మాత్రమే ఏపీలో ఈ నకిలీ లీడర్లు ఎక్కడా లేని ప్రేమను కురిపిస్తున్నారు. ఇలాంటి లీడర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అంటూ నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆమె ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి చేశారనేది పేరు మాత్రం తెలుపలేదు. కానీ ఆమె ట్వీట్ కింద కొందరు బూతు పదాలతో పలు కామెంట్లు చేస్తున్నారు. మా నాయకుడు పవన్ కల్యాణ్ను అంటున్నావ్ కదా అంటూ.. కొందరు జనసేన, పవన్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బూతు పదాలతో రెచ్చిపోతున్నారు. కొందరైతే ఏకంగా రాయలేని భాష ఉపయోగిస్తూ ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఇంకోసారి ఇలాంటి కామెంట్లు పెడితే ఏం జరుగుతుందో కూడా ఊహించలేవంటూ పూనమ్కు వార్నింగ్ ఇస్తూ పవన్ ఫోటోను డీపీగా పెట్టుకుని వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో ఆమె ఇన్స్టాలో మరో ట్వీట్ చేశారు. 'మీరందరూ నా గురించి ఒకటి గుర్తుపెట్టుకోండి. నా పేరు 'కౌర్' అని మీరు మర్చిపోతున్నారు. సూమారుగా 5 ఏళ్లు అవుతుంది. కొంచెం ఆలోచించండి.' అని పోస్ట్ చేశారు. The people who are shouting at the top of their voice about women issues , as if they are highly concerned are the one who did not speak a word for #Wrestlers , beware of fake leaders who concern when it’s to their benefit and convenience.#AndhraPradesh — पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) July 16, 2023 -
టీడీపీ నేతలకు కొత్త టెన్షన్.. రూటు మార్చిన పచ్చ పార్టీ లీడర్లు!
అభివృద్ధి అనేది టీడీపీ ఎజెండాలో లేని విషయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనుల్ని అడ్డుకోవడమే పచ్చ పార్టీ నేతల పని. అన్ని ఆటంకాలు అధిగమించి పనులు సాగుతుంటే మాత్రం ఆ ఘనత తమదే అని డప్పు కొట్టుకోవడంలో కూడా టీడీపీ నేతలు ముందుంటారు. అనంతపురం జిల్లాలోని ఒక టీడీపీ నేత డప్పు ఎలా కొట్టుకుంటున్నారంటే.. అనంతపురం అర్బన్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ ఛైర్మన్ వైకుంఠం ప్రభాకర చౌదరి అభివృద్ధి అంటే నేనే అని డప్పు కొట్టుకోవడంలో ఆరితేరిపోయారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ తరపున జేసీ దివాకరరెడ్డి ఎంపీగా, ప్రభాకర చౌదరి టౌన్ ఎమ్మెల్యేగా కొనసాగారు. అనంతపురం టౌన్లో ఏ పని చేయాలన్నా ఇద్దరి మధ్యా ఏకాభిప్రాయం కుదిరేది కాదు. పట్టణంలో ఏ పనీ చేయకుండా, ఇద్దరు గొడవ పడటంతోనే ఐదేళ్ళు ముగిసిపోయింది. అందుకే టీడీపీ పాలనలో అనంతపురం పట్టణం అభివృద్ధి జరగకపోగా.. మరింత వెనుకపడిపోయింది. గత ఎన్నికల్లో ప్రభాకరచౌదరి మీద విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక నగరం అభివృద్ధి పథంలో సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అనంతపురం నగర అభివృద్ధికి ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అనంతపురం అభివృద్ధికి 650 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కేంద్రంతో మాట్లాడి అనంతపురం నగరం మీదుగా ఓ జాతీయ రహదారిని మంజూరు చేయించారు. అనంతపురం నగరంలో కొత్త ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. హైవే పనులు కూడా 80 శాతం పూర్తి కావటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరం అభివృద్ధి అంతా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్ళడం టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి నచ్చడంలేదు. ఇలాగే సాగితే నగరంలో పచ్చ పార్టీకి ఉనికి ఉండదని భయపడి.. అభివృద్ధిని వక్రీకరించడం ప్రారంభించారు. అనంతపురం నగరంలో నిర్మాణమవుతున్న 42, 44 జాతీయ రహదారుల లింక్ హైవే టీడీపీ హయాంలోనే మంజూరు అయిందని.. పనులు ప్రారంభం అయ్యే లోగా ప్రభుత్వం మారిపోయిందంటూ ప్రభాకర్ చౌదరి గోబెల్స్ ప్రచారం ప్రారంభించారు. వాస్తవానికి జాతీయ రహదారిగా ఉన్న అనంతపురం సుభాష్ రోడ్డును స్టేట్ హైవేగా మారుస్తూ టీడీపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం విక్రయాలకు నేషనల్ హైవే నిబంధనలు అడ్డురావటంతో నగర అభివృద్ధి గురించి ఆలోచించకుండా టీడీపీ నేతలు హైవే హోదానే తగ్గించేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రభాకర్ చౌదరి దీనికి ఏ మాత్రం అడ్డుచెప్పలేదు. మద్యం అమ్మకాల కోసం చంద్రబాబు అనంతపురం నగరంలోని జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చేశారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పును గుర్తించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. దీంతో అనంతపురం ప్రధాన రహదారిని తిరిగి నేషనల్ హైవే జాబితాలో చేర్చాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా కొత్తగా నాలుగు లేన్ల హైవే నిర్మించాలని.. అనంతపురం క్లాక్ టవర్ దగ్గరున్న పాత బ్రిడ్జి స్థానంలో కొత్త ఫ్లై ఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ నేపథ్యంలో 310 కోట్లతో జాతీయ రహదారి మంజూరు అయింది. హైవే పనులు జరక్కుండా అడుగడుగునా అడ్డు పడిన టీడీపీ నేతలు.. అభివృద్ధి పనులు చివరి దశకు చేరటంతో రూటు మార్చారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. పనులన్నీ పూర్తి అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ నామరూపాల్లేకుండా పోతుందన్న భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది. పచ్చ పార్టీ రాజకీయ డ్రామాలు నమ్మవద్దని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలకు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: టీడీపీలో సీటు కోసం నానాపాట్లు.. సీనియర్ నేతకు సర్దుబాటు అవుతుందా? -
తెగేసి చెబుతున్న తెలుగు తమ్ముళ్లు.. గోపాలపురం టీడీపీలో ఏం జరుగుతోంది?
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం టీడీపీలో వర్గపోరు భగ్గుమంటోంది. ఇన్చార్జ్గా ఉన్న నేతను తప్పించి మరొకరిని నియమించడంతో విభేదాలు తారాస్థాయికి చేరాయి. పై చేయి సాధించేందుకు రెండు వర్గాలు హోరా హోరీ తలపడుతున్నాయి. ఏ వర్గమూ బెట్టు వీడకపోవడంతో.. అంతంత మాత్రంగా ఉన్న కేడర్ రెండు వర్గాల మధ్య నలిగిపోతోంది. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని గోపాలపురం తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు కాక రేపుతోంది. నియోజకవర్గ పార్టీ ఇన్ ఛార్జ్ ని మార్చినప్పటి నుండి ఇక్కడ అసమ్మతి సెగలు రగులుతున్నాయి. గోపాలపురం ఇన్చార్జి గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పనితీరుపై విశ్వాసం కోల్పోయిన చంద్రబాబు ఆయన స్థానంలో మద్దిపాటి వెంకటరాజును నియమించారు. దీంతో గోపాలపురంలో ముప్పిడి, మద్దిపాటి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. కొత్త ఇంచార్జ్ మద్దిపాటి వెంకటరాజు తమను పట్టించుకోవడంలేదని, తనకు కావాల్సిన వారికే పదవులు ఇచ్చుకుంటున్నారని ముప్పిడి వర్గం మండిపడుతోంది. ఇన్ చార్జ్ గా మద్దిపాటిని తప్పించి మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావునే మళ్ళీ కొనసాగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమం రోజే దేవరపల్లిలో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. తాజాగా ద్వారకా తిరుమల మండలంలో కూడా మద్దిపాటికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. మద్దిపాటి వెంకట్రాజు తీరుపై నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. కొంత మంది బడా నాయకుల్ని వెంట బెట్టుకుని మద్దిపాటి రాజకీయం చేస్తున్నాడని, గ్రామాల్లో యువకులకు పెత్తనమిచ్చి, నాయకులను అసమర్థులుగా తయారుచేశాడని, కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడని సీనియర్లు మండిపడుతున్నారు. మంగళగిరి కార్యాలయంలో 200 మంది నాయకులు, కార్యకర్తలు మద్దిపాటి నాయకత్వాన్ని వ్యతిరేకించినా అర్ధరాత్రి 12 గంటలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అతడినే ఇన్చార్జిగా ప్రకటించడం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తామంతా పార్టీ కోసం కష్టపడుతున్నామని, డబ్బు తగలేసుకుని పార్టీని నిలబెట్టుకుంటున్నా విలువలేకుండా చూస్తున్నారంటూ వాపోతున్నారు. రాజమండ్రి మహానాడు పూర్తయినందున త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఇన్చార్జి విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు. పార్టీ కోసం శ్రమిస్తున్నవారిని పట్టించుకోవడంలేదని, ఇన్చార్జ్ నియామకం విషయంలో అందరికీ అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పార్టీ పరిస్తితిని అధిష్టానానికి తెలియచేద్దామని, తమ కష్టాన్ని పరిగణలోకి తీసుకోకపోతే అప్పుడే తగిన నిర్ణయం తీసుకుందామని మద్దిపాటి వెంకటరాజును వ్యతిరేకిస్తున్న వర్గం నిర్ణయించుకుంది. చంద్రబాబు నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గోపాలపురం తెలుగుతమ్ముళ్ళు తెగేసి చెబుతున్నారు. చదవండి: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్ -
‘గులాబీ’కి చికాకు తెప్పిస్తున్నారా?.. బీఆర్ఎస్ ప్లాన్ ఏంటి?
ఉమ్మడి నల్గొండ జిల్లాను మరోసారి స్వీప్ చేయడానికి బీఆర్ఎస్ నాయకత్వం వేస్తున్న ప్లాన్ ఏంటి? అధినేత ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు పొరపాట్లు సరిచేసుకుంటున్నారా? తప్పులు దిద్దుకోనివారి పరిస్థితి ఏంటి? టిక్కెట్ కోసం కొట్టుకుంటున్నవారిని ఎలా దారికి తెస్తారు? గులాబీ పార్టీకి చికాకు తెప్పిస్తున్న నియోజకవర్గం ఎక్కడుంది? అది కాంగ్రెస్కు కంచుకోట నల్గొండ జిల్లాను కాంగ్రెస్కు కంచుకోట అని చెబుతారు. ఇక్కడి నుంచి ఇద్దరు ఎంపీలు కూడా ప్రస్తుతం కాంగ్రెస్కు చెందినవారే ఉన్నారు. కాని ఒక్కరంటే ఒక్కరు కూడా హస్తం పార్టీ ఎమ్మెల్యే ఈ జిల్లాలో లేరు. జిల్లా మొత్తం గులాబీ పార్టీ ఎమ్మెల్యేలే. మునుగోడు గెలుచుకోవడం ద్వారా నల్గొండ జిల్లాను గులాబీ సేన క్లీన్ స్వీప్ చేసేసినట్లయింది. రానున్న ఎన్నికల్లో కూడా మొత్తం 12 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని జిల్లాలో తమదే తిరుగులేని ఆధిపత్యం అని చాటుకోవడానికి గులాబీ పార్టీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య పోరు పార్టీకి చికాకు తెప్పిస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం దేవరకొండలో నేతల మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. సిటింగ్ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్ మధ్య సీటు పోరు కొంతకాలంగా సాగుతోంది. పార్టీ ఫిరాయించి వచ్చిన రవీంద్రకుమార్కు కాకుండా తొలినుంచీ ఉద్యమంలో ఉన్న తనకు టిక్కెట్ ఇవ్వాలని మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన దేవేందర్ నాయక్ గట్టిగా పట్టుబడుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల సందర్భంగా ఇద్దరి మధ్య ఆధిపత్యపోరు మరోసారి బయట పడినట్లు తెలుస్తోంది. ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతన్న సమయంలోనే దేవేందర్ నాయక్ తన వర్గంతో కలిసి తీర్థయాత్రలకు వెళ్లారట. అప్పట్లో ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసమ్మతి వెనుక ఓ సీనియర్ నేత మరోవైపు నియోజకవర్గంలో ఏం జరుగుతుందో కేడర్కు కూడా అర్థంకాక తలలు పట్టుకున్నారట. ఇదే విషయం అధినేత దృష్టికి కూడా వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తీరు పట్ల నియోజకవర్గంలోని నేతలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీ గాని, ప్రభుత్వం కాని నిర్వహిస్తున్న కార్యక్రమాలకు తమకు కనీసం సమాచారం కూడా ఇవ్వడంలేదని గులాబీ పార్టీ నేతలు ఎమ్మెల్యే పట్ల గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే నేతలంతా ఒక వర్గంగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో రవీంద్ర కుమార్కు టికెట్ ఇస్తే సహకరించేది లేదని తేల్చి చెప్పేశారట. ఈ అసమ్మతి వెనుక జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. రవీంద్ర కుమార్ మాజీ గురువు అయిన ఆ నేత....తనను కాదని మరో పవర్ సెంటర్లో చేరిపోయిన తన మాజీ శిష్యుడిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న కసితో ఉన్నారనే ప్రచారం సైతం సాగుతోంది. ఆ సీనియర్ నేతకు దేవరకొండపై మంచి పట్టు ఉండటంతోపాటు తన వైరివర్గంలో చేరిన ఎమ్మెల్యేకు ఎలా అయినా చెక్ పెట్టాలని వ్యూహాలు పన్నుతున్నారట. ఇదే సమయంలో టికెట్ ఆశిస్తున్న దేవేందర్ నాయక్ను తన వైపు తిప్పుకున్నారట. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో దేవరకొండలో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ నాయకత్వానికి చికాకు కలిగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరు నేతల మధ్య టిక్కెట్ పోరు ఎక్కడికి దారితీస్తుందో అన్న ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. చదవండి: బెజవాడ రాజకీయాలు.. కేశినేని నాని దారెటు? -
డిఫరెంట్ లుక్స్లో టాప్ లీడర్స్: దిమ్మదిరిగే ఫోటోలు
-
చంద్రబాబు బ్యాచ్ అంటేనే ఇంత.. ఇవేం చీప్ ట్రిక్స్!
తెలుగుదేశం పార్టీకి ఇదేం ఖర్మో?. ఇదేం ఖర్మరా బాబూ అంటూ చంద్రబాబు నిర్వహిస్తున్న సభలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. పార్టీ అధినేతకే దిక్కు లేనపుడు నియోజకవర్గ స్థాయి నేతల పరిస్థితి ఎలా ఉంటుంది?. అనేక చోట్ల మాజీ మంత్రుల సభలకు జనం రావడంలేదని చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు. జనం లేని సభల గురించి దృష్టి మరల్చడానికి పచ్చ పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులు ఏంటి?.. రాష్ట్ర ప్రజల్ని ఆకర్షించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని పాట్లు పడుతున్నా.. వారిని ఎవరూ పట్టించుకోవడంలేదు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహిస్తున్న సభలకే జనం లేక దిగులు చెందుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక ప్రజల్ని రెచ్చగొడదామనే ఉద్దేశంతో ఇదేం ఖర్మరా బాబూ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులు ఎంత ప్రయత్నించినా ఏ సభా సక్సెస్ కావడంలేదు. చంద్రబాబు సభలకే దిక్కులేకపోతే.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా అదే తరహా సభలు నిర్వహిస్తూ ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలిస్తున్నారు. జనం లేరని చీప్ ట్రిక్స్కు పాల్పడుతున్నారు అయ్యన్న. అయ్యన్న ఎప్పుడు.. ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. సభల్లో మహిళలు ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా బహిరంగంగా బూతులు మాట్లాడతారు. అసందర్భంగా ముఖ్యమంత్రి జగన్పై నోటికొచ్చినట్లు మాట్లాడతారు. దీంతో అయ్యన్న సభలంటే ప్రజలకే కాదు.. టీడీపీ కార్యకర్తలకు కూడా విసుగు పడుతోంది. అయ్యన్న తీరుతో నర్సీపట్నం నియోజకవర్గంలో ఆయన నిర్వహించే ఇదేం ఖర్మ రా బాబు కార్యక్రమానికి స్పందన లేకుండా పోయింది. అయ్యన్న ప్రసంగించే సమయంలో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. తన సభలకు జనాలు రాకపోవడంతో వైయస్సార్సీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా.. చంద్రబాబు మాదిరిగానే అయ్యన్నపాత్రుడు కూడా వ్యవహరిస్తున్నారు. నాతవరం మండలంలో జరిగిన సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. ప్రజలే కాదు టీడీపీ కార్యకర్తలు కూడా ఈ సభను పట్టించుకోలేదు. వేదిక మీద తెలుగుదేశం పార్టీ నాయకులు తప్ప వేదిక కింద ఎవరూ లేరు. దీంతో టీడీపీ సభ వేదిక పైకి ఎవరో రాయి విసిరారంటూ నానా హంగామా సృష్టించారు. దమ్ము, ధైర్యం ఉంటే చూసుకుందాం రండి అంటూ సవాల్ చేశారు. వాస్తవానికి అయ్యన్న సభ వేదికపై ఎవరూ రాళ్లు విసరలేదు. ఒకవేళ ఎవరైనా రాయి విసిరితే టీడీపీ కార్యకర్తలు ఎందుకు సైలెంట్గా ఉన్నారు?. విసిరిన రాళ్ళను ఎందుకు చూపించలేదు?. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?. రాళ్ళు విసిరినవారిని ఎందుకు పట్టుకోలేదు?. నిజంగా రాళ్ళు విసిరి ఉంటే ఎల్లో మీడియా ఊరుకుంటుందా?. రాళ్ళు విసిరితే సభ వేదికపై టీడీపీ నేతలు తాపీగా జీడిపప్పు తింటూ కూర్చుంటారా?. ఈ ప్రశ్నలకు టీడీపీ నేతల నుంచి సమాధానం లేదు. టీడీపీ నేతల సభలకు జనాలు రాకపోవడం వల్లనే ఇటువంటి నీతిమాలిన రాజకీయాలకు దిగుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో చంద్రబాబు ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తుంటే.. నియోజకవర్గాల్లో అయ్యన్న లాంటి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా టీడీపీ నేతలు ఇటువంటి సిగ్గుమాలిన రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది మోదీ కాదు’ -
రాజకీయాల్లో సినిమావాళ్ల విలువ ఎంతంటే..
రాజకీయాలలో సినిమా వాళ్ల పాత్ర ఏమిటి?.. వాళ్లు ప్రచారం చేసినంత మాత్రాన గెలిచిపోతారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో ఇలాంటి చర్చలు సహజంగానే జరుగుతుంటాయి. తెలుగు సినీ ప్రముఖుడు బ్రహ్మానందం కర్నాటకలోని చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆయనను చూడడానికి జనం కూడా బాగానే వచ్చారు. కానీ, ఆయన మద్దతు ఇచ్చిన బిజెపి అభ్యర్ధి డాక్టర్ సుధాకర్ మాత్రం పరాజయం చెందారు!. అయితే.. డాక్టర్ సుధాకర్.. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగానే ఇక్కడ గెలిచారు. కాని.. ఆ తర్వాత పరిణామాలలో పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉప ఎన్నికలో పోటీచేసి సుమారు 35 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంత మెజార్టీ వచ్చింది కదా అనే ధీమాతో.. తాజా అసెంబ్లీ ఎన్నికలో కూడా గెలుస్తాననే భావనలో కూరుకుపోయిన సుధాకర్కు చిక్ బళ్లాపూర్ ఓటర్లు షాక్ ఇచ్చారు. సుమారు 10,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారాయన. తెలుగువారు కూడా గణనీయంగా ఉండే ఆ నియోజకవర్గంలో బ్రహ్మానందం ప్రచారం కూడా ఉపయోగపడుతుందని ఆశించారు. దాని వల్ల ఏమనా కాంగ్రెస్ అభ్యర్ధి అయ్యర్ మెజార్టీ కాస్త తగ్గిందేమో తెలియదు కాని, బిజెపి ఓటమి మాత్రం తప్పలేదు. నిజానికి బ్రహ్మానందం రాజకీయ మిషన్ తో అక్కడ ప్రచారం చేయలేదు. తనకు వ్యక్తిగత సంబంధాలు ఉండడంతో ఆ నియోజకవర్గంలో ప్రచారం చేసి వచ్చారట. ఇలా కొన్నిసార్లు యాక్టర్ లు సిద్దాంతాలు,పార్టీలతో నిమిత్తం లేకుండా తమకు ఉన్న సంబంధ, బాంధవ్యాల రీత్యా ప్రచారం చేస్తుంటారు. అన్నిసార్లు వాటి వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పలేం కాని, కొన్నిసార్లు కొంత ప్రయోజనం ఉండవచ్చు. అంతమాత్రాన వారే రాజకీయాలు శాసించే పరిస్తితి లేదనే చెప్పాలి. ఇందుకు కొన్ని మినహాయింపులు ఉండవచ్చు. 👉 తమిళనాడులో అన్నాదురై, కరుణానిది, ఎమ్.జి.ఆర్, జయలలిత వంటివారు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించారు. తమకు ఉన్న సినిమా పాపులారిటీతో పాటు పార్టీ సిద్దాంతం కూడా వారికి కలిసి వచ్చింది. ప్రజలలో మమేకం అయ్యే వారి లక్షణం ఉపయోగపడింది. కానీ, అక్కడే మరో నటుడు విజయకాంత్ రాణించలేకపోయారు. కమల్ హసన్ది అయితే మరీ దయనీయం. రజినీకాంత్ రాజకీయాలలోకి రావాలో ,వద్దో తేల్చుకోలేక చివరికి ఆ వైపు వెళ్లరాదని నిర్ణయించుకున్నారు. 👉 ఏపీలో ఎన్టీఆర్(దివంగత) వచ్చేవరకు సినిమావారికి విశేష ప్రాధాన్యం లేదనే చెప్పాలి. కళావాచస్పతి కొంగర జగ్గయ్య ఒకసారి లోక్ సభకు మాత్రం కాంగ్రెస్ పక్షాన ఎన్నికయ్యారు. అది 1971 లో ఇందిరాగాంధీ వేవ్ లో అని గుర్తించాలి. ఆ తర్వాత ఆయన ఒకసారి అసెంబ్లీకి పోటీచేసి ఘోరంగా ఓటమి చెందారు. ఆయన ఒక్కరే కాదు. ప్రముఖ నటుడు కృష్ణ, జమున,కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, శారద, మురళీమోహన్, రామానాయుడు ఇలా పలువురు సినిమావారు ఎన్నికల రాజకీయాలలో ఒకసారికే పరిమితం అయ్యారు. విజయనిర్మల ఆ ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. మరో నటుడు నరేష్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కాని సఫలం కాలేదు. 👉 తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్.టి.రామారావు 1983లో రెండు చోట్ల, 1985లో మూడు చోట్ల పోటీచేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు. కాని 1989 లో ఆయన రెండు చోట్ల పోటీచేసి ఆశ్చర్యంగా ఒకచోట ఓటమి చెందారు. మళ్లీ 1994లో రెండు చోట్ల పోటీచేసి గెలిచారు. తొమ్మిది చోట్ల పోటీచేసి ఎనిమిదింట గెలవడం ఒక రికార్డే అయినా, ఒకసారి ఓటమి మాత్రం ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆయన ఒక సిద్దాంతంతో ప్రజల ముందుకు రావడం, అప్పట్లో రాజకీయ శూన్యత ఉండడం కలిసి వచ్చింది. అయితే ఎన్.టి.ఆర్.ను 1989లో ఓడించడంలో కొంతమంది సినిమావారి ప్రచార ప్రభావం కూడా కొంత ఉపయోగపడింది. అంటే జనంలో ప్రభుత్వంపై, లేదా ఒక రాజకీయ పార్టీపై వ్యతిరేకత ఏర్పడినప్పుడు సినిమావారి ప్రచారాలు అదనంగా కలిసి వస్తాయని అనుకోవచ్చు. అదే ప్రభుత్వంపై లేదా రాజకీయ పార్టీ పై వ్యతిరేకత లేనప్పుడు ఎంత పెద్ద సినీ నటుడు ప్రచారం చేసినా ప్రయోజనం ఉండదని అనుభవం చెబుతుంది. 👉 ప్రముఖ నటుడు చిరంజీవి సొంతంగా పార్టీ పెట్టి రెండు చోట్ల పోటీచేసి ఒకచోట మాత్రమే గెలవగలిగారు. ఆ తర్వాత ఎక్కువకాలం ఆయన పార్టీని నడపలేకపోయారు. చిరంజీవి సభలకు జనం పోటెత్తినా ఆశించిన ఓట్లు రాలేదు. ఆయనకు రాజకీయ వ్యూహం కొరవడడమే కారణం అని చెప్పాలి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని స్థాపించి కేవలం ప్రచారానికి పరిమితం అయ్యారు. టీడీపీ గెలుపునకు ఆయనే కారణమని అభిమానులు భావించేవారు. అదే పవన్ కళ్యాణ్ 2019లో మరో రాజకీయ కూటమి ఏర్పాటు చేసి పోటీలో దిగి రెండు చోట్ల పోటీచేస్తే , ఆ రెండిట ఓడిపోవడం విశేషం. ఆయన ఫెయిర్ రాజకీయాలు చేయకపోవడం, తెలుగుదేశంతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంటకాగడం, ఆయనను నమ్ముకున్న అబిమానులు, కాపు సామాజికవర్గ నేతల అబిప్రాయాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి కారణాల వల్ల ఆయన రాజకీయంగా సఫలం కాలేకపోయారు. తిరిగి 2024లో కూడా టిడిపికి తోక పార్టీగానే ఉండాలని ఆయన నిర్ణయించుకోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఆయనను సి.ఎమ్.,సి.ఎమ్.అంటూ నినదించిన అభిమానులకు ఆశాభంగం కలిగిస్తూ చంద్రబాబుకు ఆయన ఆ విషయంలో సరెండర్ అయిపోయి తనకు బలం లేదని చెప్పేసుకుని దెబ్బతిన్నారు. ఒక్క ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న ఆయన కోరిక 2024లో నెరవేరుతుందా?లేదా? అన్నది చూడాల్సి ఉంది. 👉 వైఎస్సార్సీపీ పక్షాన పోటీచేసి మరో ప్రముఖ నటి రోజా మంత్రి కాగలిగారు. ఆమె ఇప్పటికి రెండుసార్లు విజయం సాధించారు. ఒక ప్రముఖ పార్టీలో కొనసాగి,నాయకుడి పట్ల విధేయతతో ఉండడం , ఒక సిద్దాంతానికి కట్టుబడి ఉండడం వంటి కారణాలు ఆమె రాజకీయ సాఫల్యానికి కారణాలుగా కనిపిస్తాయి. మరో ప్రముఖ నటి జయప్రద ఏపీ నుంచి తొలుత రాజ్యసభ సభ్యురాలైనా, ఆ తర్వాతకాలంలో ఆమె యూపీ నుంచి రెండుసార్లు లోక్ సభ కు ఎన్నికై సంచలనం సృష్టించారు. యుపిలో మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్ యాదవ్ తో పాటు , ఆయన పార్టీలోని కొందరి అండ ఉండడంతోనే అది సాద్యమైంది. 👉👉జాతీయ రాజకీయాలలోకాని, ఆయా రాష్ట్రాలలో కాని సినీ ప్రముఖులు పూర్తి స్థాయిలో రాణించిన సందర్భాలు తక్కువేనని చెప్పాలి. కాకపోతే యాక్టర్ లకు ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే వారు తమ సినిమాల ద్వారా ప్రజలను కొంత ప్రభావితం చేస్తారు. జనంలోకి వస్తే వారిని తేలికగా గుర్తు పడతారు. వారి గ్లామర్ ఆ రకంగా ఉపయోగపడుతుంది. అందుకే ఏదైనా వ్యాపార సంస్థ ప్రారంభోత్సవానికి కూడా సినీ నటులను అతిధులుగా ఆహ్వానిస్తుంటారు. అంతమాత్రాన ఆ వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయని కాదు. వారి వ్యూహంతో పాటు, ప్రజలలో తేలికగా బ్రాండ్ ఇమేజీ తెచ్చుకోవడానికి సినీ నటులు ఉపయోగపడతారని భావించడమే. అలాగే రాజకీయాలలో కూడా వీరు కొంత బ్రాండ్ ఇమేజీకి పనికి వస్తారు కాని, సిద్దాంత పునాది, పెద్ద రాజకీయ పార్టీ మద్దతు లేకుండా వీరు రాణిస్తారని, వీరి ప్రచారంతోనే అభ్యర్ధులు గెలిచిపోతారని అనుకుంటే అది భ్రమేనని పలు అనుభవాలు తెలియచేస్తున్నాయి. ::: కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్ -
విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్ర
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు కన్నెర్రజేసింది. రాజకీయ నాయకులు మతాన్ని రాజకీయాలకు వాడుకోవడం ఆపినప్పుడే వాటికి అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. ‘‘దేశం ఎటు పోతోంది? విద్వేష ప్రసంగాలు ఓ విషవలయం. రాజకీయాలను మతంలో కలపడం పెను సమస్యకు దారి తీస్తోంది. విచ్ఛిన్న శక్తులే ఇందుకు పాల్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. దీన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం తక్షణం ఓ మార్గం చూడాలి’’ అని న్యాయమూర్తులు కె.ఎం.జోసెఫ్, బి.వి.నాగరత్న ధర్మాసనం బుధవారం అభిప్రాయపడింది. ఇటీవలి తీర్పులోనూ సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని నొక్కిచెప్పిందని గుర్తు చేసింది. ‘‘టీవీల్లో, మీడియాలో, బహిరంగ వేదికలపై రోజూ ఇలాంటి శక్తులు ఇతరులపై విద్వేష వ్యాఖ్యలకు పాల్పడుతూనే ఉన్నాయి. ఎంతమందిపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టగలం? తోటివారిపై, సామాజిక వర్గాలపై విద్వేష వ్యాఖ్యలు చేయబోమని ప్రజలే ప్రతినబూనితే బాగుంటుంది’’ అని సూచించింది. దివంగత ప్రధానులు జవహర్లాల్ నెహ్రూ, అటల్ బిహారీ వాజ్పేయి వంటివారి ప్రసంగాలు ఎంతో హుందాగా ఉండేవంటూ గుర్తు చేసింది. వాడీవేడి వాదనలు.. ‘‘విద్వేష ప్రసంగాలపై సకాలంలో చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిస్తేజంగా మారాయి. అందుకే కోర్టులకు పని పడుతోంది’’ అంటూ ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలా మౌనంగా ఉండే పక్షంలో ప్రభుత్వాల ఉనికికి అర్థమేముందని ప్రశ్నించింది? రాష్ట్రాల సంగతేమో గానీ ఈ వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వానికి వర్తించవని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. కేరళ, తమిళనాడుల్లో నేతల విద్వేష ప్రసంగాల ఉదంతాలను కూడా ఈ పిటిషన్తో కలిపి విచారించాలని కోరారు. వాటికి సంబంధించిన వీడియో క్లిప్ల ప్రదర్శనకు అనుమతించాలని కోరడంతో దీన్నో డ్రామాగా మార్చొద్దని ధర్మాసనం పేర్కొంది. ‘‘దేనికైనా ఓ పద్ధతుంటుంది. మేం వీడియో క్లిప్లు చూడాలని మీరు భావిస్తే దాన్ని మీ పిటిషన్లో చేర్చండి’’ అని సూచించింది. విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement