-
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
సంక్రాంతికి మూవీ రిలీజ్.. ఇంతలోపే సూపర్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!
తమిళ స్టార్ హీరో సూర్య.. మరో క్రేజీ దర్శకుడితో పనిచేయబోతున్నాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ 'కంగువ'తో బిజీగా ఉన్న సూర్య.. దీని తర్వాత వరసగా సుధా కొంగర, వెట్రిమారన్ లాంటి క్రేజీ డైరెక్టర్స్తో కలిసి పనిచేయబోతున్నాడు. ఇది కాదన్నట్లు లోకేష్ కనకరాజ్ తీసే 'రోలెక్స్'లోనూ సూర్య లీడ్ రోల్ చేయనున్నాడు. వీటిలో వెట్రిమారన్, లోకేశ్ చిత్రాలు తీయడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంతలో మరో యువ దర్శకుడిక సూర్య బంపరాఫర్ ఇచ్చినట్లు టాక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) గతంలో 'అండ్రు నేట్రు నాళై' లాంటి డిఫంట్ సినిమా తీసిన రవికుమార్.. ప్రస్తుతం శివకార్తికేయన్తో 'అయలాన్' తీశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం.. జనవరి 12న అంటే ఈ వారాంతంలోనే థియేటర్లలోకి రానుంది. ఇంతలోనే సూర్య నుంచి ఈ దర్శకుడికి పిలుపొచ్చిందనే న్యూస్ వైరల్ అవుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. (ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) -
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. -
హీరోయిన్కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్లో జరిగిన ఈవెంట్లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: కోలీవుడ్లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!) ముద్దు సీన్తో వివాదం అయితే ఈ ఈవెంట్కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్కు హాజరైన హీరోయిన్ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు. మీకేం ఇబ్బంది? అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
కాల్ చేస్తే మాట్లాడడం లేదని.. నమ్మించి.. మైకో లేఔట్కి పిలిపించి..
కర్ణాటక: వేరే సంస్థలో చేరిన ప్రియురాలు తనతో ఫోన్లో మాట్లాడడం లేదనే ఆక్రోశంతో ఉన్మాదిగా మారిన ప్రియుడు ఆమెను చావబాదాడు. ఈ ఘటన బెంగళూరు మైకోలేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గాయాలైన యువతి స్నేహసిక్త చటర్జీ (26) నిమ్హాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సైకో ప్రియుడు రవికుమార్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ ఇంజినీర్లు. రవికుమార్ ఇందిరానగరలో ఓ సంస్థలో పని చేస్తుండగా స్నేహ అక్కడ శిక్షణకు వచ్చింది. వారి మధ్య పరిచయమై ప్రేమకు దారి తీసింది. ఇటీవల స్నేహకు మరో కంపెనీలో ఉద్యోగం రాగా అక్కడకు వెళ్లిపోయింది. అప్పటినుంచి రవికుమార్ కాల్ చేస్తే సరిగా మాట్లాడడం లేదు. ఈ నెల 3న తెల్లవారుజామున స్నేహను మైకో లేఔట్లోని తను ఉంటున్న హాస్టల్ వద్దకు పిలిపించాడు. ఎందుకు నాతో మాట్లాడడం లేదని ఆమెతో ఘర్షణ పడి ఇనుప రాడ్తో తలపై బాదటంతో గట్టి గాయాలయ్యాయి. కొందరు చూసి బాధితురాలిని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మైకోలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
భారీ వృద్ధి దిశగా అడుగులు.. అప్స్టాక్స్ సీఈవో రవి కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ అప్స్టాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. 25–30 శాతం మేర లాభాల వృద్ధి ఉండగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం రూ. 1,000 కోట్లు దాటగా.. బ్రేక్ ఈవెన్ సాధింంది. అప్స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ గురువారమిక్కడ విలేకరుల సమావేశం సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమకు 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను పది కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లయింట్ల సంఖ్య గత రెండేళ్లలో 13% పెరిగిందని, వీరిలో 70% మంది యువ ఇన్వెస్టర్లేనని రవి కుమార్ చెప్పారు. డెరివేటివ్స్ ట్రేడింగ్లో దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు స్థాయిలో ట్రేడర్లు ఉన్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ ట్రేడర్ల కోసం రియల్ టైమ్ సమాచారంతో ట్రేడ్ మోడ్, ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్ట్ మోడ్ పేరిట రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. 2018 నుం ఇప్పటివరకూ 200 మిలియన డాలర్ల నిధులు సమీకరించామని చెప్పారు. అప్స్టాక్స్లో ప్రస్తుతం 600 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్లో దాదాపు 40 మంది ఉన్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసే Äñæచనలో ఉన్నట్లు కువర్ తెలిపారు. -
కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్ను తొలగించిన కాగ్నిజెంట్!
బ్రియాన్ హంఫ్రీస్ను సీఈవో పదవి నుంచి తొలగించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీ ఫైల్స్లో ఈ విషయాన్ని వెల్లడించిన కంపెనీ.. హంఫ్రీన్ తొలగింపుకు గల స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. ఈ ఏడాది కాగ్నిజెంట్ బోర్డ్ సభ్యులు సంస్థ వేగంగా పురోగమించడం, వ్యాపార కార్యకలాపాల్ని వేగవంతం చేయడం, ఆదాయ వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించింది. కాబట్టే సీఈవో పదవీ బాధ్యతల్లో మార్పులు అవసరమని తాము విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ బోర్డ్ ఛైర్మన్ స్టీఫెన్ జె రోహ్లెడర్ తెలిపారు. సీఈవో పదవి నుంచి తొలగించడంతో జనవరి 12 నుంచి మార్చి 15 వరకు కాంగ్నిజెంట్లో సలహాదారులుగా పనిశారు. హంఫ్రీస్ సీఈవో పదవి నుంచి తొలగించడంతో ఆయన స్థానాన్ని భారత్కు చెందిన టెక్ జెయింట్ ఇన్ఫోసిస్కు ప్రెసిడెంట్గా పనిచేసిన రవికుమార్ భర్తీ చేసిన విషయం తెలిసిందే. తొలగింపులకు కారణాలు హంఫ్రిస్ను ఫైర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయం పడిపోవడం, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సంస్థను విడిచిపెట్టడం, వార్షిక ప్రాతిపదికన అట్రిషన్ రేటు పెరిగిపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. తగ్గిన పరిహారం సీఈవోగా బాధ్యతలు నిర్వహించే సమయంలో హంఫ్రీస్కు చెల్లించే పరిహారం భారీగా తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 2021తో పోలిస్తే 2022లో హంఫ్రీస్ పరిహారం 9 శాతం తగ్గిందని ప్రకటన హైలైట్ చేసింది. నాన్ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు సైతం 4 మిలియన్ల నుండి 1.7 మిలియన్లకు తగ్గాయి. చదవండి👉 భారత్లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ -
కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!
సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ను ఎంపికయ్యారు. నాలుగేళ్ల పాటు కంపెనీకి సేవలందించిన మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్ నియమితులయ్యారు. గ్రోత్కు సంబంధించి మంజి పొజిషన్లో ఉన్న కాగ్నిజెంట్ సీవోగాఎంపిగాకవడం సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్న కుమార్ కాగ్నిజెంట్లో ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. అయితే దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్ వార్షికవేతనం ఇపుడు హాట్ టాపిక్గా నిలిచింది. 2020లో అంబానీ జీతం కంటే నాలుగు రెట్ల అధికం రవి కుమార్ జీతం 2020లో ముఖేశ్ అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువట. రవి కుమార్ మొత్తం జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు( 7,50,000 డాలర్ల )జాయినింగ్ బోనస్ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్ బేసిక్ సాలరీగా ఒక మిలియిన్డాలర్లు చెల్లింస్తుంది కంపెనీ. అలాగే 2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్లను పొందనున్నారు. .కాగా గత రెండేళ్లుగా అంబానీ కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకున్నారని గమనించాలి. 2019-20లో ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. కాగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు. కుమార్ ట్రాన్స్యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పనిచేశారు. హంఫ్రీస్ రాజీనామా చేయడంతోరవికుమార్ను ఎంపిక చేసింది కాగ్నిజెంట్. ప్రత్యేక సలహాదారుగా మార్చి 15 వరకు కంపెనీలోనే ఉంటారు హంఫ్రీస్ . -
టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తా: పనస రవికుమార్
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం అని పారిశ్రామిక వేత్త పనస రవికుమార్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి పనస సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా రవి పనస, డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ... తెలంగాణ, భారతదేశానికి గుండెలాంటిది. అలాంటి తెలంగాణని తెచ్చిన టీఆర్ఎస్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ... ‘శ్రవణ్, రవి పనస పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నా’ అన్నారు. -
కాంగ్రెస్కు షాక్.. గులాబీ గూటికి పల్లె రవికుమార్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, ఆయన సతీమణి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు భేటీ అయ్యారు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పల్లె రవికుమార్ దంపతులకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్తోపాటు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో పల్లె రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించడంతో పల్లె రవికుమార్ తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్కు ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్కు కచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని భరోసానిచ్చారు. చదవండి: కేసీఆర్ టార్గెట్పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కంటి మీద కునుకులేదు? Big Jolt to #Congress Chundur MPP Jyothi and her husband Palle Ravi joins #TRS ahead of #Munugode pic.twitter.com/k7dwPPmHI7 — Sarita Avula (@SaritaTNews) October 15, 2022 చండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్కు తెలియజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పల్లె రవికుమార్ తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషిని చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS గారి సమక్షంలో మునుగోడు కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, వారి సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/Ovdsq0IhyF — TRS Party (@trspartyonline) October 15, 2022 -
రవికుమార్తో వివాహేతర సంబంధం.. తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం
సాక్షి, ముమ్మిడివరం (కోనసీమ జిల్లా): మండలంలోని అనాతవరం ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఒక యువకుడు శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. స్థానిక బోగాల తోటకు చెందిన పెదపూడి రవికుమార్(32)ను తలపై బలంగా కొట్టి సమీపంలో ఉన్న పంటబోదెలో పడేశారు. శనివారం రాత్రి 11గంటలకు కుమారుడికి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకురావటానికి బయటకు వెళ్లి వచ్చాడు. భార్యతో మళ్లీ వస్తానని చెప్పి.. ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో భార్య లలిత భర్తకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కంగారు పడి మామగారు త్రిమూర్తులకు చెప్పటంతో ఆయన రవికుమార్ స్నేహితులకు ఫోన్ చేసినప్పటికీ సమాచారం తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. వారి ఇంటికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన రవికుమార్ మోటారు బైక్, చెప్పులు కనిపించాయి. రవికుమార్ (పాత చిత్రం) పరిసర ప్రాంతాల్లో గాలించగా పక్కనే ఉన్న పంట బోదెలో రవికుమార్ విగత జీవుడై కన్పించాడు. దీంతో త్రిమూర్తులు ముమ్మిడివరం పోలీసులకు సమాచారం అందించారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంటబోదె లోంచి తీసి పరిశీలించగా తలపై బలమైన గాయాలు ఉండటంతో రవికుమార్ హత్యకు గురైనట్టు గుర్తించారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (పాము కాటుకు పురోహితుడు బలి.. రెండుసార్లు కాటువేసినా చంపకుండా..) వివాహేతర సంబంధమే కారణమా? రవికుమార్కు ఆరేళ్ల క్రితం కొమానపల్లికి చెందిన లలితతో వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల బాబు నిహాన్షు ఉన్నాడు. రవికుమార్ అనాతవరం సెంటర్లో మీ సేవ కేంద్రం నిర్వహించేవాడు. ఇటీవల ఇసుక, కంకర సరఫరా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్థానికుల కథనం ప్రకారం రవికుమార్ కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో ఆమెను వదిలివేశాడు. ఆమె తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. తెలంగాణ వ్యక్తి రవికుమార్తో సంబంధం కొనసాగించవద్దని ఆమెను హెచ్చరించాడు. రవికుమార్కు కూడా ఫోన్లు చేసి హెచ్చరించాడు. కొన్ని నెలల క్రితం కొంతమంది యువకులు ముఖానికి ముసుగులు వేసుకుని రవికుమార్ ఇంటికి వచ్చి దాడికి యత్నించారు. వివాహేతర సంబంధం వల్లే రవికుమార్ హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అమలాపురం సీఐ సీహెచ్ కొండలరావు ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎస్ఐ కె.సురేష్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలస్యం... అమృతం... విషం!
గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం. బ్రిటిష్ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి. మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరిం చాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది. కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్) డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇనగంటి రవికుమార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్: 94400 53047 -
Virat Kohli: "ఇప్పటి నుంచే నన్ను ఔట్ చేసేందుకు ప్లాన్ చేస్తావా ఏంటి..?"
U19 Bowler Ravi Kumar Vs Virat Kohli: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన యువ భారత జట్టులో కీలక ఆటగాడైన రవికుమార్.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మెగా ఫైనల్కు ముందు జరిగిన ఓ సంభాషణ సందర్భంగా కోహ్లి తనకి కౌంటరిచ్చాడని రవికుమార్ పేర్కొన్నాడు. ఫైనల్కు ముందు జట్టులో స్ఫూర్తినింపేందుకు వీడియో కాల్ మాట్లాడిన కోహ్లిని తాను ఓ చిరాకు తెప్పించే ప్రశ్న అడిగానని, అందుకు కోహ్లి తనదైన స్టైల్లో ఫన్నీగా సమాధానమిచ్చాడని రవికుమార్ చెప్పుకొచ్చాడు. తాను కోహ్లిని బ్యాటింగ్ బలహీనత గురించి అడగ్గా, అందుకు అతను బదులిస్తూ.. "ఎందుకు.. ఇప్పటి నుంచే నన్ను ఔట్ చేసేందుకు ప్లాన్ చేస్తావా..?" అంటూ ఫన్నీగా కౌంటరిచ్చాడని రవికుమార్ తెలిపాడు. కాగా, ఇంగ్లండ్తో జరిగిన అండర్19 ప్రపంచకప్ ఫైనల్లో రవికుమార్ 4 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఇదిలా ఉంటే, రవికుమార్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తాను బౌలర్ అయినప్పటికీ.. తన ఆరాధ్య క్రికెటర్ ధోని అని, ఫేవరెట్ బౌలర్ విషయానికొస్తే.. ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ని అమితంగా ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో తప్పక అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన 18 ఏళ్ల రవికుమార్.. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కోచ్ సలహా మేరకు యూపీ నుంచి బెంగాల్కు వలస వెళ్లాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా రవికుమార్లాగే గతంలో యూపీ నుంచి బెంగాల్కు వలస వెళ్లి స్టార్ బౌలర్గా ఎదిగాడు. చదవండి: Virat Kohli: కేఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి పంపాడు.. ఆ ఓటమి ఇప్పటికీ బాధిస్తుంది..! -
ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా, హాంకాంగ్లకు చెందిన గేమింగ్, డేటింగ్ యాప్స్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్ కంపెనీల లావాదేవీలకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్ చేరేలా చేశాడని చెప్పింది. హెయిర్ మర్చంట్స్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఢిల్లీకి చెందిన చార్టెట్ అకౌంటెంట్ రవికుమార్.. చైనా, హాంకాంగ్కు చెందిన లింక్యూన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్ యాప్ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్ ద్వారా రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్బీఐ, ఎస్బీఎమ్ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్కు మళ్లించినట్టు తేల్చింది. సంతకానికి రూ. 1,500 మనీ లాండరింగ్ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్ 621 బోగస్ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్ ఫామ్ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్ అకౌంటెంట్గా బ్యాలెన్స్ షీట్లను చూడకుండానే షెల్ కంపెనీలకు సంతకాలు చేశాడంది. ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది. -
టీడీపీ నేతల దౌర్జన్యం
సింహాద్రిపురం : వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లె గ్రామానికి చెందిన శివరామిరెడ్డి అనే రైతు శనగ పంటను స్థానిక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు వై.గోపాల్రెడ్డి, లోక్నాథ్రెడ్డి, నాగేశ్వరరెడ్డి, విజయ్కుమార్రెడ్డి, కేశవవర్దన్రెడ్డిలు శివరామిరెడ్డి పొలాన్ని దౌర్జన్యంగా తీసుకోవాలని తరచూ గొడవ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల క్రితం బాధితుడి పొలంలో కొలతలు వేయనీయకుండా సర్వేయర్ను, తహసీల్దార్ మహబూబ్ బాషాను దౌర్జన్యంగా అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో బాధితుడు జమ్మలమడుగు ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.(చదవండి: చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి) ఈ భూమికి సంబంధించి టీడీపీ వర్గీయులు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఆర్డీఓ కూడా ఈ భూమి శివరామిరెడ్డికి సంబంధించినదే అని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఆదివారం బాధితుడి పొలంలోని శనగ పంటను రెండు ట్రాక్టర్లతో దున్నేశారు. మరో 20 రోజుల్లో పంట చేతికందే సమయంలో దున్నేయడంతో రూ.2 లక్షల మేర నష్టం వచ్చినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతల దౌర్జన్యానికి ఇది పరాకాష్ట అని అతను వాపోయాడు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ బీటెక్ రవి అండదండలతో తనను తరచూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. -
ఆక్సిజన్ పెట్టారా? లేదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనాతో బాధపడుతున్న రోగి రవికుమార్కు ఆక్సిజన్ పెట్టామని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెం డెంట్ చెబుతున్నారు. తనకు ఆక్సిజన్ మాస్కు తొలగించారని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మళ్లీ పెట్టాలని కోరినా పట్టించుకోలేదని రవికుమార్ వీడియో తీసి పంపారు. ఇందులో ఏది నిజం. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా?’’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్ మృతి చెందారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బొల్గం యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. రవికుమార్ గుండె సంబంధవ్యాధితో చనిపోయారని, వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. రవికుమార్కు సంబంధించిన వైద్య నివేదికలు సమర్పించారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు. కొంత సమయం ఇస్తే రికార్డులు సమర్పిస్తామని చెప్పగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని తామెలా భావించాలి? నిబంధనల మేరకు కరోనా రోగికి అందించాల్సిన అన్ని చికిత్సలు చేశామంటున్నారు. మరి వైద్యనివేదికలు మా పరిశీలనకు ఎందుకు ఇవ్వడం లేదు ?’’అని ధర్మాసనం ప్రశ్నించింది. అదే ఆస్పత్రిలో మరో రోగి కూడా వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయారని, అతడు కూడా చనిపోయే ముందు వీడియో తీసి పంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రియాంకా చౌదరి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం..రవికుమార్కు సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ను ఆదేశిస్తూ...విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రవికుమార్ మృతి
సాక్షి, హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడు కరోనా వల్ల మరణించలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడి ప్రాణం పోయిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటిలేటర్ తీసేయడం వల్లే అతడు చనిపోయాడని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్కు చెందిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సకాలంలో వైద్యం అందకే రవికుమార్ మరణించారని, వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉందని పిటిషనర్ న్యాయవాది ప్రియాంక చౌదరి వాదించారు. ఇప్పటికే రవికుమార్ వీడియో వైరల్ అయ్యిందన్నారు. దీనిపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నివేదిక కప్పదాట్లతో ఉండకూడదని.. బాధ్యులు ఎంతటి సీనియర్ డాక్టర్లు అయినా చర్యలు ఉండాలని పేర్కొంది. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. -
రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మందుల స్కాంలో 19 మంది ప్రమేయం... ♦ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్–డిమ్స్) విభాగంలో 2014–15 నుంచి 2018–19 వరకు జరిగిన కొనుగోళ్లపై విచారణ నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ♦ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ నిమ్మాడలో అదుపులోకి తీసుకుంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టరు సీకే రమేష్కుమార్ను తిరుపతిలో, డాక్టర్ జి.విజయ్కుమార్ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసింది. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న డిమ్స్ ఉద్యోగులు డాక్టర్ జనార్దన్, ఇ.రమేష్బాబు, ఎంకేబీ చక్రవర్తిలను కూడా అరెస్టు చేసింది. మార్కెట్ ధరకన్నా అధికంగా చెల్లింపులు.. ♦ మందులు, ల్యాబ్ కిట్స్, శస్త్రచికిత్స పరికరాలు, ఫర్నిచర్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లతో పాటు కాల్సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ♦ మార్కెట్ ధర కన్నా 50 నుంచి 129 శాతం అధికంగా చెల్లించి మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొన్ని సంస్థలతో కుమ్మక్కై ఇ–టెండర్లో కాకుండా నామినేషన్ విధానంలో కొనుగోళ్లు జరిపారు. ♦ కొందరు ‘డిమ్స్’ ఉద్యోగులే తమ కుటుంబ సభ్యుల ద్వారా బినామీ కంపెనీలను సృష్టించారు. తప్పుడు ఇన్వాయిస్లు, బిల్లులతో రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ఈసీజీకి డబుల్కిపైగా చెల్లింపులు... ♦ టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి ఆదేశాలతో అప్పటి డిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్కుమార్ టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ♦ టెలిమెడిసిన్కు సంబంధించి కాల్సెంటర్, టోల్ ఫ్రీ, ఈసీజీ సేవల ఒప్పందం లోపభూయిష్టంగా జరిగింది. ఇతర ఆస్పత్రుల్లో సుమారు రూ.200 మాత్రమే ఖర్చు అయ్యే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. ♦ కాల్సెంటర్కు వచ్చిన కాల్స్కి కాకుండా సర్వీసు ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీకి, ఫేక్ కాల్స్ లాగ్స్కి ఒక్కో కాల్కి రూ.1.80 చొప్పున బిల్లులు చెల్లించారు. ♦ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటులోనూ అవకతవకలు, అవినీతి చోటుచేసుకుంది. -
కుట్రతోనే తబ్లీగీలు రాష్ట్రంలోకి ప్రవేశించారు
బెంగుళూరు : తబ్లీగి జమాత్, అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారి నుంచే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగల్లాగా రాష్ట్రంలో ప్రవేశించి కరోనా వ్యాప్తికి కారకులయ్యారని దుయ్యబట్టారు. రాజస్తాన్లోని అజ్మీర్లోని దర్గాకు హాజరైన దాదాపు 1900 మంది, తబ్లీగికి వెళ్లొచ్చిన 500 మంది ద్వారానే కర్ణాటకలో సెకండరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని ఆరోపించారు. మేధావులుగా పిలువబడే సమాజ పెద్దలు తబ్లీగీల చర్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆశా వర్కర్లపై జరుగుతున్న దాడులను ఖండించిన రవికుమార్.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఒక మతానికి కరోనాను అంటగడుతూ, వారి వల్లే ఇలా జరిగిందని దూషించడం ఎంత మాత్రం సమంజసం కాదని ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవికుమార్ స్పందిస్తూ.. పార్టీ వైఖరి, వ్యక్తిగత అభిప్రాయాలు వేర్వేరని పేర్కొన్నారు. ఇప్పటివరకు కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 862కి చేరగా, 31 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. (మా షాపులో ముస్లింలెవరు పనిచేయడం లేదు!) -
‘రామ’సక్కని సూరీడు!
తల్లి తన గర్భగుడిలో బిడ్డను నవమాసాలు మోస్తుంది.. ప్రాణాలకు తెగించి.. పురిటి నొప్పులతో జన్మనిస్తుంది. పాలిచ్చి.. లాలించి పెంచి పెద్ద చేస్తుంది.. తాను పస్తులుండైనా బిడ్డ ఆకలి తీరుస్తుంది. గోరుముద్దలు తినిపిస్తుంది.. చందమామ కథలు చెప్తుంది.ఆలనా పాలన చూస్తుంది.. అడిగిందల్లా ఇస్తుంది..జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది..రుణం తీర్చుకునే సమయం వస్తే..కన్న కొడుకుగా.. ఏమిచ్చి తల్లి రుణం తీర్చుకోవాలి..?అమ్మంటే.. సాటి మనిషిగా చూడకుండా.. నిండైన అమ్మతనపు కమ్మదనం ఎరిగిన బిడ్డ..జబ్బు చేసిందని జాలి చూపలేదు..కలికాలం.. కరోనా కాటు.. జనం విలవిల్లాడుతుంటే..వైద్యాలయాలే దేవాలయాలు అనుకుని..వైద్యమో రామ‘చంద్రా’ అంటూ వైద్యుడే దేవుడంటూ..తల్లిని భుజానకెత్తుకొని వడివడిగా అడుగులేస్తూ.. పేగుతెంచుకు పుట్టిన ‘రవి’ పరుగులు తీశాడు.. వైద్యదేవత చల్లని చూపు చూసింది.. మాతృమూర్తి ఇంటికి చేరింది. (ఆకలితో అడవిలోనే..!) అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం దురుదకుంటకు చెందిన వృద్ధురాలు రామక్క మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. తల్లి బాధను చూసి తట్టుకోలేని తనయుడు రవికుమార్ ద్విచక్ర వాహనంపై కళ్యాణదుర్గం తీసుకెళ్లాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో ద్విచక్ర వాహనానికి అనుమతిలేకపోయింది. పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి వద్ద బైక్ను వదిలి, తల్లిని భుజంపై ఎత్తుకొని ఎర్రటి ఎండలో ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వెళ్తున్న దృశ్యాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా దెబ్బకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయకూడదని నిబంధన ఉంది. దీంతో వైద్యం అందలేదు. ఎవరిని అడగాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. చివరికి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్టాఫ్నర్సును అడిగి తల్లికి వైద్యం చేయించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వాస్పత్రిలో సేవలందించేందుకు వచ్చి ఉంటే వృద్ధురాలైన తల్లికి వైద్యం చేయించడానికి కుమారుడికి ఇన్ని అవస్థలు ఉండేవి కావని పలువురు అభిప్రాయపడ్డారు. తల్లి రామక్కను మోసుకుని వైద్యం కోసం తీసుకెళ్తున్న కుమారుడు రవికుమార్ -
డోపీలు సుమీత్, రవి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్... షూటర్ రవి కుమార్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. వీరిద్దరు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నవాటిని వినియోగించినట్టు డోప్ పరీక్షల్లో తేలింది. సుమీత్ 2017 ఆసియా ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచాడు. సుమీత్ ఎక్టెజోలామైడ్ ఉత్ప్రేరకం వాడినట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన షూటర్ రవి కుమార్ ప్రొప్రానోలోల్ ట్యాబ్లెట్ను వాడినట్లు డోప్ పరీక్షలో తేలింది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినపుడు డాక్టర్ వద్దకు వెళ్లగా అతను ఈ ట్యాబ్లెట్ రాసిచ్చాడని రవి తెలిపాడు. -
ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్హ్యాండెడ్గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
ఐదుగురు లిఫ్టర్లు డోపీలు
సాక్షి, భువనేశ్వర్: భారత వెయిట్లిఫ్టర్లు డోపింగ్లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టార్ లిఫ్టర్ రవి ‘ఒస్టారిన్’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది. విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్షిప్లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్లిఫ్టింగ్ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది. -
కండ ఉంది... సాయం చేసే గుండె కావాలి
ప్రతి రోజూ ఏడు గంటల వ్యాయం. రుచీ పచీ లేని ఆహారం. సరదాగా తిరగాల్సిన వయసులో ఏదో సాధించాలనే తపన. మరోవైపు బీదరికంతో పోరాటం. కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంతో ముందుకెళుతూ అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నాడు ఈ యువ యోధుడు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఎన్.రవి కుమార్ (21) తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ సాధించని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్లో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్లో బంగారు పతకం సాధించాడు. నవంబర్లో సౌత్ కొరియాలో జరగనున్న ప్రపంచ బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలకు ఎంపికైన తొలి తెలుగువ్యక్తి రవికుమారే. అయితే పేదరికం మూలన ఆ ప్రపంచ కప్ పోటీలకు దూరం అయ్యాడు. ప్రతిభ పుష్కలంగా ఉన్నా ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడమే అతనికి కష్టంగా ఉంది. నెలకు ఆహార ఖర్చులకే దాదాపు రూ.లక్ష అవుతుంది. స్పాన్సర్షిప్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కొంత చేయూతనిస్తే తప్పకుండా ప్రపంచ మెడల్ సాధిస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. లారీడ్రైవర్ కుమారుడు రవి కుమార్ది గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం. తండ్రి వెంకట్రావు లారీడ్రైవర్. అమ్మ వెంకట నరసమ్మ గృహిణి. వారిది సాధారణ కుటుంబం. తండ్రి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. అయితే వారు రాత్రింబగళ్లు కష్టం చేసి కుమారుడికి తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు. కొడుకు బంగారు పతకం సాధిస్తే చాలని నాన్న లారీ డ్రైవర్గా కష్టపడుతుంటే తల్లి చిల్లర అంగడి పెట్టుకొని వచ్చిన సంపాదనను కుమారునికే ఖర్చుపెడుతోంది. పోటీలకు వెళ్లేందుకు డబ్బులు లేకపోతే తన బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ పోటీలకు పంపిందామె. ఆ తర్వాత ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రోత్సాహం లభించింది. కండలు పెంచే వ్యాయామం కోసం రవి కుమార్ తీసుకునే పాలు, గుడ్లు, చికెన్, పండ్లు, చేపలు, కూరగాయలు, ప్రోటీన్ పౌడర్లు వీటి ఖర్చు చాలా ఎక్కువ. ప్రస్తుతం స్నేహితుల సాయం, పోటీల ద్వారా వచ్చే ప్రైజ్మనీతో సాధన నడుస్తోంది. ఇటీవల సెప్టెంబరు నెలలో ఇండోనేషియా బాటమ్లో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల్లో పతకం సాధించి, పతకంతోపాటు, భారతదేశ జెండాను ప్రదర్శిస్తూ... సరదాగా మొదలైన సాధన రవి కుమార్ తన 15వ ఏట స్నేహితులతో సరదాగా వ్యాయామం ప్రారంబించాడు. రోజుకు గంట సేపు చేస్తున్నా సీరియస్గా తీసుకుని చేసింది లేదు. 2014లో గుంటూరులో జి.శ్రీనివాసరావు అనే సీనియర్ బాడీ బిల్డర్ ఏర్పాటు చేసిన పోటీలకు అన్ని జిమ్లకూ ఆహ్వానం అందింది. రవి కుమార్ కూడా ఆ పోటీల్లో సరదాగా పాల్గొన్నాడు. అప్పుడు రవి దేహాన్ని చూసి కొంత మంది నవ్వారు. అది అతని మనస్సులో నాటుకుపోయింది. అప్పుడు కోచ్ జి.శ్రీనివాసరావును కలసి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే ఏం చేయాలని అడగడం, అందుకు ఆయన కొన్ని సూచనలు చేయడంతో రవి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి సాధన గంట నుంచి రెండు, మూడు.. నాలుగు గంటలైంది. ‘మిస్టర్ ఆంధ్ర’ టైటిల్ సొంతమయ్యింది. ప్రస్తుతం రవికుమార్ 75 కేజీల విభాగంలో ఇండియాలోనే బెస్ట్గా కొనసాగుతున్నాడు. తల్లి వెంకట నరసమ్మతో చిల్లర కొట్టులో... ఆహార నియమాలు కఠోరం బాడీ బిల్డర్స్ ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. రవి కుమార్ తీసుకునే చికెన్, ఫిష్, కూరగాయలలో కనీసం ఉప్పుగాని, మసాలాలుగాని వాడరు. సగం ఉడికినవే తినాలి. అంతే కాదు పోటీలకు 10 రోజుల ముందు నుంచి మంచినీరు తాగడం క్రమేపీ తగ్గించేస్తారు. పోటీలకు మూడు రోజుల ముందునుంచి చుక్క నీరు కూడా తీసుకోరు. అప్పుడే బాడీలో ఉండే మజిల్స్ను పోటీల్లో ప్రదర్శించే అవకాశం లబిస్తుంది. ఈ మూడు రోజులు వారు పడే అవస్థలు వర్ణాతీతం. అయినా వాటిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అప్పుడే కదా పతకాలు సాధించేది. సాధించిన పతకాలతో... ప్రపంచ కప్ పోటీలకు దూరం నవంబరు 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక అయ్యాడు రవి. కాని పేదరికం అడ్డొచ్చింది. స్పాన్సర్లు దొరకకపోవడంతో పోటీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పతకం సంపాదించాలనే తపన ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయాననే బాధ అతనిని పట్టి పీడిస్తోంది. అతను మాత్రం పట్టు వదలకుండా మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లాలని కఠోర శ్రమ చేస్తూనే ఉన్నాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 1–2, 2020 సంవత్సరంలో జరగనున్నాయి. స్పాన్సర్లు, ప్రభుత్వం చేయూతనిస్తే, తెలుగోడి సత్తా చాటి బంగారు పతకం సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ‘నాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గతంలో ప్రయత్నించి వదిలేసాను. వ్యాయామమే జీవితంలా బతుకుతున్నాను. దాని కోసం ఇంట్లో భారంగా ఉన్నా నెట్టుకొస్తున్నాను. ఒక్కొక్కసారి వదిలేద్దామని అనుకున్నా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాను. త్వరలో ముఖ్యమంత్రి జగనన్నను కలుస్తాను. ఆయనకు నా పతకాలన్నీ చూపిస్తాను’ అని ఆశగా చెబుతున్నాడు రవి కుమార్. – ఒ.వెంకట్రామిరెడ్డి, సాక్షి అమరావతి బ్యూరో -
నిన్న జనసేన.. ఈరోజు బీఎస్పీ
పశ్చిమ గోదావరి జిల్లా: ఎన్నికల వేళ తెలుగురాష్ట్రాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న అభ్యర్థులు మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇటీవలే ఏలూరు రేంజ్ డీఐజీగా పదవీ విరమణ చేసిన రవికుమార్ మూర్తి జనసేన పార్టీలో చేరారు. తన సొంత ప్రాంతమైన తిరుపతి ఎంపీ సీటును జనసేన నుంచి రవికుమార్ ఆశించారు. తిరుపతి సీటు దక్కకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనతో బీఎస్పీ అభ్యర్గిగా కొవ్వూరుకు మారారు. పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటును జనసేన బీఎస్పీకి కేటాయించిన సంగతి తెల్సిందే. నిన్నటి వరకు జనసేనలో ఉండి ఒక్క రోజులోనే కండువా మార్చి బీఎస్పీ అభ్యర్థిగా సోమవారం మాజీ డీఐజీ రవికుమార్ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అవాక్కవడం పార్టీ నేతల వంతైంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
మంచు విష్ణు ప్రాజెక్ట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్మన్ .. ఫొటోలు వైరల్
తప్పక చదవండి
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- ఏలియన్స్ ఉన్నట్లా? లేనట్లా?.. ఇంతకీ మస్క్ ఏమన్నారంటే?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
Advertisement