-
గ్యారంటీలే కాంగ్రెస్ విజయానికి బాటలు..
ఆదిలాబాద్: గ్యారంటీలే కాంగ్రెస్ విజయానికి బా టలు వేస్తాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో పార్టీ గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా తయారైందన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ ఎంపీ అభ్యర్థికి ఊహించిన దానికంటే ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశముందన్నారు. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు గుడిపెల్లి నగేష్, మంచికట్ల ఆశమ్మ, శ్రీ లేఖ, బండి దేవిదాస్, చారి, తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వలసలు ఆగేదెలా? -
ఇక.. నేటి నుంచి మరో రెండు గ్యారంటీలు ప్రారంభం
సాక్షి, యాదాద్రి: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి కింద రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బుధవారం నుంచి ఈ రెండు పథకాలు అమలులోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం జిల్లా కలెక్టర్కు పంపించింది. తెల్ల రేషన్కార్డు (ఆహార భద్రతా కార్డు) ప్రామాణికంగా ఈ రెండు పథకాలను వర్తింపజేయనున్నారు. వీటి ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందడంతో పాటు, నగదు బదిలీ పద్ధతిన గ్యాస్ వినియోగదారులకు రూ.500లకే సిలిండర్ అందనుంది. జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులు జిల్లాలో 2,16,942 ఆహార భద్రత కార్డులున్నాయి. జిల్లాలో 3,11,415 గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. ప్రజాపాలనలో గ్యాస్ సబ్సిడీ కోసం 2,30,412 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్యాస్ వినియోగదారులు ముందుగానే మొత్తం డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తరువాత ప్రభుత్వం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.500పోను మిగిలిన సబ్సిడీ మొత్తాన్ని బదిలీ చేస్తుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ప్రతి రీఫిల్కు రూ.500సబ్సిడీ అందనుంది. గడిచిన మూడు సంవత్సరాల్లో వినియోగదారులు గృహ అవసరాలకు వాడిన గ్యాస్ సిలిండర్ల ఆధారంగా గ్యాస్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా లెక్కలు తీశారు. మార్చి1 అనంతరం జీరో బిల్లులు.. జిల్లాలో ఉచిత కరెంట్ కోసం 2,09,899 మంది ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 200 యూనిట్ల లోపు వాడే గృహ విద్యుత్ వినియోగదారులు 1,61,099 మంది ఉన్నారు. వీరి వివరాలను విద్యుత్ శాఖ సేకరించింది. లబ్ధిదారుల స్థానికత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు, ఫోన్నంబర్లు సేకరించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబంలో ఒక నెలలో 200 యూనిట్ల వరకు జీరో బిల్లును ఇస్తారు. మార్చి 1 అనంతరం వచ్చే విద్యుత్ బిల్లులతో జీరో బిల్లు పథకం అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇవి చదవండి: లక్ష కోట్లు.. 5 లక్షల ఉద్యోగాలు -
ఈ ఏడాది ఆరు గ్యారంటీలపై ప్రజల్లో ఆశలు..
ఖమ్మం: ఈ ఏడాది ఖరీఫ్లో సరైన వర్షపాతం నమోదు కాకపోవడంతో పాటు అకాల వర్షాలు, తుపాన్తో రైతులు పంటలను నష్టపోయారు. ఇక రబీలో ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు లేక పంటలు లక్ష్యం మేర సాగయ్యే పరిస్థితి కనిపించక అన్నదాతలు దిక్కులు చూస్తున్నారు. అలాగే, ఉద్యోగ, ఉపాధి కోసం నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురుచూపుల్లో గడుపుతున్నారు. మరోపక్క సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం ఇటీవల ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించిన నేపథ్యాన త్వరలోనే తమకు ఫలాలు అందుతాయని ప్రజలు భావిస్తున్నారు. సూర్యుడు మకరంలోకి చేరుతూ వెలుగులను విరజిమ్మే కాలం నుంచి తమ జీవితాల్లోనూ వెలుగులు ప్రసరించాలని అంతా కోరుకుంటున్నారు. కష్టనష్టాలు, ఒడిదుడుకుల మధ్య సాగిన బతుకులు ఈ పండుగ నుంచి మారాలని కోటి ఆశలతో ఆకాంక్షిస్తున్నారు. ఇవి చదవండి: కస్టం మిల్లింగ్ కహానీ.. -
సంక్షేమంపై దూకుడు
సంగారెడ్డి: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లా అధికార యంత్రాంగం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతిష్టాత్మక పథకాలను వీలైనంత త్వరగా లబ్ధిదారుల చెంతకు చేరేలా చర్యలు చేపట్టింది. ప్రధానంగా గొర్రెల పంపిణీ, దళితబంధు వంటి పథకాలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో తొలి విడతలో 18,754 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. అయితే రెండో విడతలో 10,331 మందికి ఈ యూనిట్లను అందించాల్సి ఉండగా, ఈ పంపిణీ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్బంగా ఈ యూనిట్లను పంపిణీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, గొర్రెలు కొనుగోళ్లు ఆలస్యం కావడంతో ఈ పంపిణీ ప్రక్రియ ముందుకు సాగలేదు. ప్రొక్యూర్మెంట్ టీంలు గొర్రెలను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పటికీ వాటిని ఇక్కడికి తేవడంలో జాప్యం జరుగుతోంది. దీంతో సుమారు 10 వేల యూనిట్లు పంపిణీ చేయాలని భావించినప్పటికీ ఇప్పటి వరకు కేవలం 342 యూనిట్లు మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కొందరు లబ్ధిదారులకు ఈ యూనిట్లకు సంబంధించిన గొర్రెలను ఇచ్చారు. దళితబంధు జాబితా వెరిఫికేషన్.. ప్రతిష్టాత్మక పథకాల్లో ప్రధానమైన దళితబంధు పథకం రెండో విడత అమలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయా నియోజకవర్గాల నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాను అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నారు. తొలి విడతలో నియోజకవర్గానికి వంద చొప్పున దళితబంధు లబ్ధిదారులకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఈ యూనిట్లు ఇప్పటికే గ్రౌండింగ్ పూర్తయింది. అయితే తొలి విడతలో నియోజకవర్గానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి సాచ్యూరేషన్ పద్ధతిన ఆ గ్రామంలోని దళితులందరికి ఈ పథకం కింద యూనిట్లను మంజూరు చేసిన విషయం విదితమే. ఇప్పుడు నియోజకవర్గానికి 1,100 చొప్పున యూనిట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలను అందజేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి లబ్ధిదారుల జాబితాలు కలెక్టరేట్కు రాగా, ఒక్క జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఈ జాబితా రావాల్సి ఉంది. రెండు, మూడు రోజుల్లో ఇది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాలు మెదక్ జిల్లా పరిధిలో ఉండటంతో ఆయా మండలాల జాబితాలు మెదక్ జిల్లా కలెక్టరేట్కు పంపుతున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే దళితబంధు యూనిట్లను మంజూరు చేసేందుకు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కలెక్టర్ సమీక్షలు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలపై కలెక్టర్ శరత్ తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు ముందస్తు ఏర్పాట్లు, సన్నాహాలు చేస్తూనే.. మరోవైపు ఈ సంక్షేమ పథకాల అమలు తీరుపై సంబంధిత శాఖ అధికారులు, మండలాల్లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. దళితబంధు, గొర్రెల పంపిణీ పథకం అమలుపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేసిన కలెక్టర్.. ఈ రెండు పథకాల అమలును వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఎన్నికల కోడ్ వచ్చేలోగా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. -
మరపురాని మహానేత వైఎస్సార్.. ది లెజెండ్
వైఎస్సార్ .. ఆ పేరు వినపడగానే తెలుగునేల మీద ప్రతి గుండె స్పందిస్తుంది. మహానుభావుడు.. అంటూ ఆయన జ్ఞాపకాలను తడుముకుంటుంది. మరపురాని మహానేత వైఎస్సార్.. ది లెజెండ్. 2009.. సెప్టెంబర్ 2. ఒక దుర్దినం. తెలుగుజనం గుండెమీద బండ పడ్డ దినం. నిరంతరం తమ గురించి, తమ మేలు గురించి ఆలోచించే ఓ పాలకుడిని కోల్పోయిన రోజు. పదమూడేళ్లు గడిచిపోయాయి. ఆ జ్ఞాపకాలు చెరిగిపోలేదు. ఆ రూపం చెదిరిపోలేదు. ఆ నవ్వుల రేడు...సంక్షేమసారధి లేడుగానీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాడు. జోహార్ వైఎస్సార్. వర్షం గురించి కలవరించే మనిషి. ఊరూరా వర్షం లెక్కలు వేసుకునే ముఖ్యమంత్రి. జలసిరులతో పంటలు బాగా పండాలని, రైతన్నల గడపల్లో సంతోషం వెల్లివిరియాలన్నది నిరంతర తపన. వైఎస్సార్ దగ్గర పనిచేసిన అధికారులు తరచూ గుర్తు చేసుకునే విషయమిది. వర్షం పడుతుంటే కిటికీ పక్కన చేరి హర్షాతిరేకం ప్రకటించే వైఎస్సార్ కన్నా రైతుబంధువు ఎవరుంటారు? పదమూడేళ్ల క్రితం ఆ సెప్టెంబర్ 2న కూడా అదే రోజు. మేఘాలు పట్టాయి. రాజన్న ప్రజాబాట పట్టారు. రచ్చబండలో ప్రజాసమస్యలను నేరుగా తెలుసుకోవాలని బయలు దేరారు. వర్షం మొదలయిందో.. ముందే దుశ్శకునం పలికిందో ఆకాశం భోరుమంది. వైఎస్సార్ పయనిస్తున్న హెలికాప్టర్ పావురాలగుట్టలో కూలింది. అంతా అన్వేషణ. రాజన్న తిరిగొస్తాడన్న ఆశ. ఆయన రాలేదు. తిరిగిరాని లోకాలకు మరలిపోయిన రాజన్న ఇక లేడన్న చేదునిజం భరించడానికి వేలాది గుండెలకు సాధ్యం కాలేదు. ఆ దుఃఖసాగరంలోనే మునిగిపోయిన జీవితాలెన్నో... గుండెలాగిపోయిన బతుకులెన్నో.. కాలం ఆగిపోలేదు. కదలిపోతూనే వుంది. పదమూడేళ్లపోయినా రాజన్న స్మృతులు చెరిగిపోలేదు. ఎక్కడ సంక్షేమ ఫలాలు అందుతున్నా. ఎక్కడ అభివృద్ది జాడలు కనిపించినా...ప్రాజెక్టులు కనిపించినా రాజన్న పేరే తలపుకొస్తుంది. తన ముందు తన తర్వాత కూడా ఏ నాయకుడూ తలపెట్టలేనని పథకాలను ప్రవేశపెట్టిన ఆ ఘన చరిత్ర చరిత్ర పుటల్లో చెరగని ముద్ర. రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైయస్ రాజశేఖరరెడ్డిది బలమైన ముద్ర. ఆయన జీవితం ప్రజలతో ముడిపడిపోయింది. అది విడదీయలేని బంధం. అంతే కాదు, వైఎస్సార్ హయాంలో ప్రతి పేదకుటుంబానికి జరిగిన మేలెంతో ఉంది. అటు విద్యారంగంలోనూ, ఇటు వైద్యరంగంలోనూ, వ్యవసాయరంగంలోనూ వైయస్సార్ ప్రజలకు చేసిన మేలెంతో! హిమగిరి ఎవరెస్టే అందుకు ప్రామాణికం. ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అన్నది.. వైఎస్సార్ జీవనసిద్దాంతం. అందుకు అనుగుణంగానే ఆయన జీవించారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారు. సువిశాల ఆంధ్రప్రదేశ్ ప్రగతిని కలవరించి, పలవరించారు. రాష్ర్టరూపురేఖలను తీర్చిదిద్దే క్రమంలో నిరంతరం శ్రమించారు. హరితాంధ్రప్రదేశ్ను స్వప్నించారు. ఆరోగ్యాంధ్రప్రదేశ్కోసం అద్భుతాలు చేశారు. ఆదర్శాంధ్రప్రదేశ్ సాధనలో విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఓ దార్శనికుడు. పేదబిడ్డల పెద్దచదువులకు పేదరికం అడ్డు కాకూడదని వైయస్..తన పాదయాత్ర దారిలోనే సంకల్పించారు. చదువులు చదివితే..ఉద్యోగాల్లో స్థిరపడితే, ఆ పేదింట తలరాతే మారిపోతుందన్నది ఆయన దార్శనికత. ఆలోచనను అద్భుతరూపంలో తీర్చిదిద్దారు. ఫీజురీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేదింటబిడ్డల పెద్దచదువులకు దీపం వెలిగించారు. వైయస్సార్ హయాంలో లక్షలాది మంది పేదింటబిడ్డలు ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యారు. తమ తలరాతలే మార్చుకోవడమే కాదు, కుటుంబాల తలరాతలు మార్చారు. ఆ పథకం లబ్దిపొందిన కుటుంబాల్లో నేటికీ వైయస్సార్ను తలచుకోనిదే పొద్దుగడవదు. ఆ మహానుభావుడి చలవే ఇదంతా.. అన్నది లబ్దదారుల గడపల్లో ఓంకారమైన ధ్వనిస్తుంటుంది. నిరుపేదల సంజీవని రాజీవ్ ఆరోగ్యశ్రీ. అనారోగ్యం ఎవరికైనా ఒకే విధమైన బాధ కలిగిస్తుంది. కానీ పేదవాడికి అది పెనుశాపమై పీడిస్తుంది. వైయస్కు ముందు పేదల అనారోగ్యబాధల గురించి పెద్దగా ఆలోచించిన నాయకులు లేరు. బీద,బిక్కి, అనారోగ్యం పాలైతే ఆదుకునే నాథుడే కరువయ్యారు. ఒక డాక్టర్గా రోగి బాధ తెలిసిన డాక్టర్ రాజశేఖరరెడ్డి, పేదలకు ఆరోగ్యభద్రతపై శ్రద్దపెట్టారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట బీదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం ద్వారా నిరుపేదలకు ధనవంతులతో సమానంగా కార్పొరేటు స్థాయి ఆస్పత్రులలో ఉచితంగా వైద్యసౌకర్యాలు అందగలిగాయి. ఆ పథకం ద్వారా నాడు.. నేడు లబ్దిపొందిన.. పొందుతున్నవారు లక్షలాదిమంది. లక్షలాది కుటుంబాలకు అది పెద్ద భరోసా. ఆపదలో ఆపన్నహస్తంలా 108 అత్యవసర అంబులెన్స్ సేవలు, నడిచే వైద్యశాలగా 104 మొబైల్ ఆస్పత్రులు అందుబాటులోకి తెచ్చారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ విప్లవాత్మక పథకాలు అనితరసాధ్యమైనవి. అసలు సిసలు ప్రజానాయకుడి మాత్రమే వచ్చే ఆలోచనలవి. ఇలా ప్రజాజీవితాల్లో.. మరీ ముఖ్యంగా పేదల జీవితాల్లో వెలుగులు నింపే పథకాలెన్నో వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్నవే. ప్రజాసంక్షేమమే శ్వాసగా జీవించినవాడు వైఎస్సార్.. ఆయన రాజకీయాల్లో వేసిన ప్రతి అడుగూ.. ఆ దిశగానే సాగాయి. ముఖ్యమంత్రిగా ఆయన తెచ్చిన సంక్షేమపథకాలు, చేసిన అభివృద్ది పనులు గుర్తు చేసుకుంటే.. ఇదంతా మరొకరి వల్ల సాధ్యమయ్యేదేనా? అనిపించకపోదు. ప్రజాసేవలో అనుక్షణం తపించిపోయిన వైయస్సార్ సంకల్పబలం ఆయనకు మాత్రమే స్వంతమైనది. ఎన్నెన్ని పథకాలు.. ఊరువాడా, పట్టణాల తలరాతలు మార్చేశాయో! రాజశేఖరుడు జననేత. వారికేం కావాలో ఆయనకు తెలుసు. ప్రజల సమస్యలు ఎలా తీర్చాలో ఆయనకు తెలుసు. అందుకే, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిపై దృష్టి సారించారు. ప్రజాసంక్షేమమే శ్వాసగా పరిపాలన సాగించారు. అరకొరగా పథకాలను అమలు చేయడం కాకుండా.. సంతృప్తస్థాయిలో అందరికీ అన్నీ ఇవ్వాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగారు. ముఖ్యమంత్రిగా ఆయన తొలిసంతకం ఉచితవిద్యుత్తు, విద్యుత్ బకాయిల మాఫీపై సంతకం చేశారు. ఆయన ముఖ్యమంత్రి కావడానికి ముందు తొమ్మిదేళ్ల కరవు నేర్పిన పాఠాలను గుర్తుపెట్టుకున్నారు. ఆ పాఠాలతోనే జలయజ్ఞానికి శ్రీకారం చుట్టారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీళ్లను ఒడిసి పట్టి రిజర్వాయర్లలో నిలిపితే, కరవు సమయంలో రైతన్నలను ఆదుకోవచ్చనే ఉద్దేశంతో, వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో 81 ప్రాజెక్టులను నిర్మించి, కోటి ఎకరాలకు నీరందంచాలన్నదే ఈ అపరభగీరధుడి లక్ష్యం. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలకు ఆయన ఇచ్చిన వరం పావలా వడ్డీ. మొదట స్వయం సహాయక సంఘాల మహిళలకే ఈ పధకాన్ని ఇచ్చినా, ఆ తర్వాత రైతులతో పాటు వివిధ వర్గాలకు కేటాయించారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానన్నది రాజన్న లక్ష్యం. మహిళల ఆర్ధికస్వావలంబనే కుటుంబాల వెలుగు అన్నది ఆయన ఆలోచన. అలాగే ఏ ఆసరాలేని వృద్దులు, వితంతువులు, వికలాంగులు..ఇలా దాదాపు 70లక్షల మందకి ఫించను పథకాన్ని విస్తరించడమే కాదు, నెలనెలా అందేలా చేశారు. ఇందిరమ్మ ఇళ్లు, ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ ,మహిళలకు అభయహస్తం. నిరుపేదలకు రూ.2కే కిలోబియ్యం ఇలా ఎన్నెన్నో పథకాలు విజయవంతంగా అమలు చేసిన వైయస్సార్ను ఒకే ఒక్కడు అనక తప్పదు. కలలు అందరూ కంటారు. కానీ అవి సాకారం అయ్యేలా శ్రమించడం కొందరే చేస్తారు. ముఖ్యమంత్రిగా వైయస్సార్ ఐదేళ్ల పాలనా కాలం పాలకులకుల ఆదర్శప్రాయం. రాజశేఖరరెడ్డికి ప్రజల మనసు తెలుసు. ప్రజలకు ఏం కావాలో తెలుసు. అభివృద్ది ఎంత అవసరమో తెలుసు. దానికోసం ఏ స్థాయిలో కృషి చేయాలో తెలుసు. సమర్ధపాలనకు వైయస్సార్ కేరాఫ్ అడ్రస్. రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షనేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దేశస్థాయిలో గుర్తింపు పొందారు. ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి పని చేయించాలో చాటి చెప్పిన రాజకీయ నాయకులలో వైయస్ చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది. ప్రతిపక్షనేతగా వైయస్ ప్రజల హృదయాల్లో నాటుకొనిపోయారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. వైఎస్సార్ జనహృదయనేత.. జనహృదయాలను గెలిచిన నేతలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు అనేందుకు వైఎస్సార్ ఓ ఉదాహరణ. ఆయన ఓ లెజెండ్ ఆఫ్ పాలిటిక్స్. ముఖ్యమంత్రిగా ఉన్నా...ప్రతిపక్షంలో ఉన్నా ఆయనది ఒకే తీరు. ప్రజాసమస్యల పరిష్కారమే ఆయన ప్రధాన ఎజెండా. అనాథలను, అభాగ్యులను ఆదరిస్తూ...అభివృద్ది ఫలాలకు నోచుకోని మట్టిబిడ్డల అభివృద్దే లక్ష్యంగా పనిచేసిన జనహృదయనేత వైయస్సార్. మిన్ను విరిగి మీద పడ్డా భయపడని ధృఢమైన వ్యక్తిత్వం వైఎస్ రాజశేఖరరెడ్డిది. నమ్మినవారికి ప్రాణాలు అడ్డువేసే ఆయన వ్యక్తిత్వమే కార్యకర్తల్లో, నాయకుల్లో ఆయనకంటూ ఒక ఇమేజ్ తెచ్చింది. అత్యంత జనాకర్షణ ఉన్న నేతగాపేరు సంపాదించిపెట్టింది. పేదలు, రైతులు, చేను, చెట్టు, మట్టి, గ్రామీణం, వ్యవసాయం ఇవి వైయస్కు ఇష్టమైన పదాలు. ఫీజు రీయింబర్స్మెంట్తో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్తులకు పెద్ద చదువులు, ఆరోగ్యశ్రీతో కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందచేసిన నిజమైన విద్యాధికుడు, డాక్టర్ వైయస్సార్. రెండురూపాయల బియ్యం, వృద్దులకు, వికలాంగులకు నెలనెలా పెన్షన్లు, అర్హులందరికీ తెల్లకార్డులు, బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చిన అండదండలు, అన్నింటికీ మించి ప్రజల పట్ల, ప్రజాసేవ పట్ల ఆయనకున్న చిత్తశుద్ది, నిబద్దత తిరిగి రెండోసారి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. విలువలు, విశ్వసనీయతలే ప్రాణంగా... రైతులు, సేద్యం, పేదలు, అభివృద్ది ప్రాతిపదికగా సాగిన వైఎస్ పాలనకు వరుణుడు మనసారా సహకరించారు. ఐదేళ్లు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మనుషుల్ని ప్రేమించడమెలాగో వైఎస్కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. అది ఆయనకు సహజంగా అబ్బిన గుణం. మాటంటే మాటే. పోరాటమంటే పోరాటమే. అంతే....ధైర్యం, సాహసం, పట్టుదల, రిస్క్ తీసుకోవడం, ఆలోచనలతో తాత్సారం చేయకపోవడం.. ఎప్పుడూ ఉల్లాసంగా ఉండడం, జనాన్నినమ్మడం లాంటి ప్రతేక లక్షణాలకు పెట్టింది పేరు.. వైఎస్సార్. నేను ఏ నాటికైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగలను. ఆ విశ్వాసం నాకుంది అని.. రాజకీయాల్లో అడుగుపెట్టిన మొదటి రోజుల్లోనే వైఎస్సార్ ఎక్కువగా అంటూ వుండేవారట. ఏనాటికైనా ముఖ్యమంత్రి కావాలని స్వప్నించిన వైఎస్.. అందుకనుగుణంగా ప్రణాళికలు ఏర్పరచుకోవడం మొదలెట్టారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉండటం అలవరచుకున్నారు. ఊరికే కలవడం కాదు, వారి కష్టసుఖాలు తెలుసుకోవడం, తనకు వీలయినంత సాయం చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ప్రజాసమస్యలపై నిజాయితీగా పోరాడాలన్న సిద్దాంతం వైయస్సార్ది. ఆ విషయంలో రాజశేఖరుడి చిత్తశుద్దిని శంకించలేనిది. మండుటెండాకాలంలో నాటి వైయస్సార్ పాదయాత్ర ఆయన్న జనహృదయాలకు మరింత దగ్గర చేసింది. అది కరువు కాలం. రైతుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోయాయి. ఆత్మహత్యల స్థాయి దాటి ఆకలిచావులు ముంచుకొచ్చాయి. గ్రామీణులు, రైతులు, రైతు కూలీలు, చేతివృత్తులవారు, నిరుపేదలు, నిరుద్యోగులు, చిన్నచిన్న వ్యాపారులు..ఇలా అన్ని వర్గాలు, రకరకాల పీడలు, పీడనల్లో నలిగిపోయాయి. సంప్రదాయ గ్రామీణ ఆర్ధికవ్యవస్థ ఛిన్నాభిన్నమైంది. మొత్తానికి పల్లెలు కన్నీరు పెడుతున్న వేళ వైయస్సార్ పాదయాత్రికుడయ్యారు. 1400కిలోమీటర్లకు పైగా నడిచారు. ఆ కష్ణకాలంలో ప్రజలకు నేనున్నానన్న భరోసానిచ్చారు. అధికారంలోకి రాగానే ప్రజాసంక్షేమమే పరమావధిగా పనిచేస్తానని శపథం చేశారు. వైయస్సార్ను జనం నమ్మారు. ఆయన్ను, ఆయన పార్టీని 2004లో అఖండ మెజారిటీతో గెలిపించారు. 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ ప్రజలకు చేయని మేలంటూ లేదు. 2009 ఎన్నికల్లోనూ వైఎస్సార్ వెంటే నిలిచారు జనం. అన్ని రాజకీయపార్టీలు ఒక్కటైనా, ఒకే ఒక్కడుగా వైఎస్సార్ తన పార్టీని గెలిపించారు. రెండోసారి వైయస్సార్ ముఖ్యమంత్రి కావడం ఓ చారిత్రాత్మక ఘట్టం. ఆ తర్వాత వందరోజుల పాటే ఆయన పాలన సాగింది. విశాలాంధ్రప్రదేశ్ అదృష్టం అక్కడితో ఆగింది. వైఎస్సార్లాంటి ప్రజలమనిషి, ఆత్మీయమూర్తి అరుదుగా ఉంటారు. నూటికో..కోటికో ఒక్కరు అంటారే, అలాగన్నమాట. వ్యవస్థ ఏదైనా కావచ్చు. పాలకుడి విధానాల్లో స్పష్టత, ఆచరణలో చిత్తశుద్ది ఉంటే ప్రజల జీవన స్థితి ఎలా మెరుగుపడుతుందో అన్నదానికి, డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఓ ఉదాహరణ. ఆయన దూరదృష్టి, దార్శనికత భవిష్యత్తుకు మార్గదర్శి. ఆయన మహానాయకుడు. మరిచిపోలేని మన రాజన్న చిరస్మరణీయుడు. -
యూపీ ప్రజలకు సీఎం యోగి భారీ ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీల్లో భారీ విజయాన్ని అందుకున్న అధికార బీజేపీ పార్టీ శుక్రవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సీఎంగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే 52 మందిలో కేబినెట్ను విస్తరించారు ఇదిలా ఉండగా శనివారం మంత్రి మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం యోగి కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలో ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు. కాగా, యూపీలో రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ పథకమే కీలక పాత్ర పోషించింది. ఇక, సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్ అందనుంది. అయితే, కరోనా సమయంలో పేద ప్రజలకు ఉచిత రేషన్ పథకాన్ని కొనసాగించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం బ్రిజేశ్ పాఠక్ మాట్లాడుతూ.. పేదలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ప్రజలకు అందాలన్నది తమ ఉద్దేశమని వెల్లడించారు. సీఎం యోగి నిర్ణయంతో యూపీలో ఉన్న దాదాపు 15 కోట్ల పేదలకు ఈ పథకం ద్వారా ఉచిత రేషన్ అందనుంది. మూడు నెలల ఉచిత రేషన్ అందిస్తున్నందుకు గాను ప్రభుత్వం రూ. 3,270 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్కొన్నారు. -
పథకాల అమలు జగన్తోనే సాధ్యం
మట్టెవాడ, న్యూస్లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలం టే.. జగన్ సీఎం అయితేనే సాధ్యమవుతుందని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ముత్తినేని సోమేశ్వర్రావు అన్నారు. నగరంలోని హంటర్రోడ్లో గల జిల్లా, అర్బన్ పార్టీ కార్యాలయంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్వర్రావు కేక్ కట్ చేసి, పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీ కుట్రల ఫలితంగా జగన్ 16 నెలల జైలు జీవితం గడిపారని అన్నారు. ప్రస్తుతం ప్రజలు ఆయన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్ 21న సీఎంగా జగన్ పుట్టిన రోజును జరుపుకుంటామన్నారు. కార్యక్రమంలో అర్బన్ కన్వీనర్ టి.రమేష్బాబు, తూర్పు కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రాము, టి.అశోక్రా వు, భీంరెడ్డి సుధీర్రెడ్డి, శంకేశి సుధాకర్, మునిగాల కల్యాణ్రాజ్, పులిశేరి నరేందర్, కిషన్, జ్యోత్స్న, సాల్మన్రాజ్, జలంధర్, రాంచందర్, శంషొద్దీన్, భద్రొద్దీన్, ఖాదర్, సోహెల్, విజయ్ పాల్గొన్నారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో... వైఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకలను వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు కందుకూరి మహేందర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి పంచారు. కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్రె డ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్రాజ్, నాయకులు శివ, పల్లె రాహుల్రెడ్డి, సంతోష్, పసుపునూటి కిరణ్, భద్రుద్దీన్, పల్లకొండ సతీష్, నాగపూరి దయాకర్, మనీష్, సందీప్ పాల్గొన్నారు. యువజన విభాగం ఆధ్వర్యంలో... సుబేదారి : వైఎస్సార్ సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను సుబేదారిలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు భీంరెడ్డి సుధీర్రెడ్డి బర్త్డే కేక్ను కట్ చేసి, జన్మదిన వేడుకలు జరిపారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ విభాగం జిల్లా అధ్యక్షుడు మునిగాల కల్యాణ్రాజ్, జిల్లా అధికార ప్రతినిధి షంషేర్బేగ్, మైనార్టీ విభాగం నాయకులు భద్రుద్దీన్ఖాన్, దయాకర్, జీడికంటి శివ, నాగవెల్లి రజనీకాంత్, ముజఫరుద్దీన్, ప్రేమ్, అఖిల్, పసుపునాటి కిరణ్, శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. జగన్కు ప్రజాబలం.. దేవుడి అండ చెన్నారావుపేట : వైఎస్.జగన్కు ప్రజాబలం, దేవు డి అండ ఉందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ వుు త్తినేని సోమేశ్వర్రావు అన్నారు. స్థానిక సీఎస్ఐ చర్చిలో వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని రెవ ఆకుల స్వామి, సోమేశ్వర్రావు శనివారం కేక్ కట్ చేశారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సోమేశ్వర్రావు వూట్లాడుతూ క్రీస్తు జన్మించిన డిసెంబర్ వూసంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి జన్మించారని, ఆయున జన్మ దిన వేడుకలను జరుపుకోవడం సంతోషకరవుని అన్నారు. మహానేత దివంగత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేవు పథకాలు జగనన్న సీఎం అయితేనే అవులులోకి వస్తాయన్నారు. వరంగల్ తూర్పు కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రావుు, అర్బన్ కన్వీనర్ రమేష్బాబు, నర్సంపేట కోఆర్డినేటర్ నాడెం శాం తికువూర్, నర్సంపేట వుండల కన్వీనర్ నూనె నర్సయ్యు, చెన్నారావుపేట వుండల కన్వీనర్ బిల్లా ఇంద్రసేనారెడ్డి, బండి రమేష్, వలస రావుూ్మర్తి, సీనాడ్ సభ్యుడు ఆకుల కీర్తికువూర్, వీరస్వామి, కల్లెపు రాజశేఖర్, సాటిక రాజు పాల్గొన్నారు.
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఆ జానర్ వదిలేసిన గుణశేఖర్.. అలాంటి కథతో కొత్త మూవీ
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
పడిలేసిన పసిడి.. పరుగులు పెడుతున్న వెండి: నేటి కొత్త ధరలు ఇలా..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు..
టైటిల్ దాచి కొత్త సినిమా ఆప్డేట్ ఇచ్చిన కల్యాణ్ రామ్
నెలకు రూ.4 కోట్లు అద్దె చెల్లించనున్న గూగుల్
టాప్ 30 హెడ్లైన్స్@11:30AM 28 May 2024
ఆస్తిపై కన్నేసి.. ప్రేమను కాదన్నాడని కక్ష పెంచుకుని.. !
నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి..
తప్పక చదవండి
- కుప్పకూలిన క్వారీ.. పది మంది మృతి
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- రోడ్డు ప్రమాదాలకు చెక్.. టూ వీలర్లకు కొత్త లేన్
- మాజీ ఎమ్మెల్యే అనిశెట్టి బుల్లబ్బాయి రెడ్డి కన్నుమూత
- ఇప్పుడు అతడు మారిపోయాడు.. టీమిండియా రీ ఎంట్రీ పక్కా!
- ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
- శ్రీహరికోట: అగ్నిబాణం.. ప్చ్ మళ్లీ వాయిదా
- Today Horoscope: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది
- రిఫరీ తొండి అయినా... సగటు ఓటరే విజేత!
Advertisement