-
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
-
చందు సూసైడ్ వెనక సంచలన నిజాలు
-
పవిత్ర భర్త చంద్రకాంత్ సూసైడ్
-
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
'మామగారు' సీరియల్ హీరో గంగాధర్ పెళ్లి చేసుకున్నాడు. అదేనండి సీరియల్ నటుడు ఆకర్ష బైరమూడి.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ యాక్టర్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!)కర్ణాటకలోని సక్లేష్పురలో పుట్టి పెరిగిన ఆకర్ష్.. కన్నడ, తెలుగు సీరియల్స్లో హీరోగా చేసి క్రేజ్ సంపాదించాడు. పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్నిపరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ తదితర సీరియల్స్ ఇతడు చేసిన వాటిలో ఉన్నాయి. అలానే 'మామగారు' సీరియల్ కూడా ఇతడి చేస్తున్నాడు.గత కొన్నిరోజుల నుంచి బ్యాచిలర్ పార్టీ, హల్దీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూ వచ్చాయి. దీంతో ఆకర్ష్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అతడి అభిమానులు అనుకున్నారు. తాజాగా ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోని యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే అమ్మాయి ఎవరనేది మాత్రం సస్సెన్స్ గానే ఉంచేశాడు. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) -
తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్.. భార్యతో కలిసి గుడ్న్యూస్ చెప్పిన హీరో
ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.తెలుగువారికి సుపరిచితుడే!చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.చందన్పై బ్యాన్అయితే ఈ సీరియల్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇటీవలే కొత్త బిజినెస్కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by K A V I T H A (@iam.kavitha_official) -
Manjula Nirupam Photos: బుల్లితెర జంట నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
లోక్సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్కు ముందు టీవీ సీరియల్ మహాభారత్లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్పై, రాహుల్పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్ను ఓడించి తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
హిందీ సీరియల్ యాక్టర్ అర్జున్ బిజ్లానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా తెలియజేస్తూ.. తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ ఆస్పత్రి బెడ్పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. నాగిన్(తెలుగులో నాగిని) మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్ తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్. ఒకవైపు సీరియల్స్, మరోవైపు రియాల్టీ షోలల్లో పాల్గొంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నాగిని సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలియా భట్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి, తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ అతని ఫ్యాన్స్తో పాటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) -
నటుడు 'దయ' మృతికి కారణాలివే..
సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిచివేస్తోంది. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్తో పవిత్రనాథ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దయ పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ రోల్ తన కెరీర్కు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. ఈ పాత్ర ద్వారానే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సీరియల్స్లో నటించినా మొగలిరేకులు, చక్రవాకం తెచ్చిపెట్టినంత పేరు మాత్రం రాలేదు. నాలుగురోజులుగా అస్వస్థత కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన పవిత్రనాథ్ మార్చి 1న మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే మరణించడానికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పవిత్రనాథ్ కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. ఇండస్ట్రీ మిత్రులకు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది! గత నాలుగురోజులుగా పవిత్రనాథ్ అస్వస్థతకు లోనయ్యారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది! ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. హార్ట్ ఫెయిల్యూర్ కారణంతో పవిత్రనాథ్ మరణించారని వైద్యులు వెల్లడించారు. కాగా కొన్నేళ్ల క్రితం పవిత్రనాథ్.. అతడి భార్య శశిరేఖ మధ్య గొడవలు తలెత్తాయి. భర్త మీద ఎన్నో ఆరోపణలు చేసింది. అయినా సరే నటుడు వాటి గురించి పట్టించుకోలేదు. ఏనాడూ సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఆ సమయంలో మానసికంగా వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్ -
'మొగలిరేకులు' నటుడు దయ కన్నుమూత
ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. మొగలిరేకులు సీరియల్లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది. 'పవి.. ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం.. మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైనవాడివి. నీ మరణవార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. ఇది నిజం కాకూడదు.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చివరి చూపు కూడా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్లో పవిత్రనాథ్ ముఖ్యపాత్రలో నటించారు. 'మొగలిరేకులు' ధారావాహికలో ఇంద్రనీల్ తమ్ముడు దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Meghna Raami (@raamimeghna) చదవండి: డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. క్రిష్ నమూనాల సేకరణ..! -
సీరియల్ హీరోయిన్తో పెళ్లి.. విడాకులిచ్చిన విలన్
ప్రేమ-పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. జీవితకాలం ప్రేమించడం, కలిసుండటం కష్టమే అని చేతులెత్తేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మలయాళ సెలబ్రిటీ జంట జిషిన్ మోహన్- వరద వచ్చి చేరింది. వీరు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా మాలీవుడ్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇది నిజమేనని ధ్రువీకరించాడు జిషిన్. తాము విడిపోయామని వెల్లడించాడు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అంత టైం లేదు తాను ఓ సీరియల్ నటిని పెళ్లాడినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. దేవుడి దయ వల్ల సీరియల్స్తో బిజీగా ఉన్నాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేంత సమయం లేదు అని చెప్పుకొచ్చాడు. రీల్ లైఫ్లో హీరోయిన్- విలన్గా ఉన్న వీరు రియల్ లైఫ్లో మాత్ం జోడీ కట్టారని సంతోషించేలోపే ఇలా జరిగిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏడుస్తూ ఉండనక్కర్లే! తాజాగా వరద సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టింది. 'నిన్న నవ్వాను, ఈ రోజు నవ్వుతూనే ఉన్నాను. రేపు కూడా నవ్వులు చిందిస్తూనే ఉంటాను. జీవితం చాలా చిన్నది. ఏడుస్తూ గడపడం కాదు జీవితమంటే..!' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. మీ ఇద్దరి మధ్య ఏమైంది? ఎందుకని విడిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అమల అనే సీరియల్లో వరద హీరోయిన్గా, జిషిన్ విలన్గా నటించాడు. ఆ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు విడాకులు తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చదవండి: కథ వినలేదు, జోక్యం చేసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా.. అదీ అతడి గొప్పతనం! -
పెళ్లి చేసుకోనున్న నిఖిల్-కావ్య? నటుడి ఆన్సరిదే!
ఆన్స్క్రీన్లో జంటగా కనిపించే సెలబ్రిటీలు రియల్ లైఫ్లో కూడా జోడీగా ఉంటే చూడాలని ముచ్చటపడుతుంటారు అభిమానులు. అలాగే చాలామంది రీల్ జంటగా మిగిలిపోకుండా రియల్ లైఫ్లోనూ పెళ్లి చేసుకుని చూపించారు. ఈ క్రమంలో బుల్లితెర జంట కావ్య-నిఖిల్కు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఏ షోకి వెళ్లినా జంటగా వెళ్లే వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నిస్తున్నారు. నిజమైన దంపతులుగా చూడాలని ఉందని అభిమానులు తహతహలాడుతున్నారు. తను నాకు ఫ్రెండ్గా దొరకడమే గ్రేట్ ఈ క్రమంలో పెళ్లిపై పెదవి విప్పాడు నటుడు నిఖిల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'కావ్య చాలా మంచి అమ్మాయి, మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తే బాగుండని నాలాంటి ప్రతీ అబ్బాయి కోరుకుంటాడు. నిజం చెప్పాలంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్గా దొరకడమే గొప్ప. మీరంతా లవ్వు, గివ్వు అని ఎక్కడికో వెళ్లిపోతున్నారు. జనాలకు మేము జంటగా కనిపిస్తే ఇష్టం. అందుకే మేమిద్దరం కలిసే షోలు చేస్తాము. మేము పెళ్లి చేసుకుంటామా? లేదా? అన్నది మా చేతుల్లో లేదు. పెళ్లి గురించి ఆలోచించట్లే అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మా ఇంట్లో పెళ్లి గురించి తొందరపడటం లేదు. కాబట్టి ఇప్పట్లో దాని జోలికి వెళ్లను' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. త్వరలోనే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ రియల్ కపుల్గా ప్రమోషన్ పొందాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరిద్దరూ ప్రస్తుతం ఓ సీరియల్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. చదవండి: విఘ్నేశ్ ఎల్ఐసీ.. సినిమా నుంచి తప్పుకున్న నయనతార? -
పండక్కి గుడ్న్యూస్ చెప్పిన బుల్లితెర బ్యూటీ
బుల్లితెర నటి సురభి చందన గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది. 13 ఏళ్లుగా ప్రియుడు, నటుడు కరణ్ శర్మతో డేటింగ్లో ఉన్న ఆమె అతడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. పెళ్లెప్పుడు? ఎక్కడ? అనే వివరాలను పూర్తిగా ప్రకటించలేదు. పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు అయితే ఆమెకు పెళ్లవబోతున్న విషయాన్ని సురభి పెంపుడు కుక్క చెప్తున్నట్లుగా మై హ్యూమన్స్ ఆర్ గెటింగ్ మారీడ్ (నా మనుషులు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు) అని రాసి ఉన్న బోర్డు ముందు దిగిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. 13 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంతో పదిలం చేసుకోబోతున్న ఈ ప్రేమజంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సురభి హిందీ సూపర్ హిట్ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. ఇద్దరికీ సీరియల్స్ ద్వారానే క్రేజ్ 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'షెర్డిల్ షెర్గిల్' సీరియల్స్లో నటించింది. 'బాబీ జాసూస్' అనే హిందీ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ఇది ఆమె వెండితెరపై నటించిన ఏకైక సినిమా! కరణ్ శర్మ విషయానికి వస్తే ఇతడు కూడా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
ఆ సినిమా డిజాస్టర్.. ఇప్పటికీ వడ్డీలు కడుతున్నా: టాలీవుడ్ నటుడు
టాలీవుడ్లో బుల్లితెర అభిమానులకు గుర్తుండిపోయే పేరు నందకిశోర్. 2001లో మా టీవీలో ప్రసారమైన అత్తగారు కొత్త కోడలు అనే సీరియల్లో కానిస్టేబుల్గా నటించే బుల్లితెరపై తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వెలుగు నీడలు అనే సీరియల్లో విలన్గా నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై సూర్యవంశం సీరియల్లో ఆఫర్ వచ్చింది. అంతే కాకుండా జెమినీ టీవీలో ప్రసారమైన స్రవంతి సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ ద్వారా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నంద కిశోర్కు వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేఖ, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్లో నటించారు. టీవీలో సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశారు. నితిన్ మూవీ ద్రోణలోనూ మంచి రోల్ చేశారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉప్పెన సీరియల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా స్రవంతి పార్ట్-2 స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. నంద కిశోర్ సీరియల్స్లో పాటు సినిమాల్లోనూ చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన నంద కిశోర్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సొంతంగా సినిమా తీశాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా యాంకర్ సిరి హనుమంతుతో గొడవపై కూడా స్పందించారు. ఇంతకీ ఆ వివరాలేంటో చూద్దాం. బుల్లితెరపై పలు సీరియల్స్లో సందడి చేసిన ఈ నటుడు 'నరసింహపురం' సినిమా చేశాడు. 2021 జూలైలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సిరి హనుమంతు హీరోయిన్గా నటించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే సినిమా కొవిడ్ టైంలో రిలీజ్ కావడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదని నందకిశోర్ అన్నారు. అయితే ఈ మూవీ ఓ అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. దాదాపు రూ.కోటి రూపాయల వరకు అప్పులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమా డిజాస్టర్.. ఎందుకంటే? నందకిశోర్ మాట్లాడుతూ.. 'టీవీ ఇండస్ట్రీలో సక్సెస్పుల్ అంటే యాంకర్స్ మాత్రమే. టెలివిజన్లో చేయాలంటే మనం కొన్ని రోజులు కేటాయించాలి. నరసింహపురం సినిమా విషయంలో పొరపాటు జరిగింది. అయితే నేను సినిమా విషయంలో ఫుల్గా ప్రిపేర్ అవ్వలేదు. అందువల్లే కమర్షియల్గా సక్సెస్ కాలేదు. అది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఎవరీ సపోర్ట్ లేకుండా మేము సినిమా తీశాం. మాకు మూడేళ్లు పట్టింది. కరోనా సెకండ్వేవ్ కావడంతో ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. నా సొంత సంపాదన, అప్పులు తెచ్చి సినిమా తీశా. నాకున్న ప్యాషన్తో ఏదో చేయాలనిపించింది. ఆ సినిమా కోసం ఒరిజినల్గా గుండు కూడా కొట్టించుకున్నా. కానీ అది డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా అప్పులకు వడ్డీలు కడుతున్నా.' అని తెలిపారు. సిరి హనుమంతుతో గొడవ.. సిరితో గొడవపై మాట్లాడుతూ.. 'నేను సిరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ కొన్ని ఛానెల్స్ వేరేగా రాసి ఉండొచ్చు, తాను చాలా బాగా చేసింది. సిరికి మంచి టాలెంట్ ఉంది. అయితే మేము ఆమె అనుకున్నంత డబ్బులు ఇవ్వలేకపోయాం. సిరి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. చాలా మంచి అమ్మాయి.. మంచి యాక్టర్ కూడా' అని అన్నారు. కాగా.. నరసింహపురం సినిమాలో యాంకర్, వైజాగ్ అమ్మాయి సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది. అయితే ఆమె మూవీ ప్రమోషన్స్కు పిలిచినప్పుడు తాను రాలేదు.. అంతే తప్ప ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవని అని నందకిశోర్ తెలిపారు. -
Shrenu-Akshay: సమ్థింగ్ సమ్థింగ్...పెళ్లితో ఒక్కటైన నటి (ఫొటోలు)
-
డేటింగ్కు ఫుల్స్టాప్, పెళ్లితో ఒక్కటైన లవ్ బర్డ్స్
బుల్లితెర జంట శ్రెను పరిఖ్, అక్షయ్ మాత్రే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ 2021లో ప్రసారమైన 'ఘర్ ఏక్ మందిర్ కృపా అగ్రసేన్ మహారాజా కీ' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిమధ్య సమ్థింగ్ సమ్థింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి, పెళ్లికి పచ్చజెండా ఊపాయి. దీంతో శ్రెను సొంతూరైన గుజరాత్లోని వడోదరలో గురువారం(డిసెంబర్ 21న) వీరి వివాహం ఘనంగా జరిగింది. అతడితోనే జీవితం.. తమ పెళ్లి ఫోటోలను ఈ నవదంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో శ్రెను రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లెహంగాలో ధగధగ మెరిసిపోయింది. అటు అక్షయ్ రెడ్ కలర్ షేర్వాణీ ధరించాడు. ఈ ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన కొత్త పెళ్లికూతురు ఈ జీవితానికి అతడినే బుక్ చేసుకున్నానని రాసుకొచ్చింది. సీరియల్స్తో గుర్తింపు పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సైతం జరిగాయి. సంగీత్లో ఈ లవ్ బర్డ్స్ బాలీవుడ్ హిట్ సాంగ్స్కు స్టెప్పులేశారు. కాగా శ్రెను పరిఖ్.. ఏక్ భ్రమ్ సర్వగుణ్ సంపన్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూన్- ఏక్ బార్ ఫిర్, ఇష్క్బాజ్, ఘర్ ఏక్ మందిర్, జింగదగీ కా హర్ ర్యాంగ్, గులాల్.. వంటి పలు సీరియల్స్తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. అక్షయ్ మాత్రే.. ఇండియావాలీ మా సీరియల్లో నరేన్ వ్యాస్గా నటించి బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) చదవండి: సీనియర్ను ప్రేమించా.. అతడు కూడా ఇంట్రస్ట్ చూపించాడు.. అంతలోనే! -
Maanas Nagulapalli Srija Wedding: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన 'బిగ్ బాస్' మానస్ (ఫొటోలు)
-
Maanas-Srija Marriage: బిగ్బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ పెళ్లి (ఫోటోలు)
-
తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్బాబు సందడి
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) -
శామీర్పేట్ ఘటన: కాల్పులు జరిపింది తాను కాదన్న సీరియల్ నటుడు
శామీర్పేట్ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్దార్థ్పై నటుడు మనోజ్ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు నటుడు మనోజ్. గన్ ఫైర్ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లో కాల్పులు జరిపిన మనోజ్ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు. అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్ అనే ఓ వ్యక్తి గన్ ఫైర్ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్ క్లిప్పింగ్స్ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. శామీర్పేట్ సెలబ్రిటీ రిసార్ట్లోని విల్లాలో సిద్ధార్థ దాస్పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల మనోజ్.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. View this post on Instagram A post shared by Manoj Kumar (@imanoj_kumar) చదవండి: శామీర్పేట్ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్ ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్ను అందరిముందే అవమానించిన స్టార్ హీరో -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
మహాభారత్ నటుడు కన్నుమూత
మహాభారత్ సీరియల్లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుఫి ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గుఫీ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు కూడా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి) కాగా.. గుఫీ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించారు. మహాభారత్ సీరియల్తో పాటు బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ, జే కనియా లాల్ షోలలో కనిపించాడు. అతను 1975 చిత్రం రఫూ చక్కర్తో బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ చిత్రాలలో కనిపించాడు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్గా డ్వేన్ బ్రావో..
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా
కాంగ్రెస్ పై హరీష్ రావు ఫైర్
వంగా గీతకు చేతులెత్తి మొక్కిన యాంకర్ శ్యామల
సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి. ‘ఇది ప్రమాదం కాదు హత్యే’
రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల? వంగా గీత రియాక్షన్
మిమిక్రీ చేసే పక్షులు!
హార్దిక్ తప్పేం లేదు.. అంతా సీనియర్ల వల్లే: ముంబై మాజీ కెప్టెన్
ఎమిరేట్స్ విమానం ఢీ.. 40 ఫ్లెమింగో పక్షులు మృతి
తప్పక చదవండి
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- ‘సీఎం రేసులో ఉన్నానని చెప్పేందుకు ఢిల్లీకి రూ.100 కోట్లు’
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- IPL 2024: ధోనిని అవమానించిన ఆర్సీబీ ప్లేయర్లు!.. తప్పు ‘తలా’దేనా?
- కెనడాలో భారతీయ విద్యార్థుల నిరసన.. ఎందుకంటే?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- కొన్ని గంటల్లోనే నిర్ణయం వెనక్కి తీసుకున్న బీఐఏఎల్
- T20: ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టులో కొత్తగా ఇద్దరు.. స్మిత్కు మరోసారి!
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement