-
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్ఫుల్గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్లను అధ్యయనం చేస్తున్నారు. -
బాబు తెలివిని మ్యాచ్ చెయ్యలేక పోయిన కేసీఆర్, అరవింద్
-
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
యువతరానికి దిక్సూచి ‘భవిత’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కేడింగ్ కార్యక్రమం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని.. ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కోరుకున్న ఫీల్డ్లో స్థిరపడ్డాను మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్లో స్ధిరప డాలని సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. – దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై స్కిల్లింగ్ ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేసిన ఏపీ.. ఏపీలో యంగ్ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్లో స్కిల్లింగ్కి ఏజ్ బార్ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్ పిరమిడ్ను కూడా సీఎం జగన్ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్డెవలప్మెంట్ శాఖ మంత్రి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్ సెక్టార్ కు ఇది గొప్ప అడుగు. స్కిల్ ఎకో సిస్టమ్ని అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి. –కె.గ్వాంగ్లీ, కియా మోటర్స్ ఎండీ కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమానయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్ వింగ్స్ ఫౌండేషన్ అనే స్కిల్లింగ్ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్ ఎకో సిస్టమ్కు మద్దతు అందిస్తాం. – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెమికల్ ఇంజినీర్స్ అవసరం చాలా ఉంది ఏపీ సెజ్ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆటమిక్ రీసెర్చ్ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్ ప్రాసెసింగ్ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్ ఇంజినీర్స్ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. – కొయిచీ సాటో, టొయేట్సు రేర్ ఎర్త్ ప్రై.లి., ఎండీ సీఎం వైఎస్ జగన్కు ధన్యవాదాలు నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాఫ్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు. – భార్గవ్, విశాఖపట్నం మానవవనరుల్లో మనమే ముందంజ.. అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం జగన్ 27 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్స్, 55 స్కిల్ స్కోప్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్గ్రేడ్ చేస్తున్నాం. – సురేష్కుమార్, ఏపీ స్కిల్డెవలప్మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ -
బుద్ధి కుశలత
కుశలత అంటే నేర్పరితనం. ఏ పని చేయటానికైనా ఒక నేర్పరితనం అవసరం. ఏదో ఒక తీరులో తోచిన విధంగా చేయటం కాక, సులువైన పద్ధతిలో సునాయాసంగా చేయగలగటం నేర్పరితనం. బుద్ధిని దాని సామర్థ్యాన్ని తగిన విధంగా ఉపయోగించటమే బుద్ధి కుశలత. సాధారణంగా మనస్సుని, బుద్ధిని సమానార్థకాలుగా వాడుతూ ఉంటాం. కాని రెండింటికీ తేడా ఉంది. ఆలోచన చేసేది, పంచేంద్రియాలని ప్రేరేపించేది, వాటిపై పెత్తనం చేసేది, తనకి నచ్చినట్టు, కావలసినట్టు ఊహ చేసేది, కలలు కనేది, ఆశపడేది, రాగద్వేషాలకి నిలయమైనది మనస్సు. బుద్ధిలో కూడా మనోవ్యాపారం ఉన్నా, దానిలో విచక్షణా, సహేతుకతా ఉంటాయి. ఒక మంచిపని, తనకి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేది చేద్దామని నిర్ణయం తీసుకున్నప్పుడు పని చేసింది బుద్ధి. తీరా ఆ పని మొదలుపెట్టిన తరువాత ఏవేవో పనికిరాని కారణాలతో సమర్థించుకుని వాయిదా వేసుకుంటూ వచ్చినప్పుడు పని చేసింది మనస్సు. మనస్సు శారీరిక, మానసిక సుఖాన్ని అపేక్షిస్తుంది. మంచి చెడులను వేర్పరచి విచక్షణతో నిర్ణయం తీసుకునేది బుద్ధి. అయితే ఎన్నో సందర్భాలలో మనసు బుద్ధి వేషం వేసుకుని వస్తుంది. పని వాయిదా వేయటానికి కారణాలు వెదకినట్టుగా మనోవ్యాపారమైన ఆలోచనల సహకారంతో ఏది మంచి ఏది చెడు ఏది శాశ్వతం, ఏది తాత్కాలికం, ఏది తనకి, సమాజానికి ఉపయోగ పడుతుంది, ఏది ఉపయోగ పడదు అనే అంశాలను విడదీసి, విమర్శించి, వేర్పరచి సరైన నిర్ణయం తీసుకునేందుకు సహకరించే శక్తి బుద్ధి. ఒకప్పుడు గురుకులాల్లో గురువులు శిష్యులకి విద్యాబుద్ధులు నేర్పేవారు. విద్యావంతులు బుద్ధిమంతులుగా ఉండేవారు. విద్య అంటే విషయ సేకరణ మాత్రమే కాదు. సేకరించిన విషయాలను, సముపార్జించిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయం చేసి, ఆచరణలో పెట్టగలగటం, ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎంత అవసరమో నిర్ణయించగల మెలకువ కలిగి ఉండటం. అదే బుద్ధికుశలత. ఒక పండితుడికి, శాస్త్రవేత్తకి తమ తమ రంగాలకి సంబంధించిన జ్ఞానం చాలా ఉండవచ్చు. దానిని సందర్భానుసారంగా ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియక నలుగురిలోనూ నవ్వులపాలు కావటం చూస్తూ ఉంటాం. మెదడు బాగా ఎదిగింది కాని, విచక్షణ లేదు అని అర్థం. గొప్ప మేథావులు కూడా జీవితంలో సరయిన నిర్ణయం తీసుకోక నష్టపోవటానికి ఎంతోమంది శాస్త్రవేత్తల జీవితాలని ఉదాహరణలుగా గమనించవచ్చు. కారణం విద్యతో పాటు బుద్ధి గరపిన వారు లేకపోవటమే. ప్రస్తుత విద్యావిధానంలో చదువులు నేర్పి అక్షరాస్యులని తయారు చేయటం మాత్రమే కనిపిస్తోంది. కాని, బుద్ధివికాసం ఎంతవరకు జరుగుతోంది? అన్నది ప్రశ్నార్థకమే. ఈ కారణంగానే పెద్ద పెద్ద విద్యార్హతలు ఉన్న వారు కూడా సంఘవిద్రోహకశక్తులుగా మారటం, దేశద్రోహులుగా మారటం కుటుంబ దేశ పరువు ప్రతిష్ఠలను దెబ్బ తీసే విధంగా ప్రవర్తించటం చివరికి తమకే హాని చేసుకోవటం గమనించవచ్చు. ఆకలి దహించుతోంది, నిద్ర ముంచుకు వస్తోంది. తినటం, పడుకోటం లలో ఏది ముందు చేయాలి? అని నిర్ణయించుకుని మేలు పొందటానికి కావలసినది విచక్షణ మాత్రమే కాని చదువులు కాదు. కార్యసాధకుల లక్షణాలలో ప్రధానమైనది బుద్ధికుశలత. జీవితంలో గొప్ప విజయాలు సాధించి అత్యున్నత స్థానానికి చేరుకున్నవారందరు బుద్ధికుశలురే. చదువులు సహాయం చేసి ఉండవచ్చు. కుశలత... విచక్షణ ప్రతి మనిషికి మనసు ఉన్నట్టే బుద్ధి కూడా ఉంటుంది. కాని, అందరూ బుద్ధిని సరిగా ఉపయోగించరు. దానిని ఉపయోగించటంలోని మెలకువలు తెలియటమే బుద్ధి కుశలత. ఏ పని ఎట్లా చేయాలో తెలిసి ఉండటమన్న మాట. దీనినే ఒడుపు అని కూడా అనవచ్చు. ఏ పనినైనా గుడ్డెద్దు చేలో పడ్డట్టు అడ్డదిడ్డంగాను చేయవచ్చు. ఎక్కువమంది చేసేది ఆ విధంగానే. లేదా క్రమపద్ధతిలోనూ చేయవచ్చు. ఇది నేర్పరులు చేసే పద్ధతి. బుద్ధిని ఉపయోగించటంలో ఇటువంటి నేర్పరితనం ఉంటే దాన్నే బుద్ధి కుశలత అనవచ్చు. అంటే చురుకుగా పనిచేసే విచక్షణాజ్ఞానం అన్నమాట. – డా.ఎన్.అనంతలక్ష్మి -
రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్బాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 165 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని, ఆయా విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు నైపుణ్య విశ్వ విద్యాలయం ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) తరహాలో ఈ వర్సిటీ నైపుణ్య మానవ వనరులను అందిస్తుందని వివరించారు. టాటా, మహీంద్ర కంపెనీలు స్కిల్ వర్సిటీ స్థాపనకు ముందుకు వచ్చాయని చెప్పారు. వర్సిటీ కార్యరూపంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారని వ్యాఖ్యానించారు. బుధవారం మాదాపూర్లోని ఐటీసీ కోహినూర్లో జరిగిన టెలిపర్ ఫార్మెన్స్ ఇంప్రెసివ్ ఎక్స్పీరియన్స్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్బాబు ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు తమ ప్రభుత్వం సరళీకృతమైన విధానం ప్రవేశపెడుతుందని పునరుద్ఘాటించారు. పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అత్యంత అనువైన ప్రాంతమని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతులకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. జూన్లో హైదరాబాద్లో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏఐ కంపెనీలను ఆహ్వనిస్తున్నామని శ్రీధర్బాబు వివరించారు. ఏఐ సాంకేతికతలో హైదరాబాద్ను గ్లోబల్ హెడ్ క్వార్టర్స్గా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టిసారించామని, టూరిజం అభివృద్ధిని 20 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ ఖాయం 1990వ దశకంలో దేశ ప్రధానిగా పీవీ నర్సింహారావు ఉన్నప్పుడే హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీకి అంకురార్పణ చేశారని మంత్రి శ్రీధర్బాబు గుర్తుచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ... తాము హైదరాబాద్లో ఐటీ, ఇండస్ట్రీ గ్రోత్ కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. టెలిపర్ ఫార్మెన్స్ గ్రూప్ ఫౌండర్ డానియల్ జులియన్, సీఈఓ అనీష్ ముక్కర్ను ఇండియాకు వచ్చి ఇండస్ట్రీ స్థాపనకు హైదరాబాద్ను ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు మంత్రి వివరించారు. గురువారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, ఇండస్ట్రీ, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ పాలసీలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. -
Microsoft: 20 లక్షల మందికి ఏఐలో శిక్షణ
ముంబై: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతపై రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. శ్రామికశక్తి అభివృద్ధి చెందడానికి నైపుణ్యాలను పెంపొందించడం అనేది ఒక సంస్థ చేయగలిగే అత్యంత ముఖ్యమైన విషయమని అన్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నాదెళ్ల భారత్లో అడుగుపెట్టారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. కొత్త తరం సాంకేతికత వృద్ధిని సమానంగా పంపిణీ చేయగలదని అన్నారు. శక్తివంతమైన సాధారణ ప్రయోజన సాంకేతికతగా ఏఐని పేర్కొన్న ఆయన.. ఏఐ నిబంధనల విషయంలో ఏకాభిప్రాయం బహుపాక్షిక స్థాయిలలో కూడా చాలా అవసరమని నాదెళ్ల తెలిపారు. జీడీపీ వృద్ధిలో ఏఐ.. సాంకేతికత వేగంగా విస్తరించడం వల్ల ఆర్థిక వృద్ధిలో సమాన పంపిణీకి సహాయపడుతుందని సత్య నాదెళ్ల అన్నారు. జీడీపీ వృద్ధిని పెంచడంలో ఏఐ సహాయపడుతుందని చెప్పారు. భారత్ను ప్రపంచంలోని అత్యధిక వృద్ధి మార్కెట్లలో ఒకటిగా పేర్కొన్నారు. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో ఏఐ జీడీపీ 500 బిలియన్ డాలర్లుగా ఉంటుందన్న మినిస్ట్రీ ఆఫ్ ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నివేదికను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. పునరుత్పాదక వనరుల నుంచి విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, భారత్ కూడా గ్రిడ్ స్థిరత్వంపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారు. సాంకేతికత కూడా ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని అన్నారు. భారత పర్యటనలో భాగంగా టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ను తాను కలిశానని, ఎయిర్ ఇండియా ఏఐ వినియోగాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. ఐటీసీ, అరవింద్, లాభాపేక్ష లేని ఇతర భారతీయ సంస్థలు, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటి ఐటీ కంపెనీలు అనేక సంస్థాగత కార్యక్రమాల కోసం ఏఐ సాధనాలను ఉపయోగిస్తున్నాయని నాదెళ్ల వివరించారు. -
విజయవాడలో ఫ్యూచర్ స్కిల్స్ పై అవగాహన కార్యక్రమం
-
మన అజ్ఞాత ఇంజినీర్లు
భారతదేశ అభివృద్ధి చేతివృత్తుల మీద జరిగింది. గౌండ్ల, కంసాలి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి నైపుణ్యాలున్న కులాలు దేశమంతటా ఎన్నో ఉన్నాయి. పౌర సమాజంలో వీరి జనాభానే అధికం. ఈ చేతివృత్తుల కులాలే అనేక రంగాల్లో అద్భుతమైన ఇంజినీరింగ్ పరిజ్ఞానాన్ని సృష్టించాయి. ఉత్పత్తి సంస్కృతికి వీరు ప్రతినిధులు. ఆర్యులు, ముస్లింలు, బ్రిటిష్ వలసవాదులు గనక భారతదేశం మీదకు దండెత్తి వచ్చి ఉండకపోతే, ఈ భారతీయ ఇంజినీరింగ్ నైపుణ్యాలు ఒక ప్రత్యేక తాత్విక దృక్పథాన్ని సంతరించుకొని ఉండేవి. అయితే ఈ కులాలను ముస్లిం, బ్రిటిష్ దురా క్రమణదారుల కంటే బ్రాహ్మణ హిందూమతమే ఎక్కువగా దెబ్బతీసింది. వీరి నైపుణ్యాలకు ఆధ్యాత్మిక హోదా కల్పించలేదు. వీరిని సమాజంలో తక్కువ స్థాయిలోనే ఉంచింది. అయినా వాళ్లు సమాజ అభివృద్ధిలో నిరంతరం పాలుపంచుకుంటూనే వచ్చారు. కల్లుగీత కార్మికులు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. వీళ్ళు మనుషులు తాగడానికీ, తద్వారా తమ ఆరోగ్యాన్ని సమ తూలంగా ఉంచుకోవడానికీ పనికొచ్చే పానీ యాన్ని అందించే చెట్లను కనుగొన్నారు. కనుగొన డమే కాదు, దానికి తగిన పనిముట్లను సిద్ధం చేశారు. ఇందులో వీరి గొప్ప ప్రతిభ దాగివుంది. అందుకే కల్లుగీత కోసం రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం మనిషికీ, ప్రకృతికీ మధ్య ఒక సజీవ మైన అనుబంధంగా మారింది. భారతదేశంలో అత్యంత గొప్ప ఇంజినీరింగ్ నైపుణ్యాలు మరో మూడు కులాల్లో కనిపిస్తాయి. అవి కమ్మరి (ఇనుముతో పనిముట్లు తయారు చేసేవాళ్లు), వడ్రంగి (కలపతో వివిధ పనులు చేసేవాళ్ళు), కంసాలి (బంగారం, వెండితో ఆభర ణాలు చేసేవాళ్లు). కమ్మరి వృత్తి ఆర్యుల కాలం కంటే ముందు నుంచే ఉన్నట్టు కనపడుతుంది. వారి పనిముట్లు చరిత్రకు ఆనవాళ్లు పట్టిస్తాయి. ఈ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానం ఇప్పటికీ మన గ్రామీణ, వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో అంత ర్భాగం. కమ్మరి పని వ్యవసాయ ప్రక్రియలో అనేక విధాలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. భారత దేశపు సామాజిక శక్తులు ఇనుము ఉపయోగాలను ఎలా కనుక్కొని ఉంటాయన్నది ఒక చారిత్రక అంశం. కమ్మరి కొలిమి ఇనుము సంబంధ పనుల్లో కీలకం. ఆ ప్రదేశం రెండు పైపు లైన్లను తోలు తిత్తితో అనుసంధానించి ఉంటుంది. అది కొలిమిలోకి క్రమబద్ధంగా గాలిని సరఫరా చేస్తుంది. ఈ తిత్తి ఆవిష్కరణ ఒక అద్భుతం. వడ్రంగి పనికి గొప్ప వృత్తి నైపుణ్యం అవసరం. వీరు సృష్టించిన అత్యంత విప్లవాత్మక సాధనం నాగలి. అలాగే వడ్రంగులు మానవ సమాజానికి అందించిన మరొక సేవ,ఇళ్ల నిర్మాణం. సమాజ ప్రధాన అవసరాలలో ఒకటైన ఇంటికి వాడే కర్రపనిలో వడ్రంగుల నైపుణ్యం మామూలుది కాదు. ఈనాటి ఇళ్ల నమూ నాల మూలాలన్నీ వడ్రంగుల నైపుణ్యంలో దాగి వున్నాయి. ప్రపంచంలో తొలినాళ్ల కుండల తయారీ జ్ఞాన వ్యవస్థల్లో కొన్నింటికి భారతదేశం పుట్టినిల్లు అని చెప్పవచ్చు. సింధు నాగరికత నాటికి మన దేశంలో కుండల తయారీ ఎంతో ఉచ్చస్థితిలో ఉంది. కుండల తయారీని ఎలా అభివృద్ధి పరిచారు అన్నది ఒక ఆశ్చర్యం. భారతీయ గ్రామాల్లో కుండల తయారీలో అధునాతన పరిజ్ఞానం కలిగిన కులాలు ఉన్నాయి. వారిని తెలుగునాట కుమ్మరోళ్లని పిలుస్తారు. అసలు సింధు నాగరికత ఈ కుండలు తయారు చేసేవారి భుజస్కందాలపై ఆధారపడే ఏర్పడినట్టు అనిపిస్తుంది. కుండల తయారీ పరి జ్ఞానం తొలుత మట్టికీ, చక్రానికీ మధ్య నుండే సంబంధాన్ని అర్థం చేసుకోవడంతో మొద లవుతుంది. ముడి కుండను మలిచేందుకు ముందు చక్రం తిప్పుతారు. మెత్తని బంక మట్టిని కుండగా మార్చవచ్చనీ, ఆ కుండలను వంటలకూ, నీళ్లు, ఇతర ద్రవ పదార్థాల నిల్వ ఉపయోగించవచ్చనీ వాళ్లకు ఎవరు చెప్పి ఉంటారు? మానవ జీవన పరిస్థితులను మెరుగుపరిచేందుకు భూవనరు లతో నిరంతరం పోరాడేవాళ్ళే బంకమట్టి నుంచి రకరకాల కుండలు తయారు చేయ వచ్చని కను గొని ఉంటారు. వేగంగా తిరిగే చక్రం మీద ఉంచిన బంకమట్టిని చేతివేళ్ల కొనలతో నొక్కుతూ ఒక ఆకారంలోకి తెస్తారు. ఈ దశలో కుమ్మరి చేతివేళ్ళు, గోళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవాళ గృహాల అంతర్గత అలంకరణకు వినియోగించేలా అనేక ఆకృతులను కూడా అద్భుతంగా తయారు చేస్తున్నారు. ఇలా దేశంలోని ఎన్నో కులాలు భారతదేశ ఉత్పత్తి సంస్కృతికి ప్రాతినిధ్యం వహించాయి. దేశ నాగరకతను ముందుండి నడిపించాయి. – కిరణ్ ఫిషర్ అడ్వకేట్ ‘ 79893 81219 -
ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ నైపుణ్యాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ఆరో తరగతి నుంచే వివిధ టెక్నాలజీల పాఠాలు బోధించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. వచ్చే ఏడాది (2024–25) నుంచి మొత్తం 6,200 హైస్కూళ్లలో ఈ ఫ్యూచర్ స్కిల్స్ను అందించనుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), బ్లాక్చైన్ టెక్నాలజీ, వర్చువల్ రియాలిటీ (వీఆర్)– ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), మెటావర్స్/ వెబ్ 3.0, 3డీ మోడలింగ్ అండ్ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా/డేటా అనలిస్ట్, రోబోటిక్స్, గేమింగ్ వంటి రేపటితరం టెక్నాలజీల్లో శిక్షణ ఇవ్వనున్నారు. రాబోయే కాలంలో ఈ కోర్సులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉండనున్న నేపథ్యంలో పాఠశాల స్థాయిలోనే వీటిపై పూర్తి అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సైన్స్, సోషల్, మ్యాథ్స్ (6) సబ్జెక్టులను చదువుతుండగా, ఇకపై ఏడో సబ్జెక్టుగా టెక్ పాఠాలు చదువుతారు. వచ్చే ఏడాది ఆరు, 9 తరగతి విద్యార్థులకు టెక్ పాఠాలను బోధించనున్నారు. 2025–26లో 7, 10 తరగతులకు, 2026–27లో ఎనిమిది, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్పై శిక్షణ అందించనున్నారు. ఇలా 2028 నాటికి మొత్తం ఆరు నుంచి +2 వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నారు. డిజిటల్ వసతుల కోసం రూ.2,400 కోట్ల ఖర్చు.. ఇప్పటికే పాఠశాలల్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్పీలు), స్మార్ట్ టీవీలు, ట్యాబ్స్, ఇంగ్లిష్– మ్యాథ్స్ – పాల్ – కంప్యూటర్ ల్యాబ్స్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లెర్నింగ్ కోసమే దాదాపు రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇకపై టెక్ అంశాల్లో విద్యార్థుల ఆలోచన శక్తిని పెంపొందించడంతోపాటు విజ్ఞానంలో ముందుండేలా శిక్షణనివ్వనున్నారు. నాస్కామ్, జేఎన్టీయూ నిపుణులు, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఏపీఎస్ఈఆర్టీ), స్వతంత్ర నిపుణులు రూపొందించిన ఫ్యూచర్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకురావడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఏడో సబ్జెక్టుగా టెక్ పాఠాలు.. 6,200 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ నైపుణ్యాలను నేర్పించేందుకు కంప్యూటర్ సైన్స్ లేదా ఎల్రక్టానిక్స్లో ఎంటెక్/ఎంసీఏ/బీటెక్ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. తమ ప్రాజెక్టులో భాగంగా వీరు ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్గా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలు అందిస్తారు. విద్యార్థులకు టెక్ పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు వీరు ‘టెక్నాలజీ లీడ్’ శిక్షణ ఇస్తారు. ఏటా డిసెంబర్/ఏప్రిల్ నెలల్లో విద్యార్థులకు ప్రత్యేకంగా ఇండక్షన్ శిక్షణ ఇస్తారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో డిసెంబర్ 15 నాటికి ఇండక్షన్ ట్రైనింగ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరగతిని బట్టి టెక్ బోధనాంశాలు... విద్యార్థులకు అనువుగా ఎంపిక చేసిన అంశాలకు ప్రత్యేక కరిక్యులమ్ను సైతం రూపొందించారు. 6–8 తరగతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్స్, ఆల్గారిథమ్, డేటా ఎనాలసిస్, ఏఐ ఎథిక్స్ అండ్ సోషల్ ఇంపాక్ట్స్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ అంశాల్లో ప్రాథమిక అంశాలపై అవగాహన కల్పిస్తారు. ♦ 9–10 తరగతులకు ‘ఏఐ’ టెక్నాలజీ, మెషీన్ లెర్నింగ్పై ప్రాథమిక అవగాహన, అప్లికేషన్స్, ఆల్గారిథమ్ అండ్ డేటా ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఎథిక్స్, సోషల్ ఇంపాక్ట్, మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ను నేర్పిస్తారు. ♦ 11–12 తరగతుల విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై అడ్వాన్స్డ్ అంశాలను బోధిస్తారు. ఈ అంశాల్లో అన్ని పాఠశాలల్లోనూ ఒకేసారి ఒకే పాఠాన్ని బోధించనున్నారు. దీనివల్ల విద్యార్థులు ఒక స్కూలు నుంచి మరో స్కూలుకు మారినా టెక్ అంశాల బోధనలో మార్పు ఉండదు. దీంతో విద్యార్థుల సామర్థాలు మెరుగుపడడంతో పాటు అంతర్జాతీయ అవకాశాలను అందుకునే నైపుణ్యాలు నేర్చుకుంటారు. సిలబస్ సిద్ధం చేస్తున్నాం.. ఎంపిక చేసిన 10 మాడ్యూల్స్ బోధనకు సిలబస్ను సిద్ధం చేస్తున్నాం. డిసెంబర్ నాటికి అన్ని స్కూళ్లకు ఐఎఫ్పీలు నూరు శాతం అందుబాటులోకి వస్తాయి. ఫ్యూచర్ స్కిల్స్ ఫెసిలిటేటర్స్ నియామకానికి అనుమతి లభించింది, వచ్చే నెల రోజుల్లో వీరి నియామకం పూర్తవుతుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6,200 హైస్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్పై బోధన ప్రారంభమవుతుంది. – కాటమనేని భాస్కర్, కమిషనర్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతులు -
‘ఎన్బీఏ’ గుర్తింపే లక్ష్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కరిక్యులమ్లో మార్పులు చేయడంతో పాటు మొట్టమొదటిసారి సాంకేతిక విద్యా, శిక్షణ మండలి ద్వారా పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తెచ్చింది. ఇండస్ట్రీ కనెక్ట్ పేరుతో పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ విద్యార్థులకు బోధన సమయంలోనే లభించేలా చర్యలు తీసుకుంది. కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు మెరుగైన కొలువులు లభించేలా సంస్కరణలు తెచ్చిది. అలాగే రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా.. తొలి దశలో 41 కాలేజీలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించేలా ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే తొమ్మిది కాలేజీల్లోని 16 ప్రోగ్రామ్లకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. మిగిలిన 32 కాలేజీలు కూడా ఈ విద్యా సంవత్సరం చివరి నాటికి ఎన్బీఏ గుర్తింపు పొందేందుకు సిద్ధమయ్యాయి. వీటిలోని 5 కాలేజీల్లో అన్ని రకాల తనిఖీలు పూర్తవ్వగా.. ఈనెల చివరి వారంలో మరో 5 కాలేజీల్లో ఎన్బీఏ బృందాల సందర్శనకు షెడ్యూల్ ఖరారైంది. రెండో దశలో భాగంగా వచ్చే విద్యా సంవత్సరంలో మరో 43 కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా సాంకేతిక విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. వృత్తి విద్యా రంగంలో నాణ్యత, కొలువులు సాధించే సామర్థ్యాలను నిర్ధారించే అంతర్జాతీయ ప్రమాణాల అక్రెడిటింగ్ ఏజెన్సీగా భారతదేశంలో ఎన్బీఏ వ్యవహరిస్తోంది. విద్యార్థుల సంఖ్య, అధ్యాపకుల నిష్పత్తి, పీహెచ్డీ స్థాయి అర్హతలు, ఆర్థిక వనరుల వినియోగం, ఐపీఆర్–పేటెంట్లు, స్వీయ మూల్యాంకనం, జవాబుదారీతనం, నిపుణుల తయారీ తదితర అంశాలను ఎన్బీఏ పరిశీలిస్తుంది. వీటన్నింటి ఆధారంగా పాలిటెక్నిక్ కాలేజీలకు గుర్తింపునిస్తుంది. కాగా, ప్రభుత్వం ఇటీవల కొత్తగా 3 పాలిటెక్నిక్ కాలేజీలను ప్రారంభించింది. వీటికి మూడేళ్ల తర్వాతే ఎన్బీఏ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుంది. ప్రభుత్వ కృషితో పెరిగిన ప్లేస్మెంట్స్ మరోవైపు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్థులకు బోధన సమయంలోనే ఉపాధి లభించేలా వివిధ పరిశ్రమలతో సాంకేతిక విద్యా శాఖ 674 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీంతో క్యాంపస్ ప్లేస్మెంట్ల సంఖ్య భారీగా పెరిగింది. 2022–23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో 7,073 మంది విద్యార్థులు చదువు పూర్తి చేసుకోగా.. వారిలో 4 వేల మందికిపైగా విద్యార్థులు కొలువులు సాధించారు. గతంలో పది శాతానికే పరిమితమైన ప్లేస్మెంట్స్.. ఇప్పుడు 59.6 శాతానికి పెరిగాయి. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాలిటెక్నిక్లు గతంలో ఎన్బీఏ గుర్తింపు సాధించడంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు వెనుకబడ్డాయి. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్బీఏకు అనుగుణంగా కాలేజీల్లో ప్రమాణాలు పెంచాలని సాంకేతిక విద్యా శాఖను ఆదేశించింది. ఈ నేపథ్యంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా శ్రీకాకుళం, విజయవాడ, కుప్పం, అనకాపల్లి, గన్నవరం, కళ్యాణదుర్గం, ఆమదాలవలస, కాకినాడ, గుంటూరు పాలిటెక్నిక్ కాలేజీలకు ఎన్బీఏ గుర్తింపు దక్కింది. ఆయా కాలేజీల్లో పరిసరాల పరిశుభ్రత మొదలు భవనాల మరమ్మతులు, కొత్త నిర్మాణాలు, ప్రయోగశాలల ఆధునికీకరణ, విద్యార్థులకు వసతుల మెరుగు, సిబ్బంది రేషనలైజేషన్ తదితర మార్పులు తీసుకువచ్చాం. తద్వారా ప్రభుత్వ పాలిటెక్నిక్లకు ఎన్బీఏ గుర్తింపు లభించేలా చర్యలు తీసుకున్నాం. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యా శాఖ -
'స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబే'
తాడేపల్లి: చంద్రబాబు అవినీతిపరుడు కాబట్టే ఎవరూ మద్దతివ్వడంలేదని మంత్రి కారుమూరి అన్నారు. చంద్రబాబు ప్రజల వద్దకు యాక్టర్లను పంపిస్తున్నారు కానీ.. ముఖ్యమంత్రి జగన్ ప్రజల వద్దకు డాక్టర్లను పంపిస్తున్నారని చెప్పారు. ఎన్నో కేసుల్లో చంద్రబాబు న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇవాళ్టికి చంద్రబాబు పాపం పండింది కాబట్టే జైలు పాలయ్యారని అన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి, లబ్ధిదారు చంద్రబాబేనని చెప్పారు. కేసుల నుంచి బయటపడటానికి చంద్రబాబు కోట్ల రూపాయలు వెచ్చించి సీనియర్ న్యాయవాదులను పెట్టుకున్నారని మంత్రి కారుమూరి చెప్పారు. బాబు తప్పు చేశారు కాబట్టే ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం లేదని స్పష్టం చేశారు. బాబు పాలనలో ప్రజలను దోచుకుతిన్నారని మండిపడ్డారు. ఇవాళ ప్రజలందరికీ ఇంటి వద్దకే పథకాలు అందుతున్నాయని అన్నారు. చంద్రబాబు అవినీతిని ఎండకడతానన్న పవన్ టిడిపితోనే కుమ్మక్కయ్యారని మంత్రి కారుమూరి అన్నారు. తడాకా చూపిస్తానని చెప్పి బాబు పంచన చేరారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి పవన్కు ఏమీ లేదని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!.. ఎందుకిలా.. -
స్కిల్ పెంచండి బాబులూ..!
స్కిల్స్ పలు రకాలు.. ఏ ‘స్కిల్’ ప్రమాదకరమో మొన్నీమధ్యే చూశాం కదా, అలాంటివి కాదు. మనకూ జనానికీ ఉపయోగపడేవి. ఆ స్కిల్స్ చూడండి సరదాగా... సేల్స్.. స్కిల్ ఓ పెద్దమనిషి, అరవై ఏళ్లకు పైబడి ఉంటాడు. జోరు వర్షంలో గొడుగేసుకుని ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పుస్తకాలు అమ్ముతున్నాడు. అప్ప టికే బాగా చీకటి పడింది. ఇది ఆసక్తిగా అనిపించి ఓ యువకుడు కారులోనుంచే.. ‘పుస్తకం ఎంత’ అని అడిగాడు. ‘మూడువేల రూపాయలు. కానీ, నీకు అమ్మబోను. నీకు ఈ పుస్తకం చదివే ధైర్యం ఉన్నట్టు లేదు,’ అన్నాడు ‘‘నాకు చాలా ధైర్యం ఉంది. గంటలో లాగించేస్తాను.’ – అన్నాడా యువకుడు కాస్త రోషంతో. ‘‘..అయితే ఒక షరతు మీద ఈ పుస్తకం నీకు అమ్ముతా, అది ఓకే అయితే నీకు ఓ వంద డిస్కౌంట్ కూడా ఇస్తా..’’ అన్నాడా పెద్దమనిషి ‘‘ఏమిటా షరతు?’’ ‘‘నువ్వు జన్మలో చివరి పేజీ చదవనని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. చాలా బాధపడతావు.’’ ‘‘ఓకే ప్రామిస్!.. నేను ధైర్యవంతుడినే అయినా, చివరి పేజీ చదవను, ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు..’’ అంటూ మనీ పెద్దమనిషి చేతిలో పెట్టాడు. పెద్దమనిషి డబ్బులు తీసుకుని పుస్తకం ఇస్తూ షరతు గురించి మళ్లీ గుర్తు చేశాడు. పుస్తకం తీసుకున్న యువకుడు ఇంటికి వెళ్లి భయం, భయంగా పుస్తకం చదివేశాడు. క్రైమ్ థ్రిల్లర్ బుక్ అది.. కొంచెం క్రైమ్, కొంచెం సస్పెన్స్ ఉన్నా... మరీ అంత భయంకరంగా లేదు. చివరి పేజీ ఎందుకు చదవ వద్దన్నాడా పెద్దమనిషి? దానిలో అంత తట్టుకోలేని బాధ ఏముంటది? అని మనవాడికి డౌట్ వచ్చింది. చదువుదామని మనసు పీకింది. కాస్త భయం వేసింది. ప్రామిస్ను పక్కన పెట్టి... గుండె దిటవు చేసుకుని భయం భయంగా చివరి పేజీ చూస్తే నిజంగానే గుండె ఆగినంత పనైంది.. ఆ చివరి పేజీలో ఇలా ఉంది ‘పుస్తకం ఖరీదు 50 రూపాయలు...’ ఇదీ సేల్స్ స్కిల్... అంతే కదా? ... ఇక ఈ తరహా తెలివితేటలు చూడండి. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. మేడిన్ ఇండియా! ఒకసారి అమెరికా కంపెనీలో సబ్బుల ఫ్యాక్టరీలో ఒక పొరపాటు జరిగింది. కొన్ని కవర్లు ప్యాక్ అయ్యాయి కానీ, అందులో సబ్బుల్లేవు. డీలర్లు, కస్టమర్ల గొడవ.. పెద్దగోలయ్యింది. దానితో యాజమాన్యం కంపెనీలో ఇలాంటి సమస్యలు ఇంకెప్పుడూ రాకూడదనీ, పరువు పోకూడదనీ జాగ్రత్త కోసం ఆరు కోట్లు పెట్టి ఎక్స్రే మెషీన్ కొన్నదట. ప్యాకైన సబ్బులు వెళుతుంటే అందులో సబ్బు ఉన్నదీ లేనిదీ ఆ మెషీన్ ద్వారా కనుక్కుని తీసేయడానికి వీలయ్యింది. ఈ విషయం హైదరాబాద్ సబ్బుల కంపెనీలో మీటింగ్లో ప్రస్తావనకు వచ్చింది. ఆ అమెరికా కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఒకరు ఆ దేశ టెక్నాలజీని, వాళ్ల స్కిల్ను. శ్రద్ధను చిలవలు పలవలుగా వివరిస్తున్నాడు. ఆ మీటింగ్లో చాయ్ బిస్కట్ ఎంజాయ్ చేస్తున్న మనోడు లేచి,‘‘ఎందుకు సర్ 6 కోట్లు తగలేశారు. ఓ 3వేలు పెట్టి ‘పెడెస్టెల్ ఫ్యాన్’ కొని స్పీడ్గా తిప్పితే ఖాళీ ప్యాకెట్లు ఎగిరిపోతాయిగా. పొరపాటున ఖాళీగా వచ్చేవి ఒకటీ రెండేగా’’... అనేసి మళ్లీ చాయ్ బిస్కట్ మీద పడ్డాడు. దీనితో అమెరికా ఎగ్జిక్యూటివ్ అవాక్కయ్యాడు. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలి.. అన్న సామెత అన్నిచోట్లా వర్తించదు. ఎంత పాముకు అంత కర్ర.. అదీ సరైన సమయంలో. – ఇదీ ఓ రకమైన జాబ్ స్కిల్లే కదా! నో స్కిల్... 81 పర్సెంట్... ఇంతకీ స్కిల్లు గురించి ఎందుకీ సొల్లు అంటారా? అత్యుత్తమ ఔట్పుట్ ఇవ్వగల నైపుణ్యాలు ఉద్యోగుల్లో ఉండటం లేదట. ఒకటో, రెండో కాదు.. ఐటీ రంగంలో ఏకంగా 81 శాతం సంస్థలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయని ఈవై, ఐమోచా సంస్థల అధ్యయనంలో వెల్లడైంది. మంచి నైపుణ్యాలు ఉన్న ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతోందని తేలింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల ఉద్యోగుల్లో పని నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీలపై అవగాహన అంశాలపై ఈవై, ఐమోచా సంస్థలు అధ్యయనం నిర్వహించాయి. ‘టెక్ స్కిల్స్లో మార్పులు – ఆ తర్వాత పని పరిస్థితులు’ పేరిట ఇటీవల నివేదికను విడుదల చేశాయి. – ప్రస్తుత డిజిటల్ యుగంలో పోటీలో నిలిచేందుకు వీలుగా కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకుంటున్నాయనీ.. కానీ వాటికి తగినట్టుగా నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు దొరకడం కష్టమవుతోందనీ నివేదిక వెల్లడించింది. ఒక్క ఐటీ రంగం మాత్రమే కాకుండా... బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం, డేటా అనాలసిస్ వంటి ఇతర రంగాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని స్పష్టం చేసింది. – అప్లికేషన్ డెవలపర్లు, పవర్ యూజర్ స్కిల్స్ ఉన్నవారికి డిమాండ్ పెరగడం కూడా కొరత నెలకొనడానికి కారణమని నివేదిక పేర్కొంది. స్కిల్ ఉంటేనే జాబులు... – సర్వేలో పాల్గొన్న చాలా సంస్థలు డెవలపర్, పవర్ యూజర్ నైపుణ్యాల కొరతను ఎదుర్కొంటున్నట్టు తెలిపాయి. కొత్త టెక్నాలజీలు, అవసరాలకు అనుగుణంగా ఏ ఉద్యోగానికి ఏ నైపుణ్యాలు తప్పనిసరి అనే విభజనను అనుసరిస్తున్నామని 19 శాతం కంపెనీలు తెలిపాయి. 43 శాతం కంపెనీలు ఉద్యోగుల స్థాయిలో నైపుణ్యాల పరిశీలన చేపట్టామన్నాయి. ఈ విభజన/పరిశీలన క్రమంలో చాలా మంది ఉద్యోగుల్లో అవసరమైన నైపుణ్యాలు లేనట్టుగా గుర్తించామని వెల్లడించాయి. ఈ క్రమంలో ఓవైపు ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, మరోవైపు మంచి స్కిల్స్ ఉన్నవారిని చేర్చుకోవడంపై దృష్టి పెడుతున్నట్టు వివరించాయి. స్కిల్స్ పెంచేద్దాం... ప్రస్తుతం ఉద్యోగులు నిర్వర్తించాల్సిన విధులు, అందుకు అవసరమైన నైపుణ్యాల్లో ఎన్నడూ లేనంత వేగంగా మార్పులు వస్తున్నాయని ఈ అధ్యయనం చెబుతోంది. 2025 నాటికి తమ సంస్థల్లోని మూడో వంతు ఉద్యోగుల్లో సాంకేతిక నైపుణ్యాలను గణనీయంగా పెంపొందించాల్సిన అవసరం ఉందని 28 శాతం సంస్థలు భావిస్తున్నాయనీ వివరిస్తోంది. మరో 62శాతం కంపెనీలు కనీసం 15 శాతం మంది ఉద్యోగుల్లో నైపుణ్యాల పెంపు తప్పనిసరి అని భావిస్తున్నట్టు తెలిపారు. ఇండియాలోనూ అంతే.. భారతదేశంలోని 60 శాతానికి పైగా కంపెనీలు నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నట్టు ఇటీవలి ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్’ నివేదికలో ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్) కూడా పేర్కొంది. ముఖ్యంగా చదువు పూర్తిచేసుకుని కొత్తగా ఉద్యోగాల్లోకి వస్తున్నవారికి తగిన నైపుణ్యాలు ఏమాత్రం ఉండటం లేదని వెల్లడించింది. ఉద్యోగుల్లో నైపుణ్యాల కల్పనకు తోడ్పడే అప్రెంటిస్షిప్, ఇంటర్న్షిప్, ఆన్ జాబ్ ట్రైనింగ్ వంటి వాటిని భారత్లో ఉపేక్షిస్తున్నారని పేర్కొంది. ముఖ్యంగా కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన స్కిల్స్ కల్పించేలా విద్యా రంగంలో సంస్కరణలు రావాల్సి ఉందని అభిప్రాయపడింది. సరికొండ చలపతి -
‘స్కిల్’ స్కామ్ సామాజిక, ఆర్థిక నేరం
సాక్షి, అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ను భారీ కుట్రకు సంబంధించిన సామాజిక, ఆర్థిక నేరంగా గతంలో విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు అభివర్ణించింది. బెయిల్ మంజూరు చేసే సమయంలో న్యాయస్థానాలు ఇలాంటి కేసులను ప్రత్యేక దృష్టి కోణంలో చూడాలని తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తు చేసింది. ఈ స్కామ్లో బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నిందితులపై ఉన్నవి తీవ్ర ఆరోపణలని తెలిపింది. ఈ స్కామ్లో రూ.371 కోట్ల ప్రజాధనం ముడి పడి ఉందని, చాలా తీవ్రత ఉందని హైకోర్టు తెలిపింది. ఈ స్కిల్ కుంభకోణంలో ఇద్దరు కీలక నిందితులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, హైకోర్టు వారి పిటిషన్లు కొట్టేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వేర్వేరు న్యాయమూర్తులు వేర్వేరు సందర్భాల్లో ఈ మేరకు తీర్పు ఇచ్చారు. షెల్ కంపెనీల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను దర్యాపు అధికారులు కోర్టు ముందు ఉంచలేదన్న నిందితుల వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ విషయాలన్నీ తుది ట్రయల్లో చెప్పుకోవాలని స్పష్టం చేసింది. కేసు రికార్డులను పరిశీలించిన హైకోర్టు.. షెల్ కంపెనీల కొనుగోలు జరిగిన తీరును గమనించింది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్లు తెలిపింది. రిమాండ్ తిరస్కరణ సరికాదు.. ఇదే కుంభకోణంలో కీలక నిందితుడి రిమాండ్ను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని కూడా హైకోర్టు తప్పు పట్టింది. రిమాండ్ సమయంలో కింది కోర్టు మినీ ట్రయల్ నిర్వహిస్తూ ఫలానా సెక్షన్ వర్తించదంటూ తేల్చేయడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. రిమాండ్ సమయంలో మినీ ట్రయిల్ తగదని స్పష్టం చేసింది. నిందితునిపై నమోదు చేసిన కేసు విచారణకు స్వీకరించదగ్గదా.. కాదా.. అన్నది మాత్రమే చూడాలని స్పష్టం చేసింది. నేరంలో నిందితుల పాత్ర గురించి క్షుణ్ణంగా చెప్పాల్సిన అవసరం లేదంది. 41ఏ సీఆర్పీసీ కిందకు రాని నేరాలకు కూడా 41ఏ ఇవ్వాలని చెప్పడం సరికాదంది. ఈ మొత్తం కేసులో ఐపీసీ 120బి ప్రకారం నేరపూరిత కుట్ర ఉందన్న విషయాన్ని ఏసీబీ ప్రత్యేక కోర్టు విస్మరించిందని హైకోర్టు ఆక్షేపించింది. రిమాండ్ తిరస్కరిస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. -
స్కిల్ యూనివర్స్ పేరుతో డాష్ బోర్డు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్వహించే నైపుణ్య శిక్షణ కోర్సులు, ఉపాధి కల్పన వంటి వివరాలు 24గంటలు అందుబాటులో ఉండేవిధంగా ‘స్కిల్ యూనివర్స్’ పేరుతో డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. ఈ మేరకు ప్రత్యేక పోర్టల్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) త్వరలో అందుబాటులోకి తీసుకువస్తుందని చెప్పారు. విజయవాడ ఆటోనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన శుక్రవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ట్రైనింగ్, ప్లేస్మెంట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం యువతకు ఎప్పటికప్పుడు తెలిసేలా డాష్ బోర్డును తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్ఎస్డీసీ, సీడ్యాప్, న్యాక్, పీఏడీఏ వంటి వివిధ సంస్థలకు చెందిన శిక్షణ వివరాలు పోర్టల్లో నమోదు చేయనున్నట్టు చెప్పారు. రాష్ట్ర యువతి, యువకులు నైపుణ్య శిక్షణ కోసం నమోదు చేసుకునేవారు, శిక్షణ దశలో ఉన్నవారు, శిక్షణ పూర్తి చేసుకున్నవారు, ఉద్యోగాల్లో చేరినవారు... ఇలా సమగ్ర సమాచారం ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే విధంగా డ్యాష్బోర్డును అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.కేతిక, నైపుణ్య విద్యను అభ్యసించే యువతి, యువకులకు అధ్యాపకుల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతన పోర్టల్లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో కరిక్యులమ్(రెజ్యూమ్) తయారు చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ తెలిపారు. వాటర్ మేనేజ్మెంట్, ప్లంబింగ్ స్కిల్ కౌన్సిల్లో ఏపీఎస్ఎస్డీసీ సాధించిన అవార్డును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ కార్యదర్శులు, ఎండీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ నాగరాణి, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ డాక్టర్ వినోద్కుమార్, ఈడీ దినేష్కుమార్, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. -
సర్ఫింగ్ ఆటలో ఇవాంక.. మియామీ తీరంలో అలలపై ఆటలు..
న్యూయార్క్: సర్ఫింగ్పై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. సోమవారం తన అద్భుతమైన వేక్బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించారు. మయామి బీచ్ తీరంలో అలలపై స్వారీ చేస్తున్న వీడియోను ఇవాంక తన ఇన్స్టా పోస్టులో పంచుకున్నారు. ఇవాంక వెంటే పడవలో కూర్చున్న ఆమె ఏడేళ్ల కుమారుడు థియో ఆనందంగా కేరింతలు కొడుతూ కనిపించారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) పసుపు రంగు వన్-పీస్ స్విమ్సూట్, బ్లాక్ లైఫ్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ ధరించారు ఇవాంక. నల్లటి స్విమ్సూట్లో సర్ఫ్బోర్డ్ను పట్టుకుని, కోస్టారికాలోని బీచ్లో చెప్పులు లేకుండా షికారు చేస్తున్న మరొక చిత్రాన్ని కూడా గతంలో షేర్ చేశారు. సర్ఫింగ్తో పాటు మిగిలిన అవుట్ డోర్ గేమ్స్లలో కూడా ఇవాంక పాలుపంచుకుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తర్వాత ఇన్స్టాలో ఆమె పోస్టు చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె చాలావరకు సైలెంట్గానే ఉన్నారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంలో తాను పాలుపంచుకోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఇవాంక తన వ్యక్తిగత కుటుంబానికి సమయం అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) 2024 ఎన్నికల్లో ఇవాంక తండ్రి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేయదలచిన అభ్యర్థుల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇదీ చదవండి: మాస్కోకు నార్త్ కొరియా కిమ్.. పుతిన్తో రహస్య భేటీ? -
10 అనవసర విషయాలు.. వీటి జోలికి వెళ్లకపోవడమే శ్రేయస్కరం!
మనిషి ప్రశాంతంగా ఉండాలంటే తప్పనిసరిగా కొన్ని పరిధులను కల్పించుకోవాలని నిపుణులు చెబుతుంటారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే లేని పోని సమస్యలు ఎదురవుతాయి. అవమానాలు కూడా ఎదురయ్యే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఈ 10 అనవసర విషయాలు మనిషికి ముప్పును తెచ్చిపెడతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సమయం, శక్తి వృథా: మీకు అవసరం లేని చోటికి వెళ్లడం వలన లేదా అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ విలువైన సమయం, శక్తి వృథా అవుతాయి. దీనికి బదులుగా మీ నైపుణ్యాలను అవసరమయ్యే విషయాలపైనే కేంద్రీకరించండి. తద్వారా మీ శక్తిసామర్థ్యాలు సద్వినియోగం అవుతాయి. 2. గుర్తింపునకు దూరం కావడం: మీరు అవసరం లేని చోటికి వెళ్లినప్పుడు, లేదా మీ సామర్థ్యాన్ని అనవసరం లేని విషయాలపై కేంద్రీకరించినప్పుడు మీకు తగిన గుర్తింపు, ప్రశంసలు అందకపోవచ్చు. ఇటువంటి సందర్భాల్లో మీకు సహకారం అందకపోగా, మీ గుర్తింపు కూడా మరింత తగ్గే అవకాశం ఉంది. 3. ఇతరుల వ్యక్తిగతాల్లోకి తొంగిచూడటం: మీకు అవసరం లేనప్పుడు ఇతరుల వ్యక్తిగతాల్లోకి చొరబడకపోవడమే ఉత్తమం. ఇతరుల వ్యక్తిగతాలను గౌరవించండి. ఎదుటివారు మీ సహాయం కోసం ప్రత్యేకంగా అడగనంత వరకు వారి వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్లకండి. 4. ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కడం: మీరు ఉద్దేశ్యపూర్వకంగా ఇతరుల సామర్థ్యాలను అణగదొక్కే ప్రయత్నం చేయకండి. వారి నైపుణ్యాలపై నమ్మకం ఉంచండి. వారి బాధ్యతలను వారు స్వతంత్రంగా నిర్వహించేలా చూడండి. ఇందుకు అవసరమైతేనే సహకారం అందించండి 5. ఉనికికే ప్రమాదం: మీరు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకుని, ఇతరులు మీ ఉనికిపై ఆధారపడే భావాన్ని వారిలో కల్పించవద్దు. ఇది ఇతరుల ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఎందుకంటే వారు తమ స్వంత నైపుణ్యాలను, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి బదులు మీపై ఆధారపడే స్వభావాన్ని ఏర్పరుచుకోవచ్చ. తద్వారా మీ ఉనికికే ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుంది. 6. లక్ష్యానికి దూరం కావడం: మీరు అవసరం లేని విషయాలలో అతిగా జోక్యం చేసుకుంటే మీ ఆసక్తులు, లక్ష్యాలకు దూరమై అన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు. మీ వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యత ఇవ్వడం, మీకు నిజమైన ప్రయోజనాలను అందించగల ప్రయత్నాలను కొనసాగించడం ఎవరికైనా చాలా అవసరం. 7. అతిశయోక్తులకు దూరంగా ఉండటం: మిమ్మల్ని మీరు అతిగా ఊహించుకోవడం, వర్ణించుకోవడం వలన మీ అత్యవసరాలను, శ్రేయస్సును నిర్లక్ష్యం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆరోగ్యకరమైన పనితీరు, జీవిత సమతుల్యతను కాపాడుకునేందుకు మనం ఏమిటో మనం తెలుసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. 8. వనరుల దుర్వినియోగం: మీరు మీ దగ్గరున్న వనరులను మీకు అవసరం లేని అంశాలపై మళ్లించినప్పుడు.. అది సమయం అయినా, డబ్బు అయినా వృథాకు దారితీస్తుంది. మీ దగ్గరున్న వనరులను ద్విగుణీకృతం చేసుకునేందుకు, వాటిని సమర్థవంతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. 9. కార్యకలాపాలకు అంతరాయం: మీరు లేనిపోని విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ కార్యకలాపాలకు, ఇతరుల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుంది. మీరు కోరుకునే మార్పు, మెరుగుదల కోసం ఇప్పటికే ఉన్న ప్రక్రియలను కొనసాగించాలి. సంబంధిత ప్రోటోకాల్లను గౌరవించడం కూడా అవసరమే. 10. చివరికి మిగిలేది: మీరు అవసరం లేని విషయాల్లో తరచూ జోక్యం చేసుకోవడం వల్ల అది నిరాశకు దారితీస్తుంది. మీ ప్రయత్నాలను అనవసరమైన విషయాలపై పెట్టి, సమయం వృథా చేసుకోకుండా, విలువైన, అర్ధవంతమైన మార్పును కలిగించగల అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇది కూడా చదవండి: ‘నాలుగు కాళ్ల’ వింత కుటుంబం.. ఆశ్చర్యపోతున్న శాస్త్రవేత్తలు -
కేటీఆర్ మనసు దోచుకున్న కార్పెంటర్: మీరు కూడా ఫిదా అవుతారు
ప్రతిభ ఎవడి సొత్తూ కాదు. కానీ అసామాన్య ప్రతిభ మాత్రం కొందరికే సొంతం. రోజూ చేసే పనే అయినా దానిలో బుద్ధి కుశలతను ప్రదర్శించి, మేధో తనాన్ని రంగరించి కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతారు. ఆధునిక పోకడలకు, తమదైన టెక్నాలజీ జోడించి శభాష్ అనుపించుకుంటారు. అలాంటి నైపుణ్యంతో ఒక కార్పెంటర్ వార్తల్లో నిలిచారు. ఈ కళాకారుడు హస్తకళా నైపుణ్యంతో సత్యనారాయణ వ్రత పీఠాన్ని తయారు చేసిన తీరు అద్భుతంగా నిలిచింది. (ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ వీడియో: బిగ్ సెల్యూట్ అంటున్న నెటిజన్లు) నేతన్న నైపుణ్యాన్ని చిన్న అగ్గిపెట్టెలో చీరను మడిచిపెట్టిన చందంగా ఒక కార్పెంటర్ పెట్టెలో పూజా పీఠాన్ని విడిగా అమర్చాడు. ఆ తరువాత ఒక్కో భాగాన్ని తీసి ఒక క్రమంగా పద్దతిలో ఎటాచ్ చేయడం సూపర్బ్గా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను రాగుల సంపత్ ట్విటర్లో షేర్ చేశారు. దీన్ని తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేస్తూ ఆయనకు సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీనికి ఫిదా అయిన కేటీర్ చాలా గ్రేట్ స్కిల్ అంటూ కమెంట్ చేశారు. అతనికి ఎలా చేయూత అందించవచ్చో పరిశీలించాల్సిందిగా సంబంధింత అధికారులకు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లును విపరీతంగా ఆకట్టుకుంటోంది. (దుబాయ్లో మరో అద్భుతం: ఈ వీడియో చూస్తే మతిపోవాల్సిందే!) Absolutely great skill Request @TWorksHyd to reach out to see how we could help https://t.co/KQe8zKOrCY — KTR (@KTRBRS) August 16, 2023 -
బుడతా..! నీ టాలెంట్కు హ్యాట్సాఫ్.. నెటిజన్లు ఫిదా..!
సోషల్ మీడియా వేదిక ఎందరికో ఉపాధిని కల్పిస్తే.. మరెందరికో తమ ఆసక్తిని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. ఎంతటి సదూరంలో ఉన్నా.. అధునాతన సౌకర్యాలు లేకున్నా తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలిపే విధంగా సోషల్ మీడియా ఉపయోగపడుతుంది. పాతతరం వాళ్లతో పోలిస్తే.. నేటి తరం చిన్నారులు అన్ని రంగాల్లోనూ చురకత్తుల్లా దూసుకుపోతున్నారు. తాజాగా రుద్ర ప్రతాప్ సింగ్ అనే బుడతడు విల్లు ఎక్కుపెట్టి దూరంగా ఉన్న బెలూన్ను గురి చూసి కొడుతున్నాడు. దూరంలో ఉన్న లక్ష్యాన్ని విల్లుతో ఎక్కుపెట్టడంలో ఏముంది వింత! అనుకుంటున్నారా..? అయితే.. అతను చేసే విలువిద్య చేతులతో కాదు.. కాళ్లతోనే భాణాన్ని సంధిస్తున్నాడు. తన శరీరాన్ని ధనస్సులా వెనక్కి వంచి. అరచేతులపై నిలబడి కాళ్లతోనే బాణాన్ని ఎక్కుపెట్టి ఏమాత్రం గురి తప్పకుండా లక్ష్యాన్ని గురిపెడుతున్నాడు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Rudra Pratap singh (@littleyogaguru) ఈ వీడియోను చూసిన వారంతా ఆ అబ్బాయి టాలెంట్కు ఫిదా అయిపోతున్నారు. 'నీ టాలెంట్కు హ్యాట్సాఫ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ చిన్నోడు మామూలోడు కాదని ఏకలవ్యుడని ప్రశంసిస్తున్నారు. మహాభారతంలో ఏకలవ్యుడు కంటికి కనిపించని లక్ష్యాన్ని ఛేదిస్తే.. ఈ బుడతడు కాళ్లతోనే శరాన్ని సంధించి లక్ష్యాన్ని గురి పెట్టాడంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీరు ఈ చిన్నోడు టాలెంట్ చూసేయండి. ఇదీ చదవండి: ఏంటీ వింత? ఎపుడూ లేనిది.. ఇపుడే కొత్తగా! 45 మందికి షాకిచ్చిన గోవా ఎక్స్ప్రెస్ ట్రైన్ -
ఏపీ విద్యార్థులను వెస్టర్న్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యం: సీఎం జగన్
వెస్టర్న్ వరల్డ్లో ఉన్న బోధనా స్థాయిలను అలవర్చుకుంటేనే ఏపీ విద్యార్థులు కూడా ఆ స్థాయికి చేరి పోటీ పడగలుగుతారు. దీనికోసం ప్రశ్నా విధానం మారాలి. పిల్లలకు బోధించే విధానంలో కూడా మార్పు రావాలి. కరిక్యులమ్లో కూడా మనం వాళ్లకంటే ఏ మేరకు మెరుగు పరుచుకోవాలన్న విషయాన్ని పరిశీలించాలి. ఇందుకు పాఠశాల స్థాయిలో కూడా బోధన, బోధనా విధానాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నది ఆలోచించాలి. స్టేట్ సిలబస్, నేషనల్ సిలబస్, సీబీఎస్ఈ వంటి అంశాలకే పరిమితం కాకుండా ఇంకా ముందుకు అడుగులు వేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థులకు ఫ్యూచర్ టెక్నాలజీపై నైపుణ్యాభివృద్ధిని అందించాల్సి ఉందని, ఆ మేరకు పాఠ్యాంశాలు, పాఠ్య ప్రణాళికకు రూపకల్పన చేయాలని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా బోధనలో, శిక్షణలో ఫ్యూచర్ టెక్నాలజీ వినియోగంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్పై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సమావేశం అయ్యారు. విద్యా శాఖ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్)తో కలిసి ఒక కొత్త సిలబస్ను రూపొందించబోతున్నామని, అది దేశానికే బెంచ్ మార్క్ కాబోతుందని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఐబీ, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్తో కలిసి టీచింగ్ మెథడాలజీని, పాఠ్య ప్రణాళికను మార్చబోతున్నామని.. దీనికి మీ లాంటి వారి సహకారం అవసరమని కోరారు. తద్వారా ఈ కల సాకారమయ్యే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత విద్యలో మెరుగైన సంస్కరణలు మనం రెండు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాం. ఒకటి పాఠశాల విద్య, రెండోది ఉన్నత విద్య. పాఠశాల దశ నుంచి ఉన్నత విద్య వరకు ఈ రెండింటినీ అనుసంధానం చేయాలి. పాఠ్యప్రణాళిక కూడా సమ్మిళితం చేయాలి. ఇది ప్రధాన లక్ష్యం. ఉన్నత విద్యలో మరింత మెరుగైన సంస్కరణలు అవసరం. ఇండియాలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వంటి వర్టికల్స్ అభివృద్ధి చాలా తక్కువ. వాటిని బోధించే సిబ్బంది కొరత కూడా ఎక్కువ. వీటిని పాఠ్య ప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఫైనాన్స్ సబ్జెక్ట్నే తీసుకుంటే.. బీకామ్లో ఫైనాన్స్కు సంబంధించిన ఇతర వర్టికల్స్ ఏవీ అందుబాటులో లేవు. అక్కడితో ఆగిపోవాల్సిన పరిస్థితి. రిస్క్ మేనేజ్మెంట్, అసెట్ మేనేజ్మెంట్, రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ వంటి అంశాలను కరిక్యులమ్లో భాగం చేయాలి. కంటెంట్ ఉన్నా, ఈ వర్టికల్స్ను బోధించే సిబ్బంది అందుబాటులో లేనందునే కరిక్యులమ్లో భాగంగా వీటిని తీసుకురాలేకపోతున్నాం. వెస్టర్న్ వరల్డ్లో వీటికి సంబంధించిన ఫ్యాక్టలీ ఉంది. ఇవన్నీ అక్కడ కరిక్యులమ్లో భాగంగా ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అంశాలు కరిక్యులమ్లో చేర్చాలి. ఈ కరిక్యులమ్ కేవలం ఒక సంస్థకే పరిమితం కాకుండా.. పెద్ద సంఖ్యలో స్కూళ్లు, కాలేజీల్లో అందుబాటులోకి తీసుకురావాలి. ఒక తరంలో వీటిని మనం నేర్పించగలిగితే... ఆయా వర్టికల్స్లో మనం నిపుణులను తయారు చేయగలుగుతాం. ఈ అంశాలను మన కరిక్యులమ్లో భాగంగా చేర్చకపోతే.. మన పాఠ్య ప్రణాళిక బలపడదు. వెస్టర్న్ వరల్డ్తో పోటీ పడలేం. అందువల్ల ప్రధానంగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలి. దీన్ని పెద్ద ఎత్తున ఎలా చేపట్టాలన్న కసరత్తు జరగాలి. స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఎలా సమ్మిళితం చేయాలన్నది మూడో అంశం. తరగతి గదుల డిజిటలైజేషన్ రాష్ట్రంలో ఇప్పటికే 6వ తరగతి నుంచి తరగతి గదుల డిజిటలైజేషన్ ప్రక్రియను చేపట్టాం. ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 63 వేల తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డిసెంబర్ ఆఖరుకు ఇది పూర్తవుతుంది. ఇప్పటికే 32 వేల తరగతి గదుల్లో డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ ను అమలు చేస్తున్నాం. బైలింగువల్ టెక్ట్స్ బుక్స్ పంపిణీ చేస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాం. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు కూడా ఇస్తున్నాం. ఈ మార్పులన్నీ ఏపీలోని స్కూళ్లలో చోటుచేసుకుంటున్నాయి. ఈ మార్పులను ఇప్పుడు ఉన్నత విద్యతో సమ్మిళితం చేస్తూ మరింత ముందుకు ఎలా తీసుకువెళ్లాలన్నదే మన ముందున్న సవాలు. ఐబీ యుగంలో ఉన్నాం ఇప్పుడు మనం ఐబీ (ఇంటర్నేషనల్ బాకలారియేట్) యుగంలో ఉన్నాం. మనం వాటిని అవలంబించలేకపోతే, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే.. వెస్టర్న్ కంట్రీస్లో పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. ఐబీలో వారి ప్రశ్నల స్థాయికి, మనకు మధ్య చాలా తేడా ఉంది. మనం 3వ తరగతి నుంచే టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, ప్లస్1, ప్లస్ 2 లెవల్లో సీనియర్ పరీక్షలను కరిక్యులమ్లో భాగం చేయబోతున్నాం. ఈ మార్పులన్నీ ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు అందించగలిగితే అది గొప్ప మార్పు అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అదే చేస్తున్నాం. స్కూల్ స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు ఈ మార్పులు తీసుకుని వెళ్లి, సమ్మిళితం చేయడం ద్వారా ప్రధామైన పోటీదార్లుగా నిలబెట్టి.. మా పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. అత్యుత్తమ ఐటీ నిపుణులు, కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా ఆశయం. ఈ నేపథ్యంలో ఈ మార్పుల కోసం మీ అందరి సహకారం కోరుతున్నాను. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో వచ్చిన మార్పులను కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 5వ తరగతి వరకు స్మార్ట్ టీవీ ఏర్పాటు చేశాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిగదిలో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశాం. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే వరకు భరోసా అందించాలన్నదే మా ప్రయత్నం. ఇందులో భాగంగా తల్లులు తమ పిల్లలను స్కూల్కు పంపించేలా ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. దేశంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలవుతోంది. రూ.20 వేల వరకు పిల్లలకు బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చులు చెల్లిస్తున్నాం. మా ప్రభుత్వం మానవ వనరుల మీద పెట్టుబడి పెడుతోంది. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. సమావేశంలో పాల్గొన్న వారు.. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ లీడ్ డాక్టర్ విన్నీ జౌహరి, ఇంటెల్ సీనియర్ డైరెక్టర్ (ఆసియా పసిఫిక్ అండ్ జపాన్) శ్వేత ఖురానా, నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సంధ్య చింతాల, ప్రైమస్ పార్ట్నర్స్ ఇండియా కో ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ చారు మల్హోత్ర, ప్రైమస్ పార్ట్నర్స్ ఇండియా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ పూజ క్వాత్రా, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ జైజిత్ భట్టాచార్య, అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్ ఆఫ్ స్కిల్స్ టు జాబ్స్ (ఇండియా అండ్ సౌత్ ఆసియా) డిపి సింగ్, గూగుల్ లీడ్ ఎడ్యుకేషన్ శ్రీనివాస్ గరిమెళ్ల, మైక్రోసాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రామ్ మేనేజర్ కిషోర్ గార్గ్, డేటావివ్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ వేదాంత్ అహ్లువాలియా, డేటావివ్ బోర్డు మెంబర్ అతుల్ కుమార్ పాల్గొన్నారు. రాష్ట్రానికి చెందిన పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, సమగ్రశిక్షా అభియాన్ ఎస్పీడీ బి శ్రీనివాసరావు, మిడ్ డే మీల్స్ డైరెక్టర్ నిధి మీనా, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ (మౌలిక వసతుల కల్పన) కాటమనేని భాస్కర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఏపీఈడబ్ల్యూఐడీసీ ఎండీ సి ఎన్ దీవాన్ రెడ్డి, పలువురు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వర్చువల్గా విదేశీ కోర్సులు ఫ్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ను పాఠశాల స్థాయికే పరిమితం చేయకుండా ఉన్నత విద్యలో కూడా ప్రవేశపెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను చేర్చగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. అప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యే నాటికి మన పిల్లలకు మంచి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్ని కోర్సుల కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అదే సబ్జెక్ట్లను వర్చువల్గా బోధించడం ద్వారా మన దేశంలో అందుబాటులోకి తీసుకురావాలి. వర్చువల్ టీచింగ్, వర్చువల్ కంటెంట్ అందుబాటులోకి తేవాలి. ఇంజనీరింగ్, మెడిసిన్లోని సంప్రదాయ విధానాల్లో కూడా మార్పులు రావాలి. వాటిని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది. రోబోటిక్స్ ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉంది. వీటిమీద దృష్టి పెట్టాలి. ఈ మార్పులన్నింటినీ దృష్టిలో ఉంచుకుని వచ్చే సమావేశం నాటికి స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఒక స్పష్టమైన విధానాన్ని రూపొందించాలి. సీఎంతో సమావేశమైన ప్రముఖులు.. డాక్టర్ విన్నీ జౌహరి మైక్రోసాఫ్ట్ లెర్నింగ్ అండ్ స్కిల్స్ లీడ్ మైక్రోసాఫ్ట్లో డైరెక్టర్, ఎడ్యుకేషన్ అడ్వొకసీగా విన్నీ జౌహరి పని చేస్తున్నారు. దీనికి ముందు గుర్గావ్లోని ఐఐఎంటీలో డైరెక్టర్, స్ట్రాటజీ ప్రొఫెసర్గా పనిచేశారు. హెచ్పీ ల్యాబ్స్ ఓపెన్ ఇన్నోవేషన్ ఆఫీస్కు రీజియన్ లీడ్గా సేవందించారు. హెచ్పీ ల్యాబ్స్లో పనికి, విద్యా విషయాల్లో విజయాలకు అవార్డులు అందుకున్నారు. జౌహరి జర్నల్ ఆఫ్ సరీ్వసెస్ రీసెర్చ్, జర్నల్ ఆఫ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఫర్ గ్రోయింగ్ ఎకానమీస్కు వ్యవస్థాపక సంపాదకురాలుగా ఉన్నారు. ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పొందారు. శ్వేత ఖురానా ఇంటెల్ సీనియర్ డైరెక్టర్ (ఆసియా పసిఫిక్ అండ్ జపాన్) ఆసియా పసిఫిక్, జపాన్ ప్రభుత్వాలతో వ్యూహాత్మక కార్యక్రమాలు నడిపించే బాధ్యత శ్వేత ఖురానా నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, డెవలప్మెంట్ ఏజెన్సీలు, విద్యాసంస్థలు, కమ్యూనిటీలతో సంబంధాలు కొనసాగించడంలో 23 ఏళ్ల అనుభవం ఉంది. 2010లో ఇంటెల్లో చేరారు. ఇండోనేసియాలో ఇంటెల్ కోసం కార్పొరేట్ అఫైర్స్, టెక్–ఎనేబుల్డ్ ఎడ్యుకేషన్ను ప్రోత్సహించడం, ఇండియాలో కే12 ఎడ్యుకేషన్ను నిర్వహించడం వంటి అంశాల్లో నాయకత్వం వహించారు. చారు మల్హోత్ర ఎండీ, కో ఫౌండర్, ప్రైమస్ పార్టనర్స్ ఇండియా విద్యావేత్త, లెరి్నంగ్, డెవలప్మెంట్ ప్రొఫెషనల్, పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్లో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం చారు మల్హోత్రకు ఉంది. విద్య, సాంకేతికత, సీఎస్ఆర్ కార్యక్రమాలలో ప్రాజెక్టులపై 15 కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేశారు. భారతదేశంలోని ప్రభుత్వాల్లో ముఖ్యమైన ప్యానెళ్లు, కమిటీల్లో పనిచేశారు. శ్రీనివాస్ గరిమెళ్ల, గూగుల్ లీడ్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటర్ప్రైజ్, ప్రభుత్వ, విద్యాపరమైన పాత్రలను కలిగి ఉన్న బహుముఖ విధుల్లో 20 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం శ్రీనివాస్కు ఉంది. కార్పొరేట్, ప్రభుత్వ, విద్యాసంస్థల పనితీరులో సమర్థత, ప్రభావాన్ని తీసుకురావడానికి ఐసీటీ జోక్యాలపై దృష్టి సారించి అనేక ఇ–గవర్నెన్స్ ప్రాజెక్ట్లు, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్లకు నాయకత్వం వహించారు. భారతదేశంలో మైక్రోసాఫ్ట్ కోసం స్మార్ట్ సిటీ కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తున్నారు. భారత్లో మైక్రోసాఫ్ట్ ప్రాక్టీస్ను నిర్మించడానికి బాధ్యత వహిస్తున్నారు. జైజిత్ భట్టాచార్య సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఐఐఎం కలకత్తా ఇన్నోవేషన్ పార్క్ డైరెక్టర్ల బోర్డులో జైజిత్ భట్టాచార్య ఉన్నారు. డిజిటల్ విజన్ 2035 రూపొందిస్తున్నారు. షేకత్కర్ కమిటీ నివేదిక ఆధారంగా భారత వైమానిక దళ పునరి్నర్మాణం వంటి జాతీయ కార్యక్రమాలకు సహకరించారు. ఓపెన్ స్టాండర్డ్స్పై జాతీయ విధానానికి సహకరించారు. పెట్టుబడిదారుల దృక్కోణం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను సంకలనం చేసిన ‘ఇండియా సోర్స్ హై‘ నివేదిక ముఖ్య రచయిత ఆయన. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం లాంచ్లో భాగంగా ప్రధాని మోదీ దీనిని ప్రారంభించారు. ఇ–గవర్నెన్స్ వ్యూహాలపై ప్రభుత్వాలకు సలహాలు ఇస్తున్నారు. -
అమెరికాలో ఉద్యోగావకాశాలు.. ఎస్ఎల్యూ నుంచి లెవెల్అప్ ప్రోగ్రాం
హైదరాబాద్: అమెరికన్ విశ్వవిద్యాలయం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ (ఎస్ఎల్యూ) తమ అంతర్జాతీయ విద్యార్థులు స్థానికంగా ఉద్యోగావకాశాలను దక్కించుకునేందుకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ కల్పించనుంది. ఇందులో భాగంగా వారు ఉద్యోగానుభవం పొందేందుకు ఉపయోగపడే లెవెల్అప్ ప్రోగ్రామ్ను ఆవిష్కరించినట్లు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఎస్ఎల్యూ అసోసియేట్ ప్రొవోస్ట్ ఎరిక్ ఆర్మ్బ్రెక్ట్ తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థులు తాము ఎంచుకున్న రంగాల్లో అనుభవాన్ని గడించేందుకు, జాబ్ మార్కెట్లో కంపెనీల దృష్టిని ఆకర్షించేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం ఎక్సెలరేట్ సంస్థతో జట్టు కట్టినట్లు పేర్కొన్నారు. -
నేర్చుకున్నది ఎప్పటికీ వృధా కాదు!
ఇతిహాసాల్లోని పాత్రలకు తమ అభినయంతో వెండితెర మీద ప్రాణం పోయడమంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ పరీక్షలో నెగ్గి.. సీతగా జీవించింది కృతి సనన్ ‘ఆదిపురుష్’లో! ఆ టాలెంట్కి ఫ్యాషన్ స్టయిల్ని క్రియేట్ చేసే చాన్స్ దక్కించుకున్న బ్రాండ్స్లో కొన్ని ఇక్కడ.. అర్పితా మెహతా... సాధారణంగా చాలా మంది తల్లులు .. కూతుళ్లకు చీరకట్టి.. ముస్తాబు చేసి మురిసిపోతుంటారు. కానీ అర్పితాకు మాత్రం అమ్మకు చీరకట్టడమంటే ఇష్టం. పండుగలు, వేడుకలకు అమ్మ, అమ్మమ్మకు చక్కగా చీరకట్టి.. అలంకరించి సంబరపడేది. అలా బాల్యంలోనే.. తన ప్యాషన్ ఫ్యాషనే అని గ్రహించి, పెద్దయ్యాక ముంబైలోని ఎన్ఎన్డీటీ యూనివర్సిటిలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసింది. కొంతకాలం ప్రముఖ డిజైనర్ల దగ్గర పనిచేసి.. 2009లో సొంత లేబుల్ ‘అర్పితా మెహతా’ను ప్రారంభించింది. వైవిధ్యమైన, ఆధునిక డిజైన్స్ని క్రియేట్ చేస్తూ, అనతికాలంలోనే అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. అందుకే వీటి ధరలూ అదే స్థాయిలో ఉంటాయి. ఆన్లైన్లో లభ్యం. ఆమ్రపాలీ జ్యూలరీ ఇద్దరు స్నేహితులు రాజీవ్ అరోరా, రాజేష్ అజమేరా కలసి జైపూర్లో ‘ఆమ్రపాలీ’ పేరుతో మ్యూజియాన్ని స్థాపించారు. ఇందులో నచ్చిన వాటిని కొనుగోలు చేసే వీలూ ఉంది. అయితే, వీటి ధర లక్షల్లో ఉంటుంది. అందుకే, అలాంటి డిజైన్స్లో ఆభరణాలను రూపొందించి తక్కువ ధరకు అందించేందుకు ‘ఆమ్రపాలీ జ్యూలరీ’ ప్రారంభించారు. ఒరిజినల్ పీస్ అయితే మ్యూజియంలోనూ, మామూలు పీస్ అయితే అమ్రపాలి జ్యూలరీలోనూ లభిస్తుంది. చాలామంది సెలబ్రిటీస్కి ఇది ఫేవరెట్ బ్రాండ్. ఆన్లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. జ్యూలరీ బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. బ్రాండ్: అర్పిత మెహత చీర ధర: రూ. 2,50,000 బ్లౌజ్ ధర: రూ. 40,000. (చదవండి: రోజ్ ఫెస్టివల్..ఎటు చూసి గూలబీ పూల గుత్తులే..!) -
కమ్మని కాఫీలాంటి కళ
యువతరంలో చాలామంది..తమ క్రియేటివ్ స్కిల్స్ను అభిరుచికి మాత్రమే పరిమితం చేసుకోవడం లేదు. ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి ఆసక్తి, అభిరుచులనే కెరీర్ ఛాయిస్గా తీసుకుంటున్నారు. కాపీరైటర్ కావాలనే కల కూడా అందులో ఒకటి. ‘మేకిట్ సింపుల్. మేకిట్ మెమొరబుల్’ ‘రైట్ వితౌట్ ఫియర్. ఎడిట్ వితౌట్ మెర్సీ’... లాంటి మాటలను గుండెలో పెట్టుకొని తమ కలల తీరం వైపు కదులుతున్నారు.. పశ్చిమ బెంగాల్లోని చిన్న పట్టణం నుంచి తన కలల తీరమైన ముంబైకి వచ్చింది అనూష బోస్. మాస్ కమ్యూనికేషన్లో పట్టా పుచ్చుకున్న అనూష ఒక అడ్వర్టైజింగ్ కంపెనీలో చేరింది. జింగిల్స్, డైలాగులు రాయడంలో తనదైన శైలిని సృష్టించుకుంది. మూడురోజుల్లో రాసే టైమ్ దొరికినా కేవలం 30 సెకండ్లలో మాత్రమే రాసే అవకాశం ఉన్నా.. ఎక్కడా తడబాటు ఉండకూడదనేది తన ఫిలాసఫీ. ‘ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సానబట్టాలి’ అంటుంది సీనియర్ కాపీ రైటర్ అయిన అనూష బోస్. ట్రైనీ కాపీరైటర్గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది ముంబైకి చెందిన ఆకృతి బన్సాల్. చిన్నప్పటి నుంచి తనకు టీవీలో వచ్చే యాడ్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టమే తనని అడ్వర్టైజింగ్ ఫీల్డ్కు తీసుకువచ్చింది. అది ఏ వ్యాపారానికి సంబంధించినది అనేదానికంటే ఆ యాడ్ వెనుక ఉన్న ఐడియా తనకు బాగా నచ్చేది. ‘హోం సైన్స్’ చదువుకున్న ఆకృతికి ‘ఎడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్రిలేషన్’ ఒక సబ్జెక్ట్గా ఉండేది. ఆ సబ్జెక్ట్ ఇష్టంగా చదువుకున్న తరువాత ‘ఈ రంగంలో నేను ప్రయత్నించవచ్చు’ అనుకుంది. ఫీల్డ్కు వచ్చిన తరువాత ప్రతిరోజు, ప్రతి డెడ్లైన్ను ఒక సవాల్గా స్వీకరించింది. ‘చాలెంజ్ ఉన్నప్పుడే మజా ఉంటుంది’ అంటుంది ఆకృతి బన్సాల్. మరి ఆమె భవిష్యత్ లక్ష్యం ఏమిటి? ‘ప్రతిష్ఠాత్మకమైన ఎడ్వర్టైజింగ్ అవార్డ్ తీసుకోవాలి లేదా నా తల్లిదండ్రులు రోడ్డు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి నచ్చిన యాడ్ హోర్డింగ్ నేను రాసినదై ఉండాలి’ అంటుంది ఆకృతి బన్సాల్. రాధిక నాగ్పాల్ టీనేజ్ నుంచి పుస్తకాల పురుగు. భాషలోని సొగసు అంటే ఇష్టం. రాధిక జర్నలిజం కోర్స్ చేసింది. అందులో ఒక సబ్జెక్ట్ అయిన ఎడ్వర్టైజింగ్ తనకు బాగా నచ్చింది. రాధిక ఇప్పుడు ‘సోషియోవాష్’లో సీనియర్ కాపీ రైటర్. ‘యాడ్ ఏజెన్సీలో పనిగంటలు అంటూ ఉండవు. కాలంతో పరుగెత్తాల్సిందే. బ్రాండ్ను అర్థం చేసుకోవడంతో పాటు క్లయింట్ ఆశిస్తున్నది ఏమిటి? ఆడియెన్స్ను వేగంగా ఎలా చేరుకోవాలి? అనే దానిపై అవగాహన ఉండాలి. మనం చెప్పదల్చుకున్నది సింగిల్ లైన్లోనే క్యాచీగా చెప్పగలగాలి’ అంటుంది రాధిక. విస్తృతంగా చదవాలి. గత అనుభవాల నుంచి రెఫరెన్స్ తీసుకోవడానికి ఎంతో ఉంది’ అనేది ఔత్సాహిక కాపీరైటర్లకు రాధిక ఇచ్చే సలహా. గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన అంజు న్యూస్పేపర్లలో వచ్చే ఎడ్వర్టైజింగ్లను ఫైల్ చేస్తుంటుంది. ఆమె ఎన్నోసార్లు చదివిన పుస్తకం క్లాడ్ సీ.హాప్కిన్స్ రాసిన సైంటిఫిక్ ఎడ్వర్టైజింగ్ (1923). ఈ పుస్తకంలోని సరళమైన భాష అంటే అంజుకు ఇష్టం. ‘జస్ట్ సేల్స్మన్షిప్’ ‘ఆఫర్ సర్వీస్’ ‘హెడ్ లైన్స్’ ‘బీయింగ్ స్పెసిఫిక్’ ‘ఆర్ట్ ఇన్ ఎడ్వర్టైజింగ్’ ‘టెల్ యువర్ ఫుల్స్టోరీ’ ‘ఇన్ఫర్మేషన్’ ‘స్ట్రాటజీ’ ‘నెగెటివ్ రైటింగ్’... మొదలైన చాప్టర్ల గురించి అనర్గళంగా మాట్లాడగలదు. అంజు భవిష్యత్ లక్ష్యం ‘కాపీ రైటర్’ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! వీరు కూడా.. ప్రముఖ సినీ నటి రాశీఖన్నా న్యూ దిల్లీ, లేడీ శ్రీరామ్ కాలేజీ స్టూడెంట్. కాలేజీ రోజుల నుంచి చదవడం రాయడం అంటే ఇష్టం. కాపీరైటర్ కావాలనేది తన కల. కలను నిజం చేసుకోవడానికి ముంబైకి వెళ్లింది. అయితే సినిమాల్లో అవకాశాలు రావడంతో తన రూట్ మారింది. కాపీరైటర్ కాబోయి యాక్టర్ అయిందన్నమాట! సినిమారంగంలో ఉన్నప్పటికీ గుడ్ కాపీరైటింగ్ కోసం వెదుకుతుంది. బాలీవుడ్ హీరో రణ్వీర్సింగ్ కాలేజీ చదువు పూర్తికాగానే ఒక యాడ్ ఏజెన్సీలో కాపీరైటర్గా కెరీర్ మొదలుపెట్టాడు. ఇప్పటికీ చిన్న చిన్న రచనలు చేస్తుంటాడు. మన ప్రత్యేకతే మన శక్తి ఇండస్ట్రీలో నేను కూడా ఒకరిని అనుకోవడం కాదు. మనలోని ప్రత్యేకత గురించి ఇండస్ట్రీ మాట్లాడుకునేలా క్రియేటివిటీకి సాన పట్టాలి. – ఆకృతి బన్సాల్, కాపీ రైటర్ ఒక ఐడియా... వెయ్యి ఏనుగుల బలం ఒక ఐడియా స్ట్రైక్ అయ్యేవరకు మనసులో భయంగా ఉంటుంది. తళుక్కుమని ఒక ఐడియా మెరిసిందా...ఇక అంతే. వెయ్యి ఏనుగుల బలం దరి చేరుతుంది! క్రియేటివ్ బ్లాక్స్ రాకుండా ఉండడానికి పుస్తకాలు చదువుతాను. నచ్చిన పుస్తకాలు మళ్లీ చదువుతాను. – రాధిక నాగ్పాల్, సీనియర్ కాపీ రైటర్ (చదవండి: కాళ్లు లేకపోయినా రెక్కలున్నాయ్! ) -
స్కిల్ హబ్స్ ద్వారా నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
-
విద్యార్థులకు వరంగా మరీనా స్కిల్ హబ్ సెంటర్లు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అలా ప్రవర్తించినందుకు పిల్లలు తిట్టారు, ఏడ్చారు.. నాకూ దుఃఖమాగలేదు!
తాడిపత్రి హింసాత్మక ఘటనల వెనుక అసలు హస్తం
కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది
హీరామండి నటి షర్మిన్ సెగల్ భర్త ఎవరో తెలుసా? వేల కోట్ల ఆస్తి
పోలీసులు ఏ రాజకీయ పార్టీల ప్రలోభాలకు లోను కాకుండా నిస్పక్షపాతంగా పనిచెయ్యాలి
అభిషేక్ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్మన్ .. ఫొటోలు వైరల్
ఓటీటీలోకి సుహాస్ లేటెస్ట్ హిట్ మూవీ.. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్
SRH: సన్రైజర్స్ కెప్టెన్ చేసిన పనికి అభిమానులు ఫిదా
తప్పక చదవండి
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- ఎవరీ శ్యామ్ రంగీలా? మోదీపై ఎందుకు పోటీ చేయాలనుకున్నారు
- లాలూ యాదవ్ కూతుళ్ళ పేర్ల వెనుక ఇంత హిస్టరీ ఉందా?
- జెరోధా ట్రేడర్లకు అలెర్ట్.. అదిరిపోయే ఫీచర్తో
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- APL వేలంలో నితీశ్ కుమార్ రెడ్డికి అత్యధిక ధర.. సరికొత్త రికార్డు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
- ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభాస్
- ఎల్లో గ్యాంగ్ బొక్క బోర్లా.. అసలు నిజం ఇదే..
Advertisement