-
కొచ్చి యూనివర్సిటీ తొక్కిసలాటకు కారణమిదే..
కొచ్చి: ఒక్కసారిగా కుంభవృష్టి కురవడం వల్లే కొచ్చి యూనివర్సిటీలో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోయారు. 50 మంది దాకా గాయపడ్డారు.సింగర్ నిఖితాగాంధీ కన్సర్ట్ సందర్భంగా విద్యార్థులు ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో గుమిగూడినపుడు ఘటన జరిగింది. ‘ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లోపలికి వెళ్లేందుకు బయటికి వచ్చేందుకు ఒకే గేట్ ఉంది. పాసులు ఉన్న వాళ్లను ఆ ఒక్క గేటు నుంచే బ్యాచుల వారిగా లోపలికి నిర్వాహకులు లోపలికి పంపారు. లోపలికి వెళ్లేందుకు పాసులు లేని యూనివర్సిటీకి సంబంధం లేని యువకులు పెద్ద సంఖ్యలో గేటు వద్ద వేచి ఉన్నారు. ఈ సమయంలోనే వర్షం పడింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. అక్కడున్న మెట్ల మీది నుంచి కొందరు కిందపడ్డారు. పడిపోయిన వారి మీద నుంచి విద్యార్థులు పరుగులు తీయడంతో నలుగురు చనిపోయారు’ అని పోలీసులు తెలిపారు. మృతి చెందిన విద్యార్థులను అతుల్ తంబి, అన్ రుఫ్తా, సరా థామస్, అల్విన్గా గుర్తించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 30 మంది త్వరగా కోలుకుంటున్నారని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గాయపడ్డవారి చికిత్సను దగ్గరుండి పర్యవేక్షించాల్సిందిగా ఆరోగ్య మంత్రిని ఆదేశించారు. ఇదీచదవండి..నాడు కసబ్ను గుర్తించిన బాలిక ఇప్పుడేం చేస్తోంది? -
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో తొక్కిసలాట.. 31 మంది మృతి
బ్రజ్జావిల్లే: కాంగో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో అపశ్రుతి చొటుచేసుకుంది. ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. కాంగో రాజధాని బ్రజ్జావిల్లేలోని ఓర్నానో స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ డ్రైవ్ను అధికారులు నిర్వహించారు. నవంబర్ 14 నుంచి ర్యాలీ జరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం వేలాది మంది యువత ర్యాలీకి హాజరయ్యారు. యువత గుంపులుగా రావడంతో పరిస్థితిని సిబ్బంది అదుపు చేయలేకపోయారు. దీంతో ఒకరిపై మరొకరు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడినట్లు ప్రభుత్వం మంగళవారం తెలిపింది. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
పూరీ, హసన్ ఆలయాల్లో తోపులాట
పూరీ/హసన్: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుని ఆలయం, కర్ణాటకలో హసన్లో ఉన్న హసనాంబ ఆలయాల్లో శుక్రవారం వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. రద్దీ కారణంగా చోటుచేసుకున్న తోపులాటల్లో 27 మంది వరకు గాయపడ్డారు. కొందరు స్పృహ తప్పి పడిపోయారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు వివరించారు. శుక్రవారం వేకువజాము నుంచే ఆలయానికి భక్తుల రాక మొదలైందని శ్రీ జగన్నాథ్ ఆలయ అధికారులు తెలిపారు. మంగళ హారతి సమయంలో గేట్లు తెరవడంతో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుని 10 మంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధ మహిళలున్నారని అన్నారు. బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినట్లు చెప్పారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. గాయపడిన వారిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారని తెలిపారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువైందే తప్ప తోపులాట జరగలేదని పూరీ ఎస్పీ కేవీ సింగ్ స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలోని హసనాంబ ఆలయంలో క్యూలైన్లలోని వారు విద్యుత్ షాక్కు గురై 17 మంది వరకు గాయపడ్డారు. ఇది తోపులాటకు దారితీసింది. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. బాధితులు చెబుతున్న కరెంట్ షాక్ విషయమై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు. -
దుర్గా పూజ మండపం వద్ద తొక్కిసలాట.. అయిదేళ్ల చిన్నారి సహా ముగ్గురి మృతి
పాట్నా: బిహార్లో విషాదం నెలకొంది. దసరా ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా పూజ మండపం వద్ద జరిగిన తొక్కిసలాట ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. గోపాల్గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. వివరాలు.. దేవి నవరాత్రుల సందర్భంగా రాజా దళ్ ప్రాంతంలో దుర్గా పూజ వేడుకలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఒకేసారి ఎక్కువ మంది గుమిగూడటంతో మండపం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో అయిదేళ్ల బాలుడు, ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై గోపాల్ గంజ్ ఎస్పీ స్వర్ణ ప్రభాత్ మాట్లాడుతూ.. సోమవారం రాత్రి 8.30 గంటలకు రాజాదలళ్ పూజా పండల్ గేటు దగ్గర తొక్కిసలాట జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో ఓ బాలుడు కిందపడి పోవడంతో అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు మహిళలు సైతం కిందపడిపోయారన్నారు. అదే సమయంలో భక్తులు ప్రసాదం కోసం బారులు తీరడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. దీంతో ముగ్గురికి ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లారని,, ఆసుపత్రికి తరలించేలోపు ముగ్గురు మరణించారని పేర్కొన్నారు. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించినట్లు చెప్పారు. మరో 10కి పైగా గాయపడగా.. వారిని సదర్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు మండపం వద్ద ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడమే తొక్కిసలాటకు దారితీసిందని పోలీసులు తెలిపారు. చదవండి: తమిళనాడులో రోడ్డు ప్రమాదం.. ఏడుగురి మృతి -
మడగాస్కర్ స్టేడియంలో తొక్కిసలాట.. 13 మంది మృతి
అంటాననరివో: మడగాస్కర్ రాజధాని అంటనానారివోలోని స్టేడియంలో శుక్రవారం జరిగిన తొక్కిసలాటలో 13 మంది మరణించగా 107 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారని రెడ్క్రాస్ తెలిపింది. రెడ్క్రాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రారంభోత్సవం సందర్బంగా కనీసం 50,000 మంది బారే స్టేడియానికి తరలిరాగా ఎంట్రన్స్ వద్దే ఈ తొక్కిసలాట జరిగింది. ఒకేసారి జనం ఎంట్రన్స్ వద్దకు దూసుకు రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని రెడ్ క్రాస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆ సమయంలో ప్రారంభోత్సవాలకు హాజరై అక్కడే ఉన్న మడగాస్కర్ అధ్యక్షుడు ఆండ్రీ రజోఎలినా అక్కడే మౌనం పాటించాలని కోరారు. సంఘటన తర్వాత స్టేడియంలో ఎక్కడ చూసినా జనం తనవారి కోసం తమ వస్తువుల కొసం వెతుకులాడుతున్న దృశ్యాలే దర్శనమిచ్చాయి. ఈ దారుణానికి కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు కానీ మృతుల సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం ఉందని రెడ్క్రాస్ తెలిపింది. 40 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఇండియన్ ఓషన్ ఐలాండ్ గేమ్స్ ప్రతి నాలుగేళ్లకు హిందూ మహాసముద్రం పరిసర ద్వీపాల్లో ఒక్కోసారి ఒక్కో ద్వీపంలో నిర్వహిస్తూ ఉన్నారు. గత పర్యాయం ఈ గేమ్స్ మారిషస్లో జరగ్గా ఈ సారి వీటిని మడగాస్కర్లో నిర్వహించ తలపెట్టారు నిర్వాహకులు. మడగాస్కర్ స్టేడియానికి విషాదాలు కొత్తేమీ కాదు. 2019లో ఇదే స్టేడియంలో జాతీయ సెలవు రోజున ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఆరోజు జరిగిన తొక్కిసలాటలో 16 మంది మృతి చెందారు అందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. అంతకుముందు 2016లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జరిగిన బాంబు దాడిలో ముగ్గురు చనిపోయారు. #Breaking | At least 12 people die in a stampede at a stadium in Antananarivo, capital of Madagascar - Prime Minister Christian Ntsay Follow @aliifil1 for More UPDATES pic.twitter.com/AZDRDvRHI4 — Breaking news 24/7 (@aliifil1) August 25, 2023 ఇది కూడా చదవండి: మలుపుతిప్పిన చంద్రయాన్-3.. ఇస్రో చేతికి నాసా ఉపగ్రహం -
రంజాన్ 2023: యెమెన్లో వితరణ వేళ విషాదం.. 78 మంది దుర్మరణం
సనా: యెమెన్ దేశంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్థానికులకు తలో 7 డాలర్లమేర ఉచిత నగదు పంపిణీ కార్యక్రమం చివరకు ఘోర విషాదంతో ముగిసింది. వందల సంఖ్యలో జనం తరలిరావడం, వారిని అదుపుచేసేందుకు సాయుధ హౌతీ తిరుగుబాటుదారులు గాల్లోకి కాల్పులు జరపడం, ఆ తూటాలు తగిలి విద్యుత్ తీగల వద్ద పేలిన శబ్దాలతో భయపడిన పేదజనం పరుగెత్తారు. దీంతో హఠాత్తుగా తొక్కిసలాట చోటుచేసుకుంది. యెమెన్ రాజధాని సనా సిటీలోని ఓ పాఠశాల ఆవరణలో జరిగిన ఈ తొక్కిసలాటలో చిన్నారులు, మహిళలుసహా 78 మంది ప్రాణాలుకోల్పోయారు.73 మంది గాయపడ్డారు. 13 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న హౌతీ తిరుగుబాటుదారులు తెలిపారు. ఓల్డ్సిటీ పరిధిలోని బాబ్ అల్–యెమెన్ ప్రాంతంలోని మయీన్ స్కూల్లో బుధవారం అర్ధరాత్రివేళ ఈ ఘోరం సంభవించింది. నగదు పంపిణీ కార్యక్రమం నిర్వహణలో విఫలమవడంతో దాతలైన ఇద్దరు స్థానిక వ్యాపారవేత్తలను అరెస్ట్చేశామని హౌతీ రెబల్స్ నేతృత్వంలోని అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. దారుణ మానవ విపత్తు 2014లో యెమెన్ ఉత్తర ప్రాంతంపై పట్టు కోల్పోయిన హౌతీ తిరుగుబాటుదారులు ఆ తర్వాతి ఏడాదే దేశ రాజధానిని తమ వశంచేసుకుని ఆ ప్రాంతాన్ని పాలిస్తున్నారు. అదే ఏడాది గత ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి ప్రయత్నించినా ఇంతవరకూ సాధ్యపడలేదు. ఆ ఆగ్రహమే పలు మలుపులు తిరిగి నాటి నుంచి సౌదీ అరేబియా, ఇరాన్ల మధ్య శత్రుత్వాన్ని కొనసాగింది. ఇన్నాళ్లలో అక్కడి ఘర్షణల్లో 1,50,000 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. పెద్ద సంఖ్యలో పౌరులు, సైనికులను పొట్టనబెట్టుకున్న ఈ సంఘర్షణ ప్రపంచంలోనే అత్యంత దారుణ మానవసంక్షోభాల్లో ఒకటిగా నిలిచింది. 2.1 కోట్ల దేశజనాభాలో మూడింట రెండొంతుల మంది పేదలు అంతర్జాతీయ సాయంకోసం అర్రులుచాస్తున్నారు. -
పాక్లో ఆహార పంపిణీలో మళ్లీ తొక్కిసలాట
కరాచీ: పాకిస్తాన్లోని రేవు నగరం కరాచీలో మరో విషాదం చోటుచేసుకుంది. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం ప్రజలకు ఆహార పదార్థాలు పంపిణీ చేస్తుండగా, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. భాధితుల్లో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. ఆహార పదార్థాల పంపిణీ జరుగతుండగా, కొందరు అక్కడే ఉన్న కరెంటు తీగపై కాలు వేశారని, దాంతో భయందోళనకు గురై ఒకరినొకరు తోసుకున్నారని, ఫలితంగా పక్కనే ఉన్న కాలువలో పలువురు పడిపోవడం, 11 మంది మరణించడం క్షణాల్లో జరిగిందని అధికారులు వెల్లడించారు. ఉచిత ఆహార పంపిణీ కార్యక్రమాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గతవారం ప్రారంభించారు. పంజాబ్ ప్రావిన్స్లో ఇటీవలే గోధుమ పిండి పంపిణీలో తొక్కిసలాట జరిగి 11 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. -
స్వామీజీ కార్యక్రమంలో భారీ చోరీ.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం..
ముంబై: స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మీరా రోడ్లోని సలసార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్లో పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించారు. స్వామీజీ ఆశీర్వాదం కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆయితే నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇక్కడ దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. వేలమంది భక్తులు మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది. సరిగ్గా ఈ సమయంలోనే భక్తుల మెడలో ఉన్న బంగారు గొలుసులు మాయమయ్యాయి. మొత్తం 36 మంది బాధితులు తమ బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని లబో దిబోమన్నారు. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మెడలో మంగళసూత్రం కూడా పోయిందని ఓ మహిళా భక్తురాలు కన్నీటిపర్యంతమైంది. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లో వీడియోలు చూసి ఇక్కడకు వెళ్లినట్లు చెప్పింది. తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తే నయం చేస్తారని కార్యక్రామానికి వచ్చినట్లు పేర్కొంది. కానీ తోపులాట జరిగి మంగళసూత్రం పోగొట్టుకోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమైంది. కాగా.. కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారు. బంగారు ఆభరణాలు పోయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. శాంతాబెన్ మిథాలాల్ జైన్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ ఈవెంట్కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ పోలీసులకు శుక్రవారం మెమోరాండం కూడా సమర్పించాయి. చదవండి: నీట్గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి -
బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట
-
ఉచిత చీరల పంపిణీలో తొక్కిసలాట.. నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. ఉచిత చీరల కోసం వెళ్లిన నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. తిరువత్తూరులో జిల్లా వాణియంబాడిలోని జిన్నాపాలెం వద్ద మురుగన్ తైపుసం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేటు సంస్థ మహిళలకు ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. చీరల కోసం ఉచిత టోకెన్లు పొందేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 2000 మంది మహిళలు తరలివచ్చారు. అయితే టోకెన్ల కోసం మహిళలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఊపిరాడక 16 మంది మహిళలు స్పృహతప్పి పడిపోయారు.వీరిని వెంటనే వాణియంబాడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు మహిళలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయలపాలైన మరో 12 మంది మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై ఎస్పీ బాలకృష్ణ విచారణకు ఆదేశించారు. టోకెన్ల పంపిణీకి ఏర్పాట్లు చేసిన ప్రైవేట్ సంస్థ యజమాని అయ్యప్పన్ను అదుపులోకి తీసుకున్నారు. చదవండి: పెండింగ్ చలాన్లపై 50శాతం డిస్కౌంట్.. ఒక్కరోజే రూ.5.6 కోట్లు వసూలు.. -
గుంటూరు ఘటనపై విచారణ: విసరడంతోనే తొక్కిసలాట!
‘చంద్రబాబునాయుడు వెళ్లిపోయిన తర్వాత క్యూలైన్లో నిల్చున్నాం.. లారీలపై ఉన్న వలంటీర్లు కానుకలను కిందకు విసరడంతో టోకెన్ లేకపోయినా ఇస్తున్నారంటూ అంతా ఒక్కసారిగా ఎగబడ్డారు.. కానుకలు విసరడంతోనే తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో నా కుమార్తె గాయపడగా నేను అదృష్టవశాత్తూ బయటపడ్డా...’ – విచారణ కమిటీ ఎదుట గుంటూరుకు చెందిన రాఘవి వాంగ్మూలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: నూతన ఏడాది తొలిరోజు గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ సందర్భంగా తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై బాధితులు, ప్రత్యక్ష సాక్షులు గురువారం విచారణ కమిటీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు. జనవరి 1వ తేదీన ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరైన విషయం తెలిసిందే. కందుకూరు, గుంటూరులో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనల్లో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డ నేపథ్యంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ను నియమించింది. గుంటూరులో ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన కమిషన్ మైదానం సామర్థ్యం, ఎంత మంది ఉన్నారు? తొక్కిసలాట ఎలా జరిగింది? అనే అంశాలపై కలెక్టర్ ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ ఆరిఫ్ హఫీజ్లతోపాటు బాధితులు, నిర్వాహకులను ఆరా తీసింది. సభ జరిగిన ప్రదేశం కొలతలు సేకరించింది. ఎంత మందికి కానుక టోకెన్లు ఇచ్చారు? పంపిణీ వద్ద ఎంతమంది ఉన్నారు? తదితర సమాచారాన్ని సేకరించింది. అనంతరం ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో విచారణ కొనసాగించారు. గాయపడ్డ వారు, మృతుల కుటుంబీకుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. తక్షణమే స్పందించడంతో.. తాము 60 క్యూలైన్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించినట్లు పోలీసులు వెల్లడించారు. 30 ఏర్పాటు చేస్తామని చెప్పి చివరికి 12 మాత్రమే ఏర్పాటు చేశారని వివరించారు. బారికేడ్లలో ఒక్కో క్యూలైన్ వెడల్పు ఐదు అడుగులకుపైగా ఉండటంతో కానుకలు తీసుకుని వెనక్కి వచ్చే వారు ఇరుక్కుపోయి తొక్కిసలాట చోటు చేసుకుందని తెలిపారు. తాము వెంటనే స్పందించి కానుకల పంపిణీని నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పిందని ఘటనా స్థలంలో బాధ్యతలు నిర్వహించిన పోలీసు అధికారులు కమిషన్కు వాంగ్మూలం ఇచ్చారు. అంతా ఒకే లైన్లోనే.. చంద్రబాబు సభ ముగిసే వరకు చీరల పంపిణీ వద్దకు ఎవరిని వెళ్లనివ్వలేదు. సభ ముగిసిన తరువాత వెళితే ఒక కౌంటర్లో ఐదు వేల మందికిపైగా ఉన్నారు. ఒకే లైన్ ద్వారా వెళ్లటం, తిరిగి బయటకు రావటంతో ఇరుక్కుని తొక్కిసలాట జరిగింది. కళ్ల ముందే ఎంతో మంది గాయాలపాలయ్యారు. నిర్వహణ సరిగా లేకపోవటంతోనే తొక్కిసలాట జరిగింది. – గుంటముక్కల సౌందర్య (స్వర్ణభారతినగర్) అక్కా అంటూ ఆప్యాయంగా.. మా ఇంటి పక్క వీధిలో నివసించే షేక్ బీబీ తొక్కిసలాటలో మృతి చెందింది. అక్కా అని ఎంతో అభిమానంగా ఉండేదాన్ని. తొక్కిసలాటలో కళ్ల ముందే చనిపోవటాన్ని మరవలేకపోతున్నా. నేను స్పహ కోల్పోయి రెండు రోజుల పాటు ఐసీయూలో కోమాలో ఉన్నా. వెన్నుపూస దెబ్బతిని నరకం అనుభవిస్తున్నా. – తెల్లమేకల రంగాదేవి (మారుతీనగర్) కాలు విరిగింది.. సభకు వెళ్లిన వారిని మధ్యాహ్నం నుంచి కుర్చీల్లో కూర్చోబెట్టారు. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత ఒక్కసారిగా వదిలిపెట్టడంతో ఘటన చోటు చేసుకుంది. తొక్కిసలాటలో నాకు కాలు విరగడంతో ఆపరేషన్ చేశారు. 15 రోజుల తరువాత అడుగు కిందకు పెట్టా. మాకు న్యాయం చేయాలి. – షేక్ హుస్సేన్బీ (ఏటీ అగ్రహారం) -
సంక్రాంతి వేడుకల్లో తొక్కిసలాట.. ఒకరు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
భువనేశ్వర్: ఒడిశా కటక్లో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. బడాంబ- గోపినాథ్పుర్ టీ-బ్రిడ్జిపైకి భక్తులు భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులు సహా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఇక్కడ భారీ వేడుకలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే సామర్థ్యానికి మించి జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. చదవండి: క్రిమినల్ కేసులో ఎంపీకి 10 ఏళ్ల జైలు శిక్ష.. లోక్సభ సభ్యత్వం రద్దు.. -
పాకిస్తాన్లో ఆహార సంక్షోభం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ఆహార సంక్షోభం సైతం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు. ఖైబర్ పఖ్తూంక్వా, సింధ్, బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాట, తోపులాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పిండి కోసం తరలివచి్చన జనంతో మార్కెట్లు నిండిపోయాయి. మార్కెట్లలో రాయితీ గోధుమ పిండి కోసం జనం గంటల తరబడి వరుసల్లో నిలబడాల్సి వస్తోంది. నిత్యం వేలాది మంది వస్తున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. కిలో గోధుమ పిండి రూ.160 పాకిస్తాన్ ప్రధాన ఆహారమైన గోధుమలు, గోధుమ పిండి ధర విపరీతంగా పెరిగిపోయింది. కరాచీలో కిలో పిండి ధర రూ.160కు చేరింది. ఇస్లామాబాద్, పెషావర్లో 10 కిలోల గోధుమ పిండి బ్యాగ్ను రూ.1,500కు విక్రయిస్తున్నారు. 15 కిలోల బ్యాగ్ ధర రూ.2,050 పలుకుతోంది. గత రెండు వారాల వ్యవధిలోనే ధర రూ.300 పెరిగింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారడం ఖాయమన్న సంకేతాలను బలూచిస్తాన్ ఆహార మంత్రి జమారక్ అచాక్జాయ్ ఇచ్చారు. గోధుమ నిల్వలు పూర్తిగా ఖాళీ అయ్యానని చెప్పారు. ఆహార శాఖ, పిండి మిల్లుల నడుమ సమన్వయ లోపమే కొరతకు కారణమని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు పాకిస్తాన్ను ద్రవ్యోల్బణం హడలెత్తిస్తోంది. గత ఏడాది సంభవించిన భీకర వరదల వల్ల కష్టాలు మరింత పెరిగాయి. కేవలం గోధుమలే కాదు ఉల్లిపాయలు, తృణధాన్యాలు, బియ్యం ధరలు సైతం పైకి ఎగబాకుతున్నాయి. కిలో ఉల్లిపాయల ధర 2022 జనవరి 6న రూ.36.7 కాగా, 2023 జనవరి 5 నాటికి ఏకంగా రూ.220.4కు చేరింది. అంటే ఏడాది వ్యవధిలోనే 501 శాతం పెరిగింది. అలాగే డీజిల్ ధర 61 శాతం, పెట్రోల్ ధర 48 శాతం పెరిగింది. బియ్యం, తృణధాన్యాలు, గోధుమల ధర 50 శాతం ఎగబాకింది. 2021 డిసెంబర్లో పాక్ ద్రవ్యోల్బణం 12.3 శాతం కాగా, 2022 డిసెంబర్లో 24.5 శాతం నమోదయ్యింది. ఆహార ద్రవ్యోల్బణం ఒక ఏడాదిలోనే 11.7 శాతం నుంచి 32.7 శాతానికి చేరింది. పాకిస్తాన్లో విదేశీ మారక నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. 2021 డిసెంబర్లో 23.9 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 డిసెంబర్లో కేవలం 11.4 బిలియన్ డాలర్లు ఉన్నాయి. రష్యా గోధుమల దిగుమతి రష్యా నుంచి గోధుమలు పాకిస్తాన్కు చేరుకోవడం కొంత ఊరట కలిగిస్తోంది. రెండు ఓడల్లో వేలాది టన్నుల గోధుమలు తాజాగా కరాచీ రేవుకు చేరుకున్నాయి. అదనంగా 4,50,000 టన్నులు రష్యా నుంచి గ్వాదర్ పోర్టు ద్వారా త్వరలో రానున్నాయని పాక్ అధికారులు వెల్లడించారు. గోధుమల కొరతను అధిగమించడానికి వివిధ దేశాల నుంచి 75 లక్షల టన్నులు దిగుమతి చేసుకోవాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం సరుకు ఈ ఏడాది మార్చి 30 నాటికి పాకిస్తాన్కు చేరుకుంటుందని అంచనా. -
తీవ్ర ఆర్థిక సంక్షోభం: ఆహారం కోసం జనం పాట్లు, వైరల్ వీడియోలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం మరింత ముదురుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభానికి ఇటీవలి వరదలు తోడు కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ప్రధానంగా గోధుమ పంట నాశనంకావడంతో, గోదుమ పిండి ధరలు కనీ వినీ స్థాయిలో పెరిగి పోయాయి. గోధుమ సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. గోధుమ పిండి కోసం ప్రజలు పాట్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోధుమల సంక్షోభంతో పాకిస్థాన్ ప్రజలు తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. గోధుమలు పలు చోట్ల ప్రస్తుతం 10 కిలోల బస్తా రూ.1,500 ఉండగా, 20 కిలోల బస్తా రూ.2,800గా ఉంది. మరోవైపు అనేక ప్రావిన్స్లలో, సబ్సిడీపై పిండిని సరఫరా చేస్తోంది ప్రభుత్వం. దీన్ని కొనుగోలు చేయడానికి వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ గంటల తరబడి క్యూలో ఉన్నారు. ఇది ఘర్షణలు , తొక్కిసలాటలకు దారితీసింది. ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ,బలూచిస్థాన్లలో తొక్కిసలాట కూడా జరిగింది. సింధ్ ప్రావిన్స్లోని మీర్పూర్ ఖాస్ నగరంలో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వీరిని నియంత్రించడానికి సైన్యాన్ని మోహరించారు. తాము చాలా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామనీ అత్యవసర ప్రాతిపదికన 400,000 బస్తాల గోధుమలు అవసరం అని బలూచిస్థాన్ ఆహార మంత్రి జమరాక్ అచక్జాయ్ తెలిపారు. తమ ప్రావిన్స్లో గోధుమ నిల్వ పూర్తిగా అయిపోయిందని ప్రకటించారు. బలూచిస్తాన్కు సహాయం చేయాలని ఇతర ప్రావిన్సులను ఆయన కోరారు. లేదంటే సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. బలూచిస్థాన్లో గోధుమ సంక్షోభానికి ఫెడరల్, సింధ్ , పంజాబ్ ప్రభుత్వాలను నిందించిన మంత్రి, పంజాబ్ ముఖ్యమంత్రి పర్వేజ్ ఇలాహి 600,000 బస్తాల గోధుమలను అందిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. రష్యా నుండి గోధుమలు దిగుమతి దేశంలో గోధుమల కొరతను తీర్చేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం మొత్తం 75 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకుంటోంది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమలు పెద్ద ఎత్తున కరాచీ పోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది అలాగే రష్యా నుంచి అదనంగా 4 లక్షల 50 వేల టన్నుల గోధుమలు గ్వాదర్ పోర్టు ద్వారా పాకిస్థాన్కు చేరుకోనున్నాయి. కాగా పాకిస్థాన్కు సంబంధించి దాదాపు 70శాతం గోధుమ ఉత్పత్తి పంజాబ్ నుంచే వస్తోంది. గోధుమల దిగుమతికి సంబంధించి ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఇదే గోధుమ పిండి కొరతకు దారి తీసిందని భావిస్తున్నారు. ఈ సంక్షోభానికి ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వాల మధ్య గొడవలే కారణమని ఎంత గోధుమలను దిగుమతి చేసుకోవాలో సరిగ్గా అంచనా వేయడంలో పంజాబ్ ఆహార శాఖ విఫలమైందని విమర్శలు చెలరేగాయి. Acute shortage of #wheat flour in #Pakistan - people dying in stampedes. However, Pak set to dispatch around 160 containers with #ammunition for #Ukraine. 'Project Shipping' firm to #ship containers from #Karachi to #Gdansk.#Poland #Russia #Food #War #Economy #Port pic.twitter.com/oTmX2Y9m14 — Nishit Doshi (@NishitDoshi144) January 10, 2023 #PakistanFlourCrisis, Visual from #Sindh Pakistan, people were seen squabbling for flour. It's Painful💔💔#PakistanEconomy #ResilientPakistan pic.twitter.com/7qlSjh3rni — Bakhtawar Shah (@Shah_Bakhtawar1) January 10, 2023 br /> -
ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా
పేదరికం పేగు తెంచుకొని పుట్టినందుకు పూటకుపూట అన్నం కోసం దేవులాడుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ ప్రచార ఆర్భాట గాలానికి గుచ్చిన రూపాయి ఎరకు ఆశపడి కష్టాల కొక్కెను గొంతులో ఇరికించుకున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీ మోచేతి మత్తు కోసం గుటకలు మింగే మా మొగోళ్ళు మా బాధలను గాలికొదిలేసి మీ చెప్పులతో స్నేహం చేస్తున్నారు ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా జనమంతా మీతోనే ఉన్నారని నమ్మించడానికి మీరు చల్లిన నూకలు ఆకలి గుంపును అదిమి పట్టడానికే అని తెలిసికూడా మీ మాయల ఉచ్చులోపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా మీరు విదిలించే కానుకల కిట్లు మా ఇంట్లో కొత్త సంవత్సర శోభ తెస్తాయని ఇంటిల్లిపాది పనులు మానుకొని బారులు తీరి మీ కుతంత్రం కాళ్ళకింద పడి ఊపిరి వదిలేశాం ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా ఈ ప్రపంచాన్ని నోటు నడిపించినంత కాలం... ఈ నోట్లు పెద్దోళ్ళ పెరట్లో కాస్తున్నంత కాలం... మా కూలి బతుకుల్లో విచ్చుకున్న ఆకలి గాయాలు నిత్యం ఏడుస్తూనే ఉంటాయి ఏం చేస్తాం! మా రాత అట్టా రాసుందయ్యా – డాక్టర్ ఎన్. ఈశ్వర రెడ్డి, ప్రొఫెసర్, యోగివేమన యూనివర్సిటీ, వైస్సార్ కడప జిల్లా (గుంటూరు తొక్కిసలాటలో కూతురును కోల్పోయిన ఒక తల్లి రోదిస్తూ... ‘మా రాత అట్టా రాసుందయ్యా’ అన్న వాక్యం విన్న బాధతో) -
గుంటూరు తొక్కిసలాట.. టీడీపీ అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలు
గుంటూరు: టీడీపీ తప్పుడు రాజకీయం, అబద్ధాల బాగోతం మరోసారి బట్టబయలైంది. ఆదివారం తొక్కిసలాట జరిగిన గుంటూరు సభకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమారే దరఖాస్తు చేయగా, ఈ లేఖతోనే పోలీసులు సభకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సభ నిర్వహించుకునేందుకు వీలు కల్పించారు. అయితే సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు చనిపోయాక టీడీపీ ప్లేటు ఫిరాయించింది. ఈ సభతో తమకు సంబంధమే లేదని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తోంది. ఉయ్యూరు ఫౌండేషనే ఈ సభకు అనుమతి తీసుకుందని చంద్రబాబు అబద్ధాలు చెప్పారు. ఇలాంటివారిని ఎంకరేజ్ చేయాలనే సభకు హాజరయ్యానన్నారు. అసలు టీడీపీ దరఖాస్తులో చంద్రన్న కానుకల ప్రస్తావనే లేదు. కానీ జనాలు భారీగా రావాలని కానుకలు ఇస్తామంటూ చెప్పి టీడీపీ నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. దీంతో కానుకలకు ఆశపడి జనం తరలివెళ్లారు. అయితే కానుకలు కొందరికే ఇచ్చి మిగతావాళ్లను వెళ్లగొట్టారు. తమకు కూడా కానుకలు ఇవ్వాలని మహిళలు దూసుకెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. తన సభలో ఇంత విషాదం జరిగినా బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు కూడా చంద్రబాబు వెళ్లలేదు. గుంటూరు ఘటనకు నాలుగు రోజుల ముందే కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన సభలోనూ తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోయారు. చదవండి: గుంటూరు తొక్కిసలాట ఘటన: ఉయ్యూరు శ్రీనివాస్ అరెస్ట్ -
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు
సాక్షి, కందుకూరు: నెల్లూరు జిల్లా కందుకూరు చంద్రబాబాబు సభలో జరిగిన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదయింది. సెక్షన్ 174 కింద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. ఈ ఘటనలో 8 మంది మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు విచారణ అనంతరం నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చనున్నారు. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ప్రచార యావ చాలా ఎక్కువ. ఈ విషయం ఇప్పటికే అనేక సందర్భాల్లో రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో నిర్వహించిన బహిరంగసభ అనేక మంది కుటుంబాల్లో పెను విషాదన్ని మిగిల్చింది. చదవండి: (‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్ షోలో 8 మంది దుర్మరణం) -
Stampede: బెంగాల్లో తొక్కిసలాట.. ముగ్గురు మహిళలు మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ బర్దవాన్లో విషాద ఘటన జరిగింది. దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ప్రతిపక్షనేత సువేంధు అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే దుప్పట్ల పంపిణీకి అనుకున్నదానికంటే ఎక్కువ మంది రావడంతో ఈ ప్రమాదం జరిగింది. సువేందు అధికారి కార్యక్రమంలో పాల్గొని వెనుదిరిగిన వెంటనే తొక్కిసలాట చోటు చేసుకుంది. అయితే ఈ కార్యక్రమానికి బీజేపీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని అధికార టీఎంసీ ఆరోపించింది. చిన్న వేదికలో సామర్థ్యానికి మించి ఎక్కువమందిని తరలించారని, అందుకే ప్రమాదం జరిగిందని పేర్కొంది. నిబంధనలు పాటించని సువేందు అధికారిపై విమర్శలు గుప్పించింది. ఈ ఘటన దురదృష్టకరమని పేర్కొంది. చదవండి: కదులుతున్న రైలు ఎక్కబోయి కిందపడ్డ తల్లీకూతురు.. తృటిలో.. -
విజయనగరం : ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట
-
మా వైఫల్యం వల్లే ఆ 156 మంది చనిపోయారు: పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్
సియోల్: రాజధాని సియోల్లో శనివారం రాత్రి చోటుచేసుకున్న దుర్ఘటనకు తమ వైఫల్యమే కారణమని దేశ పోలీస్ చీఫ్ యూన్ హీ క్యూన్ అంగీకరించారు. హాలోవిన్ ఉత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 156 మంది చనిపోగా, మరో 151 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 26 మంది పరిస్థితి విషమంగా ఉంది. ‘జరగబోయే ప్రమాదం గురించి ఘటనకు ముందు అందిన అత్యవసర ఫోన్కాల్స్పై మా అధికారులు సరిగా స్పందించలేదని తేలింది. వెంటనే చర్యలు తీసుకుని ఉంటే విషాదం నివారించగలిగే వారం. ప్రభుత్వ విభాగం అధిపతిగా ఈ దుర్ఘటనకు నాదే బాధ్యత’ అని యూన్ చెప్పారు. ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. మృతి చెందిన 156 మందిలో 101 మంది మహిళలుండగా వీరిలో ఎక్కువ మంది టీనేజర్లని ప్రభుత్వం తెలిపింది. పురుషులతో పోలిస్తే వీరు తక్కువ ఎత్తు ఉండటం, శారీరకంగా తక్కువ బలవంతులు కావడంతో తోపులాటలో ఛాతీ ఎక్కువ ఒత్తిడికి గురై ఊపిరాడక చనిపోయారని పేర్కొంది. హాలోవీన్ ఉత్సవాల కోసం 137 మంది అధికారులను కేటాయించామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. వీరికి డ్రగ్స్ వాడకాన్ని నివారించే బాధ్యతలే తప్ప, బందోబస్తు విధులను కేటాయించలేదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్ష మంది ఈ కార్యక్రమంలో పాల్గొనడం, నిర్వాహకులెవరూ లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని భావిస్తున్నామన్నారు. మృతుల్లో అమెరికా, చైనా, రష్యా, ఇరాన్ తదితర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. చదవండి: ఎవరెస్ట్ నేర్పే పాఠం ఎలాంటిదంటే.. -
హాలోవీన్ వేడుకల్లో తొక్కిసలాట..150కి చేరిన మృతుల సంఖ్య
సియోల్: దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.çహాలోవీన్ను పురస్కరించుకుని శనివారం రాత్రి వీధుల్లో సంబరాలకు గుమిగూడిన జనం అకస్మాత్తుగా ఒక ఇరుకైన వీధిలోంచి పోటెత్తడంతో తొక్కిసలాట సంభవించింది. ఈ అనూహ్య ఘటనలో మృతుల సంఖ్య 151కి చేరింది. మరో 100 మందికి పైగా గాయపడ్డారు. తొక్కిసలాటలో ఊపిరాడక ఈ మరణాలు సంభవించాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. Officials in Seoul said that at least 120 people were dead and 100 others were injured after a stampede in the South Korean capital's popular Itaewon district, where crowds had gathered to celebrate Halloween. https://t.co/auJuczo3Ll pic.twitter.com/7FXmfW8qab — The New York Times (@nytimes) October 29, 2022 ఇటెవోన్ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన హాలోవీన్ ర్యాలీలో సుమారు లక్షమంది పాల్గొన్నాట్లు సమాచారం. వేల సంఖ్యలో గుమికూడిన ప్రజలు హ్యామిల్టన్ హోటల్ సమీపంలోని ఇరుకు మార్గం గుండా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగి వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. కొందరు ఊపిరాడక స్పృహ తప్పి పడిపోగా మరికొందరు చనిపోయారు. WARNING: GRAPHIC CONTENT – At least 149 people, mostly teenagers and young adults in their 20s, were killed in South Korea when a crowd celebrating Halloween surged into an alley in a night-life area of Seoul https://t.co/ZBB3cKhxO5 pic.twitter.com/evlVibGuUw — Reuters (@Reuters) October 29, 2022 పదుల సంఖ్యలో ఒకరిపై ఒకరు పడిపోయి అపస్మారక స్థితిలో ఉన్న వారికి సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించారు. రక్షణ, సహాయక చర్యల నిమిత్తం 400 మంది సిబ్బందిని, 140 వాహనాలను వినిగించామన్నారు. ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయిన 150 మందిపైగా బాధితులకు సీపీఆర్ అందించినట్లు తెలిపారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా అంబులెన్సులు, పోలీసు వాహనాల సంచారంతో నిండిపోయింది. Pushing and stressing hysterically, a man tries to escape..during the celebrations at the Halloween party..in South Korea..#SouthKorea #Halloween #Seoul #Itaewon #이태원 #이태원사고 #압사사고. pic.twitter.com/qqmgvLOXVf — Siraj Noorani (@sirajnoorani) October 29, 2022 తోపులాటకు కారణం తోపులాటకు దారి తీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఇరుకు వీధిలోని ఇటెవొన్ బార్కు ఓ సెలబ్రిటీ వచ్చారన్న వార్తలతో జనం అక్కడికి చేరుకునేందుకు ఒక్కసారిగా ప్రయత్నించడమే తోపులాటకు కారణమని స్థానిక మీడియా అంటోంది. 2020 కరోనా మహమ్మారి అనంతరం తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలకు జనం పెద్ద సంఖ్యలో హాజరైనట్లు సమాచారం. ఆ ప్రాంతం అంత సురక్షితమైంది కాదంటూ శనివారం సాయంత్రం నుంచే సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం కావడం గమనార్హం. అత్యవసర సమావేశం విషాద ఘటన అనంతరం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆదివారం జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులు, మరణించిన వారి అంత్యక్రియలక నిర్వహణ ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తుకు ఆదేశించినట్లు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
జింఖానా గ్రౌండ్ తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదు: అడిషనల్ సీపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్(HCA) ఘోర వైఫల్యంతో పోలీసులు సీరియస్గా ఉన్నారు. ఆసీస్-భారత్ జట్ల మధ్య ఉప్పల్లో జరగబోయే మ్యాచ్ కోసం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఈ ఉదయం టికెట్ల అమ్మకాలు చేపట్టింది హెచ్సీఏ. అయితే.. ఒక్కసారిగా అభిమానులు తోసుకుని రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తరుణంలో.. అభిమానులతో పాటు పోలీసులు గాయపడ్డారు. వాళ్లను నియంత్రించేందుకు పోలీసుల లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఇక తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిందని ప్రచారం ఊపందుకుంది. అయితే తొక్కిసలాటలో ఎవరూ చనిపోలేదని.. గాయపడిన మహిళ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని అడిషనల్ సీపీ చౌహాన్ క్లారిటీ ఇచ్చారు. హెసీసీఏ సరైన వసతులు కల్పించకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని నార్త్ జోన్ అడిషనల్ సీపీ చౌహాన్ తెలిపారు. సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదని, కౌంటర్లు పెంచుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని, వదంతులు నమ్మొద్దని ఆయన మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. హెచ్సీఏకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయని అన్నారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. కాసేపు కౌంటర్లు మూసేశారు. ప్రస్తుతం గ్రౌండ్లో లైన్లలో ఉన్నవాళ్లకు టికెట్ల విక్రయం కొనసాగించేందుకు యత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు గురువారం ఉదయం ఎగబడ్డారు. వేలాది మందిగా ఎగబడిపోవడం.. గేట్లు తెరవడంతో ఒక్కసారిగా దూసుకెళ్లారు అభిమానులు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకోగా అభిమానులతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసుల లాఠీఛార్జ్కు దిగారు. ఈ క్రమంలో గాయపడిన కొందరిని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మరోవైపు ఈ పరిస్థితికి హెచ్సీఏ ఘోర వైఫల్యమే కారణమన్న విమర్శ వినిపిస్తోంది. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 55వేలుకాగా, ప్రస్తుతం అందుబాటులో కేవలం 3వేల టికెట్లు మాత్రమే ఉంచింది. ఈ మూడు వేల టికెట్ల కోసమే వేలాదిగా అభిమానులు ఎగబడిపోవడంతో ఈ పరిస్థితి చోటుచేసుకుందని తెలుస్తోంది. టికెట్ల అమ్మకంలో మొదటి నుంచి హెచ్సీఏ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నా హెచ్సీఏ నుంచి స్పందన కరువైంది. అయితే.. మొదట పేటీఎం ద్వారా టికెట్ల విక్రయమని మాట మార్చిన హెచ్సీఏ.. తర్వాత ఆఫ్లైన్లో టికెట్ల విక్రయమంటూ ప్రచారం చేసింది. హెచ్సీఏ సభ్యుల మధ్య వివాదాలతో టికెట్ల విక్రయాల్లో గందరగోళం నెలకొందనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. తొక్కిసలాట నేపథ్యంలో.. హెచ్సీఏ తీరుపై పోలీసులు సీరియస్గా ఉన్నారు. -
ఫుట్బాల్ మైదానంలో విషాదం.. 8 మంది మృతి
కెమారూన్లోని ఒలెంబే ఫుట్బాల్ మైదానంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన 8 మంది మృత్యువాత పడగా, మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియం వద్ద జరిగిన తొక్కసలాటలో వీరంతా ప్రాణాలు కోల్పోయారు. సామర్ధ్యానికి మించి ప్రేక్షకులను అనుమతించడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ సంఘటనపై ఆఫ్రికన్ ఫుట్బాల్ సమాఖ్య దర్యాప్తునకు ఆదేశించింది. చదవండి: PSL 2022: పాకిస్థాన్ సూపర్ లీగ్పై కరోనా పంజా.. -
విషాదం: తొక్కిసలాటలో 29 మంది దుర్మరణం
న్యూఢిల్లీ: లైబీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాజధాని మొనోర్వియాలోని ఒక చర్చిలో తొక్కిసలాటలో 29 మంది మరణించారు. వీరిలో 11 మంది పిల్లలు, ఒక గర్భిణీ స్త్రీ కూడా ఉన్నారని స్థానిక మీడియా నివేదించింది. తీవ్రంగా గాయపడిన మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. రాజధాని శివారులోని న్యూక్యూటౌన్ లో పెంతెకొస్తల్ చర్చ వద్ద ఆరాధన వేడుక సమయంలో దోపిడీ ముఠా మారణాయుధాలతో చర్చిలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. దీంతో సమావేశానికి హాజరైన వందలాది భక్తులు భయంతో పరుగులు తీశారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తొక్కిసలాటలో 29మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతోందని స్థానిక పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. లైబీరియన్ రెడ్క్రాస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాయి. మరోవైపు లైబీరియా అధ్యక్షుడు జార్జ్ వీహ్ సంఘటనా సందర్శించి మృతులకు నివాళుర్పించారు. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు."ఇది దేశానికి విచారకరమైన రోజు." అని డిప్యూటీ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ విచారం వ్యక్తం చేశారు. -
వైష్ణోదేవి మందిరంలో విషాదం.. అసలేం జరిగింది?
న్యూఢిల్లీ: ప్రఖ్యాత వైష్ణోదేవి మందిరంలో కొత్త సంవత్సరాదిన విషాద ఘటన జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని భక్తులు శ్రీ మా వైష్ణో దేవి ఆలయానికి భారీగా వచ్చారు. కొత్త సంవత్సర ఘడియలు ఆరంభమైన సమయంలో అమ్మవారిని దర్శించాలన్న ఆతృతతో అధిక రద్దీ ఏర్పడింది. ఈ రద్దీ పెరిగి తొక్కిసలాటగా మారడంతో 12 మంది మరణించగా, పదహారుమంది గాయాలపాలయ్యారు. కాగా, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం భక్తుల్లో కొందరు టీనేజర్ల మధ్య వాగ్వివాదం ఆరంభమైందని పోలీసు డీజీ దిల్బాగ్ సింగ్ చెప్పారు. ఈ గొడవకు కారణం తెలియక ప్రజల్లో అయోమయం నెలకొందని, గందరగోళం ఎక్కువకావడంతో ఒక్కమారుగా ఇరుకు సందులోకి అనేకమంది దూసుకువచ్చారని తెలిపారు. ఈ గందరగోళంలో ఊపిరాడక పలువురు మరణించినట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అధికారులు స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారన్నారు. చదవండి: (హిజాబ్ ధరించారని క్లాస్లోకి రానివ్వలేదు) కరోనా నేపథ్యంలో ఆంక్షలు అమల్లో ఉన్నా పలువురు భక్తులు నిర్ణీత స్థాయిని మించి ఆలయంలోకి వచ్చారని ప్రత్యక్ష సాక్షి ప్రేమ్ సింగ్ చెప్పారు. ఆలయ బోర్డు ఏర్పాట్లలో లోపమే ఘటనకు కారణమని ప్రమాదం నుంచి బతికి బయటపడ్డ కొందరు ఆరోపించారు. చాలామంది కనీసం మాస్కులు కూడా ధరించలేదని చెప్పారు. అధిక రద్దీతో తొక్కిసలాట జరగవచ్చని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారని, కానీ ఆలయ బోర్డు తగిన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల దుర్ఘటన జరిగిందని విమర్శించారు. ఘటన సమయంలో వెనక్కు వెళ్లకుండా చాలామంది నేలపై పడుకున్నారని, దీంతో రద్దీ మరింత పెరిగిందని మరో సాక్షి చెప్పారు. ఇతర సాక్షులు కూడా ఈ విషయాలను ధృవీకరించారు. అయితే ఆలయ బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. 50 వేల మందికి అనుమతి ఉన్నా 35 వేల మందికే అనుమతిచ్చామని తెలిపింది. రెండు గ్రూపుల మధ్య ఆరంభమైన గొడవ అంతిమంగా తొక్కిసలాటకు దారితీసిందని ఆలయ బోర్డు ప్రకటించింది. చదవండి: (వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
Advertisement