-
పుట్టింటికి ఎందుకొచ్చావని తల్లి మందలించిందని.. కూతురి విషాదం!
సంగారెడ్డి: తల్లి మందలించడంతో కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం సామలపల్లిలో ఆదివారం వెలుగుచూసింది. బేగంపేట ఎస్సై రవికాంత్రావు తెలిపిన వివరాల ప్రకారం.. వర్గల్ మండలం సామలపల్లికి చెందిన చిగుళ్ల నర్సింలు–జయమ్మ దంపతులు తమ కూతురు నవనీత(20)ను ఏడాదిన్నర కిందట మర్పడగ గ్రామానికి చెందిన బోడపట్ల యాదగిరితో వివాహం జరిపించారు. వివాహం అనంతరం కూతురు తరచూ పుట్టింటికి వస్తుండడంతో తల్లిదండ్రులు పలుమార్లు మందలించారు. శనివారం మరోసారి కూతురు పుట్టింటికి రావడంతో వివాహం జరిగిన తర్వాత భర్త వద్ద ఉండాలని, ఎందుకొచ్చావని తల్లి జయమ్మ మందలించింది. తర్వాత జయమ్మ భర్త నర్సింలు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లక్ష్మక్కపల్లిలో ని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వారు వెళ్లిన అనంతరం నవనీత జీవితంపై విరక్తితో తల్లిగారి ఇంట్లోనే దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఇవి చదవండి: కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని.. కోపంతో తండ్రి.. -
ఆత్మహత్య చేసుకోబోతున్నా.. నా చావుకు కారణం అతనే, నటి వీడియో వైరల్
ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ఓ నటి విడుదల చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఎవరూ స్పందించడం లేదని.. అందుకే చనిపోవాలని డిసైడ్ అయ్యానంటూ సదరు నటి ఆ వీడియోలో పేర్కొంది. ఆ నటి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది? సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తమిళ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటి విజయలక్ష్మీ. 1997లో 'నాగమండలం' చిత్రంతో సినీ కెరీర్ ప్రారంభించి.. జోడిహక్కి, భూమితై చొచ్చల మగా, అరుణోదయ, స్వస్తిక్, హబ్బా, సూర్యవంశం లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ్లో వరుసగా సినిమాలు చేస్తూ.. అప్పట్లో బిజియెస్ట్గా నటిగా మారింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ సినిమాలో జగపతిబాబు, అర్జున్ చెల్లెలిగా నటించి ఆకట్టుకుంది. మోహన్లాల్తో కలిసి మలయాళ చిత్రం దేవదూతన్లో కూడా నటించింది. ఇలా తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 40 సినిమాలకు పైగా నటించి ఆకట్టుకుంది. సీమాన్పై తీవ్ర ఆరోపణలు ఆ మధ్య తమిళనాడుకు చెందిన నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు, దర్శకుడు సీమాన్పై తీవ్ర ఆరోపణలు చేశారు విజయ లక్ష్మీ. సీమాన్ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని... ప్రేమిస్తున్నట్లు నటించి 7 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ సంచనల వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 29న ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సీమాన్ తనతో మాట్లాడాలని కోరింది. అయితే ఆ వీడియో పట్ల సీమాన్ స్పందించలేదు. దీంతో తాజాగా మరో వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు విజయలక్ష్మీ. ఇదే నా చివరి వీడియో ఆ వీడియోలో విజయలక్ష్మీ మాట్లాడుతూ.. ‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాను. ఆ వీడియోలో నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత నటుడు సీమాన్ నాతో మాట్లాడాలని, ఆయనతో కలిసి జీవించాలని కోరారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. చాలా బాధపడ్డాను. ఏడుస్తూ ఓ వీడియోని అతనికి పంపాను. ‘నువ్వు కావాలి..నువ్వు లేకుంటే చనిపోతాను’అని చెప్పినా పట్టించుకోలేదు. నన్ను సీక్రెట్గా పెళ్లి చేసుకొని.. జీవితాన్ని నాశనం చేశాడు. ఇప్పుడు అక్కర్లేదంటూ రోడ్డున పడేశాడు. ఇప్పుడు నాకు ఎవరూ సాయం చేయడం లేదు. నన్ను పట్టించుకోవడం లేదు. కర్ణాటకలో బ్రతుకలేకపోతున్నాను. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. ఇదే నా చివరి వీడియో.. నా చావుపై సీమాన్ వివరణ ఇవ్వాలి’అని ఆమె డిమాండ్ చేసింది. మంగళవారం పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. View this post on Instagram A post shared by The Whistle (@thewhistletv) -
జిల్లా సమాఖ్య అధ్యక్షురాలి తీవ్ర విషాదం!
ఆదిలాబాద్: మండలంలోని మన్మద్ గ్రామానికి చెందిన జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు దొడ్లి అనిత(50) ఆత్మహత్య చేసుకుంది. ఏఎస్సై దిగంబర్ కథనం ప్రకారం..మృతురాలు నాలుగు నెలలుగా మానసికంగా బాధపడుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో సూపర్ వాస్మోల్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజాము నిర్మల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతిచెందింది. మృతురాలి కుమారుడు పవన్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్తు ఏఎస్సై తెలిపారు. కాగా, పార్థివదేహం వద్ద డీఆర్డీవో విజయలక్ష్మి పుష్కగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అంతక్రియల్లో పాల్గొంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఇవి చదవండి: వనపర్తి: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి -
కొడుకుకు ఉద్యోగం లేదని.. తల్లి తీవ్ర నిర్ణయం!
కరీంనగర్: కుమారుడికి సరైన ఉద్యోగం లేదనే బెంగతో ఓ తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఏఎస్సై వెంకటరమణ తెలిపిన వివరాలు. మండలంలోని తెర్లుమద్దికి చెందిన పల్లె రమణ(40) ఈనెల 10న ఇంట్లో పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న రమణను కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. రమణ కుమారుడు నిఖిల్కు సరైన ఉద్యోగం లేదని తరచూ బాధపడుతుండేది. ఉద్యోగం లేక ఖాళీగా ఉంటున్నాడని మదనపడేది. ఈక్రమంలోనే పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి కుమారుడు నిఖిల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. ఇవి చదవండి: వేములవాడలో యువకుడి దారుణహత్య -
ఈ వయసులోనే పెళ్లి వద్దని మందలించడంతో.. విద్యార్థి విషాదం!
అనంతపురం: ప్రేమించిన బాలికతో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఓ విద్యార్థి (మైనర్) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కుందుర్పి మండలం కరిగానిపల్లికి చెందిన సోమనాథ్, రుక్మిణమ్మ దంపతుల పెద్ద కుమారుడు అభిషేక్ (17) కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి సమీపంలోని పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో తనకు పరిచయమైన ఓ బాలికతో ప్రేమలో పడ్డాడు. రెండు నెలలుగా ఈ వ్యవహారం కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలో బుధవారం రాత్రి తన ప్రేమ విషయం తల్లిదండ్రులకు తెలిపి పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. ఈ వయసులోనే పెళ్లి వద్దని బాగా చదువుకుని ఉద్యోగం వచ్చిన తర్వాత అదే అమ్మాయితో పెళ్లి చేస్తామని, అప్పటి వరకూ బుద్ధిగా చదువుకోవాలని తండ్రి సోమనాథ్ తెలిపాడు. ఇందుకు అభిషేక్ అంగీకరించలేదు. తనకిప్పుడే పెళ్లి చేయాలని పట్టుబడ్డాడు. దీంతో అసహనానికి గురైన తల్లిదండ్రులు.... మైనారిటీ తీరకముందే పెళ్లి చేస్తే జరిగే అనర్థాలను కుమారుడికి వివరించారు. తాము చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. దీంతో మనస్తాపం చెందిన అభిషేక్ గురువారం తెల్లవారుజామున తమ తోటలోకి వెళ్లి చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పొలానికి వెళ్లిన తండ్రి సోమనాథ్... చెట్టు వేలాడుతున్న కుమారుడి మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యలు, పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. ఇవి చదవండి: ‘టౌన్ ప్లానింగ్’ శివబాలకృష్ణ అరెస్టు -
అప్పు చేసి ఇల్లు నిర్మించొద్దన్నందుకు..
కరీంనగర్: మొట్లపల్లి గ్రామానికి చెందిన సంఘని రాజయ్య(50)అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజయ్య గ్రామంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. డబ్బులు లేక ఇంటి పనులు నిలిచి పోయాయి. అప్పు తెచ్చి నిర్మాణం కొనసాగించాలని కుటుంబ సభ్యులను కోరాడు. అప్పుతెచ్చి ఇల్లు కడితే అవి తీర్చలేక ఇబ్బందుల పాలవుతామని కుటుంబసభ్యులు నిరాకరించారు. మనస్తాపానికి గురైన రాజయ్య ఈనెల 4వ తేదీన పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మృతుడి భార్య రాజమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: భార్యపై దారుణంగా ప్రవర్తించిన భర్త.. -
బర్త్డేకు ఇదే నా చిన్న గిఫ్ట్ అంటూ.. సెల్ఫీతో యువకుడి విషాదం!
కరీంనగర్: సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మండలంలోని మల్లాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కోమటి శివసాయి(23) కరీంనగర్లో సెల్ఫోన్ రిపేర్ పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. కొన్ని నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్న పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శివసాయి ఈనెల ఒకటిన ఎల్ఎండీ కట్టపై పురుగుల మందు తాగాడు. తర్వాత బావ అడిచర్ల నరేశ్కు ఫోన్చేసి విషయం చెప్పాడు. వెంటనే నరేశ్ 108కు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందాడు. ఆత్మహత్యపై అనుమానాలు.. ఇదిలా ఉండగా శివసాయి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ప్రేమ విఫలంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బర్త్డేకు చిన్న గిఫ్ట్ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీంతో లవ్ ఫెయిల్యూర్ అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. పోలీసుల విచారణ.. ఇదిలా వుండగా కడుపునొప్పి భరించలేక తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు శివసాయి తండ్రి కోమటి కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్ఎండీ పోలీసులు తెలిపారు. ఇవి చదవండి: గ్యాంగ్స్టర్ గడోలీ ప్రియురాలు దివ్యా పహుజా హత్య -
విషయం తండ్రికి చెబుతామన్నందుకు విద్యార్థిని..
తూర్పుగోదావరి: రామచంద్రపురం మండలంలోని ఏరుపల్లి శివారు రామారావుపేటకు చెందిన 6వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలిక సింగం దీవెన గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. ద్రాక్షారామ ఎస్సై జి.సురేంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలిక తమ ఇంట్లో ఉన్న డబ్బు తీసుకుంది. ఇది చూసిన ఆమె తమ్ముడు, అక్కలు విషయం తండ్రికి చెబుతామని తెలపడంతో ఆమె భయపడి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేంద్ర తెలిపారు. ఇవి చదవండి: అనకాపల్లి: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య -
వివాహానికై వచ్చి ఆర్మీ జవాన్ తీవ్ర నిర్ణయం! అసలు కారణాలేంటి?
నిర్మల్: ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని వెంకటాపూర్లో చోటుచేసుకుంది. దీంతో కాలనీలో విషాదం నెలకొంది. పట్టణ ఎస్సై రాజేశ్వర్గౌడ్ వివరాల ప్రకారం.. స్థానిక వెంకటాపూర్ కాలనీకి చెందిన గడ్ చందా రమేష్ (28) ఆర్మీ జవాన్. కోల్కత్తా బార్డర్లో విధులు నిర్వహిస్తున్నాడు. డిసెంబర్ 15న తన బామ్మర్ది వివాహం నాగంపేట్ ముప్కల్ మండలంలో ఉండడంతో వచ్చాడు. వేడుకలు ముగించుకొని ఆదివారం ఉదయం తన ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ప్యాన్కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకి రాకపోవడంతో ఇంట్లో వారు చూసేసరికి ప్యాన్కు వేలాడుతూ కనిపించాడు. అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రమేష్ తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: రెండు కార్లు ఢీ.. రెండు కుటుంబాల్లో ఐదుగురు మృతి -
వివాహమైన రెండేళ్లకే నూరేళ్లు! అనాథగా తొమ్మిదినెలల కుమారుడు..
కరీంనగర్: అదనపు కట్నం తేవాలనే అత్తామామల వేధింపులు భరించలేక పెద్దపల్లి జిల్లా మన్మంతునిపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధన(25) సోమవారం వేకువజామున ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివాహమైన రెండేళ్లకే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టడంతో ఆమె తొమ్మిది నెలల కుమారుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. ఎస్సై మల్లేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామానికి చెందిన గోగుల మౌనిక ఉరఫ్ తీగల సాధనను రెండేళ్ల క్రితం పెద్దపల్లి మండలం హన్మంతునిపేటకు చెందిన తీగల రాజ్కుమార్కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.7లక్షల నగదు, పల్సర్బైక్ కట్నంగా ఇచ్చినట్లు మౌనిక తల్లి గోగుల సమ్మక్క తెలిపారు. ఆ తర్వాత కూడా అదనంగా కట్నం తేవాలంటూ తమ కూతురును భర్త రాజ్కుమార్, అత్త, మామ యశోద, పోచాలు వేధించేవారని కన్నీటి పర్యంతమైంది. తరచూ కొంత మొత్తాన్ని వారికి ఇచ్చామని పేర్కొన్నారు. మళ్లీ రూ.2లక్షలు తేవాలంటూ వేధించడంతో మౌనిక ఈనెల13న పుట్టింటికి వచ్చిందన్నారు. ఇటీవలే భర్తతో మాట్లాడించి మళ్లీ అత్తింటికి పంపించామని అన్నారు. ఈక్రమంలో సోమవారం వేకువజామున మౌనిక ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు భర్త రాజ్కుమార్, అత్త, మామలు యశోద, పోచాలుపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మహేశ్ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఫోన్ల వేటలో పోలీసులు భళా! కానీ 'బండి' విషయంలో..?? -
పెళ్లి కుదిరింది! ఫోన్ మాట్లాడొద్దని తల్లి బెదిరించడంతో.. యువతి
నిర్మల్: తల్లి మందలించిందని యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలోని దేవునిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ప్రభాకర్రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని దేవునిగూడెం గ్రామానికి చెందిన పానుగంటి గంగవ్వ–పోషన్నలకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. తండ్రి గతంలో మృతిచెందడంతో తల్లి గంగవ్వనే కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల పెద్ద కూతురు సాత్విక(22) పెళ్లి కుదిరింది. గత కొద్ది రోజులగా తరుచుగా ఫోన్లో మాట్లాడుతుండడంతో తల్లి ఆదివారం మందలించింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబీకులు వెంటనే నిర్మల్లోని ప్రైవేట్ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహన్ని ఖానాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కొని వస్తుండగా.. ఘోర ప్రమాదం! -
కుటుంబ కలహాలతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర నిర్ణయం! కానీ భర్త?
నల్గొండ: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మృతిచెందాడు. ఈ ఘటన జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామంలో ఈ నెల 12న తేదీన జరగగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మాల గ్రామానికి చెందిన భాషపోలు నవీన్(35)ది వ్యవసాయ కుటుంబం. నవీన్కు 14 ఏళ్ల కిందట నిర్మలతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు అక్షిత, దీక్షిత ఉన్నారు. నవీన్, నిర్మల మధ్యన చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడడంతో గత రెండేళ్ల నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టగా.. చిన్న చిన్న విషయాలకు ఘర్షణ పడవద్దని ఇద్దరికీ నచ్చజెప్పారు. అయినప్పటికీ అప్పుడప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నెల 12న భార్యభర్తలిద్దరు తమ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి పనులు చేసుకుంటూ అక్కడ కూడా ఘర్షణ పడ్డారు. క్షణికావేశంలో నిర్మల అక్కడే ఉన్న పురుగుల మందు తాగింది. దీంతో తాను కూడా తాగుతానని నవీన్ అక్కడే ఉన్న గడ్డి మందును తాగాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇద్దరిని సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నవీన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. నిర్మల సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కోలుకుంటుంది. కాగా నవీన్ మృతదేహానికి గురువారం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి వీరస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు అర్వపల్లి ఎస్ఐ బి. అంజిరెడ్డి తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: పెళ్లి చేసుకుంటానని ఇలా చేశాడు. చివరికి యువతి? -
మనస్తాపంతో వివాహిత తీవ్ర నిర్ణయం!
కర్నూలు: నగరంలోని కొత్తపేటలోని రామాలయం దగ్గర నివాసముంటున్న బోయ మహాలక్ష్మి (19) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామానికి చెందిన ఈమె.. తల్లిదండ్రులు చనిపోవడంతో సాయిబాబా సంజీవ నగర్లో ఉంటున్న అవ్వ భవానమ్మ వద్ద పెరిగింది. కొత్తపేటకు చెందిన అబ్దుల్ గనిని ప్రేమించి రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరికి 8 నెలల కూతురు ఉంది. భర్త చికెన్ పకోడి బండి పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా వీరు నాలుగు నెలల క్రితం వేరు కాపురం పెట్టారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో మహాలక్ష్మి మనస్తాపం చెందింది. బుధవారం తెల్లవారుజామున పాపను తీసుకెళ్లి పాలు తీసుకురమ్మని పంపి తిరిగి వచ్చేలోగా ఇంట్లో కొక్కికి చీరతో ఉరి వేసుకుంది. భర్త వచ్చి గమనించి ఉరి నుంచి కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందింది. అవ్వ భవానమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
దాయాదులు పొలానికి దారి ఇవ్వలేదని యువకుడు తీవ్ర నిర్ణయం!
అనంతపురం: పొలానికి వెళ్లేందుకు దాయాదులు దారి విడువక పోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దవడుగూరు మండలం రాంపురానికి చెందిన ఆదినారాయణ, సావిత్రమ్మ దంపతుల రెండోకుమారుడు కాయల రామచంద్ర (26)కు సమీప బంధువులతో పొలం రస్తా విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం గుత్తి మండలం కొత్తపేట సమీపంలో తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన పత్తి పంటను తొలగించి దిగుబడిని ఇంటికి తరలించేందుకు రామచంద్ర సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న దాయాదులు రస్తాకు అడ్డు వేయడంతో మూడు రోజులుగా ఎద్దులబండి అక్కడే ఆగిపోయింది. ఆదివారం మరోసారి దాయాదులతో రామచంద్ర మాట్లాడాడు. అయినా వారు ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో జీవితంపై విరక్తి పెంచుకున్న రామచంద్ర నేరుగా ఇంటికెళ్లి పురుగుల మందు డబ్బా తీసుకుని పొలం వద్దకు చేరుకుని తాగాడు. అటుగా వెళుతున్న వారు గమనించి సమాచారం అందించడంతో పోలీసులు, కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న రామచంద్రను గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే రామచంద్ర మృతి చెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఆదినారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ఏడాదిలో 119 మంది ఖైదీల ఆత్మహత్య -
ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం!
మహబూబ్నగర్: మండలంలోని దారారం చెందిన ఆవుల శ్రీనివాసులు(43) ఆత్యహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆవుల శ్రీనివాసులు శుక్రవారం కుటుంబసభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లి పోయాడు. వ్యక్తి గురించి కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. గ్రామానికి సమీపంలో ఉన్న పచ్చగట్టు వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కొంతమంది కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతుడికి కొంతకాలంగా కడుపునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఇవి కూడా చదవండి: వివాహేతర సంబంధమే కారణమా..? -
ఆ ట్రిపుల్ఐటీలో అసలేం జరుగుతుంది? విద్యార్థిది హత్యా! లేక మరేంటి?
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాటి ప్రవీణ్కుమార్(19) వసతిగృహంలోని గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ఐటీ అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని భైంసా ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో భద్రపరిచారు. ఔట్పాస్ తీసుకుని.. ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రవీణ్కుమార్ శనివారం ఔట్పాస్ తీసుకున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు విద్యార్థులు ఇళ్లకు వెళ్తున్నారు. శనివారం ఔట్పాస్ తీసుకున్న విద్యార్థి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో అంతుచిక్కడం లేదు. అధికారులైతే ఆదివారం ఉదయం అల్పహారం చేశాడని చెబుతున్నారు. ఒక రోజు ఔట్పాస్ తీసుకున్న విద్యార్థి అక్కడే ఎందుకు ఉండిపోయాడనే విషయం అంతుపట్టని ప్రశ్న. ఔట్పాస్ తీసుకున్న విద్యార్థులు కళాశాలలో ఉన్నారో బయటికి వెళ్లిపోయారా అనే విషయాన్ని భద్రతా సిబ్బంది చూసుకుంటున్నారో లేదో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఖాళీ గదిలో ఆత్మహత్య.. ప్రవీణ్కుమార్ బీహెచ్–1 వసతి గృహంలో ఉంటున్నాడు. ఆదివారం బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహంలోని ఖాళీ గదుల్లోనే గతంలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వసతి గృహాల్లో ఖాళీ గదులకు తాళాలు ఎందుకు వేయడం లేదనే అనుమానం తలెత్తుతోంది. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థి మెడ భాగం కమిలిపోయి ఉందని, ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నాడో తెలియడం లేదని పలువురు చెబుతున్నారు. పోలీసు భద్రత.. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న వెంటనే మృతదేహాన్ని అంబులెన్సులో భైంసాకు తరలించారు. పోస్టుమార్టం గది వద్దకు ఎవరిని అనుమతించలేదు. మృతదేహాన్ని లోపల భద్రపరిచి తాళం వేశారు. ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు మోహరించారు. ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయనే విషయం అంతుచిక్కడం లేదు. వ్యక్తిగత కారణాలతోనే.. నాగర్కర్నూలు జిల్లాకు చెందిన రామాటి ప్రవీణ్కుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఔట్పాస్ తీసుకున్నాడు. ఉదయం వేళ అల్పహారం చేసిన ఈ విద్యార్థి బీహెచ్–2 వసతి గృహంలోని ఖాళీగదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నాం. ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశాం. – ప్రొఫెసర్ వెంకటరమణ, వీసీ ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి కూడా చదవండి: అడవిలో కట్టెలు తీసుకురావడానికి వెళ్లిన యువకుడిని కిరాతకంగా.. -
దుబాయ్లో భర్త.. మరో యువకుడి కారణంగా.. వివాహిత తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని పార్పెల్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని పార్పెల్లి గ్రామానికి చెందిన ఒడిషెల చిన్న భోజన్న బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మూడేళ్లుగా అతడి భార్య నాగమణి(35) ఇద్దరు కుమారులతో కలిసి తల్లిగారింటి వద్ద నిర్మల్లోని బెస్తవార్పేట్లో నివాసం ఉంటోంది. పార్పెల్లి గ్రామానికి చిలుక వంశీ అనే వ్యక్తి నాగమణిని కొద్ది రోజులుగా చరవాణిలో లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో నాగమణి రెండు రోజుల కిందట పార్పెల్లి గ్రామానికి చెందిన చిలుక వంశీ తనను ఫోనులో వేధింపులకు పాల్పడుతున్నాడని తల్లితో చెప్పింది. ఇదే క్రమంలో బుధవారం ఉదయం 10గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇంటికి వచ్చిన తల్లి కళావతికి కుమార్తె ఉరేసుకుని కనిపించింది. వెంటనే స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి కళావతి ఫిర్యాదు మేరకు నిర్మల్టౌన్లో కేసు నమోదు చేశారు. పార్పెల్లిలో ఆందోళన.. నాగమణి మృతదేహాన్ని పార్పెల్లికి అంత్యక్రియల కోసం తీసుకొచ్చారు. ఇదే క్రమంలో వంశీ అనే వ్యక్తి లైంగికంగా వేధింపులకు గురిచేయడంతోనే నాగమణి ఆత్మహత్య చేసుకుందని అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని బంధువులు అతడి ఇంటి ఎదుట మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్, సోన్ సీఐ నవీన్ కుమార్ చేరుకుని పార్పెల్లిలో గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భార్య మృతితో ఇంటికి వచ్చిన భర్త.. నాగమణి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిందని విషయం తెలవడంతో భర్త చిన్న భోజన్న దుబాయ్ నుంచి గురువారం ఉదయం స్వగ్రామం చేరుకొన్నాడు. దీంతో తన ఇద్దరు కుమారులు శ్రీచరణ్(12), శ్రీవర్ధన్(10)తో కలిసి భార్య మృతదేహం వద్ద రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. ప్రస్తుతం ఆందోళన కొనసాగిస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'నా చావుకు ఎవరు కారణం కాదు.. ఈ కారణంగానే నేనిలా..' సూసైడ్నోట్ రాసి..
సాక్షి, కరీంనగర్: చేతిలో డబ్బు లేకపోవడం.. చెల్లికి పెళ్లి చేయలేకపోవడంతో మనస్థానికి గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చందుర్తి మండలం ఎన్గల్లో విషాదం నింపింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు. మండలంలోని ఎన్గల్కు చెందిన గసికంటి ప్రమోద్(25) ఉపాధి కోసం మూడేళ్ల క్రితం గల్ఫ్ వెళ్లాడు. అక్కడ కంపెనీలో పని సరిగ్గా లేక రెండేళ్ల క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామంలోనే కూలీ పనిచేసుకుంటున్నాడు. ఆదివారం రాత్రి గ్రామంలో పత్తి లోడు(హమాలీ) పనిచేసి ఇంటికొచ్చాడు. తల్లి సత్తవ్వతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున తల్లి లేచి చూసే సరికి ప్రమోద్ ఇంట్లో దూలానికి ఉరివేసుకుని కనిపించాడు. తల్లి రోదనలతో చుట్టుపక్కల వారు వెళ్లి పరిశీలించగా అప్పటికే మృతిచెంది కనిపించాడు. తన చావుకు ఎవరు కారణం కాదని.. ఆర్థిక ఇబ్బందులతోనే చనిపోతున్నట్లు సూసైడ్నోట్లో రాశాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. తండ్రి శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపారు. మృతునికి తల్లి సత్తవ్వ, తండ్రి శంకర్, చెల్లె శ్రావణి ఉన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: ‘నువ్వు లేకుండా ఎలా బతికేది..’ కువైట్లో ఘటన..! -
ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదంటూ.. చనిపోతున్నానని ఫోన్చేసి..
సాక్షి, వరంగల్: ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ సీఐ నరేష్ కథనం ప్రకారం.. వర్ధన్నపేటకు చెందిన కట్ట సుజాత తన భర్త మృతి చెందడంతో నగరంలో ఎండోమెంట్ శాఖలో ఉద్యోగం చేస్తూ కుమారుడు రాజ్కుమార్(23)తో కలిసి నగరంలోని గిర్మాజీపేటలో నివాసం ఉంటోంది. రాజ్కుమార్ ఒకేషనల్ చదువుతున్నాడు. తరుచూ తల్లిని ఖర్చులకు డబ్బులు అడుగుతూ ఇవ్వకపోతే చనిపోతానని బెదిరిస్తూ పలుమార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. శుక్రవారం మళ్లీ తల్లిని ఖర్చులకు డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో అదేరోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి రైలు కింద పడి చనిపోతున్నానని ఫోన్లో చెప్పాడు. అనంతరం నగరంలోని సంతోషిమాతా ఆలయం ఎదుట ఉన్న రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై డిప్యూటీ ఎస్ఎస్ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ కె భాస్కర్ కేసు నమోదు చేసుకుని మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించి తల్లి సుజాతకు అప్పగించామని సీఐ నరేష్ శనివారం తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నొప్పిని భరించలేక.. యువకుడి తీవ్ర నిర్ణయం!
సాక్షి, కరీంనగర్: మండలంలోని కొండపల్కల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య, సీఐ రాజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీరాముల మోహన్(33) తన నాయీబ్రాహ్మణ వృత్తి ద్వారా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కొన్ని రోజులుగా విపరీతమైన వెన్ను నొప్పి వస్తుండటంతో ఆస్పత్రిలో చూపించుకొని, మందులు వాడుతున్నాడు. అయినా నొప్పి తగ్గడం లేదు. ఈ క్రమంలో దీపావళి పండుగ సందర్భంగా అతని భార్య రజని ఖాజీపేటలోని తన తల్లిగారింటికి వెళ్ళింది. మోహన్ సోమవారం ఉదయం ఇంటి ఆవరణలో గల మామిడి చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఇవి కూడా చదవండి: దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయావా.. బండపల్లిలో విషాదం..! -
అకారణంగా తిడుతూ.. చెప్పుతో కొట్టారని.. చివరికి..
సాక్షి, పెద్దపల్లి: అకారణంగా తిడుతూ, చెప్పుతో కొట్టారని అవమాన భారంతో ధూళికట్ట గ్రామానికి చెందిన పెద్ది కనుకయ్య(65) బీరన్నగుడి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జూలపల్లి ఎస్సై వెంకటకృష్ణ కథనం ప్రకారం.. పెద్ది కనుకయ్య 20ఏళ్లుగా పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈనెల10న ఐకేపీ సెంటర్ వద్ద అదే గ్రామానికి చెందిన పెద్ది వెంకటయ్యతో ధాన్యం కాంటా విషయంలో గొడవ జరిగింది. ఈవిషయాన్ని పెద్దమనుషులకు చెబుతూ కనుకయ్య రోడ్డు వెంట వెళ్తున్నాడు. అయవతే, కనుకయ్య తమనే తిడుతున్నాడంటూ గ్రామానికి చెందిన అమరగొండ చంద్రయ్య, అమరగొండ లక్ష్మి, అమరగొండ సంతోష్ భావించారు. అతడిని నానా బూతులు తిట్టి, చేతులతో నెట్టివేశారు. అంతటితో ఆగకుండా లక్ష్మి వృద్ధుడిని చెప్పుతో కొట్టింది. దీంతో తీవ్రంగా మనస్తాపం చెందిన కనుకయ్య.. ఆరోజు రాత్రంతా నిద్రపోలేదు. తనకు అవమానం జరిగిందని మానసికంగా కుంగిపోయాడు. శనివారం వేకువజామున 4గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తాను కౌలుకు తీసుకున్న వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నలుగురి కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య పెద్ది ఐలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు నలుగురిపై నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
తీవ్ర మనస్తాపం చెంది.. యువకుడు విషాద నిర్ణయం..!
సాక్షి, కరీంనగర్: వేములవాడ మండలంలోని మల్లారం గ్రామం రాజానగర్కు చెందిన గొర్రె వెంకటేశ్ (35) కుటుంబ కలహాలతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై మారుతి తెలిపిన తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్ పదేళ్ల క్రితం జగిత్యాల జిల్లా పొలాసకు చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో ఆమె జగిత్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన వెంకటేశ్ బుధవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: చింతకాయలు తెంపుతుండగా.. కట్టుకున్న లుంగీ మెడకు చుట్టుకుని.. ఆపై.. -
ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లి.. చివరికి ఇలా.. అసలు కారణాలేంటి?
సాక్షి, కరీంనగర్: సిరిసిల్ల, ముస్తాబాద్ మండలంలోని గూడెం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శేఖర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గూడెంకు చెందిన గద్దల బాలయ్య, దేవవ్వ దంపతుల కుమారుడు నితిన్ ఐదు రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లాడు. తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆచూకీ కోసం గాలించినా ప్రయోజనం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ తల్లిదండ్రులకు ఒక్కాగానొక్క కుమారుడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటన స్థలాన్ని ఎస్సై పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా.. -
'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!
సాక్షి, ఆదిలాబాద్: జైనథ్ మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన రమాకాంత్(26) పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రమాకాంత్ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం బయటకు వెళ్లిన ఆయన సాయంత్రం భోరజ్ గ్రామానికి వెళ్లే రోడ్డుపై శవమై కనిపించాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించి 108కు ఫోన్ చేశారు. అప్పటికే అతడు మృతి చెందడంతో 108 తిరిగి వెళ్లిపోయింది. మృతదేహాన్ని ఆటోలో రిమ్స్కి తరలించారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్లో దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉందని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు నర్సింగ్, చంద్రభాగ వేడుకుంటున్నారు. ఈ విషయమై పోలీసులను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: అక్కకు బై చెప్పేందుకు వెళ్లి.. ఒక్కసారిగా.. -
‘ఎల్ఎండీ’ వాగులో దూకుతున్నట్లు.. వాట్సాప్లో స్టేటస్ పెట్టి.. యువకుడు..
సాక్షి, కరీంనగర్: కుటుంబ కలహాలతో ఓ యువకుడు మోయతుమ్మెద వాగు(ఎల్ఎండీ బ్యాక్ వాటర్)లో దూకిన ఘటన తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలంలోని ఖాసీంపేటకు చెందిన సందెబోయిన అభిలాష్ అలియాస్ టింకు బుధవారం రాత్రి రేణికుంట శివారులోని రాజీవ్ రహదారి బ్రిడ్జి పైనుంచి ఎల్ఎండీ బ్యాక్ వాటర్లో దూకాడు. అంతకుముందు తన ఫోన్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. అది చూసిన కుటుంబసభ్యులు వెంటనే ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రమోద్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గురువారం ఉదయం గజ ఈతగాళ్లను రప్పించి, గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు అభిలాష్ ఆచూకీ దొరకలేదని ఎస్సై తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 'ఆ కారణంతోనే ఇలా..' సూసైడ్ నోట్ రాసి యువకుడు తీవ్ర నిర్ణయం!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
టబుకి హాలీవుడ్ చాన్స్.. ఆ వెబ్ సీరీస్లో కీలక పాత్ర!
టీడీపీ నాయకుల దాష్టీకం..
ఘొల్లుమనే జోకులేసిన రఘురామ
ఆస్ట్రేలియాలో ఏం జరుగుతోంది? ఎందుకలా..?
జగన్నాథుడి జైత్రయాత్ర తథ్యం..కూటమి కుట్రలు పారలేదు
ఫేస్బుక్, ఇన్స్టా డౌన్.. యూజర్ల గగ్గోలు
కేతిరెడ్డి పెద్ద రెడ్డి ఇంట్లో పోలీసుల వీరంగం
వైఎస్సార్సీపీ గెలుపుతో చంద్రబాబు రథచక్రాలు విరిగిపోతాయి...
కియారాకు అరుదరైన అవకాశం
రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
తప్పక చదవండి
- రేపటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు.. అభ్యర్థులకు అలర్ట్
- సుచి లీక్స్.. నాకు ఆ ఫొటోలు త్రిషనే ఇచ్చింది: సుచిత్ర
- ‘మృతి చెందిన యువతికి వరుడు కావలెను’
- ఇవాళే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం!
- చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
- MS Dhoni: ఎల్లలు దాటిన అభిమానం.. వామ్మో ఇలా కూడా చేస్తారా?
- 4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
- అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
- ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మరో కొత్త ప్లాన్!
- Love Marriage: లేటు వయసులో ఘాటు ప్రేమ
Advertisement