-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు
Sri Rama Navami 2024: శ్రీరామ నవమి సందర్భంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం ఆలయం వెలుపల పీవీ సింధు మీడియాతో మాట్లాడారు. ‘‘ శ్రీ రామ నవమి నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మలేసియా, ఇండోనేషియాలో టోర్నమెంట్స్, ఒలింపిక్స్ జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్లలో బాగా రాణించాలని కోరుకున్నా’’ అని పీవీ సింధు తెలిపారు. -
తిరుపతిలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు..
-
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు..
-
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు ఎలక్షన్ స్టంట్..వాలంటీర్లు స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబుకు తమ ఉసురు తగులుతుందంటున్న పెన్షనర్లు
-
రాబోయేది మన ప్రభుత్వమే.. మొదటి సంతకం వాటిపైనే..!
-
చిన్న సింగమలలో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి(ఫొటోలు)
-
టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇస్తే తప్పేంటి?: సీఎం జగన్
తిరుపతి, సాక్షి: చంద్రబాబు కారణంగానే ఇవాళ వృద్ధులు పింఛన్ కోసం ఎండలో నిలబడాల్సి వచ్చిందని.. వలంటీర్లపై నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించింది టీడీపీనేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నాం తిరుపతి జిల్లా చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. "ఒక టిప్పర్ డ్రైవర్కు సీటు ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారు. టిప్పర్ డ్రైవర్ను చట్ట సభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబెడుతున్నా. ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇస్తే తప్పేంటి?. ఏం తప్పు చేశానని టీడీపీ ఇవాళ నన్ను అవహేళన చేస్తోందని" సీఎం జగన్ నిలదీశారు. "వీరాంజనేయులు(శింగనమల నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి) ఎంఏ ఎకనామిక్స్ చదివాడు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అయితే టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు సీట్లు ఇస్తున్నారని" ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రస్తావించారు. "గత ఐదేళ్లుగా ఆటో, ట్యాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉంటున్నాం. ఏడాది రూ.10వేల చొప్పున.. ఈ ఐదేళ్లలో రూ. 50 వేలు సాయంగా ఇచ్చాం. వాహన మిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చామని" సీఎం జగన్ తెలిపారు. నేను అడుగుతున్నా.. ఇదే చంద్రబాబును. నేను చంద్రబాబునాయుడుగారిని.. అవునయ్యా.. జగన్ టిప్పర్ డ్రైవర్ కే సీటు ఇచ్చాడు. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడయ్యా? జగన్ అని అడుగుతున్నాను. నిజంగా నువ్వు చేయలేని పని, నువ్వు కోట్లు కోట్లు డబ్బులున్న పెత్తందార్లకు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరపున నిలబెట్టించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తున్నాను. నిజంగా నీకు, నాకు ఉన్న తేడా ఇదీ చంద్రబాబూ అని ఒక వైపున చెబుతూ, మరో వైపున నిజంగా ఈరోజు గర్వపడుతున్నాను. ఎందుకు తెలుసా? సొంత ఆటోలు కొనుక్కుని, ఈరోజు ట్యాక్సీలు కొనుక్కుని నడిపేవారు ఎంత మందో తెలుసా? అక్షరాలా 3,93,655 మంది. తమ జీవితం మీద తామే కంట్రోల్ తీసుకుంటూ తమ జీవితం వేరే వాళ్ల మీద ఆధారపడకుండా.. చదువుకున్న వాళ్లే వీరంతా కూడా. కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టేవాళ్లే వీళ్లంతా. వీళ్లంతా కూడా ముందుకు వచ్చి ఎవడో ఉద్యోగం ఇవ్వలేదనో, ఎవడో తోడుగా ఉండటం లేదనో భయపడకుండా తామంతట తామే సొంత ఆటో కొనుక్కుని, సొంత ట్యాక్సీ కొనుక్కుని తమ కుటుంబాలను పోషిస్తున్న వారు అక్షరాలా 3,93,655 మంది. మొట్ట మొదటి ప్రభుత్వం.. వాళ్లు ఉన్నారు అని గమనించి, వాళ్లకు తోడుగా, అండగా ఉంటూ వాళ్లను ప్రోత్సహించాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, చిన్న చిన్న రిపేర్లు చేయించాలి. ఈ రెండూ చేపిస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ రాదు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ రావాలి అంటే కనీసం అంటే రూ.10 వేలు ఇన్సూరెన్స్ కోసమని, రిపేర్ల కోసం అయినా గానీ ఖర్చు పెట్టి.. ఆ రూ.10 వేలు ముందే జమ చేసి, ఖర్చు పెట్టి అన్నీ చేస్తే తప్ప ఫిట్ నెస్ సర్టిఫికెట్ వచ్చే కార్యక్రమం జరగదు. ఈ దఫా టిప్పర్ డ్రైవర్లకూ... మరి ఈ మాదిరిగా ఫిట్ నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలంటే ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తా కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లు ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్లందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా, అండగా ఉంది అని చెబుతూ ఏకంగా 3,93,655 మందికి క్రమం తప్పకుండా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ 3,93,655 మందికి.. వాళ్ల కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ఆర్థిక ఆసరా అందిస్తున్నాం. మరొక్క సారి చెబుతున్నాను. వాహన మిత్ర అనే స్కీము తీసుకొచ్చి సొంత ట్యాక్సీ గానీ, సొంత ఆటో గానీ కొనుక్కుని తన జీవనం సాగిస్తున్న సొంతంగా చేసుకుంటున్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 58 నెలల కాలంలో రూ.1.296 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టాం. ఈ ఒక్క పథకం ద్వారా ఈరోజు మీ అందరికీ మరొక్క మాట చెబుతున్నాను. మరలా మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కుని, సొంతంగా లారీలు కొనుక్కుని వాళ్ల జీవనం వాళ్లు నడిపించుకుంటున్న వాళ్లను కూడా ఈ జాబితాలోకి తీసుకుని వస్తాం అని ఈ సందర్భంగా చెబుతున్నాను. వీళ్లందరికీ కూడా ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామో తెలుసా? కారణం స్వయం ఉపాధి రంగంలో వీళ్లంతట వీళ్లు స్వయం ఉపాధి పొందుతూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎవరి మీదో ఆధారపడకుండా తమ కాళ్ల మీద తాము నిలబడుతూ తమ కుటుంబాన్ని తాము పోషించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇక ఎలాగూ మామూలుగా ఉన్న డ్రైవర్లకు, మిగిలిన వాళ్లందరికీ కూడా మన నవరత్నాల్లోని అన్ని పథకాలూ ఎలాగూ వాళ్లందరికీ కూడా అందుతున్నాయి. అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలు పెడితే, వారింట్లో అవ్వాతాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్లింట్లో ఉన్న పెద్దవాళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఎలాగూ అందుతున్నాయి. తిరుపతి జిల్లాలో ఈ మాదిరిగా వాహన మిత్ర పొందుతున్న వాళ్లు ఎంత మందో తెలుసా? ఈ జిల్లాలో ఏకంగా 18,000 కుటుంబాలు వాహన మిత్ర పొందుతున్నారు. ఈ జిల్లాలో వీళ్లకు ఇచ్చింది రూ.61 కోట్లు. ఈ 7 సెగ్మెంట్లలోనే ఇచ్చాం. మీ సలహాలు, సూచనలు ఇంకా ఏమైనా ఉంటే రాసి, ఆ స్లిప్పులన్నీ కూడా ఆ బాక్సులు వేయండి. వ్యక్తిగతంగా మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది రాయండి. అందరికీ మైకులు ఇవ్వలేం, అందరూ మాట్లాడేంత టైమ్ ఉండదు కాబ్టటి.. మనకు కూడా ఇంకా ప్రోగ్రాములు చాలా ఉన్నాయి కాబట్టి.. ఆ స్లిప్పుల మీద మీరు రాసేస్తే, మీరు ఇవ్వాలనుకున్న సూచనలు, సలహాలు ఆ బాక్సులో మీరు వేసేస్తే అవన్నీ నా దాకా వస్తాయి. అందులో ఉన్న మంచివేదైనా, ముఖ్యమైనవి ఏదైనా ఉండి మనం ఇన్కార్పొరేట్ చేయగలిగినవన్నీకచ్చితంగా చేద్దాం. ఈ రోజు మీ అందరితో ఈ వేదికపై నుంచి మీరు చెప్పాల్సింది ఏదైనా ఉంది అంటే మీ దగ్గర నుంచి కూడా ఏదైనా విందాం అని అనుకుంటున్నాను. మైకు మీకు ఇస్తాను. మీ తరపు నుంచి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కూడా వినేందుకు సిద్ధంగా మీ బిడ్డ, మీ అన్న మీ తమ్ముడు, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలో ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే మైకు నేరుగా మీకే ఇస్తాం. అని సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు. -
తిరుపతిలో సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర దృశ్యాలు
-
సీఎం జగన్ కు గజమాలలతో స్వాగతం పలుకుతున్న ప్రజలు
-
CM Jagan: ‘అవ్వా.. పెన్షన్ తెచ్చుకున్నావా?’.. అభిమానికి సెల్ఫీ
తిరుపతి, సాక్షి: ఒకటో తేదీన ఇళ్లకే చేరాల్సిన ఫించన్.. చంద్రబాబు అండ్ కో కుట్రల కారణంగా నిలిచిపోయింది. పెన్షనర్లు.. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు ఎండలో స్వయంగా వెళ్లి తెచ్చుకోవాల్సిన పాత పరిస్థితుల్ని కళ్లారా చూస్తున్నాం. బస్సు యాత్రలో ఉన్న సీఎం జగన్ ఈ పరిస్థితులపై విచారం వ్యక్తం చేస్తున్నది తెలిసిందే. తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద ఎనిమిదో రోజు బస్సు యాత్ర సందర్భంగా సీఎం జగన్ కొందరు అక్కాచెల్లెమ్మలతో, అవ్వలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ అవ్వను దగ్గరకు పిలిపించుకుని మరీ పెన్షన్ కోసం ఆరా తీశారు. కొందరి వల్లే అలా జరిగిందని ఆమెకు వివరించే యత్నం చేశారాయన. అలాగే.. మళ్లీ మన ప్రభుత్వమే రావాలని.. అలా అయితేనే పెన్షన్లు ఇంటికే వస్తాయని.. దేవుడ్ని మొక్కుకోమని ఆ అవ్వను సీఎం జగన్ కోరారు. అలాగే వేరుశనగ పంటను పరిశీలించి.. వాళ్లిచ్చిన కాయల్ని తిన్నారాయన. మరోవైపు మేమంతా సిద్ధం యాత్రలో సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టేందుకు దారి పొడవునా జనాలు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పేడు శివారులో చెప్పులు లేకుండా ఎండలో రోడ్డు మీద తన ప్రచార రథం వెంట పరిగెడుతూ వస్తున్న ఓ వ్యక్తిని చూసి సీఎం జగన్ తన బస్సును ఆపించారు. ఎందుకలా చెప్పుల్లేకుండా వస్తున్నావ్ అని సీఎం జగన్ ఆరా తీయగా.. తాను మీ అభిమానినని(సీఎం జగన్ను ఉద్దేశించి..), పరిగెత్తుకొచ్చే క్రమంలో చెప్పులు తెగిపోయాయని ఆ వ్యక్తి సమాధానం చెప్పడంతో అంతా నవ్వులు చిందించారు. ఆ వ్యక్తిని ఆప్యాయంగా దగ్గరికి పిలిచి సెల్ఫీ దిగి మరీ పంపించారు సీఎం జగన్. -
వన్స్ మోర్ జగన్..
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘అవ్వా.. చెప్పులేసుకో. లేదంటే కాళ్లు కాలుతాయి’ అని మనువరాలు చెబుతున్నా వినిపించుకోకుండా.. ‘ఆ చెప్పులతోనేమి.. బిర్నా రా ఆ సామి వెళ్లిపోతాడేమో’ అంటూ వృద్ధురాలు అలివేలమ్మ వేగంగా పొలంలో నుంచి రోడ్డు మీదకు వచ్చింది. అటుగా బైక్ మీద వెళుతున్న వ్యక్తిని ఆపి.. ‘ఎంత వరకు వచ్చాడు?’ అని ఆరా తీసింది. ఇంకా రాలేదు.. వస్తున్నాడని చెప్పి ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. ఈ లోపు మనవరాలు అలివేలమ్మ దగ్గరకు వచ్చి.. ‘చెబితే వినవు.. సీఎం జగన్ రావడానికి ఇంకా చానాసేపు పడుతుంది. చెట్టునీడకు రా..’ అని పిలవగా.. ‘ఉదయం నుంచి ఎదురు చూస్తున్నా.. కొద్దిసేపు ఇక్కడ నిలబడితే ఏం కాదులే.. ఐదేళ్ల క్రితం ఇదే దారిలో వెళుతుంటే కలిశాను. అధికారంలోకి వస్తావ్ అని అప్పట్లో చెప్పాను.. అనుకున్నట్టే సీఎం అయ్యాడు. మాటిచ్చినట్టే ఇంటి దగ్గరకే పెన్షన్ పంపాడు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వస్తున్నాడు. మళ్లీ నువ్వే అధికారంలోకి వస్తావ్ అని ఆ సామికి చెబుతానమ్మి..’ అంటూ అవ్వబదులిచ్చింది. చిత్తూరు జిల్లా సదుం ఎస్టీ కాలనీకి చెందిన ఎం.మునెమ్మకు వందేళ్లు ఉంటాయి. స్వతహాగా నడవలేదు, నిల్చోలేదు. అయినప్పటికీ ఎంతో ఓపికగా ఉదయం నుంచి సదుం నుంచి కల్లూరుకు వెళ్లే రహదారి పక్కన కుర్చీలో కూర్చుని ఉంది. ఎక్కువసేపు నువ్ కూర్చోలేవ్ ఇంట్లో పడుకుందువ్ రా.. అని మనవడు పిలిచినా వినడం లేదు. ఆమె గంటల తరబడి అక్కడే వేచి ఉండటానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఈ రోడ్డు మీదుగా సీఎం జగన్ వస్తున్నారని, ఆయన్ని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తోందని ఆమె మనవడు తెలిపాడు. ఇలా అలివేలమ్మ, మునెమ్మల తరహాలో ఎందరో వృద్ధులు.. మహిళలు, వికలాంగులు, విద్యార్థులు, రైతులు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడిని చూడటానికి పోటీపడ్డారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా తమకు అండగా నిలిచిన నేతను కళ్లారా చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ‘తమను అన్ని విధాలుగా ఆదుకున్న మీకే మా మద్ధతు.. ఎన్ని జెండాలు జత కట్టినా మరోసారి చంద్రబాబు మా చేతుల్లో చిత్తవ్వడం ఖాయం’ అని సీఎం జగన్కు ప్రజలు తేల్చి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ‘మేమంతా సిద్ధం’ అంటూ బస్సు యాత్ర నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి చిత్తూరు, తిరుపతి జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పుంగనూరు నియోజకవర్గం అమ్మగారిపల్లెలో బస శిబిరం నుంచి బుధవారం ఉదయం 9.45 గంటల ప్రాంతంలో ఏడో రోజు యాత్రను ప్రారంభించారు. శిబిరం నుంచి బయటకు వస్తుండగానే అమ్మగారిపల్లె గ్రామస్తులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చిన మహిళలు బంతి పూల వర్షం కురిపించారు. మంగళ హారతులు పట్టి జననేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సదుంలోకి ప్రవేశించిన సీఎంకు రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనసందోహం ఆత్మీయ స్వాగతం పలికింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ రోడ్షో నిర్వహించారు. అనంతరం కల్లూరు వైపు బయలుదేరిన రోడ్షోకు మార్గంమధ్యలో వివిధ గ్రామాల ప్రజలు సంఘీభావం తెలిపారు. పెత్తందార్లకు ఓటు వేయం... బహిరంగ సభ అనంతరం పి.కొత్తకోట, పాకాల క్రాస్, గాదంకి, ఐతేపల్లి క్రాస్, చంద్రగిరి క్రాస్, రేణిగుంట మీదుగా రాత్రి 9 గంటలకు గురువరాజుపల్లెలో ఏర్పాటు చేసిన బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. బెంగళూరు–తిరుపతి జాతీయ రహదారిపై యాత్రగా వెళుతున్న సీఎం జగన్కు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ప్రజాభిమానం అడ్డు పడటంతో నిర్ధేశించిన షెడ్యూల్ కంటే ఎంతో ఆలస్యంగా యాత్ర సాగినప్పటికీ.. ప్రజలు మాత్రం ఎంతో ఓపికగా సీఎం రాక కోసం వేచి ఉన్నారు. అభిమాన నేతను చూసి ఎంతో సంతోషపడ్డారు. రోడ్లపై బారులు తీరిన వారిలో ఎవ్వరిని కదిలించినా.. ‘వన్స్మోర్ సీఎం జగన్’ అన్న నినాదమే వినిపించింది. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న నేత వైఎస్ జగన్కు కాకుండా.. పెత్తందారులకు కొమ్ముకాసే చంద్రబాబు, ఆయన తొత్తులకు ఏ విధంగా ఓటు వేస్తాం అంటూ ప్రజలు గర్జించారు. చంద్రగిరి నియోజకవర్గానికి ముందే ఉగాది పుంగనూరు నియోజకవర్గం నుంచి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దామలచెరువులో సంబరాలు అంబరాన్ని అంటాయి. సీఎం రాక నేపథ్యంలో చంద్రగిరి నియోజకర్గ ప్రజలకు ముందే ఉగాది పండుగను తెచ్చిపెట్టాయి. దామలచెరువులో ఊరంతా అరటి ఆకులు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించి, సుమారు 20 క్రేన్లతో భారీ గజమాలలతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కచెల్లెళ్లు సీఎంకు హారతులు పట్టి, గుమ్మడికాయలతో దిష్టి తీశారు. కోలాటం, చెక్కభజన సహా వివిధ కళారూపాలతో మహిళలు పలికిన ఆత్మీయ స్వాగతం అబ్బుర పరిచింది. ఎర్రటి ఎండను ఏ మాత్రం లెక్క చేయకుండా వేల సంఖ్యలో ప్రజలు దామలచెరువుకు చేరుకున్నారు. రోడ్డు అంతా జనాలతో కిటకిటలాడింది. మధ్యాహ్నం ఒంటి గంట దాటాక దామలచెరువు చేరుకున్న సీఎం.. ఎరట్రి ఎండలోనే బస్ పైకి ఎక్కి ఊరంతా రోడ్ షో నిర్వహించారు. సీఎం కాన్వాయ్తో పాటు సమాంతరంగా నడుస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తెచ్చుకోవడానికి మేమంతా సిద్ధం అంటూ ప్రజలు నినదించారు. అనంతరం పూతలపట్టుకు పయనమైన సీఎంకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐరాల మండలం గుండ్లపల్లి, కొలకలతో పాటు వివిధ గ్రామాల ప్రజలు యాత్రకు సంఘీభావం తెలిపారు. పూతలపట్టు నియోకవర్గం తేనెపల్లి వద్ద సీఎం జగన్ భోజన విరామ శిబిరానికి చేరుకుని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విరామ శిబిరం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి, రంగంపేట క్రాస్ మీదుగా పూతలపట్టు బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నేను విన్నాను.. నేను ఉన్నాను చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన సదుం గ్రామానికి చెందిన 23 ఏళ్ల ముఖేష్ రెండేళ్ల కిందట పెరాలసిస్కు గురయ్యాడు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకువస్తున్న తల్లిదండ్రులకు ముఖేష్ వైద్య ఖర్చులు తలకు మించిన భారం అయ్యాయి. అతని వైద్యానికి మరో రూ.15 లక్షలు అవసరం అవుతాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సీఎంను కలిస్తే తప్పక తమకు సహాయం దొరుకుతుందని ముఖేష్ తల్లి నమ్మింది. ఈ నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రలో సదుం వద్ద ముఖేష్ కుటుంబం ముఖ్యమంత్రిని కలిసింది. సీఎం జగన్ వారిని బస్సు వద్దకు పిలిపించుకుని ముఖేష్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. కచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. ముఖేష్ వివరాలను తీసుకోవాలని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ అధికారులను సూచించారు. వైఎస్ జగన్ ఇచ్చిన భరోసాతో తమ బిడ్డకు వైద్యం అంది, మామూలు మనిషి అవుతాడనే నమ్మకం కలిగిందని ఆ కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. అభిమానం చాటుకున్న ముస్లిం మైనార్టీలు ఎన్నో పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచి, ఆ వర్గాలకు రాజకీయంగా తగు ప్రాధాన్యం ఇచ్చిన సీఎం జగన్ తమ ఊరికి వస్తుండటంతో తెల్లవారుజాము నుంచే కల్లూరు గ్రామంలో సందడి నెలకొంది. సీఎం జగన్ గ్రామానికి చేరుకోగానే మైనార్టీ సోదరులు, అక్కచెల్లెమ్మలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మత పెద్దలు ముస్లిం సంప్రదాయం ప్రకారం సీఎంకు శాలువ కప్పి, హిమామ్ జామీన్ కట్టి ప్రార్థనలు నిర్వహించి, ఆశీర్వదించారు. అనంతరం బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు నమస్కరిస్తూ ముందుకుసాగారు. ఆ తర్వాత కల్లూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన కురుబ సామాజికవర్గం ఆత్మీయ సమావేశానికి సీఎం హాజరయ్యారు. -
పింఛన్ దారుడి మృతిపై చలించిన సీఎం జగన్
సాక్షి, కాకినాడ: ప్రతీ నెలా ఒకటో తేదీన అందే ఫించన్తోనే నెలంతా గడిపే పేద కుటుంబాలు ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నాయి. ఒకటో తేదీన వలంటీర్లే అందించాల్సిన పెన్షన్ను.. ఈసీ కోడ్ మూలంగా తామే స్వయంగా తామే వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు చంద్రబాబు అండ్ కో చేసిన కుట్ర కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మూడో తేదీన ఫించన్ అందుతుందని తెలిసినా.. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం సచివాలయాల వద్ద పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. విషాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి. కాకినాడ రూరల్ తూరంగిలో ఫించన్ అందలేదన్న బాధతో ఓ వృద్ధుడు గుండె ఆగి మరణించాడు. కే. వెంకట్రావ్(70) అనే వ్యక్తికి వలంటీర్ వ్యవస్థ మూగ బోయ్యిందన్న సమాచారం తెలియదు. దీంతో తీవ్ర ఆందోళనకు లోనయ్యాడు. ఈ క్రమంలో తానే స్వయంగా సచివాలయానికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకున్నాడు. మార్గం మధ్యలోనే గుండెపోటుకి గురై కన్నుమూశాడు. కూలీ పని చేసుకునే వెంకట్రావ్కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకట్రావ్ మృతి పట్ల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు సంతాపం వ్యక్తం చేశారు. ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చారు. అంతేకాదు.. వెంకట్రావ్ మృతి చెందిన విషయాన్ని సీఎం జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంకట్రావ్ మృతిపై చలించిపోయిన సీఎం జగన్.. వెంకట్రావ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల పరిహారం అందించాలని అధికారుల్ని ఆదేశించారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసమే చేసిన కుట్రతో వలంటీర్లు ఫించన్ పంపిణీకి దూరమైయ్యారు. వలంటీర్ల ఫోన్ లు వెనక్కి ఇచ్చేయడంతో సమాచారం లేక వెంకట్రావు సచివాయాలనికి బయలు దేరాడు. మార్గ మధ్యలో గుండె ఆగి చనిపోవడం విషాదకరం. వెంకట్రావ్ కుటుంబాన్ని ఆదుకుంటాం అని కురసాల కన్నబాబు ఈ సందర్భంగా చెప్పారు. తిరుపతిలో మరో వృద్ధుడు.. తిరుపతిలో జిల్లా వెంకటగిరి బంగారుపేటలో 80 ఏళ్ల వృద్ధుడు వెంకటయ్య మృతి చెందాడు. వాలంటీర్లు ఇంటికి వెళ్లి పెన్షన్ను ఇవ్వరన్న మనస్తాపంతో గుండెపోటుతో అక్కడికక్కడే వెంకటయ్య కుప్పకూలిపోయాడు. మరోపక్క.. చంద్రబాబు, పవన్, బీజేపీ తీరుపై మనస్తాపానికి గురై పలువురు వలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం తమను బాధించిందన్నారు. ఒకటో తేదీ ఉదయం నుంచే తమకు పలువురు ఫించన్ కోసం ఫోన్లమీద ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారని, తకు ముందులా తాము బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వలంటీర్లు అంటున్నారు. -
గ్రీన్ ఛానెల్..గుండె మార్పిడి.. వైజాగ్ - తిరుపతి
-
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
తాళపత్రాల్లోని విజ్ఞానం భావితరాలకు అందాలి
తిరుపతి సిటీ/తిరుమల: తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీని బుధవారం ఆయన సందర్శించి తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల పూర్వం మహర్షులు, రుషులు, మేధావులు అపారమైన విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను తాళపత్రాల్లో లిఖించారన్నారు. అటువంటి విజ్ఞానాన్ని సంరక్షించి, పరిశోధనలు చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వేదిక్ వర్సిటీలో తాళపత్ర గ్రం«థాల సంరక్షణ, డిజిటలైజేషన్ చేయడం ప్రశంసనీయమన్నారు. పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల్లో చాలా విలువైన సమాచారం ఉందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. పురాతన నాగరికతలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం, న్యాయవ్యవస్థల సమాచారం తాళపత్రాల్లో ఉండటం విశేషమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తాళపత్ర గ్రంథాలను సంరక్షించి, పరిశోధనలు, ప్రచురణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీ నడవడం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామమన్నారు. అనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో కలసి ఆయన వర్సిటీలోని వేద, వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ శాస్త్ర తాళపత్రగంథాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, ప్రచురణను పరిశీలించారు. అనంతరం వర్సిటీ, టీటీడీ అధికారులు సీజే దంపతులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకూర్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు టీటీడీ ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందజేశారు. సీజేఐని కలిసిన టీటీడీ చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ను, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తిరుమల పుష్పగిరి మఠంలో జరిగిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భాను ప్రకాష్ వివాహానికి టీటీడీ చైర్మన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
చంద్రబాబు సొంత అడ్డాలో టికెట్ లోల్లి
-
నేడు తిరుపతికి సుప్రీంకోర్టు సీజే రాక
తిరుపతి సిటీ: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డాక్టర్ డీవై చంద్రచూడ్ మంగళవారం తిరుపతిలో పర్యటించనున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరగనున్న బీఏ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఉపన్యసించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు, వర్సిటీ అధికారులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
జనసేనకు తిరుపతి టికెట్.. సుగుణమ్మ కంటతడి
సాక్షి, తిరుపతి: విపక్ష కూటమిలో అసంతృప్తి జ్వాలలు చల్లరాడం లేదు. అసెంబ్లీ, ఎంపీ టికెట్ ఆశించిన ఆశావాహలు.. సీట్లు దక్కకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. జనసేన నుంచి ఆరని శ్రీనివాసులుకు టికెట్ ప్రకటించడంతో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ దక్కలేదని మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. టీడీపీ కోసం అహర్నిశలు పనిచేశామని, తిరుపతి అసెంబ్లీ స్థానం దక్కకపోవడం బాధాకరమని అన్నారు. తిరుపతి సీటును జనసేనకు కేటాయింపుపై పునరాలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు చేసిన సర్వేలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎవరికో మద్దతు పలకమంటే తాను అంగీకరించినా.. పార్టీ కేడర్ అంగీకరించదని పేర్కొన్నారు. తిరుపతి టికెట్పై చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి చర్చించాలని సుగుణమ్మ తెలిపారు. తిరుపతి అభ్యర్థిపై పునరాలొచిస్తారని నమ్ముతున్నానని అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన నేతలు అసెంబ్లీ స్థానంపై పునరాలోచన చేయాలని సూచించారు. ఉన్నపళంగా పార్టీలో చేరిన వారికి టికెట్ కేటాయిస్తే జనం అంగీకరించడం లేదన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచన లేదన్న సుగుణమ్మ.. తిరుపతికి తమ కుటుంబం చేసిన పనులను గుర్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్ మారిందా? -
Tirumala: సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది. సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న(ఆదివారం) 80,532 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 29,438 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.95 కోట్లుగా లెక్క తేలింది. -
అసంతృప్తి జ్వాలలు.. బాబు ఉక్కిరిబిక్కిరి
-
తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ కార్యాలయం.. ప్రారంభించిన టాలీవుడ్ నిర్మాత!
ఊర్వశివో రాక్షసివో, బేబి, అంబాజీపేట మ్యారేజి బ్యాండు వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్గా టాలీవుడ్లో పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన నిర్మాతగానే కాదు.. సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పలు సూపర్ హిట్ సినిమాలను పంపిణీచేస్తున్నారు. బేబి, గుంటూరు కారం, హనుమాన్, గామి వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను పంపిణీ చేసి డిస్ట్రిబ్యూషన్ రంగంలో దూసుకెళ్తున్నారు. ఆయన తాజాగా సీడెడ్ ఏరియా పంపిణీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ యతితో కలిసి తిరుపతిలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ప్రారంభించారు ధీరజ్ మొగిలినేని. ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన 'ఓం భీమ్ బుష్', సిద్దు జొన్నలగడ్డ 'టిల్లు స్క్వేర్'తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తిరుపతిలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇండస్ట్రీ మిత్రులు, శ్రేయోభిలాషులు, సన్నిహితుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. -
తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు
సాక్షి, తిరుపతి: తిరుపతి జనసేనలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. తిరుపతి జనసేన, టీడీపీ నాయకులు నాన్ లోకల్ వద్దు-లోకల్ ముద్దు అంటున్నారు. తిరుపతి జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఇంటిలో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. ఆరని శ్రీనివాసులకు సహకరించేది లేదని తిరుపతి జనసేన నాయకులు తేల్చి చెబుతున్నారు. 50 డివిజన్ జనసేన అధ్యక్షుల మార్పులు, చేర్పులపై ఆరని శ్రీనివాసులు కసరత్తు చేస్తున్నారు. శ్రీనివాసులు వైఖరిపై కిరణ్ రాయల్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వద్దే తేల్చుకుంటామని కిరణ్రాయల్ అంటున్నారు. కాగా, చిత్తూరుకు చెందిన ఆరని శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించారంటూ జనసేన నేత కిరణ్రాయల్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేసిన సంగతి తెలిసిందే. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా.. పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే చిత్తూరు నుంచి చీరలు, గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారని జనసేన నేత కిరణ్రాయల్ పార్టీ అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఆరణికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు. -
Tirupati: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. నిన్న (బుధవారం) 67,832 మంది స్వామివారిని దర్శించుకోగా 25,636 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.55 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది 5 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు . దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement