-
Suma Kanakala: జీవితమే ఒక సుదీర్ఘ పాఠం అంటున్న సుమ... (ఫొటోలు)
-
Naba Natesh: లెజెండ్రీ నటుడికి నివాళిగా.. నబా నటేష్ ఇలా మారిపోయింది! (ఫోటోలు)
-
హిట్ సినిమాపై రాశిఖన్నా ప్రశంసలు..!
ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని సాధించిన మలయాళ చిత్రం మంజుమల్ బాయ్స్. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అందరూ కొత్త వారే నటించడం మరో విశేషం. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.240 కోట్లకు పైగా వసూలు సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. మరో విషయం ఏమిటంటే కేరళలో కంటే తమిళంలోనే అత్యధిక వసూళ్లను సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది.ఇప్పటి వరకూ తమిళంలో విడుదలైన మలయాళ చిత్రాలన్నిటికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించిన చిత్రంగా మంజుమల్ బాయ్స్ నిలిచింది. అయితే ఇంతటి సంచలన విజయాన్ని సాధించినా ఈ చిత్రానికి అభినందనలతో పాటు ఘాటుగా విమర్శలు కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాపై నటి రాశీఖన్నా ప్రశంసలు కురిపించారు. మంజుమ్మెల్ బాయ్స్ చిత్రం ఒక రత్నమని.. ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని కలిగించే చిత్రమని కొనియాడారు. అభినందించడానికి అర్హత కలిగిన చిత్రం మంజుమ్మెల్ బాయ్స్ అంటూ తన ఇన్స్ట్రాగామ్లో పేర్కొన్నారు. మంజుమల్ బాయ్స్ చిత్రంపై రాశీఖన్నా ప్రశంసలు కురిపించడంపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈమె నటి తమన్నాతో కలిసి నటించిన అరణ్మణై 4 చిత్రం ఇటీవలే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం ఈనెల 5వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించిన రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.అయితే తాజాగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరిదృష్టి సినిమావారిపైనే ఉందని తెలిపారు. కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా నిజమేనని అన్నారు. సినిమాల్లో స్టార్గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదని రమ్యకృష్ణ వెల్లడించింది. కాగా.. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో 1948లో వైజీ మహేంద్రతో కలిసి 'వెళ్లి మిందాన' అనే తమిళ చిత్రంలో నటించింది. 1986లో విడుదలైన 'భలే మిత్రులు' ఆమె తొలి తెలుగు చిత్రం. 1990లో సౌందర్య, మీనా, రోజా, నగ్మా లాంటి హీరోయిన్లలో గుర్తింపు సాధించింది. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్, రజనీకాంత్ లాంటి స్టార్స్తో సినిమాలు చేసింది. కన్నడలో రవిచంద్రన్, పునీత్ రాజ్కుమార్, ఉపేంద్ర సరసన నటించారు. -
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
హీరామండి వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరోయిన్ అదితిరావ్ హైదరీ. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో వచ్చిన భారీబడ్జెట్ వెబ్ సిరీస్ హీరామండిలో నటించింది. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన అదితి తన ప్రేమ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో సిద్ధార్థ్తో ఎంగేజ్మెంట్ చేసుకోవడంపై స్పందించింది. సిద్ధార్థ్తో కలిసి ఉండటం ప్రేమపై నమ్మకాన్ని పెంచిందని తెలిపింది.అదితి మాట్లాడుతూ.. 'నేను కొన్ని విషయాల్లో పవిత్రతను నమ్ముతాను. మా ఇద్దరి రిలేషన్పై రూమర్స్ రావడం సహజమే. కానీ మేం మా తల్లిదండ్రుల అనుమతితోనే మా బంధాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాం. వారు మా కంటే ఎంతో ప్రైవేట్గా ఉంటారు. మాకు చాలా కాల్స్ వస్తున్నందుకే మా రిలేషన్ను బయటకు చెప్పేశాం. ఈ విషయాన్ని బయటకు చెప్పడం బాధ్యతాయుతమైన పనిగా మేము భావించాం'అని తెలిపింది.ఆమె ఇంకా మాట్లాడుతూ..'నేను ఎల్లప్పుడూ అన్ని విషయాలను సానుకూలంగా చూడాలనుకుంటున్నా. నా గోప్యత, పవిత్రతను నేను నమ్ముతా. నా గోప్యతను కోరుకునే ప్రదేశంలో ఉన్నానని భావిస్తున్నా. కానీ ప్రజలు మా పట్ల ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. మీ అందరి ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీ అభిమానం చాలా విలువైనది. సెలబ్రిటీలు కూడా మనుషులేనని మీరు గ్రహించారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. వారు ఏమి చెప్పాలనుకుంటున్నారో వారి ఇష్టమని' తెలిపింది.కాగా.. హీరో సిద్దార్థ్తో డేటింగ్లో ఉన్న భామ ఇటీవలే నిశ్చితార్థం చేసుకుంది. దాదాపు రెండేళ్ల పాటు ఈ జంట డేటింగ్లో ఉన్నారు. వనపర్తిలోని అతి పురాతన ఆలయంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక జరిగింది. మా ఇద్దరి తల్లిదండ్రుల కారణంగానే నిశ్చితార్థం జరిగిందని అదితి తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ 'హీరామండి: ది డైమండ్ బజార్'లో బిబో జాన్ పాత్రలో అదితి రావ్ హైదరీ నటించింది. -
ఓ సుకుమారీ.. నీ స్టయిలే అదిరే.. కుమారీ! (ఫోటోలు)
-
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్లో శ్రీలీల (ఫోటోలు)
-
Rakul Preet Singh: డిజైనర్ వేర్లో మస్త్ క్యూట్గా రకుల్ ప్రీత్ సింగ్ (ఫొటోలు)
-
Meena Durairaj: యెల్లో..యెల్లో..మీనా బ్యూటిఫుల్లో..! (ఫోటోలు)
-
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి క్లాస్ లుక్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
-
Priyamani: ట్రెడిషనల్ డ్రెస్లో కవ్విస్తున్న ప్రియమణి.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
-
Priyanka Singh: వయ్యారి భామ నీ కళ్లు చూస్తే.. రేరాజైనా కుళ్లుకోవాల్సిందే! (ఫోటోలు)
-
Pragya Jaiswal: కలర్ఫుల్ డ్రెస్లో ప్రగ్యా జైస్వాల్ సమ్మర్ లుక్స్.. ఫోటోలు
-
Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
-
రివాల్వర్ రీటా’గా వస్తోన్న కీర్తి సురేశ్.. అప్డేట్ వచ్చేసింది!
మాలీవుడ్లో బాలనటిగా రంగప్రవేశం చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ముద్దుగుమ్మ కీర్తి సురేశ్. మహానటిగా ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్రవేసుకుంది. కోలీవుడ్లో ఇదు ఎన్న మాయం చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్పుల్ హీరోయిన్గా పేరు తె చ్చుకుంది. హీరోయిన్గా తానేంటో నిరూపించుకున్న కీర్తి సురేశ్ టాలీవుడ్లో దివంగత నటి సావిత్రి జీవిత చరిత్రతో రూపొందిన తెలుగు చిత్రం మహానటి పాత్రకు జాతీయ ఉత్తమ నటి అవార్డు దక్కించుకున్నారు. అలా ఒక్కో అడుగేస్తూ ఇప్పుడు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ వరుణ్ ధావన్కు జంటగా కోలీవుడ్ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్న బేబీజాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇది తమిళంలో హిట్ అయిన తెరి చిత్రానికి రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే తమిళంలో జయంరవికి జంటగా నటించిన సైరన్ చిత్రం కీర్తిసురేశ్ను నిరాశపరిచింది.ప్రస్తుతం ఈ బ్యూటీ నటిస్తున్న చిత్రాల్లో రివాల్వర్ రీటా ఒకటి. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందిస్తోన్న ఈ చిత్రానికి చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు రెడిన్ కింగ్స్లీ, మైమ్గోపీ, సెండ్రాయిన్, స్టంట్ మాస్టర్ సూపర్సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని నటి కీర్తిసురేశ్ తన ఇన్స్టాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్తో చివరి షూటింగ్లో కేక్ కట్ చేసిన వీడియోను విడుదల చేశారు. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా ఈ చిత్రం ఆడియో, ట్రైలర్లను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కీర్తిసురేశ్ రఘుతాత అనే చిత్రంలోనూ నటిస్తున్నారు. -
నాకు నేనే సవాల్గా మారా: స్టార్ హీరోయిన్
దక్షిణాదిలో టాప్ హీరోయిన్గా ఎదిగి ఆ తరువాత ఉత్తరాదిలో రాణిస్తున్న నటి తాప్సీ. తెలుగు, తమిళం భాషల్లో గ్లామర్నే నమ్ముకున్న ఈ ఢిల్లీ బ్యూటీ హిందీలో అభినయానికి ప్రాముఖ్యత కలిగిన చిత్రాల్లో నటిస్తున్నారు. అంతే కాదు అక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించే స్థాయికి చేరుకున్నారు. ఇటీవల ఈమె షారూఖ్ఖాన్తో జత కట్టిన డంకీ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, తాప్సీ నటనకు మంచి మార్కులే పడ్డాయి.ప్రస్తుతం ఈ భామ పిర్ ఆయి హసీన్ దిల్రూబా, కెల్కెల్ మెయిన్ చిత్రాల్లో నటిస్తున్నారు. దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తే నటించడానికి రెడీ అంటున్న తాప్సీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం తనకు తానే సవాల్గా మారినట్లు తెలిపారు. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నానన్నారు. నటనలో మంచి స్థాయిలో ఉన్నా.. దాని నుంచి బయటకు వచ్చి ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని ఆశిస్తున్నానన్నారు.తాను నటిస్తున్న పాత్రల స్వభావాలను తన దృష్టితో చూస్తున్నానని.. మాటల్లో మాత్రమే కాకుండా కల్పనల నుంచి పుట్టే ప్రపంచాన్ని చూడాలని కోరుకుంటున్నానన్నారు. కాగా నటిగా తానీ స్థాయికి చేరుకోవడం అంత సులభం కాలేదన్నారు. అందుకు కఠినంగా శ్రమించినట్లు చెప్పారు. నిత్యం ముందడుగు వేస్తూ ఎదుగుతూ వచ్చానన్నారు. అలా ఇది తన శ్రమకు దక్కిన స్థానం అని అన్నారు. అందుకే తాను చాలా సంతోషంగా ఉన్నానని తాప్సీ అన్నారు. -
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రం దేవర ద్వారా తెలుగులోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆ తర్వాత రామ్ చరణ్తో జత కట్టనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన శ్రీదేవి చెన్నైలోనూ ఆస్తులున్నాయి. నిర్మాత బోనీ కపూర్తో వివాహమైన తర్వాత తొలిసారిగా చెన్నై మాన్షన్ను శ్రీదేవి కొనుగోలు చేసింది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఇల్లు ఇదే కావడ విశేషం. అయితే శ్రీదేవి మరణం తర్వాత ఆ భవనాన్ని పునరుద్ధరించే బాధ్యతను బోనీ తీసుకున్నారు. ఆ ఇంటిని అందంగా తీర్చిదిద్దారు.అయితే తాజాగా శ్రీదేవి నివసించిన ఇంటిని రెంట్కు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ రెంటల్ సంస్థ ఎయిర్బీఎన్బీ (Airbnb) తన వెబ్సైట్ద్వారా వెల్లడించింది. ఈ ఖరీదైన భవనంలో బోనీ చెన్నై ఆఫీస్, ఖరీదైన లివింగ్ ఏరియా, శ్రీదేవి పెయింటింగ్స్, కుటుంబంతో ఉన్న పాత చిత్రాలు కూడా ఉన్నాయి. ఎవరైనా ఆ ఇంట్లో ఉండాలనుకునేవారికి మే 12 నుంచి బుకింగ్ చేసుకోచ్చు. కేవలం ఒక రోజు రాత్రి స్టే చేసే వెసులుబాటు కూడా ఉంది. ఈ ఇంట్లో ఉండే వారికి దక్షిణాది వంటకాలను కూడా రుచి చూసే అవకాశం ఉంటుందని ఎయిర్బీఎన్బీ వెల్లడించింది. కాగా..శ్రీదేవి 2018లో దుబాయ్లోని ఓ హోటల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. -
Sreeleela HD Photos: యువరాణిలా శ్రీలీల.. క్యూట్నెస్తో చంపేస్తోందిగా! (ఫొటోలు)
-
Eesha Rebba Photos: హాట్ ఫోజులతో కిర్రెక్కిస్తోన్న ఈషా రెబ్బ (ఫొటోలు)
-
Kavya Kalyanram Photos: బలగం బ్యూటీ ఫోటోషూట్.. కావ్య కల్యాణ్రామ్ స్మైల్కి నెటిజన్లు ఫిదా (ఫొటోలు)
-
ఆ సినిమా చూశాకే అలా చేయడం మానేశా: తమన్నా
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బాక్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో అరణ్మనై-4తో వస్తోన్న ఈ చిత్రంలో రాశి ఖన్నా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో తమన్నా, రాశి ఖన్నా బిజీ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.ఓ హాలీవుడ్ ఫిల్మ్ని చూశాక వ్యాక్సింగ్ (చర్మంపై రోమాలు తొలగించడం) మానేశానని తెలిపారు. హాలీవుడ్ చిత్రం హౌజ్ ఆఫ్ వ్యాక్స్ చిత్రంలో వ్యాక్స్తోనే పలు రకాలుగా చంపేస్తుంటారు. ఆ సినిమా చూశాకే వ్యాక్సింగ్ మానేశానని చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. ఇటీవల హైదరాబాద్లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. రాశి ఖన్నాతో కలిసి వేదికపై మెరిసింది. కోలీవుడ్ దర్శకుడు సుందర్ నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన ఈ హారర్ కామెడీ చిత్రం మే 3న థియేటర్లలో సందడి చేయనుంది. -
మంచు విష్ణు కన్నప్పలో మిల్కిబ్యూటీ..
-
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రభుత్వ పథకాలతో మెరుగుపడిన జీవనం
ఆ కుటుంబానికి పథకాలే ఆధారం
ఫ మా గుండెల్లో పెట్టుకుంటాం ఫ లంచాలు లేని పాలన తొలిసారి చూశాం ఫ చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోలేం ఫ మనసు విప్పిన ‘తూర్పు’ ఫ ఉమ్మడి జిల్లాలో ‘సాక్షి’ రోడ్ షో ఫ ఆరు నియోజకవర్గాల్లో 82 కిలోమీటర్ల మేర నిర్వహణ
ఓటరన్నా.. ఆలోచించు!
తాగునీటికి 2.25 టీఎంసీల నీళ్లు
నేటి నుంచి ఇంజనీరింగ్ సెట్
అక్రమ నిర్మాణాల తొలగింపులో లోకాయుక్త జోక్యం చేసుకోలేదు
ఇప్పట్లో మరమ్మతులు కష్టమే!
అథ్లెటిక్స్ సంఘంలో రాజకీయ నేతల పెత్తనం
పాప్లెట్ చేపలతో పరేషాన్!
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement