-
డీజిల్ ధర తగ్గినా మారని సరుకు రవాణా ఖర్చు
సరుకు రవాణా ధరలు మార్చి 2024లో ఫ్లాట్గా ఉన్నాయని శ్రీరామ్ ఫైనాన్స్ నెలవారీ లాజిస్టిక్స్ పరిశోధన నివేదిక శ్రీరామ్ మొబిలిటీ బులెటిన్ తెలిపింది. గౌహతి-ముంబై ట్రిప్ మినహా మెజారిటీ రూట్లలో పెరుగుదల కనిపించలేదని చెప్పింది. ఈ మార్గంలో రవాణా ధరలు 1.1 శాతం పెరిగాయని పేర్కొంది. మరోవైపు దిల్లీ-కోల్కతా, దిల్లీ-చెన్నై, దిల్లీ-బెంగళూరు, ముంబై-కోల్కతా ట్రిప్ల్లో రవాణా ధరలు స్వల్పంగా తగ్గాయి. దిల్లీ-కోల్కతా మార్గంలో గరిష్టంగా 1.4 శాతం ధరలు తగ్గినట్లు నివేదిక తెలిపింది. అందులోని వివరాల ప్రకారం..ఆల్ ఇండియా వెహికల్ రిటైల్ అమ్మకాలు ఫిబ్రవరిలో 20.29 మిలియన్ యూనిట్లతో పోలిస్తే మార్చిలో 21.27 మిలియన్ యూనిట్లు పెరిగాయి. ఈ విభాగంలో 4.81 శాతం వృద్ధి నమోదైంది. ఇది మార్చి 2023లో నమోదైన 20.62 మిలియన్లతో పోలిస్తే 3.14 శాతం ఎక్కువ. ఇదీ చదవండి: పాతబడేకొద్దీ మరింత ప్రమాదం ఆర్థిక సంవత్సరంలో మార్చి చివరి నెల కావడంతో కార్పొరేట్ సంస్థలు తమ లక్ష్యాలను పూర్తి చేయడానికి కాస్త అధికంగా సరుకు రవాణా చేయడంతో ట్రక్కుల అద్దెలు స్థిరంగా ఉన్నాయి. ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి చివరి వరకు ఇంధన ధరలు తగ్గాయి. ఫిబ్రవరి 28న దిల్లీలో డీజిల్ ధరలు లీటరుకు రూ.89.62 ఉండగా, మార్చి 31న లీటరుకు రూ.87.62 పడిపోయింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మార్చి 15న లీటరుకు రూ.2 చొప్పున ఇంధన ధరలను తగ్గించాయి. అయినా ట్రక్కు అద్దె ధరలు, రవాణా ధరల్లో ఎలాంటి మార్పు లేదని నివేదిక ద్వారా తెలిసింది. -
పెళ్లి వేడుకలోకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఐదుగురు మృతి!
మధ్యప్రదేశ్లోని రైసెన్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక ట్రక్కు రాంగ్ సైడ్ నుండి ఓవర్టేక్ చేసి, వివాహ వేడుకలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. సుల్తాన్పూర్ ప్రాంతంలో ఈ ప్రమాద ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. వివాహ వేడుకలకు లైట్లు మోసే కూలీలు ప్రమాదం బారినపడ్డారని సుల్తాన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ రజత్ సారథే తెలిపారు. ఘటన అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటలకు ఖమారియా గ్రామ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నదని రైసెన్ కలెక్టర్ అరవింద్ దూబే తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వారికి వైద్య చికిత్స అందించేందుకు భోపాల్కు తరలించారు. ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. -
బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి!
బీహార్లోని కైమూర్ జిల్లా మొహానియా పరిధిలోగల దేవ్కలి సమీపంలో వేగంగా వస్తున్న వస్తున్న ఒక కారు..బైక్ను ఢీకొని, మరో లేన్లోకి దూసుకెళ్లి.. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిదిమందితో పాటు బైక్ నడుపుతున్న వ్యక్తితో సహా మొత్తం తొమ్మిదిమంది సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుల్లో గాయకుడు ఛోటూ పాండే కూడా ఉన్నారు. ఈ ఘటన గురించి మోహానియా డీఎస్పీ దిలీప్ కుమార్ మాట్టాడుతూ స్కార్పియో వాహనం ససారం నుంచి వారణాసి వైపు వెళుతున్నదని, ఆ వాహనంలో ఎనిమిదిమంది ఉన్నారని తెలిపారు. మోహనియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్ 2లోని దేవ్కలి సమీపంలో, ఆ కారు ఒక బైక్ను ఢీకొని, డివైడర్ను దాటి.. మరో లేన్లోకి ప్రవేశించి, ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొన్నదని తెలిపారు. -
అరెస్ట్ చేయండి!.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తాజాగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఓ ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేస్తూ.. ఇది చూస్తుంటే చాలా బాధ కలుగుతోందని ట్వీట్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఎక్స్కవేటర్ ట్రక్కును పార్ట్స్.. పార్ట్స్గా విడదీయడం చూడవచ్చు. ఇది ఓ ఫ్యాక్టరీలో జరిగినట్లు తెలుస్తోంది. దీనిని ఆనంద్ మహీంద్రా ట్రక్ హత్యగా పేర్కొంటూ.. దీనికి కారణమైన ఎక్స్కవేటర్ను అరెస్ట్ చేయండంటూ పేర్కొన్నారు. ఒక ట్రక్కును తయారు చేయడానికి ఎంత టెక్నాలజీ, కృషి అవసరమో మాకు తెలుసు. కానీ అలాంటి ట్రక్కును కనికరం లేకుండా ముక్కలు చేయడం చాలా బాధాకరంగా ఉందని, రీ సైక్లింగ్ ద్వారా అవి మళ్ళీ ఎప్పటికైనా జీవిస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. ఇది చాలా బాధాకరమని, ఆ ఎక్స్కవేటర్ హ్యుందాయ్ కంపెనీకి చెందిందని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇదీ చదవండి: 50వేల మంది ఇష్టపడి కొన్న కారు ఇదే! Someone arrest that claw-excavator for ‘truck homicide!’ As manufacturers, we know how much technology & effort goes into producing trucks. Hurts to see them so mercilessly torn apart. But I suppose through recycling they’ll live ‘forever.’ 🙂pic.twitter.com/vvhMDKF6MI — anand mahindra (@anandmahindra) February 22, 2024 -
ట్రక్కునే మొబైల్ హౌస్గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
హైవేను దిగ్భంధించిన ఆందోళనకారులు..!
-
ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్లపై ఎగబడుతున్న జనం
ఢిల్లీ: హిట్ అండ్ రన్ కేసుల్లో కేంద్రం తీసుకువచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లపై రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలతో ఇంధన ట్రక్కులు దేశవ్యాప్తంగా నిలిచిపోయాయి. దీంతో ఇంధన కొరత ఏర్పడుతుందని జనం పెట్రోల్ బంక్లపై ఎగబడుతున్నారు. థానే జిల్లాలోని మీరా భయాందర్ ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ హైవేపై ట్రక్కు డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వారు. రాళ్లదాడితో పోలీసు వాహనం ధ్వంసమైంది. షోలాపూర్, కొల్హాపూర్, నాగ్పూర్, గోండియా జిల్లాల్లో కూడా రోడ్లు దిగ్బంధించారు. ఛత్తీస్గఢ్లోనూ నిరసనలు మిన్నంటాయి. రాష్ట్రవ్యాప్తంగా 12,000 మందికి పైగా ప్రైవేట్ బస్సు డ్రైవర్లు సమ్మెను ప్రకటించారు. రాయ్పూర్, బిలాస్పూర్, దుర్గ్, రాజ్నంద్గావ్లోని బస్ స్టేషన్లలో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. ఆందోళనలు రాబోయే రోజుల్లో ఇంధన సరఫరాకు ఆటంకం కలిగిస్తాయని భయపడి ప్రజలు వివిధ నగరాల్లోని పెట్రోల్ పంపుల వద్ద క్యూ కట్టారు. అటు.. పశ్చిమబెంగాల్, పంజాబ్, మధ్యప్రదేశ్లోనూ డ్రైవర్ల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. భారతీయ శిక్షా స్మృతి స్థానంలో కేంద్రం ఇటీవల భారత న్యాయ సంహితను తీసుకొచ్చింది. ఇందులో హిట్ అండ్ రన్ కేసుల్లో కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదాలకు కారణమైన ట్రక్కు డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించాలి. లేదంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.7 లక్షల జరిమానా విధించే అవకాశాన్ని కల్పించారు. దీంతో ట్రక్కు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఈ కఠిన నిబంధనలకు భయపడి కొత్తవారు ఈ వృత్తిలోకి రావడంలేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: వరుసగా మూడోనెల తగ్గిన ఫ్యూయెల్ ధర.. ఎంతంటే.. -
Video: ఆగ్రా రహదారిపై రోడ్డు ప్రమాదం.. కోళ్ల కోసం ఎగబడ్డ జనం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా ఎక్స్ప్రెస్పై బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగాపలు వాహనాలు ఒకదానికి ఒకటి డీకొట్టాయి. ఈ ఘటనలో దాదాపు 12 వాహనాలు (ట్రక్కు, కారులు, బైక్లు) ధ్వసంమయ్యాయి. ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సహయక చర్యలు ప్రారంభించారు. క్రేన్ ద్వారా ధ్వంసమైన వాహనాలను తొలగించి రోడ్డును క్లియర్ చేశారు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఒక విచిత్ర దృశ్యం కంటపడింది ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి బ్రాయిలర్ కోళ్లను తరలిస్తున్న ట్రక్కు కూడా ఉంది. ఇంకేముంది... ప్రమాదం గురించి కానీ, అక్కడ జరిగిన విధ్వంసం గురించి కానీ పట్టింపు లేకుండా పలువురు వాహనదారులు, స్థానికులు ట్రక్కునుంచి కోళ్ల కోసం ఎగబడ్డారు. కోళ్లను ఎత్తుకెళ్లకుండా ట్రక్కు డ్రైవర్ అడ్డుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. In UP's Agra, a lorry carrying chickens met with an accident in a road pile up due to dense fog. Commuters can be seen grabbing chickens and fleeing from the spot. Some bundled them in sack. pic.twitter.com/hBUaFCjj7g — Piyush Rai (@Benarasiyaa) December 27, 2023 కొందరు ఒకటి రెండు కోళ్లను చేతుల్లో పట్టుకొని వెళ్లగా.. మరికొందరు దొరికినకాడికి దొరికినట్లు పదుల కొద్ది కోళ్లను సంచులో వేసుకొని మరీ పరుగులు పెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదం కారణంగా నేడు అనేక కుటుంబాలకు మంచి చికెన్ విందు భోజనం దొరికినట్లైంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రెండు లక్షల యాభై వేల రూపాయల విలువ చేసే కోళ్లు ఉన్నాయని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ట్రక్కు డ్రైవర్ సునీల్ కుమార్ తెలిపాడు. జేవార్ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. Chicken thief gang became active after the accident on #YamunaExpressway in #Agra 😇🤣👇#DelhiFog #DelhiNCR #AnanyaPanday #Encounter #RubinaDilaik #AUSvPAK #Ennore_GasLeak pic.twitter.com/AiYlNrjOyJ — Robert Lyngdoh (@RobertLyngdoh2) December 27, 2023 -
మార్కెట్లోకి కొత్త వాహనాలు.. ప్రత్యేకతలివే..
సరకు రవాణా అవసరాలు తీర్చేందుకు టాటా మోటార్స్ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపింది. సరకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించే ఉద్దేశంతో కొత్త తేలికపాటి వాణిజ్య వాహనాలను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. ఇంట్రా వీ70, ఇంట్రా వీ20 గోల్డ్, ఏస్ హెచ్టీ+, ఇంట్రా వీ50 పేర్లతో వాటిని విపణిలోకి తీసుకొచ్చింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు సరుకు రవాణాతో అధిక లాభాలు సంపాదించేందుకు వీటిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కస్టమర్ల అవసరాలకు అనుకూలమైన వాహనాన్ని ఎంచుకునేలా వీటిని తయారుచేసినట్లు కంపెనీ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ డీలర్షిప్ల్లో ఈ వాహనాల బుకింగ్లు ప్రారంభమయినట్లు చెప్పారు. ఈ సందర్భంగా టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ వాఘ్ మాట్లాడారు. ‘టాటా మోటార్స్ చిన్న వాణిజ్య వాహనాలు కస్టమర్ల జీవనోపాధిని మెరుగుపరుస్తున్నాయి. ప్రస్తుతం విడుదల చేసిన వాహనాలతో వినియోగదారులకు మరింత సేవలందించేలా కంపెనీ కృషిచేస్తోంది. ఇంధన సామర్థ్యాన్ని పెంచి, అధిక పేలోడ్లను మోస్తూ ఎక్కువ దూరం వెళ్లేలా వీటిని రూపొందించాం. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఈ-కామర్స్, లాజిస్టిక్స్, సరకు రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడుతాయి’ అని అన్నారు. ఇదీ చదవండి: రామమందిర ప్రతిష్ఠాపనకు డేట్ ఫిక్స్.. ప్రముఖులకు ఆహ్వానం ఇంట్రా వీ70 పేలోడ్ సామర్థ్యం 1700కేజీలు. ఫ్లీట్ ఎడ్జ్ టెలిమాటిక్స్ సిస్టమ్తో 9.7 అడుగుల పొడవైన లోడ్ బాడీతో దీన్ని తయారుచేసినట్లు అధికారులు తెలిపారు. ఇంట్రా వీ20 గోల్డ్ 800 కిమీల డ్యుయల్ ఇంజిన్ పికప్ సామర్థ్యంతో 1200 కేజీ పేలోడ్ను మోసుకెళ్తుందని కంపెనీ చెప్పింది. ఏస్ హెచ్టీ+ 900 కేజీ పేలోడ్ కెపాసిటీతో 800సీసీ డీజిల్ ఇంజిన్ కలిగి ఉందని అధికారులు పేర్కొన్నారు. -
అదిరిపోయే లుక్స్తో టెస్లా ‘సైబర్ట్రక్’ (ఫోటోలు)
-
సీఎం జగన్ పారిశ్రామిక విధానాలు అభినందనీయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటులో పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలు, విధానాలు అంతర్జాతీయ సంస్థల అధిపతుల ప్రశంసలు అందుకుంటున్నాయి. పరిశ్రమ ఏర్పాటుకు దరఖాస్తు నుంచి పరిశ్రమ ప్రారంభోత్సవం వరకు పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ ప్రభుత్వం అండదండగా నిలుస్తోంది. వేగంగా అన్ని అనుమతులూ ఇస్తోంది. దీంతో రాష్ట్రంలో శరవేగంతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. జర్మనీకి చెందిన ప్రపంచంలోనే అతి పెద్ద విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కూడా సీఎం వైఎస్ జగన్ విధానాలకు ప్రశంసలందించారు. ఈ సంస్థ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీకి రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్ద యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రూ.4,640 కోట్లతో చిత్తూరు జిల్లా పుంగనూరు వద్ద 800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ యూనిట్ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది. ఈ యూనిట్ ద్వారా 8,100 మంది ఇంజినీర్లు, టెక్నీషియన్లకు ఉపాధి లభిస్తుంది. పెప్పెర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే పెప్పర్ మోషన్ యూనిట్ వివరాలను వివరించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్ బస్సులు ట్రక్కుల క్లస్టర్ ఏర్పాటుకు వేగంగా అనుమతులు మంజూరు చేసిన సీఎం వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటులో సీఎం వైఎస్ జగన్ విధానాలను కొనియాడారు. ఏడాదికి 30,000 విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సామర్ధ్యంతో ఇక్కడి యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీంతోపాటు ఇంటిగ్రేటెడ్ వర్టికల్ ప్రొడక్షన్ ఫెసిలిటీ, 20 జీడబ్ల్యూహెచ్ సామర్ధ్యం గల బ్యాటరీల తయారీ, అంతర్జాతీయ ప్రమాణాలతో యూనిట్ ఏర్పాటు, డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏపీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా వంటి దేశాల్లోని పెప్పర్ భాగస్వాములకు కూడా ఇక్కడి నుంచే సేవలు అందిస్తామని చెప్పారు. మూడు దశల్లో ఏర్పాటు చేసే ఈ యూనిట్ తొలి దశ 2025 మూడో త్రైమాసికానికి అందుబాటులోకి వస్తుందన్నారు. 2027 మూడో త్రైమాసికానికి మూడో దశలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఏపీలో గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పారిశ్రామిక విధానాలు, సింగిల్ విండో అనుమతులు, అమలు చేస్తున్న పారదర్శక విధానాలను సీఎం జగన్ పెప్పర్ మోషన్ ప్రతిని«దులకు వివరించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెప్పర్ మోషన్ సీటీవో డాక్టర్ మథియాస్ కెర్లర్, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవే స్టెల్టర్, సీఐవో రాజశేఖర్రెడ్డి నల్లపరెడ్డి, సీఎస్వో సత్య బులుసు, సీసీవో రవిశంకర్, అసోసియేట్ శ్రీధర్ కిలారు, ఉర్త్ ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండీ హర్ష ఆద్య పాల్గొన్నారు. సీఎం విజనరీ థింకింగ్ మమ్మల్ని ఆకట్టుకుంది: ఆండ్రియాస్ హేగర్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజనరీ థింకింగ్, అమలు చేస్తున్న పాలసీలు తమను ఆకట్టుకున్నాయని, ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అందించిన సహాయ సహకారాలు మరువలేమంటూ పెప్పర్ మోషన్ సీఈవో ఆండ్రియాస్ హేగర్ కొనియాడారు. సీఎంను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఏపీలో వరల్డ్ క్లాస్ యూనిట్ ఏర్పాటు చేయడంపై చాలా సంతోషంగా ఉన్నాం. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మా యూనిట్ ఏర్పాటుచేస్తున్నాం. ప్రజా రవాణాకు అవసరమైన విధంగా డీకార్బొనైజ్డ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తీసుకువచ్చేలా మా యూనిట్ నుంచి వాహనాల ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో యూనిట్ ఏర్పాటు చేయడం సరైన నిర్ణయంగా భావిస్తున్నాం. బెంగళూరు, చెన్నై నగరాలకు దగ్గరగా మా యూనిట్ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నాం. మాకు సహాయ సహకారాలు అందించిన సీఎం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అని చెప్పారు. -
రాజస్తాన్లో రోడ్డు ప్రమాదం...ఆరుగురు పోలీసుల దుర్మరణం
చురు: రాజస్తాన్లో చురు జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల నిమిత్తం వెళ్తున్న ఆరుగురు పోలీసు సిబ్బంది ఈ ఘటనలో దుర్మరణం పాలయ్యారు. వారంతా నగౌర్ నుంచి ఎన్నికల ర్యాలీ జరగనున్న ఝుంఝును వెళ్తుండగా తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు దట్టమైన పొగ మంచు కారణంగా ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. దాంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. తీవ్రంగా గాయపడ్డ మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
మస్క్కు తెగ నచ్చేసిన సరికొత్త సైబర్ ట్రక్: వీడియో చూస్తే మీరూ ఫిదా!
ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా సైబర్ట్రక్పై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. తాజాగా వియత్నాంకు చెందిన యూ ట్యూబర్ టెస్లా సైబర్ ట్రక్ ప్రతిరూపాన్ని చెక్కతో అద్భుతంగా రూపొందించాడు. చెక్కతో పూర్తిగా పనిచేసేలా ఈ సైబర్ట్రక్ రూపొందించడం విశేషంగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో కోసం నెట్లో సెర్చ్ చేసి, డిజైన్ చేసుకొని మరీ మెటల్ ఫ్రేమ్మీద చెక్కతో దీన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాడు. ఎలక్ట్రిక్ మోటారు , బ్యాటరీలపై చెక్క పలకలను ఉపయోగించాడు. లైట్లను కూడా అందంగా పొందుపరిచాడు అలాగే X లోగోతో సైడ్ ప్యానెల్ను కూడా డిజైన్ చేశాడు. చివరికి తన వుడెన్ కారును కొడుకుతో కలిసి రైడ్కి తీసుకెళ్లడంతో క్లిప్ ముగుస్తుంది. దీనికి సంబంధించి వుడ్వర్కింగ్ ఆర్ట్ అనే YouTube ఛానెల్లో మస్క్ కోసం వందరోజుల్లో టెస్లా సైబర్ ట్రక్ తయారీ అనే క్యాప్షన్తో ఈ వీడియోను షేర్ చేశాడు. దీంతో పాటు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్కు ఒక నోట్ పెట్టాడు. తనకు చెక్క వాహనాలంటే చాలా ఇష్టమని,అందులోనూ టెస్లాపై ఉన్న విపరీతమైన అభిమానంతో దీన్ని తయారు చేశానని చెప్పారు. ఇందులో అనుభవం సాధించాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా అనేక చెక్క కార్లను రూపొందించా.. ఇపుడు ఈ సైబర్ట్రక్ పూర్తి చేశా అన్నాడు. తన వ్యూయర్లలో చాలామందికి నచ్చిన, తాను మెచ్చిందీ, నిర్మించాలని కోరుకుంటున్న కారు కూడా ఇదే అంటూ యూట్యూబర్ వెల్లడించాడు. సైబర్ట్రక్ కోసం టెస్లా తన సవాళ్లను ఎదుర్కొందో తెలుసు. అయినా కూడా మస్క్ పైనా, టెస్లా సామర్థ్యాలపై అచంచలమైన విశ్వాసం ఉంది. ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పడమే కాదు. టెస్లా చెక్క సైబర్ట్రక్ను బహుమతిగా ఇవ్వడం సంతోషంగా ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే దీనిపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ స్పందించడం విశేషం. సూపర్.. చాలా అభినందించదగ్గదే అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో 9 లక్షలకు పైగా వ్యూస్ 14 వేల లైక్స్ సాధించింది. వాట్ ఎ లెజెండ్ అంటూ అతనిపై నెటిజనులు ప్రశంసలు కురిపించారు. ఖచ్చితంగా మస్క్ మీ దగ్గరికి వస్తారు అంటూ ఒకరు వ్యాఖ్యానించగా, టెస్లా సైబర్ ట్రక్ అంటే అత్యుత్తమంగా ఉండాలి తప్ప ఇలా కాదు.. దీన్ని టెస్లా హెడ్ క్వార్టర్ లో ఉంచితే బెటర్ అని ఒక యూజర్ కమెంట్ చేశాడు. -
వలసదారుల ట్రక్కు బోల్తా.. 10 మంది దుర్మరణం
దక్షిణ మెక్సికోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ మెక్సికో రాష్ట్రమైన చియాపాస్లో అక్రమ వలసదారులను తీసుకెళ్తున్న ట్రక్కు హైవేపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది వలసదారులు మరణించారు 25 మందికి పైగా వలసదారులు గాయాలపాలయ్యారు. మృతులంతా మహిళలేనని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు 18 ఏళ్లలోపు వయస్సు గలవారున్నారన్నారు. గ్వాటెమాల సరిహద్దులో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వారం రోజుల వ్యవధిలో వలసదారులకు సంబంధించి ఇది రెండవ ప్రమాదం అని తెలుస్తోంది. ప్రమాద బాధితులంతా క్యూబన్లు అని ఒక అధికారి వార్తాసంస్థకు వెల్లడించారు. దక్షిణ రాష్ట్రమైన చియాపాస్లోని పిజ్జియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు 27 మంది క్యూబా వలసదారులను తీసుకువెళుతున్నారు. పిజిజియాపాన్-టోన్లా హైవేపై ట్రక్కు ప్రమాదానికి గురైంది. ట్రక్కు డ్రైవర్ అతివేగంతో వాహనాన్ని నడిపినట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయని అధికారులు తెలిపారు. లారీ బోల్తా పడిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. ప్రస్తుతం క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రక్కు తునాతునకలయ్యింది. వలసదారులు తరచూ రష్యా నుండి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా వలసదారులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురికావడం ఇది మొదటిసారి కాదు. గత గురువారం తెల్లవారుజామున చియాపాస్ రాష్ట్రంలోని మెజ్కలాపా మున్సిపాలిటీ పరిధిలో ఒక ట్రక్కు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వలసదారులు మరణించారు. అమెరికా వెళ్లేందుకు వివిధ దేశాల నుంచి వేలాది మంది వలసదారులు మెక్సికో నుంచి బస్సులు, ట్రక్కులు, గూడ్స్ రైళ్లలో సైతం ప్రయాణిస్తుంటారు. 2021లో జరిగిన ఇటువంటి ప్రమాదంలో 55 మంది వలసదారులు మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇది కూడా చదవండి: జపనీస్ కుర్రాళ్లు గడ్డం ఎందుకు పెంచుకోరు? -
ఎలక్ట్రిక్ ట్రక్కు కంపెనీ ట్రెసా మోటర్స్ చైర్మన్గా వినోద్ దాసరి
బెంగళూరుకు చెందిన మీడియం, హెవీ ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీ సంస్థ ట్రెసా మోటర్స్ బోర్డు ఛైర్మన్గా వినోద్ కె దాసరిని నియమించింది. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో వినోద్కు ఉన్న విశేష అనుభవం తమ కంపెనీ దేశీయ మార్కెట్లో పట్టు సాధించడంతోపాటు అంతర్జాతీయ వ్యాపార అవకాశాల అన్వేషణకు తోడ్పడుతుందని ట్రెసా మోటార్స్ విశ్వసిస్తోంది. ఇదీ చదవండి ➤ ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి? వినోద్ దాసరి గతంలో రాయల్ ఎన్ఫీల్డ్ సీఈఓగా, అశోక్ లేలాండ్ సీఈవో, ఎండీగా పనిచేశారు. అపెక్స్ ఇండస్ట్రీ బాడీ ఎస్ఐఏఎంకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2016లో ఆటోకార్ ప్రొఫెషనల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు. ట్రెసా మోటర్స్ చైర్మన్గా వినోద్ దాసరి నియామకం తక్షణమే అమల్లోకి రానుంది. ట్రెసా మోటర్స్లో కీలక బాధ్యతలను చేపట్టనున్న ఆయన కంపెనీ వ్యూహాత్మక దిశానిర్దేశం, ఆవిష్కరణలను నడపడంలో కీలకంగా వ్యవహరించనున్నారు. ట్రెసా మోటార్స్ కుటుంబానికి వినోద్ కె దాసరిని స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రోహన్ శ్రవణ్ అన్నారు. ఆటోమోటివ్ రంగంలో వినోద్ విశేష అనుభవం, అద్భుతమైన విజయాలు తమ కంపెనీ వృద్ధి ప్రయాణానికి కీలక వనరులుగా మారుతాయని, ఆయన నాయకత్వంలో ట్రెసా మోటర్స్ కొత్త శిఖరాలకు చేరుకుంటుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రెసా మోటర్స్ ఛైర్మన్గా తన నియామకంపై వినోద్ కె దాసరి మాట్లాడుతూ, ట్రెసా మోటార్స్లో చేరడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు ట్రెసా మోటర్స్ కంపెనీని 2022లో రోహన్ శ్రవణ్, రవి మచాని స్థాపించారు. పారిశ్రామిక డిజైన్, ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్, బ్యాటరీ సంబంధిత టెక్నాలజీలో ఈ కంపెనీకి విశేష సామర్థ్యం ఉంది. ఇది ప్రస్తుతం 18T-55T GVW విభాగంలో ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. దాని మొదటి వాహనం మోడల్ V0.1ని ఇటీవలె ఆవిష్కరించింది. అధికారిక ఉత్పత్తి లాంచ్ 2024 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జరగనుంది. -
లండన్లో బర్గర్లు పంచిన ప్రిన్స్ విలియం.. దీనికి భారత్తో సంబంధం ఇదే..
బ్రిటన్లోని కొందరికి మొన్నటి ఆదివారం మరపురానిదిగా మిగిలిపోతుంది. ప్రిన్స్ విలియం లండన్లో ఒక ఫుడ్ ట్రక్ నుంచి పర్యావరణానికి హాని చేయని బర్గర్లను కొందరికి పంచిపెట్టారు. ఇది చూపరులను ఎంతగానో ఆశ్ఛర్యపరిచింది. వార్షిక ఎర్త్షాట్ పురస్కారాల పంపిణీలో భాగంగా గత ఏడాది విజేతలకు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ‘ఎర్త్షాట్ బర్గర్ల’ను అందించారు. ఈ పురస్కారాలను పర్యావరణానికి విశేషమైన సేవలు అందించిన ఐదుగురికి అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ చానల్ సార్టెడ్ ఫుడ్లో షేర్ చేశారు. ఈ చానల్లో పర్యావరణ అనుకూలమైన వంటగది పరికరాలు, రకరకాల వంటకాల తయారీ విధానాలు కనిపిస్తాయి. వీడియో ప్రారంభంలో ప్రిన్స్ విలియం సార్టెడ్ ఫుడ్కు సంబంధించిన స్టూడియోకి చేరుకుంటారు. గత ఏడాది ఎర్త్షాట్ పురస్కార విజేతలు రూపొందించిన వాటిని ఒక వ్యక్తి పట్టుకుని ఉంటాడు. తరువాత బర్గర్ తయారు చేస్తుంటారు. ప్రిన్ ఆ డిష్ తీసుకుని జనం మధ్యలోకి చేరుకుంటారు. వీడియోలో ఫుడ్ ట్రక్ దగ్గర ప్రిన్స్ విలియం నిలుచుని, మీరు తినబోయే కంటైనర్ను నోట్ప్లా అనే కంపెనీ తయారు చేసిందని, దీనిలో ఎలాంటి ప్లాస్టిక్ను ఉపయోగించలేనది వినియోగదారులకు ఆయన చెప్పడాన్ని వినవచ్చు. ఈ కంటైనర్లకు సముద్రపు పాచితో తయారు చేస్తారు. బర్గర్లోని పదార్థాలను భారతదేశంలోని ఖేతీ అనే సంస్థ గ్రీన్హౌస్లలో ఉత్పత్తి చేసిందని ప్రిన్స్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మరో ముఖ్య విషయం కూడా చెప్పారు. ముకూరు క్లీన్ స్టవ్పై బర్గర్ను సిద్ధం చేసినట్లు తెలిపారు. కెన్యాకు చెందిన ఓ మహిళ ఈ స్టవ్ను డిజైన్ చేసింది. వాయు కాలుష్యాన్ని తగ్గించడమే ఈ ఉత్పాదన లక్ష్యం. ఇది కూడా చదవండి: నాడు దోస్తీ కోసం.. నేడు ఉద్రిక్తతలకు నిలయం -
ట్రెసా నుంచి వీ0.1 ఎలక్ట్రిక్ ట్రక్
హైదరాబాద్: ట్రెసా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’ మోడల్ను ఆవిష్కరించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ ప్లాట్ ఫామ్: ఫ్లక్స్350పై దీన్ని అభివృద్ధి చేసినట్టు సంస్థ ప్రకటించింది. దీన్ని ప్రపంచ మార్కెట్ కోసం డిజైన్ చేసినట్టు తెలిపింది. భవిష్యత్ కోసం ఉద్దేశించిన సుస్థిర రవాణా పరిష్కారాలను అందించాలన్న సంస్థ అంకిత భావానికి ఈ ఉత్పత్తి నిదర్శనంగా ఉంటుందని పేర్కొంది. ట్రెసా ఎలక్ట్రిక్ ట్రక్ ‘వీ0.1’లో 350 కిలోవాట్ పవర్ను అందించే మోటార్ ఉంటుంది. ఈ తరహా పవర్ను అందించే తొలి భారత ఓఈఎం తమదేనని ట్రెసా మోటార్స్ ప్రకటించింది. యాక్సియల్ ఫ్లక్స్ మోటార్ను పూర్తి దేశీయంగా అభివృద్ధి చేసినట్టు తెలిపింది. ‘‘దేశంలో 28 లక్షల ట్రక్కులు ఉన్నాయి. ఇవి 60 శాతం కాలుష్యానికి కారణమవుతున్నాయి. కనుక మధ్య స్థాయి నుంచి, భారీ తరహా ట్రక్కులు సున్నా ఉద్గార ఇంధనాల వైపు మళ్లాల్సిన అవసరం ఉంది. 2024లో రానున్న వాహన తుక్కు విధానం, పెరుగుతున్న ఇంధన ధరలు ఎలక్ట్రిక్ ట్రక్కులకు అనుకూలించనున్నాయి. సురక్షిత, వినూత్న, పర్యావరణ పరిష్కారాలతో ఈ పరివర్తనాన్ని ట్రెసా ముందుండి నడిపిస్తుంది’’అని సంస్థ పేర్కొంది. -
బాబోయ్..! నదీ ప్రవాహంలో ట్రక్కు డ్రైవింగ్.. వీడియో వైరల్..
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
బాందా: విద్యుదాఘాతానికి గురైన ఒక బాలు డిని ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో వేగంగా వెళ్తు న్న వాహనం ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బాందాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. టిలౌసా గ్రామానికి చెందిన కల్లు(13) అనే బాలుడు విద్యుత్ షాక్కు గురయ్యాడు. కుటుంబసభ్యులు అతడిని తీసుకుని దగ్గర్లోని బబెరు ఆరోగ్య కేంద్రానికి ఎస్యూవీలో బయలుదేరారు. వారి వాహనం అదుపుతప్పి కమాసిన్ రోడ్డులో నిలిపిఉన్న ట్రక్కును వేగంగా వెళ్లి ఢీకొట్టింది. ఈ ఘటనలో కల్లు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో వారి వాహనం గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో వెళ్తుతోందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నామన్నారు. -
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం..
-
జోబైడెన్ హత్యకు భారత సంతతి యువకుడి యత్నం.. ట్రక్కుతో వైట్హౌస్పై దాడి
ఓ యువకుడు అమెరికా అధ్యక్షడు జో బైడెన్ని హత్య చేయాలని చేసిన యత్నం తీవ్ర కలకలం రేపింది. ఆ యువకుడు వైట్హౌస్ పరిసరాల్లోకి ట్రక్కుతో దూసుకొచ్చి బారికేడ్లను ఢీకొట్టాడు. అతను సోమవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటనకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న యూఎస్ పోలీసులు అతను లాఫాయోట్ పార్క్ వెలుపల ఉన్న బోలార్డ్లోకి ఉద్దేశ పూర్వకంగా డ్రైవింగ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ట్రక్కుపై నాజీ జెండాను పోలీసులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని భారత సంతతికి చెందిని తెలుగు యువకుడు సాయివర్షిత్ కందులగా పోలీసులు గుర్తించారు. అతన్ని విచారించగా అమెరికా అధ్యక్షుడిపై దాడి చేసేందుకు ఆరు నెలలుగా ప్లాన్ చేశానని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అతనిపై ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నిన కేసులు నమోదు చేశారు. (చదవండి: నమ్మకమే పునాది) -
రాహుల్ గాంధీ నైటవుట్, ఈసారి ఇలా..!
ఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో జోష్ మీద ఉన్న ఆ పార్టీ శ్రేణులు.. ఆ విక్టరీలో రాహుల్ గాంధీకి కూడా కొంత క్రెడిట్ కట్టబెట్టాయి. భారత్ జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ గెలుపులో తన వంతు పోషించారాయన. ఇదే ఊపులో సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ అధికారం దిశగా ప్రయత్నిస్తామని ఆయన ప్రకటించుకున్నారు కూడా. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సోషల్మీడియా హాట్ టాపిక్గా మారారు. హర్యానా అంబాలా వద్ద సోమవారం అర్ధరాత్రి సందడి చేశారాయన. ట్రక్కులో ఆయన పర్యటించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి ఛండీగఢ్ వెళ్లే క్రమంలో.. ఆయన ఈ పని చేసినట్లు తెలుస్తోంది. హెవీ వెహికల్స్ డ్రైవర్లు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు.. వాళ్లతో కలిసి ప్రయాణించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అంబాలా వద్ద ఆగి.. కాసేపు ఆయన ట్రక్కు డ్రైవర్లతో ముచ్చటించారు. ఆ తర్వాత ఆయన మార్గం మధ్యలో ఓ గురుద్వారాను దర్శించుకున్నారు. यूनिवर्सिटी के छात्रों से खिलाड़ियों से सिविल सर्विस की तैयारी कर रहे युवाओं से किसानों से डिलीवरी पार्टनरों से बस में आम नागरिकों से और अब आधी रात को ट्रक के ड्राइवर से आख़िर क्यों मुलाक़ात कर रहे हैं राहुल गांधी? क्योंकि वो इस देश लोगों की बात सुनना चाहते हैं,… pic.twitter.com/HBxavsUv4f — Supriya Shrinate (@SupriyaShrinate) May 23, 2023 Country needs such a leader#RahulGandhi pic.twitter.com/WOfCga0V7J — Kavish Aziz (@azizkavish) May 23, 2023 This is Rahul Gandhi, INC ex MP. Late night, he met with truck drivers, have a chat with them, asked them their problems. He travelled in one of the trucks too, enjoyed the desi music of truck driver. How many political leaders have you seen now doing this without any media… pic.twitter.com/HQFhjs7qR9 — Dr Nimo Yadav (@niiravmodi) May 23, 2023 -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. బుల్లితెర నటి స్పాట్ డెడ్!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బెంగాలీకి చెందిన ప్రముఖ బుల్లితెర నటి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. షూటింగ్ పూర్తి చేసుకున్న టీవీ నటి సుచంద్ర దాస్గుప్తా బైక్ టాక్సీపై ఇంటికి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరానగర్లో జరిగింది. (ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్) ఎలా జరిగిందంటే.. షూటింగ్ ముగించుకున్న సుచంద్ర దాస్ గుప్తా సోదేపూర్ ప్రాంతంలోని తన ఇంటికి చేరుకోవడానికి ఓ యాప్ ద్వారా బైక్ను బుక్ చేసుకున్నారు. బైక్పై ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు ఓ సైక్లిస్ట్ వారికి ఎదురుగా వచ్చాడు. దీంతో బైక్ రైడర్ సడన్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో వెనకాల కూర్చున్న నటి ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆ సమయంలో వెనకాలే వస్తున్న ట్రక్ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె హెల్మెట్ ధరించినా కూడా ప్రాణాలు దక్కలేదు. సమాచారం అందుకున్నబారానగర్ పోలీసులు ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కాగా.. సుచంద్ర దాస్గుప్తా ప్రముఖ బెంగాలీ టీవీ షోలలో కనిపించారు. గౌరీ షోలో సపోర్టింగ్ రోల్ పోషించి పాపులర్ అయ్యారు. (ఇది చదవండి: హైదరాబాద్లో ఇల్లు కొన్న మృణాల్ ఠాకూర్? ఆమె ఏమందంటే..) -
ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాత
లక్నో: ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మినీ వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఓ చిన్నారి సహా ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. మరో 12 మందికిపైగా గాయాలయ్యాయి. మోరాదాబాద్ జిల్లాలోని ఖైర్ఖాతా గ్రామ సమీపంలోని దల్పత్పూర్-కాశీపూర్ రహదారిపై ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. ఓ వివాహ వేడుకకు హజరయ్యేందుకు కుటుంబ సభ్యులు, బంధువులంతా వ్యాన్లో వెళ్తున్నారు. ఇంతలో అతివేగంతో వెళ్తున్న ట్రక్కు పికప్ వ్యాన్ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో వ్యాన్పై లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వ్యాన్లో ప్రయాణిస్తున్న చాలా మంది ప్రయాణికులు శిథిలాల కింద చిక్కుకుపోవడంతో అధికారులు.. చాలా కష్టం మీద వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో 15 మంది గాయపడగా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో రెండు వాహనాల్లో ప్రయాణికులు ఉన్నారు. చదవండి: పుల్వామాలో ఉగ్రకుట్ర భగ్నం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం -
నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్..
ముంబై: మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ధూమ్ సినిమాను తలపించేలా ఓ దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ కారు వచ్చింది. ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్గా ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మొదట ఈ చోరీ ఉత్తర్ప్రదేశ్ ఉన్నావ్లో జరిగిందని ప్రచారం జరిగింది. దీంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్పురి-ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कानपुर उन्नाव हाइवे पे ट्रक से बकरे चोरी करने वाला गिरोह जो लग्जरी कार से चोरी कर रहा.... वीडियो गौर से देखिए........@Uppolice pic.twitter.com/ytC6m6owgI — Mohit Sharma (@Mohit_Casual_) April 30, 2023 ఈ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు. అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడని జోకులు పేల్చారు. చదవండి: బైక్ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువ రేవంత్ కష్టపడ్డాడు: కేటీఆర్
'రెండు గంటల జర్నీ 20 నిమిషాల్లో'.. పుష్ప భామ ప్రశంసలు
ఎంపీ స్వాతి మలివాల్పై దాడి నిజమే.. స్పందించిన ‘ఆప్’
రొమాంటిక్ కామెడీ చిత్రంగా సంగీత్.. గ్రాండ్గా షూటింగ్ ప్రారంభం (ఫొటోలు)
ఢిల్లీతో లక్నో డూర్ ఆర్ డై మ్యాచ్.. తుది జట్లు ఇవే
ఎందుకలా వదిలేశారు?.. మీ బాధ్యత కాదా?.. రష్మి ట్వీట్ వైరల్
తప్పక చదవండి
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- ఏపీలో తుది పోలింగ్ శాతంపై సాయంత్రానికి క్లారిటీ: ఎంకే మీనా
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- మొబైల్ యూజర్స్కు షాక్, త్వరలో రీఛార్జ్ ధరలు భారీగా పెంపు!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement