-
స్టార్టప్లకు 5 వేల్యుయేషన్ విధానాలు
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు అన్లిస్టెడ్ అంకుర సంస్థలు జారీ చేసే షేర్ల విలువను మదింపు చేసే విధానాలకు సంబంధించి కొత్త ఏంజెల్ ట్యాక్స్ నిబంధనలను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని 11యూఏ నిబంధనలో ఈ మేరకు సవరణలు చేసింది. దీని ప్రకారం అన్లిస్టెడ్ స్టార్టప్లు జారీ చేసే ఈక్విటీ షేర్లు, కంపల్సరీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ల (సీసీపీఎస్) వేల్యుయేషన్ను సముచిత మార్కెట్ విలువ (ఎఫ్ఎంవీ)కి పది శాతం అటూ ఇటూగా లెక్క కట్టవచ్చు. ప్రవాస ఇన్వెస్టర్లు అయిదు రకాల వేల్యుయేషన్ విధానాలను ఉపయోగించవచ్చు. ఆప్షన్ ప్రైసింగ్ విధానం, మైల్స్టోన్ అనాలిసిస్ విధానం మొదలైనవి వీటిలో ఉంటాయి. దేశీ ఇన్వెస్టర్లకు ఈ అయిదు విధానాలు వర్తించవు. రూల్ 11 యూఏ ప్రకారం దేశీయ ఇన్వెస్టర్లకు ప్రస్తుతమున్న డీసీఎఫ్ (డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లో), ఎన్ఏవీ (అసెట్ నికర విలువ) విధానాలు వర్తిస్తాయి. ఎఫ్ఎంవీకి మించిన ధరకు షేర్లను విక్రయించడం ద్వారా స్టార్టప్లు సమీకరించిన నిధులపై వేసే పన్నును ఏంజెల్ ట్యాక్స్గా వ్యవహరిస్తున్నారు. ఇది తొలుత దేశీ ఇన్వెస్టర్లకే పరిమితమైనప్పటికీ 2023–24 బడ్జెట్లో విదేశీ పెట్టుబడులను కూడా దీని పరిధిలోకి తెచ్చారు. దీన్ని అమల్లోకి తెచ్చే దిశగా కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తాజా నోటిఫికేషన్ జారీ చేసింది. అయిదు రకాల వేల్యుయేషన్స్ విధానాలను అందుబాటులోకి తేవడం వల్ల ఇన్వెస్టర్లకు పన్నులపరంగా కొంత వెసులుబాటు పొందే వీలు లభించగలదని డెలాయిట్ ఇండియా, నాంగియా అండ్ కో తదితర సంస్థలు తెలిపాయి. -
ఈ దేశాల నుంచి స్టార్టప్ల్లోకి పెట్టుబడులు.. పన్ను లేదు
న్యూఢిల్లీ: అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర 21 దేశాల నుంచి అన్లిస్టెడ్ భారత స్టార్టప్ల్లోకి వచ్చే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ వర్తించదని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. సింగపూర్, నెదర్లాండ్స్, మారిషస్ నుంచి వచ్చే పెట్టుబడులకు ఈ అవకాశం కల్పించలేదు. ఆస్ట్రేలియా, జర్మనీ, స్పెయిన్ ఆస్ట్రియా, కెనడా, చెక్ రిపబ్లిక్, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఇజ్రాయెల్, ఇటలీ, ఐస్ లాండ్, జపాన్, కొరియా, రష్యా, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ ఏంజెల్ ట్యాక్స్ మినహాయింపు జాబితాలో ఉన్నాయి. అన్లిస్టెడ్ కంపెనీల్లోకి వచ్చే విదేశీ పెట్టుబడులను ఏంజెల్ ట్యాక్స్ పరిధిలోకి తీసుకొస్తూ బడ్జెట్లో ప్రతిపాదించారు. అనంతరం కొన్ని రకాల విదేశీ ఇన్వెస్టర్ల తరగతులను మినహాయించాలంటూ పరిశ్రమ నుంచి వినతులు రావడంతో.. ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్టు పేర్కొంది. -
‘అన్లిస్టెడ్’ షేర్లూ.. డీమ్యాట్లోనే...
న్యూఢిల్లీ: అన్లిస్టెడ్ కంపెనీల్లో బినామీలను గుర్తించే దిశగా కేంద్రం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అన్లిస్టెడ్ కార్పొరేట్ల షేర్లను డీమెటీరియలైజ్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) మరికొన్ని వారాల్లో ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయా సంస్థల్లో సిసలైన వాటాదారులను గుర్తించేందుకు ఇది తో డ్పడగలదని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా 80,000–90,000 దాకా పబ్లిక్ కంపెనీలతో ఈ ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తోన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 2017 మార్చి ఆఖరు నాటికి దేశీయంగా మొత్తం 11.7 లక్షల కంపెనీలు క్రియాశీలకంగా ఉన్నాయి. అయితే, ప్రస్తుతం షేర్ల డీమెటీరియలైజేషన్ ప్రక్రియ కేవలం 8,000 లిస్టెడ్ కంపెనీలకు మాత్రమే వర్తిస్తోంది. లక్షల సంఖ్యలో ఉన్న అన్లిస్టెడ్ సంస్థల షేర్లన్నీ ఎకాయెకిన డీమ్యాట్ చేయడం సాధ్యపడదు కాబట్టి ముందుగా పబ్లిక్ కంపెనీలతో మొదలుపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సదరు సంస్థల్లో 5.5–6 కోట్ల మంది పైచిలుకు వాటాదారులపై ఇది ప్రభావం చూపొచ్చని అంచనా. సిసలైన లబ్ధిదారుల గుర్తింపు .. డొల్ల కంపెనీల్లో చాలా మటుకు యాజమాన్య వాటాలు బినామీల పేర్లమీదే ఉంటున్నాయని పసిగట్టిన ప్రభుత్వం.. అసలు యజమానులను కూడా గుర్తించేందుకు తగు నిబంధనల రూపకల్పనపైనా కసరత్తు చేస్తోంది. పది శాతం పైగా వాటాలున్న వారిని గణనీయంగా లబ్ధి పొందే యాజమాన్య అధికారాలున్న వారిగా వర్గీకరించాలని ప్రతిపాదించనుంది. అంతర్జాతీయ స్థాయిలో మనీలాండరింగ్పై పోరులో భాగంగా.. కంపెనీల చట్టంలో ఇప్పటికే కొత్తగా ఒక సెక్షన్ చేర్చడం జరిగింది. దీని ప్రకారం సిసలైన లబ్ధిదారులైన యజమానుల పేర్లతో ఆయా అన్లిస్టెడ్ సంస్థలు ప్రత్యేక రిజిస్టరు మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. కనీసం పాతిక శాతం లేదా ఆ పై స్థాయిలో వాటాలు ఉన్న వారిని ఈ కేటగిరీ కింద వర్గీకరించవచ్చంటూ కంపెనీల చట్టం చెబుతోంది. అయితే, బినామీలను గుర్తించే క్రమంలో.. మరింత మంది షేర్హోల్డర్లను కూడా ఈ కేటగిరీలోకి చేర్చేలా నిర్దేశిత వాటాల పరిమితిని పది శాతానికి కుదించాలని ఎంసీఏ భావిస్తున్నట్లు తెలుస్తోంది. విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం.. మొత్తం మీద ఈ కొత్త మార్పులన్నీ విదేశీ ఇన్వెస్టర్లపైనా ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇంకా అనుమతి లేని రంగాల్లో ఇన్వెస్ట్ చేసిన వారిపై అధిక ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నారు. నిర్దేశిత గడువులోగా షేర్లను డీమ్యాట్ చేయాలంటూ నిబంధనలు అమల్లోకి వచ్చిన వెంటనే .. అన్లిస్టెడ్ సంస్థల నుంచి ఒక్కసారిగా ఫైలింగ్స్ Ðð ల్లువెత్తనున్నాయి. కంపెనీల చట్టం కింద.. సిసలైన లబ్ధిదారుల వివరాలు వెల్లడించకపోయిన పక్షంలో రూ. 50,000 దాకా జరిమానాతో పాటు రోజువారీ రూ. 1,000 దాకా పెనాల్టీ కూడా వర్తిస్తుంది. అంతే కాకుండా, ఆయా కేసులపై విచారణ చేసేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం కూడా ఉంటుంది. -
అన్లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో లిస్ట్కావచ్చు
ముంబై: అన్లిస్టెడ్ కంపెనీలు సరాసరి విదేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అయ్యేందుకు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతించింది. తద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు అవకాశాలను కల్పించింది. అంతేకాకుండా విదేశీ రుణాలను చెల్లించేందుకు కూడా ఈ నిధులను వినియోగించుకునేందుకు దేశీయ అన్లిస్టెడ్ కంపెనీలకు వీలుచిక్కనుంది. ప్రభుత్వం గరిష్టస్థాయి కరెంట్ ఖాతాలోటుతో సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆర్బీఐ తాజా చర్యలకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఇంతవరకూ ఉన్న నిబంధనల ప్రకారం అన్లిస్టెడ్ కంపెనీలు విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్అయ్యేందుకు వీలులేదు. ఇందుకు ముందుగా దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్కావలసి ఉంటుంది. అయితే ఈ నిబంధనల తాజా సమీక్షలో భాగంగా ఆర్బీఐ విదేశాలలో ప్రత్యక్షంగా లిస్ట్అయ్యేందుకు అన్లిస్టెడ్ కంపెనీలను అనుమతిం చేందుకు నిర్ణయించింది. ఇందుకు వీలుగా విడుదల చేసిన నోటిఫికేషన్లో తొలి దశకింద రెండేళ్ల గడువును విధించింది. పరిశీలనార్థం ఈ గడువును విధించినట్లు ఆర్బీఐ తెలిపింది. అయితే సెబీతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్న ఐవోఎస్సీవో, ఎఫ్ఏటీఎఫ్ వంటి అంతర్జాతీయ ఆర్గనైజేషన్ల ద్వారా మాత్రమే లిస్టయ్యేందుకు కంపెనీలను అనుమతిస్తారు. కాగా, నిధులను సమీకరించాక విదేశాలలో వాటిని వినియోగించని పక్షంలో, వాటిని 15 రోజుల్లోగా దేశీయంగా వాణిజ్య బ్యాంకులలో జమ చేయాల్సి ఉంటుంది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- మాక్స్వెల్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
- జీతాలపై ప్రభావం.. ఎయిర్ఇండియా ఉద్యోగుల ఆందోళన!
- విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు
- ఒకపుడు జర్నలిస్టు, అంబానీని మించిన ఇంద్రభవనంలో : అత్యంత అందమైన రాణి
- ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
- ఈవెంట్లో ప్రియాంక చోప్రా.. వందల కోట్ల విలువైన నెక్లెస్తో!
- T20: బంగ్లాకు షాకిచ్చిన పసికూన.. మినీ టీమిండియా అంటూ..
- చనుగొండ్లలో చిరుత పిల్లల సంచారం.. భయాందోళనలో గ్రామస్తులు
- ఇజ్రాయెల్ హెచ్చరిక.. రాయబారులు వెనక్కి రండి
- నేమ్ప్లేట్ మార్చేసిన సూపర్ మామ్ సానియా మీర్జా ఫోటోలు వైరల్
Advertisement