ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
ఆసిఫాబాద్అర్బన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలోని సందీప్నగర్ గోండుగూడాలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సతీశ్ తెలి పిన వివరాల ప్రకారం.. కాలనీలో నివాసముంటున్న క్రుసంగే సాయికుమార్ (21) కొంతకాలంగా ఏ పనీ చేయకుండా మ ద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. ఇదే క్ర మంలో మంగళవారం రాత్రి తాగి వచ్చిన సాయికుమార్ను అతడి తల్లి గంగుబాయి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన సాయికుమార్ ఇంట్లోని దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
హత్య కేసులో ఒకరి రిమాండ్
కాగజ్నగర్ రూరల్: కాగజ్నగర్ మండలం గన్నారం గ్రామానికి చెందిన గుర్లె చంద్రశేఖర్ను హత్య చేసిన కేసులో అదే గ్రామానికి చెందిన గుర్లె సురేశ్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఈజ్గాం ఎస్సై రామన్కుమార్ తెలిపారు. తాగిన మైకంలో చంద్రశేఖర్ తలపై సురేశ్ ఇటుకతో బాదడంతో తీవ్ర గాయాలపాలై చంద్రశేఖర్ మృతిచెందాడని పేర్కొన్నారు. విచారణ చేపట్టి సురేశ్ను అరెస్ట్ చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment