● మా వల్లే లాభాల వాటా ● ఏఐటీయూసీ అధ్యక్షుడు సీతారామయ్య
శ్రీరాంపూర్: సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిందని, ఇది సరికాదని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం ఆయన నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. అధికారులను సైతం బెదిరిస్తూ తమకు నచ్చిన విధంగా పనిచేయాలని, లేదంటే బదిలీ చేయిస్తున్నారని తెలిపారు. ఇటీవల డైరెక్టర్(పా) యన్వీకే శ్రీనివాస్ ఉదంతమే ఇందుకు నిదర్శనం అన్నారు. నేడు 33శాతం లాభాల వాటా తమ కృషి ఫలితమేనని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మొదటిసారి లాభాల వాటా ఇప్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కే.వీరభద్రయ్య, ఎం.సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీసైదా, నాయకులు కొమురయ్య, మారుపల్లి సారయ్య, సంఘం సదానందం, అఫ్రోజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment