Mancherial District Latest News
-
టైర్ పేలి లారీబోల్తా
గుడిహత్నూర్: లారీ టైర్ పేలి బోల్తాపడిన ఘటన మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలు.. తమిళనాడులోని నమక్కల్ జిల్లాకు చెందిన లారీ దుస్తుల లోడ్తో వెళ్తోంది. మార్గమధ్యలో ఒక్కసారిగా టైరు పేలి పక్కనే నిలిచి ఉన్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టి అండర్మ్యాన్ పాస్ వద్ద రోడ్డుపై పడింది. దీంతో క్యాబిన్ నుజ్జునుజ్జుయింది. అటు నుంచి వెళ్తున్న పలువురు, ఎన్పీడీసీఎల్ హెల్పర్ హన్మంతు, మధ్యప్రదేశ్కు చెందిన దుస్తుల వ్యాపారి వేర్వేరు బైక్లపై వస్తున్నారు. దుస్తుల వ్యాపారి బైక్పై పైనుంచి టైర్లు పడడంతో వాహనం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన క్షణంలో హెల్పర్ బైక్పై పడ్డ రివిట్మెంట్ బండలతో వాహనం దెబ్బతింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నుజ్జునుజ్జుయిన క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ మురుగేశన్ (49) బయటకు తీయించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. తప్పిన పెను ప్రమాదం ఈ ఘటన శుక్రవారం జరిగి ఉంటే పెను ప్రమాదంగా మారేది. అంగడి బజార్ సంత వల్ల ఈ ప్రాంతమంతా కిక్కిరిసిన జనాలతో ఉండేది. ఈ ప్ర మాదం జరిగి ఉంటే పదుల సంఖ్యలో మృతి చెందేవారు. జాతీయ రహదారి నిర్మాణంలో జరిగిన లోపాల వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రహదారిపై నిత్యావసరాల కోసం లారీలను నిలపడం సైతం ఒక కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుడిహత్నూర్లో ఘటన డ్రైవర్ మృతి -
యూనిఫాం.. కొత్త రూపం
● మార్పులు చేస్తూ ఆదేశాలు ● కుట్టు పని స్వయం సహాయక సంఘాలకే.. ● ప్రభుత్వ పాఠశాలల్లో 45,807 మంది బాలబాలికలుమంచిర్యాలఅర్బన్: వచ్చే విద్యాసంవత్సరంలో ప్ర భుత్వ పాఠశాలలు ప్రారంభించే నాటికే విద్యార్థుల కు యూనిఫాం అందించేందుకు విద్యాశాఖ కసర త్తు చేస్తోంది. 2025–26 విద్యాసంవత్సరం పాఠశాలల విద్యార్థులకు సంబంధించిన యూనిఫాం డిజై న్లు మార్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బాలబాలికలకు వేర్వేరు డిజైన్లలో దుస్తులు కుట్టించి అందించనున్నారు. చొక్కాలు, లాంగ్ఫ్రాక్లకు పట్టీలు, భుజ పట్టీలపైన కప్స్, ప్యాచ్వర్క్స్ లేకుండా సాధారణ యూనిఫాంలను డిజైన్గా మార్చారు. కుట్టుపని బాధ్యతలను స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)కు అప్పగించనున్నారు. సకాలంలో ముడివస్త్రం వస్తేనే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రతియేటా ఏదో కారణంగా విద్యార్థులకు సకాలంలో అందకుండా పోతున్నాయి. హైదరాబాద్ నుంచి జిల్లాకు వస్త్రం సరఫరా నుంచి కుట్టడం వరకు ఆలస్యం అవుతున్నాయి. మహిళా పొదుపు సంఘం సభ్యులకు దుస్తులు కుట్టించే బాధ్యతలు అప్పగించారు. అప్పట్లో ముడిసరుకు సరఫరాలో ఆలస్యం, సమయం తక్కువగా ఉండడం, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల దుస్తులు కుట్టడంలో జాప్యం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పొదుపు మహిళా సంఘాలకు అప్పగించారు. ముడివస్త్రం అరకొరగా రావడమో ఏమోగానీ విద్యార్థులకు అందించే రెండు జతల్లో ఒక జత బడి తెరిచే నాటికి విద్యార్థులకు అందించినప్పటికీ రెండో జత అందించడంలో జాప్యం జరిగింది. ఈ ఏడాదైనా ముడివస్త్రం వస్తేనే విద్యార్థులకు రెండు జతలు అందే వీలుంటుంది. మారిన దుస్తుల ఆకృతి వచ్చే విద్యాసంవత్సరం(2025–26)లో పిల్లలకు అందించే దుస్తుల ఆకృతిలో మార్పులు చేశారు. గతేడాది దుస్తుల ఆకృతిని బాలబాలికలకు తరగతుల వారీగా మూడు రకాలుగా, బాలురకు రెండు రకాలుగా విభజించారు. దుస్తుల ఆకృతితో ప్రభుత్వం చెల్లించే ధరలు గిట్టుబాటు ధర కాకపోవడం.. సమయం ఎక్కువగా తీసుకోవడంతో ప్రభుత్వం డిజైన్లు మార్పులు చేసింది. బాలికలకు ఒకటి నుంచి 3వ తరగతి వరకు లాంగ్ఫ్రాక్ చొక్కా, 4నుంచి 5వ తరగతి వరకు షర్టు స్కట్, 6నుంచి 12వ తరగతి పంజాబీ(టాప్, బాటమ్) చున్నీ లేకుండా, బాలురకు 1నుంచి 7వ తరగతి వరకు చొక్కా లాగు, 8నుంచి 12వ తరగతి వరకు చొక్కా, ప్యాంటు సాధారణ డిజైన్లు చేశారు. ఇదివరకు చొక్కాలు, లాంగ్ ఫ్రాక్లకు పట్టీలు, భుజాలపైన కప్స్ వంటి ప్యాచ్ వర్క్లతో సమయం సరిపోకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కొన్ని పాఠశాలల్లో జేబులు ఊడిపోవడం.. పట్టీలు తెగిపోవడం.. దారం పోగులు లేచి అసౌకర్యంగా మారాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి సాధారణ డిజైన్గా మార్చడంతో కుట్టేందుకు సరళంగా ఉండడంతోపాటు మహిళలకు పని సులభతరం కానుందని మంచిర్యాల డీఈవో యాదయ్య తెలిపారు. యూనిఫాంలు అందించే విద్యార్థుల వివరాలుపాఠశాలలు 778 బాలురు 22,058 బాలికలు 23,749 మొత్తం విద్యార్థులు 45,807 మండలాల వారీగా...మండలం విద్యార్థుల సంఖ్య..బెల్లంపల్లి 4,708 భీమిని 1,302 భీమారం 978 చెన్నూర్ 2,848 దండేపల్లి 3,241 హాజీపూర్ 1,900 జైపూర్ 2,094 జన్నారం 4,048 కన్నెపల్లి 1,652 కాసిపేట 2,347 కోటపల్లి 2,587 లక్సెట్టిపేట 2,986 మంచిర్యాల 4,927 మందమర్రి 3,418 నస్పూర్ 1,399 నెన్నెల 1,924 తాండూర్ 2,154 వేమనపల్లి 1,299 -
కార్మికుల సమస్యల పరిష్కారానికి ఏఐటీయూసీ కృషి
కాసిపేట: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కా రం, హక్కుల సాధనకు గుర్తింపు సంఘంగా ఏఐటీయూసీ కృషి చేస్తుందని సంఘం బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి దాగం మల్లేష్ తెలిపారు. మందమర్రి ఏరియా కాసిపేట 1గనిపై శనివారం గేట్ మీటింగ్ నిర్వహించారు. గుర్తింపుసంఘం ఏఐటీయూసీ, సీఅండ్ఎండీతో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలోని అంశాలను వివరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గని ఫిట్ కార్యదర్శి మినుగు లక్ష్మీనారాయణ, ఏఐటీయూసీ నాయకులు తదితరులున్నారు. బెల్లంపల్లి: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో తమ సంఘం ముందంజలో ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు అన్నారు. మందమర్రి ఏరియా శాంతిఖని గనిపై శనివారం జరిగిన గేట్ మీటింగ్లో నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 7న హైదరాబాద్లో సింగరేణి యాజమాన్యంతో జరిగిన స్ట్రక్చరల్ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు తీవ్రంగా చర్చించి 14డిమాండ్లకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడటానికి ఎర్రజెండా యూనియన్ ఎంతటి పోరాటాలకై న ముందుంటుందని ప్రకటించారు. సమావేశంలో శాంతిఖని గని ఏఐటీయూసీ ఫిట్ సెక్రెటరి మంతెన రమేష్, నాయకులు పి.రాజలింగు, మిట్టపల్లి రమేష్, ఆర్.ప్రవీణ్, దాడి రమేష్, సంతోష్కుమార్, రామకృష్ణ, ఫకృడా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
వారబందీ.. ఇబ్బంది!
● సాగునీటి కోసం రోడ్డెక్కిన అన్నదాతలు ● నాలుగు తడుల్లో రెండు తడులే అందాయి.. ● పంటలు ఎండిపోతున్నాయంటూ ఆవేదనదండేపల్లి: కడెం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటలకు వారబందీ పద్ధతిలో అందించే సా గునీరు సక్రమంగా అందడం లేదంటూ మండలంలోని నాగసముద్రం మూలమలుపు వద్ద కడెం ఆయకట్టు పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ–22, 23, 24 కాలువల ఆయక ట్టు రైతులు శనివారం రాస్తారోకో చేశారు. తాళ్లపే ట, నాగసముద్రం, మాకులపేట గ్రామాల రైతులు పలువురు మాట్లాడుతూ కడెం ప్రాజెక్టు నీటిని వారబందీ పద్ధతిలో డిస్ట్రిబ్యూటరీ–28 వరకు అందిస్తామని చెప్పారని, మొక్కజొన్న, వరి తదితర పంటలు సాగు చేసుకున్నామని తెలి పారు. ఇటివరకు నాలుగు తడులు వచ్చాయ ని, ఇందులో రెండు మాత్ర మే సక్రమంగా ఇ చ్చారని, మూడో తడి నుంచి కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదో తడి రావాల్సి ఉన్నా ఇంతవరకు రాలేదని తెలిపారు. నాలుగో తడి సక్రమంగా అందలేదని పది రోజుల క్రితం ప్రధాన కాలువలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. అయినా అధికారులు ఐదో తడి విషయంలో నిర్లక్ష్యం చేయడంతో రోడ్డెక్కారు. అధికారులు సాగునీరందిస్తామని హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. ఎస్సై తహసీనొద్దీన్ సంఘటన స్థలానికి చేరుకుని, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. -
ఇస్రో పిలుస్తోంది!
● అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన ● తొమ్మిదో తరగతి విద్యార్థులకు అవకాశం ● యువికా కార్యక్రమానికి 23వ తేదీ తుది గడువు మంచిర్యాలఅర్బన్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో) ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా ఏటా ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా)–25 పేరిట నిర్వహిస్తోంది. మే 19 నుంచి 30 ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ ఏడా ది దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి విద్యార్థులను ఆ హ్వానిస్తోంది. మార్చి 23 తేదీలోపు www. isro. gov. in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు వడపోత అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న వారి జాబితా విడుదల చేస్తారు. తర్వాత 14 రో జులపాటు అవగాహన తరగతులు నిర్వహిస్తారు. ఎంపిక ఇలా.. ఆయా పాఠశాలలో ప్రస్తుతం మార్చి 1, 2025 నాటికి తొమ్మిదో తరగతి చదువుతూ ఉండాలి. విద్యతోపాటు సహపాఠ్యంశాలపై మంచి పట్టు ఉండాలి. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పెస్, సైన్స్క్లబ్లో ఉంటే 5 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ స్వ్కాట్ అండ్ గౌడ్ విభాగంలో 5 శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం ఇస్తారు. ఎంపికై న విద్యార్థులకు..ఇస్రో నిర్వహిస్తున్న యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం భోజనం, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తోంది. వారికి మే నెలలో 14 రోజుల పాటు ఇస్రో స్పెస్ సెంటర్లకు తీ సుకెళ్తారు. అక్కడ స్పెస్కు సంబంధించి విశేషాలు, సప్తగ్రహ కూటమి, తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో ముఖాముఖీగా మాట్లాడే అవకాశం విద్యార్థులకు ఉంటుంది. ఏడు కేంద్రాల్లో నిర్వహణఇస్రో ఈకార్యక్రమాన్ని దేశంలో ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ) తిరువనంతపురం, యూఆర్ఎస్ (ఎన్ఆర్ఎస్సీ) బెంగుళూరు, స్పేస్ ఆఫ్లికేషన్ సెంటర్ (ఎస్ఏసీ) ఆహ్మదాబాద్, నేషనల్ రిమోట్ సె న్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) హైదరాబాద్, ఈశన్యస్పెస్ ఆఫ్లికేషన్ సెంటర్(ఎన్ఈ–ఎస్ఏసీ) శి ల్లాంగ్, ఎస్డీఎస్సీ శ్రీహరికోట, ఐఐఆర్ఎస్ డెహ్రడూన్లో అవగాహన తరగతులు నిర్వహిస్తోంది. విద్యార్థులకు అవకాశం యువికా ద్వారా విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తోంది. 150 మందికి అవగాహన తరగతులు నిర్వహిస్తారు. నిపుణులు, శాస్త్రవేత్తలతో అంతరిక్ష విజ్ఞానంపై బృందచర్చ, ప్రాక్టికల్ ఫీడ్ బ్యాక్ తరగతులు చూపిస్తారు. ఆయా ప ట్టణాల్లో ఇస్రో ప్రయోగ కేంద్రాలు, ప్రయోగశాలలను చూపిస్తారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబును సంప్రదించాలి. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
ఎమ్మెల్సీ దక్కేనా..!
● ఎమ్మెల్యే కోటా కాంగ్రెస్ అభ్యర్థిత్వంపై ఆశలు ● రేఖానాయక్, నరేశ్జాదవ్ ప్రయత్నాలు ● ఒకటి ఎస్టీకి కేటాయిస్తారనే ప్రచారం ● అధిష్ఠాన నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి సాక్షి, ఆదిలాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే విషయంలో రాష్ట్రంలో అందరూ ఆసక్తిగా గమనిస్తుండగా, అందులో ఒకటి ఎస్టీ సామాజికవర్గానికి కేటా యిస్తామని పార్టీ చెబుతుందని ప్రచారం జరుగుతు ండటం ఆసక్తి కలిగిస్తోంది. ఈ నేఫథ్యంలో ఆదిలా బాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇద్దరు నే తలు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సీనియ ర్ నాయకుడు నరేశ్ జాదవ్ పదవీని ఆశిస్తున్నారు. ఈ నేఫథ్యంలో ఈ ఇద్దరిలో ఎవరికై న దక్కుతుందా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. ఆదివారం పార్టీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుండగా ఎవరికి దక్కుతుందని పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా కాంగ్రెస్కు నాలుగు స్థానాలు దక్కే అవకాశం ఉండటంతో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక స్థానాన్ని ఎస్టీ నుంచి భర్తీ చేసే యోచనలో పార్టీ ఉందని ప్రచారం నడుస్తోంది. అందులో మహిళగా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ను పార్టీ పరిశీలన చేస్తుందనే ప్రచారం లేకపోలేదు. మహిళా అభ్యర్థుల పరంగా రాష్ట్రంలో విజయశాంతితోపాటు రేఖానాయక్లో ఎవరికై న ఇవ్వవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజికవర్గంలో రేఖానాయక్ను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే విధంగా ఏళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని ఏఐసీసీ సభ్యుడు డా.నరేశ్జాదవ్ కోరుతున్నాడు. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులను కలిసి తన ప్రాతినిధ్యం పరిశీలించాలని కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ ఇద్దరి నేతల్లో ఎవరినైన ఆదరిస్తుందా అనేది ఎదురుచూడాల్సిందే. లంబడాలు ప్రాతినిధ్యం కల్పించలేదనే.. ఉత్తర తెలంగాణ పరిధిలో గతంలో కాంగ్రెస్ని ఆదరించిన లంబడాలు క్రమంగా బీజేపీ వైపు వెళ్తున్నారని, ప్రధానంగా వారికి ప్రాతినిధ్యం కల్పించకపోవడంతోనే ఈ పరిస్థితి ఉందని ఆ పార్టీకి చెందిన ఆ సామాజికవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి పరిస్థితిలో మార్పు రాకపోతే పూర్తిగా దూరమవుతారని పార్టీకి హెచ్చరిస్తున్నారు. ఉత్తర తెలంగాణ నుంచి ఎస్టీ కోటాలో లంబడాల నేతలను ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థిగా ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇటు రేఖానాయక్, అటు నరేశ్జాదవ్ రాష్ట్ర ముఖ్య నేతలను కలుస్తూ ఎమ్మెల్సీ కేటాయించాలని కోరుతున్నారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాల్సిందే. పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితుల నేఫథ్యంలో.. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే ఒకరు మాత్రమే ఉన్నారు. మిగతా స్థానాల్లో నాలుగింటిలో బీజేపీ, రెండింటిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటంతో ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో హస్తం పార్టీకి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలు కాంగ్రెస్లో చేరగా, ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో ఫలితాలు లభించలేదన్న ప్రచారం లేకపోలేదు. అప్పట్లో పార్టీ పరంగా అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీచేసి ఓడిపోయిన వారే మిగతా నియోజకవర్గాల్లో ఇన్చార్జీలుగా ఉన్నారు. అధికారంలో ఉండటంతో సులువుగా పార్లమెంట్ స్థానాన్ని సాధిస్తామని అనుకున్నప్పటికి ఫలితం తారుమారైంది. ఈ స్థానంలో కమలం పార్టీ గెలుపొందడం కాంగ్రెస్ శ్రేణులకు నిరాశను కలిగించింది. తాజాగా పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీలో కాషాయం పార్టీకే ఆదరణ లభించింది. ఇలాంటి పరిస్థితిలో పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీకి జవజీవసత్వాలు కలిగించేందుకు పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదీ కార్యకర్తలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎమ్యెల్యే కోటా ఎమ్యెల్సీల్లో ఇక్కడి నేతలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. -
రక్తహీనతతో బాలింత మృతి
ఉట్నూర్రూరల్: ఓ వైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో నెల రోజుల బాలింత రక్తహీనతతో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ఉడుంపూర్ గ్రామానికి చెందిన భగవంత్రావు– శ్రీవిద్య దంపతులు ఉపాధి నిమిత్తం ఉట్నూర్ మండలం లక్కారం గ్రామానికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్రీవిద్య నెలక్రితం రిమ్స్లో పాపకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో రక్తహీనతతో బాధపడగా చికిత్స అనంతరం ఆమెను ఇటీవల ఇంటికి పంపారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున ఆరోగ్యం క్షీణించి లక్కారంలో మృతి చెందింది. తల్లి మృతి అనంతరం పసికందు గుక్కపెట్టి ఏడుస్తున్న హృదయవిదారక దృశ్యం పలువురిని కంటతడి పెట్టించింది. బాలింత మృతి విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పసికందుకు పాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు. అంతర్రాష్ట్ర చైన్స్నాచర్ల అరెస్టుఖలీల్వాడి: నిజామాబాద్, నిర్మల్, ఆదిలా బాద్ జిల్లాల్లో చైన్స్నాచింగ్, బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు ఏసీపీ రాజా వెంకట్రెడ్డి తెలి పారు. నిజామాబాద్లోని తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గతేడాది డి సెంబర్ 12న బోర్గాం(పి)కి చెందిన దుమాల లక్ష్మిబాయి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు బైక్పై వచ్చి చైన్స్నాచింగ్కు పాల్పడినట్లు చె ప్పారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసినట్లు తెలిపారు. నాల్గో టౌన్ ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలోని బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టిందన్నారు. మహారాష్ట్రలోని ధ ర్మాబాద్కు చెందిన షేక్ ఇమాన్ అలియాస్ అ బ్బు, షేక్ అర్బాజ్ అలియాస్ మాయా నిర్మల్ జిల్లా బాసరలోని శారదానగర్లో నివసిస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకొని మూడు గొలుసులు, బైక్ను స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించామన్నారు. నిందితులపై నాల్గో టౌన్ పీఎస్, మాక్లూర్, నిర్మల్ జిల్లా బాసరలో చైన్ స్నాచింగ్లు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బైక్ల చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇదిలా ఉండగా నాందేడ్ జిల్లాకు చెందిన మరో నిందితుడు అమన్ అలియాస్ అమన్పటేల్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ చెప్పారు. -
● ఆదిలాబాద్, మంచిర్యాలలో కొత్తగా డిస్పెన్సరీలు ● అందుబాటులోకి వైద్యం ● కార్మిక కుటుంబాలకు ఉచితంగా సేవలు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలకు వైద్యం చేరువ చేసేందుకు ఈఎస్ఐ(కార్మిక రాజ్య బీమా సంస్థ) కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరో రెండు డిస్పెన్సరీల ఏర్పాటుకు నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18డిస్పెన్సరీలు ఏర్పాటు చేస్తుండగా ఇందులో ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెండు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్ పట్టణం శాంతినగర్లో, మంచిర్యాల పట్టణం ఏసీసీ కాలనీలో ఈఎస్ఐ డిస్పెన్సరీలు ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో ఈఎస్ఐ ఆసుపత్రి ఉంది. నిర్మల్లో బీడీ కార్మికులకు ప్రత్యేకంగా మరొకటి ఉంది. ఉమ్మడి జిల్లాలో సిమెంట్ పరిశ్రమలు, మట్టి, స్పిన్నింగ్, పేపర్ మిల్లు తదితర కార్మిక వర్గాలు ఎక్కువగా ఉన్న చోట్ల ఈఎస్ఐ ఆధ్వర్యంలో కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి. ఈ డిస్పెన్సరీ, ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఖాళీలతో అరకొర వైద్యమే అందుతోంది. అంతేగాక సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే అసౌకర్యాల మధ్య సేవలందిస్తున్నాయి. ఇటీవల మంచిర్యాల కలెక్టరేట్ సమీపంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ నిర్మాణం కోసం భూమి కేటాయించారు. కొత్తగా ఆదిలాబాద్ పట్టణం, మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఆవరణలో కొత్త డిస్పెన్సరీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో సేవలు మెరుగవుతాయనే ఆశలు నెలకొన్నాయి. కార్డు ఉంటే.. ప్రైవేటు రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు చాలీచా లని జీతాలతో తమ కుటుంబాల వైద్య ఖర్చులకే రూ.లక్షల్లో వెచ్చించాల్సి వస్తోంది. నెలకు రూ. 21వేల లోపు వేతనం పొందుతున్న ప్రతీ కార్మికుడు లేదా ఉద్యోగి ఈఎస్ఐకి అర్హులు. దివ్యాంగ ఉద్యోగులైతే రూ.25వేల వరకు అవకాశం ఉంది. ఈఎస్ఐ కార్డుతో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. స్థానికంగా వైద్య పరీక్షలు చేయించుకుని సిఫారసుతో హైదరాబాద్తోపాటు దేశంలో ఎక్కడైనా ఈఎస్ఐ పెద్ద ఆసుపత్రిల్లో ఖరీదైన వై ద్యం సైతం ఉచితంగా పొందవచ్చు. అలాగే ఈఎస్ ఐ చెల్లిస్తున్న కార్మికులకు పని ప్రదేశాల్లో గాయపడిన, ఇతర ప్రమాదం ఏదైనా జరిగితే వేతనంతో కూడిన సెలవు, వైద్య ఖర్చులు పొందే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది ఈఎస్ఐని ఉపయోగించుకోవడం లేదు. ఇక కొన్ని సంస్థలు తమ పరిధిలో పని చేస్తున్న కార్మికులకు కనీసం ఈఎస్ఐ కూడా చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నాయి. ప్రై వేటు ఉద్యోగులు తప్పనిసరిగా ప్రతీ నెలా ఈఎస్ఐ చెల్లించేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.అవగాహన లేక సేవలకు దూరంఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఆయా రంగా ల్లో పని చేస్తున్నారు. ప్రైవేటు విద్య, వైద్యారోగ్య సంస్థలు, మున్సిపల్, కార్పొరేషన్ సిబ్బంది, రవాణా, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు, బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్, హోటల్స్, రెస్ట్రారెంట్స్, సినిమా థియేటర్లు, తదితర చోట్ల కనీసం పది మంది పని చేసే చోట ఆయా యాజమాన్యాలు ఈఎస్ఐ పరిధిలోకి రావాల్సి ఉంది. అయితే చాలా చోట్ల ఇవేమి అమలు కావడం లేదు. దీంతో అనేక మంది కార్మికులు తమ కష్టార్జీతం వైద్యారోగ్య సేవలకే వెచ్చించాల్సి వస్తోంది. అయితే చాలామంది ఈ సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకే వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలో కార్మికులకు విస్తృతంగా ప్రచారం కల్పించి అర్హులు సేవలు పొందేలా చూడాల్సిన అవసరం ఉంది. -
కుటుంబంలో మహిళల పాత్ర కీలకం
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాలఅగ్రికల్చర్: కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వరకు అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో డీసీపీ ఏ.భాస్కర్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ఖాన్లతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మా ట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు సా మాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతోపాటు ముఖ్య మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎ యిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా రాణిస్తున్నారని, ప్ర తీ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. లింగ భేదం లేకుండా అబ్బాయిలు, అమ్మాయిలను ఒకేలా చూస్తూ సమాన అవకా శాలు కల్పించాలని అన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికా రులు, ఉద్యోగులను ప్రశంసాపత్రాలు, శాలు వాలతో సత్కరించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. -
ఖానాపూర్ అడవిలో కార్చిచ్చు
ఖానాపూర్: మండలంలోని సత్తన్పల్లి, అడవి సారంగాపూర్ తదితర గ్రామాల శివారులోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చుతో దగ్ధమవుతోంది. పలుచోట్ల భారీ వృక్షాలు, కలప దుంగలు కాలిబూడిదవుతున్నాయి. వేసవి ప్రారంభానికి ముందే పలుచోట్ల మంటలు రాజేసుకున్న సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మంటలకు విలువైన టేకు కలప వృక్షాలు దగ్ధంతో ప్రభుత్వానికి తీరని నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల ప్లాంటేషన్లకు నష్టం జరిగే అవకాశం ఉంది. జంతువుల మనుగడకు సైతం కార్చిచ్చుతో ముప్పు వాటిల్లే అవకాశం నెలకొంది. రోడ్డు పక్కనే పరిస్థితి ఇలా ఉంటే, అడవి ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అనే విషయం చర్చనీయాంశంగా మారింది. అడవిలో రాలిన ఆకును శుభ్రపర్చే సిబ్బంది ఉన్న నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై ఎఫ్ఆర్వో కిరణ్ను వివరణ కోరగా, సిబ్బందితో ఎప్పటికప్పుడు మంటలార్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
నర్సాపూర్(జి): అప్పుల బాధతో రైతు ఉరేసుకుని ఆ త్మహత్యకు పాల్ప డ్డాడు. మండలంలో ని గొల్లమాడలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ఎండీ.జలాలుద్దీన్ కథనం ప్రకారం.. గ్రా మానికి చెందిన రైతు నీరటి గంగాధర్ (44) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. గత రెండేళ్లుగా పంట సాగుచేస్తున్నాడు. సరైన దిగుబడి రాలేదు. పంట పె ట్టుబడి కోసం ఇతరుల వద్ద రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. తిరిగి చెల్లిస్తాననో లే దో అని మనస్తాపం చెంది శనివారం గ్రామ శివారులోని వేపచెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య సవిత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. -
● పంట రక్షణకు వెళ్లి..విద్యుత్ తీగలకు తగిలి రైతు మృతి
కంచె ప్రాణం తీసింది●తానూరు: విద్యుత్ కంచె ఓ రైతు ప్రాణం తీసింది. అడవి జంతువుల బారి నుంచి పంట రక్షణ కోసం వెళ్లి కరెంట్ తీగలకు తగిలి మృతిచెందాడు. మండలంలోని మహలింగి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏఎస్సై శ్యాముల్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తురాఠి గంగాధర్ (60) వ్యవసాయం చేస్తుంటాడు. అడవి జంతువుల బారి నుంచి పంటను రక్షించేందుకు విద్యుత్ కంచె తీగలు ఏర్పాటు చేసుకున్నాడు. శుక్రవారం చేనులో పంట రక్షణ కోసం వెళ్తున్నానని కుటుంబీకులకు చెప్పి బయల్దేరాడు. రాత్రి ఇంటికి తిరిగిరాలేదు. శనివారం ఉదయం వారు చేనులో వెళ్లి చూసేసరికి విద్యుత్ కంచె తీగలకు తగలి విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భార్య గంగామణి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. -
బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు నస్పూర్: జిల్లాలోని బాలల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. పట్టణ పరిధిలో నూతన బాలసదనం భవన నిర్మాణానికి ఆయన కలెక్టర్ కుమార్దీపక్, డీసీపీ భాస్కర్లతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మిషన్ వాత్సల్య నిధులు రూ.1.34కోట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. వంద రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలు, పిల్లల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్శాఖ ఈఈ పి.రామ్మోహన్రావు, డీఈ రాజ్కుమార్, ఈఈ కుర్షిద్ అన్వర్, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి మంచిర్యాలటౌన్: ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరిట మహిళా దినోత్సవం కానుకగా చేపడుతున్న కార్యక్రమాలతో మహిళల సంక్షేమానికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నా రు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రజాప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. -
షార్ట్ సర్క్యూట్తో మూడిళ్లు దగ్ధం
ఆసిఫాబాద్రూరల్: మండలంలోని ఆడదస్నాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి షార్ట్ సర్క్యూట్తో మూడిళ్లు దగ్ధమైంది. ఇంట్లో నిత్యావసరాలు, వస్తువులు కాలి బూడిదయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన ధరవత్ బలరాం, నాందేవ్ జమిందార్ ఇళ్లపై నుంచి విద్యుత్ వైర్లు ఉండగా రాత్రి సమయంలో గాలికి ఒకదానికి ఒకటి తగిలి మంటలు చెలరేగాయి. ఇంటి సమీపంలో గడ్డి వాముపై నిప్పు పడటంతో ఇళ్లకు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో ఓ ఎద్దు మృతిచెందింది. రెండు ఎడ్లకు గాయాలయ్యాయి. సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ హైమద్ శనివారం దగ్ధమైన ఇళ్లను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
శ్రామిక మహిళల రక్షణలో ప్రభుత్వాలు విఫలం
● ఐఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి కామిల్ల జయరావు మంచిర్యాలరూరల్(హాజీపూర్): శ్రామిక మహిళలకు రక్షణ కలిపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఐఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి కామిల్ల జయరావు అన్నారు. శనివారం అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐఆర్టీయూ, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం హాజీపూర్ మండలం ముల్కల్ల ఇటుక బట్టీల వద్ద మహిళా కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి, ఇటుక బట్టీ కార్మికులు లక్ష్మీ, మదునక్క, పద్మ, వెంకటమ్మ, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నగదు దొంగిలించిన వ్యక్తి అరెస్టు
సోన్: నగదు దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసి, సొమ్ము రికవరీ చేసినట్లు ఏఎస్పీ రాజేష్ మీనా తెలిపారు. జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన సాకట్ యాదవ్ గత 12 ఏళ్లుగా సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామానికి చెందిన సౌమ్య ఫెర్టిలైజర్ షాప్లో పనిచేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో షెటర్ తాళం పగులగొట్టి కౌంటర్లో రూ.96 వేలు దొంగతనం చేశాడు. శనివారం ఉదయం యజమాని గోల దయాసాగర్ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఐదు గంటల్లో కేసును ఛేదించారు. దొంగను పట్టుకుని సొమ్మును రికవరీ చేశారు. కేసు ఛేదించిన సోన్ సీఐ నవీన్ కుమార్, ఎస్సైలు గోపి, శ్రీకాంత్, సిబ్బంది భీమన్న, ముజమిద్ను ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. -
మహిళా శక్తి మహోన్నతమైన శక్తి
● డీసీపీ ఎగ్గడి భాస్కర్ ● ఘనంగా మహిళా దినోత్సవం మంచిర్యాలక్రైం: మహిళా శక్తి మహోన్నతమైన శక్తి అని మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ అ న్నారు. శనివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక డీసీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడు తూ శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పో లీస్ల పాత్ర కీలకమని కొనియాడరు. పురుష పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తించ డం అభినందనీయమని అన్నారు. అనంతరం మహిళా పోలీస్ అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏ సీపీ ఆర్.ప్రకాష్, సీఐలు ప్రమోద్రావు, కుమారస్వామి, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేష్కుమార్, షీ టీమ్ ఎస్సై హైమా, భరోసా, సఖీ సెంటర్ మహిళా సిబ్బంది పాల్గొన్నారు. -
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్ల అరెస్టు
● ఏడు బైక్లు స్వాధీనంఆదిలాబాద్టౌన్: జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేఽశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. నిర్మల్ కేంద్రంగా ఉండే ఇద్దరు మైనర్లు ఆరు నెలలకోసారి ఆదిలాబాద్కు వస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. బైక్లతోపాటు నేరడిగొండ, ఇచ్చోడ ఆలయాల్లోనూ చోరీలు చేశారు. శనివారం ఉదయం లాండసాంగ్వీ ఎక్స్రోడ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానస్పదంగా బైక్పై వెళ్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. విచారించగా ఏడు బైక్లను దొంగలించినట్లుగా అంగీకరించారు. వారి వద్ద ఉన్న రెండు బైక్లు, ఏరోడ్రమ్లో ఉంచిన మరో ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ తెలిపారు. గతంలో వీరిపై అనేక కేసులు నమోదై ఉన్నాయన్నారు. వీరితోపాటు పెన్చౌహాన్తో మరో మైనర్ బాలుడు కలిపి నలుగురు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. వన్టౌన్ పరిధిలో ఐదు, టూటౌన్, మావల స్టేషన్ల పరిధిలో ఒక్కో బైక్ను దొంగలించినట్లుగా ఆయన వెల్లడించారు. చాకచక్యంగా వీరిని పట్టుకున్న పోలీసులను ఆయన అభినందించారు. సమావేశంలో సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్రావు, ఫణీదర్, సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రత.. బాధ్యత..
● షీ టీమ్, సఖీ కేంద్రాల అభయహస్తం మంచిర్యాలక్రైం: మహిళల భద్రత, రక్షణే ధ్యేయంగా జిల్లాలో షీటీమ్, సఖీ కేంద్రాలు పని చేస్తున్నాయి. పని ప్రదేశాలు, విద్యాసంస్థలు, ఉద్యోగ స్థలాలు, ప్రయాణాల్లో ఎవరైన వేధించినా, ఇబ్బందులకు గురి చేయడం, మాయమాటలతో మోసం చేసిన ఘటనలు చోటు చేసుకున్న వెంటనే డయల్ 100కు సమాచారం అందిస్తే తక్షణమే భద్రత కల్పిస్తున్నాయి. సమస్య ఉన్న చోటుకే వెళ్లి అక్కడే పరిష్కారం చేస్తున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్, సఖీ కేంద్రాల సేవలపై ప్రత్యేక కథనం. మహిళలకు అండగా ఉంటాం..మహిళలు ఎలాంటి సమస్యల్లో ఉన్నా నిర్భయంగా ఫిర్యాదు చేస్తే అండగా ఉంటాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. న్యాయపరమైన సేవలు, వైద్య సేవలు అందిస్తాం. భార్యాభర్తలు, అత్తామామల వేధింపులకు గురైన వారికి అండగా నిలబడతాం. పోలీసుల సహకారంతో మహిళలకు భద్రత, రక్షణ కల్పిస్తాం. – శ్రీలత, సఖీ సెంటర్ నిర్వాహకురాలు షీ టీమ్ ఆపరేషన్ డెకాయ్...మహిళల రక్షణ కోసం పోలీసు శాఖలో 2015అక్టోబర్ 31న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో షీ టీమ్స్ ఏర్పడ్డాయి. ఆపరేషన్ డెకాయ్ పేరుతో కళాశాలలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో షీ టీమ్స్ మఫ్టీలో ఉంటూ స్పై కెమెరాలతో ఘటనలను చిత్రీకరిస్తాయి. అనుమానితులను అదుపులోకి కౌన్సెలింగ్ ఇస్తారు. 2024లో ఎనిమిది రెడ్హ్యాండెడ్ కేసుల్లో 21మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10మంది మేజర్లపై కేసులు నమోదు చేశారు. వేధింపులపై 100 డయల్కు ఫిర్యాదు చేస్తే మఫ్టీలో నిఘా వేస్తారు. అనుమానితులు, పోకిరీలను అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇవ్వడం, కేసు నమోదు చేయడం చేస్తారు. జిల్లాలో 2024 నుంచి ఫిబ్రవరి వరకు 96 హాట్స్పాట్లను గుర్తించి 1424 సార్లు సందర్శించారు. పరిసర ప్రాంతాల ప్రజలకు షీ టీమ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. షాడోలా ఉంటూ రక్షణ కల్పిస్తాం.. షీ టీమ్కు ఫిర్యాదు చేస్తే షాడోలా ఉంటూ రక్షణ కల్పిస్తాం. సోషల్మీడియా, ఆన్లైన్ స్నేహితులను నమ్మవద్దు. వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దు. ఫొటోలు మార్ఫింగ్ చేసి సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతారు. తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే స్పందించవద్దు. సైబర్ నేరాలపై 1930, వేధింపులపై 100డయల్, 6303923700 షీ టీమ్ వాట్సాప్ నంబర్కు సమాచారం ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నంబర్లు 112, 181, 1090, 1091 ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. – హైమా, షీ టీమ్ ఎస్సై, మంచిర్యాల -
● ఇళ్లలో స్వేచ్ఛ లభిస్తోంది.. ● బయట అనుమానపు చూపులు ● తెలియని వారితోనే సమస్యలు ● మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ సర్వే
మంచిర్యాలఅర్బన్/మంచిర్యాలటౌన్/చెన్నూర్/నిర్మల్/వాంకిడి/ఆసిఫాబాద్రూరల్/బోథ్: మహిళలు, యువతులు, విద్యార్థినులు అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. పురుషులకు దీటుగా పనులు చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. కానీ స మాజంలో అక్కడక్కడ మహిళలపై చిన్నచూపు ఉండడం వల్ల అనేక అవకాశాలకు దూరమవుతున్నారు. పని ప్రదేశాల్లో వేధింపులు, ఆధిపత్య ధోరణులు మహిళలకు ప్రతిబంధకంగా మారుతున్నా యి. ఎక్కడ.. ఎవరితో వివక్షకు గురవుతున్నారనే అంశాలపై ‘సాక్షి’ మంచిర్యాలలోని శ్రీహర్ష డిగ్రీ కళాశాలతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యార్థినులు, యువతులు, మ హిళలు 350మంది నుంచి సర్వే ద్వారా వివరాలు సేకరించింది. తెలియని వారు, ఆకతాయిలతో ఇక్కట్లు పడుతున్నట్లు తేల్చిచెప్పారు. బస్టాప్ల్లో అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వె ల్లడైంది. ఇళ్లలో ఆడ, మగ అనే వివక్ష లేదని, అభిప్రాయాలకు గౌరవం లభిస్తోందని స్పష్టమైంది. -
● బొగ్గు ఉత్పత్తిలోనూ మహిళల శ్రమ ● పురుషులకు సమంగా అతివలు ● భూగర్భంలోకి దిగుతున్న వైనం ● సింగరేణిలో పెరుగుతున్న ప్రాధాన్యత
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/శ్రీరాంపూర్: బొగ్గు గని అంటే చీకటి గుహ. మగవాళ్లకే పరిమితమైన విధులను మహిళలు సైతం చేసి చూపిస్తామని నిరూపిస్తున్నారు. ‘మీ రేం పని చేస్తారు’ అన్న ఎగతాళీ నోళ్లకు ముకుతాడు వేస్తూ మహిళలు తలచుకుంటే ఏ పనైనా చేయగలమని నిరూపించారు. కంపెనీలో కారుణ్య ఉద్యోగాల కారణంగా మహిళల సంఖ్య 1995 మందికి చేరింది. గత కొంతకాలంగా భూగర్భంలోనూ పని చేస్తున్నారు. కంపెనీలో పని చేస్తున్న మహిళలపై కథనం.. కోర్టు తీర్పుతో హక్కులు..బ్రిటీష్ కాలంలో పురుషులతోపాటు సమానంగా మహిళలు గనుల్లో పని చేసేవారు. ప్రమాదాలు నిత్యకృత్యంగా జరిగినా, తిండి లేక చావడం కంటే పిడికెడు మెతుకుల కోసం పనులకు వచ్చేవారు. ఎక్కువగా వితంతువులే ఈ పనులకు వెళ్లేవారు. దేశ స్వాతంత్య్రం వచ్చాక మహిళలను గనుల్లో తీసుకోవడం నిలిపివేశారు. ప్రమాదవశాత్తు గనుల్లో కార్మికులు చనిపోతే వారి స్థానంలో భార్యలకు ఉద్యోగం కల్పించే వారు. అది కూడా ఉపరితలంలోనే గుట్కాల షెడ్డులు, కార్యాలయాల్లో అటెండర్లుగా నియమించారు. మహిళలకు కూడా అవకాశాలు కల్పించాలనే ఓ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో మహిళలకు అవకాశాలు మెరుగయ్యాయి. అన్ని స్థాయిల్లో విధులు కారుణ్య కోటాలో మొదట జనరల్ మజ్దూర్(ఫిమేల్)గా నియమిస్తూ ఆఫీసులు, సివిల్ డిపార్టుమెంట్లలో తేలిక పాటి పనులకు తీసుకునే వారు. వీరి సంఖ్య పెరగడంతో ఓసీపీలు, వర్క్షాప్లు, స్టోర్స్, సీహెచ్పీలతోపాటు భూగర్భ గనుల్లో కూడా దిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఓసీపీల్లో హెమ్ సెక్షన్లో పురుషులతోపాటు వీరు సమానంగా యంత్రాలను మరమ్మతు చేస్తున్నారు. సీనియర్ మహిళా కార్మికులు సెక్యూరిటీ గార్డులుగా ఉన్నారు. జనరల్ మజ్దూర్, జూనియ ర్ అసిస్టెంట్, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ, సబ్ ఓవర్సీస్ ట్రైనీ, స్టాఫ్నర్స్, క్లే పిల్ మజ్దూర్, స్వీపర్ బదిలీ వర్కర్లతోపాటు ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అండర్ మేనేజర్లు, లా ఆఫీసర్స్ వంటి 27హోదాల్లో పని చేస్తున్నారు. -
బస్టాప్ల్లో ఇబ్బందే..!
చెప్పలేను 59ఉంది 87మీరు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ప్రదేశంలేదు 204సెల్ఫోన్లో వచ్చే మెస్సేజ్లతో 72మీ కాలేజీ, పని ప్రదేశంలో మహిళగా ఏమైనా వివక్ష ఎదుర్కొంటున్నారా..తెలిసిన వారే.. 146తెలియని వారు 204బస్టాప్లో 204కాలేజీ లేదా ఆఫీసులో 74 -
అడవి దివిటీలు
● అడవి రక్షణలో మహిళా అటవీ ఉద్యోగుల కీలకపాత్ర ● పురుషులతో సమానంగా విధుల నిర్వహణ ● మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనంజన్నారం: దట్టమైన అడవులు.. క్రూర జంతువుల అరుపులు.. కలప స్మగ్లర్లు.. వన్యప్రాణుల వేటగాళ్లు.. ఇవన్నీ చాలవన్నట్లు పోడు భూముల రక్షణ.. వీటన్నింటి మధ్య విధి నిర్వహణ కత్తిమీద సామే. అయినా అన్నీ దాటుకుంటూ అటవీ శాఖ మహిళా ఉద్యోగులు తామెంటో నిరూపించుకుంటున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ పురుషులతో సమానంగా ధైర్య సాహసాలతో విధులు నిర్వర్తిస్తూ అడవి దివిటీలుగా నిలుస్తున్నారు. కవ్వాల్ టైగర్జోన్లోని మంచిర్యాల జిల్లా అటవీశాఖ పరిధిలో 74మంది మహిళా ఉద్యోగులు వివిధ స్థాయిల్లో పని చేస్తున్నారు. జన్నారం అటవీ డివిజన్లో ఎనిమిది మంది రేంజ్, డీఆర్వో, బీట్ అధికారులు ఉన్నారు. 24 గంటలు విధుల్లో.. అటవీ శాఖ ఉద్యోగం అంటేనే 24గంటల విధి నిర్వహణ. మహిళా ఉద్యోగులు రాత్రివేళల్లో పని చేస్తారా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ తామేమి తక్కువ కాదని ని రూపిస్తున్నారు. జన్నారంఅటవీ రేంజ్లోని జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట అటవీ రేంజ్లలో మహిళా ఉద్యోగులు ఉదయమే అడవులకు వెళ్లి వన్యప్రాణుల కదలికలు, పులి పర్యవేక్షణ, స్మగ్లింగ్ తదితర అంశాలను పరిశీలిస్తారు. అధికారుల కళ్లుగప్పి కలప దాటిస్తున్న స్మగ్లర్ల ను పట్టుకోవడంలో ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. రాత్రిళ్లు పెట్రోలింగ్ మహిళా ఉద్యోగులు కలప స్మగ్లింగ్ నిరోధంలో భాగంగా ఒక్కోసారి వారి బీట్ పరిధిలో రాత్రివేళల్లోనూ ధైర్యంగా పెట్రోలింగ్ చేస్తుంటారు. చెక్పోస్టు డ్యూటీ, బీట్ పరిధిలో అభివృద్ధి పనులు, నీటి సౌకర్యం, గడ్డిక్షేత్రాల నిర్వహణ, పశువులు బీట్ పరిధిలో తిరగకుండా జాగ్రత్తలు తదితర పనుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. – రాత్రి ఒంటి గంట సమయంలో మీ బీట్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగిందనే సమాచారం ఓ మహిళా ఉద్యోగికి అందింది. వెంటనే బేస్క్యాంప్, తోటి సిబ్బందికి సమాచారం ఇచ్చి కుటుంబ సభ్యుల తోడుతో ఆ ప్రాంతానికి వెళ్లి మంటలను అదపులోకి తెచ్చి ఇంటికి చేరుకున్నారు. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. సమాచారం అందగానే వెళ్లి మంటలు అడవంతా వ్యాపించకుండా బ్లోయర్ల సహాయంతో మంటలు వ్యాపించిన ప్రాంతంలో ఆకులను దూరం చేస్తారు. -
తోడు లేకున్నా.. నీడైంది..!
● ఆ అమ్మకు నీరాజనం ● ఏడుగురు కూతుళ్లు, కుమారుడు ● భర్త లేకున్నా అందరినీ సాకిన ఆదర్శమూర్తి ● కూలీ పని చేస్తూ పిల్లలకు ఉన్నత చదువులుశ్రీరాంపూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే8 కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కొంకటి అనసూర్య ఆయాగా పని చేస్తోంది. ఆర్కే8 కాలనీలోనే నివాసం ఉంటోంది. ఆర్కే 6 గనిలో కోల్కట్టర్గా పని చేస్తూ భర్త వెంకటయ్య 30ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. వీరికి ఎనిమిది మంది సంతానం. కూతుళ్లు సంతోష, విజయ, స్వరూప, మాధవి, సంధ్య, రమా, స్వాతి, కుమారుడు రఘు ఉన్నారు. పిల్లలందరినీ ఐదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చదివించింది. ఆ తర్వాత ప్రభుత్వ హాస్టళ్లలో ఎక్కడ సీటు వస్తే అక్కడ చేర్పించింది. ‘చదువు లేకుంటే కై కిలు పనికి పోవాల్సి వస్తుంది బిడ్డ..’ అని మంచి మాటలు చెబుతూ వారి ధ్యాసను చదువువైపు మళ్లించింది. భర్త ఉన్నప్పుడే పెద్ద కూతురు సంతోషకు పెళ్లి చేసింది. రెండో కూతురు విజయను పీజీ(ఎంఏ) వరకు చదివించగా అంగన్వాడీ టీచర్గా పనిచేస్తోంది. స్వరూపను పీజీ(ఎంఏ), మాధవి కూడా పీజీ(ఎంఎస్సీ, బీఈడీ) వరకు చదివించి పెళ్లి చేసింది. సంధ్య బీఎస్సీ నర్సింగ్ చేసి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా, రమ్య బీఎస్సీ నర్సింగ్ చేసి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో నర్సుగా చేస్తున్నారు. స్వాతి ఎంకాం, బీఈడీ చదివి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్గా చేస్తూ గ్రూప్స్కు సిద్ధమవుతోంది. వీరందరికీ అనసూర్య పెళ్లి చేసింది. కుమారుడు రఘును సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చదివించగా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఉన్నదాంట్లో పిల్లలను పెంచిన కూడా చదువులు, పెళ్లిళ్లకు అనసూర్యకు సుమా రు రూ.10 లక్షల వరకు అప్పు అయ్యింది. ఆడపిల్లలైనా చదువుకు లోటు రాకుండా చేసింది. తల్లి కష్టాన్ని చూసి కూతుళ్లు మిగతా చెల్లెళ్ల పెళ్లిళ్లకు చేతనైన సహా యాన్ని అందిస్తూ వచ్చారు. ఈ నెల 2న జరిగిన చివరి కూతురు పెళ్లి సమయానికి అక్కాచెల్లెళ్లు అంతా కలిసి తల్లి అప్పుల్లో కొంత తీర్చి శభాష్ అనిపించుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుక్రవారం అనసూర్యను పాఠశాలలో ఉపాధ్యాయులు రమేశ్, సరిత శాలువాతో ఘనంగా సత్కరించారు. ఎదిగిన పిల్లలు ఆసరాగా.. -
బర్డ్వాక్ విజయవంతం చేశాం
నా తోటి సిబ్బందితో కలిసి నాలుగుసార్లు నిర్వహించిన బర్డ్వాక్ విజయవంతం చేశాం. మహిళా సెక్షన్, బీట్ అధికారులు చాలా శ్రమించారు. రేంజ్ పరిధిలో స్మగ్లింగ్ జరుగకుండా రాత్రి, పగలు ప్రత్యేక నిఘా పెట్టాం. రాత్రివేళల్లో మహిళా ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా పెట్రోలింగ్ చేస్తుంటాం. ఓ వైపు అడవిలో అభివృద్ధి పనులు, విధి నిర్వహణతోపాటు అడవిలోకి వెళ్లే సమయంలో కనిపించిన పక్షులను కెమరాలో బంధిస్తుంటాను. సర్పెంట్ ఈగల్, వైట్ ఐ బ్లజర్ వంటి అరుదైన పక్షులను కెమెరాలో బంధించాను. – సుష్మారావు, తాళ్లపేట్ రేంజ్ అధికారి -
పోరాడి సాధించాం..
బీటెక్లో మైనింగ్ కోర్సు అంటే అందరూ భయపెట్టినా పట్టించుకోలేదు. 2017లో కంపెనీ ఎంజీఈటీ నోటిఫికేషన్లో మొదట మెన్ అనే నిబంధన ఉంది. మైనింగ్ కోర్సుకు అవకాశం ఇచ్చి ఉద్యోగానికి వచ్చే సరికి ఎందుకు పనికి రామని ప్రభుత్వ ఇందన శాఖ కార్యదర్శికి లేఖ రాశాం. ఎమ్మెల్యేలను కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. మా పోరాటం ఫలితంగా గత సంవత్సరం జేఎంఈటీ, ఎంజీటీ పోస్టుల్లో ఉమెన్కు అవకాశం కల్పిస్తే ఉద్యోగం సాధించాను. అందరూ సహకరిస్తున్నారు. – పీ.లక్ష్మీ, ఎంజీటీ(అండర్ మేనేజర్) ఆర్కే 7 గని, శ్రీరాంపూర్ -
ప్రోత్సహిస్తే రాణిస్తారు
సమానత్వం చూపెట్టి ప్రోత్సహిస్తే మహిళలు పురుషులకంటే మిన్నగా రాణిస్తారు. ఏ పని అప్పగించిన నిజాయతీగా, అంకితభావంతో పని చేస్తారు. మహిళా ఉద్యోగులు పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. కంపెనీ వారి కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తోంది. ఆరు నెలలు మెటర్నిటి, పిల్లలకు 18ఏళ్లు వచ్చే లోపు 2ఏళ్ల చైల్డ్ కేర్ లీవులు ఉన్నాయి. ఎవరైనా వేధింపులకు గురైతే ఏరియా ప్రిసైడింగ్ అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. మహిళల సంరక్షణకు కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటోంది. – ఎస్.శిరీషారెడ్డి, డీజీఎం(లాఆఫీసర్), శ్రీరాంపూర్ -
గోబర్గ్యాస్ గోదాంలో అగ్ని ప్రమాదం
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని ఏసీసీ కాలనీలో గోబార్గ్యాస్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా ఫైర్ అధికారి భగవన్రెడ్డి కథనం ప్రకారం.. ఎన్జీవో ఆధ్వర్యంలో ఎస్కేజీఎస్ సంగ్ సంస్థ ఏసీసీ కాలనీలో ఒక క్వార్టర్ను అద్దెకు తీసుకుంది. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ఎంపిక చేసి రూరల్ డెవలప్మెంట్ వర్క్ కింద ఉచితంగా (బయో) గోబార్ గ్యాస్ అందిస్తోంది. గ్యాస్ నిర్మాణంలో వాడేందుకు ఉపయోగించే ప్లాస్టిక్ పైపులు, కప్పులు గోదాంలో నిల్వ ఉంచారు. శుక్రవారం షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.50వేల విలువ చేసే ప్లాస్టిక్ కప్పులు, పైపులు దగ్ధమయ్యాయి. కాగా గోబర్ గ్యాస్ ఉచితంగా అందజేసేందుకు ఎలాంటి అనుమతులు లేవని పలువురు ఆరోపిస్తున్నారు. స్థానిక ఫైర్ అధికారి రమేశ్బాబు, లీడింగ్ ఫైర్మెన్ అరుణ్కుమార్, డ్రైవర్ ఎంఏ రహీమ్, ఫైర్ మెన్ రాజేందర్, రమేశ్, శ్యాంసుందర్ ఉన్నారు. -
ఆకట్టుకున్న ‘అంబేడ్కర్’ నాటకం
నెన్నెల: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆశయాలు, లక్ష్యాలు అందరికీ తెలిసేలా స్ఫూర్తివంతంగా మండల కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, అంబేడ్కర్ సంఘం నాయకుల సౌజన్యంతో హైదరాబాద్కు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జీవితచరిత్రను సంఘం శరణం గచ్ఛామి పేరుతో ప్రదర్శించారు. అంబేడ్కర్ బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, అంటరానితనం నిమ్నజాతుల హక్కుల కోసం చేసిన పోరాటాలు, రాజ్యాంగ రచన, రిజర్వేషన్లతోపాటు దేశ సేవలను ప్రదర్శించారు. ఇప్పటి వరకు అకాడమీ ద్వారా తెలంగాణలో 722 ప్రదర్శనలు ఇచ్చినట్లు అకాడమీ డైరెక్టర్ శివరప్రసాద్, రచయిత దేవరాజ్, సెక్రెటరీ జగ్గరాజు తెలిపారు. కార్యక్రమంలో అంబేడ్కర్ సంఘం నాయకులు దుర్గం మల్లేశ్, గట్టు బానేశ్, సిద్ధార్థ, రాంమూర్తి, కృష్ణ, జాడి రాజ్కుమార్ పాల్గొన్నారు. -
అప్పుడు సర్పంచ్.. ఇప్పుడు టీచర్
అతివలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారు. ఆ దిశగా ముందుకు సాగుతున్నారు. పురుషులకు సమానంగా సత్తా చాటుతున్నారు. క్రీడా, విద్య, స్వయం ఉపాధి, తదితర రంగాల్లో ప్రతిభ కనబర్చి శెభాశ్ అనిపించుకుంటున్నారు ఉమ్మడి జిల్లాలోని పలువురు నారీమణులు. కొందరు పలువురికి ఉపాధి చూపుతున్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చెన్నూర్రూరల్: గతంలో సర్పంచ్గా పని చేసింది. ఆ పదవీ కాలం పూర్తి కాగానే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుంది. మండలంలోని అంగ్రాజ్పల్లికి చెందిన చెవ్వ సువర్ణ. తాండూరు మండలం తంగళ్లపల్లికి చెందిన ఈమెకు చెన్నూర్ మండలం అంగ్రాజ్పల్లికి చెందిన చెవ్వ శ్రీనివాస్తో 2003లో వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు. అప్పటికే బీఎస్సీ ఫస్టియర్ చదివింది. మూడేళ్లలో పూర్తి చేయాల్సిన డిగ్రీ.. పిల్లల ఆలపాలన చూసుకుంటూ ఐదేళ్లు పట్టింది. 2010లో ఎంఎస్సీ, 2012లో బీఈడీ పూర్తి చేసింది. 2013లో సర్పంచ్కు బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో గ్రామస్తుల కోరిక మేరకు స్వతంత్య్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందింది. ఐదేళ్లవరకు ప్రజలకు సేవలందించింది. 2019లో చెన్నూర్లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో గణిత టీచర్గా ఎంపికై విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. భర్త ప్రోత్సాహంతో సాధ్యమైందని అంటోంది. స్విట్జర్లాండ్లో సాఫ్ట్వేర్ జాబ్ కోటపల్లి: మా స్వగ్రామం కో టపల్లి. మే ము నలుగురు అక్కాచెల్లెళ్లు. తల్లిదండ్రులు బాగా చదివించారు. అందరూ వివిధ రంగాల్లో స్థిరపడ్డాం. తాను స్విట్టర్లాండ్లో ఆరేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యో గం చేస్తున్నా. ఏటా రెండు నెలలు అమ్మానాన్నలను స్విట్టర్లాండ్కు తీసుకెళ్తున్నా. – లక్ష్మీప్రసన్నభర్త ప్రోత్సాహంతో భీమారం: ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యం పాఠశాల స్థాయిలో ఏర్పడింది. అందుకు బాగా చదివాను. పెళ్లయ్యాక చదువుకోవాలని భర్త ప్రోత్సాహించారు. టీచర్గా సేవ చేయాలనే కోరిక ఉన్నా భర్త తనను ఎస్సైగా చూడాలని ఉండేది. హైదరాబాద్కు వెళ్లి కోచింగ్ తీసుకున్నా. 2019 ఎస్సైగా ఎంపికయ్యాను. – కె శ్వేత,భీమారం ఎస్సైఒక్క బిడ్డ చాలనుకున్నం నిర్మల్: ‘ఆడబిడ్డయితే ఏంటి.. తను వారసురాలే కదా. తనకు ఉత్తమ చదువును, ఉన్నత జీవితాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకే మాకు ఒక్కబిడ్డనే చాలనుకున్నాం..’అంటున్నారు నిర్మల్ జిల్లాకేంద్రంలోని ఆదర్శనగర్కు చెందిన తిరుపతి సుస్మిత, ప్రమోద్రావు దంపతులు. ఎవరెన్ని ఒత్తిళ్లు పెట్టినావారు అనుకున్నట్లుగానే ఒక్కబిడ్డకే జన్మనిచ్చారు. తన ఆకాంక్షలకు తగ్గట్లుగానే చదివించారు. తల్లిదండ్రుల ఆశయాలను ఆకళింపు చేసుకున్న ఆ బిడ్డ శరదితన్వి తనకంటూ గుర్తింపును తెచ్చుకుంటోంది. స్థానిక దీక్ష జూనియర్ కళాశాల కరస్పాండెంట్గా చేస్తున్న ప్రమోద్రావు ముందు నుంచి కొంత సామాజిక స్పృహతో ఆలోచిస్తుంటారు. శరదితన్వి ప్రస్తుతం ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఆక్సెంచర్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తోంది. తండ్రిలాగే సామాజికస్పృహతో తన స్థాయిలో సేవలందిస్తోంది. తమ బిడ్డ శరదితన్వితో సుస్మిత, ప్రమోద్రావు దంపతులుస్వ‘శక్తి’తో ముందుకు.. ఆదిలాబాద్: ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న మహిళ ప్రైవేట్ ఉద్యోగానికి మొగ్గు చూపింది జిల్లా కేంద్రంలోని తిర్పెల్లి కాలనీకి చెందిన ముదిగొండ కల్పన. ఇంటర్ తర్వాత వివాహం కాగా, అటు కుటుంబ బాధ్యతలు మోస్తూనే 2007లో డిగ్రీ పూర్తి చేసింది. భర్త ప్రోత్సాహంతో 2010లో జిరాక్స్, ఆన్లైన్ సెంటర్, బుక్స్టాల్ ప్రారంభించింది. టైలరింగ్ చేస్తోంది. ఇటీవల బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటుంది. ఓ వైపు ఇంటిని చక్కదిద్దుతూనే బుక్సెంటర్ నడుపుతోంది. కుమారుడు, కుమార్తెలను చదివించి ప్రయోజకులుగా చేయాలనే తనవంతుగా శ్రమిస్తోంది.ఆడబిడ్డపై ఆలోచన మారాలి నిర్మల్:‘ఆడబిడ్డయినా.. మగబిడ్డయినా ఒకటే. ఒ కప్పుడు మగపిల్లాడుంటే చాలు అనుకునేది. కా నీ.. ఈరోజుల్లో ఎవరైనా మంచి చదువు, ఉ ద్యో గం ఉంటేనే విలువ. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీ ల నుంచి మొదలు పెళ్లి సంబంధాల దాకా ఆడ, మగ అనే తేడాలు చూడటం లేదు. వారి చదువు, హోదా, సంస్కారాన్ని గుర్తిస్తున్నారు. అందుకే మాకు ఒక్క ఆడబిడ్డనే అని ఏరోజూ ఆలోచించలేదు..’అని చెబుతున్నారు నిర్మల్కు చెందిన వైద్యదంపతులు చిటికేశి రంజిత, సంతోష్రాజ్. తమ బిడ్డ ఇషితారాజ్ ఎంత చదివితే అంత చదివిస్తామంటున్నారు. ప్రస్తుతం తాను ఎంబీబీఎస్ చదువుతోంది. అమ్మ గైనకాలజిస్ట్, నాన్న పీడియాట్రిక్ వైద్యుడు.వీరిద్దరూ బిడ్డకు గైడ్ చేస్తున్నామే తప్పా .. ఇది చదువు, అది చేయు అని చెప్పడం లేదంటున్నారు. అన్నిరంగాల్లో సీ్త్ర, పురుషులు సమానంగా పనిచేస్తున్నారని, ఇకపై ఆడ,మగ అనే ఆలోచనను మానుకోవాల్సిందేనని అంటున్నారు.వైద్య వృత్తిని వదిలి.. ప్రజాసేవకు కదిలి బోథ్: ఎంబీబీఎస్ పూర్తి చేసి.. వైద్య వృత్తిని వదిలి ప్రజాసేవకు కదిలారు బోథ్కు చెందిన డాక్టర్ సంధ్యారాణి. జెడ్పీటీసీగా గెలుపొంది మహిళా శక్తిని నిరూపించారు. బోథ్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించా రు. జెడ్పీ సమావేశాల్లో తనగొంతు విని పించారు. ఆమె వైద్యురాలు కావడంతో బోథ్ ఆసుపత్రిని అభివృద్ధి పర్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రులు, ఉన్నతాధికారులను కలిసి రూ.10 కోట్ల నిధులు తేవడంలో కృషిచేశారు. మాజీ జెడ్పీటీసీగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది. – డా.సంధ్యారాణి, మాజీ జెడ్పీటీసీ, బోథ్ఇతరులపై ఆధారపడకుండా.. ఆసిఫాబాద్అర్బన్: ఇతరులపై ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నా. ఇంటి వద్దే 20 ఏళ్ల క్రితమే టిఫిన్స్ సెంటర్ ప్రారంభించా. ప్రస్తుతం ఇంటి వద్ద 15 మంది ఉపాధి కల్పిస్తూ.. వ్యాపారం విజయవంతంగా కొనసాగుతోంది. ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరా క్యాంటీన్ను జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రారంభించాం. అక్కడ కూడా మరో ఐదుగురు ఉపాధి పొందుతున్నారు. మహిళలు ఎందులోనూ తక్కువ కాదు. ఆర్థిక స్వాతంత్య్రం సాధించాలి. – మార స్వరూప, మహిళా సమాఖ్య సంఘం సభ్యురాలు, ఆసిఫాబాద్ చిన్నచూపు పోవాలి ఆసిఫాబాద్అర్బన్: మా స్వగ్రామం మంచిర్యాల. నాన్న ఓ సంస్థలో చిరుద్యోగి. ఇద్దరం ఆడపిల్లలం అయినా ఎవరిపైనా ఆధారపడొద్దని ఉన్నత చదువులు చదివించారు. నేను ప్రస్తుతం ఆసిఫాబాద్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్(ఏటీవో)గా పనిచేస్తుండగా, మా చెల్లెలు ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వర్తిస్తోంది. నాకు ముగ్గురు, మా చెల్లికి ఇద్దరు ఆడపిల్లలే. వారిని అన్నిరంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతాం. చదువుతోనే భవిష్యత్తు బాగుంటుంది. ప్రతీ మహిళా చట్టాలపై అవగాహన ఉండాలి. సమాజంలో మహిళలనే చిన్నచూపు పోవాలి.– భానుమతి గోమాస, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్●తేడా ఉండొద్దు ఆసిఫాబాద్రూరల్: మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా సమాజంలో అందరం ఒక్కటే అనే భావన రావాలి. కొంతమంది తల్లిదండ్రులు కుమార్తె కంటే కుమారుడినే ఎక్కువ ఇష్టపడుతారు. అలా సంతానాన్ని సమానంగా చూడాలి. వారి నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. – శ్రీదేవి, బీజెడ్సీ సెకండియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ మహిళలకు అవకాశాలు పెరిగాయి భైంసాటౌన్: నేటి కాలంలో మహిళలకు అవకాశాలు పెరిగాయి. ఏ రంగంలోనైనా వివక్ష ఉంటుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు లభిస్తుంది. పెరుగుతున్న ఖర్చులకు ఇంట్లో భార్యాభర్తలిద్దరూ పనిచేస్తేనే ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. రాజకీయాల్లో మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి. – సిరం సుష్మారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షురాలు, భైంసాకఠిన చట్టాలు రావాలి ఆసిఫాబాద్రూరల్: మహిళలకు కొన్నిచోట్ల రక్షణ లేకుండా పోయింది. యువతులు, మహిళలపై లైంగిక దాడులు పెరిగిపోయాయి. తప్పుచేసిన వారికి కఠిన శిక్షలు లేకపోవడంతో రెచ్చిపోతున్నారు. సమాజంలో మహిళల రక్షణకు కఠిన చట్టాలు రావాలి. – అశ్విని, ఎంపీసీఎస్ ఫైనలియర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్ -
రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝూ
● సీఐడీ విభాగానికి ఎం.శ్రీనివాస్ బదిలీమంచిరాల్యక్రైం: రామగుండం పోలీసు కమిషనర్(సీపీ) ఎం.శ్రీనివాస్ సీఐడీ విభాగానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వరంగల్ పోలీసు కమిషనర్ 2009బ్యాచ్కు చెందిన అంబర్ కిషోర్ ఝా నియామకం అయ్యారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాస్ 2024 ఫిబ్రవరి 14న రామగుండం సీపీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అంతర్రాష్ట్ర జిల్లాల పోలీసు అధికారులతో తరచూ సమావేశం అయ్యారు. మావోయిస్టుల కదలికలు కనిపెట్టేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో జల్లెడ పట్టేందుకు వీలుగా డ్రోన్ కెమెరాలు అందుబాటులోకి తెచ్చారు. మావోయిస్టుల గ్రామాల్లో సేవా కార్యక్రమాల్లో, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. గంజాయి, పేకాట, రేషన్బియ్యం, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. రౌడీషీటర్లలో మార్పుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏఎస్పీగా..రామగుండం సీపీగా నియామకం అయిన అంబర్ కిషోర్ ఝా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ ఎస్పీగా పని చేశారు. ఆయనకు సౌమ్యుడి పేరుంది. ఐపీఎస్ తర్వాత మొదటి పోస్టింగ్ ఉమ్మడి జిల్లాలో ఏఎస్పీగా 2012లో కొంతకాలం పని చే శారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీగా పని చేశారు. 2018లో కేంద్ర సర్వీసుల్లో విధులు నిర్వర్తించా రు. ఉమ్మడి జిల్లాలో ఏఎస్పీగా పని చేసిన ఆయనకు మంచిర్యాల జిల్లాపై కొంత అవగాహన ఉంది. ఐపీఎస్ హోదాలో డీసీపీగా భాస్కర్ మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్కు ఐపీఎస్ హో దాలో పోస్టింగ్ ఇస్తూ ఇక్కడే నియమిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలి పారు. 2019 బ్యాచ్కు చెందిన ఆయన గ్రూప్–1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు. నాన్ క్యాడర్ డీసీపీగా 2024 జూన్ 20న మంచిర్యాల డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2024 ఆగస్టు 14న స్టేట్ సర్వీస్ పూర్తి చేసుకోగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఐపీఎస్ హోదా కల్పించింది. అనంతరం పోస్టింగ్ లేకపోవడంతో మంచిర్యాల డీసీపీగా అటాచ్డ్ చేశారు. ప్రస్తుతం ఐపీఎస్ హోదాలో డీసీపీగా బాధ్యతలు అప్పగించారు. -
మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత..
ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు బలవన్మరణం చెందారు. అప్పుల బాధతో ఆటోడ్రైవర్, అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రావడం లేదని మరొకరు ఉరేసుకున్నారు. మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.మానసిక పరిస్థితి బాగా లేక వివాహిత..మంచిర్యాలక్రైం: మానసిక పరిస్థితి బాగాలేక వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ కిరణ్కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. జిల్లాకేంద్రంలోని గోపాలవాడకు చెందిన కనవేణి సతీశ్, రాజమణి(35) భార్యాభర్తలు. వీరికి ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. రాజమణి గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతుంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. ప్రతీరోజు భయం, భయంగా ఉంటుంది. తమ్ముడు రఘువర్ధన్ గమనించి అక్క రాజమణికి ధైర్యం చెప్పేవాడు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంది. మృతురాలి తమ్ముడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.అప్పుల బాధతో ఆటోడ్రైవర్బజార్హత్నూర్: అప్పుల బాధతో ఆటోడ్రైవర్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై అప్పారావ్ తెలిపారు. ఎస్సై, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు..మండలంలోని జాతర్ల పంచాయతీ పరిధి రాంనగర్ గ్రామానికి చెందిన భగత్ సంతోష్ (36) ఆటో నడుపుకుని జీవనం కొనసాగిస్తుండేవాడు. కుటుంబ పోషణకు, ఆటో కొనుగోలుకు రూ.4 లక్షలు ప్రైవేటు అప్పులు చేయగా వడ్డీలు పెరిగాయి. ఆదాయం అంతంత మాత్రమే ఉండటంతో అప్పు ఎలా తీర్చాలో మదనపడేవాడు. గురువారం ఉదయం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. భార్య రోజా ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.అనారోగ్యంతో ఒకరు, భార్య కాపురానికి రాలేదని మరొకరుభైంసాటౌన్: భైంసా రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ నైలునాయక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఇలేగాం గ్రామానికి చెందిన అవదూత్ పెద్ద పోశెట్టి(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం తన ఇంట్లో ఉరేసుకున్నాడు. అలాగే దేగాంకు చెందిన ఇరగదెండ్ల ప్రవీణ్ (27) భార్య కాపురానికి రావడం లేదని బుధవారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
‘పది’ ప్రీఫైనల్ పరీక్షలు షురూ
మంచిర్యాలఅర్బన్: పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసే ప్రీఫైనల్ పరీక్షలు జిల్లాలో గురువారం ప్రారంభమయ్యాయి. వందశాతం ఫలితాలే లక్ష్యంగా పది విద్యార్థులకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 వరకు నిర్వహించిన పరీక్షలకు జిల్లాలోని 246 పాఠశాలలకు చెందిన 9,489 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటి రోజు ఫస్ట్లాంగ్వేజ్ పరీక్ష ని ర్వహించగా 7న సెకండ్ లాంగ్వేజ్, 10న ఇంగ్లి ష్, 11న గణితం, 12న ఫిజికల్ సైన్స్, 13న బ యెలాజికల్ సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగనున్నాయి. వార్షిక పరీక్షలకు ఏమాత్రం తీసిపోని విధంగా పకడ్బందీగా నిర్వహిస్తున్నా రు. కొన్ని పాఠశాలల్లో బెంచీకి ఒకరు చొప్పు న మాత్రమే విద్యార్థులను అనుమతించారు. -
● స్పష్టం చేసిన శాంతిఖని ప్రభావిత గ్రామాల ప్రజలు ● పునఃధ్రువీకరణను రెన్యూవల్ చేయాలని కోరిన కార్మిక సంఘాల నాయకులు ● గ్రామాల్లో సౌకర్యాలు కల్పించాలన్న సామాజిక కార్యకర్తలు ● ఓపెన్కాస్ట్ గని చేపట్టడం లేదని అధికారుల స్పష్టీకరణ ● పోలీసు బందోబస్తు మధ్య ప్రజాభ
హామీలు నెరవేర్చాలిగతంలో ప్రభావిత గ్రా మాల ప్రజలకు ఇచ్చిన హామీలను సింగరేణి అధికారులు నెరవేర్చాలి. గ్రా మాల అభివృద్ధికి పాటుపడాలి. బొగ్గు వనరులు ఉన్నచోటే త వ్వకాలు చేపట్టడం జరుగుతుంది. శాంతిఖ ని లాంగ్వాల్ ప్రాజెక్టు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్లియరెన్స్ ఇవ్వాలి. – కాంపల్లి సమ్మయ్య, ఐఎన్టీయూసీ నాయకుడుసౌకర్యాల కల్పనకు ప్రాధాన్యంప్రభావిత గ్రామాల్లో అభివృద్ధి పనులు, సౌకర్యాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు ప్రభావిత గ్రామాల్లో ఖర్చు చేసేలా చర్యలు తీసుకుంటాం. గాలి, నీరు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడుతాం. బెల్లంపల్లి ప్రజలకు నీటి సౌకర్యం అందిస్తాం. పంటల సాగు కోసం చెరువుల్లోకి నీటిని మళ్లిస్తాం. భూగర్భ జలాల సంరక్షణకు పాటుపడతాం. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇప్పిస్తాం. – జి.దేవేందర్, జీఎం, మందమర్రి ఏరియా బెల్లంపల్లి: భూగర్భ జలాలను నిర్వీర్యం చేసి పంటల సాగుకు విఘాతం కలిగించే శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టు వద్దని, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టు పునఃధ్రువీకరణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వవద్దని ప్రభావిత గ్రా మాల ప్రజలు ముక్తకంఠంతో కోరారు. గురువారం ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పాత శాంతిఖని గని కార్యాలయ ఆవరణలో పోలీసు, ఎస్ అండ్పీసీ, ఎస్టేట్ సిబ్బంది భారీ బందోబస్తు మధ్య శాంతిఖని లాంగ్వాల్ భూగర్భ బొగ్గుగని ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎస్.మోతీలాల్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఈఈ లక్ష్మణ్ ప్రసాద్ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ముందుగా అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ ప్రభావిత గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పన కోసం సింగరేణి వ్యయం చేసిన డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధుల వ్యయం వివరాలను ప్రకటించారు. ఆ తర్వాత అభిప్రాయ సేకరణ జరగగా ప్రాజెక్టును ప్రభావిత గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన రైతులు, యువకులు, రిటైర్డు కార్మికులు, రాజకీయ నాయకులు మాట్లాడుతూ శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టు వల్ల గ్రామీణులకు ఒరిగేదేం లేదన్నారు. సింగరేణి అధికారుల మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయామని, ఇకపై నమ్మబోమని స్పష్టం చేశారు. బట్వాన్పల్లిలో 2004లో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో సింగరేణి అధికారులు ఇచ్చిన హామీల్లో నేటికీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. 500 నుంచి 700 మీటర్ల దిగువలో బొగ్గు ఉత్పత్తి చేయడానికి లాంగ్వాల్ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం వల్ల భూగర్భంలో నీటి వనరులు మరింతగా అడుగంటి పోతాయన్నారు. ఇప్పటికే బోర్లలో సరిపడా నీళ్లు లేక వట్టి పోతుండగా, పంటల సాగుకు నానాయాతన పడుతున్నామన్నారు. ప్రాజెక్టు విస్తరణకు అంగీకరించే ప్రసక్తేలేదన్నారు. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కొత్త చట్టం ప్రకారం శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టును రెన్యూవల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓపెన్కాస్ట్ చేస్తారనే ప్రజల్లో కలిగిన అపోహలను నివృత్తి చేసి స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సింగరేణి అధికారులకు సూచించారు. సింగరేణి డీఎంఎఫ్టీ, సీఎస్ఆర్ నిధులు ప్రభావిత గ్రామాల్లోనే ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. లాంగ్వాల్ ప్రాజెక్టు నిర్వహణకు మద్దతు తెలుపుతున్నట్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, బీఎంఎస్ కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ క్రమంలో గ్యాలరీలో కూర్చున్న యువకులు, నాయకులు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. కుర్చీల్లోంచి లేచి నిలబడి ప్రసంగానికి అడ్డుపడ్డారు. ర్యాలీగా తరలివచ్చిన గ్రామీణులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభావిత పాత బెల్లంపల్లి, ఆకెనపల్లి, లింగాపూర్, బుచ్చయ్యపల్లి, పెర్కపల్లి, బట్వాన్పల్లి గ్రామాల యువకులు, రైతులు, రిటైర్డు కార్మికులు, ప్రజలు ర్యాలీగా తరలి వచ్చారు. వీరిని తనిఖీ చేసిన తర్వాత సభాస్థలిలోకి పంపారు. బెల్లంపల్లి ఏసీపీ ఏ.రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు పహారా కాశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి పర్యావరణ శాఖ జీఎం బి.సైదులు, మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వాతావరణం ఆకాశం మబ్బుపట్టి ఉంటుంది. ఎండల తీవ్రత పెరుగుతుంది. వడగాలులు బలంగా వీస్తాయి. ఉక్కపోతగా ఉంటుంది.
ఎమ్మెల్యే పీఏపై ఫిర్యాదులు! ● పార్టీ రాష్ట్ర ఇన్చార్జికి పంపిస్తున్న నియోజకవర్గ వాసులు సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: జిల్లాలో ఓ ఎమ్మెల్యే పీఏ తీరు వివాదాస్పదమవుతోంది. సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచే డబ్బులు వసూలు చేస్తుండడంతో అంతా అవాక్కవుతున్నారు. భూ ములు, అభివృద్ధి పనులు, ఇతర ఏదైనా అవసరం కోసం వెళ్తే పని కావాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాలనే ధోరణితో ఉండడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తొలిసారిగా ఆ నియోజకవర్గంలో పార్టీ విజయం సాధించింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారు ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సదరు ప్రజాప్రతినిధి వద్ద పైరవీలు చేయించడంతోపాటు పనులు చేయడం, పార్టీ పదవులు, ప్రాధాన్యత విషయంలో అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. గతంలో వరి ధాన్యం కొ నుగోలు కేంద్రాల మంజూరు కోసం పైసలు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. నియోజకవర్గ కేంద్రంతోపాటు సింగరేణి, అసైన్డ్, లావాణి పట్టా భూముల ఆక్రమణలు, కబ్జాలు, అవుట్సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగాలు, బదిలీలు వంటి తమ అనుకూల పలుకుబడితో పోలీసు, రెవెన్యూ అధికారులతో చెప్పిస్తూ చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డీఎంఎఫ్టీ పనుల్లో ఒక శాత కమీషన్ వసూలు చేయడం, ఇక్కడ జరుగుతున్న అవినీతిపై గతంలో మావోయిస్టులు సదరు ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ లేఖ సైతం విడుదల చేశారు. అధిష్టానానికి ఫిర్యాదు సదరు ఎమ్మెల్యే పీఏపై నూతనంగా వచ్చిన పార్టీ రాష్ట్ర ఇన్చార్జికి మెయిల్స్, వాట్సాప్ల్లో ఫిర్యాదులు వెళ్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఇన్చార్జి అయినా చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. ఆయన తీరుతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి ఇబ్బందులు వస్తున్నాయని, వెంటనే దృష్టి సారించాలని ఫిర్యాదులో కోరినట్లు తెలిసింది. పత్తి రైతులు ఆందోళన చెందవద్దు● ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చెన్నూర్: చెన్నూర్ ప్రాంత పత్తి రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నా రు. గురువారం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆధార్ లింక్ అప్డేట్ సమస్యతో పది రోజులు పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులు ఇబ్బంది పడ్డారన్నారు. ఎంపీ వంశీకృష్ణ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడి సమ స్య పరిష్కారానికి కృషి చేశారన్నారు. ఈ ఏడాది 3.50 లక్షల క్వింటాళ్ల పత్తి కోనుగోలు చేశారని, మ రో 70 వేల క్వింటాళ్ల పత్తి ఉన్నట్లు తెలిపారు. సోమవారం నుంచి వారం రోజులపాటు నిరంతరం పత్తి కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ చల్లా రాంరెడ్డి, నాయకులు సూర్యనారాయణ, హిమవంతరె డ్డి, రాజమల్లగౌడ్, చింతల శ్రీనివాస్, చెన్నూరి రాజే శ్, వెంకటేశ్, నాగరాజు, మహేశ్ పాల్గొన్నారు. -
వద్దంటే కుదరదు..!
అద్దెకు ఇస్తే చర్యలే...క్వార్టర్ను అద్దెకు ఇచ్చి సొంతింటికి లేదా అద్దె ఇంటికి వెళ్దామంటే దీనికి కూడా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. క్వార్టర్ కిరాయికి ఇచ్చినట్లు తెలిస్తే కరెంట్ కట్ చేయడం, నీళ్లు బంద్ చేయడం, చివరికి పీనల్ రెంట్ వసూలు చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇంతటి అధ్వాన్న పరిిస్థితిపై గుర్తింపు సంఘాలు స్పందించకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా గుర్తింపు సంఘం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కార్మికులు కోరుతున్నారు.నిబంధన ఎత్తివేయాలిసింగరేణి యాజమాన్యం ఈ నిబంధన ఎత్తివేయాలి. క్వార్టర్ వెకేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. శ్రీరాంపూర్లో ఉన్న ఈ ప్రత్యేక నిబంధనపై కార్పొరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – ఎస్కే బాజీసైదా, గుర్తింపు సంఘం బ్రాంచి కార్యదర్శి శ్రీరాంపూర్: సింగరేణిలో ఎక్కడాలేని వింత నిబంధనను శ్రీరాంపూర్ ఏరియా అధికారులు అమలు చేస్తున్నారు. క్వార్టర్లన్నీ సింగిల్ బెడ్రూంవే కావడంతో ఇరుకుగా మారడం.. వసతులు బాగోలేక సొంతిళ్లు కట్టుకుని బయటికి వెళ్దామనుకుంటే ఉన్న క్వార్టర్ను కంపెనీ వాపస్ తీసుకోవడం లేదని కార్మికులకు వాపోతున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో 8,592 మంది కార్మికులు పని చేస్తున్నారు. శ్రీరాంపూర్ కాలనీ, ఆర్కే 8 కాలనీ, కృష్ణాకాలనీ, సీసీసీ టౌన్షిప్, నస్పూర్ కాలనీ, షిర్కే కాలనీ, నాగార్జున కాలనీల్లో మొత్తం కలిపి 7,147 క్వార్టర్లు ఉన్నాయి. సీనియర్ కార్మికుల ఇంట్లో పిల్లలు పెద్దవారు కావడం, వారి పిల్లలకు పెళ్లిళ్లుసైతం కావడంతో ప్రస్తుతం ఉంటున్న సింగిల్ బెడ్రూం క్వార్టర్లు చాలా ఇరుకుగా మారాయి. కొందరు సొంతిళ్లకు వెళ్లేందుకు, మరికొందరు బయట ప్రైవేటు ఇళ్లలో అద్దెకు ఉండేందుకు ఇష్టపడుతున్నారు. కంపెనీ ప్రోత్సాహంతోనే.. సొంతిళ్లు కట్టుకోవాలని కార్మికులను కంపెనీ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఇల్లు నిర్మించుకున్న కార్మికునికి రూ.10 లక్షలకు సంస్థ వడ్డీ చెల్లిస్తోంది. దీంతో ఈ హెచ్బీఎల్ఆర్ఎస్ స్కీంను చాలా మంది కార్మికులు వినియోగించుకుని ఇళ్లు నిర్మించుకున్నారు. కానీ ఉంటున్న క్వార్టర్ను ఖాళీ చేయలేని దుస్థితి. ఎందుకంటే క్వార్టర్ను వాపస్ తీసుకుంటే దాని స్థానంలో కార్మికునికి బేసిక్ వేతనంపై 10 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కంపెనీపై ఆర్థికభారం పడుతుందన్న సాకుతో అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో క్వార్టర్లలో ఉండలేక, వేరే ఇంటికి వెళ్లలేక అనేకమంది కార్మికులు సతమతమవుతున్నారు. ఇలా శ్రీరాంపూర్ ఏరియాలో సుమారు వెయ్యి మంది కార్మికులు క్వార్టర్ ఖాళీ కోసం ఎదురుచూస్తున్నారు. క్వార్టర్ అలాట్ చేస్తే ఉండాల్సిందే.. వాపస్ తీసుకోని సింగరేణి ఉండకపోయినా హెచ్ఆర్ఏ నిలిపివేత సొంత ఇళ్లు ఉన్నా వెళ్లలేకపోతున్న కార్మికులు.. -
భూ సమస్యల పరిష్కారానికి కమిటీలు
● మండల, డివిజన్, జిల్లాస్థాయిలో ఏర్పాటు ● సందేహాలు, ఫిర్యాదులకు ప్రత్యేక కాల్ సెంటర్ ● భూ అర్జీలను పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలుసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూ వివాదాలను పరిష్కరించేందుకు మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలు జారీచేశారు. మండల స్థాయిలోనే ప్రతీ సోమవారం ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు అర్జీలు స్వీకరిస్తారు. ప్రతీ అర్జీకి ఓ నంబరు కేటాయించి క్షేత్రస్థాయిలో అధికా రులు పరిశీలన చేయాల్సి ఉంటుంది. కనీసం 15 రోజులు, గరిష్టంగా 21 రోజుల్లో సమస్య పరిష్కారానికి అధికారులు చొరవ చూపాల్సి ఉంటుంది. ప్రతీ 15 రోజులకోసారి మండల స్థాయి అర్జీలను డివిజనల్ స్థాయి అధికారులు సమీక్షిస్తారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎస్హెచ్వో, డివిజన్లో ఆర్డీవో, ఏసీపీ, జిల్లాస్థాయి డీసీపీ, కలెక్టర్ కమిటీల్లో సభ్యులుగా ఉండనున్నారు. అలాగే నివాస ప్రాంతాలు, అనుమతులపై ప్రత్యేక అధికారులుగా పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులు ఉంటారు. దీంతో ఎక్కడైనా తప్పుడు పత్రాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే వెంటనే చర్యలు తీసుకోనున్నారు. అంతేకాకుండా కమిటీల పనితీరు ఇతర ఫిర్యాదులు, సందేహాలపై ప్రజల కోసం కాల్ సెంటర్ 08736–250106 నంబరు అందుబాటులో ఉంటుంది. కమిటీ అధికారులు అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వం చూపిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. అయి తే రెవెన్యూ, పోలీసు, పంచాయతీ, మున్సిపల్ అధికారులు తమ రోజువారీ విధుల్లోనే తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కమిటీ బాధ్యులు భూ సమస్యల పరిష్కారానికి అదనపు సమయం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కమిటీ బాధ్యులతో రెండు రోజుల క్రితమే కమిటీలు ఎలా పని చేయాలనే అంశంపై డీసీపీ, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. తీరని భూ వివాదాలు జిల్లాలో అనేక చోట్ల భూ తగదాలు కొనసాగుతున్నాయి. భూఆక్రమణలు, హక్కులు, వారసత్వ, కోర్టు, సింగరేణి, రెవెన్యూ, అసైన్డ్, సర్కారు, నివా స జాగాల్లో పలుచోట్ల వివాదాలు ఉన్నాయి. చాలా చోట్ల రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ రాజ్ అధికారులు పరిష్కరించే అవకాశం ఉన్నా చొరవ చూపడంలేదు. కొందరు కోర్టుల్లోనూ న్యాయ పోరాటం చేస్తున్నారు. అనేక ఏళ్లుగా కేసుల విచారణ సాగుతోంది. ఆయా వర్గాల్లో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపించేందుకే కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతీ సోమవారం ప్రజాఫిర్యాదుల విభాగానికి భూ వివాదాల అర్జీలే అధికంగా వస్తున్నాయి. సమస్య పరిష్కారం కాకపోగా జాప్యం జరగడంతో మరింత జఠిలమవుతోంది. గతంలోనూ మండల స్థాయిలో భూ వివాదాలు ప రిష్కరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చా రు. కానీ క్షేత్రస్థాయిలో పలు అవరోధాల కారణంగా చాలా భూ సమస్యలు అలాగే పేరుకుపోయా యి. దీంతో కొందరు భూతగాదాలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సెటిల్మెంట్లు చేస్తూ వసూళ్లకు పాల్ప డుతున్నారు. తాజాగా కలెక్టర్ భూవివాదాల పరి ష్కార కోసం కమిటీలు ఏర్పాటు చేయడంతో ఈ సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. -
ఉత్తమ ఫలితాలు సాధించాలి
● కలెక్టర్ కుమార్ దీపక్లక్సెట్టిపేట: పదోతరగతిలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కుమా ర్ దీపక్ సూచించారు. గురువారం మండలంలోని జిల్లా పరిషత్ బాలికల, కస్తూరిబా పాఠశాలలను తనిఖీ చేశారు. వంటగదులు, భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ఆస్పత్రిని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ దిలీప్కుమార్, మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ఉన్నారు. కేవీ భవన నిర్మాణ పనులు పరిశీలన మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ మండలం గుడిపేట పునరావాస కాలనీ శివారులో నిర్మిస్తున్న కేంద్రియ విద్యాలయం(కేవీ) పనులను కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. రూ.26 కోట్లపై చిలుకు నిధులతో భవన నిర్మాణం చేపడుతున్నామని, వచ్చే విద్యా సంవత్సరానికి సిద్ధంగా ఉంటుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావుదేశ్పాండే, ఆర్ఐ ప్రభు ఉన్నారు. -
‘ఇంటర్’ పరీక్షలకు 97శాతం హాజరు
మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. 6,071 మంది విద్యార్థులకు గానూ 5,914 మంది పరీక్షలకు హాజరుకాగా 157 మంది గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,433 మందికిగానూ 5,299 మంది హాజరుకాగా 134 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 638 మందికిగానూ 615 మంది హాజరుకాగా 23 మంది గైర్హాజరయ్యారు. 97శాతం హాజరు నమోదైంది. ప్రతీ విద్యార్థిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు. పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు. -
ఎకో క్లబ్ నిర్వహణకు నిధులు!
● అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమ ● విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన మంచిర్యాలఅర్బన్: పాఠశాలల విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఎకో క్లబ్ కార్యకలపాల నిర్వహణకు నిధులు విడుదలయ్యాయి. సమగ్ర శిక్ష హైదరాబాద్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ యూత్ క్లబ్ పాఠశాలలకు 2024–25 సంవత్సరానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని సర్కారు బడులకు నిధులు విడుదల చేశారు. ప్రాథమిక పాఠశాలకు రూ.3 వేలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు రూ.5 వేలు చొప్పున కేటాయించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఖాతాల్లో జమ చేయనున్నారు. నిధులను ఆయా కమిటీల భాగస్వామ్యంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నిధుల వినియోగం ఇలా.. గ్రోగీన్ కార్యక్రమం, కిచెన్ గార్డెన్, పూలతోట, పండ్ల తోటల నిర్వహణ, వినాయక చతుర్థి పండుగ సందర్భంగా మట్టి విగ్రహాలను ఉపయోగించేందు కు ప్రోత్సహించడం..విస్తృత ప్రచారానికి బ్యాన ర్ వాడటం కోసం నిధులు రూ.1500 వినియోగించా ల్సి ఉంటుంది. పర్యావరణ దినోత్సవాల (ఓజోన్, భూమి, జల) నిర్వహణకు ఉత్తమ ఎకో క్లబ్ పాఠశాలలకు ప్రశంసా పురస్కారాలు, పోస్టర్ పోటీ, క్విజ్, విద్యార్థుల కోసం వార్షిక పర్యావరణ సమావేశం, సెలవు కార్యక్రమం రూ.750 నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లా ఉన్నతపాఠశాల నిధులు ఆదిలాబాద్ 103 రూ.5,15,000 ఆసిఫాబాద్ 55 రూ.2,75,000 మంచిర్యాల 104 రూ.5,20,000 నిర్మల్ 114 రూ.5,70,000 -
ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి
ఇంద్రవెల్లి: మండలంలోని ఓల్మద్రి సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందాడు. ఎస్సై సునీల్, కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రంలోని భీంనగర్ కాలనీకి చెందిన జెల్పెట్ వినోద్(35), తమ్ముడు పూలాజీతో కలిసి గురువారం అటవీశాఖ కార్యాలయంలో నర్సరీ నుంచి తన ట్రాక్టర్ ద్వారా ప్లాంటేషన్ మొక్కలు తరలిస్తున్నాడు. మార్గమధ్యలో ఓల్మంద్రి సమీపంలో కల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు బోల్తాపడింది. వినోద్పై ట్రాక్టర్ పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డైవింగ్ చేస్తున్న పూలాజీ సురక్షితంగా బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని జేసీబీతో మృతదేహాన్ని బయటకు తీశారు. పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మీబాయి, కుమారుడు రుద్రక్షిత్, కూతుళ్లు ప్రకృతి, ఏడాది వయస్సు ఉన్న పాప ఉంది. -
ఇసుక లారీ పట్టివేత
జైపూర్: మండలంలోని కిష్టాపూర్లో అక్రమంగా నిల్వచేసిన గోదావరి ఇసుకను రాత్రి లారీలో ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం వేకువజామున పట్టుకున్నారు. జిమ్మిడి నాగరాజు అక్రమంగా నిల్వచేసిన ఇసుక, షెట్పల్లికి చెందిన ధర్మాజీ సంతోశ్ జేసీబీ, ఇందారం గ్రామానికి చెందిన సాధిక్ లారీని స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ ఎస్సై ఉపేందర్రావు తెలిపారు. ఈమేరకు ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన లారీ, జేసీబీని జైపూర్ పోలీసుస్టేషన్కు తరలించామన్నారు. ఇసుక అక్రమ రవాణా.. వేలాలలో ప్రభుత్వం ఇచ్చిన ఇరిగేషన్శాఖ అనుమతులతో గతంలో ఇసుక క్వారీ కొనసాగింది. ఇటీవల అనుమతులు రద్దుతో మూతపడ్డాయి. వీటిని ఆసరాగా చేసుకున్న వేలాల, కిష్టాపూర్ వాసులు కొందరు నేతల సహకారంతో పగలు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను గోదావరి నది నుంచి ఒక్క చోటుకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రాత్రి లారీల్లో కిష్టాపూర్ సమీపంలో సుందిళ్ల బ్యారేజీ మీదుగా పెద్దపల్లి జిల్లాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. పట్టణాల్లో ఇసుకకు ఉన్న డిమాండ్తో టన్నుకు రూ.వెయ్యికిపైగా రావడంతో ఒక్కలారీలో 40 నుంచి 50 టన్నులు రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. -
పెరుగుతున్న హాజరు
● ఊపందుకున్న ఉపాధి ● ఉపాధి పనులపై కూలీల ఆసక్తి కోటపల్లి: గ్రామాల్లో వలసలు నివారించి ఉన్న ఊరిలో ఉపాధి కల్పించేందుకు తీసుకువచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జోరందుకున్నాయి. జాబ్కార్డు కలిగిన కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. జిల్లాలో ఉపాధిహామీ కూలీల హాజరు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతీ పంచాయతీకి సరాసరి 33 మంది పనిచేస్తున్నారు. ఈనెలాఖరు వరకు 50కి పని కల్పించాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. మొన్నటి వరకు యాసంగి పనులు ఉండటంతో కూలీలు అధికంగా అటువైపు మొగ్గు చూపారు. ఫిబ్రవరి చివరివారంలో జిల్లాలో 8 వేల వరకు కూలీలు పనిచేయగా ప్రస్తుతం 11 వేలకు పైగా హాజరవుతున్నారు. ఇప్పటికి ప్రారంభం కాని పనులు ఉంటే వాటి స్థానంలో ప్రత్యావయ్నాయ పనులు గుర్తించి ఈనెలాఖరు నాటికి పూర్తి చేయడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. పెరిగిన డిమాండ్ రాష్ట్రంలో ఉపాధి పనులు చేసిన భూమి లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో గ్రామాల్లో ఉపాధి పనులకు మరింత డిమాండ్ పెరుగుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పనులు ఎప్పుడు ప్రారంభమైతే అప్పుడు వస్తామని కొందరు కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్లను కలిసి కోరుతున్నట్లు పేర్కొన్నారు. అధికారులదే గుర్తించాల్సిన బాధ్యత ఏటా మార్చి నుంచి ఉపాధి పనులకు డిమాండ్ ఉంటుంది. ఇప్పటికి వంద రోజులు పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు మార్చి 31వ తేదీ వరకు పనులకు హాజరవ్వడానికి వీలులేదు. దీంతో ఆయా కుటుంబాలు పనులకు దూరంగా ఉంటున్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త వార్షిక ఏడాది ప్రారంభమవుతుంది. అప్పుడు కూలీలందరూ పనులు చేసుకోవడానికి అర్హత సాధిస్తారు. కూలీలు పనిచేయడానికి ఇప్పటి నుంచే సిద్ధంగా ఉన్నారు. పనులు గుర్తించి సిద్ధం చేసి పెట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. రైతులకు తప్పిన భారం గతంలో తమ పొలాలకు వెళ్లేందుకు తలా కొంత నగదు జమ చేసుకుని రోడ్లు వేసుకునే వాళ్లు. ప్రస్తుతం ఉపాధి హామీ కింద ఫార్మేషన్ రోడ్లు నిర్మిస్తుండటంతో అన్నదాతలకు ఆర్థికభారం తప్పినట్లయింది. లక్ష్యాన్ని చేరుకుంటాం ఉపాధి హామీ పథకం కింద జిల్లాకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకుంటాం. జాబ్కార్డు ఉండి అడిగిన వారందరికీ పనులు కల్పిస్తున్నాం. ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య పెరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించాం. – కిషన్, డీఆర్డీఏ, మంచిర్యాల జిల్లాలో హాజరు వివరాలు తేదీ హాజరైన కూలీలు ఫిబ్రవరి 28 8295 మార్చి 1 8357 మార్చి 2 9877 మార్చి 3 11035 మార్చి 4 11108జిల్లా మండలాలు పంచాయతీలు జాబ్కార్డులు కూలీలు ఆదిలాబాద్ 17 468 175747 370082 కుమురంభీం 15 335 129885 277287 నిర్మల్ 18 396 180572 370550 మంచిర్యాల 16 311 121067 255151 -
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● కాపాడిన గంగారాం యువకులునెన్నెల: చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని యువకులు గురువారం కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన కొమ్ము మొండయ్య గంగారాంలోని దామెర చెరువులోకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించగా అటుగా వెళ్లిన యువకులు సిగ్గం అంజి, సిగ్గం సంతోష్, రామటెంకి రాజేందర్, జాడి రాజ్కుమార్లు అతడిని బయటకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై ప్రసాద్ హోంగార్డు రామరాజును పంపించారు. సదరు వ్యక్తిని పోలీసుస్టేషన్కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. అతడి కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. ప్రాణాలు కాపాడిన గంగారాం యువకులను ఎస్సై అభినందించారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
అంతర్జాతీయ కళా పోటీల్లో ఆదిలాబాద్ జిల్లావాసి ప్రతిభ
ఆదిలాబాద్టౌన్: దేశంలోని కళాకారులు, ఐదు దేశాలకు పైగా ఎన్ఆర్ఐల మ ధ్య నిర్వహించిన సె షన్ 16వ అంతర్జాతీ య కళాపోటీల్లో పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన గాధరి చంద్రశేఖర్ ప్రతిభ కనబర్చాడు. ఇన్నోవిజే గ్లోబల్ టాలెంట్ సెర్చ్ ర్యాంక్ స్లాట్ ప్రకారం ఐఏసీ నుంచి డ్రాయింగ్, పెయింటింగ్ విభా గంలో ది మెడల్ ఆఫ్ అప్రిషియేషన్తోపాటు ది లెటర్ ఆఫ్ రికగ్నిషన్ లెవల్–2లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నా డు. అర్హులైన కళాకారుల్లో ఒకరిగా పేరు సాధించుకున్నాడు. అవార్డు అందుకున్న ఆయన్ను బంధుమిత్రులు అభినందనలు తెలిపారు. గోదావరికి సప్తహారతిబాసర: బాసర గోదావరినది పుష్కరఘాట్లో శ్రీవేద భారతీపీఠం వ్యవస్థాపకుడు వేద విద్యా నందగిరిస్వామి ఆధ్వర్యంలో సప్తహారతి అందించారు.గంగాహారతి ప్రారంభించి గురువా రం నాటికి 2,676వ రోజు పూర్తి చేసుకుంది. ప్ర తీరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు గోదారమ్మతల్లికి పూజలు నిర్వహిస్తారు. భక్తులు పాల్గొనాలని విద్యానందగిరిస్వామి కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుమంచిర్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని చున్నంబట్టి సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.సీఐ ప్రమోద్రావు కథన ం ప్రకారం.. హాజీపూర్ మండలం ముల్క ల్లకు చెందిన శెటపల్లి నరేశ్..జిల్లాకేంద్రంలోని మెడికల్ కాలేజీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. కాలేజీకి గురువారం బైక్పై వెళ్తుండగా సీసీసీ వైపు నుంచి మంచిర్యాలకు వస్తున్న లారీ బైక్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరేశ్ మామ రాజయ్య ఫిర్యాదుతో లారీ డ్రైవర్ నర్సింహరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. హోంగార్డు, మిత్రుడిపై కేసునిర్మల్టౌన్: ఓ వ్యక్తిని భయపెట్టి అతని వద్ద నుంచి డబ్బులు, సెల్ఫోన్ తీసుకున్న హోంగా ర్డు, ఆయన మిత్రుడిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మామడ మండలం కమల్కోట్కు చెందిన పత్తిరి రాజేశ్వర్ చికిత్స కోసం గురువారం జిల్లాకేంద్రంలోని ఓ హాస్పిటల్కు వచ్చాడు. అక్కడ ఓ మహిళ తన బంధువులతో మాట్లాడుతానంటూ రాజేశ్వర్ వద్ద నుంచి ఫోన్ తీసుకుని వెళ్లిపోయింది. గమనించిన హోంగార్డు సంజీవ్, అతని మిత్రుడు తి రుపతి ఇద్దరు పథకం ప్రకారం.. రాజేశ్వర్ వద్ద కు వెళ్లారు. తమ మిత్రుడు భార్యకు ఎందుకు ఫోన్ చేసి వేధిస్తున్నావని భయపెట్టి, రూ.5 వేలు, సెల్ఫోన్ తీసుకున్నారు. రాజేశ్వర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
మేము బాగున్నాం..ఆందోళన చెందొద్దు
మలేషియా అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కున్న ఆరుగురు ● అక్కడి జైలులో బాధితులను కలిసిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ● తమవారిని తీసుకురావాలని కుటుంబీకుల వేడుకోలు ఖానాపూర్: మలేషియాలో అక్రమ ఆయుధాల కేసులో ఇరుక్కుని జైలులో మగ్గుతున్న ఆరుగురు ‘మేము బాగున్నాం..తమ వాళ్లు ఆందోళన చెందవద’ని చెప్పాలని తనతో అన్నారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్నాయక్ తెలిపారు. కడెం మండలం లింగాపూర్, మున్యాల గ్రామాలకు చెందిన ఆరుగురు గతేడాది అక్టోబర్ 28న అక్రమ ఆయుధాల కేసులో జైలుపాలయ్యారు. ఈ విషయాన్ని స్థానిక నాయకులు, బాధితులు తన దృష్టికి తీసుకురాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మలేషియాలోని బాధితులను కలిసి వచ్చానని గల్ఫ్ బాధిత కుటుంబీకులకు వివరించారు. గురువారం ఖానాపూర్లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో జాన్సన్నాయక్ను గల్ఫ్ బాధిత కుటుంబీకులు కలిసి రోదించారు. మలేషియాలోని మలాక, ఏఎఫ్ మోసా ప్రాంతాల్లోని జైలులో ఉన్నవారు పనిచేసే ప్రాంతంలో అక్రమ ఆయుధాల కేసులో సంబంధం లేకున్నా ఇరుక్కున్నారని అన్నారు. ఎలాగైనా తమ వారిని తీసుకురావాలని కుటుంబీకులు వేడుకున్నారు. మాకు మీరే దిక్కని నిరుపేద కుటుంబాలకు చెందిన తాము, తమ వారిని బయటకు తీసుకువచ్చే మార్గం తెలియక గత ఐదునెలలుగా తడారని కళ్లతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జాన్సన్నాయక్ మాట్లాడుతూ మలేషియాలో అక్కడి న్యాయవాదితో కలిసి జైలులో ఉన్నవారిని ములాఖత్ అయినట్లు తెలిపారు. రెండు రోజులు అక్కడే ఉండి కేసు పూర్వపరాలు తెలుసుకోవడంతోపాటు వారిని బయటకు తీసుకువచ్చేలా చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మరో 20 రోజుల్లో బయటకు వచ్చేలా న్యాయవాదికి తగు సూచనలు చేసినట్లు తెలిపారు. -
వంతెనపై నుంచి పడి వ్యక్తి..
సిర్పూర్(టి): మండలంలోని వెంకట్రావ్పేట్ సమీపంలో పోడ్సా అంతర్రాష్ట్ర వంతెన పై నుంచి పడి వ్యక్తి కిందపడి మృతిచెందాడు. సిర్పూర్(టి) ఎస్సై కమలాకర్ కథనం ప్రకారం.. కాగజ్నగర్ మండలం ఈజ్గాం విలేజ్ నెంబర్ 12కు చెందిన ప్రశాంత్ సనా (31) వ్యాపారం నిమిత్తం బైక్పై బుధవారం ఉదయం మహారాష్ట్రలోని ధాబా గ్రామానికి వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వస్తున్నాడు. మహారాష్ట్ర–తెలంగాణ సరిహద్దులో ఉన్న పోడ్సా అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు. సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం మేరకు మృతుడి సోదరుడు ప్రమోతో సనా సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతుడు ప్రశాంత్ సనాగా గుర్తించాడు. సోదరుడు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. -
కాంగ్రెస్ నాయకుడిపై ఫిర్యాదు
ఆదిలాబాద్టౌన్: ప్రభుత్వ ఉద్యోగులపై తప్పుడు ఫిర్యాదులతో వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుడు సామ రూపేష్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కోరారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంద అశోక్, ఏ.నవీన్కుమార్తోపాటు వివిధ శాఖలకు చెందిన 50 మంది ప్రభుత్వ ఉద్యోగులు గురువారం వన్టౌన్ సీఐ సునీల్ కుమార్ను కలిసి లిఖితపూర్వక ఫిర్యాదు అందజేశారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు తనపై తప్పుడు ఫిర్యాదు చేసి, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించారన్నారు. జిల్లాకేంద్రంలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటించిన వార్తను తాను వాట్సప్లో పోస్ట్ చేశానని, ఇది ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈనెల 5న జరిగిన విషయమన్నారు. గజెటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కె.శివ కుమార్, సంఘ బాధ్యులు నరేశ్, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు సప్దార్ అలీ, ఆశన్న, నర్సింలు, గోపి, ప్రవీణ్, అనిల్, అరుణ్, చంద్రశేఖర్, సంతోష్, రాజేశ్వర్, వెంకటేశ్, కలీం పాల్గొన్నారు. -
భైంసాలో మూడిళ్లలో చోరీ
● ఓ బైక్ను ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని దొంగభైంసాటౌన్: పట్టణంలోని గోకుల్నగర్లో తాళాలు వేసి ఉన్న మూడిళ్లలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. కాలనీలోని సాయిచరణ్రెడ్డి, రాహుల్ బుధవారం వారి ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఇంట్లో శుభకార్యం నిమిత్తం వెళ్లగా, అదే కాలనీలో ఐలాజిక్ కంప్యూటర్ సెంటర్కు తాళం వేసి ఉంది. దీంతో గుర్తు తెలియని దొంగ ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి చొరబడి చోరీకి పాల్పడ్డాడు. బాధితులు గురువారం ఉదయం చేరుకుని చూడగా వస్తువులన్నీ చిందరవందరగా ఉండడం గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించి, క్లూస్టీంతో ఆధారాలు సేకరించారు. సాయిచరణ్రెడ్డి ఇంట్లో రూ.20వేల విలువైన ఆభరణాలు, రాహుల్ ఇంట్లో రూ.లక్ష వరకు నగదు, ఆభరణాలు, ఐలాజిక్ కంప్యూటర్ కేంద్రంలో ఓ బ్లాంక్ చెక్కు అపహరణకు గురైనట్లు బాధితులు పేర్కొన్నారు. అలాగే ఇదే కాలనీలో ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ సైతం ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు సీఐ గోపినాథ్ వెల్లడించారు. నిందితుడిని గుర్తించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. -
వరకట్న వేధింపులకు వివాహిత బలి
● ఈనెల 4న పురుగుల మందు తాగి.. ● చికిత్స పొందుతూ మృతి మంచిర్యాలరూరల్(హాజీపూర్): అత్తింటివారి అదనపు కట్న వేధింపులు భరించలేక వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. హాజీపూర్ ఎస్సై గోపతి సురేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊశన్నపల్లి గ్రామానికి చెందిన లావణ్య (23) 2020 ఫిబ్రవరి 15న హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన మాడ శంకర్రెడ్డితో వివాహమైంది. పెళ్లయిన మూడునెలల తర్వాత భర్త, అతని తల్లిదండ్రులు లక్ష్మి–జనార్దన్రెడ్డిలు అదనపు వరకట్నం తీసుకురావాలంటూ వేధింపులకు గురిచేస్తూ వస్తున్నారు. ఈ విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగింది. ఇరువురి మధ్య సఖ్యత ఏర్పడి కాపురం చేయసాగారు. వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినప్పటికీ భర్త, అతని తల్లిదండ్రులు అదనపు వరకట్నం తేవాలని వేధించసాగారు. లావణ్య భరించలేక ఈనెల 4న గుర్తుతెలియని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి పంపించారు. చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి తండ్రి రాములు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
యంత్రాలను వినియోగించుకోవాలి
శ్రీరాంపూర్: యంత్రాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డీ.సత్యనారాయణరావు తెలిపారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్ ఓసీపీని సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఓసీపీల్లో ఉత్పత్తి పెరుగాలంటే యంత్రాల పనిగంటలు పెంచుకోవాలని తెలిపారు. అనంతరం కోల్ ఎన్క్లోజర్ ప్రదేశాలను ప్రత్యక్షంగా పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జీఎం(సీహెచ్పీఎస్) తిరుమల్రావు, ఏరియా ఎస్ఓటు జీఎం యన్.సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ చంద్రశేఖర్రెడ్డి, ఓసీపీ పీఓ టీ.శ్రీనివాస్, డీజీఎంలు కేశవరావు, రవీందర్, క్వాలిటీ మేనేజర్ కే.వెంకటేశ్వర్రెడ్డి, ప్రాజెక్టు ఇంజనీర్ నాగరాజు, గని మేనేజర్ బ్రహ్మాజీ పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలు షురూ
● ఒక్క నిమిషం సడలింపుతో ఊరట ● పరీక్ష కేంద్రాలను పరిశీలించిన డీఐఈవోమంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం నిబంధనను సడలిస్తూ ఐదు నిమిషాలకు పెంచడం విద్యార్థులకు ఊరట కలిగించింది. పరీక్ష నిర్ధేశిత సమయం కంటే మూడు, నాలుగు నిమి షాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులనూ అనుమతించారు. కుటుంబసభ్యులతో కలిసి పరీక్ష సమయానికి ముందే వచ్చిన కొందరు నోటీసు బోర్డులో గది నంబరు తాఫీగా చూసుకున్నారు. ఈ నెల 22 వరకు జరిగే పరీక్షల కోసం 23 పరీక్ష కేంద్రాలు ఏ ర్పాటు చేశారు. మొదటి సంవత్సరం 6365 మంది విద్యార్థులకు గాను 6078 మంది హాజరు కాగా 287 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 5697 మందికి 5497 మంది పరీక్ష రాయగా.. 225 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 668 మందికి 606 మంది హాజరు కాగా 62 మంది రాలే దు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రాల్లోకి అనుమతించారు. చేతిగడియారాలు, పరీక్ష ప్యాడ్లపై చిన్నగా రాసినట్లు ఉన్నా అనుమతించలేదు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య పరిశీలించారు. పకడ్బందీగా నిర్వహించాలి జైపూర్: జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలను అవకతవకలకు తావులేకుండా లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆయన జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, తహసీల్దార్ వనజారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు సరిపడా ఫర్నిచర్, తాగునీరు, ఫ్యాన్లు, వెలుతురు ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. -
మూడో యూనిట్ పనులకు సిద్ధంగా ఉండాలి
జైపూర్: సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు విస్తరణలో భాగంగా మూడో యూనిట్(800 మెగా వాట్లు) ప్లాంటు నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) డి.సత్యనారాయణరావు అన్నా రు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటును సందర్శించారు. ప్లాంటు నిర్మాణ స్థలం పరిశీలించి పైలా న్ నిర్మాణంపై అధికారులతో చర్చించారు. 1200మెగావాట్ల బీటీజీ ఏరియాలో బాయిలర్స్ పరిశీలించి విద్యుత్ ఉత్పత్తి, ఉత్పాదకతను గమనించి ప్లాంటు నిర్వహణలో లోపాలు లేకుండా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ చేపట్టాలని తెలిపారు. సాయంత్రం ఎస్టీపీపీ ఓపెన్ అడిటోరియంలో ఇటీవల ఫైనాన్స్ జీఎంగా పని చేసి పదవీ విరమణ పొందిన టి.సుధాకర్ను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి ఈడీ శ్రీనివాసులు, వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు ప్రసాద్, వేణుగోపాలరావు, సీఎంవోఏఐ బ్రాంచ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్రావు, సముద్రాల శ్రీనివాస్, ఫారెస్ట్ మేనేజర్ చంద్రమణి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై చర్యలు
● 10 నుంచి ప్రజావాణి ప్రారంభం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్నస్పూర్: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. నస్పూర్లోని కలెక్టరేట్లో బుధవారం ఆయన అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీలు, తహసీల్దార్లు, సీఐలు, ఎస్సైలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితం నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 10న తిరిగి ప్రారంభం అవుతుందని తెలిపారు. ప్రజావాణి దరఖాస్తులపై పోలీస్, రెవెన్యు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. దరఖాస్తులు స్వీకరించిన తర్వాత కనీసం 15 రోజులు, గరిష్టంగా 21రోజుల్లో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. కోర్టులో పరిష్కారమయ్యే సమస్యలపై అర్జీదారులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బెదిరింపులు, ఆందోళనలు చేపట్టే వారిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, ఆక్రమిత ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, జైపూర్ ఏసీపీలు ప్రకాశ్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు. ఎన్నికల అధికారితో కలెక్టర్ భేటీ శ్రీరాంపూర్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణికుముదిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు వచ్చిన ఆమెను సీసీసీలోని సింగరేణి గెస్టుహౌజ్లో బుధవారం కలిసి పూల మొక్కను అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిపై చర్చించినట్లు తెలిసింది. -
బాలికల వసతిగృహంలో బీసీ వెల్ఫేర్ అధికారి బస
జైపూర్: మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతిగృహంలో మంగళవారం రాత్రి జిల్లా బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ అధికారి భాగ్యవతి బస చేశారు. విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. వసతిగృహా పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. అ నంతరం 10వ తరగతి విద్యార్థులకు వార్షిక ప రీక్షలపై అవగాహన కల్పించారు. ఒత్తిడికి గురి కావద్దని, ప్రశాంతతో చదవాలని, ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకుని ఎక్కువగా రివిజన్ చేస్తే ఉత్తీర్ణతతోపాటు మంచి మార్కులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ వసతిగృహా సంక్షేమాధికారి సుధాలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. -
లింగనిర్ధారణ పరీక్షలు చేయొద్దు
మంచిర్యాలటౌన్: జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయవద్దని, చేసినట్లు రుజువైతే చట్ట ప్రకారంగా చర్యలు తప్పవని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హరీశ్రాజ్ హెచ్చరించారు. జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల తనిఖీలను బుధవారం ప్రా రంభించారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ స్కా నింగ్ కేంద్రాన్ని డీఎంహెచ్వో పరిశీలించి సూ చనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ స్పెషల్డ్రైవ్లో భాగంగా జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నామని తెలి పారు. వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రో గ్రాం ఆఫీసర్ డాక్టర్ కృపాబాయి, మాస్ మీడి యా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
పట్టభద్రుల సీటూ కమలానిదే!
● గ్రాడ్యుయేట్లోనూ బీజేపీ హవా ● అధిక ఓట్లతో గెలిచిన అంజిరెడ్డి ● మూడు రోజులు సాగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ● ముగ్గురికే 92.52శాతం ఓట్లుసాక్షి ప్రతినిధి, కరీంనగర్/సాక్షి, పెద్దపల్లి: కరీంనగర్–ఆదిలాబాద్–నిజామాబాద్–మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి విజయం సాధించారు. మూడు రోజులపాటు ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో ఎలిమినేషన్ రౌండ్లతో బీజేపీ గెలుపు ఖరారైంది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత కూడా గెలుపునకు సరిపడా కోటా ఓట్లు రాకపోయినా అంజిరెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో ఆయననే విజేతగా ప్రకటించారు. చివరి వరకు హోరాహోరీగా పోరాడిన కాంగ్రెస్ అభ్యర్థి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం పార్టీ విజయం సాధించడంతో శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. సుదీర్ఘంగా సాగిన కౌంటింగ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫిబ్రవరి 27న జరగ్గా, మార్చి 3న కౌంటింగ్ ప్రారంభించారు. మూడు రోజులపాటు నిర్విరామంగా మూడు షిప్ట్ల్లో 800మంది కౌంటింగ్ సిబ్బంది కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో 21 టేబుళ్లపై లెక్కింపు పక్రియ చేపట్టారు. సోమవారం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు, మంగళవారం మధ్యాహ్నం వరకు చెల్లని ఓట్లను వడపోసి, కట్టలు కట్టారు. మంగళవారం రాత్రి నుంచి మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కింపు చేపట్టి బుధవారం ఉదయం 8.30గంటల నుంచి ఎలిమినేషన్ రౌండ్లను ప్రారంభించారు. ఎలిమినేషన్ రౌండ్లలో బరిలో ఉన్న 54మందిలో తక్కువ ఓట్లు కలిగి ఉన్న వారిని ఒక్కొక్కరిగా తొలగిస్తూ, వారికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతూ కౌంటింగ్ పక్రియను మూడు రోజులపాటు సుదీర్ఘంగా కొనసాగించారు. ముగ్గురికే 92.52శాతం ఓట్లు ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చెల్లుబాటైన ఓట్లలో 92.52శాతం(2,06,659) మొదటి ప్రాధాన్యత ఓట్లు ఈ ముగ్గురికే వచ్చాయి. మిగతా 53మంది స్వతంత్ర అభ్యర్థులు 16,684 ఓట్లు మాత్రమే సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ బీజేపీదే హవా నిర్ధారిత కోటా ఓట్ల కోసం అభ్యర్థుల ఎలిమినేషన్ పక్రియను చేపట్టగా అందులో సైతం బీజేపీ అభ్యర్థి అధిక్యం చూపారు. తొలుత 53మందిని ఎలిమినేషన్ చేసి రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించగా బీజేపీ అభ్యర్థికి 78,635 ఓట్లు, కాంగ్రెస్కు 73,644 ఓట్లు, బీఎస్పీకి 63,404 ఓట్లు వచ్చాయి. 53మందిని ఎలిమినేషన్ చేసినా.. కోటా ఓట్లను ఎవరూ సాధించకపోవడంతో మూడో స్థానంలోని బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నహరికృష్ణను ఎలిమినేట్ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బీఎస్పీ అభ్యర్థికి పోలైన ఓట్లలో చాలామంది రెండో ప్రాధాన్యత ఓటును బీజేపీకే వేయడంతో విజయం దక్కింది. -
● నేడు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ● మారనున్న భూగర్భ గని స్వరూపం
బెల్లంపల్లి: మందమర్రి ఏరియా శాంతిఖని లాంగ్వాల్ భూగర్భ గని ప్రాజెక్టు కోసం గురువారం ఉదయం 11గంటలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఆకెనపల్లి గ్రామ పంచాయతీ పరిధి శాంతిఖని పాత మైన్ కార్యాలయం ఆవరణలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నిజామాబాద్ ప్రాంతీయ కార్యాలయం, మంచిర్యాల జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ప్రజాభిప్రాయం సేకరిస్తారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి చేస్తున్న శాంతిఖని భూగర్భ గని పునఃధ్రువీకరణ కోసం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ(ఎంవోఈఎఫ్, సీసీ) 2018 ఏప్రిల్ 6న పర్యావరణ అనుమతుల కోసం జారీ చేసిన సూచనల నియామవళిలో ప్రతిపాదించిన మార్పులకు అనుగుణంగా మరోమారు ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమయ్యారు. 2006లో ఎంఓఈఎఫ్, సీసీ పర్యావరణ అనుమతి(ఈసీ)ని మంజూరు చేసింది. ఆ ప్రకారంగా 681.23 హెక్టార్ల ప్రాజెక్టు ప్రాంతంలో సాలీనా 1,167 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో గనిని నిర్వహించాలని ప్రతిపాదించారు. కొత్తగా భూ సేకరణ అవసరం లేకుండానే.. 1954లో అంకురార్పణ జరిగిన శాంతిఖని భూగర్భ గనిలో మూడేళ్ల ఎడబాటు తర్వాత 1957లో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత ప్రారంభమైంది. ఈ గని ప్రా రంభమై 71ఏళ్లు కావస్తోంది. ఇంకా ఈ గని భూగర్భంలో మరి కొన్నేళ్లపాటు తవ్వకాలు జరిపినా తరగని బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. తాజాగా పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో గని కార్యకలాపాల ని ర్వహణ కోసం అదనంగా భూమి సేకరించాల్సిన అవసరం లేదని సింగరేణి యాజమాన్యం స్పష్టం చే స్తుండగా.. గని భూగర్భంలో ప్రస్తుతం 500 మీటర్ల దిగువలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఈ గనిని ఓ పెన్కాస్ట్ గనిగా మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని, భూగర్భ భౌగోళిక స్థితిగతుల రీత్యా ఓపెన్కాస్ట్ గనిగా మార్చే వీలు ఏ కోశాన లేదని యాజమాన్యం స్పష్టం చేస్తోంది. సమీప భవిష్యత్లో గనిలో 500 మీటర్ల నుంచి 700 మీటర్ల లోతు వరకు బొగ్గు వెలికితీతకు అవకాశాలు ఉన్నాయి. ఇందుకు గాను శాంతిఖని గనిని లాంగ్వాల్ ప్రాజెక్టుగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టు బోర్డు ప్రభావిత గ్రామాల ప్రజల్లో భయాందోళనలుప్రతిపాదిత శాంతిఖని లాంగ్వాల్ ప్రాజెక్టు పరిసరాల్లో పలు గ్రామాలు ప్రభావితమయ్యే అ వకాశాలు ఉన్నాయి. తరాల నుంచి ఆయా గ్రామాల ప్రజలు సాగు భూములను నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రస్తు తం తలపెట్టిన పర్యావరణ ప్ర జాభిప్రాయ సేకరణతో సర్వ త్రా అనుమానాలు వ్యక్తమవుతునాయి. గని ప్రభావిత గ్రా మాలుగా ఆకెనపల్లి, లింగాపూ ర్, పాతబెల్లంపల్లి, గురిజాల, పెర్కపల్లి గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజల్లో నెలకొ న్న సందేహాలు, అనుమానాల ను నివృత్తి చేసి పునఃధ్రువీకరణ అంశంపై స్పష్టమైన అవగా హన కల్పించాల్సిన బాధ్యత రా ష్ట్ర కాలుష్య నియంత్రణ మండ లి, సింగరేణి యాజమాన్యంపై ఉంది. ఇప్పటికే గ్రామాల్లో శాంతిఖని గని ఓపెన్కాస్ట్ ప్రాజెక్టు కాబోతోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పర్యావరణ అనుమతి కోసం జరిగే ప్ర జాభిప్రాయ సేకరణకు ప్రభావి త గ్రామాల ప్రజలు, కార్మిక, రాజకీయపక్షాల శ్రేణులు, సా మాజిక కార్యకర్తలు హాజరై అభిప్రాయాలను వెల్లడించడానికి సిద్ధమయ్యారు. ప్రాజెక్టు స్వరూపం భూగర్భ గనిగా శాంతిఖని లాంగ్వాల్ ప్రా జెక్టు చేపడుతారు. ప్రాజెక్టు విస్తీర్ణం 681.23 హెక్టార్లు కాగా.. ఇందులో అటవీ భూమి 484.94హెక్టార్లు, అటవీయేతర భూమి 196.29 హెక్టార్లు ఉంది. గని జీవిత కాలం ఎనిమిదేళ్లు కాగా.. బోర్డు, ఫిల్లింగ్ మైనింగ్ పద్ధతిలో మైనింగ్ చేస్తారు. లాంగ్వాల్, రోడ్హెడర్, కంటిన్యూయస్ మైనర్ సాంకేతికతను వినియోగిస్తారు. మూలధన నిధులు రూ.307.840 కోట్లు కాగా.. పర్యావరణ పరిరక్షణకు రూ.50లక్షలు(మూల ధన నిధులు), రెవెన్యూ నిధులు సాలీనా రూ.39లక్షలు ఖర్చు చేస్తారు. గనిలో ఎనిమిది పొరలు గా బొగ్గు ఉన్నట్లు గుర్తించారు. ఎస్జే టాప్ సెక్షన్, ఎస్జే బాటమ్ సెక్షన్ పొరలుగా బొగ్గు వెలికి తీస్తారు. నిల్వలు.. జియోలాజికల్ నిల్వలు 48.872 మిలియన్ టన్నులు ఉండగా.. వెలికితీయదగిన నిల్వలు 30.93 మిలియన్ టన్నులు, భూగర్భ గని ద్వారా తీయగలిగే నిల్వలు 17.775 మిలి యన్ టన్నులు ఉన్నాయి. 2023 మార్చి 31వరకు 9.01మిలియన్ టన్నులు బొగ్గు వెలికి తీయగా.. 2023 ఏప్రిల్ 1నాటికి 8.765 మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయని, బొగ్గు సగటు గ్రేడ్ జీ–9గా గుర్తించారు. -
అరకొరగా పౌష్టికాహారం
● అంగన్వాడీ కేంద్రాలకు సరకుల సరఫరాలో జాప్యం ● గత నెల నుంచి రాని కందిపప్పు ● చిన్నారుల్లో పౌష్టికాహార లోపంమంచిర్యాలటౌన్: అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా.. అందుకు అవసరమైన సరుకుల సరఫరాలో ప్రతీనెల జాప్యం జరుగుతోంది. దీంతో పిల్లల ఎదుగుదల, పోషకాహార లోపానికి గురయ్యే అవకాశం ఉంది. మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతినెలా అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం, కందిపప్పు, కోడిగుడ్లు, పాలు, బాలామృతం, స్నాక్స్ అందించాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టెండర్లు నిర్వహిస్తున్నారు. ప్రతీ నెల లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాల్సి ఉండగా.. ఒక్కో నెలలో కేంద్రాలకు సరఫరా కావడం లేదు. గత నెలలో కందిపప్పు సరఫరా చేయకపోవడంతో లబ్ధిదారులకు అందించలేదు. రేషన్ బియ్యం గోదాముల నుంచి నేరుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉండగా.. గత నెలలో కొన్ని కేంద్రాలకు బియ్యం కూడా సరఫరా చేయలేదు. దీంతో లబ్ధిదారులకు పౌష్టికాహారం అందకుండా పోతోంది. కేంద్రాల్లో ప్రతీ రోజు మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాల్సి ఉంటుంది. గత నెల నుంచి పప్పు సరఫరా కాకపోవడంతో కూరగాయల భోజనం పెట్టాలన్నా టమాటా మినహా మిగతా వాటి ధరలు అధికంగా ఉండడం టీచర్లకు భారంగా మారుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో నిల్వ ఉన్న పప్పు కూడా అయిపోవడంతో అధిక ధరకు కూరగాయలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. మాతాశిశు మరణాల నివారణకు సరైన పౌష్టికాహారం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. గతంలో జిల్లాలోనే పాలు, పప్పు టెండర్లు నిర్వహించి సరఫరా చేసేవారు. కొన్నేళ్లుగా రాష్ట్ర స్థాయిలోనే టెండర్లు నిర్వహించి సరఫరా చేస్తున్నారు. ప్రతియేటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సరుకుల సరఫరాకు టెండర్లు నిర్వహిస్తుండగా.. ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరడంతో టెండర్ ప్రక్రియ ఆలస్యమైతే సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. కొన్ని కేంద్రాలకు చిన్న కోడిగుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో పోషకాలు అందడం లేదు. నెల నెల సరఫరా చేస్తేనే.. జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆరేళ్లలోపు చిన్నారులు 45,455 మంది, 4,245 మంది గర్భిణులు, 3,186 మంది బాలింతలు ప్రతీరోజు మధ్యాహ్నం పౌష్టికాహారం తీసుకుంటున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్నం భోజనం, బాలింతలకు 200 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నారు. ఎ క్కువగా పప్పు, ఆకుకూరలతో భోజనం వడ్డిస్తున్నారు. కోడిగుడ్లు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం వాటిపై ‘అంగన్వాడీ గుడ్డు–తెలంగాణ ప్రభుత్వం’ అనే ముద్ర వేస్తోంది. మొదటి విడతలో నీలం రంగు, రెండో విడత ఎరుపు రంగు, మూడో విడతలో ఆకుపచ్చ రంగుతో ముద్ర వేసి సరఫరా చేస్తున్నారు. ముద్రల వల్ల కోడిగుడ్ల పంపిణీ జరిగిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. కానీ మూడు విడతల గుడ్లను నెలలో ఒ క్కసారే ఇస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కోడిగుడ్లు, పాలు, కందిపప్పు, బాలా మృతం ప్రతినెలా ఆయా కేంద్రాలకు సరిపడా స రఫరా చేస్తే లబ్ధిదారులకు సకాలంలో అంది పౌ ష్టికాహారంతో కూడిన ఆహారం పొందే వీలుంది.సరఫరాకు ఇబ్బంది లేదుఅన్ని కేంద్రాలకు కందిపప్పును రెండు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. రేషన్ బియ్యం నేరుగా గోదాముల నుంచి సరఫరా అవుతున్నాయి. కొందరు టీచర్లు కందిపప్పు స్టాక్ ఉందని చెబితే ఆయా కేంద్రాల్లో వేయడం లేదని తెలిసింది. లబ్ధిదారులకు ప్రతినెలా సరిపడా సరుకులు కేంద్రానికి చేరేలా టీచర్లు చూడాలని, ఎక్కడైనా సరుకులు రాని పక్షంలో సూపర్వైజర్లు, సీడీపీవోలకు తెలపాలని చెబుతున్నాం. కొన్ని కేంద్రాల్లోనే సమస్య ఉన్నట్లు తెలిసింది. లబ్ధిదారులకు సరిపడేలా సరుకులను అందించేలా చూస్తాం. పౌష్టికాహారం సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదు. – రౌఫ్ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
● టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కై లాస్నగర్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేలా సమష్టిగా ముందుకు సాగాలని టీపీసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సూచించారు. బుధవారం గాంధీభవన్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లాస్థాయి సమీక్షా సమావేశానికి మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపూరావు, రేఖానాయక్, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్రెడ్డి, పా ర్టీ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, పార్లమెంట్ ఇన్చార్జి ఆత్రం సుగుణ, తదితరులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్గౌడ్, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులకు ఆమె స్పష్టమైన దిశానిర్దేశం చేశా రు. అన్ని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేలా ఐక్యంగా పనిచేయాలన్నారు. ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ పటిష్టత, స్థానిక సంస్థలన్నింటిలో విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. -
మహారాష్ట్రలో ట్రాలీ బోల్తా..
● గుడిహత్నూర్ వాసులకు గాయాలు గుడిహత్నూర్: మహారాష్ట్రలో ట్రాలీ వాహనం బోల్తా పడిన ఘటనలో మండలానికి చెందిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని గురుజ గ్రామానికి చెందిన జాదవ్ రాజు మంగళవారం 16 మంది బంధుమిత్రులతో కలిసి దైవ దర్శనానికి మహారాష్ట్రంలోని చంద్రపూర్కు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం కోర్పణ గ్రామ సమీపంలో బోల్తా కొట్టింది. దీంతో రాజుతో పాటు అతని తల్లి సీతాబాయి, మరో యువకుడు గెడం జగదీష్, నాందేడ్కు చెందిన మహిళ, రాజు మేన కోడలుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ముందుగా రిమ్స్ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సీతాబాయిని హైదరాబాద్కు, అత్త, మేనకోడలిని నాందేడ్ తరలించి చికిత్స అందిస్తున్నారు. గెడం జగదీష్తో పాటు పలువురు రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ప్రమాదం జరిగిందని కోర్పణ పోలీసులు తెలిపారు. -
జిల్లాకు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం
ఆదిలాబాద్: జిల్లాకు ఎయిర్ పోర్ట్ తప్పకుండా తీసుకువస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి మాట్లాడారు. ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న చేసిన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులు అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్న జోగు రామన్న జిల్లా ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఏర్పాటు కోసం 2014లో తాను ఎంపీగా ఉన్న సమయంలో కృషి చేశానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థలం ఇవ్వని కారణంగానే ఎయిర్ పోర్ట్ అకాడమీ పెండింగ్లో ఉందన్నారు. ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు సంబంధించి 2011లోనే సర్వే జరిగిందన్నారు. ఇదే రైల్వే లైనుకు ఆర్మూర్–ఆదిలాబాద్ వయా నిర్మల్ కు జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ చేసుకోవడానికి ఇద్దరు మంత్రులను కలిసినా పట్టించుకోలేదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు వేద వ్యాస్, రఘుపతి, లాలా మున్నా, నగేష్, కృష్ణ, కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● ఎంపీ గోడం నగేష్ -
121ప్రైవేటు డిగ్రీ కళాశాలల పరీక్ష ఫలితాలు నిలిపివేత
కేయూక్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కోర్సుల మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ల పరీక్ష ఫలితాలను ఈ నెల 4న రాత్రి విడుదల చేసిన విషయం తెలిసిందే. కానీ డీన్ అకాడమిక్కు ఫీజులు చెల్లించని 121 ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఫలితాలను నిలిపి వేశారు. ఇప్పటికే ఫీజులు చెల్లించాల్సి ఉండగా.. అప్పట్లో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ బాధ్యులు కేయూ వీసీ ప్రతాప్రెడ్డిని, అప్పటి రిజిస్ట్రార్ మల్లారెడ్డిని కలిశారు. ప్రభుత్వం మూడేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంటు ఇవ్వడం లేదని, కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. 15 నుంచి 20 రోజుల వరకు సమయం ఇచ్చారు. పరీక్షలు పూర్తయ్యాక యూనివర్సిటీ అకాడమిక్ డీన్ ఆయా కళాశాలలకు ఫీజులు చెల్లించాలని నోటీస్లు పంపారు. బుధవారం వరకు 121 ప్రైవేటు కళాశాలలు ఫీజులు చెల్లించలేదు. ఫీజులు చెల్లించిన కళాశాలల ఫలితాలు వెబ్సైట్లో ఉంచి చెల్లించని వారివి నిలిపివేశారు. తమ ఫలితాలు చూసుకునే వీలులేకపోవడంతో ఆయా కళాశాలల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఫీజులు చెల్లించినట్లు క్లియరెన్స్ వస్తేనే ఫలితాలు వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ రాజేందర్ స్పష్టం చేశారు. -
గోదావరిలో నీట మునిగి వ్యక్తి మృతి
బాసర: నిర్మల్ జిల్లా బాసర గోదావరిలో నీటమునిగి ఒకరు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బీదరిల్లి గ్రామానికి చెందిన డోన్ గాలే మారుతి (34) కుటుంబ సభ్యులతో కలసి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్తో పాటు ఇతర పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నాడు. తిరుగు ప్రయాణంలో బుధవారం బాసర గోదావరినదికి వచ్చారు. స్నానం చేస్తుండగా లోతు ఎక్కువగా ఉండడంతో నీటమునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై గణేశ్ తెలిపారు. గోండుగూడ వద్ద మరొకరు..కడెం: మండలంలోని చిట్యాల్ గోండుగూడకు చెందిన పందిరి జలపతి (56) గోదావరి నదిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జలపతి ఈనెల 4న స్నానం చేయడానికి గోదావరినదికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుని భార్య సీతాబాయి ఫిర్యాదు మేరకు బుధవా రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి..తాండూర్: ఈ నెల 2న రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కిరణ్కుమార్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచ్చులాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన పెరుగు రాజయ్య (57) ఐబీ నుంచి నయారా పెట్రోల్బంక్ వద్దకు బైక్పై వెళ్తుండగా రేచినీ గ్రామానికి చెందిన భీంరావు ద్విచక్ర వాహనంపై ఎదురుగా వచ్చి ఢీ కొట్టాడు. ఘటనలో రాజయ్యకు తీవ్ర గాయాలు కావడంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీంరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. చేపలు పట్టేందుకు వెళ్లి మహిళ..సోన్: చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మహిళ మృతి చెందిన సంఘటన నిర్మల్ జిల్లాలోని సోన్ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి (54) మంగళవారం సరస్వతీ కాలువలో చేపలు పట్టడానికి వెళ్లింది. చేపలు పడుతున్న క్రమంలో ఒడ్డు మీద నుంచి ప్రమాదవశాత్తు కాలుజారి కాలువలో పడిపోయింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం పోలీసులు మృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ హైమద్ మోహినుద్దీన్ తెలిపారు. -
గంజాయి సేవిస్తున్న పలువురి అరెస్టు
చెన్నూర్: మండలంలోని కిష్టంపేట శివారులో గంజాయి సేవిస్తున్న పలువురిని అరెస్టు చేసినట్లు సీఐ రవీందర్ తెలిపారు. పోలీసు స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిష్టంపేట జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న పదిమంది యువకులను పట్టుకుని విచారించగా గంజాయి సేవిస్తున్నట్లు ఒప్పుకున్నారన్నారు. వారి వద్ద 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో ఒకరు మైనర్కాగా మరొకరు పరారయ్యారన్నారు. సమావేశంలో ఎస్సై సుబ్బారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
మలేషియా జైలులో కడెం వాసులు
కడెం: మండలంలోని లింగాపూర్కు చెందిన రాచకొండ నరేష్, తలారి భాస్కర్, గురిజాల శంకర్, గురిజాల రాజేశ్వర్, గుండా శ్రీనివాస్, దస్తురాబాద్ మండలంలోని మూన్యాల్ గ్రామానికి చెందిన యమునూరి రవీందర్ ఉపాధి నిమిత్తం గతేడాది మలేషియాకు వెళ్లారు. కొన్ని కారణాల వలన జైలులో ఉన్నారని కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్ కలిసి విడుదల చేయించాలని వేడుకున్నారు. మలేషియా వెళ్లి ఉన్నతాధికారులను సంప్రదించాడు. అక్రమ ఆయుధ చట్టం కింద జైలులో ఉన్నారని తెలుసుకుని బాధితులను పరామర్శించాడు. విడుదల చేసేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించాడు. -
ఒకరిపై కేసు
కౌటాల: మండలంలోని వీరవెల్లి గ్రామానికి చెందిన ఒకరిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై మధుకర్ తెలిపారు. వీరవెల్లి గ్రామానికి చెందిన కేడ్కర్ నాగోరాం ఈ నెల 1న అదే గ్రామానికి చెందిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో తన కోరిక తీర్చకుంటే చంపేస్తానంటూ అక్కడే ఉన్న బకెట్తో దాడి చేయడంతో ఆమె ఎడమ కంటిపై గాయాలయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. ‘తుమ్మల’కు కవిసంధ్య పురస్కారంనిర్మల్ఖిల్లా: ప్రపంచ కవితా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కు చెందిన కవిసంధ్య సాహితీ సంస్థ, నారాయణరావు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి కవితా పోటీలలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన కవి, ప్రభుత్వ ఉపాధ్యాయుడు తుమ్మల దేవరావుకు కవిసంధ్య పురస్కారం దక్కింది. అతను రచించిన ‘వరి గొలకులు’ కవిత కన్సోలేషన్ బహుమతికి ఎంపికై నట్లు కవిసంధ్య సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈట శిఖామణి, దాట్ల దేవదానం రాజు తెలిపారు. ఈ నెల 23న హైదరాబాద్లోని తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంనర్సాపూర్(జి): మండలంలోని బూరుగుపల్లి (జి) గ్రామానికి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు బుధవారం షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. దినేష్ తన ఇంటికి తాళం వేసి భార్యతో కలిసి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ క్రమంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనలో ఇంట్లోని సామగ్రితో పాటు రూ.2 లక్షల 50 వేల నగదు, ఐదు గ్రాముల బంగారం కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని ఆర్ఐ సుమలత , పంచాయతీ కార్యదర్శి శివకుమార్ సందర్శించి పంచనామా నిర్వహించారు. పలువురిపై వీధికుక్కల దాడిభీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో బుధవారం వీధి కుక్కలు దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్తున్న హర్ష అనే బాలుడిపై, కొట్రంగి చంద్రక్క, నాజర్పై క కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. బాధితులను బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు. కీచక ప్రధానోపాధ్యాయుడిపై కేసుమంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో పని చేస్తున్న ఓ కీచక ప్రధానోపాధ్యాయుడిపై కేసు నమోదైంది. రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నైతం శ్రీనివాస్ రామకృష్ణాపూర్కు చెందిన ఓ ఉపాధ్యాయురాలిని తరచూ వేధింపులకు గురిచేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. గతంలో విద్యార్థులను సైతం వేధింపులకు గురి చేసినట్లు ఘటనలు ఉన్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
విద్యుత్షాక్తో యువకుడు మృతి
సిరికొండ: విద్యుత్షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. తుమ్మల్పాడ్ గ్రామానికి చెందిన ఇంగోలే నాగోరావ్, కుసుంబాయి దంపతుల రెండో కుమారుడు ఇంగోలే విలాస్ (24)బుధవారం ఇంటి మరమ్మతు పనులు చేస్తుండగా విద్యుత్ వైరుకు తగలడంతో షాక్కు గురయ్యాడు. కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఇచ్చోడ ఆస్పత్రికి తరలించేలోగానే మృతి చెందాడు. మృతుడు ఆరునెలల క్రితమే దుబాయ్ నుంచి ఇంటికి వచ్చాడని గ్రామస్తులు తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు..నెన్నెల: గత నెల 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ప్రసాద్ తెలి పారు. బెల్లంపల్లి మండలం ఆకెనపల్లికి చెందిన తోకల రాజేశం (34) అత్తగారి ఊరైన నెన్నెల మండలం మైలారంలో ఉంటున్నాడు. ఫిబ్రవరి 28న మద్యం మత్తులో పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరుడు తోకల సుదర్శన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. స్వగ్రామం చేరిన మృతదేహంలక్సెట్టిపేట: గత నెల 27న ఓమన్లో మృతి చెందిన వలస కూలీ మృతదేహం బుధవారం స్వగ్రామం చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని హన్మంతుపల్లి గ్రామానికి చెందిన గుమ్ముల కొమురయ్య(48) ఉపాధి నిమిత్తం రెండేళ్లక్రితం ఓమన్ దేశానికి వెళ్లి అక్కడ భవన నిర్మాణ రంగంలో కూలీగా పనిచేస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న భవనం మూడో అంతస్తులో పనిచేస్తుండగా అదుపుతప్పి కిందపడిపోవడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. బుధవారం మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించా రు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వృద్ధుడు ఆత్మహత్యదండేపల్లి: గడ్డిమందు తాగి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై తహసినొద్దీన్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వెల్గనూర్కు చెందిన అక్కల మల్లేశం (79) కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు కుమారులను కోల్పోయాడు. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో జీవితంపై విరక్తి చెందడంతో ఈనెల 4న గడ్డిమందు తాగి వాంతులు చేసుకోవడంతో గమనించిన స్థానికులు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు రెఫర్ చేయగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుని కుమార్తె రాజవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు. అధికారి ఇంట్లో చోరీకి యత్నంభైంసాటౌన్: పట్టణంలోని సాయికాటన్ ఏరియాలో ఉంటున్న ఆర్అండ్బీ డీఈఈ సునీల్ ఇంట్లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు చోరీకి వి ఫలయత్నం చేశారు. సాయికాటన్లోని ఓ ఇంట్లో అ ద్దెకు ఉంటున్న భైంసా ఆర్అండ్బీ డీఈఈ సునీల్ మంగళవారం ఇంటికి తాళం వేసి వెళ్లాడు. బుధవా రం ఇంటి తాళం తెరిచి ఉండడం గమనించిన స్థా నికుల సమాచారంతో అతను వచ్చి పరిశీలించగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగదు లేవని చెప్పారు. అడవి పందుల దాడిలో ఇద్దరికి గాయాలుపెంబి: మండలంలోని సిక్కిగూడ గ్రామానికి చెందిన సిడాం లక్ష్మణ్, సిడాం తుకారాం మంగళవారం రాత్రి షెట్పల్లి సమీపంలో ఉన్న చేనుకు కాపలాగా వెళ్తుండగా అడవి పందులు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. 108లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పక్షుల లెక్క తేలింది
● జన్నారం డివిజన్లో 201 రకాలు గుర్తింపు ● అటవీశాఖ, వరల్డ్వైడ్ లైఫ్ఫండ్ ఆధ్వర్యంలో సర్వే జన్నారం(ఖానాపూర్): పక్షుల గమనానికి పరిధిలు లేవు. అవి ఖండాలు దాటి ప్రయాణిస్తూ పర్యావరణంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. పర్యావరణంలో జరిగే పెను మార్పుల వల్ల కొన్ని జాతుల పక్షులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వలస వెళ్తుంటాయి. ఇలాంటి పక్షులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పక్షులు ఎంతో జీవవైవిద్యం ప్రదర్శిస్తూ మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా పక్షుల వివరాలను తెలుసుకునేందుకు అటవీశాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థలు సంయుక్తంగా సర్వే నిర్వహించాయి. ఈ ఏడాది జనవరి 24 నుంచి 26 వరకు జంతుగణన మాదిరి కవ్వాల్ టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో పక్షుల గణన చేశారు. 28 మంది సభ్యులు ఏడు బృందాలుగా ఏర్పడి డివిజన్లోని 40 అటవీ బీట్లలో సర్వే చేశారు. డివిజన్లో సంచరిస్తున్న పక్షుల వివరాలను సేకరించారు. వీటితో పాటుగా అంతరించిపోయే దశలో ఎన్నిరకాల పక్షులు ఉన్నాయి? ఏఏ కేటగిరీలో ఏ పక్షులున్నాయో సర్వేలో తేలినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 201 రకాల పక్షులు జన్నారం అటవీ డివిజన్లో నిర్వహించిన సర్వేలో 201 రకాల పక్షులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అటవీశాఖ, వరల్డ్ వైడ్ లైఫ్ ఫండ్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) సంస్థ ఆధ్వర్యంలో పక్షులపై సమగ్ర పరిశీలన చేశారు. 11 రకాల పక్షి జాతులు అంతరించి పోయే దశలో ఉన్నాయని, 57 రకాల పక్షులు కేవలం అటవీ, ప్లాంటేషన్ ఏరియాలో సంచరిస్తున్నాయని, మన పరిసరాల్లో తిరిగే పక్షులు 18, కీటకాలు తినే పక్షులు 99 రకాలు, కేవలం పండ్లను మాత్రమే తినే పక్షులు 16 రకాలు ఉన్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. పక్షులపై అవగాహన ప్రస్తుత రోజుల్లో పక్షుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విద్యార్థి దశ నుంచే దీనిని ఒక హాబీగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో పక్షులు, వాటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అటవీశాఖ నిర్ణయం తీసుకోనుంది. ఇందులో భాగంగా డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సైన్స్ టీచర్లను అడవుల్లోకి తీసుకెళ్లి బర్డ్వాక్ కార్యక్రమం చేపట్టనున్నారు. వీటితో పాటుగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ ప్రతినిధులతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. ఉపాధ్యాయులు నేర్చుకున్న అంశాలు పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించనున్నారు. ఈ విషయంపై అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. పక్షుల సంరక్షణపై, పక్షులు అంతరిస్తే కలిగే నష్టాలు, జీవ వైవిద్యంలో పక్షుల పాత్ర, తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ప్రతీ ఆర్నెల్లకోసారి.. ప్రతీ ఆర్నెల్లకోసారి పక్షులపై అవగాహన కల్పించే యోచన చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పక్షుల రకాలను గుర్తించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నాం. ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వలంటీర్లగా నియమించాలని యోచిస్తున్నాం. అర్హులైన స్థానికులను నేచర్ గైడ్లుగా నియమిస్తాం. – శివ్ఆశిష్సింగ్, జిల్లా అటవీశాఖ అధికారి, మంచిర్యాల -
విద్యుత్ తీగలు అమర్చిన ఇద్దరి అరెస్టు
పెంచికల్పేట్: వన్యప్రాణులను వేటాడటానికి విద్యుత్ తీగలను అమర్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎఫ్ఆర్వో అనిల్ కుమార్ తెలి పారు. కమ్మర్గాం గ్రామానికి చెందిన తలండి వెంకటేశ్, సిడాం అశోక్ వన్యప్రాణులను వేటడానికి పంట చేనులో విద్యుత్ తీగలను అమర్చరానే పక్కా సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేసి అదుపులో తీసుకుని విచారించగా నేరం ఒప్పుకున్నారు. నిందితులను ఇద్దరిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలిపారు. వారి వెంట ఎఫ్ఎస్వో జగన్మోహన్, ఎఫ్బీవో విజయలక్ష్మీ, సిబ్బంది ఉన్నారు. -
వివాహిత హత్య కేసులో భర్త అరెస్టు
పెంచికల్పేట్: మండలంలోని లోడుపల్లి గ్రామానికి చెందిన గుర్లె లలితను ఈ నెల 2న ఆదివారం ఆమె భర్త గణేశ్ హత్య చేసినట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు. పెంచికల్పేట్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ కొద్ది రోజులుగా గణేశ్ భార్యపైన అనుమానంతో వేధింపులకు పాల్పడుతున్నాడు. వ్యవసాయ పనులకు వెళ్లిన దంపతులు ఆదివారం గ్రామ సమీపంలోని పంట చేనులో గొడవపడ్డారు. భార్య ఎదురుతిరగడంతో కోపంతో చాతిపైన కొట్టడంతో లలిత కింద పడిపోయింది. వెంటనే తన మెడలో ఉన్న తువ్వాలు మొఖం మీద కప్పి ముక్కు, నోరు మూయడంతో ఊపిరాడక మృతి చెందింది. మృతురాలి తల్లి తానుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని ఎల్కపల్లి బస్టాండ్లో అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన తువ్వాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎస్సై కొమురయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
ఖి‘లేడి’ల అరెస్ట్
● ఆదిలాబాద్లో బంగారు అభరణాల చోరీ ● భర్తతోపాటు ఇద్దరు భార్యల తతంగం ఆదిలాబాద్టౌన్: జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చోరీలకు పాల్పడుతున్న భర్తతో పాటు ఇద్దరు భార్యలను అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా చికల్తానా గ్రామానికి చెందిన తేజ్ షిందేకు మైనా షిందే, జ్యోతి షిందే ఇద్దరు భార్యలు. ఫిబ్రవరి 23న మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్కు వచ్చారు. ఉట్నూర్ మండలంలోని నాగాపూర్కు చెందిన ఏరుకొండ లక్ష్మి తన స్వగ్రామానికి వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా సహాయపడినట్లుగా ఆమె చేతిలో నుంచి బ్యాగు తీసుకున్నారు. మీరు బస్సు ఎక్కండని చెప్పి బ్యాగులో ఉన్న ఆరు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. బాధితురాలు బ్యాగు చూసుకోగా ఆభరణాలు కన్పించకపోవడంతో ఆందోళనకు గురై టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్చౌక్ ఏరియాలోని రాజరాజేశ్వరస్వామి బట్టల దుకాణంలో గంగమ్మకు చెందిన 19 గ్రాముల పుస్తెల తాడు ఎత్తుకెళ్లగా వన్టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. మంగళవారం ఆదిలాబాద్ బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలను పోలీసులు విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లుగా అంగీకరించారు. వారి నుంచి మూడు గ్రాముల ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. తేజ్ షిందే పరారీలో ఉన్నాడు. మిగతా బంగారం తమ భర్త వద్ద ఉందని ఆ మహిళలు చెప్పినట్లుగా సీఐ వెల్లడించారు. పట్టుకున్న వారిలో ఎస్సై విష్ణు ప్రకాష్ , సిబ్బంది బబిత, అనసూయ, సౌజన్య, నరేందర్ , కుంట ప్రవీణ్, తదితరులు ఉన్నారు. -
గోదావరిలోపడి వ్యక్తి మృతి
లక్సెట్టిపేట(మంచిర్యాల): ప్రమాదవశాత్తు గోదావరిలో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ముల్కల్లగూడెంకు చెందిన సత్యనారాయణ (44) కాగజ్నగర్లోని ఎస్సీ వసతిగృహంలో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయన మంగళవారం ఉదయం గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడంతో మృతి చెందాడు. మృతుని భార్య సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు..నస్పూర్: పట్టణ పరిధిలోని శ్రీరాంపూర్–బెల్లంపల్లి హైవే బైపాస్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సుగుణాకర్ తెలిపారు. ఛత్తీస్గఢ్కు చెందిన భూపేందర్ సింగ్ (41)రామగుండం ఎన్టీపీసీలోని ఓ కంపెనీలో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం కారులో గోదావరిఖని వైపు నుంచి మందమర్రి వైపు వెళ్తుండగా సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆల యం సమీపంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద లభించిన గుర్తింపు కార్డులో ఉన్న వివరాలు సేకరించి సమాచారాన్ని అతని కుటుంబ సభ్యులకు అందించారు. మృత దేహాన్ని మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో భద్రపర్చామని, కుటుంబ సభ్యులు వచ్చాక అప్పగిస్తామన్నారు. తప్పిన ప్రమాదందండేపల్లి: మండలంలోని మేదరిపేట గ్రామ పంచాయతీ కార్యాలయ ట్రాక్టర్ మంగళవారం ఆటోమేటిక్గా స్టార్టయి చెట్టును ఢీకొని ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మల్టీపర్పస్ వర్కర్ ఇంటి సమీపంలో నిలిపి ఉంచిన ట్రాక్టర్లో ఆడుకుంటున్న పిల్లలు క్లచ్పై కాలుపెట్టడంతో ఆటోమేటిక్గా స్టార్టయిన ట్రాక్టర్ కొంతదూరం వెళ్లి పక్కనున్న చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలిపాతమంచిర్యాల: అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సంఘం (సీఐటీయూ అనుభందం) జిల్లా అధ్యక్షురాలు భానుమతి అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పలుమార్లు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కోశాధికారి మహేశ్వరి, నాయకురాళ్లు పద్మ, సరిత, అనురాధ, సబిత, తదితరులు పాల్గొన్నారు. కేకేఓసీలో వోల్వో ఆపరేటర్కు గాయాలుమందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే ఓసీలోని మట్టితీత పనుల వద్ద మంగళవారం జరిగిన ప్రమాదంలో వోల్వో ఆపరేటర్కు గాయాలయ్యాయి. ఓసీలోని ఓబీ తొలగింపు వద్ద మట్టితో నింపిన వాహనం ముందుకు వెళ్లే క్రమంలో బ్రేకులు ఫెయిల్ కావడంతో అక్కడే ఉన్న మరో వాహనాన్ని ఢీకొట్టడంతో అందులో ఉన్న ఆపరేటర్ రాజేశంకు గాయాలయ్యాయి. తోటి ఆపరేటర్లు రామకృష్ణాపూర్లోని సింగరేణి ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మహిళపై కోతుల దాడిబోథ్: మండల కేంద్రానికి చెందిన గంగమ్మపై మంగళవారం కోతులు దాడి చేశాయి. మందగా వచ్చిన కోతులు ఒక్కసారిగా ఆమైపె దాడి చేయడంతో గాయాలయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బోథ్ సీహెచ్సీకి తరలించారు. -
విద్యార్థులు క్రీడానైపుణ్యం ప్రదర్శించాలి
బాసర: విద్యార్థులు క్రీడా నైపుణ్యం ప్రదర్శించాలని ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. మంగళవారం బాసర ఆర్జీయూకేటీలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అథ్లెటిక్స్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ డేలో భాగంగా 30 అథ్లెటిక్స్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో రణధీర్ సాగి, స్పెషల్ ఆఫీసర్ ప్రభాకర్ రావు, పీడీలు రవికిరణ్, శ్యాంబాబు, పీఈటీలు రఘువీర్, వసంత, స్వప్న పాల్గొన్నారు. -
‘ఓరియంట్’లో భద్రత వారోత్సవాలు
కాసిపేట: మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీలో మంగళవారం భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యూనిట్ హెడ్ బాలగిరిధర్ భద్రత జెండా ఆవిష్కరించారు. అనంతరం డీఏవీ పాఠశాల విద్యార్థులకు, ఉద్యోగులకు, కార్మికులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ నెల 4 నుంచి 10 వరకు నిర్వహించనున్న కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికులతో భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈకార్యక్రమంలో కంపెనీ సీనియర్ జీఎం ఆనంద్ కులకర్ణి, డీఏవీ ప్రిన్సిపాల్ కిరణ్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్టౌన్: నూతనంగా నియామకమైన ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గెజిటెడ్ నం.1 పాఠశాలలో డీఎస్సీ 2024 ద్వారా నియామకమైన ఉమ్మడి జిల్లా పరిధిలోని 300 మంది ఎస్ఏలకు వృత్యంతర ప్రేరణ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయులు పుస్తకాలను సమర్థవంతంగా ఉపయోగించి విద్యాబోధన చేయాలన్నారు. విద్యా ప్రమాణాలను మెరుగుపర్చి మంచి ఫలితాలు సాధించాలన్నారు. రూపకార, సమీకృత అంచనాలు, డిజిటల్ కాంటెంట్, ఎఫ్ఎల్ఎన్, స్కూల్ ఎడ్యుకేషన్ యాప్, యూడైస్ తదితర కార్యక్రమాల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాల నం.2లో బయోసైన్స్, బాలక్ మందిర్లో గణితం, హింది, ప్రభుత్వ బాలికల పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, గెజిటెడ్ నం.1లో సాంఘిక శాస్త్రం, సరస్వతినగర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారులు సుజాత్ఖాన్, నారాయణ, శ్రీకాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
బాసరలో భారతీస్వామి పూజలు
బాసర: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని మంగళవారం శ్రీచిదానంద ఆశ్ర మ భువనేశ్వరి విజయవాడ పీఠం పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీస్వామి దర్శించుకున్నా రు. ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతతాండూర్: ఆటోలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాజ్కుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి బెల్లంపల్లి నుంచి తాండూర్ వైపు వెళ్తున్న ట్రాలీని బోయపల్లి బోర్డు వద్ద తనిఖీ చేయగా 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం లభ్యమైనట్లు ఆయన పేర్కొన్నారు. తాండూర్ మండలం తంగళ్లపల్లికి చెందిన దుర్గం శ్రీకాంత్, బుల్లి చందు, కునుగల తిరుపతిని అదుపులోకి తీసుకోగా గోవిందుల శ్రీనివాస్ పరారైనట్లు తెలిపారు. చింతగూడ అడవిలో మంటలుఆదిలాబాద్రూరల్: మండలంలోని చింతగూడ అటవీ ప్రాంతంలో సోమవారం రాత్రి కార్చిచ్చు అంటుకుంది. ప్రజలు గమనించి అటవీ శాఖ, పోలీసులకు సమాచారం అందించారు. విషయం ఎస్పీ గౌస్ ఆలం దృష్టికి వెళ్లడంతో పోలీసులు, అగ్నిమాపక, అటవీ శాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో మంటలు ఆర్పివేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్వో గులాబ్సింగ్ మాట్లాడుతూ రాలిపోయిన ఆకులకు నిప్పంటుకోవడంతో సుమారు 4 నుంచి 5 హెక్టార్ల వరకు మంటలు చెలరేగడంతో సిబ్బందితో కలిసి ఆర్పివేశామన్నారు. సింగరేణి పాఠశాలలో నాణ్యమైన విద్య మందమర్రిరూరల్: సింగరేణి పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుందని సింగరేణి ఎడ్యుకేషన్ సెక్రెటరీ శ్రీనివాస్ అన్నారు. మందమర్రి ఏరియాలోని సింగరేణి హైస్కూల్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థకు చెందిన పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హెచ్ఎం పురుషోత్తం, సీసీసీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నరసింహస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సోలార్ పవర్ప్లాంట్లకు స్థల పరిశీలన
నెన్నెల/దండేపల్లి: మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు కేటాయించిన స్థలాలను రెడ్కో సంస్థ మేనేజర్ శ్రీమన్నారాయణ, డీఆర్డీవో కిషన్ మంగళవారం పరిశీలించారు. నెన్నెల శివారులోని సర్వేనంబరు 671లో నాలుగు ఎకరాలు సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు కేటాయించారు. ఒక మెగావాట్ ఉత్పత్తి సామర్థ్యంతో సోలార్ పవర్ ప్లాంటు ఏర్పాటుకు అనుకూలంగా ఉందని, రెండు కిలోమీటర్ల దూరంలోనే 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ఉండడంతో ఉత్పత్తి చేసిన విద్యుత్ విక్రయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులు పేర్కొన్నారు. ప్లాంట్ల ఏర్పాటుతో మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే అవకాశం ఉందన్నారు. సెర్ప్ ద్వారా మహిళా సంఘాలకు రుణాలు అందించనున్నట్లు తెలిపారు. దండేపల్లి మండలం వెల్గనూర్ గ్రామ పంచాయతీ పరిధి అందుగులపేటలో స్థలాన్ని పరిశీలించారు. నాలుగు ఎకరాల స్థలంలో రూ.3కోట్లతో సోలార్పవర్ ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెన్నెల ఎంపీడీవో దేవేందర్రెడ్డి, డీపీఎం సంజీవ్, ఏపీఎంలు విజయలక్ష్మి, పంజాల ప్రకాష్గౌడ్, ఏపీవో నరేష్, ఎంఆర్ఐ సులోచన, దండేపల్లి ఎంపీడీవో ప్రసాద్, ఆర్ఐ భూమన్న, విద్యుత్ ఏఈ బాపు, ఏపీఎం బ్రహ్మయ్య, ఏపీవో దుర్గాదాస్, తదితరులు పాల్గొన్నారు. -
పత్తి రైతుకు టీఆర్ తిప్పలు..!
● కౌలు రైతులకు దళారులే దిక్కు ● మద్దతు ధర దక్కక నష్టం మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో కొద్ది రోజులుగా టెంపరరీ రిజిస్ట్రేషన్(టీఆర్) పత్రాల జారీ నిలిపివేతతో కౌలు రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోంది. వ్యవసాయ అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నా మార్కెట్ అధికారులు టీఆర్ పత్రాలు ఇవ్వడం లేదు. దీంతో సీసీఐ కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోలుకు అధికారులు నిరాకరిస్తున్నారు. ఫలితంగా మద్దతు ధర దక్కకుండా పోతోంది. జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట మార్కెట్ యార్డు పరిధిలోని జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్కెటింగ్ అధికారులు జనవరి 10 వరకు టీఆర్ పత్రాలు జారీ చేశారు. రెండు నెలల్లో గతేడాది కంటే అధికంగా పత్తి రావడం, కొనుగోళ్లపై ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. మార్కెటింగ్ అధికారులు దళారులతో కుమ్మకై ్క టీఆర్ పత్రాలు జారీ చేసి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని చెన్నూర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి రామాంజనేయులును సస్పెండ్ చేశారు. జిల్లాలో 90శాతం కొనుగోలు చేయడం జరిగిందని సీసీఐ జనవరిలో 13రోజులపాటు కొనుగోలు కేంద్రాలు మూసివేసింది. సాగు లక్ష్యం మేరకు కొనుగోలు జరిగిందని కేంద్రాల ఎత్తివేతకు సిద్ధమైంది. దీంతో రైతులు పది రోజులపాటు మిల్లుల వద్ద పడిగాపులు కాస్తూ.. రాస్తారోకోలు చేపట్టారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లడంతో తిరిగి కొనుగోలు చేపట్టారు. కానీ టీఆర్ పత్రాలు జారీ చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు మద్దతు ధర కంటే రూ.500 నుంచి రూ.800 తక్కువకు విక్రయించి నష్టపోతున్నారు. ఇళ్లలోనే 25 శాతం నిల్వలు జిల్లాలో 1.56 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. 12లక్షల నుంచి 13 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. కానీ వాతావరణ ప రిస్థితులు అనుకూలించక 10 లక్షల నుంచి 11లక్షల క్వింటాళ్లకు దిగుబడి పడిపోయినట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ 7,03,863 క్వింటాళ్లు, ప్రైవేటు వ్యాపారులు 95,176 క్వింటాళ్ల పత్తిని కొ నుగోలు చేశారు. రైతులు సొంతభూమితో పాటు 30 ఎకరాల వరకు కౌలుకు తీసుకుని సాగు చేసిన వారూ ఉన్నారు. సాగు ఆలస్యం కావడం, కూలీల కొరత కారణంగా కొందరు ఫిబ్రవరిలో రెండో వి డత పత్తితీత చేపట్టారు. ఆలస్యంగా దిగుబడి వచ్చి న రైతులు పత్తిని అమ్ముకోవడానికి ఇబ్బందులు పడుతుండగా.. 25శాతం నిల్వలు ఇళ్లలోనే ఉన్నా యి. కౌలు రైతులకు వ్యవసాయ అధికారి ధ్రువీకరణ పత్రం, మార్కెట్ కమిటీ కార్యదర్శి టీఆర్ పత్రం ఇస్తేనే సీసీఐ కొనుగోలు చేస్తుంది. టీఆర్ పత్రాలు దళారులకు ఇవ్వడంతో ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి వేల క్వింటాళ్ల పత్తి సీసీఐకి విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క చెన్నూర్ మార్కెట్ పరిధిలోనే టీఆర్ పత్రాల ద్వారా రూ.80 లక్షల విలువైన పత్తి విక్రయాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విచారణ కొనసాగుతుండగా.. చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ పరిధిలోనూ ఆరోపణలు ఉన్నాయి. వారి తప్పిదం.. వీరికి శాపం మార్కెట్ కమిటీ అధికారుల తప్పిదాలతో కౌలురైతులకు తిప్పలు తప్పడం లేదు. భూ యజమానికి కౌలు ఒప్పందం ప్రకారం ఎకరానికి రూ.12వేల నుంచి రూ.15వేల వరకు సీజన్కు ముందే మే నెలలో కౌలు చెల్లించారు. కౌలు ధ్రువీకరణ పత్రాలతో అమ్ముకునే వెసులుబాటు ఉంటుందని భావించారు. కానీ టీఆర్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. భూ యజమాని పత్రాలతో విక్రయించాలంటే భూ యజమాని కొనుగోలు కేంద్రానికి రావాలి, తూకం వేసే వరకు ఉండాలి, ఫొటో దిగాలి, వచ్చే నగదు అతడి ఖాతాలోనే జమ అవుతుంది. గ్రామాల్లో భూములు ఉంటే పట్నంలో ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉన్న భూ యజమానిని కొనుగోలు కేంద్రానికి తీసుకు రావడం, అమ్మిన పైసలు రావాలంటే కౌలు రైతుకు కత్తిమీద సాములాగా మారుతోంది. టీఆర్ పత్రాలు అందించి పత్తి కొనుగోలు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.అమ్ముకునుడెట్లా.. పది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేసిన. సంక్రాతి నుంచి సీసీఐ పదిహేను రోజు లు బంద్ చేసింది. త ర్వాత ప్రారంభించి కొ నుగోలు చేస్తుంది. మార్కెట్ అధికారులు టీఆర్ ఇ వ్వడం లేదు. ప్రైవేటు వ్యాపారులు రూ.6700 వ రకు అడుగుతున్నారు. ఈ ధరకు అమ్ముకుంటే కౌలుకు భూమి తీసుకొని సాగు చేసిన నష్టపోవుడే ఉంది. – గంగిశెట్టి తిరుపతి, రైతు, నెన్నెల నెల రోజులుగా ఇంటి వద్దే.. నా భూమి ఆరెకరాలతోపాటు మరో 20 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేసిన. మహారాష్ట్ర, బీహర్ నుంచి కూలీలను రప్పించి పత్తి తీయించాను. ఫిబ్రవరి మొదటి వారం వరకు రెండో విడత ఏరడం పూర్తయింది. వ్యవసాయ అధికారి కౌలు ధ్రువీకరణ పత్రం ఇచ్చినా మార్కెట్ కమిటీ అధికారులు టీఆర్ ఇవ్వడం లేదు. నెల రోజులుగా పత్తి ఇంటి వద్దనే ఉంది. – తోట మధు, రైతు, నెన్నెల -
క్లుప్తంగా
కారు బోల్తా.. నలుగురికి తీవ్రగాయాలునేరడిగొండ(బోథ్): మండలంలోని చించోలి అంతర్రాష్ట్ర రహదారి సమీపంలో కారు బోల్తా పడిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి(బి) గ్రామానికి చెందిన మదన్, సుజాత, రాధ, లింగవ్వ, వేదాన్ష్ సోమవారం బజార్హత్నూర్లో జరిగిన శుభకార్యానికి కారులో వెళ్లారు. మంగళవారం ఉదయం తిరుగు ప్రయాణంలో చించోలి గ్రామ సమీపంలోకి రాగానే కారు అదుపు తప్పి బోల్తా పడింది. సుజాత, రాధ, లింగవ్వ, వేదాన్ష్కు తీవ్రగాయాలు కావడంతో ముందుగా బోథ్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిర్మల్కు తరలించారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేతతాండూర్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను మంగళవారం పట్టుకున్నట్లు జిల్లా మైనింగ్ శాఖ అధికారి జగన్మోహన్రెడ్డి తెలిపారు. టేకులపల్లి నుంచి తాండూర్ మండలం అచ్చులాపూర్ గ్రామానికి ఇసుకను అనుమతి లేకుండా తీసుకువస్తుండగా పక్కా సమాచారంతో పట్టుకున్నామని, సదరు ట్రాక్టర్ను విచారణకోసం రెవెన్యూ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.గంజాయి కేసులో ఏడేళ్ల జైలుఆసిఫాబాద్అర్బన్: గంజాయి సాగు చేసిన కేసులో ఒకరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 50వేల జరిమానా విధిస్తూ మంగళవారం జిల్లా సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పునిచ్చినట్లు సిర్పూర్ (యూ) ఎస్సై రామకృష్ణ తెలిపారు. గతంలో విధులు నిర్వహించిన ఎస్సై విష్ణువర్దన్ 2021 అక్టోబర్ 24న మధుర తాండ గ్రామ శివారులో పత్తి చేనులో తనిఖీ నిర్వహించగా భానుదాస్ పత్తి చేనులో గంజాయిని సాగు చేసినట్లు పేర్కొన్నారు. అప్పటి ఎస్హెచ్ఓ గంగారం కేసు నమోదు చేశారు. నేరం రుజువు కావడంతో నిందితుడు భానుదాస్కు పైవిధంగా శిక్ష ఖరారు చేస్తూ తీర్పునిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. మూడు ఆలయాల్లో చోరీజన్నారం: మండలంలోని తిమ్మాపూర్ శ్రీ రామచంద్రస్వామి ఆలయంతో పాటు పక్కనే ఉన్న సత్యనారాయణస్వామి, శివాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయాల్లో హుండీలను పగుల కొట్టి నగదును అపహరించుకుపోయినట్లు వారు పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు కమ్మల భూమయ్య, శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పశువుల కొట్టం దగ్ధందహెగాం: మండలంలోని బొర్లకుంటలో సొనులే పోశన్నకు చెందిన పశువుల కొట్టం మంగళవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. కొట్టంలో ఉన్న కేసింగ్ పైపులు రెండు, ఆయిల్ ఇంజన్ పైపులు ఇరవై, పశుగ్రాసం పూర్తిగా కాలిపోయిందని బాధిత రైతు పేర్కొన్నాడు. సుమారు లక్ష వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని వాపోయాడు. రెవెన్యూ అధికారులకు సమాచారం అందించడంతో ఆర్ఐ శృతి పంచనామా నిర్వహించారు.