Mancherial District Latest News
-
సహాయంలో ముందున్న భరోసా కేంద్రాలు
నస్పూర్: మహిళలకు సహాయం అందించడంలో భరోసా కేంద్రాలు ముందున్నాయని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అన్నారు. పట్టణంలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా భరోసా కేంద్రం వద్ద సిబ్బందితో కలిసి గురువారం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, బాలికలకు భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని అన్నారు. బాధిత మహిళలకు కౌన్సెలింగ్, వైద్యం, న్యాయ సహాయం అందించడంలో భరోసా కేంద్రం ముందుందని తెలిపారు. కొందరు ఫిర్యాదుకు వెనుకంజ వేస్తున్నా రని, వారికి ఈ కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతు న్నాయని అన్నారు. భరోసా కేంద్రంలో 17 కేసులు వచ్చాయని, అందులో 13 పోక్సో, 4 అత్యాచారం కేసులు ఉన్నాయని, 57 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాశ్, మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్, మహిళా పోలీస్స్టేషన్ సీఐ నరేశ్కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్, షీటీఎం ఎస్సై హైమ, మంచిర్యాల ఎస్సై వినత, భరోసా సిబ్బంది విజయ, నవ్యకృష్ణ, ప్రమీల, పుష్పలత, ప్రియాంక, ప్రమీల, రజిత పాల్గొన్నారు. -
20మంది మిల్లర్లపై కేసులు !
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీఎంఆర్(కస్టం మిల్లింగ్ రైస్) సకాలంలో ఇవ్వని రైస్మిల్లర్లపై జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలో కొందరు మిల్లర్లు ఆయా సీజన్లలో సర్కారు నుంచి ధాన్యం తీసుకోవడమే గానీ, గడువులోపు బియ్యం అప్పగించకపోవడంతో చివరగా కఠిన చర్యలు చేపడుతున్నారు. సకాలంలో ఇవ్వని మిల్లర్ల బకాయిలు, జరిమానాలు, తదితరలు కలుపుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 133. 78కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. ఈ మొ త్తంలో మిల్లర్లు అత్యధికంగా రూ.19కోట్ల నుంచి మొదలు కనీసం రూ.3కోట్ల దాక బకాయిదారులు ఉన్నారు. దీంతో ఆయా బకాయిలు ఉన్న వారందరిపైనా మొదట ఆర్ఆర్ యాక్టు(రెవెన్యూ రికవరీ చట్టం) ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. అ యినప్పటికీ స్పందించని వారిపై పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు పెడుతున్నారు. కలెక్టర్ కుమార్దీపక్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 20మంది మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి. గతేడాది మేలో మొదటగా ఓ మిల్లుపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఇప్పటివరకు మొత్తం 14మంది మిల్లర్లపై ఆర్ఆర్ యాక్టుతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మరో నలుగురిపై ఆర్ఆర్ యాక్టు, మరో ఇద్దరిపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు మిల్లర్లు ఇప్పటికే శతావిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బకాయిలు రాబట్టేందుకు ఆర్ఆర్ చట్టం ప్రకారం కేసులు ఎదుర్కొంటున్నవారి ఆస్తుల గుర్తింపు జరుగుతోంది. ఈ క్రమంలో చట్ట ప్రకారం సర్కారుకు బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. -
ఆలోచన శక్తి పెంచుకోవాలి
జైపూర్: విద్యార్థులు ఆలోచన శక్తి పెంచుకోవాలని జిల్లా సైన్స్ అధికారి మధుబాబు తెలి పారు. మండల కేంద్రంలోని కేజీబీవీలో గురువారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విజ్ఞాన మొబైల్ సైన్స్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు వివిధ రకాల సైన్స్ కృత్యాలపై ఆయన వివరించారు. విద్యార్థులు ప్రకృతిని చూసి విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. విద్యార్థుల భాగస్వామ్యంతో 30కి పైగా చేసిన కృత్యాలు ఆలోచింపజేశాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేకాధికారి ఫణిబాల, విజ్ఞాన ల్యాబ్ ఉపాధ్యాయులు లక్ష్మణ్, భారతిదేవి, పద్మ, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
‘స్థానిక’ ఏర్పాట్లు వేగవంతం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: స్థానిక సంస్థల ఎన్ని కల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో అధికారులు జిల్లాలో ఏర్పాట్లు వేగవంతం చేశారు. ఈ నెల 15లోపు నోటిఫికేషన్ వె లువడే అవకాశం ఉండడంతో అంతా సిద్ధం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని తెలపడంతో ఆ మేరకు ఎంపీటీసీ స్థానాల పునర్విభజన పూర్తి చేశారు. తాజాగా జిల్లాలో 129 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, జెడ్పీటీసీ స్థా నాలు 16 ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నా యకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. తమ పరిధిలో ఉన్న స్థానాల రిజర్వేషన్లు ఖరారైతే రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి సిద్ధం చే సే నామినేషన్ పత్రాలు, పోలింగ్, ఏజెంట్ల గుర్తింపు కార్డులు తదితర సామగ్రి జిల్లాలోని మండల పరిషత్లకు చేరవేస్తున్నారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లు సిద్ధమయ్యాయి. బ్యాలెట్ బాక్సులతో సహా పేపర్లు, గుర్తులు ముద్రించినవి తదితర సామగ్రిని అందుబాటులో ఉంచారు. కొత్త ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. నాయకుల ప్రయత్నాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్థానిక నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేష న్లు ఖరారైతే పోటీలో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా మండలాలు, గ్రా మాల పరిఽధిలో ఏ రిజర్వేషన్ వస్తే ఎవరు పోటీలో ఉంటారనే చర్చలు నడుస్తున్నాయి. అంతేగాక పార్టీ గుర్తుపై జరిగే మండల, పరిషత్ ఎన్నికలు కావడంతో స్థానిక ప్రజాప్రతినిధులతోనూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ అ నుకూలిస్తే తమకు టికెట్ ఇవ్వాలని ఇప్పటికే కో రుతున్నారు. ఇప్పటికే కొందరు గ్రామాల్లో ఓట్లు కూడగట్టుకునేందుకు మద్దతు పొందే పనులు చే స్తున్నారు. మాజీ ప్రజాప్రతినిధులతోపాటు గతంలో అవకాశం రాక ఎదురుచూస్తున్న వారంతా ఈసారి మళ్లీ బరిలో దిగేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రిజర్వేషన్లపై ఉత్కంఠ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తి చాలామందికి ఉన్నప్పటికీ రిజర్వేషన్లు ఎలా ఉంటాయోననే ఉ త్కంఠ అందరిలో నెలకొంది. బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ, ఎస్టీ, ఓసీ రిజర్వేషన్లలో మార్పులతో ఏ స్థానానికి ఎక్కడ ఎవరికి అవకాశం దక్కుతుందోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జనరల్, మహిళా, రిజర్వేషన్ల కోటా ఖరారు అయితే నే పోటీకి మార్గం సుగమం కానుంది. ఈ నేపథ్యంలో గత రిజర్వేషన్లు, గ్రామాల్లో ఉన్న జనా భా, రొటేషన్ పద్ధతి తదితరవన్నీ అంచనాతో లె క్కలు వేసుకుంటున్నారు. అధికారికంగా వెలువ డే వరకు ఆయా స్థానాలకు ఏ వర్గాలకు అవకాశం కలుగుతుందోననే ఉత్కంఠ కొనసాగుతోంది. అంతా సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల ఖరారుపై అందరిలోనూ ఉత్కంఠ -
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
మంచిర్యాలటౌన్: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జెడ్పీ సీఈవో గణపతి, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ పథకంలోని మంచిర్యాల, నస్పూరులో వార్డులకు అవసరమైన మేరకు తాగునీరు అందించాలని, పైప్లైన్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేసి అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. అమృత్ 2.0 పథకం కింద చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేసి వేసవికాలంలో నీరందించేందుకు సిద్ధం చేయాలని అన్నారు. గత నాలుగేళ్లుగా జిల్లాలో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నివేదిక అందించాలన్నారు. ప్రతీ రోజు నీటి సరఫరా బెల్లంపల్లి: ప్రతీ ఇంటికి ప్రతీరోజు తాగునీరు సరఫ రా చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం బెల్లంపల్లి మున్సిపల్ కా ర్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సి పాల్టీలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, అంతర్గత రహదారులు, మురికి నీటి కాలువ నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో హరికృష్ణ, తహసీల్దార్ జ్యోత్స్న, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించండి నెన్నెల: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించా లని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువా రం నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్సీ పరిసరాలు, వైద్య సదుపాయాలు, ఆస్పత్రి రిజిష్టర్ను పరిశీలించారు. వైద్యులతో మా ట్లాడి సేవలు, సీజనల్ వ్యాధులపై ఆరా తీశారు. ల్యాబ్ టెక్నీషియన్ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే నియమిస్తామని చెప్పారు. అనంతరం నెన్నెల, దుబ్బపల్లి, గన్పూర్, జోగాపూర్ పాఠశాలలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడిగారు. నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎంపీడీఓ దేవేందర్రెడ్డి, ఏపీఓ నరేష్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులతో సమీక్ష సమావేశం -
గీతకార్మికులకు రక్షణగా కాటమయ్య రక్ష కిట్లు
జన్నారం: గీత కార్మికులకు ప్రభుత్వం అందించే కాటమయ్య రక్ష కిట్లు ఎంతో రక్షణగా ఉంటాయని కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్ రాష్ట్ర కో ఆ ర్డినేటర్ బెల్లంకొండ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం మండలంలోని బాదంపల్లి గ్రా మంలో ఇందన్పల్లి, కిష్టాపూర్, జన్నారం, పొ నకల్ గ్రామాల గీత కార్మికులకు లక్షెట్టిపేట ఎకై ్సజ్ సీఐ సమ్మయ్య ఆధ్వర్యంలో కాటమయ్య రక్ష సేఫ్టీ కిట్లతో ప్రత్యేక శిక్షకులతో శిక్షణ ఇ ప్పించారు. ఆయా గ్రామాలకు చెందిన వంద మంది గీతకార్మికులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి చెట్టు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడే ప్రమాదం జరగకుండా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్సై మౌనిక, బాదంపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు నాయిని సత్యాగౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షుడు మూల భాస్కర్గౌడ్, ప్రధాన కార్యదర్శి పోడేటి రవిగౌడ్, మోకుదెబ్బ జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
● మండిపోతున్న ఎండలు ● పగటి వేళ తగ్గిన జనసంచారం
జిల్లాలో గురువారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత(డిగ్రీలు సెల్సియస్) వివరాలు మండలం గ్రామం ఉష్ణోగ్రతలు భీమారం భీమారం 37.5 జన్నారం తపాలపూర్ 37.5 దండేపల్లి లింగాపూర్ 37.4 భీమిని భీమిని 37.4 నెన్నెల నెన్నెల 37.4 నస్పూర్ నస్పూర్ 37.4 కోటపల్లి దేవులవాడ 37.3 చెన్నూర్ కొమ్మెర 37.3 బెల్లంపల్లి బెల్లంపల్లి 37.2 జైపూర్ కుందారం 37.1బెల్లంపల్లి/దండేపల్లి: జిల్లాలో ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండలు దడ పుట్టిస్తున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గురువారం జిల్లాలోని పలు మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 37డిగ్రీల సెల్సియస్కు పైగా నమోదైంది. ఆదిలోనే ఎండలు దంచికొడుతుండడంతో మున్ముందు మరెంత తీవ్రంగా ఉంటాయోనని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జిల్లాలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. బొగ్గు గనులు కలిగి ఉన్న బెల్లంపల్లి, తాండూర్, మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ పారిశ్రామిక ప్రాంతాల్లో సాధారణంగా పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. వేసవిలో మరింత ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఎండవేడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో కొంత మార్పు కనిపిస్తోంది. ఉదయం కొంత చలి.. పగటివేళ ఎండ తీవ్రత.. రాత్రివేళ కొంత చలితో భిన్న వాతావరణం ఉంటోంది. సాధారణంగా యేటా ఫిబ్రవరి మొదటి వారంలో నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే ఈసారి 3నుంచి 4డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తగ్గుతున్న జన సంచారం ఎండల తీవ్రత కారణంగా మధ్యాహ్న సమయంలో రోడ్లపై జనసంచారం తగ్గుతోంది. అత్యవసర పనుల కోసం తప్ప సాధ్యమైనంత వరకు బయటకు రావడానికి సాహసించడం లేదు. సాయంత్రం ఐదు గంటల వరకు ఎండల తీవ్రత తగ్గడం లేదు. మరో నాలుగు రోజులు కూడా ఎండల తీవ్రత అధికంగానే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్కెట్ను ముంచెత్తిన పుచ్చకాయలు ఎండల తీవ్రత పెరుగుండడంతో చల్లదనాన్ని అందించే పుచ్చకాయలు మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. వేసవి తాపాన్ని తీర్చడంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి లారీలు, వాన్లలో దిగుమతి అవుతున్నాయి. జిల్లా కేంద్రం మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, చెన్నూర్, లక్సెట్టిపేట, జైపూర్, దండేపల్లి, జన్నారం, తాండూర్ తదితర ప్రాంతాలకు వ్యాపారులు దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. చెరుకు, ఇతర శీతలపానీయాల దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ఉక్కపోత ప్రారంభం కావడంతో ఇళ్లలో కూలర్లను ఏర్పాటు చేసుకునే పనిలో ప్రజలు నిమగ్నమయ్యారు. కూలర్ల విక్రయాలను వ్యాపారులు ముమ్మరం చేశారు.ఇంకెంత తీవ్రంగా ఉంటాయో..ఎండకాలం వచ్చుడుతోనే భగ్గుమంటున్నది. ఉదయం 10 గంటలు దాటడంతోనే ఎండ తీవ్రత అధికంగా ఉంటున్నది. సాయంత్రం 5 గంటల దాక అట్లనే ఉంటుండడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి భయమేస్తున్నది. ఇప్పుడే ఎండలను భరించలేక పోతున్నాం. వచ్చే మూడు నెలలు ఇంకెంతగా ఎండలు దంచికొడతాయో తలుచుకుంటేనే భయమేస్తున్నది. – నడిగొట్టు కుమార్, బెల్లంపల్లి -
లెక్కతేలింది..
మంచిర్యాలఅర్బన్: జాతీయ విద్యావిధానం ప్రకా రం బడీడు పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో విద్యనభ్యసించాలనే లక్ష్యంతో నిర్వహించిన సర్వే ముగిసింది. ఇంతవరకు బడికి వెళ్లని పిల్లలు ఎంతమంది ఉన్నా రు..? మధ్యలో బడి మానేయడానికి, ఇప్పటివరకు బడిలో చేరకపోవడానికి కారణాలు ఏమిటనేది వెల్ల డైంది. బడికి రాలేని పిల్లలు గ్రామాల్లో ఎంతమంది ఉన్నారనే విషయాలపై లెక్క తేలింది. 6నుంచి 14 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలతోపాటు 15నుంచి 19 ఏళ్లలోపు బడి బయట పిల్లలపై సర్వే సాగింది. జనవరి 16నుంచి 31వరకు సర్వే నిర్వహించారు. 18 మండలాల్లో 41మంది సీఆర్పీలు ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరించారు. జిల్లాలో 264మందిని బడిబయట పిల్లలుగా గుర్తించారు. ఇంటింటికీ వెళ్లి.. బడి మానేసిన పిల్లలు, వలస కార్మికుల విద్యార్థుల వివరాలను సీఆర్పీ, ఐఈఆర్పీలతో సేకరించారు. జిల్లాలోని 18మండలాల్లో 51 క్లస్టర్లలో 41మంది సీ ఆర్పీలు వివరాల సేకరణలో పాల్గొన్నారు. బడికి వె ళ్లని విద్యార్థి పేరు, చిరునామా, తల్లిదండ్రుల పేరు, ఆధార్ సంఖ్యతోపాటు పాఠశాలకు ఎందుకు రావ డం లేదో తదితర అంశాలతో కూడిన వివరాల సేకరణ జరిగింది. బడిలో ప్రవేశం పొందినప్పుడు ఆ ధార్ నంబరుతో అనుసంధానం ఆధారంగా బాలలను గుర్తించేందుకు సర్వే నిర్వహించారు. క్షేత్రస్థాయిలో గ్రామాలు, మున్సిపాల్టీల్లో పర్యటించి వివరాల సేకరణ పూర్తి చేశారు. 15నుంచి 19ఏళ్లలోపు పిల్లలు 113మంది, 6నుంచి 14ఏళ్లలోపు పిల్ల లు 151మందిని గుర్తించారు. బడిబయట బాలల వివరాలను ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేసి ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఎందుకిలా..? జిల్లాలో చాలామంది పిల్లలు బట్టీలు, చెత్త ఏరుతూ కనిపిస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి న కార్మికుల పిల్లలతోపాటు జిల్లాకు చెందిన ఇటుకబట్టీ కార్మికులు, ఊరి బయట పంట పొలాల్లో కూలీలుగా పని చేస్తుంటారు. వారి పిల్లలు కూడా అక్కడే ఉంటూ పనుల్లో మునిగితేలడం సర్వసాధారణంగా మారింది. 15నుంచి 19ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలు వ్యవసాయ, ఇతర పనులు చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీంతో బడికి రావడం కంటే పనులవైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఫీజులు చెల్లిస్తూ.. సీఆర్పీలు ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేశారు. గతేడాది 6నుంచి 14 ఏళ్లలోపు 102 మంది బడిబ యట పిల్లలను గుర్తించి 86 మందిని సమీప పాఠశాలల్లో చేర్పించారు. 15నుంచి 19ఏళ్లు కలిగి బడికి దూరంగా 135 మంది పిల్లలు ఉన్నట్లు లెక్క తేల్చా రు. వీరిలో 102మందిని ఓపెన్ పది, ఇంటర్లో చే ర్పించారు. ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తోంది. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తూ పిల్లలను చదువుల వైపు మళ్లించారు. ప్రస్తుతం 264 మందిని గుర్తించినట్లు డీఈవో యాదయ్య తెలిపారు. సర్వేతో బడిబయ ట విద్యార్థుల గుర్తింపునకు వీలు కలిగిందని అన్నా రు. వారిని పాఠశాలలు, ఓపెన్ టెన్త్, ఇంటర్లో చదివించడానికి అవసరమయ్యే బడ్జెట్ కేటాయింపునకు సర్వే దోహదం చేస్తుందని తెలిపారు.మండలం 6–14 15–19 మొత్తంబెల్లంపల్లి 8 12 20 భీమారం – 1 1 భీమిని 20 1 21 చెన్నూర్ 30 2 32 దండేపల్లి 16 13 29 హాజీపూర్ 4 – 4 జన్నారం 4 23 27 కన్నెపల్లి 11 14 25 కోటపల్లి 19 6 25 లక్షెట్టిపేట 14 21 35 మందమర్రి 6 9 15 నెన్నెల 15 6 21 వేమనపల్లి 3 1 4 మొత్తం 151 113 264ఆన్లైన్లో నమోదుబడి బయట పిల్లలను గుర్తించి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నాం. బడి బయట పిల్ల లు లేకుండా చేయాలన్నదే సర్వే ఉద్దేశం. సీఆర్పీలు గ్రామాల్లో పర్యటించి బడిమానేసిన, వెళ్లలేని పిల్లల వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం పాఠశాలల్లో చేర్పిస్తాం. – సత్యనారాయణమూర్తి, సెక్టోరల్ అధికారి, మంచిర్యాల బడిబయట బాలలు 264మంది పాఠశాలల్లో చేర్పించనున్న అధికారులువయస్సుల వారీగా విద్యార్థుల వివరాలు -
ఎంపీడీవోల జిల్లా కార్యవర్గం ఎన్నిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీవో) అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జి ల్లా ప్రజా పరిషత్ కా ర్యాలయంలో గురువారం జెడ్పీ సీఈవో గణ పతి ప్రకటించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎం.మోహన్(చెన్నూర్), ప్రధాన కార్యదర్శిగా పి.శ్రీనివాస్(తాండూర్), ఉపాధ్యక్షులు గా బి.గంగామోహన్(భీమిని), కోశాధికారిగా ఎం.దేవేందర్రెడ్డి(నెన్నెల), కార్యవర్గ సభ్యులుగా ఎన్.రాజేశ్వర్(మందమర్రి), ప్రసాద్(దండేపల్లి) ఎన్నికై నట్లు తెలిపారు. -
గూడెంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
దండేపల్లి: జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన మండలంలోని గూడెం సత్యనారాయణస్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవా లు గురువారం అత్యంత వైభవోపేతంగా ప్రా రంభం అయ్యాయి. గుట్ట కింది నుంచి సన్నా యి వాయిద్యాలతో పూజా సామగ్రి, స్వామి వారి చిత్రపటంతో గుట్టపైకి వెళ్లారు. ఆలయం ముందు మండపం వద్ద సప్తాహ భజనలు ప్రారంభించారు. అనంతరం నిత్యవిధి, ప్రాభో ధిక ఆరగింపు, తీర్థప్రసాద గోష్టి, విశ్వక్సేనారా ధన, దీక్ష కంకణధారణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు రఘుస్వామి, సంపత్స్వామి, వేదపారాయణదారు నారాయణశర్మ, అర్చకులు సురేష్ పాల్గొన్నారు. -
రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ
మంచిర్యాలటౌన్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీల్లో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శా ఖ అధికారి ఎ.పురుషోత్తం, బీసీ స్టడీ సర్కిల్, ఆది లాబాద్ సంచాలకులు జి. ప్రవీణ్ కుమార్లు గురువారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుంచి 4 నెలల ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులకు బుక్ ఫండ్తో పాటు ప్రతీ నెల స్టైఫండ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రుల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలలోపు ఉండాలని, అభ్యర్థుల ఎంపిక విధానం రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇంటర్మీడియెట్, డిగ్రీ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటుందని తెలి పారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 9వ తేదీలోగా ఆన్లైన్లో www. tgbcstudycircle. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకో వాలని, ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. వివరాలకు 08732–221280లో సంప్రదించవచ్చన్నారు. -
కోలిండియా క్యారమ్స్ పోటీల్లో పతకాలు
శ్రీరాంపూర్: కోలిండియా క్యారమ్స్ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు పలు పతకాలు సాధించారు. ఈ నెల 3 నుంచి 5 వరకు జార్ఖండ్ రాజధాని రాంచీలో కోలిండియా క్యారమ్స్ పోటీలు జరిగాయి. ఇందులో టీం చాంపియన్గా సింగరేణి క్యారమ్స్ జట్టు నిలిచింది. ఆర్. సృజన్రావు(జనరల్ మజ్ధూర్, ఆర్కే 6, ఎస్సార్పీ), తాజోద్దీన్ (ఆఫీస్ అసిస్టెంట్, శ్రీరాంపూర్ ఓసీపీ), ఓ. మల్లేశ్ (జనరల్ మజ్ధూర్, కై రిగూడ ఓసీపీ, బెల్లంపల్లి), బీ. శ్రీనివాస్ (హెచ్వోఎం, కేటీకే 1, భూపాలపల్లి), వి. వెంకటస్వామి (కేటీకే 8, భూపాలపల్లి)లు టీం చాంపియన్షిప్ సాధించారు. ఆర్. సృజన్రావు సింగిల్స్లో ప్రథమ స్థానం, డబుల్స్లో ఓ. మల్లేశ్, బీ. శ్రీనివాస్లు ద్వితీయ స్థానం సాధించారు. కోలిండియా పోటీల్లో పతకాలు సాధించి సింగరేణి ఖ్యాతి చాటినందుకు క్రీడాకారులను ఏరియా అధికారులు, క్రీడాకారులు అభినందించారు. -
కొత్తవరిపేట శివారులో పెద్దపులి
కాసిపేట: మండలంలోని కొత్తవరిపేట శివారులో పెద్దపులి అడవిపందిపై దాడి చేసి హతమార్చినట్లు అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గ్రామశివారులోని ఆజ్మీర రాజు పత్తి చేనులో అడవిపంది కళేబరం ఉండటంతో సమాచారం ఇవ్వగా ఫారెస్టు డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి సమీపంలో గురువారం పెద్దపులి పాదముద్రలు గుర్తించారు. గ్రామస్తులు తెల్లవారుజామున పులి గాండ్రింపులు విన్పించినట్లు తెలుపగా గ్రామస్తులకు రక్షణపై అవగాహన కల్పించారు. వ్యవసాయ పొలాలు, చేనుల్లోకి ఒంటరిగా వెళ్లొద్దని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎటువంటి ఉచ్చులు, విద్యుత్ వైర్లు అమర్చవద్దని సూచించారు. వీడియో వాస్తవం కాదు.. గురువారం వాట్సాప్లో చక్కర్లు కొట్టిన వీడియో వాస్తవం కాదని, ఆధారాలు దొరకలేదని డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ తెలిపారు. కాసిపేట గనిలో విధులు నిర్వహించే దేవేందర్ రెడ్డి అనే కార్మికుడు బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గోండుగూడ సమీపంలో కారుకు పెద్దపులి అడ్డు వచ్చిందని, కుక్కను వేటాడిందని చెబుతూ వీడియో విడుదల చేశాడు. కాగా గురువారం అతడు చెబుతున్న ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో పరిశీలించగా ఎటువంటి ఆధారాలు, పాదముద్రలు లభ్యం కాలేదని డెప్యూటీ రేంజ్ అధికారి ప్రవీణ్ నాయక్ అన్నారు. పెద్దపులి సంచారం ఆ ప్రాంతంలో లేదని నిర్ధారించారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు
● గ్రాడ్యుయేట్ స్థానానికి 12 ● ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3 దాఖలు కరీంనగర్ అర్బన్: మెదక్–నిజామాబాద్–కరీంనగర్–ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది నామినేషన్ వేయగా టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. పట్టభద్రుల స్థానానికి సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన లంటు చంద్రశేఖర్, కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన యాదగిరి శేఖర్రావు తరఫున పచ్చునూరి సురేందర్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడ గ్రామానికి చెందిన మేకల అక్షయ్ కుమార్, నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్కు చెందిన అబ్బగోని అశోక్ గౌడ్, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన దేవతి శ్రీనివాస్, నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పెరుందేవి గూడేనికి రైకల సైదులు, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుయ్య సాయికృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేశ్, నిజామాబాద్కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరుపల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీస్థానానికి మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్రెడ్డి, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్కు చెందిన వై.అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ వేసిన ఆదిలాబాద్ జిల్లా యాపల్గూడకు చెందిన మంచి కట్ల ఆశమ్మ మరో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఇదివరకే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేసిన మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడేనికి చెందిన కంటె సాయన్న మరో సెట్ సమర్పించారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీకి ఇదివరకే నామినేషన్ దాఖలు చేసిన కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సిలివేరి శ్రీకాంత్ మరో సెట్ నామినేషన్ అందజేశారు. నామినేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి ఇప్పటివరకు పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు కలిపి మొత్తం 28మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో 21 మంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, ఏడుగురు టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు. -
క్లుప్తంగా
డయాగ్నోస్టిక్ సెంటర్ సీజ్ఇచ్చోడ: మండల కేంద్రంలో అనుమతి లేని డయాగ్నోస్టిక్ సెంటర్ను జిల్లా మాస్ మీడియా అధికారి రవిశంకర్ గురువారం సాయంత్రం సీజ్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎలాంటి అనుమతులు లేకుండా, అర్హత లేని వారు డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్నందున సీజ్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని డయాగ్నోస్టిక్ సెంటర్లను సీజ్ చేస్తామని పేర్కొన్నారు. పుస్తెలతాడు దొంగతనానికి విఫలయత్నంఆదిలాబాద్టౌన్: మహిళ మెడలోని పుస్తెలతాడును దొంగిలించేందుకు ఓ దుండగుడు విఫలయత్నం చేసిన ఘటన గురువారం రిమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని రవీంద్రనగర్కు చెందిన విజయలక్ష్మి బంధువులు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా కుమారుడితో కలిసి పరామర్శించేందుకు వెళ్లింది. మూడో అంతస్తులోకి వెళ్లి మెట్ల మార్గం ద్వారా కింది ఫ్లోర్కు వస్తున్న క్రమంలో ఓ దుండగుడు ఆమె మెడలోని పుస్తెలతాడును దొంగిలించేందుకు ప్రయత్నించాడు. సదరు మహిళతో పాటు ఆమె కుమారుడు అరవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన సెక్యూరిటీ గార్డు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. పోలీసులు విచారించగా ఇంద్రవెల్లి మండలంలోని ఏమైకుంట గ్రామానికి చెందిన ముండే శ్రీకాంత్గా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ వివరించారు. కాగా దుండగుడిని పట్టుకున్న రిమ్స్ సెక్యూరిటీ గార్డులు నరేశ్, అమీర్, చందు, హనుమాన్లు, అంకుష్లను డీఎస్పీ అభినందించారు. పిచ్చికుక్కల వీరంగంకోటపల్లి: మండలంలోని అన్నారం గ్రామంలో గురువారం పిచ్చికుక్కలు వీరంగం సృష్టించాయి. ఒక ఉపాధ్యాయుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చడంతో స్థానికులు భ యాందోళన చెందుతున్నారు. అన్నారంలో ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులపై పిచ్చికుక్కలు దాడిచేసేందుకు ప్రయత్నించాయి. వారిని కాపాడేందుకు ఉపాధ్యాయు డు చూడగా పిచ్చికుక్కలు ఉపాధ్యాయుడిపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చినట్లు స్థా నికులు తెలిపారు. గ్రామంలో పిచ్చికుక్కల దాడిలో చాలామంది గాయపడుతున్నా అఽ దికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిమామడ: మండలంలోని దిమ్మదుర్తి గ్రామం సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖానాపూర్ మండలంలోని సూర్జాపూర్ గ్రామానికి చెందిన పన్నెల భీమేశ్వర్ (56) మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమేశ్వర్ నిర్మల్లోని ఆసుపత్రిలో చికిత్స తీసుకుని ఖానాపూర్కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భీమేశ్వర్ తలకు తీవ్ర గాయమై మృతి చెందాడు. భీమేశ్వర్కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సందీప్ సందర్శించి కేసు నమోదు చేశారు. -
ప్రోత్సహిస్తే సత్తా చాటుతాం..!
● జాతీయస్థాయిలో మెరుస్తున్న క్రీడాకారులు ● అంతర్ జిల్లా కబడ్డీ పోటీల్లో ప్రతిభ చాటుతున్న ఆటగాళ్లు బెస్ట్ రైడర్గా నిలిచా.. చిన్ననాటి నుంచి కబడ్డీ ఆడుతూ జాతీయ స్థాయిలో ఒకసారి ప్రాతినిధ్యం వహించాను. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు ఐదుసార్లు ఎంపికయ్యాను. గత సంవత్సరం నాగార్జునసాగర్లో జరిగిన అంతర్ జిల్లా కబడ్డీ చాంపియన్షిప్లో బెస్ట్ రైడర్గా నిలిచాను. క్రీడాకారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. – జక్కుల రాజశేఖర్, నల్గొండ నిత్యం ఆరోగ్యంగా.. క్రీడలతో మానసికోల్లాసంతో పాటు శారీరకంగా దృఢంగా ఉంటాం. తరుచూ కబడ్డీ ఆడడంతో నిత్యం ఆరోగ్యంగా ఉంటున్నాం. నిత్యం సాధన చేయడంతో క్రీడల్లో నైపుణ్యం పెరుగుతుంది. ఇప్పటివరకు 8 రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నా. ఒక జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించాను. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల నుంచి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాను. – శ్రీధర్, రంగారెడ్డి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించా.. 2009 నుంచి కబడ్డీ ఆడుతున్నాను. ఇప్పటివరకు ఐదు జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాను. 14 రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడాను. స్పోర్ట్స్ కోటాలో పోస్టల్ ఉద్యోగాన్ని సాధించాను. ఉద్యోగం చేస్తూనే జీవితాన్నిచ్చిన ఆటను మరవకుండా నిత్యం సాధన చేస్తూ టోర్నమెంట్లలో పాల్గొంటున్నా. – జే. రాఘవేంద్ర రెడ్డి, రంగారెడ్డి తరుచూ పోటీలు నిర్వహించాలి కబడ్డీ ఆటకు రోజురోజుకూ ప్రాచుర్యం పెరుగుతోంది. పాఠశాల స్థాయి, సీనియర్ స్థాయిలో ఆడుతున్నాను. ఎప్పుడూ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ పోటీలు లేకపోతే ఆట నైపుణ్యాలు మరుగున పడిపోతాయి. ఎప్పటికప్పుడు అసోసియేషన్ల ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు నిర్వహించాలి. – సందీప్, నాగర్కర్నూల్ నిత్యం సాధన చేస్తుంటాం.. ఎక్కడ పోటీలు ఉన్నా ప్రాతినిధ్యం వహించడానికి ముందుకు వస్తాం. ఇప్పటివరకు ఒక జూనియర్ నేషనల్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించాను అదేవిధంగా మూడు రాష్ట్రస్థాయి పోటీల్లో మా జిల్లా తరఫున ఆడాను. ప్రతీరోజు నాలుగు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తాం. మా జట్టులో ఎంతోమంది రాష్ట్రస్థాయి క్రీడాకారులు ఉన్నారు. వారిలో నైపుణ్యాలు పెంపొందించేలా ప్రత్యేక శిక్షకులను నియమించాలి. – జాఫర్ మియా, నాగర్కర్నూల్ కబడ్డీ క్రీడలో పలువురు క్రీడాకారులు ప్రతిభ కనబరుస్తున్నారు. నిత్యం సాధన చేస్తూ, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో సత్తా చాటుతూ ఔరా అనిపిస్తున్నారు. అలాంటి క్రీడాకారులకు మరింత శిక్షణ ఇస్తే గొప్ప క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంది. జిల్లాలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న అంతర్ జిల్లాల కబడ్డీ పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చారు. జాతీయ, రాష్ట్రస్థాయి వేదికల్లో ప్రతిభ కనబరిచిన పలువురు క్రీడాకారుల మనోగతం.. – ఆదిలాబాద్ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న 71వ అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. వివిధ జిల్లాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొత్తం 8 జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. శుక్రవారం సాయంత్రం క్వార్టర్ ఫైనల్లో విజేతగా నిలిచిన జట్లు సెమీస్లో ఆడనున్నాయి. సెమీస్లో గెలుపొందిన జట్లు అదేరోజు రాత్రి ఫైనల్ మ్యాచ్లో తలపడుతాయి. విజేత జట్లు ఇవే.. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో నల్గొండ జట్టు హన్మకొండ జట్టుపై 43 –20 తేడాతో విజయం సాధించింది. గద్వాల్ జట్టు సంగా రెడ్డిపై 36 –26 తేడాతో, నాగర్కర్నూర్ జట్టు యాదాద్రిభువనగిరిపై 43 –41 తేడాతో, వనపర్తి జట్టు కరీంనగర్పై 41 –29 తేడాతో, సూర్యపే ట జట్టు భద్రాద్రి కొత్తగూడెంపై 33 –13 తేడాతో, నిజామాబాద్ జట్టు జనగాంపై 42 –34 తే డాతో, రంగారెడ్డి జట్టు మేడ్చల్పై 40 –36 తేడాతో, హైదరాబాద్–2 జట్టు హైదరాబాద్ 1పై గెలుపొంది క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. గెలు పొందిన జట్లు శుక్రవారం తలపడనున్నాయి. మూడోరోజుకు అంతర్ జిల్లా కబడ్డీ పోటీలు -
నాగోబా ఆదాయం @ రూ.21.08 లక్షలు
ఇంద్రవెల్లి(ఖానాపూర్): పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని జనవరి 28 నుంచి నిర్వహించిన నాగోబా జాతరకు రూ.21,08,520 లక్షల ఆదా యం వచ్చిందని ఆలయ ఈవో మెండి రాజమౌళి తెలిపారు. గురువారం నాగోబా ఆలయంలో మె స్రం వంశీయులు, ఆలయకమిటీ ఆధ్వర్యంలో హుండీని లెక్కించారు. తైబజార్ ద్వారా రూ. 11,36,843, హుండీ ద్వారా రూ.9,71,677 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం ఆనంద్రావ్, మెస్రం వంశీయులు చిన్ను పటేల్, కోసేరావ్, దాదారావ్, తిరుపతి, నాగ్నాథ్, మెస్రం వంశ ఉద్యోగులు సోనేరావ్, దేవ్రావ్, శేఖర్బాబు పాల్గొన్నారు. నగదు పట్టివేతతానూరు: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బెల్తరోడా సరిహద్దులో గురువారం పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ.1.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని భోకర్ నుంచి భోసి గ్రామానికి వెళ్తున్న ఓ వాహనాన్ని తనిఖీ చేసి నగదు స్వాధీనం చేసునకున్నామన్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. వ్యక్తి ఆత్మహత్యనిర్మల్టౌన్: మద్యం తాగొద్దని కుమారులు చెప్పడంతో కోపంతో చెరువులో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక కూరన్నపేట్ కాలనీకి చెందిన దాసరి భూమన్న (65) ఎక్కువగా మద్యం సేవించేవాడు. అతని ఇద్దరు కుమారులు మద్యం తాగడం బంద్ చేయాలని సూచించగా కోపంతో సోమవారం ఇంట్లో నుంచి ఎటో వెళ్లిపోయాడు. పెద్ద కుమారుడు రమణ ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గురువారం బంగల్పేట్ చెరువులో మృతదేహం కన్పించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలా నికి చేరుకున్న ఎస్సై శ్రీకాంత్ మృతదేహం దా సరి భూమన్నదిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటి తాళం పగులగొట్టి చోరీ
భీమారం: ఇంటి తాళం పగులగొట్టి చోరీ చేసిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీడీఏ కాలనీకి చెందిన రాంటెంటి రంజిత్కుమార్ జనవరి 31న తన కుమారుడి అక్షరాభ్యాసం కోసం కుటుంబంతో కలిసి సిద్దిపేట జిల్లాలోని శనిగరం వెళ్లాడు. ఫిబ్రవరి 5న ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా లాకర్ పగులగొట్టి రూ. 50 వేల నగదు, రూ.42 వేలు విలువ చేసే బంగా రం ఎత్తుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సీఐ వేణుచందర్ సందర్శించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నామని ఎస్సై గురువారం తెలిపారు. -
‘నేతకాని’ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు
జన్నారం: అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి నేతకాని కులం జనాభా 1,33,072 మాత్రమే అని ప్రకటన చేసి నేతకాని జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి గంగాధర్, జన్నారం మండల అధ్యక్షుడు రత్నం లక్ష్మణ్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగా ణలోని గోదావరి పరీవాహక ప్రాంతం ఖమ్మం నుంచి నిజామాబాద్ వరకు సుమారు 18 లక్షల నేతకా ని జనాభా ఉందన్నారు. ప్రభుత్వం పునరా లోచించి నేతకాని కులస్తులకు న్యాయం చేయాలని డి మాండ్ చేశారు. సంఘం రాష్ట్ర నాయకులు ప్రభుదా స్, వెంకట్, లక్ష్మణ్, రవి శంకర్, మల్లయ్య, నంద య్య, దత్తు ప్రేమ్కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రేషన్షాప్ సీజ్
మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో గల రేషన్ షాపు నంబర్ 15ను రెవెన్యూ అధికారులు గురువారం సీజ్ చేశారు. రేషన్ షాపులో కోటా కంటే అధికంగా బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందుకున్న తహసీల్దార్ రఫతుల్లా హుస్సేన్, డిప్యూటీ తహసీల్దార్ మధుసూదన్, ఎంఆర్ఐ అజీజ్, స్వప్న, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్లు షాపును తనిఖీ చేయగా, కోటా కంటే 9 క్వింటాళ్ల బియ్యం అదనంగా ఉండడంతో షాప్ను సీజ్ చేసి, షాపు డీలర్ గద్దల వెంకటస్వామిపై కేసు నమోదు చేశారు. లారీ డ్రైవర్కు ఏడాది జైలుశిక్షమంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతికి కారణమైన లారీ డ్రైవర్కు మంచిర్యాల జూనియర్ సివిల్ జడ్జి, సెకండ్ అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కే. నిరోష ఏడాది జైలుశిక్ష విధించినట్లు మంచిర్యాల పట్టణ సీఐ ప్రమోద్రావు తెలిపారు. గురువారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం హాజీపూర్ మండలం సబ్బపల్లి గ్రామానికి చెందిన రెబ్బ రాజలింగు అతని కుమారుడు రెబ్బ అంజయ్యలు కలిసి 2022 మార్చి 27న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మంచిర్యాల ఐబీ చౌరస్తాలోకి రాగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్ర గాయాలైన తన కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు మృతుడి తండ్రి రాజలింగు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై కిరణ్కుమార్ కేసు నమోదు చేశారు. కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయగా విచారణలో భాగంగా అదనపు ప్రాసిక్యూటర్ రవీందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి విచారించగా నేరం రుజువైనందున లారీ డ్రైవర్ దూటె ప్రవీణ్సురేశ్కు ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చినట్లు సీఐ తెలిపారు. -
‘అక్రమ’ దారి.. హత్యకు సుపారీ!
● కారులో కత్తితో పొడిచి.. ● వారం రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు ● వీడిన మమత హత్య కేసు మిస్టరీ చొప్పదండి: అక్రమ సంబంధం, జల్సా జీవితం ఓ మహిళ ప్రాణం తీసింది. భర్తను వదిలేసి, నాలుగేళ్ల బాబుతో కలిసి ఓ యువకుడితో సహజీవనం.. అతడి కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారి, మహిళను అంతమొందించేందుకు దారితీసింది. మంచిర్యాల జిల్లాలో జరిగిన రూ.5 లక్షల సుపారీ హత్య, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల శివారులోని కాలువ వద్ద దొరికిన మహిళ మృతదేహంతో బయటకు వచ్చింది. గురువారం చొప్పదండి సీఐ ప్రకాశ్గౌడ్, ఎస్సై నరేందర్రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. భర్తను వదిలేసి .. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కు చెందిన కలు మల్ల భాస్కర్ సింగరేణిలో ఉద్యోగి. అతడికి కాసిపేట గ్రామానికి చెందిన మేడ మమత(25)తో పరి చయం ఏర్పడింది. మమతకు భర్తతో మనస్పర్థలు రావడంతో అతడిని వదిలి నాలుగేళ్ల కుమారుడు ధృవతో కలిసి మంచిర్యాలలోని తిలక్నగర్లో ఉంటూ క్యాటరింగ్ పనులు చేసేది. భాస్కర్ జీతం డ బ్బంతా మమతకు ఖర్చు చేస్తుండడం.. ఇంట్లో ఇ వ్వకపోవడంతో భాస్కర్ కుటుంబ సభ్యులు ఆ మైపె కక్ష పెంచుకున్నారు. ఆమెను అంతం చేయాలని భాస్కర్ అక్క అవివాహిత కులుమల్ల నర్మద తన స్నేహితుడు గుంపుల రఘుతో కలిసి పథకం పన్నింది. ఇందుకు నర్మద అక్క భర్త బండ వెంకటేశ్, తండ్రి కులుమల్ల రాజలింగు సహకరించారు. హత్య చేసి.. మమతను చంపాలని నర్మద రఘును కోరింది. రఘు లక్సెట్టిపేటలోని సుభాష్నగర్కు చెందిన వేల్పుల కళ్యాణ్ను సంప్రదించి మమత హత్యకు రూ.5లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో కళ్యాణ్ మమతను ఫోన్ చాటింగ్ ద్వారా ట్రాప్ చేశాడు. సుపారీలో భాగంగా అడ్వాన్స్గా ఇచ్చిన రూ.60 వేలు ఖర్చు చేస్తూ మమతకు దగ్గరయ్యా డు. జనవరి 25న సెల్ఫ్ డ్రైవింగ్ కారు కిరాయి తీసుకొని మమతను, ఆమె కుమారుడిని మంచిర్యాలలో ఎక్కించుకున్నాడు. మమతను పదునైన కత్తితో పొడిచి, నైలాన్ తాడుతో గొంతు బిగించి హత్య చేశాడు. నర్మద, ఆమె కుటుంబ సభ్యులకు మృతదేహం చూపించి రూ.4 లక్షలు తీసుకొని అదే రోజు రాత్రి కారులో బయలుదేరాడు. గంగాధర మండలం కురిక్యాల రోడ్డు పక్కన మృతదేహాన్ని పడేసి బాబును తీసుకొని హైదరాబాద్ పారిపోయాడు. 27న వెలుగులోకి.. కురిక్యాల శివారులో గుర్తు తెలియని మహిళా మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మమత అక్క ఉమాదేవి ఆమెను గుర్తించింది. 25న సాయంత్రం కుమారుడిని తీసుకొని షాపునకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగిరాలేదని తెలిపింది. మమత కుమారుడు ధృవ జాడ తెలియకపోవడంతో కేసు మిస్టరీగా మారింది. సాంకేతిక పరిజ్ఞానంతో .. మంచిర్యాలలోని ఓ బార్ వద్ద మమత కారు ఎక్కినట్లు పోలీసులు సీసీ పుటేజీలో గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా నిందితుడు కళ్యాణ్ను గుర్తుపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సీఐ ప్రకాశ్గౌడ్ బృందం చైన్నె వెళ్లారు. అక్కడి పోలీసుల సహకారంతో ఓ హోటల్లో బాబును రక్షించారు. ప్రస్తుతం బాబును మమత అత్తామామకు అప్పగించారు. పోలీసులను చూసి పారిపోయిన కళ్యాణ్ను ట్రేస్చేసి మళ్లీ పట్టుకున్నారు. కాంట్రాక్ట్ మర్డర్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు కళ్యాణ్తోపాటు, లక్సెట్టిపేట మండలం మిట్టపల్లికి చెందిన గుంపుల రఘు, నర్మద, జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేటకు చెందిన బండ వెంకటేశ్, కులుమల్ల రాజలింగును రిమాండ్కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సై నరేందర్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ జంపయ్య, శ్రీధర్, ఐటీ సెల్ కానిస్టేబుల్స్ ప్రదీప్, మహేందర్ను సీఐ అభినందించారు. -
‘చెత్త’శుద్ధి ఎలా?
భైంసా: బాసరలో పారిశుధ్యం లోపించింది. ఇక్కడి శ్రీజ్ఞానసరస్వతీ ఆలయంలో మూడురోజులుగా నిర్వహించిన వసంత పంచమి వేడుకల అనంతరం ఈ పరిస్థితి తలెత్తింది. వివిధ ప్రాంతాల నుంచి 1.20లక్షల మంది భక్తులు రాగా, సరిపడా ఏర్పాట్లు చేయలేదనే విమర్శలు వచ్చాయి. స్థానిక ఎమ్మెల్యే రామారావుపటేల్ కలుగజేసుకుని పార్టీ శ్రేణులతో కలిసి శ్రమదానంతో స్నానఘట్టాలతోపాటు ఇతర ప్రాంతాలను శుభ్రం చేయించారు. ఇపుడు ఉత్సవా లు ముగిశాక ఎటు చూసినా అంతా అపరిశుభ్రమే. ఆలయ అధికారులు పారిశుధ్య నిర్వహణను విస్మరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని మార్గాల్లో అంతే.. బాసర రైల్వేస్టేషన్, బస్టాండ్, ప్రధాన రోడ్లు, ఆలయ ప్రాంగణం, పార్కింగ్ స్థలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పడి ఉన్నాయి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పదేపదే చెప్పే అధికారులు ఉత్సవాల్లో భక్తులకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారు. పైగా, దుకాణాదారులు ప్లాస్టిక్ కవర్లను వినియోగించినా చర్యలు తీసుకోలేదు. ఆలయ సిబ్బందే ప్లాస్టిక్ను వినియోగిస్తున్నారనే విమర్శలున్నాయి. పూజాద్రవ్యాలను కూడా ప్లాస్టిక్లోనే విక్రయిస్తున్నా పట్టింపు కరువైందని భక్తులు ఆరోపిస్తున్నారు. నదీ జలం కలుషితం ఇప్పటికీ స్నానఘట్టాల వద్దే పూజాద్రవ్యాలు, ఇతర వ్యర్థాలు కనిపిస్తున్నాయి. ఆలయ సిబ్బంది వీటిని తొలగించడంలో విఫలమయ్యారు. గోదావరి నది లో నీటి కాలుష్యం జరగకుండా ఎప్పటికప్పుడు క్లో రినేషన్ చేయాల్సి ఉండగా దీనినీ విస్మరించారు. కేంద్ర జలవనరుల సంఘం గతంలోనే రాష్ట్ర పరి ధిలో గోదావరి నదీ జలాలు కలుషితమవుతున్న ప రిస్థితిపై నమూనాలు సేకరించిన విషయం తెలిసిందే. నది నీటిని కలుషితం కాకుండా చూడాలని అ ప్పట్లోనే అధికారులు ఆదేశించారు. అయినా ఆల య అధికారుల్లో స్పందన లేదు. పక్కనే ట్రిపుల్ ఐ టీ కళాశాల ఉండగా ఇందులో చదువుకునే ఏడువే ల మంది విద్యార్థులకు తాగునీటిని అందించే చెరువుకు గోదావరినది నుంచే నీటిని తరలిస్తారు. ఇక్క డి గోదావరి నది నుంచే నిజామాబాద్, నిర్మల్, ఆది లాబాద్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటి ని అందిస్తున్నారు. ఎంతోమందికి తాగునీరు అందించే గోదావరి నదీ జలాలు కలుషితం కావడాన్ని అధికారులు అరికట్టడంలేదు. వీరు తీరుపై భక్తులతోపాటు స్థానికులూ అసహనం వ్యక్తంజేస్తున్నారు. బాసరలో అంతా అపరిశుభ్రం పేరుకుపోయిన చెత్తాచెదారం -
క్లుప్తంగా
రేషన్ బియ్యం పట్టివేతదండేపల్లి: ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు మండల కేంద్రంలోని రెండు కిరాణాషాపుల్లో ఎన్ఫోర్స్మెంట్ డీటీ అంజన్న, ఆర్ఐ భూమన్న మంగళవారం తనిఖీలు నిర్వహించినట్లు తహసీల్దార్ సంధ్యారాణి తెలిపారు. శ్రీనివాస్ కిరాణాదుకాణంలో వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి నిల్వ ఉంచిన రెండున్నర క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దుకాణాయజమానిపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన బియ్యాన్ని దండేపల్లిలోని షాప్ నంబర్–14లో అప్పగించినట్లు పేర్కొన్నారు. ఒకరి మృతికి కారకుడైన కారు డ్రైవర్కు జైలురెబ్బెన: ఒకరి మృతికి కారకుడైన కారు డ్రైవర్కు ఆరునెలల జైలు శిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ అడిషనల్ జేఎఫ్సీఎం జక్కుల అనంతలక్ష్మి తీర్పునిచ్చారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి, ఎస్సై చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన జంజిరాల తిరుపతి (42), అతడి భార్య, పిల్లలతో కలిసి 2020, డిసెంబర్ 20న కాగజ్నగర్లోని ఈస్గాంకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్నారు. రెబ్బెన మండలం వంకులం స మీపంలో ఎదురుగా కాగజ్నగర్ ఎక్స్రోడ్ వైపు నుంచి వస్తున్న కారును డ్రైవర్ అతివే గం, అజాగ్రత్తగా నడుపుతూ ఎదురుగా తి రుపతి నడుపుకొంటూ వస్తున్న బైక్ను ఢీకొ ట్టాడు. ఈ ప్రమాదంలో తిరుపతి, అతడి భార్య, పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. తిరుపతిని మెరుగైన వైద్యం కోసం ముందుగా మంచిర్యాలకు తరలించగా చికిత్స అందించారు. పరిస్థితి విషమించగా మరుసటి రోజు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే తిరుపతి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి కమల ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై రమేశ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం ప్రస్తుత సీఐ, ఎస్సై, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలిశా, లైజన్ అధికారి రాంసింగ్, కోర్టు కానిస్టేబుల్ ఉమేశ్ సాక్షులను హాజరుపర్చారు. జడ్జి వారిని విచారించి నేరం రుజువు కావడంతో కారు డ్రైవర్ ఎండీ జాకీర్ హుస్సేన్కు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన డ్రైవర్కు శిక్షపడేలా కృషి చేసిన డీఎస్పీ చిత్తరంజన్, సీఐ, ఎస్సైని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. ముగ్గురిపై అట్రాసిటీ కేసుదహెగాం: మండలంలోని బొర్లకుంట గ్రా మానికి చెందిన లొనారె సత్యనారాయణ, అతడి కుమారులు సాయి, ప్రసాద్పై అట్రా సిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకా రం.. ఈనెల 2న పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన డొంగ్రె తిరుపతిపై సత్యనారాయణ, అతడి ఇద్దరు కుమారులు గొడ్డలి కామతో దాడి చేశారు. అడ్డుగా వచ్చి ఆపే ప్రయత్నం చేసిన అతడి భార్య హేమలతను కూడా గాయపరిచి చంపుతామని బెదించారు. తిరుపతి ఫిర్యాదు మేరకు మంగళవారం ముగ్గురిపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెండో రోజు మూడు నామినేషన్లు
● పట్టభద్రులకు 2, ఉపాధ్యాయ స్థానానికి ఒకటి ● 12కు చేరిన నామినేషన్ల సంఖ్య కరీంనగర్ అర్బన్: కరీంనగర్–మెదక్–నిజామాబా ద్–ఆదిలాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం పట్టభద్రుల స్థానానికి ఇద్దరు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నా మినేషన్ పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతికి అందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగలధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి, సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వరపల్లికి చెందిన పిడిశెట్టి రాజు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేశారు. ఉపాధ్యాయుల ఎ మ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన ఇన్నారెడ్డి తిరుమల్రెడ్డి నామినేషన్ వేశారు. రెండ్రోజుల్లో 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలు గురు టీచర్ స్థానానికి నామినేషన్ వేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు కలిపి మొత్తం 12మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఆశ్రమ పాఠశాలల తనిఖీ
ఖానాపూర్: పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలను మంగళవారం ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలలను వేర్వేరుగా తనిఖీ చేసి విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, మెనూ పరిశీలించారు. ఈ సందర్భంగా అభ్యసన సామర్థ్యాలతో పాటు పదో తరగతి విద్యార్థుల వందరోజుల ప్రణాళిక అమలు తీరు తెలుసుకున్నారు. పీవో ప్రత్యేకంగా రూపొందించిన యంగ్ ఓరియేటెడ్ క్లబ్ కార్యక్రమంతో పాటు స్కిట్స్ రోల్ ప్లే యాక్టివిటీస్ గురించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చదువులో విద్యార్థులు ప్రతిభ కనబర్చడంతో ఉపాధ్యాయులను అభినందించారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించి స్కిట్స్ను పరిశీలించారు. పాఠశాలల పరిధిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని తెలిపారు. విధిగా మెనూ పాటించాలని ఆదేశించారు. కార్యక్రమాల్లో హెచ్ఎంలు ఎంఏ గఫార్, కాంతారావు, వార్డెన్లు బలిరాం, గోవింద్ తదితరులున్నారు. తిరుపతికి వెళ్లి తిరిగి రాని లోకాలకు..నేరడిగొండ: మండలంలోని రేంగన్వాడి గ్రామానికి చెందిన సిడాం చిత్రు (57) దైవ దర్శనానికి తిరుపతికి వెళ్లి ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి మృతి చెందాడు. వివరాలు.. సిడాం చిత్రు, విఠల్ రైలులో ఇటీవల దైవదర్శనానికి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందాడు. విఠల్ ఒక్కడే స్వగ్రామానికి చేరుకున్నాడు. చిత్రు విషయమై ఆయన కుటుంబీకులు విఠల్ను ప్రశ్నించగా తప్పిపోయినట్లు సమాధానం ఇచ్చాడు. దీంతో వారు హైదరాబాద్లో పోలీసులను ఆశ్రయించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలపై పడి మృతిచెందగా, మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రిలో ఉంచినట్లు వారు తెలిపారు. అనంతరం కుటుంబీకులకు మృతదేహాన్ని అప్పగించారు. మృతుడికి భార్య ద్రుపది, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. దైవదర్శనానికి వెళ్లిన ఆయన మృతదేహంగా రావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, మంగళవారం రాత్రి గ్రామంలో చిత్రు అంత్యక్రియలు నిర్వహించారు.