Mancherial District News
-
● మంచిర్యాల, నిర్మల్ జిల్లాలకు నిధులు ● ఒక్కో కోర్టుకు రూ.81 కోట్ల చొప్పున మంజూరు ● 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయింపు
మంచిర్యాలక్రైం: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పా టు తర్వాత, జిల్లా న్యాయస్థానాలను కూడా ఏర్పా టు చేశారు. అయితే తాత్కాలిక భవనాల్లో వసతులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. సొంత భవనాలు నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ క్రమంలో న్యాయ నిర్మాణ్ ప్రణా ళికలో భాగంగా జిల్లా న్యాయస్థానాలకు కొత్త భవనాల నిర్మాణానికి రూ.81 కోట్లు కేటాయించింది. దీంతో త్వరలో కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 2004లో కోర్టులు ఏర్పాటయ్యాయి. రెండు దశాబ్దాలుగా అద్దెభవనాల్లోనే నిర్వహిస్తున్నారు. కోర్టుల సంఖ్య 9కి పెరిగినా సొంత భవనాలు లేకపోవడంతో న్యాయవాదులు, న్యాయమూర్తులు మౌలిక సౌకర్యాల లోపం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం జిల్లా కోర్టు భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది, దీంతో దీర్ఘకాల నిరీక్షణకు తెరపడనుంది. రూ.162 కోట్లతో ఆధునిక భవనాల నిర్మాణం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులతో న్యాయ నిర్మాణ ప్రణాళిక కింద కోర్టు భవనాలు నిర్మించనున్నారు. ఇందులో కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులను భరిస్తాయి. మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం కోసం రూ.162 కోట్లు మంజూరయ్యాయి. ఒక్కో భవనానికి రూ. 81 కోట్లు కేటాయించారు. ఈ భవనాలు నాలుగు అంతస్తులతో, ఒక బేస్మెంట్తో ఆధునిక డిజైన్లో నిర్మిస్తారు. బేస్మెంట్లో 88 కార్లు, 62 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతీ అంతస్తు 43 వేల నుంచి 44 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో, మొత్తం కోర్టు భవనం 2,87,743.58 చదరపు అడుగుల వరకు ఉంటుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉండేలా డిజైన్ చేశారు. ఈ భవనంలో ఫ్యామిలీ, పోక్సో కోర్టులు కూడా ఏర్పాటు చేస్తారు. 2027 నాటికి పూర్తి కోర్టు భవనాల నిర్మాణం కోసం టెండర్ ప్రక్రియ ఈ నెల రెండో వారంలో ఖరారు కానుంది. టెండర్లు ఖరారైన వెంటనే, పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మాణ పనులు ప్రారంభమైన 24 నెలల్లో, అంటే 2027 నాటికి పూర్తిచేయాలని ఉన్నత న్యాయస్థానం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భవనాలు ఆధునిక సౌకర్యాలతో, తూర్పు అభిముఖంగా, విశాలమైన గాలి, వెలుతురు సౌకర్యాలతో నిర్మిస్తారు. నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్ట్రక్చర్ ఇప్పటికే సిద్ధం చేయబడింది. స్థలం కేటాయింపు.. మంచిర్యాల జిల్లాగా ఏర్పడక ముందే పలు కోర్టులు మంజూరయ్యాయి. 2004 నుంచి న్యాయస్థానా లు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచే కోర్టులకు సొంత భవనాలు కావాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినా స్థల కేటాయింపు విషయంలో రాజకీయ జోక్యం కా రణంగా జాప్యం జరిగింది. ఈ క్రమంలో 2016లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, కుమురంభీ ఆసిఫాబాద్ జిల్లాలుగా ఏర్పడ్డాయి. దీంతో కొత్త జిల్లాలకు కోర్టులు ఏర్పాటు అవశ్యమైంది. 2022 ఏప్రిల్లో ఉమ్మడి జిల్లా కోర్టులను విభజించి కొత్త జిల్లాల వారీగా కోర్టులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కోర్టులు ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో మంచి ర్యాల జిల్లా కోర్టు కోసం నస్పూర్లో ఐదెకరాల భూమిని కలెక్టర్ భారతి హోళ్లికేరి కేటాయించారు. ఈస్థల కేటాయింపు కోర్టు భవన నిర్మాణానికి మార్గం సుగమం చేసింది. తాజాగా కొత్త భవన నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. నిరీక్షణ ఫలించింది..మంచిర్యాల జిల్లా కాక ముందే స్థానిక అవసరాల దృష్ట్యా పలు కోర్టులు ఏర్పటయ్యాయి. 2004 నుంచి అద్దె భవనాల్లోనే కోర్టులు కొనసాగుతున్నాయి. సొంత భవనాల కోసం 20 ఏళ్లుగా విన్నవిస్తూ వస్తున్నాం. ఎట్టకేలకు మా నిరీక్షణ ఫలించింది. జిల్లా కోర్టు భవన నిర్మాణానికి రూ.81 కోట్లు మంజూరు కావడం సంతోషంగా ఉంది. కోర్టు భవన నిర్మాణంతో న్యాయవాదులు, కక్షిదారుల సమస్యలు తొలగిపోతాయి. – బండవరం జగన్, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా -
కార్మిక చట్టాల రక్షణకు ఐక్య పోరాటం
జైపూర్: కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేక వి ధానాలను నిరసిస్తూ, కార్మిక చట్టాల పరిరక్షణ కో సం ఐక్య పోరాటం చేయాలని సీఐటీయూ అనుబంధ హమాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గోమాస ప్రకాశ్ అన్నారు. మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఇందులో భాగంగా జైపూర్ మండలం ఇందారం, టేకుమట్ల, షెట్పల్లి గ్రామాల్లో హమాలీలతో కలిసి సమ్మె పో స్టర్లు ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం మా ట్లాడుతూ కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్లు తెచ్చిందని ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరసే కుట్రలను తిప్పకొట్టాలన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమా, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ 20న జరిగే సార్వత్రిక సమ్మెలో జిల్లాలోని అన్నిరంగాల కార్మికులు పాల్గొనాలని కోరారు. -
సామర్థ్యాల పెంపు.. బోధనకు మెరుగు..!
మంచిర్యాలఅర్బన్: ఎన్సీఈఆర్టీ, విద్యా మంత్రిత్వ శాఖ 2021–22లో సంయుక్తంగా నిర్వహించిన జాతీయ సాధన సర్వేలో తెలంగాణ విద్యార్థుల పనితీరు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది. అలాగే, పీజీఐ, అసర్ నివేదికలు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల్లో వివిధ స్థాయిలలో లోటును సూచించాయి. ఈ నేపథ్యంలో, విద్యార్థుల అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరచడానికి, ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ శిక్షణ కార్యక్రమం ఈ నెల 13 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది, దీని ద్వారా వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని విద్యా నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది. శిక్షణ కార్యక్రమం నిర్మాణం.. రాష్ట్రంలోని అన్ని విద్యా విభాగాలకు చెందిన ఉపాధ్యాయులకు ఈ శిక్షణ అందించబడుతుంది. జిల్లాలో 1,811 మంది స్కూల్ అసిస్టెంట్లు, 1,130 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీ) ఈ కార్యక్రమంలో శిక్షణ పొందనున్నారు. శిక్షణను సమర్థవంతంగా అందించేందుకు వివిధ స్థాయిలలో రిసోర్స్ పర్సన్లను(ఆర్పీ) ఎంపిక చేశారు. ప్రతీ జిల్లా నుంచి ప్రాథమిక స్థాయిలో ఎనిమిది మంది ఎస్జీటీలు, ఉన్నత స్థాయిలో సబ్జెక్టుకు ఇద్దరు స్కూల్ అసిస్టెంట్ల చొప్పున మొత్తం 36 మంది స్టేట్ ఆర్పీలు గా శిక్షణ పొందారు. ఈ స్టేట్ ఆర్పీలు జిల్లా స్థాయి డీఆర్పీలకు, డీఆర్పీలు మండల స్థాయి ఎంఆర్సీ లకు శిక్షణ అందిస్తారు. స్కూల్ అసిస్టెంట్లకు జి ల్లా కేంద్రంలో ఏకకాలంలో శిక్షణ ఇవ్వనున్నారు. ప్రణాళికాబద్ధమైన శిక్షణ కోసం.. ఈ వేసవి శిక్షణ శిబిరాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సమగ్ర శిక్ష కో–ఆర్డినేటర్ చౌదరి ఆదేశించారు. ఈ సందర్భంగా, జిల్లా సైన్స్ సెంటర్లో ఎస్జీటీ డీఆర్పీలు, గణితం, ఆంగ్లం, సాంఘికశాస్త్రాల స్కూల్ అసిస్టెంట్ డీఆర్పీలతో ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతీ ఉపాధ్యాయుడు శిక్షణను సద్వినియోగం చేసుకునేలా రిసోర్స్ పర్సన్లు కీలక పాత్ర పోషించాలని చౌదరి సూచించారు. కార్యక్రమంలో క్వాలిటీ కో–ఆర్డినేట ర్ సత్యనారాయణమూర్తి, గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రమేష్, వామనమూర్తి, రామన్న, కేవీ సత్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సమావేశం శిక్షణ కార్యక్రమం యొక్క సమర్థవంతమైన అమలుకు దిశానిర్దేశం చేసింది. శిక్షణ లక్ష్యాలు.. ఈ శిక్షణ కార్యక్రమం ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థుల అ భ్యసన సామర్థ్యాలను పెంపొందించడానికి రూ పొందించబడింది. ఆధునిక బోధనా పద్ధతులు, వి ద్యార్థుల అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల ను అందించడం, విద్యా సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం వంటి అంశాలపై ఈ శిక్షణ దృష్టి సారిస్తుంది. ఈ కార్యక్రమం విద్యార్థులలో క్లిష్టమైన ఆలోచన, సమస్యా పరిష్కార నైపుణ్యాలు, మరియు సృజనాత్మకతను పెంపొందించడంలో ఉ పాధ్యాయులకు సహాయపడుతుందని భావిస్తున్నా రు. అలాగే, ఈ శిక్షణ రాష్ట్రంలో విద్యా నాణ్యతను జాతీయ సగటుతో సమానం చేయడానికి ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. దీర్ఘకాలిక ప్రభావం రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ఈ శిక్షణ కార్యక్రమం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలు మెరుగుపడటం వల్ల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయి. ఇది విద్యా నాణ్యతను గణనీయంగా మె రుగుపరుస్తుంది. ఈ కార్యక్రమం జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలకు అనుగుణంగా ఉంటూ, విద్యార్థులలో 21వ శతాబ్దానికి అవసరమైన నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. రేపటి నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పటికే రిసోర్స్ పర్సన్లకు ట్రైనింగ్.. -
‘శ్రీ చైతన్య’ ర్యాంకుల ప్రభంజనం
కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ప్రతిభ కనబరిచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. గోకులకొండ వైష్ణవి 810, బి.మనోఘ్న 968, బి.సాత్విక్ 1,142, పి.స్ఫూర్తిశ్రీ 1,527, బి.శ్రావణి 1,803, పి.బ్లెస్సీ సుసన్ 2,106, పి.చందన 2165, పి.భరత్రెడ్డి 2,815, పి.అజితేష్ 3,016, కె. అనూహ్య 3,503, వి. ప్రవీణ్ 3,623, డి.రిషి 3,996, జి.అర్చన 4,171, ఆర్.శ్రీయాన్ 4,246, వి.శివాణి 4,570, బి.స్రవంతి 4,957, 5000 లోపు 16 ర్యాంకులు, 10000 ర్యాంకుల లోపు 51 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను చైర్మన్ ముద్దసాని రమేశ్ రెడ్డి, అధ్యాపకులు అభినందించారు. కళాశాలల డైరెక్టర్ కర్ర నరేందర్రెడ్డి, డీన్ జగన్ మోహన్రెడ్డి, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఏజీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
‘అల్ఫోర్స్’ విద్యార్థులకు అభినందన
‘ట్రినిటి’ విజయభేరి కరీంనగర్: ఈఏపీసెట్ ఫలితాల్లో కరీంనగర్ ట్రినిటి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు 405, 430, 560, 697, 730, 760, 791, 859, 934,1104, 1166, 1546, 1619, 1795, 1950తో పాటు మొత్తం 89మందికి పైగా విద్యార్థులు 10వేలలోపు ర్యాంకులు సాధించారు. విద్యార్థులను విద్యాసంస్థల వ్యవస్థాపక చైర్మన్ దాసరి మనోహర్రెడ్డి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ట్రినిటి జూనియర్ కళాశాలలు విద్యా రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయని తెలిపారు. ఐఐటీ–జేఈఈ(మెయిన్), అడ్వాన్స్డ్, నీట్, ఈఏపీసెట్ వంటి పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకు సాధించారని ప్రశంసించారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్రెడ్డి అభినందించారు. ఈ విజయానికి బాటలు వేసిన అధ్యాపకులకు శుభాకాంక్షలు తెలిపారు. -
ఆదివాసీలు రాజకీయంగా ఎదగాలి
జన్నారం: ఆదివాసీలను చైతన్యపర్చి రాజకీయంగా ముందుకు తీసుకురావడానికి శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ ప్రోగ్రాం కన్వీనర్ రాహుల్ బల్ అన్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని హరితరిసార్ట్లో మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా ఆదివాసీలు రాజకీయంగా ఎదగలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీలు రాజకీయంగా ఎదిగేందుకు శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, రాష్ట్ర గిరిజన సహకార చైర్మన్ కోట్నాక తిరుపతి, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకురాలు ఆత్రం సుగుణ, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. -
మానవతామూర్తులు
● వైద్యరంగంలో నర్సుల పాత్ర కీలకం ● నిరంతరం రోగులకు సేవలు ● నేడు అంతర్జాతీయ నర్సుల దినోత్సవంవైద్యరంగంలో నర్సులు.. కనిపించే దేవతలు.. సేవామూర్తులు. కాలిన గాయాలతో దవాఖానలకు వచ్చే బాధితులైనా.. రోడ్డు ప్రమాద క్షతగాత్రులైనా.. పురిటినొప్పులతో వచ్చే గర్భిణులైనా.. మరి ఇంకెవరైనా తోబుట్టువులా మొదట పలుకరించేది వాళ్లే. రోగులే దైవంగా సేవలందిస్తూ వైద్య రంగానికే వన్నె తెస్తుండగా, నేడు (సోమవారం) అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. – నిర్మల్చైన్గేట్/ఆసిఫాబాద్అర్బన్ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా నర్సింగ్ వృత్తికి హుందాతనం తెచ్చిన ఫ్లోరెన్స్ నై టింగేల్ జయంతిని పురస్కరించుకుని ఏటా మే12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన కృషిని తలుచుకుంటూ ఏటా వేడుకలు జరుపుకుంటున్నారు. ఈక్రమంలో ఏటా నర్సింగ్ విభాగంలో వి శిష్ట సేవలు అందిస్తున్న నర్సులకు రాష్ట్రపతి అవా ర్డులు అందించి సముచితంగా సత్కరిస్తున్నారు. -
‘భూభారతి’తో సమస్యల పరిష్కారం
● కలెక్టర్ కుమార్దీపక్ భీమారం: ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం ఏర్పాటు సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూసమస్యల్లో కొన్ని ధరణిలో పరిష్కరించలేకపోయామని తెలిపారు. సాదాబైనామలకు పట్టాహక్కులు కల్పించాలని పలువురు రైతులు కలెక్టర్ను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. భీమారం రెవెన్యూ శివారులోని 21 సర్వే నంబర్లో భూమి ఉన్నవారికి పట్టాలు లేవని, పట్టాహక్కులు ఉన్న రైతులకు భూమిలేదని పలువురు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు అందిస్తామని, ఈమేరకు చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ సదానందంను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా గతంలో కొనుగోలు చేసిన భూములకు అమ్మకందారుల నుంచి పత్రాలు ఉంటే పట్టా చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సదానందం, ఎస్సై శ్వేత, పంచాయతీ కార్యదర్శి కృష్ణ తదితరులు ఉన్నారు. -
పాలిసెట్కు సర్వం సిద్ధం
● రేపే ప్రవేశ పరీక్ష ● ఉమ్మడి జిల్లాలో 28 పరీక్ష కేంద్రాలు ● హాజరుకానున్న 8195 మంది విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలి విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దు. పరీక్ష కేంద్రంలో చేతికి ప్రశ్నాపత్రం అందజేసిన తర్వాత ముందస్తుగా సూచనలు చదివి అనుసరించాలి. ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలి. చదివిన అంశాలను గుర్తు చేసుకుని జవాబులు రాస్తే పరీక్షలో నెగ్గడానికి వీలుంటుంది. – డాక్టర్ ఎం.దేవేందర్, మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్ బెల్లంపల్లి: రాష్ట్రంలో ఉన్న సాంకేతికవిద్య కళాశాలల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 13న పాలిసెట్–2025 పరీక్షకు సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉమ్మ డి జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, వాంకిడి, మంచిర్యాల, బెల్లంపల్లిలో మొత్తం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 8,195 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ప్రవేశ పరీక్షక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు జరగనుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష ఆయా కేంద్రాల్లోకి చేరుకోవాలి. పరీక్ష ప్రారంభమైన ఒక్కనిమిషం ఆలస్యమైన కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి ముందస్తుగానే కాలకృత్యాలు తీర్చుకుని రావల్సి ఉంటుంది. మధ్యలో వెళ్లే పరిస్థితి లేదు. విద్యార్థులు పాటించాల్సిన సూచనలు.. ● పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్టికెట్, ప్యాడ్, హెచ్బీ పెన్సిల్, షార్పనర్, ఎరేజర్, నీలం లేదా నలుపు బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి. ● రఫ్ వర్క్ కోసం ప్రశ్నాపత్రంలో చివర రెండు ఖాళీపేజీలు అందుబాటులో ఉంటాయి. బయటి నుంచి కాగితాలు తీసుకురా వొద్దు. ● హాల్టికెట్పై ఫొటోలేని విద్యార్థులు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణపత్రంతో పరీక్షకు హాజరుకావాలి. ● సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, వాచీలు, తదితర తీసుకురావడానికి అనుమతి లేదు. ఉమ్మడి జిల్లాలో.. జిల్లా విద్యార్థులసంఖ్య పరీక్ష కేంద్రాలు ఆదిలాబాద్ 1,102 03 నిర్మల్ 2,422 08 కుమురం భీం ఆసిఫాబాద్ 1,032 04 (వాంకిడి సెంటర్కలుపుకుని) మంచిర్యాల 2,558 10 బెల్లంపల్లి 1,081 03 -
ఎన్హెచ్–44పై దారికాచిన మృత్యువు
● మూడు జిల్లాల పరిధిలో మూడు యాక్సిడెంట్లు ● నిర్మల్ జిల్లాలో తండ్రి, కూతురు దుర్మరణం ● ఆదిలాబాద్ జిల్లాలో బావ మృతి, బావమరిదికి గాయాలు.. ● కామారెడ్డి జిల్లాలో భార్య మృతి, భర్తకు గాయాలు ● మూడూ కారు ప్రమాదాలే కావడం విషాదం..కశ్మీర్ నుంచి కన్యాకుమారిని కలిపే ఎన్హెచ్ 44పై ఆదివారం మృత్యువు దారికాచింది. మూడు జిల్లాల పరిధిలో ఇదే రోడ్డుపై జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. ఇక్కడ విషాదం ఏమిటంటే మూడు ప్రమాదాలకు కారణం కార్లే.. మూడు ప్రమాదాలు కారు డ్రైవర్ల తప్పిదంతోనే జరిగాయి. నిర్మల్ బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆగిఉన్న ఐచర్ వాహనాన్ని కారుడ్రైవర్ వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో తండ్రి, కూతురు దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రోల్మామడ టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బావ మృతి చెందగా, బావమరిది గాయపడ్డాడు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో కారు అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టడంతో భార్య మృతి చెందగా, భర్తకు గాయాలయ్యాయి. ఈ మూడు ప్రమాదాలు ఆ కుటుంబాల కలలను, ఆశలను ఛిన్నాభిన్నం చేశాయి.నిర్మల్ జిల్లాలో.. ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని రవీంద్రనగర్కు చెందిన బండి శంకర్(48) బ్యాటరీ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవారు. ఆయనకు కవల ఆడపిల్లలు వైదిక, కృతిక(22) ఉన్నారు. వైదిక నిజా మాబాద్లో వైద్య విద్య అభ్యసిస్తుండగా, కృతిక హైదరాబాద్లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం కృతిక పరీక్షలు పూర్తి కావడంతో వేసవి సెలవుల కోసం ఇంటికి తీసుకురావడానికి శంకర్ తన సొంత కారులో డ్రైవర్ విలాస్తో కలిసి హైదరాబాద్కు వెళ్లారు. శనివారం రాత్రి కృతికను తీసుకుని ఇంటికి బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో నిర్మల్ జిల్లా నీలాయిపేట వద్ద వారు ప్రయాణిస్తున్న కారు, రోడ్డుపై ఆగి ఉన్న ఐచర్ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. శంకర్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన కృతికను స్థానికులు నిర్మల్ ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు, ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. డ్రైవర్ విలాస్ కాళ్లకు తీవ్ర గాయాలై, చికిత్స కోసం మహారాష్ట్రలోని ఆస్పత్రికి తరలించారు. మరో గంటలో ఇంటికి చేరి, కుటుంబంతో సంతోషంగా గడపాలన్న కృతిక ఆశలు ఈ ప్రమాదంతో ఆవిరయ్యాయి. తండ్రి, కూతురు మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. వారి రోదనలు చూసినవారిని కంటతడి పెట్టించాయి. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని రోల్మామడ టోల్ప్లాజా వద్ద జరిగిన మరో ప్రమాదంలో వెంకటేశ్(35) మృతిచెందాడు. నిర్మల్ జిల్లా వివేక్నగర్కు చెందిన వెంకటేశ్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అన్వేష్ బావ, బావమరిది. పని నిమిత్తం శనివారం ఆదిలాబాద్కు వెళ్లిన వెంకటేశ్ ఆదివారం బావమరిదితో కలిసి నిర్మల్కు బయల్దేరాడు. టోల్ప్లాజా వద్ద ఆగి ఉన్న లారీని వారి కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడి, నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అన్వేష్కు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో.. సదాశివనగర్(ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి వద్ద గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయర్ ప్రణీత (20) మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కంఠం గ్రామానికి చెందిన అమూల్ నేవీలో విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో సెలవులు రద్దు కావడంతో, ఆదివారం సాయంత్రం భార్య ప్రణీతతో కలిసి కారులో బయల్దేరారు. మార్గమధ్యంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న రైలింగ్ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రణీత తీవ్రంగా గాయపడగా, అమూల్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ ప్రణీత మృతిచెందింది. అమూల్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అమూల్, ప్రణీతకు ఏడాది క్రితం పెళ్లయింది. -
రాజారెడ్డికి కళాకిరిటి సాఫల్య పురస్కారం
మంచిర్యాలఅర్బన్: స్థానిక సరస్వతీ శిశుమందిర్లో సాహితి సంరక్షణ సమితి ఆధ్వర్యంలో కవి, సమాజ సేవకుడు బోనగిరి రాజారెడ్డికి క ళాకిరిటీ జీవన సాఫల్య పురస్కారం ఆదివారం ప్రదానం చేశారు. ఈసందర్భంగా రాజారెడ్డి సాహిత్యంపై శతవధాని మారేపల్లి వెంకటరమణ పట్వర్థన్ పరిచయం చేశారు. ఉన్నది ఉ న్న ట్లే, నేనింతే, విత్తనాలు అలజడి ఎన్నో పుస్తకా లు రచించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ గొంతుకలు, సాహితీ సుగంధాలు అనే పు స్తకాలకు సంకలన బాధ్యతలు నిర్వహించారన్నారు. కార్యక్రమంలో సాహితీ సంరక్షణ సంస్థ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వామన్రావు, శ్రీనివాస్, కవులు బ్రహ్మయ్యచార్య, దాసరి శ్రీ నాథ్గౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎఫ్పీవోలుగా.. పీఏసీఎస్లు..
● కేంద్రం కీలక నిర్ణయం ● జిల్లాలో 12 సంఘాలు గుర్తింపు..దండేపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను(పీఏసీఎస్) రైతు ఉత్పత్తిదారుల సంస్థలుగా(ఎఫ్పీవో)గా మార్చేందుకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో మంచిర్యాల జిల్లాలోని 12 సహకార సంఘాలను ఎఫ్పీవోలుగా ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా, జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ)తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సహకార శాఖ చర్యలు చేపట్టింది. 12 సంఘాలు ఎఫ్పీవోలుగా.. జిల్లాలో మొత్తం 20 సహకార సంఘాలు ఉండగా, వీటిలో 23 వేల మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఈ సంఘాలు ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లు, పంట రుణాలు, ఎరువుల విక్రయాలు వంటి సేవల ను అందిస్తున్నాయి. మొదటి దశలో 12 సహకార సంఘాలను ఎఫ్పీవోలుగా మార్చేందుకు గుర్తించా రు. మార్పు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఎఫ్పీవోల ద్వారా చైతన్యం సహకార సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఎఫ్పీవోల ద్వారా ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలను అమలు చేయనున్నారు. జిల్లాలో ఎఫ్పీవోల ద్వారా ఎరువుల దుకాణాలు, విత్తన ఉత్పత్తి కేంద్రాలు, ధాన్యం కొనుగోళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాలను నిర్వహించనున్నారు. ఆర్థిక సహాయంతో ఆదాయ వృద్ధి ఎఫ్పీవోల ఏర్పాటు కోసం సభ్యులు కలిసి రూ.15 లక్షలు జమ చేస్తే, అదనంగా రూ.15 లక్షల రుణం మంజూరు చేస్తారు. ఈ నిధులతో ఆదాయాన్ని పెంచే కార్యకలాపాలను చేపడతారు. అంతేకాక, ఎఫ్పీవోల నిర్వహణ కోసం ఏడాదికి రూ.6 లక్షల చొప్పున మూడేళ్లపాటు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ చర్యల ద్వారా జిల్లాలోని సహకార సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావడంతోపాటు, రైతులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఏర్పడనుంది. మొదటి విడతలో 12 సంఘాలు.. జిల్లాలో 20 సహకార సంఘాలు ఉండగా, అందులో 12 సంఘాలను మొదటి విడతలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు(ఎఫ్పీవో)లుగా గుర్తించడం జరిగింది. ఇందుకు సంబందిచిన ప్రక్రియ కొనసాగుతోంది. సహకార సంఘాలను ఎఫ్పీవోలుగా మార్చడంతో మరింత అభివృద్ది చెందుతాయి. – మోహన్, డీసీవో, మంచిర్యాల -
ఇంటికే పౌష్టికాహారం
● వేసవి సెలవుల నేపథ్యంలో కొత్త విధానం ● అంగన్వాడీ లబ్ధిదారులకు అందజేతజిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల వివరాలు అంగన్వాడీ కేంద్రాలు 969 గర్భిణులు 4,245 బాలింతలు 3,186 చిన్నారులు 45,455మంచిర్యాలటౌన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తున్నాయి. వేసవి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు మే నెలలో సెలవులు ప్రకటించింది. పౌష్టికాహారం కోసం లబ్ధిదారులు కేంద్రాలకు రావడం లేదు. దీంతో ఆహార సరఫరా నిలిచిపోతోంది. ఈ సమస్య పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు వారానికి ఒకసారి నేరుగా పౌష్టికాహారం అందించే విధానం అమల్లోకి తెచ్చింది. లబ్ధిదారులకు ఊరట మే నెలలో ఎండల తీవ్రత కారణంగా గర్భిణులు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు రాకపోవడంతో పౌష్టికాహారం అందడం ఆగిపోయేది. ఈ సమస్యను గుర్తించిన అంగన్వాడీ టీచర్లు, ఆయాల యూనియన్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించాయి. దీంతో, మే 1 నుంచి 15 వరకు టీచర్లు, 16 నుంచి 31 వరకు ఆయాలు కేంద్రాలను తెరిచి, లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో అంగన్వాడీ నిర్వాహకులతోపాటు లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో పౌష్టికాహార సరఫరా ఇలా.. జిల్లాలో 969 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వీటిలో 74 మినీ, 895 ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. 2023లో మినీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం ఈ కేంద్రాల నుంచి 4,245 మంది గర్భిణులు, 3,186 మంది బాలింతలు, 45,455 మంది చిన్నారులు పౌష్టికాహారం పొందుతున్నారు. రోజూ భోజనం, గుడ్డు, పాలు, స్నాక్స్ అందించాల్సి ఉంటుంది. వేసవి సెలవుల సమయంలో వారానికి ఒకసారి నేరుగా సరుకులు పంపిణీ చేస్తున్నారు. సవాళ్లు, పర్యవేక్షణ అవసరం కొందరు లబ్ధిదారులు కేంద్రాలకు రాకపోవడం, టీచర్లు/ఆయాలు పంపిణీలో నిర్లక్ష్యంచేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోవచ్చు. ఈ నేపథ్యంలో, జిల్లా ఉన్నతాధికారులు కఠిన పర్యవేక్షణతో పౌష్టికాహా రం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ కొత్త విధానం లబ్దిదారులకు నిరంతర ఆహార సరఫరాకు దోహదపడనుంది.సరుకులు అందేలా చర్యలుజిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల ల బ్ధిదారులకు పౌష్టికా హారానికి సంబంధించిన సరుకులు సక్రమంగా అందించేలా చర్యలను తీసుకుంటున్నాం. టీచర్లు, ఆయాలు 15 రోజుల చొప్పున అంగన్వాడీ కేంద్రాలను తెరిచి ఉంచాల్సిందే. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం ఉండడంతో, అంగ న్వాడీ కేంద్రాలకు చిన్నారులు వచ్చేలా టీచ ర్లు తగు చర్యలను తీసుకునేలా చూస్తున్నాం. అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులు వచ్చినప్పుడు ఎలాంటి పౌష్టికాహారం తీసుకుంటా రో, కేంద్రాలకు రాకున్నా అదే పౌష్టికాహారం తీసుకునేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. – రవూఫ్ఖాన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి -
కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
దండేపల్లి: వరి ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూ ర్తి చేయాలని అదనపు కలెక్టర్ మోతీలాల్ నిర్వాహకులకు సూచించారు. మండలంలోని గూడెం, రంగంపల్లెలో కొనుగోలు కేంద్రాలను ఆదివారం సందర్శించారు. ఈసందర్భంగా రైతులు, నిర్వాహకులతో మాట్లాడారు. సమస్యలపై ఆరా తీశారు. అక్కడి నుంచి కన్నెపల్లి సమీపంలోని శ్రీవెంకటేశ్వర రైస్మిల్ను తనిఖీ చేశారు. ధాన్యం బస్తాల అన్లోడింగ్లో ఆలస్యం చేయవద్దని సూచించారు. ఆయన వెంట ఆర్ఐ బొద్దుల భూమన్న ఉన్నారు. ధాన్యం ఎప్పటికప్పుడు తరలించాలి..మంచిర్యాలరూరల్(హాజీపూర్): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నర్సింగా పూర్, నంనూర్, గుడిపేటల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్ట ర్ సబావత్ మోతీలాల్ తనిఖీ చేశారు. కేంద్రాల్లో వసతులపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం తెచ్చి ఎన్నిరోజులవుతుందని అడిగారు. నిబంధనల మేరకు తీసుకువచ్చిన ధాన్యాన్ని తూకం వేసి వెంటనే తరలించాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. -
ఘనంగా మాతృదినోత్సవం
మంచిర్యాలటౌన్: లయన్స్ క్లబ్, వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం మాతృ దినోత్సవం నిర్వహించారు. ఇటీవల జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. తర్వాత 40 మంది మాతృమూర్తులను సత్కరించారు. భోజనం అందించారు. కా ర్యక్రమంలో వి.మధుసూదన్రెడ్డి, హన్మంతరావు, వినయ్కుమార్, రామాంజనేయులు, కారుకూరి చంద్రమౌళి, భాగ్యలక్ష్మి, ఇందిరాదేవి, కె.మంగా రెడ్డి, రజినిరెడ్డి, డాక్టర్ విశ్వేశ్వర్రావు పాల్గొన్నారు. వనితావాక్కు ఆధ్వర్యంలో.. వనితా వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కోఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కుర్మ సునీత, జ్యోత్స్న చంద్రదత్, చిగురు మంజుల, కొండా శైలజ, బద్రి శ్రీదేవి, సంగీత, సత్యవతి, కమల పాల్గొన్నారు. -
దేశవ్యాప్త సమ్మెకు దూరంగా ఉండాలి
● బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య శ్రీరాంపూర్: ఈనెల 20న పలు జాతీయ కార్మి క సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కోరారు. నస్పూర్ కాలనీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణం ఉన్న ఈ విపత్కర పరిస్థితిలో రాజకీయ పార్టీల అనుబంధ సంఘాలు తమ ఉనికిని చాటుకోవడం కోసం సమ్మెకు పిలుపు ఇవ్వడం సరికాదన్నారు. ఈ సమ్మెకు కార్మికులు మద్దతు ఇవ్వొద్దని కోరారు. దేశానికి అండగా నిలవాల్సిన ఈ సమయంలో దేశ సమగ్రతకు విఘాతం కలిగించేలా సమ్మె చేయవద్దని కోరారు. కార్యక్రమంలో యూని యన్ ప్రధాన కార్యదర్శి యతిపత్తి సారంగపాణి, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు నాతా డి శ్రీధర్రెడ్డి, నాయకులు రాగం రాజేందర్, ఆకు ల హరి, రమేష్, బోయిన మల్లయ్య, జిల్లా తి రుపతి, గొల్ల మహేందర్, కిరణ్కుమార్, అరుణ్గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అలా నాన్నతో తిట్లు తప్పాయి
చెన్నూర్: నాది అమ్మనగుర్తి గ్రామం. సైదాపూర్ మండలం. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాను. నా చిన్నప్పుడు దోస్తులతో ఆడుకునేందుకు బయటకు వెళ్లాను. మా నాన్న ఆగమరావుకు చదువంటే చాలా ఇష్టం. ఇంటికి వచ్చి దే వేందర్ ఎటుపోయాడని మా అమ్మను అడిగారు. చదువుకునేందుకు క్లాస్మెంట్ ఇంటికి వెళ్లాడని చెప్పింది. నేను ఇంటికొచ్చాక అడిగివారు. సమాధానం చెప్పేలోగా అమ్మ ముందుగానే వాడు దోస్తు ఇంటికి చదువుకునేందుకు వెళ్లాడు అని చెప్పాను కదా అంది. అలా నాన్నతో తిట్లు తప్పాయి. ఆ రోజున నేను ఎన్నడూ మర్చిపోలేను. ఆ నాటి నుంచి అమ్మకు చెప్పకుండా ఎటూ వెళ్లలేదు. -
లైంగికవేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఆదిలాబాద్టౌన్: ఓ మహిళ పేరిట సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన ఓ మహిళ బంధువులు పంజాబ్లో నివసిస్తున్నారు. కొన్ని అవసరాల నిమిత్తం అమృత్సర్కు చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ను వీరు సంప్రదించారు. సదరు అధికారి డబ్బులు ఆశించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో పనులు చేసేందుకు నిరాకరించాడు. దీంతో అతన్ని మహిళ తరపు బంధువులు విజిలెన్స్ అధికారులకు పట్టించారు. వారిపై కక్ష పెంచుకున్న మునీష్ కుమార్ ఆదిలాబాద్కు చెందిన మహిళ పేరిట పేస్బుక్లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి, సదరు మహిళ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదిలాబాద్ సైబర్ క్రైమ్ బృందం సహకారంతో, వన్టౌన్ పోలీసులు నిందితుడిని గుర్తించి అమృత్సర్ నుంచి ఆదిలాబాద్కు తీసుకువచ్చారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ఎడారి దేశంలో జిల్లావాసి జైలు జీవితం
● చేయని నేరానికి గల్ఫ్ బాధితుడి నరకయాతన ● న్యాయ సహాయం కోసం కుటుంబసభ్యుల వేడుకోలు నిర్మల్ఖిల్లా: చేయని నేరానికి అకారణంగా ఎడారి దేశంలో జైలుశిక్ష అనుభవిస్తున్న తమ కుటుంబ సభ్యుడికి న్యాయ సహాయం అందించాలని గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ స్వదేశ్ వర్కిపండ్లతో కలిసి కలిసి వివరాలు వెల్లడించారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గజకరెడ్ల సాయన్న (51) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఏప్రిల్ 16న స్థానిక పోలీసులు అరెస్టు చేసి అబుదాబీ జైలుకు తరలించారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఎవరిని సంప్రదించాలని తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్ఆర్ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి సమస్యను వివరించారు. నిరక్షరాస్యత కారణంగా తన పేరిట ఇతరులకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో వేసినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశ్ మాట్లాడుతూ బాధితుడి సమగ్ర వివరాలతో అక్కడి ఎంబసీకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. న్యాయసహాయం ద్వారా జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. బాధితుడి తల్లి భోజవ్వ, భార్య మంజుల, కుమారుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బైక్పై నుంచి పడి మహిళ మృతి
లోకేశ్వరం: ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి మహిళ మృతి చెందింది. ఎస్సై ఆశోక్ కథనం ప్రకారం.. కుంటాల మండలం కల్లూర్ గ్రామానికి చెందిన పసుల సాయన్న– పసుల గోదావరి (40) దంపతులు. వీరు ఈనెల 6న బావమరిది కూతురు పెళ్లికి మండలంలోని పిప్రి గ్రామానికి బైక్పై వచ్చారు. పెళ్లి ముగించుకుని శనివారం బైక్పై స్వగ్రామానికి బయల్దేరారు. మండలంలోని హవర్గ సమీపంలోని శ్మశానవాటిక వద్ద బైక్పై నుంచి కళ్లు తిరిగి గోదావరి కింద పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలు గోదావరి తమ్ముడు దాస శేఖర్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పట్టుదలకు ప్రోత్సాహం
బెల్లంపల్లి: తాండూర్ మండలం మాదారం టౌన్షిప్కు చెందిన ఎనగంటి శ్యామలకు దేశమన్నా.. దేశభక్తి అన్నా ఎనలేని అభిమానం. అణువణువునా మాతృదేశంపై మమకారం పెంచుకుంది. ఎనగంటి శ్యామల, సమ్మిరెడ్డి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సమ్మిరెడ్డి సింగరేణి కంపెనీలో కార్మికుడిగా పని చేసేవారు. పిల్లలు చిన్నతనంలో ఉండగానే 1988లో అకాల మరణం చెందారు. దీంతో కుటుంబ బాధ్యతలు శ్యామలపై పడ్డాయి. భర్త వారసత్వంగా వచ్చిన సింగరేణి ఉద్యో గం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేసింది. చిన్న కుమారుడు రాజశేఖర్ డిగ్రీ చదువుతూనే 2006లో ఇండియన్ ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించాడు. తల్లి ఆశించినట్లుగానే దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తున్నాడు. రాజశేఖర్ పెద్దనాన్న కుమారులు ఒకరు ఇండియన్ ఎయిర్ఫోర్స్, మరొకరు నేవీలో పని చేసేవారు. వారి స్ఫూర్తితో మూ డో ప్రయత్నంలో ఎయిర్ఫోర్స్లో ఉద్యోగం సాధించి తల్లి కలను సాకారం చేశాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో సార్జెంట్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నాడు. దేశ సేవ చేయాలనే పట్టుదల కుమారుడికి ఉండడంతో ప్రోత్సహించింది. రెండు సార్లు విఫలమైనా వెన్నుతట్టి అండగా నిలబడడంతో నేడు దేశ సేవలో ముందున్నాడు. -
తండ్రిని రోకలితో కొట్టి చంపిన తనయుడు
● నిర్మల్ జిల్లా రాజూరలో ఘటన లోకేశ్వరం: తండ్రిని రోకలితో కొట్టి తనయుడు చంపాడు. నిర్మల్ జిల్లా మండలంలోని రాజూర గ్రామంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ముధోల్ సీఐ మల్లేశ్ కథనం ప్రకారం.. రాజూర గ్రామానికి చెందిన గన్నారం భూమన్న(80)కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమారుడు భూమన్న, రెండో కుమారుడు సుదర్శన్, మూడో కుమారుడు సాయికృష్ణ. సుదర్శన్ మూడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. సాయికృష్ణ హైదరాబాద్లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. పెద్దకుమారుడు భూమన్న భార్య సునీతకు ఏడాది క్రితం గొడవల కారణంగా పుట్టింటికి నిజామాబాద్ జిల్లా అంకాపూర్కు వెళ్లిపోయింది. రాజురాలో తనకున్న మూడెకరాల్లో పెద్దకుమారుడు వ్యవసాయంతోపాటు కూలీ పని వెళ్లి తండ్రి భూమన్నకు పోషించుకుంటున్నాడు. ఇద్దరు ఇంట్లో ఉంటున్నారు. మూడు రోజులుగా తిండి పెట్టటం లేదని తండ్రి, పెద్దకుమారుడి మధ్య గొడవ జరిగింది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు గొడవపడ్డారు. క్షణికావేశానికి లోనైన కుమారుడు రోకలితో తండ్రి తలపై కొట్టి హత్య చేశాడు. మృతుడి కుమారై సుజాత ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అంతకుముందు భైంసా ఏఎస్పీ అవినాష్కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ముధోల్ సీఐ మల్లేశ్, లోకేశ్వరం ఎస్సై అశోక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అమ్మా వందనం..
తల్లులకు పిల్లలన్నా.. ఇల్లన్నా ఎంతో ప్రేమ. ఆ తల్లుల ప్రేమ ఇల్లు, పిల్లలకే పరిమితం కాలేదు. దేశాన్నీ ప్రేమించారు. మాతృభూమిపై మమకారంతో దేశ సేవ కోసం పిల్లలకు ఉగ్గుపాల నుంచే దేశభక్తిని నూరిపోశారు. నేడు ఎంతోమంది సైనికులు సరిహద్దులో దేశ సేవ చేస్తున్నారంటే ఆ మాతృమూర్తులే కారణం. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న సైనికుల విజయం వెనుక ఉన్నది ఆ తల్లులే. దేశానికి ఎంతోమంది వీర సైనికులను అందించిన తల్లులపై నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. ● దేశ సేవకు పిల్లలను పంపిన మాతృమూర్తులు ఎందరో.. ● నేడు మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. -
భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలి
మందమర్రిరూరల్: భూగర్భ గనులు, ఓపెన్ కాస్టు గనుల్లో విద్యుత్ భద్రత ప్రమాణాలు విధిగా పాటించాలని సింగరేణి డీడీఎంఎస్(ఎలక్ట్రికల్) రాజీవ్ ఓం ప్రకాశ్వర్మ అన్నారు. శనివారం మందమర్రి ఏరియాలోని కేకేఓసీ, కేకే 5 గనుల్లో నాలుగు రోజులపాటు సాధారణ తనిఖీలు నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్ హాలులో ఎలక్ట్రికల్ సేఫ్టీ, సాంకేతిక ఇంటరాక్టివ్ సెషన్లో విద్యుత్ అపాయాల నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఏరియా జీఎం దేవేందర్, బెల్లంపల్లి రీజియన్ జీఎం సేఫ్టీ రఘుకుమార్, ఎస్వోటు జీఎం విజయ ప్రసాద్, ఏరియా ఇంజనీర్ వెంకటరమణ, ఏఎస్వో రవీందర్, కేకే గ్రూప్ ఏజెంట్ రాంబాబు, కేకే ఓసీపీవో మల్లయ్య, ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
భారత సైనికుల సేవలు మరువలేనివి
మంచిర్యాలటౌన్: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు జరిపి అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారని, అందుకు దీటుగా బదులు ఇస్తున్న భారత సైనికుల సేవలు మరువలేనివని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు అన్నారు. శనివారం ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా జిల్లా కేంద్రంలో మాజీ దేశ సైనికుల కవాతు, ఐబీ చౌరస్తా నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఉగ్రదాడులతో దేశాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తున్న ఉగ్రమూకలకు భారత సైన్యం తగిన బుద్ధి చెబుతోందని, దేశ రక్షణలో సైనికులు ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్నారని తెలిపారు. ర్యాలీ అనంతరం పహల్గాం ఉగ్రదాడిలో మృతులు, వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం.మురళీనాయక్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మాజీ దేశ సైనికులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. దేశ సైన్యానికి సంఘీభావంగా ర్యాలీ పహల్గాంలో మృతులు, ఆర్మీ జవాన్ మురళీనాయక్కు నివాళులు మాజీ సైనికులకు ఎమ్మెల్యే దంపతుల సన్మానం -
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
లక్సెట్టిపేట: వరిధాన్యం కొనుగోళ్లు వేగవంతం చే యాలని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నా రు. శనివారం మండలంలోని పోతపల్లి, లక్ష్మిపూర్, ఇటిక్యాల, మిట్టపల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు, రైస్మిల్లులను పరిశీలించి మాట్లాడారు. అకాల వర్షాలు పడుతున్నాయని, గన్నీ బ్యాగుల కొరత ఉంటే తెలియజేయాలని అన్నారు. మిట్టపల్లి గ్రా మంలో శివరామ క్రిష్ణ ట్రేడర్స్ మిల్లును పరిశీలించారు. ఇప్పటి వరకు 84,700 బస్తాలను మిల్లుకు చేర్చినట్లు తెలిపారు. మిల్లుల వద్ద లారీలను అన్లోడ్ చేసిన వెంటనే పంపించాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తెలియజేయాలని అన్నారు. తహసీల్దార్ దిలీప్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
● ఏ బహుమతి ఇచ్చినా తక్కువే.. ● తల్లి నిర్ణయాలకు ప్రాధాన్యం ● ‘సాక్షి’ సర్వేలో వెల్లడి
మంచిర్యాలటౌన్: అమ్మ.. ఆమె ప్రేమ అనిర్వచనీయం. వెల కట్టలేనిది. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనిది. సృష్టికి మూలం అమ్మ. పుట్టిన బిడ్డను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎదుగుతుంటే తాను పడిన కష్టాన్ని మరిచి మురిసిపోతుంది. బిడ్డ ఎదుగుదలను తన ఎదుగుదలగానే భావించి జీవితా న్ని త్యాగం చేస్తుంది. అలాంటి తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరూ సమానమే. అందరినీ సమానంగా చూస్తూ వారు ఎంచుకున్న రంగాల్లో ప్రోత్సహిస్తూ ముందంజలో నిలిచేలా ప్రేరణనిస్తుంది. నాన్న ఎంత ప్రేమ చూపించినా తల్లి ప్రేమకే పిల్ల లు కొంత ఎక్కువగా ముగ్ధులవుతారు. ఆదివారం మదర్స్ డే సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 150 మంది విద్యార్థిని, విద్యార్థులతో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ఉదయం నిద్ర నుంచి మేల్కొంది మొదలు అమ్మ సేవలకు తీరికుండదు. ఇంట్లో తల్లి అందించే సేవలకు గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో కుటుంబ నిర్ణయాల్లో తల్లికి అంత ప్రాధాన్యం ఉండేది కాదు. కానీ నేటి తల్లులు ఇల్లును చక్కదిద్దడంలోనే కాదు అన్ని రంగాల్లోనూ తమదైన శైలిలో రాణిస్తున్నారు. అందుకే కుటుంబాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా తల్లి పాత్ర ప్రధానంగా ఉంటోంది. మదర్స్ డే అంటే కేవలం బహుమతులు ఇవ్వడమే కాదు.. తల్లితో సమయం గడపడమే గొప్ప బహుమతిగా భావిస్తామని అంటున్నారు పిల్లలు.13085202112965అమ్మ ప్రోత్సాహంతోనే ఉద్యోగంమంచిర్యాలటౌన్: నా చదువు ఎక్కడా ఆగిపోకుండా ఎప్పటికప్పుడు ప్రోత్సహించి.. ఉద్యోగం పొందాలని మా అమ్మ నన్ను ఈ స్థాయిలో నిలిపింది. నర్సింగ్ చదువులకు ఇంట్లో వారి నుంచి స్పందన రాకపోవడంతో మా అమ్మ జాడి లక్ష్మీ ప్రోత్సాహంతోనే ఈ కోర్సులో జాయిన్ అయ్యాను. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉద్యోగంలో ప్రమోషన్లను సాధిస్తున్నా. నాడు మా అమ్మ ప్రోత్సాహం లేకుంటే ఒక గృహిణిగా ఇంటికే పరిమితం అయ్యేదానిని. నాకు అండగా నిలిచిన మా అమ్మ నేటికీ నాకు చేదోడుగా ఉంటూనే ఉంది. – సుజాత, ఇంచార్జి ప్రిన్సిపాల్, మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్ కాలేజీచదువుతోనే జీవితమని నేర్పిందిమనిషి ఎలాగైనా బతుకొచ్చు కాని చదువుకుంటే జీవితం బాగుంటుందని మా అమ్మ మా చిన్ననాటి నుంచే చెబుతుండేది. మా అమ్మ గృహిణి, ఇంట్లోనే ఉంటూ బీడీలు చుట్టేది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన నాకు హోంవర్క్ చేసుకోమని చెప్పేది. ఇంట్లో ఇతర పనులేవీ చెప్పకుండా కొంత సమయం ఆడుకోమనేది. ఇలా చదువుతోపాటు రిలాక్సేషన్ కోసం ఆటలు ఆడుతూ ఒక స్థాయికి వచ్చేందుకు కృషి చేసింది. సివిల్స్ రాసేప్పుడు అండగా నిలిచి, తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తావనే భరోసాను ఇచ్చింది. ప్రస్తుతం కమిషనర్గా పనిచేస్తున్నానంటే మా అమ్మ అండగా నిలవడమే కారణం. మా అమ్మ ద్వారానే చదువు, ఉద్యోగం, ఒక స్థాయి రావడం నా జీవితంలో మర్చిపోలేనది. – తౌటం శివాజి, మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్అమ్మతోనే చెప్పుకునే వాడినినా చిన్నతనంలో అమ్మతోనే గడిపిన 11 సంవత్సరాలు ఎంతో కీలకంగా ఉండేవి. ఆ తర్వాత గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు హాస్టళ్లలోనే ఉండి చదువుకున్నా. నాకు ఏ సమస్య వచ్చినా, ఏది కావాలన్నా మా అమ్మకే చెప్పేవాడిని. బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడాలని మా అమ్మ ఎంతగానో కోరుకుంది. ఆ కోరిక తీర్చేందుకు బాగా చదివేవాడిని. కానీ డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే మా అమ్మ నా నుంచి దూరం కావడం, నాకు జాబ్ వచ్చే నాటికి అమ్మ లేని లోటును భరించడం నేటికీ నా వల్ల కావడం లేదు. అమ్మ కోరిక తీర్చినా అనే సంతృప్తి ఉన్నా అమ్మ ఉంటే బాగుండుననే బాధ ఉంది. – సిహెచ్.దుర్గాప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మంచిర్యాలతల్లి లక్ష్మీతో సుజాత -
చట్టాలపై అవగాహన ఉండాలి
● క్రమశిక్షణ ఉంటే వృత్తిలో విజయం ● ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు ● న్యాయవాదుల శిక్షణ తరగతులు మంచిర్యాలక్రైం: న్యాయవాద వృత్తిలో నైపుణ్యత, కొత్త చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సుచిత్ర ఇన్ హోటల్లో శనివారం ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించిన న్యాయవాదుల శిక్షణ తరగతులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో న్యాయవ్యవ్థలో రోజురోజుకు అనేక కొత్త చట్టాలు వస్తున్నాయని, వాటిపై న్యాయవాదులకు శిక్షణ అవసరమని అన్నారు. ప్రతీ న్యాయవాదికి క్రమశిక్షణ, నిబద్ధత, చట్టాలపై అవగాహన లేకుండా వృత్తిలో విజయం సాధించలేమని పేర్కొన్నారు. ప్రతీ న్యాయవాది బెంచ్ అండ్ రిలేషన్ నేర్చుకోవాలని అన్నారు. సామాజిక బాధ్యతతో న్యాయవాదులు కక్షిదారులకు న్యాయం చేయలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియా లాయర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు, బార్కౌన్సిల్ సభ్యుడు కొల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యల ఏమాజి, జాడి తిరుపతి, రాష్ట్ర కార్యదర్శి శైలజ, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, కార్యదర్శి మురళి, సీనియర్ న్యాయవాదులు రాజన్న, చిట్ల రమేష్, రాజేష్గౌడ్, రవీందర్రావు, రవీందర్, భుజంగ్రావు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా వాలీబాల్ పోటీలు
రామకృష్ణాపూర్: రామకృష్ణాపూర్ పట్టణంలోని సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు శనివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరుగనున్న ఈ పోటీలకు ఉమ్మడి జిల్లా నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. మందమర్రి ఏరియా జీఎం దేవేందర్, సీఐ శశిధర్రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మందమర్రి జీఎం దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని అన్నారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గెలుపు, ఓటములను లెక్క చేయకుండా అకుంఠిత దీక్షతో సాధన చేస్తే మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని అన్నారు. క్రీడల వల్ల చక్కటి క్రమశిక్షణ అలవర్చుకోవచ్చని, సమాజంలో మంచి పౌరులను తయారు చేయడానికి క్రీడలు దోహదం చేస్తాయని తెలిపారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, సీనియర్ క్రీడాకారులు బెల్లం శ్రీనివాస్, యాకూబ్, శివ, ఈశ్వరాచారీ, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
ఆసుపత్రి పనుల పరిశీలన
మంచిర్యాలటౌన్: మంచిర్యాల కాలేజీరోడ్డులో 450 పడకల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ మంచిర్యాలలో 450 పడకల ఆసుపత్రి పనులు ప్రారంభించారని, నాటి ప్రభుత్వ కృషి వల్లనే నూతన భవన నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్రావు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, బేర సత్యనారాయణ, ఎర్రం తిరుపతి, శ్రీరాముల మల్లేశ్, వంగ తిరుపతి, పెంట నవీన్, జూపాక సుధీర్, నార్ల వంశీ, పడాల రవీందర్, నాయకులు పాల్గొన్నారు. -
కళాశాల భవన నిర్మాణం నా అదృష్టం
● మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు లక్సెట్టిపేట: తాను చదువుకున్న కళాశాల భవన నిర్మాణం చేపట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రే మ్సాగర్రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వ కళాశాల పక్కా భవన ని ర్మాణ పనులను పరిశీలించారు. చిన్ననాటి జ్ఞా పకాలు, తను చదువుకున్న రోజులను గుర్తు చే సుకున్నారు. ఇక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాన ని, అటువంటి కళాశాల భవనం నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు స్వయంగా చూసుకుంటున్నాన ని తెలిపారు. విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అ నంతరం ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నిర్మాణ ప నులను పరిశీలించి వర్షాకాలం సమీపించక ముందే పూర్తి చేసి ప్రారంభం చేయాలని అధి కారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండీ.ఆరీఫ్, గడ్డం త్రిమూర్తి, చింత అశోక్, శ్రీనివాస్, పింగిళి ర మేష్, స్వామి, శ్రీధర్, కార్యకర్తలు, వైద్యాధికా రి శ్రీనివాస్, పాల్గొన్నారు. -
● జిల్లాలో పుంజుకున్న ధాన్యం సేకరణ ● పెరిగిన లారీలు, తీరిన హమాలీల కొరత ● జిల్లాతోపాటు కరీంనగర్ జిల్లాకు ధాన్యం రవాణా
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ధాన్యం కొనుగోళ్లలో క్రమంగా వేగం పెరుగుతోంది. తొలుత మందకొడిగా మొదలైనా క్రమంగా పుంజుకుంది. అకాల వర్షాలు, వాతావరణ మార్పులతో రైతులు త్వరితగతిన కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైస్మిల్లుల్లో ధాన్యం దించుకునేలా ట్యాగింగ్ ఇస్తూ అక్కడికి రవాణా చేస్తున్నారు. కొనుగోళ్లు మొదలైనప్పటికీ హమాలీల కొరత ఏర్పడింది. జిల్లా పరిధిలోనూ మిల్లుల ట్యాగింగ్ జాప్యంతోనూ ధాన్యం సేకరణ ఆలస్యమైంది. తేమ శాతం అధికంగా వస్తుందని తరుగు పేరుతో మిల్లర్లు మెలిక పెట్టారు. దీంతో అకాల వర్షాలతోనూ అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమైంది. దీంతో జాప్యాన్ని నివారించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతీలాల్ కొనుగోళ్ల తీరును పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రాథమిక సహకార సంఘ పరిధిలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను రవాణా, మిల్లుల్లో బస్తాలు దించుకునేలా తగిన మిల్లులు ఏర్పాటు చేశారు. డీఎం, డీఎస్వో, డీఆర్డీవో, డీసీవో, డీసీఎంఎస్వో, మెప్మా అధికారులతో ప్రతీ రోజు కొనుగోళ్లపై ఉదయం, సాయంత్రం రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమీక్షలు చేస్తూ లోపాలు సరిదిద్దుతున్నారు. రోజుకు 6వేల టన్నులు జిల్లాలో గత మార్చి 4నుంచి కొనుగోళ్లు మొదలు కాగా, మొదట కేంద్రాల్లో జాప్యం జరిగింది. తేమ 17శాతం కంటే అధికంగా ఉండడంతో కాంటా వేయడంలో ఆలస్యమైంది. రోజుల తరబడి కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. లారీల అన్లోడింగ్ జాప్యం జరిగింది. దీంతో ప్రతీ రోజు 355 లారీలతో 4వేల నుంచి 6వేల టన్నుల ధాన్యం కాంటా వేసి రవాణా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక జిల్లాలో రైస్మిల్లర్లు బకాయిలు ఉండడంతో ఇప్పటి వరకు 16మిల్లులకే ట్యాగింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారుల అనుమతితో కరీంనగర్ జిల్లాలో 56మిల్లులకు అనుమతి ఇవ్వడంతో పొరుగు జిల్లాకే ధాన్యం అధికంగా వెళ్తోంది. ఈ సీజన్లో 3.30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అంచనా ఉన్నప్పటికీ రైతుల సొంత వినియోగం పోను 2.20లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. గత సీజన్లో 1.55లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అయితే కొందరు మిల్లర్లు బస్తాకు 42కిలోలు ఒప్పుకుంటే దించుతామని మెలిక పెడుతున్నారు. దీంతో అంతే మొత్తంలో కాంటా వేస్తున్నారు. రైతులు సైతం ప్యాడి క్లీనర్లతో శుభ్రం చేసి తేమ లేకుండా ఉన్న వాటికి తరుగు లేకుండా చూడాలని కోరుతున్నారు. మరోవైపు మాన్యువల్ కంటే, ట్యాబ్ నమోదుల్లో జాప్యాన్ని నివారిస్తే వేగంగా రైతులకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది.మొత్తం కొనుగోలు కేంద్రాలు: 345కొనుగోళ్లు జరుగుతున్నవి: 251సేకరించిన ధాన్యం: 65,970.64టన్నులు రైతులు: 7990మంది చెల్లింపులు: రూ.39.13కోట్లురైతులకు ఇబ్బంది లేకుండా..రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు లారీల సంఖ్య పెంచి, కేంద్రాల్లో హమాలీలను ఎక్కువ మందిని అందుబాటులో ఉంచాం. అలాగే మిల్లుల ట్యాగింగ్ పెరగడం, ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం అప్రమత్తతతో ధాన్యం సేకరణలో వేగం పెరిగింది. – ఎస్.మోతీలాల్, అదనపు కలెక్టర్ -
ఎల్ఆర్ఎస్ ఆదాయం రూ.26.69కోట్లు
● 25శాతం రాయితీ గడువు పూర్తి ● సద్వినియోగం చేసుకున్నది కొందరే.. ● గడువు తర్వాత చెల్లింపులపై సందిగ్ధంమంచిర్యాలటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ద్వారా జిల్లాలో రూ.26.69కోట్ల ఆదాయం సమకూరింది. రాయితీ అవకాశం కల్పించినా కొందరే సద్వినియోగం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎల్ఆర్ఎస్ కోసం 2020లో రూ.1000 చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారికి 25శాతం రాయితీ ప్రకటించగా ఈ నెల 3న గడువు ముగిసింది. మార్చి 31వరకు 25శాతం రాయితీతో ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించేందుకు మొదట ప్రభుత్వం అవకాశం కల్పించగా.. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు, కొంత గందరగోళం నేపథ్యంలో ఏప్రిల్ 30వరకు గడువు పొడిగించింది. అయినప్పటికీ సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావడం, మున్సిపాల్టీ, గ్రామ పంచాయతీ, ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఎల్ఆర్ఎస్కు అనుమతులు ఇవ్వడంలోనూ జాప్యం జరిగింది. దీంతో మరోసారి ఈ నెల 3వరకు గడువు పొడిగించినా దరఖాస్తుదారులు సద్వినియోగానికి ముందుకు రాకపోవడం గమనార్హం. మరోసారీ ప్రభుత్వం గడువు పెంచుతుందని దరఖాస్తుదారులు భావించినా ఆదివారం సెలవు కావడంతో గడువు పెంపు ఉత్తర్వులు రాలేదు. సోమవారం ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపుదారులకు 25శాతం రాయితీ కనిపించడంతో కొందరు చెల్లించారు. ఎల్ఆర్ఎస్ ద్వారా ఫీజుల రూపంలో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆదాయం సమకూరుతుందని భావించినా అంతంత మాత్రంగానే సమకూరింది. జిల్లాలో.. జిల్లాలో 2020లో ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా.. జిల్లా వ్యాప్తంగా 55,697 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 33,529, 16 మండలాల్లో 10,728, ఐదు మున్సిపాలిటీల్లో 11,440 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిశీలించిన అధికారులు ఫీజు ధ్రువీకరించినవి 31,084 ఉన్నాయి. ఇందులో నుంచి 25శాతం రాయితీని సద్వినియోగం చేసుకుని ఫీజు చెల్లించింది 10,427 దరఖాస్తుదారులు మాత్రమే. 2020లో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకోని వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించగా 780మంది సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా ఎల్ఆర్ఎస్ ఫీజుల ద్వారా రూ.26.69కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో మంచిర్యాల కార్పొరేషన్ నుంచి రూ.16.18 కోట్లు, 16 మండలాల నుంచి రూ.5.27 కోట్లు, లక్సెట్టిపేట, బెల్లంపల్లి, మందమర్రి, క్యాతన్పల్లి, చెన్నూరు మున్సిపాలిటీల నుంచి రూ.5.29 కోట్ల ఆదాయం వచ్చింది. మిగతా వారు ఫీజులను చెల్లిస్తే జిల్లా నుంచి రూ.50 కోట్లకు పైగా ఆదాయం సమకూరే అవకాశం ఉండేది. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులో 25శాతం రాయితీ గడువును పొడిగించి, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. -
దేశం కోసం దేనికై నా సిద్ధమే..!
మంచిర్యాలక్రైం: ‘నా దేశానికి ముప్పు తలపెడుతున్న శత్రుమూకలను ఏరిపారేసేందుకు దేనికై నా సిద్ధమే’నని మంచిర్యాలకు చెందిన ఆర్మీ హ వల్దార్ కొప్పుల అశోక్ అన్నారు. గత నెల మార్చి 28న సెలవులపై ఇంటికి వచ్చారు. పహల్గాం ఘ టన, పాకిసాన్–ఇండియా మధ్య యుద్ధంతో సెలవుల్లో ఉన్న ఆర్మీ అధికారులు వెంటనే విధుల్లో చేరాలని కేంద్రమంత్రి అమిత్ షా ఆదేశించడంతో అశోక్ విధుల్లో చేరేందుకు శుక్రవారం వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను ఇంటి వద్ద ‘సాక్షి’ పలుకరించింది. ఆయన మాటల్లోనే..‘‘ఇండియా–పాకిస్తాన్ మధ్య యుద్ధం ప్రారంభమై న సందర్భంగా ఎమర్జెన్సీ కాల్ రావడంతో వెళ్లాల్సి వస్తోంది. రాజస్థాన్ సరిహద్దులో విధులు ని ర్వహిస్తున్నాం. ఆర్మీ ఉద్యోగం అంటే మొదట్లో ఒక ఫ్యాషన్గా ఉండేది. ఉద్యోగంలో చేరిన తర్వా త ఆర్మీ ఉద్యోగం అంటే ఫ్యాషన్ కాదు. ఆర్మీ అంటే దేశభక్తి, దేశ సేవ చేసే భాగ్యం దక్కిందనే గౌర వం ఉంది. విధుల్లో ఉన్నప్పుడు కుటుంబం గుర్తుకు రాదు. కుటుంబం అంటేనే నా దేశం. నా దేశాన్ని కాపాడుకుంటే నా కుటుంబాన్ని కాపాడుకున్నంత ఆనందంగా ఉంటుంది. ప్రస్తుతం రాజస్థాన్లో విధులు నిర్వర్తిస్తున్నాం. ఈసారి కుటుంబాన్ని తీసుకెళ్దామని అనుకున్న. యుద్ధ వాతావరణం కారణంగా తీసుకెళ్లడం లేదు. రాజస్థాన్ వెళ్లి ఆర్మీ ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేసిన తర్వాత ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లేందుకు సిద్ధమే. ఒకవేళ యుద్ధంలో పాల్గొనే అవకాశం వస్తే పాక్ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తా..’’ అన్నారు. ఆర్మీ హవల్దార్ కొప్పుల అశోక్ అత్యవసర పిలుపుతో విధుల్లోకి.. -
మద్యానికి బానిసై ఆత్మహత్య
తానూరు: మండలంలోని దాగాం గ్రామానికి చెందిన గాడేకర్ గులాబ్రావు (40) మద్యానికి బానిపై ఆత్మహత్య చేసుకున్నాడు. ట్రైయినీ ఎస్సై నవనీత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గులాబ్రావు కొన్నేళ్లుగా మద్యానికి బానిసై ఏ పనీ చేయకుండా ఇంటివద్దే ఉంటున్నాడు. మద్యం అలవాటు మానుకోవాలని పలుసార్లు కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా ట్రెయినీ ఎస్సై నవనీత్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య శాంతాబాయి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జీవితంపై విరక్తితో వృద్ధురాలి బలవన్మరణం ఆదిలాబాద్రూరల్: మండలంలోని కచికంటి గ్రా మానికి చెందిన కాసరపు భూలక్ష్మి (65) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై ముజా హిద్ తెలిపిన వివరాల ప్రకారం.. భూలక్ష్మి ఎనిమి ది నెలల క్రితం పశువుల దాడిలో తీవ్రంగా గాయ పడ్డది. కుటుంబ సభ్యులు ఆమెకు చికిత్స చేయించినా ఆమె మంచానికే పరిమితమైంది. జీవితంపై విరక్తి చెంది శుక్రవారం పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. మృతురాలి కుమారుడు నర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చెరువులో జారిపడి రైతు మృతి నర్సాపూర్(జి): ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి రైతు మృతి చెందాడు. ఏఎస్సై శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తురాటి గ్రామానికి చెందిన రైతు ముక్కెర గంగాధర్ అలియాస్ గంగారెడ్డి (41) తన కొడుకు రిన్నుతో కలిసి ఎద్దులను కడగడానికి శుక్రవారం మధ్యాహ్నం గ్రామ శివారులోని ఊర చెరువుకు వెళ్లాడు. చెరువులోకి దిగిన గంగాధర్ ప్రమాదవశాత్తు అందులో జారిపడి ఈతరాక నీటమునిగి మరణించాడు. గజ ఈతగాళ్ల సాయంతో చెరువులో వెతకగా అతడి మృతదేహం లభ్యమైంది. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. చెరువులో అక్రమంగా జేసీబీలతో పెద్దపెద్ద గుంతలు తీయడంతోనే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. చెక్డ్యాంలో పడి మతిస్థిమితం లేని మహిళ మృతి సారంగపూర్: మండలంలోని వంజర్ గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని మహిళ చాట్ల లక్ష్మి శుక్రవారం చెక్డ్యామ్లో పడి మృతి చెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వంజర్ గ్రామానికి చెందిన లక్ష్మి చిన్నప్పటి నుంచే మతిస్థిమితం లేక గ్రామంలో తిరుగుతుండేది. ఆమెకు కుటుంబ సభ్యులు, బంధువులెవరూ లేరు. గ్రామస్తులు అందించే భోజనం తింటూ ఉండేది. మూడు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు గాలింపు చేపట్టారు. గ్రామ సమీపంలోని చెక్డ్యామ్ వద్ద ఆమె మృతదేహం కనిపించగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై శ్రీకాంత్ ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో కిందపడ్డ ఒకరికి గాయాలు బెల్లంపల్లి: అతిగా మద్యం సేవించి కింద పడిపోయిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన మోహన్ దుర్వే బెల్లంపల్లికి వచ్చాడు. పాత బస్టాండ్ వైన్షాపు వద్ద అతిగా మద్యం సేవించా డు. కాసేపటికే మద్యం మత్తులో కింద పడగా తల కు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వన్టౌన్ ఎస్హెచ్వో దేవయ్య వెంటనే మోహన్ దుర్వేను స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మె రుగైన వైద్యం కోసం మంచిర్యాలకు రెఫర్ చేశారు. అడవిపంది దాడిలో ఒకరి మృతి ఇంద్రవెల్లి: అడవిపంది దాడిలో ఒకరు మృతి చెందారు. ఎస్సై సాయన్న, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దొడందా పంచాయతీ పరిధి చిలటిగూడ గ్రామానికి చెందిన మడావి బొజ్జు (58) ఆదే గ్రామానికి చెందిన పుసం నాందేవ్, మడావి మంతులు శుక్రవారం మేకలను మేత కోసం అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు. మేకలు మేస్తుండగా చెట్టు కింద కూర్చుని ఉన్న బొజ్జుపై అకస్మాత్తుగా అడవిపంది దాడి చేసింది. కడుపు, ఛాతి భాగంలో తీవ్రంగా గాయపరచగా బొజ్జు అక్కడికక్కడే మృతి చెందాడు. పుసం నాందేవ్, మడావి మంతులు చెట్టు ఎక్కి ప్రాణాలు దక్కించుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. యువతిని వేధించిన యువకుడిపై కేసు బోథ్: మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని స్నాప్ చాట్ యాప్లో వేధించిన సాయి అనే యువకుడిపై ఎస్సై ప్రవీణ్కుమార్ శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సాయి స్నాప్చాట్ యాప్లో ఫేక్ ఐడీని క్రియేట్ చేసి బోథ్ మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో సదరు యువతి షీటీంకు సమాచారం ఇచ్చింది. షీటీం సభ్యులు శుక్రవారం సాయిని పట్టుకుని బోథ్ పోలీస్స్టేషన్కు తరలించారు. సాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మహిళలు, యువతులు ఎలాంటి వేధింపులకు గురైనా 8712659953 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ప్రమాదవశాత్తు రాడ్ కట్టర్ తగిలి ఒకరి మృతి జైనథ్: మండల కేంద్రానికి చెందిన కోకన్ చంద్రకాంత్ (40) రాడ్ కట్టర్ తగిలి మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వ చ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండ ల కేంద్రంలోని ఓ ఇంటి వ ద్ద చంద్రకాంత్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు రాడ్ కట్టర్ ఎడమ చేయి వైపు పడింది. దీంతో అతడి చేతికి గాయమై తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి చంద్రకాంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి ఆదిలాబాద్టౌన్: మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా పెరాడి గ్రామానికి చెందిన కరాడే చంపత్ (27) రిమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాశ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన చంపత్ ఈనెల 7న తన గ్రామంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
జొన్నలు తరలిస్తున్న వాహనాల పట్టివేత
తాంసి: మహరాష్ట్ర నుంచి అక్రమంగా జొన్నలను వాహనాల్లో తరలించి శుక్రవారం తాంసి మార్కెట్యార్డులో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ సాయినాథ్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కొద్దిరోజులుగా తెలంగాణ మార్కెట్లో జొన్నలకు అధిక ధర లభిస్తుండగా మహారాష్ట్రకు చెందిన దళారులు తెలంగాణ రైతుల పట్టాపాస్పుస్తకాల పేరిట జిల్లాలోని వివిధ మార్కెట్యార్డుల్లో జొన్నలు విక్రయిస్తున్నారు. దీనిపై పక్కా సమాచారం మేరకు సీఐ శుక్రవారం భీంపూర్ ఎస్సైతో కలిసి భీంపూర్ మండలం నిపాని వద్ద తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్ర నుంచి జొన్నలతో వస్తున్న ట్రాక్టర్, రెండు బొలెరో వాహనాలను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని ఘంటాజీ, జరూర్ నుంచి అక్రమంగా జొన్నలు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించి ఏవో శ్రీనివాస్రెడ్డి, ఏఈవో సాయిప్రసాద్ సమక్షంలో సీజ్ చేసి మహారాష్ట్రకు చెందిన సుశాంత్, దినేశ్, సునీల్, భారత్, గోకుల్తోపాటు మార్కెట్లో జొన్నల విక్రయానికి పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చి సహకరిస్తున్న భీంపూర్ రైతులు నారాయణ, రాథోడ్ అరవింద్, వామన్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై పీర్సింగ్ నాయక్, సిబ్బంది దినేశ్ ఉన్నారు. -
దొరికిపోతామని దొంగిలించారు
వేమనపల్లి: వన్యప్రాణులను వేటాడేందుకు అడవికి వెళ్లిన వేటగాళ్లు పులుల ట్రాకింగ్ కోసం అమర్చిన సీసీ కెమెరాలకు చిక్కారు. ఇది గమనించిన వారు అధికారులకు దొరికిపోకూడదని ఏకంగా సీసీ కెమెరాలనే చోరీ చేశారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో ఇటీవల అడపాదడప పులి సంచారం ఉంది. వివిధ రకాల వన్యప్రాణులున్నాయి. వీటి ట్రాకింగ్కు పలు ప్రాంతాల్లో నీల్వాయి అటవీ రేంజ్ సిబ్బంది మార్చిలో నాలుగు సీసీ కెమెరాలు అమర్చారు. మార్చి 25న అవి చోరీకి గురి కాగా నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బొమ్మెన గ్రామానికి చెందిన కోల తిరుపతిని విచారించగా అదే గ్రామానికి చెందిన మానేపల్లి సమ్మయ్య, భట్టు కిష్టయ్య, మడె భీమయ్య అడవుల్లో బ్యాటరీ లైట్ సాయంతో వన్యప్రాణులను వేటాడుతున్నట్లు తెలిసింది. అందులో భాగంగా మార్చి 20న నలుగురు బ్యాటరీ లైట్ సాయంతో బద్దంపల్లి అటవీ ప్రాంతంలోకి వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లారు. ఈ క్రమంలో పులి ట్రాకింగ్ కోసం అమర్చిన సీసీ కెమెరాల ఫ్లాష్ లైట్లో పడ్డారు. దీంతో భయపడి అధికారులకు దొరికిపోతామనే భయంతో రెండు సీసీ కెమెరాలను తీసుకెళ్లారు. వాటిని కోల తిరుపతి ఇంట్లో దాచారు. ఆతర్వాత మైలారం అడవుల్లోకి మరోసారి వేట కోసం వెళ్లగా అదే రీతిలో సీసీ కెమెరాల ఫ్లాష్కు చిక్కారు. దీంతో అక్కడి రెండు సీసీ కెమెరాలు తొలగించి ధ్వంసం చేశారు. ఈ విషయమై అటవీ అధికారులు నీల్వాయి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న ఎస్సై శ్యాంపటేల్ దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి బ్యాటరీ లైట్, నాలుగు సీసీ కెమెరాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నూర్ రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై శ్యాంపటేల్ ఉన్నారు. -
కార్మికులు సమ్మెలో పాల్గొనాలి
శ్రీరాంపూర్: ఈ నెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్లోని ఎస్సార్పీ 3, 3ఏ గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్లో కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు సమ్మెలో పాల్గొనాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో కార్మికులకు చరిత్రాత్మక ఒప్పందాలు, హక్కులు సాధించామని తెలిపారు. వివిధ యూనియన్లకు చెందిన సుమారు 80 మంది కార్మికులు టీబీజీకేఎస్లో చేరారు. వారికి రాజిరెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్రెడ్డి, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ నాయకులు బండి రమేష్, పానుగంటి సత్తయ్య, పొగాకు రమేష్, అన్వేశ్రెడ్డి, లాల, మైపాల్ రెడ్డి, బుస్సా రమేష్, వెంగళకుమార్స్వామి, గొర్ల సంతోష్, ఫిట్ సెక్రెటరీ వెంకట్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఎస్టీపీపీ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి
జైపూర్: ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసులు, సింగరేణి యాజమాన్యం సూచనల మేరకు సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్లాంటు జీఎం శ్రీనివాసులు తెలిపారు. జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు అడ్మిన్ భవన కార్యాలయంలో శుక్రవారం సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా ఐడీ కా ర్డు వెంట ఉంచుకోవాలని, అత్యవసరమైతే త ప్పించి నుంచి బయట ప్రాంతాలకు వెళ్లరాదని తెలిపారు. పరిసరాలు, ప్లాంటు ఆవరణలో అ నుమానితులు కనిపిస్తే వెంటనే సెక్యూరిటీ సి బ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. తెలియని వ్యక్తుల నుంచి వస్తువులు, పార్సిళ్లు వస్తే తీసుకోరాదని కోరారు. సీఐ ఎస్ఎఫ్ కంట్రోల్ రూమ్ ఫోన్నంబర్ 83329 74224కు స మాచారం అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్టీపీపీ వోఅండ్ఎం చీఫ్ జెన్సింగ్, ఏజీఎంలు మదన్మోహన్, సీఐఎస్ఎఫ్ క మాండెంట్ చంచల్ సర్కార్, పీఎంపీఎల్ హెడ్ అఖిల్కపూర్, డీజీఎంలు రమేశ్చంద్ర, అజాజుల్లాఖాన్, డీజీఎం పర్సనల్ అజ్మీరాతుకారాం, ఎస్అండ్పీసీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘అందరికీ వేదం అందిస్తాం’
బాసర: శ్రీవేద భారతి విద్యాపీఠానికి అనుబంధంగా నిర్వహిస్తున్న బాసర శ్రీవేదభారతి వేదవిద్యాల యం నిర్వహణకు వివిధ కుల సంఘాలతో కమిటీ ఏర్పాటు కాగా, అందులోని సభ్యులు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బాసరలో వేద విద్యాలయాన్ని నిరంతరం కొనసాగిస్తామని చెప్పారు. పూర్తి భద్రత ప్రమాణాలతో పాటు వచ్చే విద్యాసంవత్సరంలో నూతన ప్రవేశాలతో వేదవిద్యాలయాన్ని పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల విద్యార్థులు లోహిత్, మణికంఠ ప్రమాదాల్లోమృతి చెందగా బాసర పోలీసులు చట్టప్రకారం కేసులు న మోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారని పేర్కొన్నా రు. కొందరు దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తం చే స్తూ హిందూ సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా యత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు దర్యా ప్తు వేగవంతం చేసి నిందితులను పట్టుకుని శిక్షించా లని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటనలపై కొన్ని మాధ్యమాలు అసత్య వార్తలు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. వేద పాఠశాల ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే ఎనిమిదేళ్లుగా వైభవంగా కొనసాగించిన దక్షిణ గంగా గోదావరి హారతి ఇ క నుంచి బాసర శ్రీవేద భారతి పీఠం, గ్రామ కమి టీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని కమిటీ సభ్యులు తెలి పారు. శ్రీవేద విద్యాలయ సంచలన సమితి బాసర అధ్యక్షుడు శ్యామ్సుందర్ మంథని, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ముష్కం రామకృష్ణగౌడ్, సహ కార్యదర్శి జాదవ్ రాజేశ్బాబు, సంజీవరావు, లక్ష్మణ్రావు, సతీశ్రావు, గాడేకర్ రమేశ్, తుమ్ దత్తు, బిదూర్ రమేశ్, పురోస్తు గోపాలకృష్ణ తదితరులున్నారు. -
జీవన రేఖ.. వివక్షకు ప్రతీక
● నది నుంచి అటవీప్రాంతం వరకు.. ● విస్తరించిన బాసర–లక్సెట్టిపేట రోడ్డు ● నిర్మల్ జిల్లాలోనే అతిపెద్ద రహదారి ● దారి వెంట ఎన్నో ఆధ్యాత్మిక క్షేత్రాలు ● అబ్బురపరిచే చారిత్రక నిర్మాణాలు ● అయినా అభివృద్ధికి నోచుకోని వైనంభైంసా: నిర్మల్ జిల్లాకు బాసర–లక్సెట్టిపేట రహదారి జీవన రేఖగా ఉంది. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలుపుతూ 175 కిలో మీటర్ల మేర ఈ రహదారి వ్యాపించి ఉంది. రెండు జిల్లాలను కలిపే ఏకై క వారధి ఈ మార్గం అధికశాతం నిర్మల్ జిల్లాలోనే ఉంది. నిర్మల్ జిల్లాలో 125 కిలోమీటర్ల మేర విస్తరించి 13 మండలాల మీదుగా సాగి జిల్లాకు ప్రధాన రవాణా మార్గంగా ఉపయోగపడుతోంది. ఈ రహదారి పొడవునా పరిసర ప్రాంతాల గొప్పతనం, చారిత్రక అంశాలెన్నో కనిపిస్తుంటాయి. నది నుంచి అడవి వరకు..బాసర వద్ద గోదావరి నది ఒడ్డు నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి అడవుల గుండా లక్సెట్టిపేట వరకు విస్తరించి ఉంది. బాసర సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని చూస్తూ చదువుల తల్లి ఆశీస్సులు పొంది ఎంతోమంది ఈ మార్గం గుండా ప్రయాణిస్తుంటారు. పక్కనే బిద్రెల్లి వద్ద మహారాష్ట్రలోకి ఓ మార్గం వెళ్తుంది. ఈ మార్గం గుండా భైంసా వరకు రెండు వైపులా వానాకాలంలో పత్తి చేల అందాలు చూడవచ్చు. వేసవిలో విస్తరించిన భూములు కనిపిస్తుంటాయి. భైంసా వద్ద మహారాష్ట్రకు వెళ్లే మరో జాతీయ రహదారి కనిపిస్తుంది. ఈ మార్గంలో పత్తి, సోయా పంటల లోడ్తో వెళ్లే వాహనాలు అధికంగా కనిపిస్తుంటాయి. మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే వాహనాలన్నీ ఈ మార్గం మీదుగా వస్తుంటాయి. 13 మండలాల మీదుగా..నిర్మల్ జిల్లాలో ప్రత్యక్షంగా ఎనిమిది మండలాలు, పరోక్షంగా 13 మండలాల గుండా ఈ మార్గం ముందుకు వెళ్తుంది. నిర్మల్ జిల్లా అంతటిని కలిపే ఈ మార్గం విస్తరణపై అధికారులు దృష్టి సారించడం లేదు. జిల్లాలో పెద్దదైన ఈ మార్గాన్ని మరింత అభివృద్ధి చేయాలి. తూర్పు, పశ్చిమ జిల్లాలను కలిపే ఈ మార్గంలో అడుగడుగునా ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను తెలిపే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఏళ్లుగా ఉన్న బాసర–లక్సెట్టిపేట మార్గంపై దృష్టిసారించాలని తూర్పు, పశ్చిమ జిల్లా ప్రజలు కోరుతున్నారు.ఆధ్యాత్మిక కేంద్రాలను కలుపుతూ..బాసర వద్ద సరస్వతీ అమ్మవారి ఆలయం నుంచి కుంటాల మండలం కల్లూరులో సాయిబాబా ఆలయం, కాల్వ వద్ద నరసింహస్వామి, కదిలి పాపహరేశ్వరస్వామి ఆలయాలకు ఈ మార్గం గుండా వెళ్లవచ్చు. అక్కడి నుంచి నిర్మల్ చారిత్రక కోటలను దాటుకుంటూ గొలుసుకట్టు చెరువులను చూస్తూ జిల్లా కేంద్రాన్ని ఈ మార్గం కలుపుతుంది. నిర్మల్ జిల్లా ధాన్యాగారంగా పిలువబడుతున్న లక్ష్మణచాందతోపాటు మామడ, ఖానాపూర్ మండలాల మీదుగా ఈ మార్గంవెళ్తుంది. మామడ మండలంలోకి వెళ్లగానే దారి మధ్యలో ఏపుగా పెరిగిన టేకు చెట్లు, దట్టమైన అరణ్యం కనిపిస్తుంటుంది. జిల్లాలో చివరగా ఖానాపూర్లో గిరిజనుల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, సదర్మాట్ గలగలలు వినిపిస్తూ కడెం నదికి పక్కనే ఈ మార్గం జన్నారం వైపు వెళ్తుంది. దస్తురాబాద్ నుంచి అభయారణ్యంలో నల్లతాచులా మెలికలు తిరిగి కవ్వాల్ అభయారణ్యంవైపు వెళ్తుంది. ఈ మార్గం పక్కనే కవ్వాల్ అభయారణ్యంలో లేడి పిల్లల పరుగులు, నీలుగాయిల ఉరుకులు, కుందేళ్ల కోలాహలం, పక్షుల కిలకిలలు చూసి మురిసిపోవాల్సిందే. -
కార్మికులకు మెరుగైన వైద్యసేవలు
బెల్లంపల్లి: సింగరేణి కార్మికులు, కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కృషి చేస్తున్నట్లు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రి డెప్యూటీ సీఎంవో డాక్టర్ ఎం.మధుకుమార్ తెలిపా రు. శుక్రవారం తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఆస్పత్రికి కావాల్సిన వివిధ పరికరా లు తెప్పించనున్నట్లు పేర్కొన్నారు. సీఎంవోగా కిరణ్ రాజ్కుమార్ బాధ్యతలు స్వీకరించాక బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి వారంలో రెండురోజులపాటు ఇతర ప్రాంతాల నుంచి ఆరుగురు స్పెషలిస్టులు వచ్చి రోగులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించా రు. వీరి సేవలు సద్వినియోగం చేసుకోవాలని కో రారు. ఏరియా ఆస్పత్రికి కొత్తగా మరో నలుగురు వైద్యులను నియమించినట్లు తెలిపారు. గతం కన్నా ఏరియా ఆస్పత్రికి వచ్చే ఔట్పేషంట్లు, ఇన్పేషంట్ల సంఖ్య రెట్టింపైందని వివరించారు. మెరుగైన వైద్యం కోసం కంపెనీ గుర్తించిన ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రికి సరిపడా సిబ్బందిని నియమించనున్నట్లు యాజమాన్యం తెలిపిందని పేర్కొన్నారు. -
బీసీ జెండా ఎగురవేస్తాం
● బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంజయ్కుమార్ బోథ్: ప్రతీ పల్లెలో బీసీ జెండా ఎగురవేస్తామని బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్కుమార్ పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బీసీ మేలు కోలుపు రథయాత్ర’ శుక్రవారం బోథ్కు చేరింది. ఈ సందర్భంగా బోథ్లో బీసీ కులాల నాయకులతో కలిసి అంబేడ్కర్, కొమురంభీం, శివాజీ, కొండా లక్ష్మణ్ బాపూ జీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించినట్లు 42 శాతం రిజర్వేషన్ బిల్లును అమలు చేయాలని కోరారు. దేశ వ్యాప్తంగా కులగణన ప్రక్రియ శాసీ్త్రయ పద్ధతిలో వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు సరైన అవకాశాలు లేక అన్ని రంగాల్లో వెనుకబడి అణగారిన వర్గాలుగా, పేదవారుగా ఉన్నారని తెలి పారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ అడ్హక్ కమిటీని నియమించారు. సభ్యులుగా జక్కుల వెంకటేశ్, మల్లెపూల శివారెడ్డి, కొండ స్వామి, గంగుల మల్లేశ్, కరిపి శ్రీనివాస్, ఇప్ప శ్రీనివాస్, తడక పోశెట్టి, ఏరుగట్ల రాజును నియమించారు. రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్గే, బీసీ ఆజాది ఫెడరేషన్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, నామాని అర్జున్, స్థానిక కుల సంఘాల నాయకులు బీ గోవర్ధన్, ఈ శ్రీనివాస్, కర్ణ శ్రీనివాస్, ఆళ్ల పోశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
విందు సరే.. విధుల మాటేంటి?
● ఖాళీగా ఆదిలాబాద్ బల్దియా ఇంజినీరింగ్ విభాగంకై లాస్నగర్: ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నా కొందరు ఆదిలాబాద్ బల్దియా అధికారులు, ఉద్యోగుల తీరు మారడం లేదు. ఇటీవల సెలవు పెట్టకుండా రెవెన్యూ ఉద్యోగులు మూకుమ్మడిగా కేరళకు విహారయాత్రపై వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చినవారు అవస్థలు పడ్డారు. తాజాగా శుక్రవారం బల్దియా ఇంజినీరింగ్ విభాగంలో ఉద్యోగులు కనిపించకుండా పోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో తలుపులు మూసే ఉన్నాయి. ఈ విభాగానికి సంబంధించిన అధికారులు, ఉద్యోగులు ఎక్కడికి వెళ్లారని శాఖ ఉద్యోగులను పలువురు అడగగా లాండసాంగ్విలో విందు చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. విధులు నిర్వహించే సమయంలో విందులో పాల్గొనడం ఏమిటని పలువురు ప్రశ్నించారు. అడిగేవారు లేక వారు ఆడిందే ఆటా.. పాడిందే పాటగా సాగుతోందని విమర్శలు గుప్పించారు. విందు చేసుకోవడం తప్పు కాదు గాని.. కార్యాలయ పనివేళల్లో మూకుమ్మడిగా వెళ్లడం ఏమిటని.. ఆయా పనుల కోసం కార్యాలయానికి వచ్చినవారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్లో అధికారుల పర్యవేక్షణ గాడితప్పిందని, ప్రత్యేకాధికారి నియామకమైన నుంచి ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం, ఉన్న అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరించడంతో ఈ తతంగం సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఉద్యోగులు ప్రతీరోజు సమయపాలన పాటించడం లేదని చెబుతున్నారు. అలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజును సంప్రదించగా.. లాండసాంగ్వి పంప్హౌస్ వద్ద ఏర్పాటు చేసిన దావత్కు వెళ్లారని పేర్కొనడం గమనార్హం. -
జ్వరంతో బాలుడి మృతి
● సొంత ఇల్లు లేక రోడ్డుపైనే మృతదేహంతో రోదించిన తల్లి లక్ష్మణచాంద: జ్వరంతో మృతి చెందిన కొడుకు అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితిలో ఓ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. వివరాలు.. నిజామాబాద్కు చెందిన చింతకింది లక్ష్మణ్–సుప్రియ దంపతులు మూడేళ్ల కిందట బతుకుదెరువు కోసం లక్ష్మణచాందకు వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమార్తె, కుమారుడున్నారు. గతేడాది ఇద్దరి మధ్య గొడవ జరగగా లక్ష్మణ్ భార్య, పిల్లలను వదిలి నిజామాబాద్కు వెళ్లాడు. దీంతో సుప్రియ పిల్లలతో కలిసి లక్ష్మణచాందలోనే ఉంటోంది. కూలీకి వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. నాలుగు రోజుల క్రితం కుమారుడు లక్ష్మీకాంత్ (12)కు జ్వరం రాగా అతడిని మొదట నిర్మల్ ఆస్పత్రిలో చూపించింది. ఆ తర్వాత హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. సుప్రియ పుట్టెడు దుఃఖంతో శుక్రవారం ఉదయం కొడుకు మృతదేహంతో లక్ష్మణచాందకు వచ్చింది. సుప్రియ ఉంటున్నది అద్దె ఇల్లు కావడంతో రోడ్డుపైనే మృతదేహాన్ని ఉంచి కన్నీరుమున్నీరుగా విలపించింది. తనకు ఎవరూ లేక దిక్కుతోచని పరిస్థితిలో దుఃఖించింది. గ్రామస్తులే మరో ఇంటి ఎదుట టెంట్ వేసి మృతదేహాన్ని అక్కడికి తరలించారు. చేతిలో చిల్లిగవ్వ లేని సుప్రియ కుమారుడి అంత్యక్రియలు కూడా చేయలేని పరిస్థితిలో ఉండగా గ్రామస్తులు కొంతమొత్తాన్ని సేకరించి సుప్రియకు అందించారు. చివరకు పోలీసులు అక్కడికి చేరుకుని సుప్రియ భర్త లక్ష్మణ్కు సమాచారం ఇచ్చారు. లక్ష్మణ్ బంధువులతో లక్ష్మణచాందకు వచ్చి కుమారుడి మృతదేహాన్ని తీసుకుని నిజామాబాద్కు తీసుకువెళ్లాడు. -
ఇక పావుగంటలోనే రిజిస్ట్రేషన్లు
● 12నుంచి మంచిర్యాలలో ప్రారంభం ● ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ● ఒక్కొక్కరికి 48 స్లాట్లు.. రోజుకు 96 మంచిర్యాలటౌన్: రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సులభతరం చేసి క్రయవిక్రయదారులకు సమయం వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే మొదటి విడతలో కొన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టగా విజయవంతమైంది. దీంతో రెండో విడతలో మరికొన్ని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించింది. మంచిర్యాల సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ నెల 12నుంచి స్లాట్ బుకింగ్ విధానా న్ని అమలు చేయనున్నారు. దీంతో అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవా ల్సి ఉంటుంది. ప్రస్తుతం సేల్డీడ్, గిఫ్ట్డీడ్, మార్టి గేజ్ డీడ్, పొజిషన్ వంటి అన్ని రకాల రిజిస్ట్రేషన్ల కు స్లాట్ బుకింగ్ తప్పనిసరి చేయాల్సి ఉంటుంది. ఈ నెల 12నుంచి స్లాట్ బుకింగ్ లేకుండా ఎ లాంటి రిజిస్ట్రేషన్ జరగదు. వెబ్సైట్ ద్వారా స్లా ట్ బుకింగ్కు అనుకూలమైన తేదీ, సమయాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల అదే సమయానికి క్ర య, విక్రయదారులు వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకునేందుకు 15నిమిషాల్లోపే సమయం పట్టనుంది. దీనివల్ల గంటల తరబడి రిజిస్ట్రేషన్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు ఇకపై ఉండవు. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక్కరోజులో మొత్తం 96 స్లాట్ బుకింగ్లకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఒక్క సబ్ రిజిస్ట్రార్తోనే కార్యాలయం నిర్వహిస్తుండగా స్లాట్ బుకింగ్ విధానం ప్రారంభించే నాటి నుంచి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేయనున్నారు. ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్గా ప్రియాంక పనిచేస్తుండగా, కరీంనగర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రాజిరెడ్డిని మంచిర్యాలకు కేటాయించారు. దీంతో వీరిద్దరు 48 స్లాట్ల చొప్పున ప్రతీరోజు 96 స్లాట్ల బుకింగ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. registration.telangana. gov.in వెబ్సైట్ సందర్శించి స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.స్లాట్ బుకింగ్ ద్వారానే..ఈ నెల 12నుంచి మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ విధానం ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయనున్నాం. ఇందుకోసం ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు పనిచేయనున్నారు. స్లాట్ బుకింగ్ సమయంలో డాటా ఎంట్రీ జాగ్రత్తగా చేసి పూర్తి లింక్ డాక్యుమెంట్లతో న మోదు చేయాల్సి ఉంటుంది. 15నిమిషా ల్లోపు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి సమ యం ఆదా అవుతుంది. – ప్రియాంక, మంచిర్యాల సబ్ రిజిస్ట్రార్ -
తమిళనాడుకు తరలిన ఆదివాసీ కళాకారులు
ఇచ్చోడ: జిల్లాకు చెందిన ఆదివాసీ సకలకళా సంక్షేమ బృందం కళాకారులు శుక్రవారం త మిళనాడు రాష్ట్రానికి వెళ్లారు. తంజావూర్లో నిర్వహించనున్న ‘సెలంగై నా ధం’ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆదివాసీ కళా సంక్షేమ బృందానికి ఆహ్వానం అందిన ట్లు బృందం డైరెక్టర్ కాత్లె శ్రీధర్ తెలిపారు. కార్యక్రమంలో గుస్సాడీ, కొమ్ము, కోయ నృత్యాలు ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడుకు బ యలుదేరిన వారిలో కళాకారులు కాత్లే ఆనంద్, రాము, రాజేంద్రప్రసాద్, లింగు, జలంధర్, దేవురావు, పవన్, సందీప్, లక్ష్మణ్, చరణ్, ఉదయ్, అక్షయ్, భీంరావు ఉన్నారు. -
రైతులకు అవగాహన కల్పించాలి
● ముందస్తు సాగుతో నష్టాలు దూరం ● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్భూముల సమస్య పరిష్కరించాలి భీమారం: కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూ ములను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారని మండలంలోని అంకుసాపూర్ రైతులు కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. శుక్రవారం అంకుసాపూర్, కొత్తపల్లి గ్రామాల్లో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. 292, 384 సర్వే నంబర్లలో 150మంది ఉన్నామ ని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మాజీ స ర్పంచ్ దర్శనాల రమేశ్ మాట్లాడుతూ తమకు అ న్ని హక్కులు ఉన్న భూములను అటవీశాఖ అధి కారులు స్వాధీనం చేసుకుని కందకాలు తవ్వించారని తెలిపారు. కలెక్టర్ స్పందిస్తూ 20రోజుల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్లు సదానందం, కృష్ణ పాల్గొన్నారు. -
ఎన్ఎస్ఎస్ సలహా కమిటీ సభ్యుడిగా శ్రీనివాస్
మంచిర్యాలఅర్బన్: కేంద్ర ప్రభుత్వ, యువజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ సే వా పథకం(ఎన్ఎస్ ఎస్) కాకతీయ యూని వర్సిటీ సలహా కమిటీ సభ్యుడిగా మంచిర్యాల కు చెందిన ఆర్.శ్రీనివాస్ను నియమిస్తూ వైస్ చాన్స్లర్ ప్రతాప్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. యూనివర్సిటీ స్థాయిలో నలుగురు ప్రిన్సిపాల్లను సభ్యులుగా నియమిస్తుండగా, ఇద్దరు ప్రభుత్వ, ఇద్దరు ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాల్లకు అవకాశం కల్పిస్తా రు. ప్రైవేట్ కళాశాలల నుంచి శ్రీనివాస్ను నియమించారు. శ్రీనివా స్ను జాతీయ సేవా పథకం జిల్లా కన్వీనర్ చంద్రమోహన్గౌడ్ అభినందించారు. -
అంగన్వాడీ కేంద్రాలకు సెలవులపై హర్షం
బెల్లంపల్లి: అంగన్వాడీ కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించడం హర్షనీయమని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు భానుమతి, కార్యదర్శి రాజమణి అన్నారు. శుక్రవారం బె ల్లంపల్లి తిలక్ స్టేడియంలో విజయోత్సవ సభ నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ అంగన్వాడీ కేంద్రాలకు మే నెల సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. మినీ అంగన్వాడీ కేంద్రాల టీచర్లను ప్రమోట్ చేశారని, యూని యన్ పోరాట ఫలితంగానే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుందని వి వరించారు. గతంలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ర మణ, మాజీ జిల్లా అధ్యక్షుడు సంకె రవి, జిల్లా సహాయ కార్యదర్శి దూలం శ్రీనివాస్, మండల కన్వీనర్ దేవదాస్, నాయకులు అశోక్, అంగన్వాడీలు విరోనిక, సబిత, సత్యవతి, స్వాతి, అనురాధ, సువర్ణ, శంకరమ్మ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్కౌంటర్ మృతుల్లో బండి ప్రకాష్..?
● మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరు ● ప్రభాత్పై రూ.25 లక్షల రివార్డు ● స్థానికంగా సర్వత్రా చర్చమందమర్రిరూరల్: తెలంగాణ–ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కర్రి గుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సికాస కార్యదర్శి బండి ప్రకాష్ అలియాస్ దాదా అలియాస్ క్రాంతి అలియాస్ ప్రభాత్(60) మృతిచెందాడనే వార్త స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసు అధికారులు ధ్రువీకరించకపోవడంతో అసలు మృతిచెందాడా..? లేదా అనే విషయమై స్పష్టత రావాల్సి ఉంది. మందమర్రి పట్టణంలోని సింగరేణి కార్మికుడైన బండి అమృతమ్మ, రామారావు దంపతులకు కూతురు ప్రమీల, కుమారులు నర్సింగరావు, ప్రకాష్, వెంకటేశ్వర్లు ఉన్నారు. రెండో కుమారుడు ప్రకాష్ 1982–84 మధ్య అప్పటి పీపుల్స్వార్ అనుబంధ విద్యార్థి సంఘమైన రాడికల్ స్టూడెంట్ యూనియన్(ఆర్ఎస్యూ) కార్యకలాపాలు చురుగ్గా నిర్వహించే సమయంలో పలు చోట్ల సమావేశాలకు ఆకర్శితుడయ్యాడు. 1984లో స్థానిక ఏఐటీయూసీ నేత వీటీ అబ్రహం హత్య కేసులో నిందితుడు కావడంతో ఆదిలాబాద్ సబ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి నేతలు హుస్సేన్, నల్లా ఆదిరెడ్డిలతో కలిసి సబ్ జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వం మావోయిస్టులతో శాంతిచర్చలకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ సమీపంలోని మువ్వడలో భారీ బహిరంగ సభకు అధ్యక్షత వహించాడు. శాంతి చర్చలు విఫలం కావడంతో మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. సింగరేణి కార్మికులకు 4, 5 వేజ్బోర్డుల అమలు కోసం చేపట్టిన 56రోజుల సమ్మెలో సికాస కీలకపాత్ర పోషించడంతోపాటు సింగరేణి చర్చల్లో పాల్గొన్నారు. ఎండ్లబండ్ల కార్మికులు, సఫాయి, టింబర్యార్డ్ల్లో పని చేసే కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ విషయంలో కీలకపాత్ర పోషించారు. సింగరేణి కార్మికుల సమస్యలపై అధికారుల ఆగడాలపై అనేకసార్లు సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) ప్రభాత్ పేరిట ప్రకటనలు జారీ చేసేవారు. సుమారు 41ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన ప్రకాష్పై తెలంగాణ ప్రభుత్వం రూ.25లక్షల రివార్డు ప్రకటించింది. ఆయనకు భార్య హేమ, కుమారుడు కిరణ్ ఉన్నారు. ఏదేమైనా ఇంతవరకు ప్రకాష్ మృతి విషయంలో సంబంధిత పోలీసులు ధ్రువీకరించలేదు. -
ఆదివాసీ, గిరిజనులకు శిక్షణ తరగతులు
● రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ జన్నారం: ఆదివాసీలు, గిరిజనులను అన్ని రంగాల్లో చైతన్యపర్చడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, ఇందులో భాగంగా జన్నారంలో ఆదివాసీ, గిరిజన నాయకులకు మూడు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించనున్నామని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్యనాయక్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన ఆదివాసీ, గిరిజనుల కాంగ్రెస్ ప్రతినిధుల శిక్షణ తరగతుల కార్యక్రమం ఈ నెల 11, 12, 13వ తేదీల్లో మండల కేంద్రంలోని హరిత రిసార్ట్లో నిర్వహిస్తామని తెలిపారు. ఏర్పాట్లను గురువారం వారు పరిశీలించారు. శిక్షణ తరగతుల ప్రారంభానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర నేతలు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జి ఆత్రం సుగుణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ, పొనకల్ సింగల్ విండో చైర్మన్ అల్లం రవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజఫర్, పార్టీ సీనియర్ నేతలు గుర్రం మోహన్రెడ్డి, సయ్యద్ ఇసాక్, ఆర్.రమేష్రావు, ఇందయ్య, టౌన్ ప్రెసిడెంట్ రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
మోదీ చిత్రపటానికి పాలాభిషేకం
పాతమంచిర్యాల: ఆపరేషన్ సిందూర్ చేపట్టి ఉగ్రమూకలను అంతమొందించిన భారత సైన్యాన్ని, ప్రధాని మోదీని అభినందిస్తూ గురువారం జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం, భారత త్రివిధ దళాల సైనికుల విగ్రహాలకు పూలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్, సీనియర్ నాయకుడు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ దేశ ప్రజలంతా భారత సైన్యానికి అండగా ఉన్నారని తెలిపారు. ఈ సమయంలో రాజకీయ పార్టీలు రాజకీయాలను అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి, భారత సైన్యానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద సంబరాలు ఆపరేషన్ సిందూర్ను విజయవంతం చేసిన భారత ఆర్మీకి అభినందనలు తెలుపుతున్నామని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు అన్నారు. గురువారం భారత ఆర్మీని అభినందిస్తూ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసం వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్రావు, తాజామాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
ముందస్తు రక్తపరీక్షలతో తలసేమియా నియంత్రణ
పాతమంచిర్యాల: మేనరిక వివాహాల నియంత్రణ, ముందస్తు రక్త పరీక్షలతో తలసేమియా వ్యాధిని నియంత్రించవచ్చని జిల్లా వైద్య, ఆరో గ్య శాఖ అధికారి డాక్టర్ హరీష్రాజ్ అన్నారు. గురువారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని జనరల్ ఆస్పత్రి వద్ద తలసేమియా అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా వ్యాధి జన్యుపరమైనదని, తల్లిదండ్రులకు ఇద్దరికీ ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఉందని తెలి పారు. రక్తదానం తలసేమియా రోగులకు జీవాధారమని, తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ అనిత, డాక్టర్ సుధాకర్నాయక్, ప్రోగ్రాం అధికారి అనిల్, జీజీహెచ్ ఆర్ఎంవో డాక్టర్ శ్రీధర్, వైద్యాధికా రులు శివప్రతాప్, స్నేహిత, అశోక్, అమన్, రెడ్క్రాస్ సొసైటీ బాధ్యులు భాస్కర్రెడ్డి, మధుసూదన్రెడ్డి, మహేందర్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్, సీహెచ్వో వెంకటేశ్వర్లు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
నల్లబ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన
మంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విజయవాడలోని ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయాందోళనలకు గురిచేసేలా ఆంధ్రప్రదేశ్ పోలీ సులు వ్యవహరించడంపై జర్నలిస్టులు నల్లబ్యాడ్జీ లు ధరించి గురువారం మంచిర్యాల ఐబీ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపా రు. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తున్న క్రమంలో జర్నలిస్టులను భయపెట్టి అదుపులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో ఏపీ పోలీసుల తీరు ఉందని విమర్శించారు. కార్డన్ సెర్చ్లో భాగంగా ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లోకి వ్యూహాత్మకంగా చొరబడిన పోలీసులు పూర్తిస్తాయి తనిఖీలు జరిపారని అన్నారు. తనిఖీల్లో ఎలాంటి వ్యతిరేక ఆధారాలు లభించలేదని, కేవలం రాజకీయ కక్ష పూరిత కుట్రలో భాగంగానే ఎడిటర్ను ఇబ్బంది పెట్టడానికే ఈ తనిఖీలు జరిపారని ఆరోపించారు. జర్నలిస్టులు, ఎడిటర్లను నియంత్రించడానికి పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మతిలేని చర్యగా భావిస్తున్నామని అన్నారు. తనిఖీల పేరు చెప్పినా అది దాడిగానే భావిస్తున్నామని, ఏపీ పోలీసుల తీరును అన్ని యూనియన్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయని అన్నారు. ఏపీలో జర్నలిస్టులపై పోలీసుల వేధింపులను తక్షణమే నిలిపివేయాలని, లేనిపక్షంలో జాతీయ స్థాయిలో నిరసన కార్యక్రమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి పింగళి సంపత్రెడ్డి, ఐజేయూ సభ్యుడు కాచం సతీశ్, ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి ఆకుల రాజు, జర్నలిస్టులు రమేశ్రెడ్డి, రాజలింగు, లింగారెడ్డి, శ్రీనివాస్, దేవరాజ్, రాజేశ్, శ్రీనివాస్, రవి, రాజు, బాబురావు, నర్సయ్య పాల్గొన్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు డేగ సత్యం, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్రెడ్డి -
మెరుగైన వైద్యం కోసమే పల్లె దవాఖానాలు
● ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్జన్నారం: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. మండలంలోని కలమడుగు గ్రామంలో గురువారం పల్లె దవాఖానా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు పల్లె దవాఖానాలను సద్వినియో గం చేసుకోవాలన్నారు. డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని దవాఖానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరోగ్యశాఖ మంత్రి రాజనర్సింహను కలిసి డయాలాసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరామని, త్వరలో ఈ ప్రాంతంలో డయాలాసిస్ సెంటర్ ఏర్పాటు కాబోతోందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందించే వైద్య సేవలు వినియోగించుకోవాలన్నారు. అనంతరం కలమడుగు గ్రామంలోని సిరిపల్లి బీరయ్యకు రూ.19వేలు, శ్రీనివాస్ రూ.18వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో హరీష్రాజ్, వైద్యురాలు ఉమా శ్రీ, ఏఏఎం ప్రోగ్రామ్ ఆఫీసర్ అనిల్ కుమార్, స్థానిక పల్లె దవాఖానా వైద్యురాలు గంగాదేవి, ఎంపీడీవో హు మర్ షరీఫ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు దుర్గం లక్ష్మీనారాయణ, ఫసిహుల్ల, గ్రామ కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముజఫర్ తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి పోటీలకు రెఫరీగా ఎంపిక
పాతమంచిర్యాల: జాతీ యస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు రెఫరీగా జుమ్మి డి కళ్యాణ్ ఎంపికై నట్లు అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్రావు, ప్రధా న కార్యదర్శి కనపర్తి రమే శ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 9 నుంచి 11 వరకు తమిళనాడులోని తిరువన్నమలైలో నిర్వహించనున్న హెఫ్ఐ 40 సౌత్జోన్ హ్యాండ్బాల్ పోటీలకు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి చెందిన కళ్యాణ్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నట్లు వారు పేర్కొన్నారు. వడ్డీ వ్యాపారిపై కేసు నమోదుఇంద్రవెల్లి: అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాకు చెందిన చిన్నం ధర్మేందర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఏపీలోని కొనసీమ జిల్లాకు చెందిన ధర్మేందర్రెడ్డి పట్టుబడినట్లు తెలిపారు. అతన్ని తనిఖీ చేయగా రూ.11,750 నగదు, ఫైనాన్స్ చీటీలు, రిజిస్టర్లు దొరికినట్లు తెలిపారు. వాటితో పాటు బైక్ను స్వాధీనం చేసుకుని తెలంగాణ ఏరియా మనీలెండర్యాక్ట్పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
అభిమన్యు గ్రూప్కు అరుదైన గౌరవం
నార్నూర్: బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ‘నేనున్నాను’ అని భరోసా కల్పిస్తూ మానవతా దృక్పధంతో వాట్సప్ గ్రూప్ ద్వారా సేవలందిస్తున్న మేస్రం శేఖర్ గురువారం కలెక్టర్ రాజర్షి షా, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ చేతుల మీదుగా ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్నవారికి ఆర్థికసాయం అందించడంతో పాటు 20 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు ఆస్పత్రికి వచ్చి వైద్యం చేయించుకునేలా ప్రభుత్వ ఆస్పత్రులపై వారికి నమ్మకం కలిగేలా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. బొలెరో ఢీకొని ఒకరు దుర్మరణంఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని తిర్పెల్లి సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్ర గాయాలపాలయ్యారు. టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపిన వివరాల మేరకు బోథ్ మండలంలోని సాకెరకు చెందిన కుందూరు రాజు (23), ఖుర్షీద్నగర్కు చెందిన దర్శనాల సునీల్ ద్విచక్ర వాహనంపై తిర్పెల్లి వైపు వెళ్తుండగా బొలెరో అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రాజు సంఘటన స్థలంలోనే మృతి చెందగా సునీల్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు. బైక్ అదుపుతప్పి యువకుడు మృతికుంటాల: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన ఆయిటి రాజు (26)గురువారం రాత్రి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై ఓలా గ్రామానికి వెళ్లి వస్తుండగా కుంటాలకు సమీపంలో సమీపాన బైక్ అదుపుతప్పి కిందపడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్ తెలిపారు. సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానంమంచిర్యాలఅగ్రికల్చర్: సెటిల్మెంట్, భూరికార్డుల కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ సర్వే ఆదేశాల ప్రకారం లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మీ సేవ కేంద్రాలలో ఈ నెల 17 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికై న వారికి జిల్లా ప్రధాన కేంద్రంలో 50 రోజులపాటు శిక్షన ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇంటర్ గణితంలో 60 శాతం మార్కులు, ఐటీఐ, డ్రాఫ్ట్మెన్ (సివిల్) / డిప్లొమా సివిల్) / బీటెక్ సివిల్) సమాన అర్హత గల అభ్యర్థులు అర్హులన్నారు. ఓసీ అభ్యర్థులు రూ.10 వేలు, బీసీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.2,500 చెల్లించాల్సి ఉంటుందన్నారు. -
● బాసర నుంచే దక్షిణ గంగ ప్రారంభం ● నదీ తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ● వేలాది ఎకరాలు సస్యశ్యామలం ● లక్షల మందికి ఉపాధి
దక్షిణ భారతావనికి తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న గోదావరినది బాసర గుండా ప్రవహిస్తోంది. సముద్రమట్టానికి 3,018 అడుగుల ఎత్తున గల పర్వత సానువుల్లో సన్నని ధారలా ప్రవహిస్తూ తెలుగు రాష్ట్రాల్లో దూసుకెళ్తోంది. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రియంబకేశ్వర్ వద్ద బ్రహ్మగిరి పర్వతం నుంచి గోదావరి నది ప్రవహిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల గుండా ప్రజలకు తాగు, సాగునీటిని అందిస్తోంది. నది పరీవాహక ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. నది ఒడ్డున ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. – భైంసాఒడ్డునే అనేక ఆలయాలు... గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో అనేక ఆలయాలు, నగరాలు కనిపిస్తాయి. మహారాష్ట్రలో నాసిక్, కొద్ది దూరంలోనే షిర్డీ, పక్కనే ఔరంగాబాద్, జాల్న, మరోవైపు మనకు సమీపంలో నాందేడ్లోని సచ్కండ్ గురుద్వారాలు, గోదావరి నది ఒడ్డునే నిర్మీతమయ్యాయి. మన ప్రాంతంలో... స్కందుడు నడియాడిన కందకుర్తి వద్ద మంజీర, హరిద్ర నదులను కలుపుకుని త్రివేణి సంగమంగా మారి బాసర వైపు గోదావరి ప్రవాహం కనిపిస్తుంది. నది ఒడ్డునే సరస్వతీ అమ్మవారి ఆలయం, లోకేశ్వరం మండలంలో బ్రహ్మేశ్వర ఆలయం, దిలావర్పూర్ మండలం సాంగ్వీలో సంగమేశ్వర ఆలయం, ధర్మపురి నరసింహస్వామి ఆలయం, గూడెం సత్యనారాయణ స్వామి ఆలయం, కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయం నది ఒడ్డునే ఉన్నాయి. సాగునీరందిస్తూ... మాజీ ప్రధాని లాల్బహదూర్ శాస్త్రి హయాంలో పైథాన్ వద్ద జయక్వాడీ ప్రాజెక్టు నిర్మించారు. ఇది ఔరంగాబాద్, జాల్న, పర్భని జిల్లాల్లో 2,37,452 హెక్టార్ల భూమికి సాగునీరు అందిస్తోంది. మహారాష్ట్రలో సాగయ్యే చెరుకు పంటకు గోదావరి నది నీరే ఆధారం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, పర్భనీ, జాల్నా, నాందేడ్ జిల్లాల ప్రజలకు తాగునీటిని అందిస్తూ మన సరిహద్దులో బాబ్లీ ప్రాజెక్టు నుంచి బాసర వైపు ఈ నది ప్రవాహం కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణకు పట్టెడు అన్నం పెట్టే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గోదావరి నదిపైనే నిర్మించారు. ఉత్తర తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి వరి పంట పండేందుకు ఈ నీరే ప్రధానం. ఇక మిషన్ భగీరథలో భాగంగా నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఈ నది నుంచే తాగునీటిని అందిస్తారు. ఎంతోమందికి ఉపాధి... సముద్రంలో కలిసి...అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూ రంలో బ్రహ్మగిరిపై బింధువుగా మొదలైన గోదావరి నది తూర్పువైపునకు 1,465 కి లోమీటర్ల మేర సాగి బంగాళాఖాతంలో ము గుస్తుంది. తెలంగాణ వాసుల కల్పతరువు, ఆంధ్రుల అన్నపూర్ణగా పిలిచే గోదావరి నది నీటి ప్రవాహం కాళేశ్వరం గుండా భద్రాచలం మీదుగా ఉభయ గోదావరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. చివరగా ఒక పాయ యానం వద్ద మరొకటి అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి చెంత సముద్రంలో కలిసిపోతుంది. ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులకు గోదావరి నది కనువిందు చేస్తుంది. శుభ, అశుభ కార్యాల్లోనూ నది పరివాహక ప్రాంతాల్లో ఉండేవారంతా దక్షిణగంగగా కొలుచుకునే గోదావరి నదిలోనే పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఇక్కడ ఉండే బ్రాహ్మణులు, బోట్లు తిప్పే వారికి ఉపాధి తెచ్చిపెడుతుంది. గోదావరి నది పొడవున జాలర్లు రోజూ చేపలు పట్టి జీవనం వెళ్లదీస్తున్నారు. మహారాష్ట్ర నుంచి రెండు తెలుగు రాష్ట్రాల వరకు గోదావరి నదిపై ఎన్నో చోట్ల రోడ్డు, రైలు వంతెనలు కనిపిస్తాయి. -
ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్య
మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య, పూర్తిస్థాయి మౌలిక సౌకర్యాలు కల్పిస్తూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. గురువారం స్థానిక సైన్స్ కేంద్రంలో మండల విద్యాధికా రులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల వి ద్యాశాఖ కార్యక్రమాలను ప్రతీ విద్యార్థి పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా బాధ్యత తీ సుకోవాలని అన్నారు. విద్యార్థులు, భయం, ఒత్తిడి లేకుండా విద్య నేర్చుకునే అవకాశం క ల్పించడానికి సమన్వయంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. సమయానికి పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ అందేలా చూడాలన్నారు. రాబోయే విద్యాసంవత్సరంలో అమలు చేయాల్సిన వినూత్న కార్యక్రమాలు అవగాహన కలిగి ఉండాలఅన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్రశిక్ష కో–ఆర్డినేటర్లు చౌ దరి, యశోధర, శ్రీనివాస్, సత్యనారాయణ మూర్తి, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్రెడ్డి, ఏఎస్సీ రాజ్కుమార్ పాల్గొన్నారు. రైతులకు సౌకర్యాలు కల్పించాలి లక్సెట్టిపేట: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అన్ని విధాల సౌకర్యాలు క ల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అ న్నారు. గురువారం మండలంలోని కొత్తూ రు, ఇటిక్యాల, మోదెల, చందారం, కొమ్ముగూడెం గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఎలాంటి ఇబ్బందులున్నా తెలియజేయాలన్నారు. ధా న్యాన్ని శుభ్రపరిచి తీసుకురావాలని, నాణ్య మైన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని, నాణ్యమైన ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. -
నిరుద్యోగ యువతకు ఉపాధి
మంచిర్యాలఅగ్రికల్చర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రా జీవ్ యువ వికాసం పథకం ద్వారా అర్హులకు రుణ సదుపాయం కల్పిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్ చాంబర్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డి.చంద్రకళతో కలిసి రాజీవ్ యువ వికాసం అక్షరాస్యత(నిల్ప్), ఎస్ఎస్సీ ఫలితా లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికా సం పథకం దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపా రు. అక్షరాస్యత కార్యక్రమంలో జిల్లాలోని కాసిపేట మండలాన్ని ఎంపిక చేసుకుని 100శాతం అక్షరాస్యత మండలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని, ఇదే స్ఫూర్తితో అక్షరాస్యత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈడీ దుర్గప్రసాద్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధి కారి రవీందర్రెడ్డి, మైనార్టీ సంక్షేమ అధికారి రాజేశ్వరి, పురుషోత్తం, గిరిజన సంక్షేమశాఖ అధికారి జనార్దన్ పాల్గొన్నారు. -
‘ఆర్థిక విధ్వంసం సృష్టించిందే బీఆర్ఎస్’
నార్నూర్: తెలంగాణలో పదేళ్ల అధికారంలో ఉండి ఆర్థిక విధ్వంసం సృష్టించిందే బీఆర్ఎస్ అని పార్టీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. గురువారం ఏర్పాటుచేసిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, రాజ్యాంగాన్ని భారత్ గౌరవిస్తుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. ఇందిరమ్మ కమిటీ పారదర్శకంగా పనిచేయాలన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. సమావేశంలో పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ మల్లయ్య గౌడ్, కుమురం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు లోఖండే దేవురావు, మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పరమేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బిర్జిలాల్, తదితరులు పాల్గొన్నారు. -
ఇన్స్టాగ్రామ్ వేధించిన యువకుడి అరెస్ట్
గుడిహత్నూర్: ఇన్స్టాగ్రామ్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఓ యువతిని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన గోపాల్ ఓ మహిళ పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి మరో యువతి పరువు తీసేలా అసత్య ప్రచారం చేశాడు. విషయం తెలుసుకున్న సదరు బాధితురా లు షీటీంకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ప్రాథమిక సాంకేతిక ఆధారాలు పరిశీలించి నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల మనో భావాలు దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. రౌడీషీటర్ రిమాండ్ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడకు చెందిన రౌడీషీటర్ కద్దుపై గురువారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఈనెల 6న సాయంత్రం వినాయక్చౌక్లో బంగారుగూడకు చెందిన మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు తనతో రావాలని వేధించాడు. మహిళతో ఉన్న ఆమె తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాధితుడు వన్టౌన్లో ఫిర్యాదు చేయగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు మహిళను వేధించిన కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గతంలో రౌడీషీటర్ కద్దు రెండు మర్డర్ కేసులతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు వివరించారు. అగ్నిప్రమాదంలో కొట్టం దగ్ధంబోథ్: మండల కేంద్రంలోని సెరె గుండయ్యకు చెందిన కొట్టం బుధవారం రాత్రి ప్రమాదవశాత్తు దగ్ధమైంది. బాధిత రైతు తెలిపిన వివరాల మేరకు రాత్రి 9 గంటల ప్రాంతంలో చేనులో మంటలు చెలరేగి కొట్టానికి అంటుకున్నాయి. గమనించిన స్థానిక రైతులు సమాచారం అందించడంతో వెళ్లి చూడగా అప్పటికే కొట్టం పూర్తిగా కాలిపోయింది. అందులో ఉన్న వ్యవసాయ పరికరాలు, పనిముట్లు, సామగ్రి దగ్ధమయ్యాయి. వాటి విలువ రూ.3 లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ బాధిత రైతు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశాడు. -
అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి
● అనుమానితుల సమాచారం పోలీసులకు చేరవేయాలి ● రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ● ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షమంచిర్యాలక్రైం: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు 24గంటలూ అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. గురువారం కమిషనరేట్ సమవేశ మందిరంలో రెండు జిల్లాల పోలీస్ అధికారులు, సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, ప్రధానమైన ఇండస్ట్రియల్ సంస్థల అధికారులతో ఆపరేషన్ సిందూర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ప్రజలకు భద్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. రక్షణపరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమాచారం వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతర నిఘా పెంచాలని తెలిపారు. ముష్కరులు ఏ రూపంలోనైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించిన, ప్రజలకు ఇబ్బంది కలిగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని, నిరంతర నిఘా కొనసాగించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీసీపీలు భాస్కర్, కరుణాకర్, అదనపు డీసీపీ రాజు, సింగరేణి, ఎన్టీపీసీ, జిల్లా ఫైర్ అధికారులు సీఐఎస్ ఎఫ్, సీఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. -
పాఠ్యపుస్తకాలు వచ్చేస్తున్నాయ్
● అవసరమైనవి 3,73,820 ● చేరినవి 1,95,360మంచిర్యాలఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు జిల్లా బుక్ డిపోకు చేరాయి. వేసవి సెలవుల్లోనే గుడిపేటలోని బుక్డిపోకు సరఫరా అవుతుండగా.. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు అందించేందుకు చర్యలు వేగవంతం చేశారు. ప్రతీసారి వేసవి సెలవుల్లోనే పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రాలకు సరఫరా చేస్తుండగా.. ఈసారి విద్యాసంవత్సరం ముగింపునకు ముందే స రఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే పాఠశాలల బలోపేతం, విద్యాప్రమాణాల పెంపుపై దృష్టి సా రించింది. అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏఐ పాఠాల బోధన సాగనుంది. విద్యార్థుల యూనిఫాం క్లాత్ జిల్లాకు చేరగా.. కుట్టు పని కోసం మహిళా సమాఖ్య సభ్యులకు అందజేశారు. జిల్లాకు 3,73,820 ఉచిత పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. ఇందులో 66శాతం పుస్తకాలు జిల్లా బుక్డిపోకు వచ్చాయి. ఇప్పటివరకు 1,95,360 పుస్తకాలు జి ల్లాకు చేరగా.. 1,12,460 పుస్తకాలు రావాల్సి ఉంది. ప్రతీ తరగతికి ఒక్కో సబ్జెక్టు పాఠ్య పుస్తకం రా వాల్సి ఉంది. పూర్తి స్థాయిలో వచ్చాక ఎంఈవో కార్యాలయాలకు చేరవేస్తారు. అక్కడి నుంచి పాఠశాలలకు పంపిస్తారు. కొత్త పుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రంతోపాటు రాష్ట్ర గీతం ప్రచురించారు. గత ఏడాది మిగిలిన దాదాపు 12వేల పుస్తకాలు వెనక్కి పంపించాలా..? పాఠశాలలకు సరఫరా చేయాలా..? వద్దా అనేది ఉన్నతాధికారుల నుంచి స్పష్టత లేకుండాపోయింది. కొత్త పాఠ్యపుస్తకాలను క్యూఆ ర్ కోడ్తో ముద్రిస్తున్నారు. బయట మార్కెట్కు తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
పంట మార్పిడితో సుస్థిర ఆదాయం
నెన్నెల: రైతులు పంట మార్పిడితో అధిక దిగుబడులు సాధిస్తూ సుస్థిర ఆదాయాన్ని పొందవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ శివకృష్ణ అన్నారు. మండలంలోని ఖర్జిలో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో భాగంగా గురువారం రైతులకు అవగాహన కల్పించా రు. రైతులు సాంకేతిక విషయాలను అవలంబి స్తూ కొత్త వంగడాలను సాగు చేయాలని సూచించారు. పురుగుల మందులు, ఎరువుల వా డకం తగ్గించి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. తక్కువ యూరియా వాడకం, సాగు ఖర్చులు తగ్గించడం, రశీదులను భద్రపర్చి నష్టపరిహారాన్ని పొందడం, తదితర అంశాల పై రైతులకు అవగాహన కల్పించారు. ఏడీఏ సురేఖ మాట్లాడుతూ రైతులు వరి, పత్తి పంటలు మాత్రమే కాకుండా ఇతర పంటలు కూడా సాగు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మర్ ఐడీ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మొ క్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ స్రవంతి, నాగరాజు, నెన్నెల ఏఓ సృజన, ఏఈఓ రాంచందర్ పాల్గొన్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించాలి
నెన్నెల: గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, విద్య, వైద్య సదుపాయాలు కల్పించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘గ్రామాలకు తరలిరండి’ అనే కార్యక్రమాన్ని నెన్నెల, నందులపల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల స్థితిగతులు, రైతులు, కార్మికులపై పాటలు పాడుతూ ప్రజలను చైతన్యపర్చారు. విద్యార్థులంతా ప్రజల జీవన స్థితిగతులను అధ్యాయనం చేయాలన్నారు. గ్రామాల్లో పేదలకు పక్కా ఇళ్లు, రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పూర్వ ఉపాధ్యక్షుడు దుర్గం బ్రహ్మానందం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల ప్రధాన కార్యదర్శులు శ్రీకాంత్, ఎం.గణేశ్, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మి, ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి రత్నం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంకు లింకేజీలో జిల్లాకు ఉత్తమ అవార్డు
పాతమంచిర్యాల: బ్యాంకు లింకేజీలో జిల్లాకు ఉత్తమ అవార్డు లభించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.464 కోట్లు గ్రామైక్య మహిళా సంఘాలకు రుణంగా అందించినందుకు జిల్లా రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలి చింది. గురువారం హైదరాబాద్లోని బేగంపేట్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్కుమార్, సీఈవో దివ్య చేతుల మీ దుగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్.కిషన్, అ దనపు డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీఎం స్వర్ణలత, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు అనిత అవా ర్డులు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అధి కారులు అవార్డులు అందుకోవడంపై జిల్లా గ్రా మీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అధికా రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏపీఎం శ్యామల, సీసీ సత్యనారాయణ, సెర్ప్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
తలసేమియాపై అవగాహన ఉండాలి
నస్పూర్: తల సేమియా వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా డిప్యూటీ వైద్యాధికారి సుధాకర్నాయక్ అన్నారు. ఈ నెల 8న ప్రపంచ తలసేమియా నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్యారోగ్యశాఖ, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నస్పూర్ పీహెచ్సీలో ఏఎన్ఎం, ఆశ వర్కర్లకు బుధవారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్నాయక్ మాట్లాడుతూ తలసేమియా, సికిల్ సెల్ వ్యాధులను అరికట్టడానికి ప్రభుత్వం హెచ్బీఏ 2 రక్త పరీక్షలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేసుకోవాలని సూచించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతీ నెల నాలుగో గురువారం సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పీహెచ్సీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యుడు, తలసేమియా సికిల్ సెల్ ట్రాన్స్మిషన్ సెంటర్ ఇన్చార్జ్ కాసర్ల శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్, జిల్లా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ కంకమాల భాస్కర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్, స్టేట్ ఎంసీ మెంబర్ మధుసూదన్రెడ్డి, కోశాధికారి సత్యపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోనే భవిష్యత్
కాసిపేట: చదువుతోనే భవిష్యత్ ఉంటుందని, చదువే మనల్ని ఉన్నతస్థానంలో నిలిపుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండలంలోని వెంకటపూర్లో వందరోజుల్లో వందశాతం అక్షరాస్యతలో భాగంగా నిర్వహిస్తున్న వయోజన విద్య కేంద్రాన్ని బుధవారం రాత్రి పరిశీలించారు. విద్యతోపాటు వృత్తి శిక్షణలో నైపుణ్యం పొందాలని వయోజనులకు సూచించారు. ఆయన వెంట వయోజన విద్య అధికారి పురుషోత్తంనాయక్, తహసీల్దార్ భోజన్న, ఏంపీవో షేక్సబ్దర్ అలీ, డీఆర్పీలు బండ శాంకరి ఉన్నారు.అక్షరాభ్యాస కేంద్రంలో వయోజనులతో పదాలు రాయిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్ -
మానవత్వం చాటిన డీసీపీ
జన్నారం: విధి నిర్వహణలో జన్నారం వెళ్తున్న డీసీపీ భాస్కర్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆస్పత్రికి పంపించి మానవత్వాన్ని చా టుకున్నారు. జన్నారం పోలీస్టేషన్లో బైక్ దొంగల అరెస్ట్పై విలేకరుల సమావేశానికి బుఽ దవారం వస్తుండగా, జన్నారం సమీపంలోని జింకల పార్కు వద్ద ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు అదుపు తప్పి పడిపోయారు. వారిని ఎవరూ ఆస్పత్రికి తరలించడం లేదు. గమనించిన డీసీపీ భాస్కర్ తన వాహనం ఆపి వారి వ ద్దకు వెళ్లి పరిశీలించారు. దారి వెంట వచ్చే ఆ టోను ఆపి తన సిబ్బందితో క్షతగాత్రులు మంచిర్యాలకు చెందిన మాచర్ల వెంకటేశ్, మాచర్ల బాబురావును ఆటోలో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. జన్నారం పోలీస్టేషన్కు చెందిన ఒక కానిస్టేబుల్ను వారి వెంట పంపించారు. -
అకాల వర్షం.. ఆగమాగం
జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. కోతకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ధాన్యం నేలరాలింది. ఇక కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. కోటపల్లి, మందమర్రి, నెన్నెల, చెన్నూర్ మండలాల్లో అకాల వర్షం తీవ్ర నష్టం కలిగించింది. కళ్ల ముందే కొట్టుకుపోతున్న ధాన్యం చూసి రైతులు కన్నీటిపర్యంతమయ్యారు. ధాన్యం కుప్పల మధ్యనే నీరు నిలవడంతో ఉదయం వాటిని తొలగించి ధాన్యం ఆరబోశారు. ఈదురు గాలులకు ఇప్పటికే మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా కురిసిన ఈదురు గాలుల వర్షానికి ఉన్న మామిడి కాయలు కూడా నేల రాలాయి. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకుంటున్నారు. హాజీపూర్ మండలంలో అకాల వర్షానికి ధాన్యం తడిసిపోయింది. మండలంలోని కర్ణమామిడి, టీకానపల్లి, పడ్తనపల్లి, సబ్బేపల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం వర్షానికి తడిసిపోయింది. తడిసిన ధాన్యం కొనుగోలు చేసి వర్షంతో నష్టపోయిన పంటకు పరిహారం అందించాలని కోరుతున్నారు. దండేపల్లి మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యంతోపాటు, తూకం వేసిన బస్తాలు తడిశాయి. – కోటపల్లి/మందమర్రిరూరల్/నెన్నెల/చెన్నూర్రూరల్/మంచిర్యాలరూరల్(హాజీపూర్)/దండేపల్లి -
భూసమస్యల పరిష్కారానికి భూభారతి
● కలెక్టర్ కుమార్దీపక్ భీమారం: రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భీమారం మండలం మద్దికల్, ఆరెపల్లిలో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మద్దికల్ సదస్సులో మాట్లాడుతూ రైతులు ఇన్నాళ్లు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకవచ్చిందన్నారు. భూములకు సంబంధించిన అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే రైతులకు పట్టాదార్ హక్కులు కల్పించనున్నట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు కార్యచరణ ప్రకారంగా జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇందులో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, తహసీల్దా ర్లు సదానందం, కృష్ణ, రైతులు పాల్గొన్నారు. ఇతరులు పట్టాలు చేసుకున్నారు.. మద్దికల్ రెవెన్యూ శివారులోని మా భూములను వేరే వ్యక్తులు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని 20 మంది రైతులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. తాము ఆభూముల్లో అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నామని తెలిపారు. మాకు న్యాయం చేయాలని వారు కలెక్టర్ని కోరారు. క్రీడా కిట్లు పంపిణీ పాతమంచిర్యాల: వేసవి క్రీడా శిబిభిరాలకు క్రీడా కిట్లు పంపిణీ చేశామని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన శాఖ అధికారి కీర్తిరాజవీర్తో కలిసి బుధవారం క్రీడా కిట్లను పంపిణీ చేశారు. బాక్సింగ్ కోచ్ చిలువేరు రాజేశ్, ఫుట్బాల్, వాలీబాల్, కరాటే శిక్షకులు పాల్గొన్నారు. -
నీలగిరి వనాలతో లాభాలు
● టీజీఎఫ్డీసీ డివిజనల్ మేనేజర్ శ్రావణి నెన్నెల: నీలగిరి వనాలతో ఎన్నో లాభాలు ఉన్నాయని వీటిపై అవగాహన పెంచుకోవాలని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ టీజీఎఫ్డీసీ కాగజ్నగర్ డివిజనల్ మేనేజర్ శ్రావణి అన్నారు. తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని నీలగిరితో స్నేహం పేరిట బుధవారం మండలంలోని బొప్పారం శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పెంచుతున్న నీలగిరి వనంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీలగిరి వనాల ద్వారా కాగితం తయారీకి అవసరమయ్యేలా కలప లభ్యం కావడమే కాక పర్యావరణకు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ఒకే చోట వేలాదిగా పెంచే నీలగిరి చెట్ల ద్వారా అధిక మొత్తంలో ఆక్సిజన్ వస్తూ కాలుష్యాన్ని నియంత్రిస్తుందన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు నీలగిరి చెట్లు పెంచే దశ నుంచి కోత వరకు కాగితం తయారీకి అవసరమయ్యే కలపను రవాణా చేసే వివిధ దశల్లో జరిగే పనులను వివరించారు. కార్యక్రమంలో టీజీఎఫ్డీసీ మంచిర్యాల రేంజ్ ప్లానిటేషన్ మేనేజర్ గోగు సురేశ్కుమార్, బెల్లంపల్లి రేంజ్ ప్లానిటేషన్ మేనేజర్ సునిత, డెప్యూటీ ప్లానిటేషన్ మేనేజర్ దుర్గం నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు. -
విజ్ఞానం పెంచుకునేందుకే సైన్స్ క్యాంప్
● డీఈవో యాదయ్యమంచిర్యాలఅర్బన్: వేసవి సెలవుల్లో విజ్ఞానం పెంచుకోవడానికి బావి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి విజ్ఞాన శిబిరం విద్యార్థులకు దోహదపడిందని డీఈవో యాదయ్య అన్నారు. జిల్లా సైన్స్ కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మర్ సైస్స్ క్యాంప్ బుధవారం ముగిసింది. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ గతనెల 25న ప్రారంభమైన శిబిరం 13 రోజులు విద్యార్థులకు ప్రయోగాత్మక నైపుణ్యాలు పెంపొందిస్తూ అనేక అంశాలు నేర్పించినట్లు తెలిపారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన ప్రాజెక్టులు, వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. ఆటోమెటిక్ వాటర్ సిస్టం, ఫైర్ కంట్రోల్ సిస్టమ్, యాంటీ సూసైడ్ ఫాన్, బ్యాంకింగ్ సెక్యూరిటీ సిస్టమ్స్ అనేక పరికరాలను విద్యార్థులు అధికారులకు వివరించారు. ప్రతీరోజు కార్యక్రమాల్లో భాగంగా వృథాగా పడివేసే వస్తువులతో స్కూల్ బ్యాండ్, స్ట్రాప్ బెలూన్లతో బెలూన్బాజాకా, అనుధైర్య తరంగాల నమూనాలు, కంటికి కనిపించని ధ్వని మార్పులను కనిపించేలా ప్రయోగాలు, మానవ శరీరంలోని అంతర్భాగాల పనితీరులను తెలియజేసే ప్రయోగాలను విద్యార్థులకు వివరించారు. ఈసంవత్సరం వినూత్నంగా సెన్సార్ కోడింగ్, రోబోటిక్స్పైన అవగాహన కల్పించామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్వో మధుబాబు, ఉపాధ్యాయులు జాకీర్హుస్సేన్, శ్రీమూర్తి, రాజేశం, తిరుపతి, లక్ష్మణ్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి సన్నద్ధం
● జిల్లాలో 36.50లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం ● ఎండల నుంచి రక్షణకు గ్రీన్ షేడ్ నెట్ల ఏర్పాటు ● ప్రతీ నర్సరీకి వన సేవకులుపాతమంచిర్యాల: జిల్లాలో వన మహోత్సవం నిర్వహణకు అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 306 నర్సీరల్లో మొక్కల పెంపకం ప్రక్రియ గత ఏడాది అక్టోబర్ నుంచే ప్రారంభించా రు. ప్రత్యేకంగా తయారు చేసిన బెడ్లలో విత్తనాలు నాటి మొక్కలను సంరక్షిస్తున్నారు. నర్సరీల్లో ఈ ఏడాది పండ్ల జాతులు, పూలమొక్కలు, నీడనిచ్చే తదితర జాతులకు చెందిన 36.50లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా నిర్ధేశించుకున్నా రు. గత సంవత్సరం నాటిన మొక్కలు ఎదగకుండా చనిపోతే వాటి స్థానంలో మళ్లీ నాటాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బంజరుభూములు, కాలువలు, చెరువుగట్లు, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటుతారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఉన్న నర్సరీలు, ఇతర ప్రాంతాల్లోని నర్సరీల్లో మొక్కల సంరక్షణకు వన సేవక్లను నియమించారు. మొక్కలు చనిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతీ పంచాయతీలోని నర్సరీలో పది వేల మొక్కలు పెంచుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కలకు నీరందిస్తున్నారు. ప్రతీ పదిహేను రోజులకోసారి కలుపు తీసి ఎరువులు వేస్తున్నారు. చనిపోయిన, ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్తగా విత్తనాలు, మొక్కలు నాటుతున్నారు. ఎండ వేడికి మొక్కలు చనిపోకుండా ప్రతీ నర్సరీలో గ్రీన్షేడ్నెట్(నీడ పరదాలు) ఏర్పాటు చేశారు. జూన్లో ప్రభుత్వం నిర్వహించే వనమహోత్సవంలో మొక్కలు నాటనున్నారు. భారీ వృక్షజాతుల మొక్కలు భారీ వృక్ష జాతుల మొక్కల పెంపకం ఈ ఏడాది నుంచి చేపట్టినట్లు జిల్లా ప్లాంటేషన్ మేనేజర్ పి.శ్రీనివాస్ తెలిపారు. 11లక్షల మొక్కలను దా దాపు 2.5మీటర్ల ఎత్తు పెంచడానికి నర్సరీల్లో చర్యలు తీసుకుంటున్నారు. భారీ వృక్షజాతులుగా పిలిచే గుల్మొహార్, నిద్రగన్నేరు, కానుగ, సుభాబుల్, చైనా బాదం, తబోబియా, నల్లమద్ది, గీత కార్మికుల కోసం ఈత, తాటి మొక్కలు పెంచుతున్నారు. ఏడాదిపాటు నర్సరీల్లో పెరిగితే దాదాపు రెండు మీటర్ల నుంచి 2.5మీటర్లు ఉంటాయి. ఆ మొక్కలను ప్రభుత్వ స్థలాలు, చెరువుగట్లు, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో నాటితే నీడతోపాటు ఆహ్లాదంగా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. భారీ మొక్కల నాటేదుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ప్రతీ ఇంట్లో మొక్కలు నాటుకోవాలి వన మహోత్సవంలో భాగంగా పంపిణీ చేసే పండ్ల మొక్కలు, పూలమొక్కలు, నీడనిచ్చే మొక్కలు ప్ర తీ ఇంట్లో నాటుకోవాలి. ఈ సంవత్సరం జూన్, జూలై మాసాల్లోనే వన మహోత్సవం పూర్తి చేయాలనుకుంటున్నాం. గ్రామాలు, పట్టణాల్లో పచ్చద నం పెరిగేలా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలి. – ఎస్.కిషన్, డీఆర్డ్డీవో పెంపకంపై ప్రత్యేక శ్రద్ధనర్సరీల్లో మొక్కలు ఎదగడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. రోజుకు రెండుసార్లు మొక్కలకు నీరు అందిస్తున్నాం. ఎండ నుంచి రక్షణ కోసం గ్రీన్ పరదాలను ఏర్పాటు చేశాం. మొక్కలు చనిపోకుండా ఎరువులు వేసి కాపాడుతున్నాం. – పీ.శ్రీనివాస్, ప్లాంటేషన్ మేనేజర్ -
సైనికా.. సెల్యూట్!
● ఆపరేషన్ సిందూర్పై సర్వత్రా హర్షం.. ● సైనికుల సాహసానికి జిల్లావాసుల జేజేలు ● ఉగ్రవాదం అంతం చేయాలని వినతిపహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ దాయాది దేశాన్ని భారత సైన్యం గట్టి దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి ’ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో తొమ్మిది ఉగ్రస్థావరాలపై విరుచుకుపడ్డాయి. భారత సైనికుల సాహసాన్ని యావత్ భారతం కొనియాడుతోంది. జిల్లావాసులు జవాన్ల ధైర్యాన్ని హృదయపూర్వకంగా కొనియాడుతున్నారు. ఉగ్రవాదం అంతమొందించేందుకు చేపట్టే చర్యలకు మద్దతు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ ఆపరేషన్పై జిల్లాకు చెందిన పలువురు ‘సాక్షి’తో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.● పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి భీమారం: కాశ్మీర్లోని పహల్గాంలో టెర్రరిస్ట్లు అమాయకులైన పర్యాటకులపై జరిపిన దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సిఽందూర్ పేరుతో దాడి చేయడం హర్షనీయం. ప్రతీసారి భారతదేశంపైకి ఉగ్రవాదులతో దాడి చేయిస్తున్న పాకిస్తాన్కు ప్రధాని నరేంద్రమోదీ గట్టి బుద్ధి చెప్పాలి. పీవోకేను స్వాధీనం చేసుకోవాలి. – కొమ్ము జయరాజు, మాజీ సైనికుడు, భీమారం ●ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేయాలి భారత ప్రభుత్వం ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంది. ఉగ్రవాదం మన దేశానికే కాకుండా ప్రపంచానికే ముప్పు ఉంది. దీనిని అంతమొందించాల్సిందే. పాకిస్తాన్లోని ఉగ్రవాదులను తుదముట్టించే వరకు దాడులు చేయాలి. దేశంలో అక్రమంగా దేశంలో నివాసం ఉంటున్న పాకిస్తానీయులను వారి దేశాలకు పంపించాలి. దేశంలో ఉంటున్నవారే ప్రమాదకరం. – రమేశ్యాదవ్, రిటైర్డ్ ఉపాధ్యాయుడు●ఉగ్రవాదులకు సరైన జవాబు మంచిర్యాలటౌన్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం గట్టి బదులు ఇచ్చిన ఆపరేషన్ సిందూర్ దేశ ప్రజల్లో మనోధైర్యం నింపింది. ప్రతీకారం కోసం ఎదురుచూసిన బాధితులు, దేశ ప్రజలకు ఉగ్ర శిబిరాలపై జరిగిన దాడితో కొంత ఊరట లభించింది. భారత దేశం రాక్షసత్వానికి సరైన బదులును ఇస్తుందని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. –సురభి స్వాతి, మోటివేషన్ స్పీకర్, మంచిర్యాల -
హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు
ఆదిలాబాద్టౌన్: హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదుతో పాటు రూ.4వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి కె.ప్రభాకరరావు బుధవారం తీర్పునిచ్చినట్లు ఎస్పీ అఖిల్ మహా జన్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని బంగారుగూడకు చెందిన షేక్అస్లమ్, కోకటి విజ య్ తమ మిత్రుడైన న్యూ హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన ఇందూర్ గజానంద్ హెచ్ఎఫ్ డిల క్స్ బైక్ చోరీ చేయాలనే కుట్రతో ఆదిలాబాద్ నుంచి జైనథ్ వైపు తీసుకెళ్లారు. కత్తితో గొంతు కోసి జైనథ్ శివారులోని వైఆర్కే కన్స్ట్రక్షన్ వద్ద పడేసి బైక్తో పరారయ్యారు. అప్పటి జైనథ్ ఎస్సై కేసు నమోదు చేసి నిందితులను విచారించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. డ్యూటీ అధికారి జమీర్ 25 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పీపీ మేకల మధుకర్, రహీమ్ నేరం రుజువు చేయడంతో జడ్జి తీర్పునిచ్చారు. పోక్సో కేసులో పదేళ్ల జైలు రెబ్బెన: బాలికను ప్రేమపేరుతో పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి శారీరకంగా వాడుకున్న నిందితుడికి పోక్సో కేసు కింద పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 60వేల జరిమానా విధిస్తూ బుధవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పునిచ్చారు. రెబ్బెన సీఐ బుద్దె స్వామి తెలిపిన వివరాల మేరకు రెబ్బెన మండలం గోలేటికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన చునార్కర్ మహేందర్ అనే వివాహితుడు పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి శారీరకంగా వాడుకున్నాడు. కొన్నిరోజుల తర్వాత బాలిక విషయాన్ని తల్లికి చెప్పడంతో 2019 ఆగస్టు 15న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై డీకొండ రమేశ్ కేసు నమోదు చేయగా డీఎస్పీ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టి నిందుతుడిని కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలుకుంటాల: మండలంలోని అంబకంటి గ్రామ సమీపంలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఎస్కే.లతీఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. నర్సాపూర్(జి) మండలంలోని బామ్ని(బి) గ్రామానికి చెందిన లతీఫ్ పని నిమిత్తం బుధవారం ద్విచక్ర వాహనంపై కుంటాలకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా అంబకంటి గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు 108లో భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎన్సీసీ విస్తరణకు కృషి ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్సీసీ విస్తరణకు కృషి చేస్తున్నామని ఎన్సీసీ నిజామాబాద్ గ్రూప్ కమాండర్ సునీల్ అబ్ర హం అన్నారు. జిల్లా కేంద్రంలోని 32 టీ బెటా లియన్ ఎన్సీసీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ ఆసిఫాబాద్కు మరో బెటాలియన్ మంజూరైందన్నారు. ఈ 38వ బెటాలియన్ ఏర్పాటైతే రిక్రూట్మెంట్ పెరుగుతుందన్నారు. ఆసిఫాబాద్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బెటాలియన్ ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కమాండింగ్ అధికారి వికాస్ శర్మ, ఎన్సీసీ అధికారులు గాలి అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య
నర్సాపూర్(జి): మద్యం మత్తులో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై సాయికిరణ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని బూరుగుపల్లి(జి) అనుబంధ గ్రామమైన సూర్యంతండాకు చెందిన చవాన్ సాయినాథ్ (28) గతేడాది బొలెరో వాహనాన్ని ఫైనాన్స్లో కొనుగోలు చేశాడు. నెలనెలా కిస్తీలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండేవాడు. ఆదివారం మద్యం మత్తులో ఇంట్లో పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కొరకు నిజామాబాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుని భార్య చవాన్ సురేఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముగ్గురు బైక్ దొంగల అరెస్ట్
జన్నారం: జల్సాలకు అలవాటుపడి సులభంగా డబ్బులు సంపాదించాలని బైక్ చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. బుధవారం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన కంచర్ల నరేశ్ మార్చి 5న మంచిర్యాల జిల్లా జ న్నారం మండల కేంద్రంలోని ఉడిపి హోటల్ ఎదు ట తన ఫ్యాషన్ ప్రో బైక్ను ఉంచి లోనికి వెళ్లాడు. బయటకు వచ్చి చూసే సరికి బైక్ కనిపించకపోవడంతో 8న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బుధవారం ఎస్సై రాజవర్దన్ వాహనాలు తనిఖీ చేస్తుండగా దస్తురాబాద్ మండలం మల్లాపూర్కు చెందిన బత్తుల పరమేశ్, రెంకల నరేశ్ బైక్లపై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నారు. జన్నారం మండలం మురిమడుగుకు చెందిన సంపంగి రమేశ్, కలమడుగుకు చెందిన లావుడ్యా హరికృష్ణ , దస్తురాబాద్ మండలం మల్లాపూర్కు చెందిన కొట్టె బానేశ్లతో కలిసి ముఠాగా ఏర్పడి మంచిర్యాల, జగిత్యాల, బెల్లంపల్లి, జన్నారం ప్రాంతాల్లో 12 బైక్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నారు. వారి వద్దనుంచి ఫ్యా షన్ప్రో బైక్లు 5, హోండాషైన్ బైక్లు–2, స్పెండర్ ప్లస్ బైక్లు–2, ఫ్యాషన్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్, టీవీఎస్ స్టార్ స్పోర్ట్స్ బైక్లు ఒక్కొక్కటి స్వాధీనం చేసుకున్నారు. బత్తుల పరమేశ్, రెంకల నరేశ్, లా వుడ్యా హరికృష్ణను అరెస్ట్ చేయగా కొట్టె బానేశ్ పరారీలో ఉన్నాడు. కాగా సంపంగి రమేశ్ వేరే కేసులో జైలులో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, లక్సెట్టిపేట సీఐ న రేందర్, ఎస్సై రాజవర్దన్, తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
పెంచికల్పేట్: పెంచికల్పేట్ పెద్దవాగు వద్ద బుధవారం 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా బెల్లంపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సుబ్బారావు, పాలమరి సురేష్, రాచకొండ నగేశ్, ఇనుముల రవి రెండు కార్లలో తరలిస్తూ పట్టుబడ్డారు. విత్తనాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కార్లను సీజ్ చేసినట్లు తెలిపారు. తనిఖీల్లో వెంకటేశ్, మధు, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు. కత్తులతో పోస్టు పెట్టిన ముగ్గురి అరెస్ట్ఆదిలాబాద్టౌన్: సోషల్ మీడియాలో కత్తులతో పోస్టు పెట్టిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. బుధవారం డీఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని తాటిగూడకు చెందిన రాహు ల్ జందాడే, క్రాంతినగర్కు చెందిన సయ్యద్ రిజ్వాన్, మహాలక్ష్మివాడకు చెందిన తైవర్ఖాన్ కత్తులు పట్టుకుని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్ట డంతో కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఆదిలాబాద్ సబ్ డివి జన్ పరిధిలో ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా, యువత కత్తులతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, రోడ్ల పై పుట్టిన రోజు కార్యక్రమాలు నిర్వహించినా, కత్తుల ప్రదర్శన చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు తీసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ముగ్గురు నిందితుల రిమాండ్
ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని మహాలక్ష్మివాడలో గతనెల 28, 29 తేదీల్లో చోరీలకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. టూటౌన్ పోలీసుస్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని యవత్మాల్కు చెందిన షేక్ మోబిన్, వాడే ఆకాష్, షిండే ఆకాష్ ఆది లాబాద్ మహాలక్ష్మివాడలోని మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. మరోసారి చోరీకి పాల్పడేందుకు బుధవారం జిల్లా కేంద్రానికి రాగా నిందితులను విచా రించడంతో సెల్ఫోన్, రూ.20వేల నగదు, 9 తులా ల బంగారం, 280 గ్రాముల వెండి అపహరించినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ద్విచక్ర వాహనం, 2 తులాల బంగారం, 80 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. సమావేశంలో టూటౌ న్ సీఐ కరుణాకర్రావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, టూటౌన్ ఎస్సై విష్ణుప్రకాష్ పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ
జైనథ్: ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో పలువురికి తీవ్ర గాయాలైన ఘటన బుధవారం భోరజ్ మండలంలోని గిమ్మ గ్రామం వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గిమ్మ గ్రామానికి చెందిన అద్దంకి సుభాష్ తన ఆటోలో నలుగురు ప్రయాణికులను ఎక్కించుకుని ఆస్పత్రికి వెళ్తుండగా ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో ఆదిలాబాద్లోని రిమ్స్కు తరలించారు. జైనథ్ ఎస్సై స్వామి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మందమర్రిరూరల్: మందమర్రి పట్టణంలోని సింగరేణి హైస్కూల్ మైదానంలో గత నెల 30న నిర్వహించిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికై నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్ తెలిపారు. ఎంపికై న వారిలో శివాని (పెంచికల్పేట్), ఆత్రం ధనలక్ష్మి (మర్లవాయి), ప్రవీణ్ (బెజ్జూర్) ఉన్నారు.ఈనెల 9 నుంచి 11 వరకు తమిళనాడులోని ఆరని, తిరువన్నమళై పట్టణాల్లో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు వారు పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులను బుధవారం అభినందించారు. -
తలసేమియా చంపేస్తోంది..!
తలసేమియా వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమించే వ్యాధి. ఇది ఆల్ఫా మరియు బీటా అనే రెండు రకాలుగా విభజించబడింది, మైనర్, ఇంటర్మీడియెట్, మేజర్ అనే మూడు దశల్లో కనిపిస్తుంది. మైనర్ తలసేమియా: ఒక ఆల్ఫా లేదా బీటా చెంజ్ తగ్గినప్పుడు సంభవిస్తుంది. ఈ దశలో రక్త మార్పిడి అవసరం లేదు, కానీ వ్యాధి తీవ్రత లేకపోయినా ఇది తదుపరి తరానికి సంక్రమిస్తుంది. ఇంటర్మీడియెట్ మరియు మేజర్: హిమోగ్లోబిన్ (హెచ్బీ) స్థాయిలు తగ్గడంతో ప్రతి 15 రోజులకోసారి రక్త మార్పిడి అవసరం. ఒక యూనిట్ రక్తం ఎక్కించడం ద్వారా హెచ్బీ స్థాయి ఒక గ్రాము పెరుగుతుంది. హెచ్బీ స్థాయి కనీసం 10.5 గ్రాముల వరకు నిర్వహించాలి. అండగా రెడ్క్రాస్.. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ తలసేమియా బాధితులకు అత్యాధునిక సేవలు అందిస్తోంది. హెచ్బీ ఏ2 పరీక్ష: వ్యాధి నిర్ధారణకు అవసరమైన హెచ్పీసీఎల్ మిషన్ అందుబాటులో ఉంది. ఐరన్ చిల్లేషన్ మెడిసిన్: 15 యూనిట్ల రక్త మార్పిడి తర్వాత శరీరంలో పేరుకుపోయిన ఐరన్ను తగ్గించే మందులు అందిస్తున్నారు. సింగరేణి సంస్థ సహకారంతో సీబీఆర్ఎం మిషన్ సైలెన్ బాక్స్ అందుబాటులో ఉంది. హెచ్పీఎల్పీ పరికరం: ఉట్నూరు మరియు మంచిర్యాలలో రక్త క్షీణతను గుర్తించే సాంకేతికత అందుబాటులో ఉంది. ఐరన్ స్థాయిలు పెరగడం వల్ల తలసేమియా బాధితుల జీవనకాలం 30 ఏళ్ల వరకు పరిమితమవుతోంది. సీరం అబార్ట్ ఐ 1000 ఎస్ఆర్ మిషన్ సింగరేణి సహకారంతో మంచిర్యాల రెడ్క్రాస్లో బాధితులకు ఉపయోగపడుతోంది. ఆరోగ్యశ్రీ పరిమితులు ఆరోగ్యశ్రీ ద్వారా నెలకు రూ.15 వేలు మాత్రమే మందుల కొనుగోలుకు అందుతోంది. రోజుకు 3–4 ఇంజెక్షన్లు (ఒక్కో ఇంజెక్షన్ రూ.300 వరకు) అవసరమవుతున్నాయి. ఈ ఖర్చును ఆరోగ్యశ్రీలో చేర్చితే నిరుపేదలకు ఊరట లభిస్తుంది. రక్తం ఎక్కించకపోతే ప్రాణాలకే ముప్పు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్తో పునర్జన్మ ఆరోగ్యశ్రీ ద్వారా అంతంత మాత్రంగానే సాయం ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న వ్యాధి నేడు ప్రపంచ తలసేమియా నివారణ దినోత్సవంఉమ్మడి జిల్లాలో తలసేమియా వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రభుత్వం పరిమిత సాయం అందిస్తుండగా, దాతలు మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతోనే బాధితులు జీవనం సాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 2 వేల మందికి పైగా తలసేమియా బాధితులు ఉన్నప్పటికీ, ఖచ్చితమైన గణాంకాలు వైద్య ఆరోగ్య శాఖ వద్ద లేవు. ప్రపంచ తలసేమియా నివారణ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. – మంచిర్యాలటౌన్బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ తలసేమియా బాధితులకు బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ శాశ్వత పరిష్కారం. సంకల్ప్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో గత ఏడాది జిల్లాకు చెందిన ఆరుగురికి ఈ చికిత్స అందించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలకు పైగా ఖర్చు అయింది. కేంద్ర ప్రభుత్వం పీఎం సహాయ నిధి ద్వారా రూ.3 లక్షలు, బాధితులు రూ.2 లక్షల వరకు, మిగిలిన ఖర్చును సంకల్ప్ ఫౌండేషన్ భరించింది. 90% బాధితులు నిరుపేదలే కావడంతో, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఈ చికిత్సను అందిస్తే వ్యాధిని నిర్మూలించే అవకాశం ఉంది.ప్రభుత్వ సాయం.. ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే తలసేమియా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇతర ప్రాంతాల్లో వ్యాధిగ్రస్తుల గణాంకాలు అందుబాటులో లేవు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి మరియు ఆదిలాబాద్ రిమ్స్లో ఉచిత రక్త మార్పిడి సౌకర్యం ఉన్నప్పటికీ, ఇతర సేవలు అందించడంలో లోపాలున్నాయి.వ్యాధి లక్షణాలు తలసేమియా వంశపారంపర్యంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. మైనర్, ఇంటర్మీడియెట్, మేజర్ మూడు దశల్లో ఉంటుంది. తలసేమియా ఆల్ఫా, బీటా రెండు రకాలు. ఒక ఆల్ఫా చెంజ్ కానీ, ఒక బీటా చెంజ్ తగ్గినప్పుడు మైనర్ వ్యాధి ఉన్నట్లు. వీళ్లు వ్యాధిగ్రస్తులైనప్పటికీ రక్త మార్పిడి అవసరం లేదు. వీరు వ్యాధి తీవ్రతతో బాధపడరు. కానీ వారి నుంచి వారి పిల్లలకు వ్యాధి సంక్రమిస్తుంది. ఇంటర్మీడియెట్, మేజర్లో హిమోగ్లోబిన్(హెచ్బీ) తగ్గిన వారికి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రోగి శరీరంలో ఒక యూనిట్ రక్తం ఎక్కిస్తే ఒక గ్రాము హెచ్బీ పెరుగుతుంది. హిమోగ్లోబిన్ మెయింటనెన్స్ కనీసం 10.5 గ్రాములు శాతం ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతీ 15 రోజులకోసారి వీరికి రక్తం అవసరం. జ్వరం రావడం, ఆకలి తగ్గడం, కామెర్లు, మూత్రం పసుపు రంగులో రావడం, ఇన్ఫెక్షన్ జరగడం, మనిషి ఎదుగుదల నిలిచిపోతుంది. హిమోగ్లోబిన్ తగ్గడంతో ఎముకల సాంద్రత తగ్గి ఎముకలు విరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాధిగ్రస్తుల ఐరన్ సంబంధిత మందులు, ఆహార పదార్థాలు, వంటపాత్రలు వాడరాదు. కాల్షియం(ఎముకలను బలపరిచే) పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.ప్రభుత్వమే ఆదుకోవాలి తలసేమియా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పెళ్లికి ముందు హెచ్బీఏ 2 రక్తపరీక్షను చట్టబద్ధం చేయాలి. ఏజెన్సీ ప్రాంతంలోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి. ఆరోగ్యశ్రీద్వారా మందులతో పాటు, ఇంజక్షన్లు ఇవ్వాలి. యూడీఐడీ కార్డులు ఇవ్వాలి. బోన్మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ను ప్రభుత్వమే చేయించాలి. – కాసర్ల రంజిత్ కుమార్, తలసేమియా వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి -
కౌలురైతు ఆత్మహత్యాయత్నం
నెన్నెల: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట వడగళ్ల వానకు దెబ్బతినడంతో పంట సాగుకు చేసిన అప్పులు ఎలాతీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన నిరుపేద కౌలురైతు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మండలంలోని గంగారాం గ్రామానికి చెందిన కడారి బక్కన్న మూడెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. ప్రైవేట్ వ్యక్తుల వద్ద రూ.2 లక్షల వరకు అప్పుచేసి పెట్టుబడి పెట్టాడు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి వరిపైరు నేలకొరిగి వడ్లన్నీ నేలరాలాయి. దీంతో పంట పెట్టుబడికి చేసిన అప్పులు ఎలా తీర్చాలోనని మనోవేదనకు గురయ్యాడు. బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108లో మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని బాధితుని భార్య మమత ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటోంది. ఘటనపై ఎస్సై ప్రసాద్ను సంప్రదించగా ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ఆటోల చోరీ ముఠా అరెస్ట్
● 27 వాహనాలు స్వాధీనం ● ఐదుగురి అరెస్ట్.. పరారీలో ఇద్దరు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ ఆదిలాబాద్టౌన్: ఆటోల చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 27 ఆటోలు స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్ మహాజన్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో మంగళవారం వెల్లడించారు. ఆదిలాబాద్రూరల్ పోలీస్స్టేషన్ పరి ధిలోని రాంపూర్ వంతెన వద్ద పోలీసులు వాహనా ల తనిఖీ చేపట్టారు. ఈ సమయంలో నిందితుడు షారూక్ పఠాన్ తాను దొంగిలించిన ఆటోలతో వెళ్తూ పోలీసులను చూసి పరారయ్యాడు. పోలీసులు అతడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని విచారించగా ఏడుగురు ముఠాగా ఏర్పడి ఆటోలు చోరీ చేస్తున్నట్లు ఒప్పుకొన్నాడు. హైదరాబాద్లో ఆటోలను దొంగిలించి వాహన, ఇంజన్ నంబర్లు మార్చి వాటి స్థానంలో నకిలీ నంబర్లు ముద్రించి అమ్మడానికి సిద్ధంగా ఉంచిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల్లో నార్నూర్కు చెందిన ఏ–1 యూసుఫ్ ప్రస్తుతం కేఆర్కే కాలనీలో ఉంటున్నాడు. ఈయన పరారీలో ఉండగా, జైనూర్కు చెందిన ఏ–2 సయ్యద్ పరారీలో ఉన్నాడు. ఆదిలాబాద్ పట్టణంలోని రణదీవెనగర్కు చెందిన ఏ–3 షారూ క్ పఠాన్, అదే కాలనీకి చెందిన ఏ–4 అల్తాఫ్ ఖాన్, నార్నూర్ మండలంలోని నాగల్కొండకు చెందిన ఏ–5 షేక్ ఖయ్యూం, అదే గ్రామానికి చెందిన ఏ–6 అఫ్సర్ బేగ్, మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా మాహో ర్ తాలుకా గొండ్వర్సకు చెందిన ఏ–7 అసద్ ఖాన్ ఉన్నట్లు తెలిపారు. ఏ–1, ఏ–2 పరారీలో ఉండగా, మిగతావారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. 27 ఆటోలకు సంబంధించిన వివరాలు తెలియగా, తొమ్మిది ఆటోల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. స్వాధీనం చేసుకున్న ఆటోల విలువ బహిరంగ మార్కెట్లో రూ.27లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఏ–1, ఏ–2ను పట్టుకోవడానికి ప్రత్యే క బృందాలను నియమించినట్లు ఎస్పీ చెప్పారు. ఎవరైనా పాత వాహనాలు అమ్మడానికి వచ్చినప్పుడు వాటి ఒరిజినల్ ఆర్సీ, చేసిస్, ఇంజన్ నంబర్లు చూసి కొనుగోలు చేయాలని సూచించారు. ఎస్పీ వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి, రూరల్ సీఐ ఫణిందర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
● ఎత్తిపోతల పథకాల్లో వరుస చోరీలు ● రణవెల్లిలో చోరీ చేస్తుండగా పట్టివేత చింతలమానెపల్లి: మండలంలోని రణవెల్లి ఎత్తిపోతల పథకంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని పట్టుకున్న ట్లు కౌటాల సీఐ ముత్యం రమేశ్ తెలిపారు. మంగళవారం కౌటాలలోని తన కార్యాలయంలో ఇందు కు సంబంధించిన వివరాలను ఎస్సై నరేశ్తో కలిసి వెల్లడించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండలం రణవెల్లి గ్రామ స మీ పంలో ప్రాణహిత నదిపై నిర్మించిన ఎత్తిపోతల ప థకాన్ని ప్రారంభించకపోవడంతో నిరుపయోగమైంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కేంద్రం లక్మాపూర్కు చెందిన డాన్సింగ్, గణేశ్ సోడంకి, స తీశ్ సీతారాం, రాజు సాహు, రాజోల్ సాహు ఎత్తి పోతల పథకంలోని పంపుహౌస్లో మోటర్లలోని రాగి తీగ చోరీ చేసేందుకు ఏప్రిల్ 13న, 19న రెక్కీ నిర్వహించారు. అదే నెల 26న పంపుహౌస్లోని మోటార్లను విడదీసి వెళ్లిపోయారు. విషయాన్ని వాచ్మన్ లెండుగురె పోశం గమనించి సమాచారమివ్వగా ఎత్తిపోతల పథకం సూపర్వైజర్ శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఏప్రిల్ 29న చింతలమానెపల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల సూచన మేరకు పోశం మరో ఏడుగురు పంపుహౌస్పై నిఘా పెట్టారు. ఈనెల 4న నిందితులు మోటర్లలోని రాగితీగను బయటకు తీసి 5న రాత్రి తరలిస్తుండగా గ్రామస్తుల సాయంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఐదుగురిలో ముగ్గురు పారిపోగా డాన్సింగ్, గణేశ్ గ్రామస్తులకు చిక్కారు. వీరిని చితకబాదిన గ్రామస్తులు పోలీసులకు సమాచారమిమిచ్చారు. అక్కడికి చేరుకున్న ఎస్సై నరేశ్ నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సమీప చెట్లపొదల్లో దాచిన 95కిలోల రాగితీగ, 15కిలోల ప్లేట్లు, ఇతర పని ముట్లు, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై గతంలో మహారాష్ట్రలో పలు చోరీ కేసులు నమోదైనట్లు విచారణలో తేలింది. సిర్పూర్(టి) మండలంలోని హుడ్కిలి ఎత్తిపోతల పథకంలోనూ గతంలో చోరీకి పాల్పడ్డారు. హుడ్కిలి ఎత్తిపోతల పథకంలో చోరీ చేసిన సామగ్రిని రూ.3లక్షలకు విక్రయించారు. ఎత్తిపోతల పథకంలో చోరీ చేసిన సామగ్రి విలువ రూ.1.30లక్షలు ఉంటుందని సీఐ వివరించారు. -
తేనెటీగల దాడిలో తాపీమేస్త్రీ మృతి
● మరో ఇద్దరికి గాయాలురెబ్బెన(ఆసిఫాబాద్): తేనెటీగల దాడిలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. వివరాలు.. గోలేటి–1 ఇంకై ్లన్ ప్రహరీ మరమ్మతు పనులను కాంట్రాక్టర్ పైడిధర్కు అప్పగించారు. మంగళవారం ఉదయం మాదారానికి చెందిన తాపిమేస్తీ నర్సయ్య, మైలారపు శ్రీనివాస్, హిమండి దుర్గారావు ఈ పనులకు వెళ్లారు. ఈక్రమంలో పక్కనున్న చెట్టుపై ఉన్న తేనెటీగలు వీరిపై దాడి చేశాయి. ప్రాణభయంతో పరుగులు తీసినా నర్సయ్యకు తీవ్రగాయాలు, మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నర్సయ్యను గోలేటిలోని సింగరేణి డిస్పెన్సరీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలున్నారు. విషయం తెలుసుకున్న రెబ్బెన ఎస్సై చంద్రశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, నర్సయ్యకు ముగ్గురు కూతుళ్లుండగా అందరికీ వివాహాలయ్యాయి. పెద్దకూతురు సంధ్య అన్నీ తానై తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది. ఏఐటీయూసీ నాయకులు ఎస్.తిరుపతి, మారం శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు పేరం శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు గజ్జెల్లి చంద్రశేఖర్, అలవేణి సంపత్ ఏరియా ఆస్పత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి కుటుంబానికి రూ.3లక్షల పరిహారం ఇచ్చేలా కాంట్రాక్టర్తో మాట్లాడి ఒప్పించినట్లు వారు తెలిపారు. -
ఆటపాటలతో గడిపేవాళ్లం
మంచిర్యాలటౌన్: మాది బీమారం గ్రామం. పుట్టి పెరిగింది అంతా అక్కడే అయినా మా అమ్మమ్మ వాళ్ల ఊరు భూపాలపల్లి జిల్లా దామరకుంట. వేసవి సెలవులు ప్రారంభం కాగానే అక్కడికే వెళ్లేవాళ్లం. మా అమ్మమ్మకు ఐదుగురు కూతుళ్లు, ఐదుగురు కొడుకులున్నారు. పది కుటుంబాల పిల్లలమంతా అమ్మమ్మ వాళ్ల ఊరికే వచ్చేది. 25 మంది వరకు ఒక్కచోట చేరడంతో పండుగ వాతావరణం నెలకొనేది. మా కుటుంబ సభ్యులమంతా కలిసి చిర్రగోనె, గోలీలు, కోతికొమ్మచ్చి, కబడ్డీ అడేవాళ్లం. ఈత కొట్టేవాళ్లం. చింతచెట్ల కింద రకరకాల ఆటలు ఆడేది. మా అమ్మమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ, మామయ్యలు, అత్తయ్యలు ఎన్నో కథలు చెప్పేవారు. ఆరుబయట కూర్చుని సరదా ముచ్చట్లు, కథలు, ఆటపాటలతో గడిపేవాళ్లం. – పోటు రవీందర్రెడ్డి, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఆసిఫాబాద్అర్బన్: నేను రిటైర్డ్ తహసీల్దార్ను. మా సొంత గ్రామం సిర్పూర్(టి) మండలం లోనవెల్లి. మేము వేసవి సెలవుల కోసం ఎదురుచూస్తుండే వాళ్లం. వార్షిక పరీక్షలు ముగిసిన మరుసటి రోజే అమ్మమ్మ ఊరు ఆసిఫాబాద్కు చేరుకునే వాళ్లం. బంధువులందరితో కలిసి సరదాగా గడిపేవాళ్లం. అమ్మమ్మ కట్టెలపొయ్యిపై వండిన వంట ఎంతో మధురంగా ఉండేది. ఉద యం, సాయంత్రం పెద్దవాగు ఇసుకపై ఆడుకునేవాళ్లం. వాగులో స్నానాలు, పాత ఆలయాల్లో ఆటలకు వెళ్తే సెలవులు తొందరగా గడిచిపోయేవి. సెలవుల తర్వాత ఇంటికి వెళ్లాలంటే ఏడుపొచ్చేది. అప్పటి మధుర జ్ఞాపకాలు జీవితంలో మరువలేం. – మాసాదె శివ్రావ్, లోన్వెల్లిమంచిర్యాలటౌన్: మాది కాగజ్నగర్. వేసవి సెలవులు వస్తే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం లింగాపూర్ గ్రామంలోని అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లేది. మేము నలుగురు ఆడపిల్లలం కాగా నేనే పెద్దదాన్ని. అంతా అమ్మమ్మ ఊరిలోనే గడిపేవాళ్లం. కోతికొమ్మచ్చి, అష్టాచెమ్మా, కై లాసం, దాగుడు మూతలు, మోటబావుల్లో ఈత కొట్టడం ఇలా సరదాగా గడిపేవాళ్లం. రాత్రి ఆరుబయట మా అమ్మమ్మ చెప్పే కథలు వింటూ నిద్రించేవాళ్లం. చిన్నప్పుడే కరాటే నేర్చుకున్నాను. నెలన్నరకుపైగా వేసవి సెలవులు ఇస్తే వేగంగా గడిచిపోయేవి. అమ్మమ్మ చెప్పిన కథలు నేటికీ మర్చిపోలేను. – నీరటి రాజేశ్వరి, జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల కథలు వింటూ నిద్రపోయేది -
మోటబావిలో ఈతకొట్టెటోళ్లం
మంచిర్యాల అర్బన్: మాది పాత వరంగల్ జిల్లా (జనగాం) నర్మెట్ట మండల బొమ్మకూర్. వేసవి సెలవులు రాగానే అమ్మమ్మ–తాతయ్య ఊరు హన్మంతపూర్కు వెళ్లేవాళ్లం. ఉదయం నుంచి చిన్నపిల్లలందరం కలిసి సిర్రగోనె, కబడ్డీ, చింతపిక్కలు తదితర ఆటలాడేవాళ్లం. సా యంత్రం అయిందంటే చాలు మోటబా విలో అందరం కలిసి ఈత కొట్టేవాళ్లం. ఇంటి ఆవరణలో మామిడి, వేపచెట్లు ఉండేవి. మామిడి కాయలు తెంపి కారం, ఉప్పుతో కలిపి తినటం ఇప్పటికీ మరి చిపోలేం. అమ్మమ్మ చేసే జొన్న అంబలి ఎంతో రుచిగా ఉండేది. రాత్రి కాగానే కుటుంబసభ్యులమంతా వేపచెట్టు కింద మంచం వేసుకుని, నేలపై పడుకుని కబుర్లు చెప్పుకొంటూ నిద్రలోకి జారుకునేవాళ్లం. అప్పట్లో బ్రహ్మంగారి చరిత్ర నాటకాన్ని కళాకారులు ప్రదర్శించగా ఎంతో ఆసక్తిగా చూసేవాళ్లం. – యాదయ్య, డీఈవో, మంచిర్యాల -
అప్పటి తీపిజ్ఞాపకాలేవి?
నిర్మల్ఖిల్లా: ఆరు దశాబ్దాల క్రితం నాలుగు నుంచి పదో తరగతి వరకు ఖానాపూర్లో చదివాను. గోదావరి నది మా ఇంటి సమీపంలోనే ఉండేది. వేపవి సెలవుల్లో అందులో ఈత నేర్చుకునేవాళ్లం. మా అమ్మమ్మ ఊరు రాయికల్కు వెళ్లాలంటే గోదావరి నదిని ఎడ్లబండిలో దాటేది. ఆ తర్వాత ప్రైవేట్ వాహనంలో వెళ్లేవాళ్లం. మామిడి కాయలు కోసి దోస్తులమంతా ఉప్పు పెట్టుకుని తినేవాళ్లం. దగ్గరలోని గ్రంథాలయానికి వెళ్లి బాలలబొమ్మల పుస్తకాలు చది వేది. నమ్మక్, గిల్లీ–దండా, కోతికొమ్మ, గోలీ లు, కబడ్డీ లాంటి ఆటలు ఆడేది. కొత్త ఆవకాయ, అన్నం తీసుకెళ్లి ఒత్తుగా కలుపుకొని గోదావరి ఒడ్డున కూచోని తింటూ దోసిళ్లతో నీళ్లు తాగేది. అప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే మళ్లీ కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది. – సంపత్కుమార్, నవలా రచయిత, కెనడా రాయబార కార్యాలయ సీనియర్ సలహాదారు -
గొలుసు చోరీ నిందితుల అరెస్ట్
నిర్మల్టౌన్: గొలుసు చోరీలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవా రం ఏఎస్పీ అవినాష్కుమార్ జిల్లా కేంద్రంలోని డీ ఎస్పీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. గత నెల 30న నిర్మల్ నుంచి నిర్మల్ రూరల్ మండలం వెంగ్వపేట్కు దంపతులు మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. మార్గమధ్యలో కావేరి కుఠీర్ వద్ద ఇద్దరు గు ర్తుతెలియని వ్యక్తులు వారి మోటార్ సైకిల్ను అడ్డగించి బంగారు గొలుసు, పుస్తెల తాడు అపహరించి బైక్పై పరారయ్యారు. బాధితులు నిర్మల్ రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక మంజులాపూర్లోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఇద్దరు అ నుమానాస్పదంగా వచ్చి పోలీసులను చూసి పారి పోయే ప్రయత్నం చేశారు. వెంటనే పోలీసులు వారి ని పట్టుకున్నారు. నాందేడ్ జిల్లా సోనారి తాలూకా కు చెందిన బాలాజీ, రూరల్ మండలం తలవేద గ్రామానికి చెందిన అలిశెట్టి శ్రీనివాస్గా గుర్తించా రు. వారిని విచారించగా.. దంపతుల మెడల్లోంచి చైన్, పుస్తెలతాడు దొంగిలించినట్లు ఒప్పుకొన్నా రు. వారి నుంచి రెండు తులాల బంగారు పుస్తెలతా డు, తులం చైన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అ రెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కానిస్టేబుళ్లు సంతోష్, సత్యనారాయణను ఏఎస్పీ అభినందించారు. సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి, సిబ్బంది ఉన్నారు. -
చిన్నప్పటి జిందగినే మస్తుండే..
నిర్మల్ఖిల్లా: ఎండాకా లంలో నిర్మల్లోని మా బేస్తవార్పేట గల్లీ దోస్తులతో దెబ్బల చెండు, మూలలాట, కుంటుడు, దేకుడు, దూకుడు, ము ట్టిచ్చుకునుడు, అగ్గిపెట్టెల పత్తాలాట, సిగరెట్ పెట్టెలతో బస్సు కార్లాట, గోటిలాట, ఒక పెద్ద తాడుకు ముడేసి అందులో అంద రం లైన్ కొద్ది నిలబడి ముంగటోడు డ్రైవర్, మధ్యలోడు కండక్టర్గా ఎన్నో ఆటల్ని ఆడుకునేటోళ్లం. చొప్పబెండ్లతో అద్దాలు, కుర్చీలు, మంచాలు, కార్లు, బస్సులు చేసుకునేటోళ్లం. తాటి ఆకులతో పంకలు చేసుకుని చేతిలో పట్టుకుని పరుగెత్తేవాళ్లం. జొన్న రొట్టెలను పప్పు, ఊరగాయ కలుపుకొని కడుపునిండా తిని వాకిట్ల బొంతలు పరిచిన మంచాల్లో ఆకాశం వైపు చూస్తూ పడుకుండేది. మా బా పువాళ్లు నిర్మల్ చరిత్ర చెప్పేటోళ్లు. రామాయ ణం, మహాభారతం కథలు కూడా చెప్పేది. – ధోండి శ్రీనివాస్, నిర్మల్ చరిత్రకారుడు సెలవులైపోతే ఏడుపొచ్చేది -
పౌరాణిక కథలు వినేవాళ్లం
మంచిర్యాల అర్బన్: వేసవి సెలవులకు మా ఊరు పెద్దంపేట్కు వెళ్లేవాళ్లం. అక్కడ మా తాతయ్య అనేక పౌరాణిక కథలు చెబుతుంటే మిత్రులతో కలిసి వినేవాళ్లం. హజీపూర్ మండలం కేంద్రంలో నాలుగో తరగతి వరకు చదువుకున్నాను. ఐదో తరగతి నుంచి ఏడో తరగతి వరకు అక్కవాళ్ల ఊరు వెల్గటూర్ మండలం చెగ్యమాలకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో సెలవులు రాగానే అందరం పెద్దంపేట్కు వచ్చేవాళ్లం. మాది వ్యవసాయ కుటుంబం కావటంతో అడవికి వెళ్లి కట్టెలు తీసుకువచ్చేవాళ్లం. నానమ్మ–తాతయ్యతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తూ సరదాగా గడిపేవాళ్లం. రోడ్డు వెంట అల్లనేరేడు చెట్లుండేవి. మిత్రులతో కలిసి పండ్లు రాల్చిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. మోటబావి పక్కనున్న జామ చెట్టు పైనుంచి పండ్లు కిందపడగానే తిన్నరోజులు ఎప్పటికీ మరిచిపోలేను. బాల్యంలో స్నేహితులతో కలిసి గడిపిన మధురానుభూతులన్నీ ఇప్పటికీ గుర్తుకొస్తున్నాయి. – అంజయ్య, డీఐఈవో, మంచిర్యాల -
కాలం వెనక్కిపోతే బాగుండు
మంచిర్యాల అర్బన్: వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఆసిఫాబాద్లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లేవాళ్లం. అక్కడ నీళ్లు దొరకని సందర్భంలో ఎండ్లబండ్లపై బిందెలు పెట్టుకుని చెలిమెలు తోడి నీళ్లు తెచ్చిన సందర్భాలెన్నో. మక్కజొన్న గట్కా, చిక్కుడు, గుమ్మడి కూర, పచ్చి కూరగాయలు దొరకని సందర్భంలో రకరకాల వరుగులతో అమ్మమ్మ వంటలు ఎంతో మధురంగా చేసేది. రాత్రివేళ పెరట్లో నులక మంచాల్లో పడుకుని వెన్నెల, నక్షత్రాలను చూస్తుండేవాళ్లం. కూని రాగాలు తీస్తూ ఆదమరిచి నిదురించేవాళ్లం. అమ్మమ్మ–తాతయ్య కథలు, కావ్యగానాలు అపూర్వమైనవి. ఇంట్లో పెద్దలకు చెప్పకుండా ఎడ్లబండి కట్టుకుని వెళ్తుండగా ఒక ఎద్దు తప్పించుకుంది. అప్పుడు అందరం కలిసి బండిని లాక్కు ని వచ్చి అదే స్థలంలో ఉంచేవాళ్లం. ఈతకు వెళ్లి నీటిలో మునిగి పోతుంటే తమ్ముళ్లు కాపాడిన విషయం ఎప్పటికీ మరిచిపోను. గ్రామంలో రాత్రివేళ ప్రదర్శించిన రామాయణం, డ్రామాలను ఇంటిల్లిపాదితో కలిసి చూడటం మరిచిపోని జ్ఞాపకాలు. ఒక్కసారి కాలం వెనక్కిపోతే బాగుండు అనిపిస్తోంది. – వామన్రావు, కవి, సాహితీ సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల -
చెదిరిపోని జ్ఞాపకాలు
మంచిర్యాలక్రైం: వేసవి సెలవుల్లో చిర్రగోనే ఆడిన, గంగయ్యబావిలో ఈత కొట్టిన మధుర జ్ఞాపకాలు మరిచిపోలేనివి. అవి తిరిగిరాని, చెదిరిపోని జ్ఞాపకాలు. మాది సూర్యపేట జిల్లా అర్వపెల్లి మండలం కొనపెల్లి గ్రామం. మా గ్రామానికి ఐదు కిలో మీటర్ల దూరంలో తిమ్మాపూర్ ఉండేది. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు అక్కడే చదివాను. వేసవిలో ఒంటిపూట తర్వాత ఇంటికి వచ్చేదారిలో గంగయ్య బావి ఉండేది. ఆ బావిలో ఈత కొట్టేవాళ్లం. చింతచెట్టు కింద కబడ్డీ, చిర్రగోనె ఆడెటోళ్లం. చెరువు గట్లపై ఈత పండ్లు, మామికాయలు తెంపుకొని సాయంత్రం ఇంటికి చేరుకునేది. బడికి వేసవి సెలవులు ప్రకటించగానే నల్గొండ జిల్లా ఆకారం అనే గ్రామానికి అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. అక్కడ తాటిముంజలతో గిరక బండి చేసుకుని చెరువు గట్టుపైకి వెళ్లేది. ఎడ్లబండ్లంటే నాకు చాలా ఇష్టం. గ్రామాల్లో ఊరు పెద్దమనుషులు చెట్లకింద పంచాయితీలు పెట్టుకునేవారు. అవి వినుకుంటూ చింతచెట్ల కింద చిర్రగోనె ఆడేవాళ్లం. ఎక్కువ శాతం చిర్రగోనె, కబడ్డీ ఆడుతూ.. ఈత కొడుతూ ఎంజాయ్ చేసేవాళ్లం. అవి తిరిగిరానివి, మరిచిపోలేని మధుర జ్ఞాపకాలు. – ఎగ్గడి భాస్కర్, డీసీపీ, మంచిర్యాల -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
కళాకారులను ఆదుకోవాలి..ఏళ్ల తరబడి వివిధ రంగాల్లో రాణిస్తున్న తెలంగాణ కళారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. సమగ్ర సాంస్కృతిక విధానం రూపొందించి 50 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్లు రూ.ఐదు వేలు అందించాలి. కళల మీదే ఆధారపడిన కళాకారుల వివరాలు సర్వే చేసి ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలి. – వివిధ రంగాల కళాకరులు మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణలతో కలిసి నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల ఫిర్యాదులు స్వీకరించారు. ● లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ నిర్ణయించి కబ్జాకు గురికాకుండా చూడాలని సీపీఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు కోరారు. ● భీమారం మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై భీమారానికి చెందిన సందనవేని అజయ్, హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామ శివారులో భూ ఆక్రమణపై గ్రామానికి చెందిన కునరాపు చంద్రమొగిలి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు
బెల్లంపల్లి: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈ జేఏసీ) జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కె.వనజారెడ్డి అన్నారు. సోమవారం ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ను కలిసి జేఏసీ నాయకులు సమస్యలు వివరించారు. ఉద్యోగుల సమస్యలపై ఈ నెల 14లోపు ప్రభుత్వం స్పందించాలని, లేనిపక్షంలో 15న నల్ల బ్యాడ్జీలతో నిరసన, ధర్నా, జూన్ 9న హైదరాబాద్లో మహాసదస్సు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం 57 సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఈ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొన్న మల్లయ్య, డెప్యూటీ సెక్రెటరీ జనరల్ బి.రామ్మోహన్, కో చైర్మెన్ శ్రీపతి బాబురావు, నాయకులు చక్రపాణి, రవి, చెన్నకేశవులు, సుధాకర్, గోపాల్, వెంకటేశం, సంఘ సభ్యులు పాల్గొన్నారు. -
మరిన్ని రహదారులు నిర్మించాలి
తెలంగాణ రాష్ట్రానికి పక్కన ఉన్న మహారాష్ట్రతో అనుసంధానిస్తూ మరిన్ని జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలి. జిల్లాలో 300 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణం చేపట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుంది. అదే తరహాలో ఆదిలాబాద్ నుంచి ఉట్నూర్, ఆసిఫాబాద్ మీదుగా మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా అల్లాపల్లి వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. – ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ -
‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’తో అనేక లాభాలు
బెల్లంపల్లిరూరల్: వ్యవసాయ సాగులో రైతులకు మరిన్ని లాభాలు చేకూర్చేందుకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం మండలంలోని పాత బెల్లంపల్లి గ్రామంలో బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మా ట్లాడుతూ వ్యవసాయ శాఖ, శాస్త్రవేత్తలు ని త్యం రైతులకు అందుబాటులో ఉంటూ సాగులో ఉన్నతంగా రాణించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. కృషి విజ్ఞాన కేంద్రం ప్రో గ్రామ్ కో–ఆర్డినేటర్ కోట శివకృష్ణ, జిల్లా వ్యవసాయాధికారి జి.కల్పన మాట్లాడుతూ రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించి సాగు ఖ ర్చును తగ్గించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏడీఏ రాజానరేందర్, ఏవో ప్రేమ్కుమార్, హెచ్వో అర్చన, కేవీకే శాస్త్రవేత్తలు ప్రియ సుగంధి, తిరుపతి, మాజీ ఏఎంసీ చైర్మన్ కారుకూరి రాంచందర్, పీఏసీఎస్ చైర్మ న్ స్వామి, నాయకులు దావ రమేష్ బాబు, రాయలింగు, రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థులు లక్ష్యాలను సాధించాలి
● పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణమంచిర్యాలఅగ్రికల్చర్: ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇటీవల విడుదలైన ఫలితాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పాఠశాలలు, కళాశాలల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను కలెక్టర్ కుమార్దీపక్, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరిలతో కలిసి శాలువాలతో సత్కరించారు. ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ ప్రతీ ప్రభుత్వ పాఠశాలలో సదుపాయాలు కల్పిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఎ.లిఖిత, షేక్ సీద్రాకొహిన్, బి.సాత్విక, ఎండీ.అజార్బీ, మహెక్ నజ్నిన్, జునైన సాబా, నిదాఫిర్దోస్, ఎన్.అభిరామ్, ఓ.సిద్ధు, బి.వరుణ్ తేజ, ఎండీ.అమన్, డి.అక్షయ, సుహైర్య, ఆర్.వైష్ణవి, డి.రిషిత, ఎస్ వైశాలి, ఎండీ.సమీర్, ఎండీ.ఫిరోజ్, ఎస్.రాంసూరిలను సన్మానించారు. టాస్క్, ఏటీసీ సందర్శన మందమర్రిరూరల్/మంచిర్యాలఅగ్రికల్చర్: మంచిర్యాల కలెక్టరేట్లోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్ డిపార్టుమెంటు(టాస్క్), మందమర్రి మండల కేంద్రంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లను సోమవారం ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి సందర్శించారు. మంచిర్యాలలో యువతకు పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను అందించి ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ, టాస్క్ ప్రతినిధి సాయికృష్ణ, ఏటీసీ ప్రిన్సిపాల్ దేవానంద్, అధికారులు పాల్గొన్నారు. -
భూసమస్యల పరిష్కారానికే సదస్సులు
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ● ఆరెపల్లిలో భూభారతి సదస్సు ● పైలట్ మండలంలో సదస్సులు ప్రారంభంభీమారం: భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అమలుపై పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై న భీమారం మండలం ఆరెపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ఈ నెల 20వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో భూభారతిచట్టంపై అవగాహన కల్పించడంతోపాటు భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రిజిస్ట్రేషన్, మ్యుటేషన్కు ముందు భూముల వివరాలు పూర్తి స్థాయిలో సర్వే చేసి మ్యాప్ తయారు చేస్తామని చెప్పారు. సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరిస్తామని, వారసత్వ భూములను విరాసత్ చేసే ముందు నిర్ణీత కాలంలో సమగ్ర విచారణతోపాటు సంబంధిత వారసులకు నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. కాగా, బూర్గుపల్లిలో నిర్వహించిన సదస్సులో మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్రావు, తహసీల్దార్ సదానందం, ప్రత్యేక తహసీల్దార్ కృష్ణ పాల్గొన్నారు. కార్యదర్శిపై కలెక్టర్ ఆగ్రహం భీమారం: మండలంలోని ఆరెపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు సోమవారం గ్రామానికి వచ్చిన కలెక్టర్ కుమార్ దీపక్కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి సమస్య ఉన్న రెండు కాలనీలను స్వయంగా సందర్శించారు. బీసీ కాలనీకి మిషన్ భగీరథ నీరందించడం లేదని, సమీపంలోని బోరుబావికి మోటారు ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేస్తున్నాం కదా అని స్థానికులను ప్రశ్నించారు. పైపులైను వేయలేదని, పంచాయతీ కార్యదర్శి దేవేందర్రెడ్డికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని తెలిపారు. కలెక్టర్ వెంటనే మొబైల్ ఫోన్ ద్వారా నీటిసరఫరా విషయమై ఆన్లైన్లో పరిశీలించారు. గ్రామం మొత్తం నీటిసరఫరా చేస్తున్నట్లు రిపోర్టు ఇవ్వడంపై కలెక్టర్ గ్రామ కార్యదర్శిని ప్రశ్నించారు. ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో ప్రతీరోజు ఎక్కడ నుంచి వస్తున్నావని అడిగారు. చెన్నూరు నుంచి అని సమాధానం చెప్పడంతో మీ ఇంట్లో నీటిసమస్య ఉంటే ఇలాగే ప్రవర్తిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడి ఉందని తెలుపగా రెండు వీధులకు కలిపి రూ.1.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. మూడు రోజుల్లో పనులు పూర్తి చేసి నీటిని సరఫరా చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. మాజీ సర్పంచ్ రమేశ్, స్థానికులు ఉన్నారు. -
● నెలన్నరలో రెండుసార్లు ఉత్తర్వులు ● ‘ఎంఎల్ఎస్’ పాయింట్ల ఇన్చార్జీల తీరిదీ ● గోదాంల్లో బియ్యం నిల్వల తేడాలే కారణమా?
అంతా ఆన్లైన్లోనే అయినా..స్టేజ్–1నుంచే అధికారులు, డీలర్లు, లబ్ధిదారుల దాక అంతా బయోమెట్రిక్గా వేలిముద్రలతోనే బియ్యం పంపిణీ సాగుతోంది. అయితే ఎంఎల్ఎస్ పాయింట్లలో రికార్డుల్లో ఓ తీరు, ఫిజికల్గా మరోతీరు అన్నట్లుగా మారింది. నెలవారీగా స్టాక్ రాక, స్టేజ్–1 నుంచి వస్తే స్టేజ్–2లో భద్రపర్చి ఆపై డీలర్లకు రవాణా చేయాలి. అయితే స్టేజ్–1నుంచే బియ్యం తక్కువగా వస్తున్నాయని, డీలర్లకు కోత వేస్తున్నారు. కొన్నిసార్లు స్టేజ్–1 లారీ నుంచి నేరుగా స్టేజ్–2కి హమాలీలతో ఎక్కించేస్తున్నారు. గోదాంలో వేసినట్లు బిల్లులు తీసుకుంటున్నారు. గతంలో కొందరు నేరుగా రైస్మిల్లర్లతోనే కుమ్మకై ్క బియ్యం రీ సైక్లింగ్ చేసిన ఘటనలు ఉన్నాయి. తర్వాత కఠిన చర్యలతో గోదాంల్లో విధులు నిర్వర్తించేందుకు జంకుతున్నారు. కానీ ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన కొందరు మాత్రం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్లో అధికారులను బదిలీ చేసినా కదలడం లేదు. మండల స్థాయి స్టాక్ పాయింట్ల(ఎంఎల్ఎస్) ఇన్చార్జీలకు గత నెలన్నరలో రెండుసార్లు బదిలీ ఉత్తర్వులు ఇచ్చారు. గత మార్చి 19న జిల్లా మేనేజర్ శ్రీకళ గోదాముల పాయింట్ల ఇన్చార్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తాండూర్, చెన్నూర్, కోటపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి ఇన్చార్జీలను బదిలీ చేశారు. ఉత్తర్వులు వచ్చినా స్థానాలు మారలేదు. కొందరు దూర భారం, వ్యక్తిగత కారణంతో ఆయ స్థానాల్లోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు. గత నెల 10న మరోసారి బదిలీల ఉత్తర్వులు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇప్పటికీ మంచిర్యాలలో ఒక్కరే చేరారు. మరోవైపు గోదాముల్లో బియ్యం నిల్వల్లో తేడాలతోనూ విధుల్లో చేరేందుకు జాప్యం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఎందుకీ జాప్యం? ప్రజాపంపిణీ వ్యవస్థలో స్టేజ్–1(బఫర్ స్టాక్) నుంచి స్టేజ్–2(ఎంఎల్ఎస్) పాయింట్లకు ఆపై డీలర్లకు బియ్యం సరఫరా అవుతాయి. జిల్లాలో మంచిర్యాల, లక్సెట్టిపేట, చెన్నూరు, కోటపల్లి, బెల్లంపల్లి, తాండూరు ఎంఎల్ఎస్ పాయింట్లు ఉన్నాయి. ప్రతీ నెల 423 రేషన్దుకాణాలకు సగటున నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా జరగాలి. ఇక స్కూళ్లలో మధ్యాహ్న భోజనం, వసతిగృహాలు, ఇతర అవసరాలకు ఇక్కడి నుంచే రవాణా అవుతాయి. ఈ సరఫరాలో పెద్దయెత్తున బియ్యం గోల్మాల్ జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింటులో క్వింటాళ్ల కొద్దీ తేడా వచ్చింది. నమ్మకస్తులైన డీలర్లకే ఎక్కువ మొత్తంలో బియ్యం పంపిస్తూ.. కొందరికీ తక్కువగా ఇస్తూ నల్లబజారుకు తరలింపుపై విచారణలు, సస్పెండ్లు జరిగాయి. మరోవైపు ఆయా కేసుల్లో పట్టుబడిన బియ్యం నిల్వల్లోనూ అక్రమాలు చేస్తున్నారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్లు సైతం కీలకంగా మారారు. ఈ కారణంగా బియ్యం నిల్వల తేడాతోనూ కొత్తగా బాధ్యతలు చేపట్టబోయే అధికారులు జాయిన్ కావడానికి వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. గోదాం పర్సన్ ఇన్చార్జీగా బాధ్యతలు చెపట్టేముందు క్లోజింగ్ బ్యాలన్స్(మిగులు బియ్యం) లెక్క అప్పగించాలి. దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టే వారు ఆ నిల్వల తేడా తమపై పడితే అనే భయం పట్టుకుంది. తక్కువగా ఉంటే జేబుల్లో నుంచి డబ్బులు పెట్టుకుని బియ్యం నిల్వ చేయాల్సి వస్తుంది. దొడ్డు బియ్యం స్టాక్ నుంచి గత నెల సన్న బియ్యం దాకా సర్దుబాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. -
స్వల్పంగా కంపించిన భూమి
జన్నారం/లక్సెట్టిపేట/దండేపల్లి: జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. సుమారు ఐదు సెకన్లపాటు కంపించినట్లు తెలుస్తోంది. జన్నారం మండలం తపాలాపూర్, పొనకల్ శ్రీలంక కా లనీ, రాంపూర్, ధర్మారం, కలమడుగు, చర్లపల్లి, జన్నారం, లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్, ఇటిక్యాల, లక్సెట్టిపేట, దండేపల్లి మండలం తాళ్లపేట, చింతపల్లి గ్రామాల్లో రాత్రి 6.50గంటల ప్రాంతంలో భూమి కంపించింది. పొనకల్ శ్రీలంకకాలనీలో ఉపాధ్యాయుడు జాడి రాజన్న టేబుల్పై గ్లాస్ పెట్టి కుర్చీలో కూ ర్చోగా గ్లాస్ కిందపడిందని, కుర్చీలో రెండు సె కన్లు కదిలిందని తెలిపారు. తపాలపూర్ గ్రా మంలో బోళ్ల స్టాండ్ నుంచి గ్లాసులు కింద పడినట్లు విజయధర్మ తెలిపారు. ఇళ్లలోని వస్తువులు అటు ఇటూ కదిలినట్లు అయ్యాయని పలు వురు తెలిపారు. ప్రకంపనలతో ఆయా గ్రామాల్లో ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. -
నస్పూర్ ఎస్సైకి పోలీస్ రియల్ హీరో అవార్డు
నస్పూర్: సీసీసీ నస్పూర్ ఎస్సై ఉపేందర్రావు కు ప్రభుత్వం పోలీస్ రియల్ హీరో అవార్డు ప్రదానం చేసింది. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం నిర్వహించిన తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎస్సై ఈ అవార్డును అందుకున్నారు. ఉపేందర్రావు రామగుండం కమిషనరేట్ పరిధి టాస్క్ఫోర్స్ విభాగంలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఓ గంజాయి కేసులో నిందితుడు ఎస్సారెస్పీ కాలువలోకి దూకి పారిపోతుండగా ఎస్సై తన ప్రాణాలకు తెగించి కాలువలోకి దూకి నిందితుడిని పట్టుకున్నారు. ఎస్సై ధైర్యసాహసాలకు మెచ్చి ప్రభుత్వం అవార్డును ప్రదానం చేసింది. -
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ వినియోగించాలి
మంచిర్యాలటౌన్: వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ను వినియోగించాలని పాత్ ఎన్జీవో స్టేట్ ప్రోగ్రాం ఆఫీసర్ జావిద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో కలిసి సోమవారం పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను ఆయుష్మాన్ భారత్ యాప్లో నమోదు చేయాలన్నారు. దీనివల్ల ఆసుపత్రులకు, ఫార్మసీకి వచ్చే రోగుల హెల్త్కార్డును లింక్ చేస్తే జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రతీ కార్డుకు రూ.20 చొప్పున ఇన్సెంటివ్ పొందవచ్చని తెలిపారు. రోగుల సంరక్షణకు, డిజిటల్ ఆరోగ్య సేవలను ప్రజలు పొందేందుకు, వారి ఆరోగ్య డేటా సంరక్షించుకునేందుకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఉపయోగపడుతుందని వివరించారు. పాత్ ఎన్జీవో సభ్యులు నరేశ్, డీపీవో ప్రశాంతి, జాతీయ ఆరోగ్య మిషన్ ప్రవళిక, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్ పాల్గొన్నారు. -
సమ్మె నోటీసు అందజేత
శ్రీరాంపూర్: దేశవ్యాప్తంగా ఈనెల 20న నిర్వహించే సమ్మెను 17 డిమాండ్లతో కూడిన నోటీసును సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ నేతలు యజమాన్యానికి అందించారు. సోమవారం హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సీఎండీ ఎన్. బలరాంనాయక్, డిప్యూటీ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్లకు ఈ నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, ఐఎఫ్టీయూసీ జనరల్ సెక్రెటరీ సీతారామయ్య, సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు డి.బ్రహ్మానందం, తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యదర్శి కామెర గట్టయ్య, ఏఐఎఫ్టీయూ అధ్యక్షుడు జి. రాములు, టీఎన్టీ యూసీ జనరల్ సెక్రెటరీ మనీ రాంసింగ్, ఎస్జీకేఎస్ అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ ం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ సమ్మె ఉంటుందన్నారు. దేశవ్యాప్త డి మాండ్లతోపాటు సింగరేణి పరిధిలో డిమాండ్లను స మ్మెలో పెట్టామన్నారు. సింగరేణిలో కొత్త భూగర్భ గనులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులకు కోలిండియాలో మాదిరిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికవర్గ మనగడ కు ముప్పు తెస్తున్న కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టా లను రద్దు చేయాలన్నారు. కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జేఏసీ నాయకులు బోసు, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మె నోటీసు.. బెల్లంపల్లి: దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా తెలంగాణ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) నాయకులు సమ్మె నోటీసు ఇచ్చారు. సోమవారం బెల్లంపల్లి సీడీపీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఐసీడీఎస్ వ్యవస్థకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని విమర్శించారు. ఈ సమ్మెకు అంగన్వాడీలు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు భానుమతి, కార్యదర్శి రాజమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రమణ, మండల కన్వీనర్ చల్లూరి దేవదాస్, నెన్నెల సెక్టార్ నాయకురాలు చంద్రకళ, సువర్ణ, విశ్వనాథ్ పాల్గొన్నారు. -
వేతన బకాయిలు చెల్లించాలని ధర్నా
బెల్లంపల్లి: గత ఫిబ్రవరి నుంచి మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తెలంగాణ మెడికల్,హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు చేత పట్టుకుని ఏరియా ఆసుపత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు, కార్మికులు మాట్లాడుతూ ఆలస్యం చేయకుండా వేతన బకాయిలను విడుదల చేయాలని లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏరియాఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి కుమార్కు వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఓం నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, లక్ష్మణ్, రమేశ్, నీరజ, సాయి, మహేశ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
జొన్నలేప తిని మూడు లేగదూడలు మృతి
దిలావర్పూర్: మండలంలోని మాడేగం గ్రామశివారు పంట చేలలో మూడు లేగదూడలు జొన్నలేప తిని మృతిచెందాయి. బాధిత రైతు పులిండ్ల విజయ్, స్థానికులు తెలిపిన వివరాలు.. ప్రతీరోజులాగా లేగదూడలు సోమవారం మేత మేయడానికి వెళ్లాయి. గ్రామశివారులోని పంట చేలలో జొన్నలేప తిని నోటినుంచి తెల్లగా బురుసు వచ్చింది. రైతులు గమనించి వెంటనే వెటర్నరీ అసిస్టెంట్ డాక్టర్ విజయ్కు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని చికిత్స అందిస్తుండగానే మృతిచెందాయి. ఒక్కో లేగదూడ రూ.30 వేలుపైగా ఉంటుందని బాధిత రైతు తెలిపాడు ట్యాంక్ ఎక్కితేనే..సిగ్నల్ కడెం: 4జీ, 5జీ టెక్నాలజీ ఎంతో ముందుకెళ్తున్నా నేటికి మొబైల్ నెట్వర్క్ లేని గ్రామాలు ఉన్నాయి. మండలంలోని మారుమూల ఇస్లాంపూర్కు నెట్ వ ర్క్ లేక స్థానికులు సోమవారం ఇలా వాటర్ ట్యాంక్లు, చెట్లెక్కి సెల్ఫోన్ను వినియోగిస్తున్నారు. జూన్ 3 నుంచి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీమంచిర్యాలఅర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో యాదయ్య ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్లో వారు చదువుతున్న పాఠశాల పదోతరగతి స్కూల్కోడ్ ద్వారా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రుసుము 1 నుంచి 3 సబ్జెక్టులకు రూ.110, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులుంటే రూ.125 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అపరాధ రుసుము లేకుండా ఈనెల 15వరకు చెల్లించవచ్చని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేకాడుతూ ఐదుగురి అరెస్ట్ఆదిలాబాద్టౌన్: పట్టణంలోని లారీ అసోసియేషన్ ప్రాంతంలో పేకాడుతున్న ఐదుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలి పారు. వారి వద్ద నుంచి రూ.8800 నగదుతోపాటు పేక ముక్కలు, నాలుగు ఫోన్లు, నాలుగు బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వివాహిత అదృశ్యంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని హౌజింగ్బోర్డు కాలనీకి చెందిన వివాహిత సువర్ణ అదృశ్యమైంది. గతనెల 26న ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టూపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ దొరకలేదు. భర్త శంకర్ సోమవారం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. క్షయరహిత సమాజం కోసం కృషిచేయాలి భీమిని: క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. భీమిని పీహెచ్సీలో సోమవారం ఏర్పాటు చేసిన ఏపీఎఫ్ టీబీ యాక్టివ్ కేసు నిర్దారణ క్యాంప్ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. ఏ వయస్సు వారికై నా క్షయ లక్షణాలు ఉన్నట్లయితే గ్రామాల్లో ఆశకార్యకర్తలు, ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. అంతకుముందు 35 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇన్చార్జి వైద్యుడు అనిల్కుమార్, సీఎచ్వో జలపతి, హెల్త్ ఆసిస్టెంట్ ఉమాశంకర్, ఎల్టీ చెన్నకేశవ, ఏసీఎఫ్ వ్యాన్ టెక్నిషియన్ శ్రీకాంత్, రవికుమార్ పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
ఉట్నూర్రూరల్: గిరిజనుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా పేర్కొన్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలపై అందించిన అర్జీలను ఆమె స్వీకరించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో మాట్లాడుతూ అర్జీలను శాఖల అధికారులు పరిశీలించి న్యాయం చేయాలన్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీవో మనోహర్, ఏవో దామోదర స్వామి, ఈఈ తానాజీ, పీహెచ్వో సందీప్, డీపీవో ప్రవీన్ , జేడీఎం నాగభూషణం పాల్గొన్నారు. ● ఉట్నూర్ మండలం కమాయిపేట గ్రామానికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని భీంరావు అర్జీ అందించాడు. ● బోథ్ మండలం సాంగ్వి గ్రామానికి చెందిన రాజేశ్వరి తనకు ఆర్వోఎఫ్ఆర్ పట్టా మంజూరు కల్పించాలని విన్నవించింది. ● కుమురం భీం జిల్లా జైనూరు మండలం పాట్నాపూర్కు చెందిన ఆత్రం లత తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వేడుకుంది. ● 9 నెలలు గడిచినా వేతనాలు చెల్లించని సొల్యూషన్ విద్యాంజలి సంస్థ జిల్లా కోఆర్డినేటర్లపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో అర్జీ అందించారు. ● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా -
ట్రిపుల్ఐటీ విస్తరణ
● బాసరకు అనుబంధంగా మరో రెండుచోట్ల ఏర్పాట్లు ● ఎల్కతుర్తిలో పూర్తయిన భూసర్వే ● మహబూబ్నగర్లోనూ భూ పరిశీలన భైంసా: బాసర ట్రిపుల్ఐటీకి అనుబంధంగా మరో రెండు క్యాంపస్ల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఎల్కతుర్తిలో భూసర్వే పూర్తిచేసిన అధికారుల బృందం తాజాగా ఈనెల 3న మహబూబ్నగర్లోనూ భూములు పరిశీలించింది. బాసర ట్రిపుల్ఐటీ వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, జేఎన్టీయూహెచ్ మాజీ రిజిస్టార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ రెవెన్యూ అధికారులతో కలిసి మహబూబ్నగర్ సమీపంలోని భూములను పరిశీలించారు. 40 నుంచి 50 ఎకరాల భూములు అవసరమవుతాయని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డికి తెలిపారు. అధికార బృందంతో ఎమ్మెల్యేతో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించింది. అనుబంధంగా మరో రెండు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామీణ నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ట్రిపుల్ఐటీలను ప్రారంభించారు. నూజివీడు, ఇడుపులపాయతోపాటు బాసరలో ట్రిపుల్ఐటీలను నెలకొల్పారు. ఒక్కో క్యాంపస్లో 1500 మంది విద్యార్థులకు సీట్లు ఇచ్చి అవకాశాలు కల్పించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒకే ట్రిపుల్ ఐటీ బాసరలో మిగిలింది. ఈ క్యాంపస్కు అనుబంధంగా మరో రెండు ట్రిపుల్ఐటీల ప్రారంభంపై ప్రభుత్వం దృష్టిసారించింది. కొత్త ప్రభుత్వం రావడంతోనే.. గత పదేళ్లపాటు కేసీఆర్ హయాంలో ఒకే ట్రిపుల్ఐటీ ఉండగా, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొత్త క్యాంపస్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. గత ఎన్నికల ప్రచారంలో నాలుగు ట్రిపుల్ఐటీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇందులోభాగంగా ఇప్పటికే ఎల్కతుర్తి, మహబూబ్నగర్లో భూసర్వేలు పూర్తిచేసింది. త్వరలోనే ఖమ్మం, నల్గొండలోనూ మరో రెండు క్యాంపస్ల ఏర్పాట్లపై దృష్టిసారించింది. పెరుగనున్న సీట్లు రాష్ట్రంలో ఉన్న ఏకై క ట్రిపుల్ఐటీ బాసరలో ఏటా ప్రవేశాల సమయంలో వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. ఆరేళ్ల ఇంజినీరింగ్ విద్యావిధానంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు ప్లేస్మెంట్లతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులకు ట్రిపుల్ఐటీలో చేర్పించాలన్న కోరిక పెరుగుతుంది. తాజాగా రెండుచోట్ల కొత్త క్యాంపస్లు ఏర్పాటు చేయనుండడంతో 3 వేల సీట్లు పెరగనున్నాయి. రెండు కొత్త క్యాంపస్లు ప్రారంభమైతే బాసరతోపాటు అనుబంధంగా ఏర్పడే ఎల్కతుర్తి, మహబూబ్నగర్ ట్రిపుల్ఐటీల్లో ప్రతిఏటా 4500 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం దక్కుతుంది. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు కొత్త క్యాంపస్లు ఎంతో మేలు చేయనున్నాయి. బాసర ట్రిపుల్ఐటీ నివేదించాం మహబూబ్నగర్ సమీపంలో ట్రిపుల్ఐటీ ఏర్పాటు కోసం భూములు పరిశీలించాం. గత మూడు నెలల క్రితం ఎల్కతుర్తిలో భూములను పరిశీలించాం. బాసరకు అనుబంధంగా కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఆ మేరకు భూములు పరిశీలించి సర్కారుకు నివేదించాం. – గోవర్ధన్, ట్రిపుల్ఐటీ వీసీ, బాసర -
ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం
తానూరు: మండలంలోని ఉమ్రి(కే) గ్రామంలో సోమవారం ప్రమాదవశాత్తు పశువుల పాక దగ్ధమైంది. తహసీల్దార్ లింగమూర్తి, బాధిత రైతు నర్సింగ్ తెలిపిన వివరాలు.. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో రైతులు సాయంత్రం గడ్డి కుప్పలకు నిప్పంటించారు. వీస్తున్న గాలికి నిప్పురవ్వలు పశువుల పాకలో గడ్డికి అంటుకోవడంతో నిల్వ ఉంచిన పశుగ్రాసంతోపాటు పనిముట్లు కాలి పోయాయి. గ్రామస్తులు అందించిన సమాచారంతో తహసీల్దార్ లింగమూర్తి, ట్రైయినీ ఎస్సై నవనీత్రెడ్డి, అగ్రిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలార్పివేశారు. ప్రమాదంలో రూ.40 వేల ఆస్తినష్టం వాటిల్లిందని తహసీల్దార్ తెలిపారు. వరి పంట దగ్ధం నర్సాపూర్(జి): మండలంలోని రాంపూర్కు చెందిన రైతు నసీరాబాద్ శివారులో సాగు చేస్తున్న వరి పంట సోమవారం ప్రమాదవశాత్తు దగ్ధమైంది. పొలంలో 11 కేవీ వైరు తెగిపడి నిప్పు రాజుకోవడంతో 5 గుంటల వరి దగ్ధమైనట్లు బాధిత రైతు తెలిపాడు. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత, నీట్లో ర్యాంక్ రాదోనని బెంగతో యువకుడు ఉరేసుకున్నారు. మద్యానికి బానిసైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానాస్పద స్థితిలో వివాహిత.. ఉట్నూర్రూరల్: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగాపూర్కు చెందిన సంజీవ్ మూడో కుమార్తె సుప్రియ(22)ను ఐదేళ్ల క్రితం ఉట్నూర్ మండలం పాత ఉట్నూర్కు చెందిన జాడి రాధాకృష్ణతో వివాహమైంది. వీరికి ఓ పాప(4) సంతానం. రాధాకృష్ణ కూలీ పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా వరకట్నం తేవాలని భార్యను మానసికంగా వేధించసాగాడు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి మనస్తాపంతో చీరతో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన భర్త, బంధువుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త బంధువులు ఈ విషయాన్ని సుప్రియ తల్లిదండ్రులకు చెప్పారు. బంధువులతో కలిసి వారు అక్కడికి చేరుకుని రోదించారు. తన కూతురిని అల్లుడు కొట్టి హత్య చేసి ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. తండ్రి ఫిర్యాదుతో సోమవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోగిలి తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. నీట్లో ర్యాంక్ రాదనే బెంగతో యువకుడు.. ఉట్నూర్రూరల్: నీట్లో ర్యాంక్ రాదనే బెంగతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ మోగిలి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డులో గంగాధర్కు ఏకై క కుమారుడు మనోజ్ (18) ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్ష కోసం లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల రాసిన నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ రాదేమోనని బెంగతో సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. వైద్యులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుమారుడు డాక్టర్ కావాలని ఆశయంతో కష్టపడి చదివిస్తే అప్పుడే నూరేళ్లు నిండాయని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. పరీక్షల్లో ఫెయిల్, ర్యాంక్ రావని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని మళ్లీ సాధిస్తామని మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చవద్దని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మద్యానికి బానిసై యువకుడు.. ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్రూరల్ మండలం అంకోలికి చెందిన యువకుడు పుట్ట భవన్ (25) మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం పట్టణంలో పురుగుల మందు తాగి పడిపోగా, స్థానికులు గమనించి రిమ్స్కు తరలించారు. రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
వేమనపల్లి: మండలంలోని ముల్కలపేట మత్తడివాగు నుంచి ఎలాంటి అనుమతి లే కుండా రాత్రివేళ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను సోమవారం వేకువజామున పట్టుకున్న ట్లు నీల్వాయి ఎస్సై శ్యాంపటేల్ తెలిపారు. ట్రాక్టర్లను పోలీసుస్టేషన్కు తరలించారు. కేతన్పల్లికి చెందిన ట్రాక్టర్ యజమానులు గురుండ్ల సంతోష్, చెన్నూరి సాలయ్య, డ్రైవర్ టకిరే పున్నంలపై కేసు నమోదు చేశామన్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ప్రాణహిత నది, ఇతర వాగుల్లో నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కృషి
● కలెక్టర్ కుమార్ దీపక్మంచిర్యాలటౌన్: జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ కుమార్ దీ పక్ తెలిపారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రా వుతో కలిసి మంచిర్యాలలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.16.06 కోట్ల తో ఆరు వరుసల రహదారి, రూ.1.57 కోట్లతో రంగంపేట్లో డ్రెయినేజీ, రోడ్లు, రూ.65 లక్షలతో బృందావనంలో డ్రెయినేజీ, రూ.2.91 కోట్లతో రాజ రాజేశ్వరి కాలనీలో రోడ్లు, రూ.2.70 కోట్లతో సూర్యనగర్లో డ్రెయినేజీ, రూ.2 కోట్లతో హమాలీవాడ నుంచి తిలక్నగర్ వరకు డ్రెయినేజీ, రూ.3.37 కోట్లతో రాజీవ్నగర్లో రోడ్లు, రూ.2 కోట్లతో దొరగారిపల్లెలో డ్రెయినేజీ పనులు ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మంచిర్యాలను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తామని తెలి పారు. ఐబీ చౌరస్తా నుంచి శ్రీనివాస గార్డెన్ వరకు హైదరాబాద్–కరీంనగర్–చాందా రహదారిపై 251/9 నుంచి 255/7 వరకు బీటీ రహదారితో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని పేర్కొన్నారు. పట్టణంలో రోడ్లు, డ్రెయినేజీలతో రవాణా సౌకర్యం మెరుగవుతాయని వివరించారు. రోడ్లు భవనాల శాఖ ఈఈ భవర్సింగ్, కమిషనర్ శివాజీ పాల్గొన్నారు. -
‘నమో భారత్’కు మోక్షమెప్పుడో?
● సిర్పూర్ కాగజ్నగర్–హైదరాబాద్ మార్గంలో నడపాలంటున్న ప్రయాణికులు బెల్లంపల్లి: రైల్వే శాఖ ఆధునికీకరించిన నమో భారత్ ర్యాపిడ్ రైలుపై ప్రయాణికులు గొప్ప ఆశలు పెట్టుకున్నారు. సిర్పూర్ కాగజ్నగర్–హైదరాబాద్ మధ్య ఈ రైలును నడపాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఆధునిక సౌకర్యాలతో తయారైన ఈ రైలును రాష్ట్ర రాజధానిని ముఖ్య నగరాలతో అనుసంధానం చేయడానికి రూపొందింది. ఆధునిక సౌకర్యాలు..నమో భారత్ ర్యాపిడ్ రైలు, గంటకు 130 కి.మీ. వే గంతో 300–350 కి.మీ. దూరం ప్రయాణించే సా మర్థ్యం కలిగి ఉంది. 12–16 ఏసీ చైర్కార్లతో, ఆటోమేటిక్ తలుపులు, ఆధునిక సౌచాలయాలు, చార్జింగ్ పోర్టులు, కవచ్ భద్రతా వ్యవస్థ వంటి సౌకర్యాలు ఈ రైలును ప్రత్యేకం చేస్తాయి. గుజరాత్, బీహా ర్లో ఇప్పటికే నడుస్తున్న ఈ రైలును తెలంగాణలో ప్రవేశపెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. సిర్పూర్–హైదరాబాద్ మార్గంలో నడపాలని..సిర్పూర్ కాగజ్నగర్–సికింద్రాబాద్ మధ్య భాగ్యనగర్, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రెండు రైళ్ల మధ్య 7 గంటల వ్యవధి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంది. నమో భారత్ రైలును ఈ రెండింటి మధ్యలో భాగ్యనగర్ తర్వాత నడిపితే ప్రయాణ సౌలభ్యం పెరుగుతుందని ప్రయాణికులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, కాజీపేట, జనగాం, భువనగిరి వంటి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించాలని కోరుతున్నారు. పుష్కరకాలంగా నిరీక్షణ..పుష్కర కాలంగా సికింద్రాబాద్–సిర్పూర్ కాగజ్నగర్ మార్గంలో కొత్త రైళ్లు ప్రవేశపెట్టకపోవడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన రైళ్లు తప్పా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ హయాంలో ఈమార్గంలో పట్టాలెక్కిన కొత్త రైలు లేదు. 90% మూడో రైల్వేలైన్ పూర్తయినా, కొత్త రైళ్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దపల్లి, ఆదిలాబాద్ ఎంపీలు గడ్డం వశీకృష్ణ, గొడెం నగేశ్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు ఈ రైలు ప్రవేశపెట్టేందుకు కృషి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. అన్ని ముఖ్య స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే, రైల్వే ఆదాయంతోపాటు ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. -
● రూ.కోట్లలో పెండింగ్.. నో గ్యారంటీ ● కొత్తగా ఐదు మిల్లులకు ట్యాగింగ్ ● పూర్తి స్థాయిలో రికవరీ కాకుండానే కేటాయింపులు
మంచిర్యాలఅగ్రికల్చర్: రూ.కోట్లు బకాయి ఉన్న రైస్మిల్లులకే మళ్లీ ధాన్యం కేటాయింపు జరుగుతోంది. బకాయితోపాటు బ్యాంకు గ్యారంటీ ఇవ్వకుండానే ధాన్యం తరలిపోతోంది. ఇప్పటికే ముప్పుతిప్పులు పెడుతున్న మిల్లర్లు సీఎంఆర్ ఏ మేరకు ఇస్తారనే సందేహం వ్యక్తమవుతోంది. ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి గత నెల 29వరకు 11 రైస్మిల్లులకు ట్యాగింగ్ ఇవ్వగా.. 30న మరోసారి ఐదు మిల్లులకు ట్యాగింగ్ వచ్చింది. ఈ ఐదింటిలో నాలుగు గతంలో ధాన్యం దించుకుని సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ఇవ్వని, యాక్షన్ ధాన్యానికి సంబంధించి పెండింగ్ బకాయి చెల్లించనివి ఉన్నాయి. అయినా మళ్లీ ధాన్యం కేటాయించ డం గమనార్హం. జిల్లాలో 2022–23 యాసంగి నుంచి 2023–24 వానాకాలం సీజన్ల సీఎంఆర్ ధాన్యం తీసుకుని రూ.కోట్లు విలువైన బియ్యం ఇవ్వకుండా, యాక్షన్ ధాన్యానికి సంబంధించిన నగదు చెల్లించకుండా పౌరసరఫరాల శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు ఉన్నారు. వీరికి సీఎంఆర్ ధాన్యం కేటాయించొద్దని, బ్లాక్లిస్టులో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. నోటీసులూ జారీ చేశారు. జిల్లాలో ఒకరిద్దరిపై ఆర్ఆర్ యాక్టు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. కానీ ఇటీవల పలువురు మిల్లర్లు దొడ్డిదారిన సీఎంఆర్ ధాన్యం కేటాయింపులు చేసుకుంటున్నారు. జన్నారం, హాజీపూర్, మందమర్రి ప్రాంతాల్లో బ్లాక్లిస్టులో ఉన్న పూర్తి స్థాయిలో బకాయి చెల్లించని మిల్లర్లకు ధాన్యం కేటాయించారు. జిల్లాలో ఇంకా బాయిల్డ్ రైస్మిల్లులు ఉన్నా బకాయిలు చెల్లించకపోవడంతో ధాన్యం కేటాయించలేదు. కొన్నింటికి మాత్రమే నాలుగు రోజుల క్రితం అనుమతి లభించింది. ఇంకా రూ.85కోట్లు పెండింగ్2022–23 సీజన్లో గోదాముల్లో నిల్వ చేసిన ధా న్యానికి తాము ఎందుకు నగదు చెల్లించాలని, మి ల్లు పేరిట కేటాయించి ధాన్యం తీసుకోకపోయినా నగదు చెల్లించాలనడం ఏమిటని కొందరు మిల్లర్లు ఉన్నతాధికారుల వద్ద వేడుకోవడంతో కొంత వెసులుబాటు కల్పించినట్లు తెలుస్తోంది. జిల్లాలో బా యిల్డ్ రైస్మిల్లులు 19, రా రైస్మిల్లులు 35 ఉన్నా యి. రెండు సీజన్ల సీఎంఆర్ ఇవ్వకపోవడం, తనిఖీ ల్లో ధాన్యం నిల్వలు లేకపోవడాన్ని గుర్తించారు. సీఎంఆర్, యాక్షన్ ధాన్యానికి సంబంధించి రూ.138.78 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం యాసంగి సీజన్ ధాన్యం దక్కించుకునేందుకు ట్యాగింగ్ కోసం అధికారులపై ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఓ మిల్లర్ రూ.11కోట్ల మేర బకాయి ఉన్నా పలుకుబడి, కొంత నగదు చెల్లించి ట్యాగింగ్ తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. కొందరు గత నెల 21న బకాయిలో 10 నుంచి 30శాతం చెల్లించి మిగతా బకాయిలు వారం పది రోజుల్లో చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా రూ.85కోట్లు బకాయి రావాల్సి ఉంది. ఇందులో ఒక మిల్లు బకాయి మొత్తం చెల్లించగా.. నాలుగు మిల్లులు రూ.కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు బ్యాంకు గ్యారంటీ కూడా ఇవ్వలేదు. నిబంధనల ప్రకారం బకాయిలు లేని మిల్లులు పది శాతం గ్యారంటీ, పాత బకాయి మరో 20శాతం అదనంగా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు బ్యాంకు గ్యారంటీ లేకుండానే ధాన్యం కేటాయింపులు నడుస్తున్నాయి. జిల్లాలో ఓ మిల్లు ఎదుట బారులుతీరిన ధాన్యం లారీలుధాన్యం దక్కించుకునేందుకు..సీఎంఆర్ ధాన్యం కేటాయింపులకు అనర్హులుగా గుర్తించిన వారు తిరిగి ధాన్యం దక్కించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా రాష్ట్ర కమిషనరేట్, కలెక్టరేట్ అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఓ మిల్లర్ తనకున్న పలుబడితో ఎలా కేటాయించరో చూస్తానని సవాల్ చేసి మరీ దక్కించుకున్నట్లు చర్చ జరుగుతోంది. పెద్ద పెద్ద మిల్లర్లు కొందరు మూలకు పడిన, వివిధ కారణాలతో ఆగిన మిల్లులను అద్దెకు తీసుకుని ధాన్యం కేటాయింపులు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలోనూ కొందరు అక్రమార్కులు ఇదే పద్ధతిలో కేటాయింపులు చేయించుకున్న సంఘటనలు ఉన్నాయి. కొందరు అధికారుల సహకారం వల్లే కేటాయింపులు జరిగినట్లు గతంలో మిల్లర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. హాజీపూర్, బెల్లంపల్లి మండలాల్లో రెండు రైస్మిల్లులు అద్దెకు తీసుకుని ఓ మిల్లు యజమాని గతంలో సీఎంఆర్ ధాన్యం తీసుకుని బియ్యం ఇవ్వకుండా రూ.కోట్లలో ప్రభుత్వానికి మొండి చేయి చూపడంతో క్రిమినల్ కేసు నమోదై జైలుకు వెళ్లారు. గడువు తీసుకున్న తర్వాతే.. పాత బకాయి ఉన్న మిల్లులు కొంత మేర చెల్లించిన వారితోపాటు మిల్లర్ల ప్రాపర్టీ, ఇతర ష్యూరిటీలు, పాత బకాయి చెల్లింపునకు గడువు తీసుకున్న తర్వాత ధాన్యం కేటాయిస్తున్నాం. ధాన్యం కేటాయింపు కలెక్టర్ నిర్ణయం మేరకే జరుగుతుంది. – శ్రీకళ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ -
ఓంకార్ శతజయంతి పోస్టర్లు విడుదల
బెల్లంపల్లి: ఎంసీపీఐ(యూ)వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ శతజ యంతి ఉత్సవాల పోస్టర్ను బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదివారం ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ.. ఓంకార్ ప్రజల పక్షాన అనేక పోరా టా లు చేశారన్నారు. తన జీవితాన్నీ ప్రజలకు అంకితం చేసిన నాయకుడని పేర్కొన్నారు. ఓంకార్ శతజయంతి ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేశ్, పట్టణ కార్యదర్శి రమేశ్, మండల కార్యదర్శి సతీశ్, నాయకులు పాల్గొన్నారు. -
భగీరథ మహర్షి జయంతి
పాతమంచిర్యాల: కలెక్టరేట్లో జిల్లా వెనుకబ డిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆ దివారం భగీరథ మహర్షి జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ హాజరై భగీరథ మహర్షి చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. సగరుని ముని మనువడు అయిన భగీరథుడు తపస్సు చేసి గంగను భూమికి తీసుకువచ్చాడని చరిత్ర చెబుతుందన్నారు. ఈ సందర్భంగా సగర కు లస్థులు భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్, జిల్లా సంక్షేమ అఽధికారి రవూఫ్ఖాన్, సాంఘిక సంక్షేమ అధికారి రవీందర్రెడ్డి, ఈడీ దుర్గాప్రసా ద్, జిల్లా రవాణా అధికారి సంతోష్కుమార్, డీఆర్పీలు పాల్గొన్నారు. -
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
భీమారం: ప్రకృతి ప్రకోపానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మండలంలోని పోతన్పల్లి, బూర్గుపల్లి, నర్సింగాపూర్, కాజిపల్లి గ్రామాల్లో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ‘మాకు రెండెకరాల పొలం ఉంది. మరోఐదెకరాలు కౌలుకు తీసుకుని వరిసాగు చేశాం. కోతకు వచ్చిన సమయంలో ఈదురుగాలులుతో కురిసిన వర్షానికి పంట మొత్తం నేలమట్టమైంది. మీరే ఆదుకోవాలి’ అని పోతన్పల్లి గ్రామానికి చెందిన మహిళా రైతు జర్పుల స్వరూప ఎమ్మెల్యే ఎదుట బోరున విలపించింది. అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. ప్రభుత్వం ఆదుకోకపోతే చావే శరణ్యమని కన్నీరు పెట్టుకుంది. ఇంత నష్టం జరిగినా అధికారులు ఎలాంటి సర్వేలు చేయలేదని పలువురు రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన వివేక్ వెంటనే కలెక్టర్ కుమార్ దీపక్కు ఫోన్ చేశారు. పంట నష్టం సర్వే చేయాలని సూచించారు. అనంతరం బాధిత రైతులకు ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు. 35 శాతం కన్నా ఎక్కువ దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపారు. నష్టపోయిన రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు పంటలను ప్రత్యక్షంగా చూపి వారి వద్ద పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఇళ్లకు జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో సర్వే జరిపి బాధితుల పేర్లు కలెక్టర్కు అందించాలని తహసీల్దార్ సదానందంను ఎమ్మెల్యే ఆదేశించారు. మామిడి పంటలు కూడా దెబ్బతిన్నాయని రైతులు ఎమ్మెల్యేకు తెలిపారు. ● చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి -
డప్పు కళాకారుడికి అవార్డు
జన్నారం: మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన డప్పు కళాకారుడు కొండుకూరి రాజుకు గద్దరన్న ఐకాన్–2025 అవార్డు లభించింది. హైదరాబాదులోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, సాంస్కృతిక సారధి చైర్పర్సన్ వెన్నెల, తెలంగాణ జేఏసీ నా యకుడు కవి గాయకుడు దరువు అంజన్న పాల్గొన్నారు. అవార్డులు ప్రదానంచేసి సత్కరించారు. కొండుకూరి రాజు అతిథుల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నాగరాజుకు.. మందమర్రిరూరల్: మందమర్రి పట్టణానికి చెందిన ధూంధాం కళాకారుడుడు అంతడుపు ల నాగరాజుకు సాయిఅలేఖ్య సాంస్కృతిక సంఘ సేవా సంస్థ వారు గద్దర్ ఐకాన్ అవా ర్డు 2025ను ప్రదానం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అవార్డు అందుకున్నారు. -
● బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో సందడి ● గత నెల 28న మార్కెట్ ప్రారంభం ● రైతులకు తగ్గిన రవాణా భారం ● కమీషన్ ఏజెంట్లతో కొనుగోళ్లు చేస్తున్న నాగ్పూర్ వ్యాపారులు ● బాక్స్ల్లో ఇతర ప్రాంతాలకు ఎగుమతి
బెల్లంపల్లి: బెల్లంపల్లి మ్యాంగో మార్కెట్లో మామిడికాయల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్ గత నెల 28న మార్కెట్ను లాంఛనంగా ప్రారంభించగా చిన్న, సన్నకారు రైతులు మార్కెట్లో మామిడికాయల అమ్మకాలు సాగిస్తున్నారు. రోజువారీగా క్వింటాళ్ల కొద్ది మామిడికాయలు మ్యాంగో మార్కెట్ను ముంచెత్తుతున్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న దశేరి, బంగెనపల్లి, హిమాయతి, మల్లిక, తోతపురి తదితర రకాల మామిడి కాయలు లభిస్తున్నాయి. స్థానిక ట్రేడర్స్తో పాటు నాగ్పూర్కు చెందిన బడా వ్యాపారులు కొందరు కమీషన్ ఏజెంట్లను పంపించి కాయల కొనుగోళ్లు చేపడుతున్నారు. కొనుగోలు చేస్తున్న మామిడి కాయలను మార్కెట్లో కూలీలతో గ్రేడింగ్ చేయించి బాక్స్ల్లో ప్రత్యేకంగా ప్యాకింగ్ చేయించి నాగ్పూర్, అమరావతి, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అమ్మకం, కొనుగోలు దారులతో మ్యాంగో మార్కెట్ సందడిగా మారింది. స్థానికంగా మామిడి కొనుగోళ్లు జరుగుతుండటంతో రైతాంగానికి రవాణా భారం గణనీయంగా తగ్గింది. దళారుల ప్రమేయం లేకుండా.. మామిడి రైతులు దశాబ్దాల నుంచి మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్కు తీసుకెళ్లి మామిడి కాయల అమ్మకాలు సాగించేవారు. అక్కడ బడా వ్యాపారులు, దళారులు కుమ్మకై ్క మద్దతు ధర దక్కకుండా చేసి రైతులను తీవ్రంగా వంచించేవారు. మార్కెట్ ఆవరణలోకి మామిడికాయలతో అడుగు పెడితే చాలు మద్దతు ధర రాకున్నా అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. మార్కెట్కు శిస్తు కట్టడంతో పాటు పంట ఉత్పత్తులు అమ్మి పెట్టినందుకు దళారికి కమిషన్ చెల్లించుకోవాల్సి వచ్చేది. కానీ బెల్లంపల్లి మార్కెట్లో దళారుల ప్రమేయం లేకుండా, మోసాలకు తావులేకుండా పంటను అమ్ముకునే సౌకర్యం కలిగింది. మద్దతు ధర లేకుంటే పంటను మరోప్రాంతానికి తీసుకెళ్లి అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. సౌకర్యాలు అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ మామిడి కాయల క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మ్యాంగో మార్కెట్కు కళ వచ్చింది.మామిడి కాయలను తూకం వేస్తున్న సిబ్బందిమార్కెట్లో కాయలను గ్రేడింగ్ చేస్తున్న కూలీలు గత ఆరురోజుల్లో మామిడికాయల విక్రయాల వివరాలు.. మార్కెట్కు అమ్మకానికి వచ్చిన మామిడికాయలు 3,000 క్వింటాళ్లు చెల్లించిన మద్దతు ధర రూ.21,000 (కనిష్టం), రూ.53,000 (గరిష్టం) అమ్మకానికి తెస్తున్న మామిడి రకాలు దశేరి, బంగెనపల్లి, హిమాయతి, మల్లిక, తోతపురి పంట అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు 165 మందిమద్దతు ధర కల్పించాలి మామిడి తోటలపై ఎన్నో ఆశలు పెంచుకున్న రైతులకు ఏటా మద్దతు ధర దక్కడం లేదు. వ్యాపారులు, దళారులు మోసం చేస్తున్నారు. అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురిసి పంట నేలపాలై నష్టపోతున్నాం. మరోవైపు మద్దతు ధర రాక మరిన్ని కష్టాలు అనుభవిస్తున్నాం. రైతులు నష్టాల పాలు కాకుండా మామిడికి గిట్టుబాటు ధర దక్కేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – రాజన్న యాదవ్, రైతు, పొట్యాల కోరిక నెరవేరింది.. మ్యాంగో మార్కెట్ ప్రారంభం కావడం సంతోషంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్లకు మా కోరిక నెరవేరింది. ఇప్పటివరకు నాగ్పూర్కు పంటను తీసుకెళ్లి నష్టాల పాలయ్యాం. రవాణా చార్జీలు భారంగా ఉండేవి. కానీ ప్రస్తుతం బెల్లంపల్లి మార్కెట్ ఆ బాధలు తప్పాయి. నాగ్పూర్ మార్కెట్ కన్నా బెల్లంపల్లి మార్కెట్ చాలా నయం.– బాబా, గుత్తేదారు, బెల్లంపల్లి -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44పై మన్నూర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రంలోని నౌవాడకు చెందిన దీపక్ (25), మిత్రుడు నితీశ్ ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి మోటార్ సైకిల్పై నాగ్పూర్వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని మన్నూర్ జాతీయ రహదారి పక్కన నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ప్రమాదంలో దీపక్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన నితీశ్ను పోలీసులు అంబులెన్సులో రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. -
తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని పూలాజీబాబానగర్లో మండాలి బక్కన్న ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్సై, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని పూలాజీబాబా నగర్కు చెందిన మండాలి బక్కన్న కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లాడు. రాత్రి 10.30 గంటలకు వచ్చి చూడగా, ఇంటి తలుపు తీసి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి రెండు తులాల బంగారం, రూ.లక్ష 50వేల నగదు దొంగతనం చేసినట్లు గుర్తించారు. దొంగలు ఇంటి వెనుకవైపు ఉన్న కిటికీ నుంచి పారిపోయారని తెలిపారు. ఎస్సై సాయన్న అక్కడికి చేరుకొని ఘటన స్థలాన్ని పరిశీలించారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందం రప్పించి దర్యాప్తు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పాఠశాలల అభివృద్ధికి ‘కడేర్ల’ సూచనలు
కెరమెరి(ఆసిఫాబాద్): ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కడేర్ల రంగయ్య పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సూచనలు, సలహాలు ఇచ్చారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీఐలో గత మూడు రోజులుగా 33జిల్లాల డీఈవోలకు శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని హెచ్ఎంలకు పాఠశాలల అభివృద్ధిపై మాట్లాడేందుకు అవకాశం కల్పించగా.. అందులో రంగయ్య ఒకరు కావడం గమనార్హం. ఆదివారం ఆయన బడిలో విద్యార్థుల సంఖ్యను 55నుంచి 200కు పెంచడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, డిజిటల్ తరగతులు, పదేళ్లుగా ఉచితంగా తన సతీమణి కడేర్ల వీణ విద్యాబోధన చేయడం, సూపర్ 100 విద్యార్థులతో విద్యాబోధన, ఎఫ్ఎం సావర్ఖేడా రేడియో స్టేషన్ ఏర్పాటు, పాఠశాల అభివృద్ధికి సొంతంగా రూ.లక్ష, గ్రామస్తులు, తల్లిదండ్రులు, దాతల విరాళాల సేకరణ, గ్రామంలో మద్యపాన నిషేధం కోసం ధర్నా చేపట్టడం, రంగయ్యను ప్రేరణాత్మక కథనంతో పోల్చి ‘సర్’ చిత్ర నిర్మాతలు రూ.3లక్షలు విరాళం అందజేయడం తదితర అంశాలను పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమాలపై పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి యోగితారాణా, జేడీ రాజీవ్, ఆర్జేడీ సత్యనారాయణ తదితరులు రంగయ్యను అభినందించారు. పాఠశాలల అభివృద్ధికి మీ అనుభవాలు, సేవలు ఎంతో అవసరమని కొనియాడారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరం కార్యక్రమానికి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసవి క్రీడా శిబిరాలు నిర్వహిస్తుందన్నారు. మే 1 నుంచి 31వరకు ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. క్రీడా శిబిరాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత చెడు వ్యసనాలు గుట్కా, మద్యానికి దూరంగా ఉండాలన్నారు. అనంతరం గ్రామస్తులు, యువత, మహిళల ఆధ్వర్యంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షిషాలను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సలోని చావ్ల, తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో జీవన్రెడ్డి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, పార్థసారథి, గ్రామ పటేల్ వెంకట్రావ్, బాదిరావ్, ఆనంద్రావ్ తదితరులు ఉన్నారు. -
చేపల వల చుట్టుకొని జాలరి మృతి
సోన్: చేపల వేటకు వెళ్లి వల చుట్టుకుని జాలరి మృతి చెందిన ఘటన గాంధీనగర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన సాలోకె బసవరాజ్ (47) శుక్రవారం రోజూ మాదిరి తెప్ప తీసుకుని చేపలు పట్టడానికి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులోకి వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ఆరా తీశారు. ఈక్రమంలో శనివారం ప్రాజెక్టు నీళ్లలో కాళ్లకు చేపల వల చుట్టుకొని ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు గుర్తించారు. బసవరాజ్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై కే.గోపి తెలిపారు. బసవరాజ్కు ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. జంట ఆత్మహత్యాయత్నంఆదిలాబాద్టౌన్: పట్టణంలోని సీసీఐ టౌన్షిప్లో ఓ జంట గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గడ్చందాకు చెందిన ఓ యువతి, బాలరాజు ఇదివరకే ప్రేమించుకున్నారు. గతేడాది నవంబర్లో బాలరాజు పెళ్లికి నిరాకరించగా లోకేశ్వరం పోలీస్స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి బాలరాజును రిమాండ్కు తరలించారు. నెల రోజులపాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండి బెయిల్పై బయటకు వచ్చాడు. ఇదిలా ఉండగా ఆ యువతికి నాలుగు రోజల క్రితం మామడ మండలం బండల ఖానాపూర్కు చెందిన యువకుడితో వివాహం జరిగింది. శనివారం తల్లిగారింటి నుంచి అత్తగారింటికి వెళ్లే క్రమంలో నిర్మల్ పట్టణానికి చేరుకున్నాక తనకు పని ఉందని కొద్దిసేపు ఇక్కడే ఉండమని భర్తకు చెప్పి అక్కడి నుంచి ప్రియుడితో కలిసి ఆదిలాబాద్కు వచ్చింది. పట్టణంలోని సీసీఐ టౌన్షిప్లో సాయంత్రం నాలుగు గంటలకు వెంట తెచ్చుకున్న గడ్డిమందును ఇద్దరు కలిసి తాగారు. అక్కడే ఉన్న పోలీసు సిబ్బంది వారిని గమనించి 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయమై వన్టౌన్ సీఐ సునీల్కుమార్ను సంప్రదించగా.. జంట ఆత్మహత్యకు యత్నించగా రిమ్స్లో చేర్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉందన్నారు. ‘దేశవ్యాప్త సమ్మెతో కేంద్రానికి గుణపాఠం చెప్పాలి’రెబ్బెన(ఆసిఫాబాద్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేలా ఈనెల 20న జరగబోయే సమ్మెను కార్మికులంతా విజయవంతం చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు అంబాల ఓదెలు, రాజశేఖర్లు పిలుపునిచ్చారు. శనివారం గోలేటి టౌన్షిప్లోని జీఎం కార్యాలయంలో ఇన్చార్జి జీఎం నరేందర్కు సమ్మె నోటీసు అందజేశారు. వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్గా మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా తయారు చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న దేశ వ్యాప్త సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిందన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు కోల్పోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెల రోజుల్లోనే కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. నాయకులు ధన్రాజ్, గోపాల్, ప్రభాకర్, కాంట్రాక్టు కార్మికులు శారద, అనిత తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
మంచిర్యాలఅర్బన్: ఆర్టీసీ ఉద్యోగులను ప్ర భుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు పరిష్కరించాలని టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ముఖ ద్వారం వద్ద ఈ నెల 7న ఆర్టీసీలో తలపెట్టిన సమ్మె వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ డిపో కన్వీనర్ గోలి శంకర్, కో–కన్వీనర్ సేని తిరుపతి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నలుగురికి కమిషనర్లుగా పదోన్నతి
మంచిర్యాలటౌన్: మున్సిపాలిటీల్లో వివిధ వి భాగాల అధికారులకు కమిషనర్లుగా పదోన్న తి కల్పిస్తూ సీడీఎంఏ డైరక్టర్ శ్రీదేవి శనివా రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు చెందిన నలుగురికి మున్సిపల్ కమిషనర్లుగా పదో న్నతి లభించింది. మంచిర్యాల కార్పొరేషన్ మేనేజర్ కె.విజయ్కుమార్, సానిటరీ సూపర్వైజర్ రాజమనోహర్, మందమర్రి మున్సి పల్ మేనేజర్ నాగరాజు, సానిటరీ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్ కమిషనర్లుగా పదోన్నతి పొందారు. ప్రస్తుతం వీరికి ఏ మున్సిపాలిటీని కే టాయించకపోయినా, త్వరలోనే వివిధ ము న్సిపాలిటీలకు కమిషనర్లుగా వెళ్లనున్నారు. -
విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
● కలెక్టర్ కుమార్ దీపక్ ● కేజీబీవీలో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం నస్పూర్: ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. పట్టణ పరిధిలో కేజీబీవీలో శనివారం ఆయన జిల్లా స్థాయి వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానంతోపాటు వినోదాన్ని పాఠ్య, పాఠ్యేతర అంశాలను నేర్చుకోవడానికి వేసవి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయ కర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఎంఈఓ దామోదర్రావు, స్పెషల్ ఆఫీసర్ మౌనిక, తదితరులు పాల్గొన్నారు. రైతుల సౌకర్యార్థం లారీల సంఖ్య పెంపు మంచిర్యాలఅగ్రికల్చర్: వరిధాన్యం తరలింపునకు అవసరమైన లారీల సంఖ్యను పెంచుతామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్లో కలిసి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సెక్టార్–1, 2, 3, 4 ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రైస్మిల్లులకు ధాన్యం సరఫరాలో జాప్యం జరగకుండా లారీ సంఖ్య పెంచే విధంగా ట్రాన్స్ఫోర్ట్ యజమానులు సహకరించాలని తెలిపారు. జిల్లాలోని రైస్మిల్లులో దిగుమతి ఆలస్యం అవుతున్నట్లయితే కరీంనగర్కు తరలించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, ట్రాన్స్ఫోర్ట్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ మంచిర్యాలఅగ్రికల్చర్: శ్రీమతి దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ హైదరాబాద్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ ప్రకటనలో తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన, నిరుపేద, అణిచివేతకు గురైన, ఇతర బాధిత బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ ఇంజినీరింగ్ విభాగాల్లో కేటాయించిన సీట్లలో రిజర్వేషన్ కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ నెల 17లోగా జిల్లా కేంద్రంలోని జిల్లా బాలల సంరక్షణ విభాగం బాలరక్షా భవన్, 9908541697, 9441506519 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. -
మద్యపానం బహిరంగమే..!
మంచిర్యాలక్రైం: బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీసులు నిషేధం విధిస్తున్నా ఎక్కడా అమలు కు నోచుకోవడం లేదు. శనివారం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని హమాలీవాడ వైన్షాపు వద్ద రైల్వేట్రాక్ పక్కన ఓ యువకుడు బహిరంగంగానే మద్యం సేవిస్తూ కనిపించాడు. పట్టపగలే ఓ వైన్స్షాపులో కొందరు యువకులు మద్యం సేవించి రోడ్డుపైకి వచ్చి గొడవ పడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించకూడదనే ఉద్దేశంతో ఎకై ్సజ్ శా ఖ ఉన్నతాధికారులు మద్యం దుకాణంతోపాటు సి ట్టింగ్కు అనుమతి ఇస్తున్నారు. కానీ కొందరు మ ద్యంప్రియులు రాత్రి, పగలు తేడా లేకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్నారు. మంచిర్యాలలో రాత్రి 9గంటలు దాటితే చాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గోదావరి సమీపంలో, హైటెక్ సిటీ, ఏసీ సీ క్వారీ రోడ్, గ్రీన్ సిటీ, తిలక్నగర్, రాజీవ్నగర్, హైటెక్ సిటీ క్లబ్ సమీపంలో మందుబాబులకు అ డ్డాగా మారాయి. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానా న్ని పోలీసులు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
రెండు నెలల్లో కొత్త కోర్టు భవనం
బెల్లంపల్లి: బెల్లంపల్లిలో కోర్టు భవన నిర్మా ణం మరో రెండు నెలల్లోగా పూర్తవుతుందని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏ.వీరయ్య అన్నారు. శనివారం బెల్లంపల్లి మున్సిఫ్ కోర్టు, కొత్త కోర్టు భవనం పనులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ పనులు 90శాతం వర కు పూర్తయ్యాయని, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ అధికారుల ను ఆదేశించారు. అంతకుముందు మున్సిఫ్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తికి జడ్జి ముకేష్, న్యాయవాదులు ఘనస్వాగతం పలికారు. శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల సబ్ జడ్జి రామ్మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
‘గడ్కరీ’ సభ విజయవంతం చేయండి
చెన్నూర్/మంచిర్యాలటౌన్: ఈ నెల 5న కు మురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ క్రా స్ రోడ్డులో కాగజ్నగర్–శ్రీరాంపూర్ నాలుగు వరుస జాతీయ రహదారి ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సభ విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్గౌడ్ అన్నారు. శనివారం ఆయన చెన్నూర్లో, మంచిర్యాలలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా మాజీ అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లితో కలిసి విలేకరులతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణంతోనే అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిందన్నారు. జాతీయ రహదారి–363 నిర్మాణంతో రవా ణా సౌకర్యం మెరుగుపడిందని తెలిపారు. బహిరంగ సభకు జిల్లాలోని బీజేపీ మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ కొయ్యల ఏమాజి, పెద్దపల్లి పురుషోత్తం, దుర్గం అశోక్, ఎనగందుల కృష్ణమూర్తి, గుండా ప్రభాకర్, వంగపల్లి వెంకటేశ్వర్రావు, బత్తుల సమ్మయ్య, తుమ్మ శ్రీపాల్, జాడి తిరుపతి, గర్రెపల్లి నర్సయ్య, కొండపాక చారి, కేవీఏం శ్రీనివాస్, బుర్ర రాజశేఖర్, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వైద్య కళాశాల పనులు పూర్తి చేయాలి
● ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ● కలెక్టర్తో కలిసి పనుల పర్యవేక్షణ మంచిర్యాలరూరల్(హాజీపూర్): వచ్చే వైద్య విద్యా సంవత్సరం ప్రారంభంలోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రభుత్వ వైద్య కళాశాల తరగతులు ఇక్కడే ప్రారంభమయ్యేలా చూడాలని మంచిర్యాల ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదేశించారు. శని వారం జిల్లా కలెక్టర్ కుమార్దీపక్తో కలిసి హాజీ పూర్ మండలం గుడిపేటలో ప్రభుత్వ వైద్య కళాశా ల నిర్మాణ పనులను పర్యవేక్షించారు. రూ.216 కో ట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వై ద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచేలా ప్రత్యేక చ ర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్టల్ భవనా నికి వేసిన గులాబీ రంగు తొలగించాలని ఆర్అండ్ బీ అధికారులకు సూచించారు. రోడ్లు, భవనాల శా ఖ డీఈఈ సజ్జత్భాషా, ఏఈఈ అనూష, కళాశాల ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ సంపూర్ణరావు, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. పనుల పరిశీలనలక్సెట్టిపేట: మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ సివిల్ ఆసుప్రతి, జూనియర్ కళాశాల భవనం నిర్మాణ ప నులను ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, కలెక్టర్ కుమా ర్ దీపక్ శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నాణ్యతతో పనులు చేపట్టాలని తెలిపారు. -
హైవేపై ఆశలు
● ప్రతిపాదనల్లోనే బెల్లంపలి–గడ్చిరోలీ ఫోర్ లైన్ ● కేంద్ర మంత్రి ‘గడ్కరీ’ పర్యటనలో హామీ ఇస్తారా? ● ఆ రోడ్డు నిర్మిస్తే రెండు జిల్లాలకు ఉపయుక్తంసాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన నేపథ్యంలో పెండింగ్లో ఉన్న ప్రతిపాదిత ప్రాజెక్టులపై ఆశలు చిగురించాయి. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు, మహారాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయుక్తమైన బెల్లంపల్లి గడ్చిరోలీ జాతీయ రహదారిని నిర్మించాలనే డి మాండ్ ఎన్నో ఏళ్లుగా ఉంది. ఈ ప్రతిపాదిత రోడ్డు కోసం పలుమార్లు సర్వేలు జరిగాయి. ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టు లేకపోవడంతో ముందుకు కదలడం లేదు. ఇదే తీరుగా ఆర్మూర్–జగిత్యాల–మంచిర్యాల రహదారి–63పై గత కొన్నేళ్లుగా జాప్యం జరుగుతోంది. ఇక్కడ రెండు సార్లు అలైన్మెంటు మార్పులతోపాటు రైతులు భూ సేకరణను వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల పీఎం ప్రాధాన్యత జాబితాలో చోటు దక్కడంతో మళ్లీ ముందుకు కదులుతోంది. తాజాగా కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో గడ్చిరోలీ వరకు నిర్మించబోయే ప్రాజెక్టుపై కదలిక వస్తుందని రెండు జిల్లాల వాసులు ఆశలు పెట్టుకున్నారు. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉన్న బెల్లంపల్లి, తాండూరు, రెబ్బెన, కాగజ్నగర్, కౌటాల మీదుగా ప్రాణహిత దాటి గడ్చిరోలీ వరకు ఈ రోడ్డు ప్రతిపాదన ఉంది. గతంలో ప్రాణహిత తీరం వెంబడి, కౌటాల నుంచి గోదావరి మీదుగా కొత్త హైవేతో భద్రాచలం వరకు హైవే నిర్మించాలని ప్రతిపాదించినా అటవీ, సాంకేతిక అనుమతుల జాప్యంతో ఆ ప్రాజెక్టునే పూర్తిగా పక్కకు పెట్టారు. ఈ క్రమంలో గడ్చిరోలీ హైవే త్వరితగతిన పూర్తయితే ఈ రెండు జిల్లాలు మహారాష్ట్రకు సులువుగా ప్రయాణం సాగించే అవకాశం ఉంది. పూర్తయిన ఏడాదికి ప్రారంభంకేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గడ్కరీ పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డితో కలిసి జాతీయ రహదారి–363ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. సోమవారం రెబ్బెన మండలం కాగజ్నగర్ ఎక్స్రోడ్డు వద్ద జరిగే ప్రారంభోత్సవ వేడుకకు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు, స్థానిక అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.3500కోట్లతో నిర్మించిన ఈ రోడ్డు గత ఏడాది క్రితమే పనులు పూర్తయి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం ఆఫీసు సమీపం నుంచి రెండు సెక్షన్లుగా మహారాష్ట్ర సరిహద్దు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం వరకు మొత్తం 94.60కి.మీ రోడ్డు నిర్మించారు. ప్యాకేజీ–1 తాండూరు మండలం రేపల్లెవాడ, అక్కడ నుంచి గోయగాం వరకు నిర్మించి మందమర్రి, వాంకిడి మండలం కమాన వద్ద టోల్గేట్లు ఏర్పాటు చేసి వసూళ్లు చేస్తున్నారు. ప్యాకేజీ–1 2020లో పనులు ప్రారంభం కాగా, ప్యాకేజీ–2 మాత్రం 2021లో మొదలయ్యాయి. కరోనా, వంతెనలు, ఇతర కారణాలతో జాప్యం జరిగింది. అయితే చివరకు పూర్తయింది. మందమర్రి మండలం పులిమడుగు వద్ద ఎన్హెచ్–363 ఫ్లై ఓవర్పై మరమ్మతులు నాణ్యతపై సందేహాలుజాతీయ రహదారి–363 నిర్మాణంలో నాణ్యతపై ఇప్పటికే పలు ఫిర్యాదులు వెళ్లాయి. బెల్లంపల్లి కన్నాల క్రాస్ వద్ద, రెబ్బెన మండలం తక్కెళ్లపల్లి వద్ద వన్యప్రాణుల అండర్ పాస్, గోయగాం చివరన యానిమల్ ఓవర్పాస్ నిర్మాణంలో నాణ్యత లోపించిందనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో భూ సేకరణ జరిగిన వరకు ఆధీనంలోకి తీసుకోకపోవడం, లైట్లు, మరమ్మతులు, నిర్వహణ లోపం కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రోడ్డు దెబ్బతినడంతో మరమ్మతులు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణదారు 15ఏళ్లు నిర్వహణ బాధ్యతలు చూడాలి. ఇప్పటికే ఏడాది పూర్తయింది. మరో 14ఏళ్లు ఇంకా కొనసాగాల్సి ఉంది. ఈ క్రమంలో భారీ వాహనాల రాకపోకలతో రోడ్డు దెబ్బతినకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. -
వాహన అనుమతిపై సందిగ్ధం
● పది రోజులుగా యజమాని పరేషాన్ ● ఆర్టీఏ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భారీ వాహనాల అనుమతిలో కంపెనీ పేర్కొన్న.. రవాణా శాఖ అధికారులు ఇచ్చే అనుమతుల్లో తేడాలు వస్తున్నాయి. జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరుకు చెందిన జంగా రమేశ్రెడ్డి ఆరు టైర్ల ఇంజన్ కలిగిన ఐదు భారీ వాహనాలు కొనుగోలు చేశారు. ట్రెలర్తో కలిపి 22టైర్ల డబుల్ క్రోన్(టైర్ల సస్పెన్షన్) వాహనానికి జీవీడబ్ల్యూ(గ్రాస్ వెయిట్ వెహికిల్) 55టన్నులు(ఖాళీ ఇంజిన్, మోసే బరువు సహా) సామర్థ్యం అనుమతి ఇచ్చారు. మరో 18టైర్ల సింగిల్ క్రోన్ నా లుగు వాహనాలకు 54టన్నులు అనుమతి కోరితే, స్థానిక ఎంవీఐ తనిఖీ చేసి 45.5టన్నులకే అనుమతి ఇచ్చారని తెలిపారు. వాహన కంపెనీ ప్రతినిధులు 54టన్నుల జీవీడబ్యూతో ఎస్టీఏ(స్టేట్ ట్రాన్స్పోర్టు అథారిటీ) అనుమతి ఉందని చెబితేనే కొనుగోలు చేశానని, గత పది రోజులుగా యజమాని ఆర్టీఏ అధికారులు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. నిబంధనల మేరకే సామర్థ్య అనుమతి ఇచ్చామని, ఏదైనా జీవో ఉంటే తీసుకు రావాలంటూ డీటీవో సంతోశ్కుమార్ యజమానికి సూచించారు. దీంతో ఆ య జమాని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలోనూ సంప్రదించగా, ఇంకా ఈ వాహనాల సామర్థ్యాలపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. వాహన తయారీ కంపెనీ ప్రతినిధులు ఎస్టీఏ నుంచి నిర్ణీత సామర్థ్యానికి అప్రూవ్ ఉందంటున్నారు. రూ.లక్షలు పెట్టి కొనుగోలు చేశానని, డీడీలకే రూ.6లక్షలకు పైగా చెల్లించానని, తీరా అనుమతి రాకపోతే నష్టపోతానని యజమాని వాపోతున్నారు. దీనిపై డీటీవోను ‘సాక్షి’ వివరణ కోరగా, నిబంధనల మేరకే అనుమతులు ఇచ్చామని, మరోసారి పరిశీ లిస్తామని తెలిపారు. సాధారణంగా ఆర్టీఏ అధికా రులు వాహన ఇంజన్, టైర్లు, సింగిల్, డబుల్ క్రోన్ సామర్థ్యాలు, ముందు, వెనక భాగాల్లో నిర్మాణం, ట్రెలర్ అమరిక, సాంకేతికత, తదితర పరిశీలించి, ఎస్టీఏ ప్రకారం సామర్థ్య అనుమతులు జారీ చేస్తారు. ఆమేరకే వాహనాల్లో లోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. -
రైస్మిల్లర్లు లక్ష్యాలను పూర్తి చేయాలి
మందమర్రిరూరల్: రైస్మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాల ని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంబికాసాయి, వాసవి, లక్ష్మీగణపతి, వెంకటేశ్వర రైస్మిల్లులను తహసీల్దార్ సతీష్కుమార్శర్మతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం లారీలను లోడ్తో గంటల తరబడి వేచి ఉంచొద్దని, అవసరమైన హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని, వెంటనే అన్లోడ్ చేసి పంపించాలని తెలిపారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయం సందర్శించారు. వడదెబ్బపై అవగాహన కల్పించాలి మంచిర్యాలఅగ్రికల్చర్: వేసవి తీవ్రత దృష్ట్యా వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే టోపీ ధరించడం, తువ్వాలు చుట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● జెడ్పీ సీఈవో గణపతి ● ఎంపీడీవో, ఎంపీవో, సూపరింటెండెంట్కు నోటీసులు మందమర్రిరూరల్: విధుల నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జెడ్పీ సీఈవో గణపతి హెచ్చరించారు. శుక్రవారం ఆయన ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి రికార్డులు పరిశీలించారు. మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో రాజేశ్వర్ను అడిగి తెలుసుకున్నారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందే విధంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం, సంక్షేమ ఫలాల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఉదయం 10గంటలకు కలెక్టర్ ఎంపీడీవో కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంపీడీవో, ఎంపీవోతోపాటు సిబ్బంది కూడా లేరు. దీంతో సమయపాలన పాటించలేదని ఎంపీడీవో, ఎంపీవో, ఆఫీస్ సూపరింటెండెంట్, ఎనిమిది మంది ఆఫీస్ సిబ్బందితోపాటు ఉపాధి హామీ సిబ్బందికి జెడ్పీ సీఈవో గణపతి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. -
కరీంనగర్ జిల్లా మిల్లులకు ధాన్యం తరలింపు
మంచిర్యాలఅగ్రికల్చర్: ‘బస్తా దిగదు.. బండి కదలదు’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. గురువారం కలెక్టర్ కుమార్ దీపక్ దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ధాన్యం సే కరణ వేగవంతంతోపాటు లోడింగ్, అన్లోడింగ్ ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రైస్మిల్లుల్లో ధాన్యం అన్లోడ్ కాక రోజుల తరబడి అక్కడే ఉంటున్నాయని కథనంలో ప్రస్తావించడం తెలిసిందే. అన్లోడ్ సమస్య పరిష్కారానికి పక్క జిల్లాలోని మిల్లులకు తరలించాలని సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. దీంతో శుక్రవారం నుంచి కరీంనగర్ జిల్లాలోని 26 రైస్మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చి ధాన్యం తరలిస్తున్నా రు. ఇప్పటివరకు 3,371 మంది రైతుల నుంచి 30,516.160 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. మిల్లులకు 20,407.400 మెట్రిక్ టన్నుల ధా న్యం తరలించగా.. ఇంకా 10,108.760 మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించాల్సి ఉంది. ఎఫెక్ట్ -
గాలి వాన బీభత్సం
జిల్లాలో కురిసిన వర్షంఅపార నష్టం భీమారం: మండలంలో వర్షానికి అపార నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. మామిడికాయలు రాలిపోయాయి. కోతలకు వచ్చిన వరిపంట నేలవాలింది. భీమారం–నెన్నెల ప్రధాన రహదారిలో కొత్తగూడెం నుంచి నర్సింగాపూర్ వరకు పెద్ద ఎత్తున చెట్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు చెట్లను ట్రాక్టర్ల ద్వారా తొలగించారు. బూర్గుపల్లి, కాజిపల్లి, భీమారం, నర్సింగాపూర్ గ్రామాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇళ్లపై ఉన్న రేకులు లేచిపోయి చాలా దూరంలో పడ్డాయి. దీంతో కాజిపల్లి గ్రామానికి చెందిన బాధితులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. బూర్గుపల్లిలోని పలు తోటల్లో 40 ఏళ్ల వయస్సు గల మామిడి చెట్లు వేళ్లతో సహా పడిపోయాయి. ప్రభుత్వం నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. జైపూర్: మండలంలో గురువారం రాత్రి భారీ ఈదురుగాలుల వర్షానికి మామిడి కాయలు నేలరాలయి. కిష్టాపూర్, వేలా ల, పౌనూర్, శివ్వారం గ్రామాల్లో కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. రోడ్డు వైపు ఉన్న పెద్దపెద్ద చెట్లు నెలకొరిగాయి. కిష్టాపూర్, శివ్వారం, పౌనూర్లో రేకులతో నిర్మించుకున్న ఇళ్లపై కప్పులు ఎగిరిపోయాయి. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేసిన వరి ధాన్యం తడిసింది. వేమనపల్లి: మండలంలోని నీల్వాయి, నాగారాం గ్రామాల్లో తోటల్లో మామిడికాయలు నేలపాలయ్యాయి. కోతకు వ చ్చిన వరి పైరు నేలవాలగా.. పలు గ్రా మాల్లో కళ్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి రైతులు నానా అవస్థలు పడ్డారు.మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాలో గురువారం రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది. చేతికొచ్చిన వరి ధాన్యం, మిర్చి, మొక్కజొన్న పంటలను నీట ముంచేసింది. దిగుబడి దశలో ఉన్న మామిడి నేలరాలింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి భారీగా నష్టం వాటిల్లింది. జిల్లాలో 5.2మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. నెన్నెల, భీమారం, జైపూర్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయి రూ.30లక్షల నుంచి రూ.50లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. బలమైన ఈదురుగాలులతో చెట్లు విరిగి ఇళ్లు, రోడ్లు, విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో 33కేవీ లైన్ స్తంభాలు 5, 11కేవీ లైన్ స్తంభాలు 92, ఎల్టీ స్తంభాలు 99, ట్రాన్స్ఫార్మర్లు 14 నేలకూలాయి. విద్యుత్ శాఖకు రూ.50లక్షల వరకు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. జైపూర్, భీమారం, నెన్నెల, బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు విరిగి, తీగలు తెగిపడి నష్టం తెచ్చిపెట్టాయి. గురువారం రాత్రి నుంచి గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా.. శుక్రవారం మధ్యాహ్నం వరకు పనులు చేపట్టి సరఫరా పునరుద్ధరించారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసింది. జిల్లాలో పంట నష్టం జిల్లాలో గురువారం రాత్రి వీచిన ఈదురుగాలు లు, అకాల వర్షానికి దెబ్బతిన్న పంటల నష్టాన్ని శుక్రవారం వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికా రులు ప్రాథమిక సర్వేలో గుర్తించారు. నెన్నెల, భీ మారం, జైపూర్ మండలాల్లో 83మందికి చెందిన కోత దశలో ఉన్న వరి పంట 133ఎకరాల్లో దెబ్బ తిన్నట్లు గుర్తించారు. 1386 ఎకరాల్లోని మామిడితోటల్లో 33శాతం పైబడి నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. చెట్లకొమ్ములు విరగడంతోపాటు వేర్లతో నే లకు వంగడం, కాయలు నేలరాలినట్లు తేల్చారు.నేలకొరిగిన వరి పంట నెన్నెల/భీమిని: నెన్నెల మండలం గంగారాం, నెన్నెల, కొత్తగూడం గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చిత్తాపూర్, నార్వాయిపేట, ఆవుడం, గంగారాం, చిన్నవెంకటాపూర్, మైలారం, గొల్లపల్లి గ్రామాల్లో 800 ఎకరాల్లో మామిడికి, 300 ఎకరాల్లో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. గంగారాం, చిన్నవెంకటాపూర్, పొట్యాల, కొంపల్లిలో కోతకు వచ్చిన వరి పంట నేలకొరిగి ధాన్యం రాలింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో 16గంటలపాటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఏఈ రాజ న్న సిబ్బందితో కలిసి మరమ్మతులు చేసి అంతరాయం లే కుండా చర్యలు తీసుకున్నారు. ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి గోడలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల వృక్షాలు నేలకూలి రోడ్లపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రూ.లక్షల్లో నష్టం ఏర్పడిందని, అంచనా వేసి పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. ● ఒక్కసారిగా గాలివాన రావడంతో కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో జంపాల అంజన్న రేకుల టేల ఎగిరి ఇంటిపై పడింది. ఇంటిపై ఉన్న రేకులు పగలడంతో నష్టం జరిగింది. చేతికి వచ్చిన వరి పంట నేలకొరిగింది. రాంపూర్ రోడ్డు పక్కన ఉన్న చెట్లు విరిగి పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తడిసిన ధాన్యం చెన్నూర్రూరల్: మండలంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. లంబడిపల్లి, లింగంపల్లి, అక్కెపలి, అంగ్రాజ్పల్లి, కిష్టంపేట తదితర గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యంపై కవర్లు కప్పారు. కొన్ని చోట్ల కవర్లపై నీరు చేరి కొంత మేర ధాన్యం తడిసింది. వర్షపు నీరు చేరడంతో రైతులు నీటిని ఎత్తి పోస్తున్నారు. ఆకాశంలో మబ్బులు అలాగే ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈదురు గాలులకు చెన్నూర్–మంచిర్యాల ప్రధాన రహదారిపై చెట్లు నేలకొరిగాయి. శుక్రవారం వాటిని తొలగింపజేశారు. నేలరాలిన మామిడి విరిగిన విద్యుత్ స్తంభాలు కూలిన ఇళ్ల పైకప్పులు 5.2 మిల్లీమీటర్ల వర్షపాతంమండలం వర్షపాతం (మిల్లీమీటర్లలో) భీమారం 23.8 నెన్నెల 21.3 చెన్నూర్ 12.3 జైపూర్ 10.8 భీమిని 9.1 కన్నెపల్లి 6.5 కోటపల్లి 6.5 వేమనపల్లి 2.2 -
సీపీఆర్ఎంఎస్లో గందరగోళం
శ్రీరాంపూర్: సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు సంస్థ కాంట్రీబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీం(సీపీఆర్ఎంఎస్) సదుపాయం కల్పించింది. ఈ స్కీం కింద హెల్త్కార్డులు పొందిన కార్మికులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. తమకు కార్డులో ఎంత మొత్తం ఖర్చయిందో, ఇంకా ఎంత మిగిలి ఉందో తెలియక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకు ఈ స్కీం కింద చేరాలంటే రూ.60 వేలు ముందుగా చెల్లించాలి. గతంలో ఈ మొత్తం రూ.40 వేలుగా మాత్రమే ఉండేది. ఈ మొత్తాన్ని సర్వీసులో ఉండగానే రికవరీ చేస్తారు. ఈ స్కీం రాక ముందు రిటైర్డ్ అయిన వారు తర్వాత డబ్బులు చెల్లిస్తే వారికి కూడా కార్డులు అందించారు. ఈ కార్డు కింద రిటైర్డ్ కార్మికునికి, ఆయన భార్యకు కలిపి రూ.8 లక్షల వైద్యం చేయించుకోవచ్చు. ఈ మొత్తం ఖర్చయితే ఇక అంతే. మళ్లీ రూ.60 వేలు చెల్లిస్తామన్నా కూడా కార్డు ఇవ్వరు. వన్టైం కిందే కార్డు ఇస్తారు. సింగరేణి పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఆసుపత్రులు, కరీంనగర్, వరంగల్, ఖమ్మంతోపాటు హైదరాబాద్లోని పలు కార్పొరేట్ ఆసుపత్రులతో కంపెనీ ఈ కార్డుతో చికిత్స అందించేలా అనుసంధానం చేసుకుంది. ఆ ఆసుపత్రులకు కార్డు పట్టుకుని రిటైర్డ్ కార్మికుడు వెళ్తే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. భార్యాభర్తలిద్దరికి కలిపి రూ.8 లక్షల విలువ గల చికిత్స పొందవచ్చు. బ్యాలెన్స్ వివరాలు లేవు.. రిటైర్డ్ కార్మికుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు ముందుగా అతను అక్కడ కార్డు చూపించి అడ్మిట్ అవుతారు. దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడానికి ముందు సదరు ఆసుపత్రి యాజమాన్యం కంపెనీ సీఎంఓకు వైద్య ఖర్చుల బిల్లులను ఎస్టిమేట్ చేసి పంపుతారు. అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాతే ట్రీట్మెంట్ మొదలవుతుంది. ఐతే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత సదరు రిటైర్డ్ ఉద్యోగికి తన కార్డులో ఎంత మొత్తం ట్రీట్మెంట్ కింద కట్ అయిందో తెలియడం లేదు. కంపెనీ వారు చెప్పడం లేదు. ఆసుపత్రి వారు చెప్పే అంచనే తప్ప, డిశ్చార్చి అయిన తర్వాత తన వైద్యానికి ఆసుపత్రుల్లో కార్డు నుంచి ఎంత మొత్తం కట్ అయిందో తెలియక వారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఏ కార్యాలయం వద్దకు వెళ్లి అడిగిన కూడా వివరాలు ఇవ్వడం లేదు. మళ్లీ ఏదైనా జబ్బు పడ్డప్పుడు దానికి సరిపడా డబ్బులు కార్డులో ఉన్నాయా లేవో అని గందరగోళపడుతున్నారు. ఖర్చు, మిగులు ఎంతో తెలియదు లెక్క చెప్పాలంటున్న రిటైర్డ్ కార్మికులు ఆసుపత్రుల వద్ద ఇబ్బందులు ఎస్ఎంఎస్ అలర్ట్ పెట్టాలి రిటైర్డ్ కార్మికుడు ఆసుపత్రిలో డిశార్చి అయిన వెంటనే అతని సెల్ఫోన్కు ఎంత మొత్తం కార్డు నుంచి వైద్యానికి కట్ అయిందో వారి ఫోన్కు మెసేజ్ వచ్చేలా యజమాన్యం ఏర్పాటు చేయాలి. కనీసం జీఎం కార్యాలయానికి వెళ్లి అడిగిన అక్కడ వివరాలు చెప్పేలా ఏర్పాటు చేయాలి. ఇవేవి లేకపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. – నాతాడి శ్రీధర్రెడ్డి, బీఎంఎస్ ఎస్సార్పీ బ్రాంచి ఉపాధ్యక్షుడు -
ఇంటర్నేషనల్ కరాటే సెమినార్లో ప్రతిభ
బెల్లంపల్లి: కేరళ రాష్ట్రంలో గతనెల 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ ఇంటర్నేషనల్ సిటోరియా కరాటే స్కూల్ ఆఫ్ ఇండియా టెక్నికల్ సెమినార్లో మాస్టర్లు ప్రతిభకనబర్చారు. పలు రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది పాల్గొనగా, రాష్ట్రం నుంచి ఏడుగురు మాస్టర్లు హాజరయ్యారు. టెక్నికల్ సెమినార్లో నైపుణ్యత కనబర్చిన మాస్టర్లకు జపాన్కు చెంనని కేఎస్కేఎస్ఐ ఫౌండర్ గ్రౌండ్ మాస్టర్ సోకే కేఎన్యూమ భూని ప్రతిభ సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సర్టిఫికెట్లు అందుకున్న వారిలో రమేశ్కుమార్, విజ్జగిరి రవి, సారిక రాజు, మారపాక దేవయ్య, ఎస్.సురేశ్, సోలంకి అశోక్, నారాయణ శెట్టి శ్రీనివాస్ ఉన్నారు. వీరిని పలువురు అభినందించారు. -
ఇసుక రాయల్టీ తీసుకున్న వీడీసీ సభ్యులపై కేసు
ఆదిలాబాద్టౌన్(జైనథ్): ఇసుక రాయల్టీ తీసుకున్న పెండల్వాడ, సాంగ్వి వీడీసీ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు జైనథ్ సీఐ సాయినాథ్ తెలిపారు. గురువారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు వివరాలు వెల్లడించారు. గతనెల 13న భోరజ్ మండలం పెండల్వాడ గ్రామ శివారులో పెన్గంగా నది నుంచి ఇసుక తీసుకోవడానికి ట్రాక్టర్ డ్రైవర్ వచ్చాడు. వీడీసీ సభ్యులు భూమారెడ్డి, అతని సోదరుడు రామ్రెడ్డితోపాటు మరికొంత మంది సభ్యులు అతని వద్ద రూ.500 రాయల్టీ అక్రమంగా తీసుకున్నారు. దీంతోపాటు ఆయనతో దుర్భాషలాడి బెదిరించారు. సాంగ్వి గ్రామంలో ఇసుక తరలింపులో వసూళ్లకు పాల్పడుతున్న అశోక్, మరికొందరిపై ట్రాక్టర్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జైనథ్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు అక్రమ దందాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. -
నరేందర్కు శ్రమశక్తి అవార్డు
మందమర్రిరూరల్: మందమర్రి ఏరియాలోని కేకే–5 గనిలో విధులు నిర్వర్తిస్తున్న రాంశెట్టి నరేందర్ను మేడే సందర్భంగా ప్రభుత్వం శ్రమశక్తి అవార్డుకు ఎంపిక చేసింది. గురువారం హైదరాబాద్లోని రవీంద్రబారతిలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర కనీసవేతనాల సలహా మండలి చైర్మన్ జనక్ప్రసాద్ చేతులమీదుగా అవార్డుతోపాటు ప్రశంసపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ శ్రమశక్తి అవార్డు ప్రదానం చేసినందుకు ప్రభుత్వానికి రుణపడి ఉంటానన్నారు. తనకు సహకరించిన ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రెటరీ జనరల్ జనక్ప్రసాద్, నాయకులు కాంపెల్లి సమ్మయ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఆత్మహత్యాయత్నం
ఇళ్ల జాబితాలో పేరు లేదని కోటపల్లి: ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు తొలగించారని మనస్తాపం చెంది మండలంలోని రొయ్యపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రవీందర్(30) ఆత్మహత్యాయత్నం చేశాడు. రవీందర్ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నాడు. గ్రామంలో 93మందితో అర్హుల జాబితా ప్రకటించగా అందులో పేరొచ్చింది. మొదటి దశలో 22మందిని ఇళ్ల నిర్మాణానికి ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎంపిక చేశారు. ఇందులో పేరు లేకపోవడంతో కమిటీ సభ్యులు రాజకీయ కారణాలతో తన పేరు తొలగించారని మనస్తాపం చెందిన రవీందర్ బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవీందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే వివేక్వెంకటస్వామి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తానని, నిరుపేదలకు అన్యాయం జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. మళ్లీ సర్వే నిర్వహించి అర్హులకే ఇళ్లు అందజేస్తామని తెలిపారు. రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, ఆయనతో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. -
అధికార లాంఛనాలతో సీఆర్పీఎస్ జవాన్ అంత్యక్రియలు
● హాజరైన సీఆర్పీఎఫ్ అధికారులు, జవాన్లుభీమారం: గుండెపోటుతో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ రామళ్ల సాగర్కు అధికార లాంఛనాలతో గురువారం భీమారంలో అంత్యక్రియలు నిర్వహించారు. భీమారం మండలకేంద్రానికి చెందిన సాగర్ సీఆర్పీఎఫ్ జవాన్గా శిక్షణ పొందుతున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. బుధవారం ఆయన మంచిర్యాలలో ఫంక్షన్కు వెళ్లగా గుండెపోటుతో మృతిచెందాడు. హకీంపేట్లోని సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ రాకేశ్ దేహార్య, జవాన్లు అంత్యక్రియలకు హాజరై తల్లిదండ్రులు గట్టయ్య, కళ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమయాత్రలో అధికారులు పాల్గొని పాడె మోశారు. శ్మశానవాటికలో మృతదేహానికి జాతీయజెండా కప్పి పూలమాలలు వేశారు. అనంతరం మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపి నివాళులర్పించారు. అంత్యక్రియలకు గ్రామస్తులు తరలివెళ్లారు. -
● ఎస్సీ వసతిగృహాల్లో నియామకం ● కాళేశ్వరం జోన్లో 19మంది రిపోర్టు
మంచిర్యాలఅర్బన్: ఎస్సీ వసతిగృహా సంక్షేమాధికారులుగా ఎంపికై పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచిర్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రవీందర్రెడ్డి బుధవారం రాత్రి నియామక పత్రాలు అందజేశారు. గత ఏడాది జూన్ 24నుంచి 29వరకు కంప్యూటర్ ఆధారిత(సీఆర్బీటీ) విధానంలో పరీక్షలు నిర్వహించగా సెప్టెంబర్ 20న ఫలితాలు విడుదలయ్యాయి. కాళేశ్వరం జోన్ పరిధిలో 24మంది అభ్యర్థులను టీజీపీఎస్సీ ఎంపిక చేసిన పంపగా.. ఐదుగురు అభ్యర్థులు వివిధ కారణాలతో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు రాలేదు. దీంతో 19మందికి నియామక పత్రాలు అందజేయగా.. గురువారం కేటాయించిన వసతిగృహాల్లో రిపోర్టు చేశారు. వీరిలో 12మంది పురుషులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. మంచిర్యాల జిల్లాకు 8, పెద్దపల్లికి 5, ఆసిఫాబాద్కు 4, ములుగుకు 1, జయశంకర్ భూపాలపల్లికి 1 అభ్యర్థిని ఎస్సీ వసతిగృహా సంక్షేమ అధికారులుగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి అభ్యర్థుల ఆప్షన్ల మేరకు పోస్టింగ్లు కేటాయించారు. నియామకపత్రాలు అందజేస్తున్న ఎస్సీ డీడీ రవీందర్రెడ్డి, ఏఎస్డబ్ల్యూవో రవీందర్గౌడ్ కాళేశ్వరం జోన్లో ఇలా.. మంచిర్యాల జిల్లాలో.. అభ్యర్థి పేరు కేటాయించిన పోస్టింగ్ యాసం శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్హాస్టల్, కోటపల్లి చీపెల్లి శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, మందమర్రి చండి రజనీకాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, తాండూర్ చిందికింది ప్రశాంత్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, దండేపల్లి అల్గూనూరి భార్గవ్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చెన్నూర్ డి.శ్రీనివాస్ ఎస్సీ బాయ్స్ హాస్టల్, చింతగూడ టి.రాజు ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్, బెల్లంపల్లి సద్గుణ, కూడెల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్, లక్సెట్టిపేట ఆసిఫాబాద్ జిల్లా.. రాహుల్కుమార్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, ఆసిఫాబాద్ జలంపల్లి ప్రేమ్కుమార్ కాలేజీ బాయ్స్ హాస్టల్, కాగజ్నగర్ ఈశ్వరి ఎస్సీ కళాశాల గర్ల్స్ హాస్టల్, ఆసిఫాబాద్ రత్నం కవిత ఎస్సీ కాలేజీ గర్ల్స్ హాస్టల్ కాగజ్నగర్ పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో.. తోట శైలజ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ(గర్ల్స్), పెద్దపల్లి ఇసంపల్లి రమ్య ఎస్సీ గర్ల్స్ హాస్టల్, మంథని ప్రశాంత్ ఎస్సీ ఐడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని డి.తిరుపతి ఎస్సీడబ్ల్యూహెచ్సీ బాయ్స్ హాస్టల్, మంథని సాధుల రమేష్ ఎస్సీ కాలేజీ బాయ్స్ హాస్టల్, మంథని ఎ.స్వాతి ఎస్సీ గర్ల్స్ హాస్టల్ రేగోండ డి.మమత ఎస్సీ గర్ల్స్ హాస్టల్, ఏటూరునాగారం -
పాఠశాలల్లో మరమ్మతు పూర్తిచేయాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ● ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష ఉట్నూర్రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో సెలవులు ముగియకముందే మరమ్మతు పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల డీఈలు, ఏఈలతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో, ఏజెన్సీ గ్రామాల్లో చేపడుతున్న మరమ్మతులు ఎంతవరకు పూర్తి చేశారని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న గేట్లను, ఆర్వో ప్లాంట్ల మరమ్మతు చేయించాలని సూచించారు. భోజనశాలల భవనాల షెడ్ల నిర్మాణాలు వెంటనే పూర్తిచేయాలన్నారు. అదనపు తరగతి గదులు నిర్మించాలని, అంగన్వాడీ మోడల్ స్కూల్, మరుగుదొడ్లు, సెప్టిక్ ట్యాంక్, డార్మంటరీ గదుల మరమ్మతు పూర్తి చేయాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో గదుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఈఈ తానాజీ, డీఈ శివప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు. -
దగ్ధమైన జొన్నపంట పరిశీలన
బజార్హత్నూర్: మండలంలోని దేగామ గ్రామానికి చెందిన 11 మంది రైతులకు సంబంధించిన పదెకరాల్లో ప్రమాదవశాత్తు దగ్ధమైన జొన్న పంటను తహసీల్దార్ శ్యాంసుందర్ గురువారం పరిశీలించారు. జొన్న పంటతోపాటు రెండు టార్పాలిన్, 40 స్పింక్లర్లు, 85 పైప్లు, 27 స్పింక్లర్ నౌజల్స్, 1 సోలార్ ఫెన్సింగ్ పలక, బ్యాటరీ కాలిబూడిదైందని తెలిపారు. మొత్తం నష్టం విలువ రూ.8.83 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశామని, రిపోర్టు తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. తహసీల్దార్ వెంట ఎంఆర్ఐ నూర్సింగ్, బాధిత రైతులు కొడారి నరేశ్, సట్ల రమేశ్, లక్ష్మి, రాజేందర్, శ్రీకాంత్, మహేశ్, ప్రవీణ్ ఉన్నారు.