విద్యార్థినులకు రక్తహీనత లేకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినులకు రక్తహీనత లేకుండా చూడాలి

Published Sun, Sep 22 2024 1:54 AM | Last Updated on Sun, Sep 22 2024 1:54 AM

విద్యార్థినులకు రక్తహీనత లేకుండా చూడాలి

మంచిర్యాలటౌన్‌: జిల్లాలోని విద్యార్థినుల్లో రక్తహీనత లేకుండా చూడాలని, ప్రతీ విద్యార్థిని రక్తనమూనాలను సేకరించి పరీక్షలు చేయాలని, రక్తహీనత ఉన్న వారు సరైన పౌష్టికాహారం తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ హరీశ్‌రాజ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయికుంట బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో గిరిజన పోషణ మిత్ర కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యార్థినులకు రక్తపరీక్షలు నిర్వహించారు. రక్తహీనత ఉన్న విద్యార్థినులకు మందులు అందించి, పోషకాహార లోపం లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఉట్నూర్‌ ఐటీడీఏ పీవో ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న గిరిజన పోషణ మిత్ర కార్యక్రమం ద్వారా మందులు, ఐరన్‌ రిచ్‌ ఫుడ్‌ను అందించనున్నట్లు తెలిపారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో అనిత, డాక్టర్‌ అశోక్‌, హెచ్‌ఎం వెంకటసాయి, మాస్‌ మీడియా అధికారి వెంకటేశ్వర్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement