అమెరికాలో ఇండియన్‌ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి | Indian embassy official found deceased under mysterious in Washington | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇండియన్‌ ఎంబసీ అధికారి అనుమానాస్పద మృతి

Published Sat, Sep 21 2024 11:16 AM | Last Updated on Sat, Sep 21 2024 11:18 AM

Indian embassy official found deceased under mysterious in Washington

వాషింగ్టన్: అమెరికాలోని ఇండియన్‌ ఎంబసీ (దౌత్య కార్యాలయం)లో విషాదం చోటు చేసుంది. కార్యాలయం ప్రాంగణంలో ఓ అధికారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నిన్న (శుక్రవారం) ఇండియన్‌ ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే మృతి చెందిన అధికారికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం వెల్లడిచలేదు.

‘‘భారత రాయబార కార్యాలయ ప్రాంణంలో 18 సెప్టెంబర్ 2024 (బుధవారం) రోజు సాయంత్రం ఓ అధికారి మరణించినట్లు మేము ధృవీకరిస్తున్నాం. మృతదేహాన్ని త్వరగా భారతదేశానికి పంపిచడానికి సంబంధిత ఏజెన్సీలు, కుటుంబ సభ్యులతో మేము సంప్రదింపులు జరుపుతున్నాం. ఇక.. కుటుంబం గోప్యత కోసం మరణించిన అధికారికి సంబంధించి అదనపు వివరాలను వెల్లడించటం లేదు. ఈ విషాద సమయంలో ఆ అధికారి కుటుంబానికి మేము సానుభూతి తెలియజేస్తున్నాం’ అని పేర్కొంది.

మరోవైపు.. ఈ ఘటపై స్థానిక పోలీసులు, సిక్రెట్‌ సర్వీస్‌ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆత్మ హత్య చేసుకున్నా? లేదా  హత్య జరిగిందా? అనే కోణంలో  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: లెబనాన్‌ పేజర్ల పేలుళ్ల కేసులో కేరళ టెక్కీ ప్రమేయం! దర్యాప్తులో ఏం తేలిందంటే..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement