breaking news
USA
-
వాస్తవిక రాజకీయం
ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా విరామం లభించింది. ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులు వేసింది. ఈ విషయంలో అధ్యక్షుడు ట్రంప్ వైఖరిపై చర్చ చాలాకాలం పాటు కొనసాగుతుంది. బహుశా కోర్టు మెట్లూ ఎక్కవచ్చు. సుమారు 15 కిలోటన్నుల బరువున్న బంకర్ బస్టర్ బాంబులు అణుస్థావరాలను ధ్వంసం చేసే అవకా శాలు తక్కువే. అంటే ఇరాన్ అణు కార్యక్రమం స్తంబించిపోలేదు. పోనీ అమెరికా బాంబులతో ఆ ప్రాంతంలో శాంతి నెలకొందా? ఇరాన్ లో ప్రభుత్వం మారిందా? ఊహూ! కాదనే చెప్పాలి. బాంబు దాడులకు బదులుగా ఇరాన్ పొరుగున ఉన్న ఖతార్లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. అది కూడా అమెరికాకు ముందుగానే చెప్పి! ఇందుకు ట్రంప్ స్వయంగా ఇరాన్కు ధన్యవాదాలూ చెప్పారు. ఏదైతేనేమి... ప్రస్తుతానికైతే శాంతి నెలకొన్నట్టు గానే కనిపిస్తోంది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో 20 శాతం కంటే ఎక్కువ రవాణా అయ్యే హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పార్లమెంట్ బంద్ చేయాలని తీర్మానించినా ప్రస్తుతానికి ఆ నిర్ణయం అమల్లోకైతే రాలేదు. మధ్యప్రాచ్యంలో యుద్ధమంటే సహజంగానే చమురు ధరల్లో పెరుగుదల ఉంటుంది. తద్వారా ద్రవ్యోల్బణం పెరగడం, పెట్టుబడిదారులు సంశయంలో పడిపోవడం, వాణిజ్యంపై దుష్ప్రభావం సహజంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రపంచ చమురు షేక్ అమెరికా! ఐదో వంతు ముడిచమురు అక్కడే ఉత్పత్తి అవుతోంది. సొంత అవసరాలు పోను ఎగుమతి చేస్తోంది కూడా! ఈ కారణంగానే ఇరాన్ , ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన తరువాత కూడా చమురు ధర మునుపటిలా బ్యారెల్కు 100 – 150 డాలర్ల స్థాయికి చేరలేదు. రెండూ కావాల్సిన దేశాలే!వీటన్నింటి ప్రభావం భారత్పై ఎలా ఉండ బోతోంది? భారత్ ఇప్పుడు జాగరూకతతో, ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఇరు దేశాలతో సత్సంబంధాలున్న దేశంగా మరింత బ్యాలెన్ ్సడ్గా ఉండాలి. రక్షణ, నిఘా ఉత్పత్తుల విషయంలో ఇజ్రాయెల్ ఇప్పుడు భారత్కు కీలకంగా మారిన విషయం తెలిసిందే. హైఫా నౌకాశ్రయంలో భారతీయుల పెట్టు బడులున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో ఇరు దేశాలూ పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఇజ్రా యెల్తో మన వ్యాపారం గణనీయంగా పెరిగి 500 కోట్ల డాలర్లకు చేరుకుంది. మరోవైపు ఇరాన్ మనకు చమురు సరఫరా చేస్తూండటం గమనార్హం. మన రూపాయిల్లోనే ముడిచమురు కొనుగోలుకు అవకాశం కల్పించిన దేశం కూడా ఇరానే! మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్లో భాగంగా చాబహార్ నౌకాశ్రయాన్ని ఇండియా అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. మన దిగుమతుల్లో 32 శాతం చమురు, 52 శాతం ఎల్ఎన్ జీ హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతోంది. ఇందులో తేడా వస్తే దాని ప్రభావం మన వంటింటి గ్యాస్ సిలిండ ర్లపై పడుతుంది. ఎరువుల ఉత్పత్తిలోనూ తేడా లొస్తాయి. రష్యా నుంచి చమురు తెచ్చుకోవడం సులువు కాదు. ఇలా చేయడం అమెరికాకు ఆగ్రహం తెప్పించేదే. చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని మాత్రమే కాకుండా, విదేశీ మారక ద్రవ్య నిల్వలపై, ద్రవ్య లోటుపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువను 87 కంటే దిగువకు చేర్చవచ్చు. ముడి చమురు బ్యారెల్ ధర పది డాలర్లు పెరిగితే భారత స్థూల జాతీయోత్పత్తి 0.3 శాతం వరకూ తగ్గవచ్చుననీ, ద్రవ్యోల్బణం 0.4 శాతం పెరుగుతుందనీ ఒక అంచనా. స్టాక్ మార్కెట్లు కూడా పెరిగే చమురు ధరలకు స్పందించి పెట్టుబడులు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. నైతిక ప్రశ్నలూ ఉన్నాయి...రాజకీయాల్లో నైతికత లేని రోజులివి. అయితే, ఏమాత్రం రెచ్చగొట్టే చర్యలకు దిగకున్నా ఒక సార్వభౌమ దేశంపై జరిగిన దాడిని ఖండించరాదా అన్న ప్రశ్న వస్తోందిక్కడ. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడిని ‘షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ ’ తన ప్రకటనలో ఖండించింది. ఇండియా ఆ ప్రకటనపై సంతకం చేయకుండా దూరం జరిగింది. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం: గాజా ప్రాంతంలో వెంటనే బేషరతుగా కాల్పుల విరమణ జరగాలన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానంపై జరిగిన ఓటింగ్లోనూ భారత్ పాల్గొనకపోవడం. ఈ తీర్మానానికి అమెరికా భాగస్వాములైన ఆస్ట్రేలియా, జపాన్ , యూకేలతోపాటు 149 దేశాలు మద్దతిచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్తో పాటు 12 దేశాలు వ్యతిరేకించాయి. భారత్ ఉద్దేశం ఏమిటి అంటే... ఇజ్రాయెల్, అమెరికాలతో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న వాస్తవిక రాజకీయం అనాలి. అయితే ఇది గ్లోబల్ సౌత్కు నాయకత్వం వహించాలన్న భారత్ కాంక్షను తక్కువ చేసేది కూడా! ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవిక రాజకీయం చేయడం మన సైద్ధాంతిక మార్గాన్ని తప్పినట్లు అవుతుంది. మన ట్రాక్ రికార్డులో మచ్చగా మిగులుతుంది. ఏ కూటమితోనూ జతకట్ట కూడదన్న అలీనోద్యమ స్ఫూర్తిని దెబ్బతీసినట్లవుతుంది.ప్రస్తుతం భారతదేశం చాలా సంతులనంతో వ్యవహరిస్తోందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ మన విధానాన్ని స్పష్టం చేసేందుకు ఇదో మంచి అవకాశం కూడా. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను నడిపించే మూలభూత విలువలను నిర్వచించుకోవాల్సిన తరుణమిది. వ్యూహాత్మక స్వావ లంబన, దేశీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం వంటివి అంతర్జాతీయ స్థాయిలో అసందిగ్ధతకు, పిరికితనానికి కారణం కారాదు. రష్యా–ఉక్రెయిన్ , ఇజ్రాయెల్– పాలస్తీనా– ఇరాన్ ఘర్షణలు భారత ఆర్థిక, దౌత్య, రాజకీయ నైపుణ్యానికి సవాలు విసురుతున్న మాట వాస్తవం. అజిత్ రానాడే వ్యాసకర్త ఆర్థికవేత్త -
అమెరికా.. మమ్మల్ని ఆదుకోండి: జెలెన్ స్కీ వేడుకోలు
రష్యా-ఉక్రెయిన్ యద్దాన్ని ఆపేశానని ఇది వరకే బడాయి కబుర్లు చెప్పిన అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా ఉక్రెయిన్పై రష్యా చేసిన అతిపెద్ద దాడిపై ఏం చెబుతారు?, ఇదే మాటను ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆవేదనతో కూడిన స్వరంతో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం రష్యా డాడులకు తట్టుకోలేని స్థితిలో ఉన్నామని, ఈ సమయంలో అమెరికా తమకు తక్షణ రక్షణ సాయం చేయాలని వేడుకుంటున్నారు. అమెరికాతో పాటు పశ్చిమ దేశాలు కూడా తమ అండగా నిలబడి, రష్యాను ఎదుర్కోనేందుకు సాయం చేయాలని జెలెన్ స్కీ సుదీర్ఘమైన ఉద్వేగభరిత పోస్ట్ పెట్టారు. ‘మాకు రక్షణ కావాలి. అది కూడా తక్షణమే కావాలి. రష్యా మా దేశంలోని ప్రతీదాన్ని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది. ప్రస్తుతం మేము జీవన పోరాటం చేస్తున్నాం. స్మిలాలోని నివాసిత ప్రాంతంలో కూడా రష్యా భీకరమైన దాడులు చేసింది. మా ఎఫ్-16 పైలట్ రష్యా దాడుల్లో చనిపోయాడు. సుదీర్ఘకాలంగా రష్యా చేస్తున్న యుద్ధం ఆపేలా కనిపించడం లేదు. వారికి భీకర దాడులు చేసే శక్తి సామర్థ్యాలు ఉండటంతో మాపై వరుస పెట్టి దాడుల చేస్తూ వస్తోంది. ఈ వారంలోనే 114 మిస్సెళ్లను, 1270 డ్రోన్లతో దాడి చేయడంతో పాటు 1,100 పైగా బాంబులు విసిరింది. ప్రపంచం శాంతి కోసం పిలుపునిచ్చినప్పటికీ, చాలా కాలం క్రితమే యుద్ధం చేస్తూనే ఉండాలని పుతిన్ నిర్ణయించుకున్నాడు. ఇది పుతిన్ వైఖరిని స్పష్టం చేస్తంది. ఈ యుద్ధాన్ని ముగించాలి. దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం, అలాగే మాకు రక్షణ కూడా అవసరం. అమెరికాతో పాటు యూరప్ దేశాలు, మిగతా భాగస్వాముల మాకు అండంగా ఉండండి. ఇప్పటివరకూ మాకు సాయంగా ఉన్నవారందరికీ ధన్యవాదాలు’ అని జెలెన్ స్కీ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ఇక తాము అమెరికా డిఫెన్స్ సిస్టమ్ను కూడా కొనుగోలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తమ పరిస్థితిని చెప్పుకొచ్చారు జెలెన్ స్కీ.Almost all night long, air raid alerts sounded across Ukraine — 477 drones were in our skies, most of them Russian-Iranian Shaheds, along with 60 missiles of various types. The Russians were targeting everything that sustains life. A residential building in Smila was also hit,… pic.twitter.com/1ExZhYAMBg— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) June 29, 2025 రష్యా-ఉక్రెయిన్ వార్ చరిత్రలోనే.. అతి పెద్ద దాడి ఇదే -
అమెరికా ఆఫీసులో భారతీయ మహిళ ఆకలి తిప్పలు..! పాపం ఆ రీజన్తో..
మన భారతీయులు అమెరికాలో పనిచేసేటప్పుడు విచిత్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. రానురాను అక్కడి పద్ధతులకు అలవాటు పడిపోతుంటారు. అది కామన్. అయితే కొన్ని విషయాల్లో ఎవ్వరైనా రాజీపడలేం. ఇక్కడ అలానే ఓ భారతీయ మహిళ తన వ్యక్తిగత అలవాటు రీత్యా ఆఫీసులో ఊహించిన విధంగా ఇబ్బంది పడింది. అయితే పాపం ఆమె అలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదంటూ ఇన్స్టాగ్రాం పోస్ట్లో తన అనుభవాన్ని పేర్కొనడంతో నెట్టింట ఈ విషయం వైరల్గా మారింది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన రుంజున్ అనే భారతీయ మహిళ తన ఆహారపు అవాట్ల రీత్యా ఆఫీస్ ఈవెంట్లో పాల్గొనలేకపోతుంది. మిగతా ఉద్యోగుల్లా ఆమె తన కార్యలయం ఇచ్చిన విందు కార్యక్రమానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అస్సలు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వుతుందని ఆమె భావించలేదు. నెట్టింట ‘ది వికెడ్ వెజిటేరియన్’ మహిళగా పేరుగాంచిన ఆమె ఆఫీస్లో ఊహించని విధంగా ఇబ్బందిని ఎదుర్కొంటుంది. తన వర్క్ప్లేస్లో యజమాన్యం తన సిబ్బందినందరిని మరుసటి రోజుకి భోజనాలు తెచ్చుకోవద్దని బహిరంగ ప్రకటన ఇచ్చింది. దాంతో అంతా మరుసటి రోజు ఇచ్చే విందు కోసం ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. వారిలానే ఈమహిళ కూడా కుతుహలంగా ఉంది. అయితే అక్కడ ఉద్యోగులంతా తమ కంపెనీ ఇచ్చే విందులో పాల్గొని ఖుషి చేస్తుంటే.. ఈ భారతీయ మహిళా ఉద్యోగి మాత్రం అక్కడ నుచి నిశబ్దంగా నిష్క్రమించాల్సి వస్తుంది. ఎందుకుంటే ఆ విందులో అక్కడ రకరకాల ప్లేవర్ల శాండ్విచ్లు సుమారు 60 రకాలు పైనే ఉన్నాయి. వాటిలో అత్యంత ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. అయితే అన్నీ నాన్వెజ్ శాండ్విచ్లే గానీ ఒక్క వెజ్ శాండ్విచ్ కూడా లేకపోవడంతో కంగుతింటుంది ఆమె. అక్కడకి వెజ్ శాండ్విచ్ కావాలని సదరు ఫుడ్ కేటరింగ్కి చెప్పినా..తినాలనుకుంటే..వాటి మధ్యలో ఉండే మాంసాన్ని తీసేసి తినవచ్చేనే ఉచిత సలహ ఇవ్వడంతో మరింత షాక్ అవుతుంది. అస్సలు అలా ఎలా తినగలను చాలా బాధపడింది. తనలాంటి ప్యూర్ వెజిటేరియన్లకు అది మరింత ఇబ్బందని, తింటే వాంతులు వస్తాయని వాపోయింది. తనకోసం వెజ్ శాండ్విచ్ ప్రిపేరవ్వదని భావించి ఆ ఈవెంట్ నుంచి నెమ్మదిగా నిష్క్రమించింది. అయితే అక్కడున్న వారంతా గిల్టీగా ఫీల్ అయ్యి..సదరు భారతీయ మహిళ రింజూన్కు మరేదైనా తెప్పిస్తామని రిక్వెస్ట్ చేశారు. కానీ ఆమెకు అప్పటికే ఆకలిగా ఉండటంతో ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లు ఇన్స్టా పోస్ట్లో పేర్కొంది. ఆ పోస్ట్ని చూసిన నెటిజన్లు తాము కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేశామంటూ ఆమె పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ.. పోస్టులు పెట్టారు.(చదవండి: ఆ ఊళ్లో నెమళ్ల బెడద..) -
కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మస్క్ ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్ను మస్క్ తప్పుబట్టారు. తాజా సెనేట్ డ్రాఫ్ట్ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్ సైతం మస్క్ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ మస్క్ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
సుంకాలపై ట్రంప్ కొత్త ట్విస్ట్.. అధ్యక్ష పదవిపై సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విధించే సుంకాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికాకు చాలా వెసులుబాటు ఉందన్నారు. సుంకాలను తిరిగి విధించడానికి జులై తొమ్మిది గడువును ఇప్పుడే నిర్ణయించలేమని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇక.. తాజాగా, అమెరికా అధ్యక్ష పదవిని ఉద్దేశిస్తూ ఆ పదవిలో ఉండటం చాలా ప్రమాదకరమని ఆయన తెలిపారు.అధ్యక్షుడు ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికా దిగుమతుల విషయంలో సుంకాలపై నిర్ణయం తీసుకోవడానికి మాకు స్వేచ్చ ఉంది. సుంకాల విధింపును అనుకున్న సమయం కంటే కుదించవచ్చు లేదా పొడిగించవచ్చు. అయితే, నేను వ్యక్తిగతంగా తొందరగా ముగించడానికే ఇష్టపడతాను. మీ అందరికీ ఓ విషయం తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరు 25 శాతం చెల్లిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. అయితే సుంకాలపై పెంపు నిర్ణయం మరింత వాయిదా పడే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బీసెంట్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా కార్మిక దినోత్సవం (సెప్టెంబర్ 1) నాటికి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.కెనడాతో కష్టం..అలాగే, కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్ను దాడిగా అభివర్ణించారు. ఇందుకు దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని అన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని పేర్కొన్నారు.అధ్యక్ష పదవి డేంజర్..ఇక, తాజాగా ట్రంప్ హైట్హౌస్లో మీడియాతో మాట్లాడుతూ గతేడాది పెన్సిల్వేనియాలో అధ్యక్ష ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన హత్యాయత్నాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. అనంతరం, ట్రంప్.. అధ్యక్ష పదవి ప్రమాదకరమైనది. ఎన్నో సవాళ్లతో కూడుకొని ఉంటుందని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి బాధ్యతలను కారు రేసింగ్, బుల్ రైడింగ్ లాగే ఇక్కడ కూడా చావు ఎప్పుడు ఎదురవుతుందో చెప్పలేమన్నారు. ఈవిషయం తనకు ఎవరైనా ముందే చెప్పి ఉంటే.. తాను ఈ రేసులో ఉండేవాడిని కాదన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, గతంలో ట్రంప్పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరిగింది.HOLY SH*T 🚨 President Trump just ENDED trade talks with Canada announcing massive tariffs soonAMERICA WILL NOT BE BULLIEDWE WILL NOT BACK DOWN pic.twitter.com/voOXgaBEes— MAGA Voice (@MAGAVoice) June 27, 2025ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి అధికారంలోకి వచ్చాక పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయా దేశాలతో ఎగుమతులు, దిగుమతుల టారిఫ్లపై నిర్ణయం తీసుకోవడం, వాణిజ్య ఒప్పందం చేసుకోవడం కోసం 90 రోజుల పాటు పెంచిన సుంకాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువు జులై తొమ్మిదో తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
ఎడిసన్లో అతిపెద్ద బౌలింగ్ కేంద్రం ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ థీమ్ మినీ పుట్టింగ్, లగ్జరీ బౌలింగ్ గమ్యస్థానమైన అల్బాట్రోస్ న్యూజెర్సీలోని ఎడిసన్లో ప్రారంభమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. ఇందులో ఎడిసన్ మేయర్ శామ్ జోషి, స్థానిక నాయకులు, మీడియా, ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.ఎడిసన్లోని 991 యుఎస్-1 వద్ద ఏర్పాటైన అల్బాట్రోస్ న్యూజెర్సీలో సామాజిక వినోదానికి ఒక కొత్త బెంచ్ మార్క్ ను ఏర్పరుస్తుంది. 50,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇది అద్భుతమైన థీమ్డ్ మినీ పుట్టింగ్, అప్స్కేల్ బౌలింగ్, ఎలివేటెడ్ డైనింగ్, క్రాఫ్ట్ కాక్టెయిల్స్ వంటి హంగులతో సాయంత్రం వేళ ఆటవిడుపును మరింత హుషారుగా మారుస్తుంది."మా గ్రాండ్ ఓపెనింగ్ ఒక అద్భుతమైన వేడుక, చివరికి అల్బాట్రోస్లోకి అతిథులను స్వాగతించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని అల్బాట్రోస్ ఎన్జె ప్రెసిడెంట్ స్టీఫెన్ సాంగర్మానో అన్నారు. "ఇది కేవలం వినోద వేదిక మాత్రమే కాదు- ఇది మరచిపోలేని సాటిలేని విధంగా రూపొందించబడిన సామాజిక ఆటస్థలం. మినీ పుటింగ్, లగ్జరీ బౌలింగ్ నుంచి క్రాఫ్ట్ కాక్టెయిల్స్, వైబ్రెంట్ డైనింగ్, లైవ్ డీజేల వరకు ఎక్కడా ఇలాంటివి లేవు’ అన్నారు."ప్రపంచ స్థాయి వినోదం, 350 కి పైగా ఉద్యోగాలు కల్పిస్తున్న అల్బాట్రోస్ ఎడిసన్కు గేమ్ ఛేంజర్. మా మొత్తం కమ్యూనిటీకి శక్తిని తెస్తోంది" అని ఎడిసన్ మేయర్ సామ్ జోషి అన్నారు. "175,000 డాలర్ల అంచనా పన్నులతో మా స్థానిక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా, కుటుంబాలు, స్నేహితులు, సందర్శకులు కనెక్ట్ కావడానికి, ఆనందించడానికి నూతన, ఉత్తేజకరమైన ప్రదేశాన్ని అందించే గమ్యస్థానానికి స్వాగతం పలకడం నిజంగా ఉత్తేజకరమైనది. ఎడిసన్ ఇంత డైనమిక్, సృజనాత్మక వేదికకు నిలయంగా ఉండటం మాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు. -
అమెరికాతో అణు చర్చలు జరపబోమని ఇరాన్ ప్రకటన
-
చాలా వెతికాం.. కనిపిస్తే కథ ముగించేవాళ్లం: ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కోసం చాలా వెతికామని, ఆయన కనబడితే కచ్చితంగా చంపేవాళ్లమని అంగీకరించింది. అయితే ప్రాణ భయంతోనే ఖమేనీ పారిపోయి దాక్కున్నారంటూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ వ్యాఖ్యానించారు.ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన కోసం చాలా చోట్ల వెతికామని, జాడ తెలిసి ఉంటే కచ్చితంగా మట్టుపెట్టేవాళ్లమని, కానీ ఆ విషయం తెలుసుకున్న ఖమేనీ లోతైన బంకర్లలో దాక్కున్నారని వ్యాఖ్యానించారాయన. ఖమేనీని అంతమొందించేందుకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF)కు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. కానీ, ఆయన సురక్షితంగా ఎక్కడో బంకర్లో దాక్కుని క్షిపణి దాడులు చేయించారు. ఇది అత్యంత తీవ్రమైన యుద్ధ నేరం కిందకే వస్తుంది అని కాట్జ్ అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తులో అలాంటి ప్రయత్నాలు సాగుతాయా? అనే ప్రశ్నకు.. ఆయన మౌనం వహించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీపై కాట్జ్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారేం కాదు. టెల్ అవీవ్పై జూన్ 14వ తేదీన ఇరాన్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన కాట్జ్.. ఖమేనీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఖమేనీకి ఇక భూమ్మీద ఉండే హక్కు లేదు అని, ఖమేనీ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని ఆ సమయంలో కాట్జ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా ఖమేనీపై విరుచుకుపడ్డారు. ఖమేనీ అభినవ హిట్లర్ అని, ఆయన ప్రాణాలతో లేకుంటేనే శాంతి నెలకొంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అమెరికా మాత్రం ఖమేనీ ఎక్కడ దాక్కున్నారనే పక్కా సమాచారం తమ వద్ద ఉందని చెబుతూ.. ఆయన్ని చంపే ఉద్దేశం లేదని, బేషరతుగా లొంగిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు.. ఖమేనీ తనకు వస్తున్న బెదిరింపులను తేలికగానే తీసుకుంటూ వచ్చారు. ఇరాన్ ఎప్పటికీ లొంగదు, బెదిరింపులకు భయపడదు అని సోషల్ మీడియాలో, ఇటు టెలివిజన్ ప్రసంగంలో పేర్కొంటూ వస్తున్నారు.ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాక.. ఆయన టెహ్రాన్ను వీడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వ వర్గాలతో సంబంధాలు లేకుండా.. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్కు దూరంగా.. గట్టి భద్రత మధ్య ఆయన సురక్షిత ప్రాంతంలో ఉన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వరుస కథనాలు ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాల్పుల విరమణ తర్వాత ఆయన జాడ లేదంటూ ఇరాన్ వ్యాప్తంగా ఆందోళన మొదలైంది. అయితే ఆ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆయన తాజాగా ఓ వీడియో సందేశం విడుదల చేశారు. అయితే అందులో 86 ఖమేనీ కాస్త నీరసంగా కనిపించారు. -
అమెరికా దాడుల ఎఫెక్ట్.. ట్రంప్కు షాకిచ్చిన ఇరాన్
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడికి ఇరాన్ ఊహించిన షాకిచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం సందర్భంగా తమపై అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి అణుచర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు.అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ వచ్చేవారం ఇరాన్తో అణుచర్చలు జరగనున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలపై తాజాగా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. ఈ సందర్బంగా అబ్బాస్.. అమెరికాతో అణు ఒప్పందానికి సంబంధించి సమావేశమయ్యే ఆలోచన మాకు లేదు. ఇటీవల ఇరాన్పై అమెరికా చేసిన దాడులు గణనీయమైన నష్టాన్ని కలిగించాయి. ఇరాన్ అణు కార్యక్రమం పునరుద్ధరణపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అమెరికాతో చర్చల్లో పాల్గొనే ఆలోచనే లేదు అని కుండబద్దలు కొట్టారు.#Iran's Foreign Minister Seyed Abbas Araghchi says that no arrangement or commitment was made to resume negotiations with the United States, amid heightened tensions following attacks by Israel and United States on Iranian territory. File Photo pic.twitter.com/LZruhGwi4K— All India Radio News (@airnewsalerts) June 27, 2025మరోవైపు.. నాటో శిఖరాగ్ర సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. వచ్చేవారం టెహ్రాన్తో అణుచర్చలు జరుపుతామన్నారు. అణ్వాయుధాలు తయారుచేయాలన్న ఆశయాన్ని వదిలేసేలా ఇరాన్తో ఒప్పందం చేసుకొనే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఇరాన్ చమురుపై ఆంక్షల విషయంలో కూడా చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు ట్రంప్ హింట్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనమయ్యేదని ఇరాన్ సుప్రీంనేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరంపై దాడి చేసి అగ్రరాజ్యాన్నీ చాచి చెంపదెబ్బ కొట్టామని అన్నారు. మళ్లీ తమపై దాడి చేసే ప్రయత్నం చేస్తే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్లోని మూడు అణుకేంద్రాలపై బంకర్ బ్లస్టర్ బాంబులు, క్రూజ్ క్షిపణులతో అమెరికా చేసిన దాడులు విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఈ దాడుల్లో అగ్రరాజ్యం ఏమీ సాధించలేకపోయిందని అన్నారు. ఖతార్లో అమెరికా స్థావరంపై తాము చేసిన దాడికి చాలా ప్రాధాన్యం ఉందని చెప్పారు. అమెరికా స్థావరాలకు చేరగల సత్తా తమ దేశానికి ఉందని నిరూపితమైందని అన్నారు. భవిష్యత్తులోనూ అవసరమైన సందర్భాల్లో ఇలాంటి దాడులు చేస్తామని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. -
భారత్ తో అమెరికా బిగ్ డీల్
-
భారత్తో భారీ వాణిజ్య ఒప్పందం
వాషింగ్టన్: భారత్తో త్వరలో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చాలారోజులుగా కొనసాగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించామని ఆయన స్పష్టమైన సంకేతాలిచ్చారు. ట్రంప్ గురువారం శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో మాట్లాడారు. త్వరలో గొప్ప ఒప్పందాలు పట్టాలెక్కబోతున్నాయని, వాటిలో ఒక ఒప్పందం బహుశా ఇండియాతోనే కావొచ్చని పేర్కొన్నారు. అది భారీగానే ఉంటుందని ఉద్ఘాటించారు. వ్యాపారం, వాణిజ్యం విషయంలో ఇండియాతో కలిసి పని చేయబోతున్నామని వివరించారు. ప్రతి దేశంతోనూ తమకు చక్కటి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అమెరికాతో ట్రేడ్ డీల్ ప్రతి దేశం ఆసక్తి చూపుతోందని అన్నారు. ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొనే పనిలో తమ ప్రభుత్వ యంత్రాంగం నిమగ్నమైందని తెలిపారు. అయితే, ప్రతి ఒక్కరితో ఒప్పందాలకు రావాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. 2030 నాటికి 500 బిలియన్ డాలర్లకు వాణిజ్యం అమెరికాతో తదుపరి వాణిజ్య చర్చల కోసం భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ బృందం గురువారం వాషింగ్టన్కు చేరుకుంది. మధ్యంతర ట్రేడ్ డీల్ను వచ్చే నెల 9వ తేదీ కల్లా ఖరారు చేసుకొనేందుకు ఇరుదేశాలు ప్రయతి్నస్తున్నాయి. ఇండియా ఉత్పత్తులపై ఏప్రిల్ 2న విధించిన అధిక టారిఫ్లను జూలై 9 దాకా ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. గడువులోగా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు వ్యవసాయం, పాడి పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులపై సుంకాలను చాలావరకు మినహాయించాలని అమెరికా కోరుతుండడం భారత్కు ఇబ్బందికరంగా మారింది. ఎలక్ట్రిక్ వాహనాలు, మద్యం, పెట్రోకెమికల్ ఉత్పత్తులు, కొన్ని రకాల పండ్లు, జన్యుమారి్పడి పంటలపై సుంకాలు భారీగా తగ్గించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. వ్రస్తాలు, వజ్రాలు, బంగారు అభరణాలు, తోలు ఉత్పత్తులు, ప్లాస్టిక్, రసాయనాలు, రొయ్యలు, నూనె గింజలు, ద్రాక్ష, ఆరటి పండ్లపై సుంకాల్లో కోత విధించాలని అమెరికాను భారత్ కోరుతోంది. వాణిజ్య ఒప్పందంలో ఇరుదేశాల డిమాండ్లకు ఏమేరకు ప్రాధాన్యం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ ప్రస్తుతం 191 బిలియన్ డాలర్లుగా ఉంది. 2030 నాటికి దీన్ని ఏకంగా 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ఇరుదేశాలు పట్టుదలతో ఉన్నాయి. #WATCH | "...We just signed (trade deal) with China. We're not going to make deals with everybody... But we're having some great deals. We have one coming up, maybe with India, a very big one. We're going to open up India. In the China deal, we're starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44— ANI (@ANI) June 26, 2025చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాం అమెరికా, చైనా మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందంపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందం వివరాలు బహిర్గతం చేయలేదు. రెండు రోజుల క్రితమే ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయని అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ తాజాగా స్పష్టంచేశారు. అమెరికాతో ఒప్పందం కుదిరిన మాట నిజమేనని చైనా వాణిజ్య శాఖ సైతం ధ్రువీకరించింది. చైనాలోని అరుదైన ఖనిజాలను అమెరికా కంపెనీలు సులభంగా పొందడానికి వీలుగా ఒప్పందానికి రాబోతున్నట్లు రెండు వారాల క్రితం ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ, తాజా ఒప్పందంలో ఈ అంశాన్ని చేర్చారా? లేదా? అనేది బయటపెట్టలేదు. అమెరికా కాలేజీల్లో చదువుకుంటున్న చైనా విద్యార్థుల వీసాలను రద్దుచేసే ప్రక్రియను నిలిపివేస్తామని అమెరికా ఇప్పటికే హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండు దేశాల నడుమ వాణిజ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. -
మైనస్లోకి అమెరికా జీడీపీ
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది తొలి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి/క్యూ1) అంచనాలకు మించి క్షీణతను చవిచూసింది. ట్రంప్ గందరగోళ వాణిజ్య విధానాలతో వ్యాపారపరమైన అనిశి్చతులకుతోడు బలహీన వినియోగ డిమాండ్ ప్రభావం చూపించాయి. జీడీపీ మైనస్ 0.5 శాతానికి పడిపోయినట్టు అమెరికా వాణిజ్య శాఖ తన మూడవ, తుది అంచనాలను ప్రకటించింది. ద్వితీయ అంచనాల్లో క్షీణత 0.2 శాతంగానే ఉండొచ్చన్న వాణిజ్య శాఖ అంచనాలను మించి ఆర్థిక వ్యవస్థ కుంగుబాటునకు గురైంది. మూడేళ్లలోనే మొదటిసారి అమెరికా జీడీపీ మైనస్లోకి వెళ్లినట్టయింది. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే కీలకమైన వినియోగదారుల వ్యయం నిదానించినట్టు తాజా అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. మార్చి త్రైమాసికంలో వినియోగం 1.2 శాతంగా ఉంటుందని అంచనా వేయగా, ఇది 0.5 శాతానికి పరిమితమైంది. 2024 చివరి త్రైమాసికంలోనూ వినియోగం 4 శాతం వృద్ధిని చూసింది. నాలుగేళ్లలోనే ఒక త్రైమాసికం పరంగా ఇది అతి తక్కువ వినియోగం కావడం గమనార్హం. మొదటి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ కుదేలవ్వడానికి ట్రంప్ టారిఫ్లు సైతం ప్రభావం చూపించాయి. టారిఫ్లు అమల్లోకి రావడానికి ముందే పెద్ద మొత్తంలో దిగుమతులకు అక్కడి సంస్థలు మొగ్గు చూపించాయి. 2024 చివరి త్రైమాసికంలో అమెరికా జీడీపీ 2.4 శాతం వృద్ధిని నమోదు చేయడం గమనార్హం. -
అమెరికా చెంప చెళ్లుమనిపించాం
దుబాయ్: ఖతార్లోని అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి ఇరాన్ తన సత్తాను చాటిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. దాడులతో అమెరికా చెంప చెళ్లుమనిపించామని ఆయన అన్నారు. యుద్ధంలో మేమే గెలిచామని ఆయన ప్రకటించారు. ఇరాన్పై బాంబుదాడులు చేసిన అమెరికాకు ఒనగూరింది శూన్యమని ఆయన ఎద్దేవాచేశారు. మరోసారి ఇరాన్పై దాడికి సాహిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికాను ఖమేనీ హెచ్చరించారు. యుద్ధం ముగిశాక తొలిసారి ఖమేనీ ఒక వీడియో సందేశం ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్లకు హెచ్చరికలు చేస్తూ పది నిమిషాలకుపైగా ఖమేనీ మాట్లాడిన ఆ వీడియోను ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ గురువారం ప్రసారం చేసింది. I offer my congratulations on the victory over the fallacious Zionist regime.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 My congratulations on our dear Iran’s victory over the US regime. The US regime entered the war directly because it felt that if it didn’t, the Zionist regime would be completely destroyed. It entered the war in an effort to save that regime but achieved nothing.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025 The fact that the Islamic Republic has access to key US centers in the region and can take action whenever it deems necessary is a significant matter. Such an action can be repeated in the future too. Should any aggression occur, the enemy will definitely pay a heavy price.— Khamenei.ir (@khamenei_ir) June 26, 2025అమెరికా రాకుంటే ఇజ్రాయెల్ ధ్వంసమయ్యేది‘‘యుద్ధంలో ఇజ్రాయెల్ను రక్షించేందుకే అమెరికా తప్పని పరిస్థితుల్లో రంగప్రవేశం చేసింది. అమెరికా గనక జోక్యంచేసుకోకపోయి ఉంటే మా దాడుల్లో ఇజ్రాయెల్ దారుణంగా ధ్వంసమయ్యేది. అయినా సరే అమెరికా స్థావరాలపైనా క్షిపణుల్ని ప్రయోగించి మా సత్తా చాటాం. ఖతార్లోని దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై క్షిపణి దాడులు చేశాం. ఇరాన్పై అమెరికా దాడులను ట్రంప్ అతిశయోక్తిగా చెప్తున్నారు. నిజానికి ఇరాన్పై దాడులతో అమెరికా సాధించింది శూన్యమే. జోక్యం చేసుకోకపోతే ఇజ్రాయెల్ నాశనమవుతుందన్న అంచనాతోనే అమె రికా యుద్ధంలోకి అడుగుపెట్టింది. కానీ లక్ష్యసాధనలో పూర్తిగా విఫలమైంది. మా ఇస్లామిక్ రిపబ్లిక్ జయకే తనం ఎగరేసింది. ఇది అమెరికాకు ఘోర పరాభవం. భవిష్యత్తులో మరోసారి మాపై దాడి చేయాలని అమెరికా భావిస్తే ఇంతకంటే పెద్దస్థాయిలో పరాభవం ఎదుర్కోక తప్పదు’’ అని ఖమేనీ హెచ్చరించారు. అయితే ఈ వీడియోలో ఖమేనీ కాస్తంత నీరసంగా కనిపించారు. -
దేశపు యువరాణి ట్రంప్ను వెక్కిరించింది?!.. వీడియో వైరల్
ఆమ్స్టర్డ్యామ్: అధికారిక పర్యటనలో భాగంగా నెదర్లాండ్ వెళ్లిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను (Donald Trump) ఆ దేశపు క్వీన్ మాక్సిమా (Queen Maxima) వెక్కిరించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇటీవల నెదర్లాండ్స్ (Netherlands)లో నాటో సమ్మిట్ జరింగింది. ఆ సమ్మిట్కు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యారు. అక్కడ రాజకీయ అతిథిగా హుయిస్ టెన్ బోష్ అనే రాయల్ ప్యాలెస్లో కింగ్ విలెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా అతిథిలుగా వచ్చారు. అక్కడ జరిగిన అధికారిక ఫోటోషూట్ సమయంలో ట్రంప్ మాట్లాడిన తరవాత, క్వీన్ మాక్సిమా అతని ముఖభావాలను అనుకరించినట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంతమంది ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని భావించగా, మరికొంతమంది మాత్రం ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అంటున్నారు. ఇది నిజంగా ట్రంప్ను వెక్కిరించారా? లేక కేవలం సరదాగా జరిగిన సంఘటనా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది. Queen #Máxima of the #Netherlands mocked #Trump's facial expressions.🙃No hint of condemnation – just understanding. pic.twitter.com/hNP3Rp2UaM— Boris Alexander Beissner (@boris_beissner) June 25, 2025 -
మీరు భారతీయుడిలా కాదు.. పాకిస్తానీలా కనిపిస్తున్నారు: కంగనా
న్యూఢిల్లీ: న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై బీజేపీ ఎంపీ, ప్రముఖ నటి కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేశారు. డెమొక్రటిక్ ప్రైమరీ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మమ్దానీ గెలుపొందిన తర్వాత అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించగా, కంగనా రనౌత్ సైతం అతని గెలుపును ఉద్దేశిస్తూ మండిపడ్డారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ ద్వారా మమ్దానీ భారతీయుడి కంటే పాకిస్తానీగానే ఎక్కువగా కనిపిస్తున్నాడని ఆరోపించారు కంగనా. @మమ్దానీ తల్లి మీరా నాయర్.. భారత అత్యుత్తమ చిత్ర నిర్మాణ రంగానికి కృషి చేసి పేరు సంపాదించారు. పద్మశ్రీ కూడా గెలుచుకున్నారు. ఆమె న్యూయార్క్లో ఉన్నప్పటికీ భారత్లో పుట్టి పెరిగారు. గుజరాత్కు చెందిన మెహ్మద్ మమ్దానీని మ్యారేజ్ చేసుకుని న్యూయార్క్లో సెటిల్ అయ్యారు. మెహ్మద్ మమ్దానీకి కూడా రచయితగా మంచి గుర్తింపు ఉంది. మరి జోహ్రాన్ మమ్దనీ మాత్రం పాకిస్తానీలాగా కనిపిస్తున్నాడు. భారత మూలాలు ఎక్కడ కనిపించడం లేదు. అతని భారత మూలాల్లో జరిగిందేదో జరిగింది. కానీ మమ్దానీ మాత్రం యాంటీ ఇండియన్ కాబోతున్నాడు’ అని కంగనా రనౌత్ రాసుకొచ్చారు. His mother is Mira Nair, one of our best filmmakers, Padmashri , a beloved and celebrated daughter born and raised in great Bharat based in Newyork, she married Mehmood Mamdani ( Gujarati origin) a celebrated author, and obviously son is named Zohran, he sounds more Pakistani… https://t.co/U8nw7kiIyj— Kangana Ranaut (@KanganaTeam) June 26, 2025 కాగా, 33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ డెమొక్రాటిక్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి రేసులో నిలిచాడు. ఉగాండాలో భారతీయ మూలాలున్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ప్రొఫెసర్ మహ్మూద్ మమ్దానీ, తల్లి ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్. భార్య సిరియా మోడల్ రమా దువాజీ(rama duwaji). రాజకీయ నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా న్యూయార్క్ మేయర్ రేసు ప్రచారంలో తొలి నుంచి.. ఉచిత బస్సు ప్రయాణం హామీతో బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే పిల్లల సంరక్షణ, సంపన్నులపై అధిక పన్నులు లాంటి హామీలతో ప్రచారంలో ఏడాదిగా దూసుకుపోతున్నాడు. అలెగ్జాండ్రియా ఒకాసియో-కార్టెజ్, బెర్నీ సాండర్స్ వంటి ప్రముఖులు ఇతనికి మద్దతుగా నిలిచారు. అయితే.. పాలస్తీనా మద్దతుతో పాటు పరిపాలనా అనుభవం లేమి వంటి అంశాలపై విమర్శలూ ఎదుర్కొన్నాడు.అయితే జోహ్రాన్ మమదానీకి జనాల్లో మాత్రం విపరీతమైన ఆదరణ ఉంది. మరీ ముఖ్యంగా యువతలో. సోషల్ మీడియాను ఏడాది కాలంగా బాగా ఉపయోగించుకుంటూ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. మద్దతుదారులతో డ్యాన్స్ చేస్తూ, మజ్జిగ పంచుతూ సంబరాలు చేస్తూ వీడియోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నారై కమ్యూనిటీని ఆకట్టుకునేందుకు బాలీవుడ్ సాంగ్స్, డైలాగులతో షార్ట్ వీడియోలతో సైతం ప్రచారం నిర్వహిస్తూ ఆకట్టుకుంటున్నారు. -
గాలిలో ఉండగానే విమానంలో మంటలు
-
ఖండాంతర క్షిపణి అభివృద్ధి కోసం పాక్ యత్నాలు
వాషింగ్టన్: పాకిస్తాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా ‘విదేశీ వ్యవహారాల’ నిఘా నివేదిక వెల్లడించింది. అణ్వస్త్ర సామర్థ్యంతో కూడిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ఐసీబీఎం) తయారీ యత్నాలను ముమ్మరం చేస్తోందని పేర్కొంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను చేధించగలదు. చైనా సహకారంతో పాక్ ఇందుకు పూనుకున్నట్టు సమాచారం. ఐసీబీఎంలు తయారుచేస్తే పాక్ను అమెరికా తన అణ్వస్త్ర శత్రువుగా ప్రకటించడం ఖాయమని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టంచేసినట్లు నివేదిక పేర్కొంది. అమెరికా భూభాగాన్ని తాకగలిగే స్థాయిలో సుదూరం నుంచి క్షిపణులను ప్రయోగించే సత్తా ఉన్న రష్యా, చైనా, ఉత్తర కొరియాను అమెరికా ‘అణ్వస్త్ర విరోధులు’గా ప్రకటించింది. ‘‘ఖండాంతర క్షిపణితో అమెరికాను లక్ష్యంగా చేసుకునే ఏ దేశాన్నీ అమెరికా తన మిత్రుడిగా భావించదు’’ అని ఆ దేశ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.ఐసీబీఎంలు లేని పాక్పాక్ వద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సాంకేతికత లేదు. ఐసీబీఎం క్షిపణులు లేవు. 2022లో భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్–3ను ప్రయోగించింది. ఇది 2,700 కి.మీ.కు పైగా ప్రయాణించగలదు. భారత్లోని ఎన్నో నగరాలు దాని పరిధిలోకి వచ్చాయి. దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నందుకు పాక్పై అమెరికా పలు ఆంక్షలు విధించింది. క్షిపణులను రూపొందించే ‘నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్’, మరో మూడు సంస్థలపై నిషేధం విధించింది. వీటితో వ్యాపారంచేసే తమ దేశీయ సంస్థల ఆస్తులను స్తంభింపజేస్తామని గతంలోనే అల్టిమేటమిచ్చింది. ఈ చర్యలను పాక్ తప్పుబట్టింది. అమెరికా స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తోందని ఆరోపించింది. ఎన్పీటీపై సంతకం చేయని పాక్ వద్ద 170 అణువార్హెడ్లు పోగుబడినట్లు పాత నివేదికలు వెల్లడిస్తున్నాయి. -
అణుఫైటర్ల కొనుగోలు
లండన్: వరుస ఉద్రిక్తతలు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో యూకే తన రక్షణ వ్యవస్థపై దృష్టి పెట్టింది. అణ్వస్త్ర వ్యవస్థను పటిష్టం చేసుకుంటోంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగలిగే ఎఫ్–35 ఏ ఫైటర్ జెట్లు 12 అమెరికా నుంచి కొనుగోలు చేయనున్నట్టు ప్రధాన మంత్రి కియిర్ స్టార్మర్ ప్రకటించారు. ‘తీవ్రమైన అనిశ్చితి యుగంలో ఈ విమానాలు మన సాయుధ దళాలను బలోపేతం చేస్తాయి. మన రక్షణ వ్యవస్థ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సైన్యానికి మద్దతు ఇస్తాయి’ అని స్టార్మర్ తెలిపారు. కొత్త విమానాలను నార్ఫోక్లోని ఆర్ఏఎఫ్ మార్హామ్లో ఉంచుతారు. శత్రు దాడులను నివారించడానికి, నాటో సభ్యుల మధ్య అణుశక్తిని పంచుకునే కార్యక్రమంలో భాగంగా ఇవి ఉంటాయి. యూకే అన్ని అంతర్జాతీయ ఒప్పందాలు, నిబంధనలకు కట్టుబడి ఉంటుంది. ‘దేశవ్యాప్తంగా 100 వ్యాపారాలకు, 20,000 కంటే ఎక్కువ ఉద్యోగా కల్పించే ఈ ఎఫ్35 డ్యూయల్ కెపాసిటీ విమానాలు మన రాయల్ ఎయిర్ ఫోర్స్లో కొత్త శకానికి నాంది పలుకుతాయి. మన దేశాన్ని, మన మిత్రదేశాలను బెదిరించే శత్రువుల నుంచి ముప్పును అరికడతాయి’ అని స్టార్మర్ అన్నారు.స్వాగతించిన నాటో.. ఈ ప్రకటనను నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే స్వాగతించారు. ఆయన దీనిని బ్రిటన్ నుంచి కూటమికి బలమైన సహకారంగా అభివర్ణించారు. ఈ నిర్ణయం నాటో ఫస్ట్ వ్యూహ్యాన్ని బలపరచడమే కాదు, యూకే ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుతుందని రక్షణ కార్యదర్శి జాన్ హీలీ అన్నారు. బ్రిటిష్ భూభాగంపై భవిష్యత్తులో దాడులు జరిగే అవకాశం ఉందని యూకే రక్షణ వ్యవస్థ ఇటీవల హెచ్చరికలు జారీ చేసింది. రష్యా అతిపెద్ద ముప్పుగా మిగిలిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ కొనుగోళ్ల ప్రకటన వెలువడింది.బలమైన అణుబంబాలను మోసుకెళ్లే జెట్లు..ఎఫ్–35ఏ విమానం బీ61–12 అనే ప్రత్యేకమైన బాంబును మోసుకెళ్ల గలదు. అవి 0.3, 1.5, 10, 50 కిలో టన్నుల పేలుడు పదార్థాలను మోయ గలవని అమెరికన్ సైంటిస్ట్స్ సమాఖ్య తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమాపై వేసిన బాంబు బరువు 15 కిలోటన్నులు. ఈ జెట్ విమానాలను యూఎస్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తయారు చేసింది. ఎఫ్–35ఏ పాత ఎఫ్–35బీ కంటే ఖరీదు తక్కువని, ప్రతి విమానంపై 25% వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. -
ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఉన్నందుకు అమెరికాలో ప్రవేశించనివ్వలేదు
న్యూయార్క్: ఫోన్లో జేడీ వాన్స్ బట్టతల మీమ్ ఫొటో ఉన్నందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనను అమెరికాలో ప్రవేశించనివ్వలేదని నార్వేకు చెందిన పర్యాటకుడు ఆరోపించారు. తనకు ఎలాంటి నేరచరిత్ర లేకపోయినా.. తాను నెవార్క్ విమానాశ్రయంలో దిగిన మరుసటి రోజు తిప్పి పంపారని తెలిపాడు. నార్వేకు చెందిన 21 ఏళ్ల మాడ్స్ మికెల్సెన్ న్యూయార్క్, టెక్సాస్, ఆస్టిన్లలో స్నేహితులను కలవడానికి అమెరికాకు వెళ్లాడు. అలాగే తన తల్లితో కలిసి రోడ్ ట్రిప్లో జాతీయ ఉద్యానవనాలను సందర్శించాలనుకున్నాడు. కానీ నెవార్క్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు మికెల్సెన్ను అడ్డుకున్నారు. ‘నన్ను అనేక మంది సాయుధ గార్డులు ఉన్న గదికి తీసుకెళ్లారు. అక్కడ నా బూట్లు, మొబైల్ ఫోన్, బ్యాక్ప్యాక్ను తీసుకున్నారు. అధికారులు నా ఫోన్ను అన్లాక్ చేయమని ఒత్తిడి తెచ్చారు. నిరాకరిస్తే జైలు శిక్ష లేదా 5వేల డాలర్ల జరిమానా విధిస్తామని బెదిరించారు. సందర్భాన్ని వివరించిన తర్వాత కూడా, అధికారులు నా వస్తువులను తనిఖీ చేశారు. వేలిముద్రలను తీసుకున్నారు. రక్త నమూనాలను సేకరించారు. అమెరికాలో నేను కలవాలనుకున్న వారందరి పేర్లు, చిరునామాలు, ఫోన్ నంబర్లు, వృత్తుల వివరాలు అడిగారు. నేను పన్నెండు గంటలు ప్రయాణించాను. సరిగ్గా నిద్రపోలేదు. వారు ప్రశ్నించడం ప్రారంభించే ముందే శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయాను. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద కుట్రలు, మితవాద తీవ్రవాదంలో పాల్గొన్నట్లు అధికారులు నాపై ఆరోపణలు చేశారు. కానీ నిజానికి కారణం అది కాదు. నా ఫోన్లో జేడీ వాన్స్ మీమ్ ఫొటో ఉంది. అందులో ఆయన బట్టతలతోఉన్నారు. అలాగే నేను చేతిలో ఒక చెక్క పైపుతో ఉన్న ఫొటో కూడా వారికి నచ్చలేదు. ఈ రెండు చిత్రాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నన్ను అడ్డుకుంటాయని అనుకోలేదు. మరునాడు నన్ను నార్వే వెళ్ళే విమానంలో ఎక్కించారు’అని మికెల్సెన్ ఆరోపించారు. ఈ వీడియో సామా జిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. -
నిక్షేపంగా న్యూక్లియర్ సైట్లు
వేల కేజీల బరువైన భారీ బాంబులను యురేనియం శుద్ధి కేంద్రాలపై పడేసి వాటిని నామరూపాల్లేకుండా చేశామని అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలు శెభాష్ అని తమకుతామే జబ్బలు చరుచుకున్నారు. అయితే వాస్తవంలో ఇరాన్కు అంతటి నష్టమేమీ జరగలేదని స్వయంగా అమెరికా నిఘా నివేదిక ఒకటి పేర్కొంది. పర్వతగర్భ ఫోర్డో అణుకేంద్రాన్ని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా కొండపైభాగంపై అరడజను దాకా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్ గైడెడ్ బాంబులను అమెరికా పడేసింది. అయితే కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని, అంతర్భాగంలో ఉన్న అణుకేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలుకొట్టింది. అమెరికా రక్షణశాఖ(పెంటగాన్)లోని నిఘా విభాగమైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(డీఐఏ) టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు అంతర్జాతీయ మీడియాకు లీక్ అయ్యా యి. ఈ వివరాలను సీఎన్ఎన్ వార్తాసంస్థ తొలుత తన కథనంలో బహిర్గతంచేసింది. అణుబాంబు తయారుచేయకుండా ఇరాన్ను శాశ్వతంగా నిలువరించామన్న ట్రంప్ వ్యాఖ్య ల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది. ముందుజాగ్రత్తగా ఇరాన్ ఆ మూడు యురేనియం శుద్ధి కర్మాగారాల నుంచి ముడి యురేనియం, శుద్ధిచేసిన యురేనియం నిల్వలు, సెంట్రిఫ్యూజ్లను ముందే వేరే చోట్లకు తరలించిందన్న వాదనలకు ఈ నివేదికతో బలం చేకూరింది. నివేదికలో ఏముంది? ఈ మూడు అణుకేంద్రాల్లోని కీలక నిర్మాణాలు, మౌలిక వసతులు, పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని, దాడుల కారణంగా యురేనియం శుద్ధి కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది. ధ్వంసమైన విభాగాలను పునరుద్ధరించి మరి కొన్ని నెలల్లో ఇరాన్ మళ్లీ న్యూక్లియర్ సైట్లను పూర్వస్థితికి తీసుకురాగలదని నివేదిక అభిప్రాయపడింది. నతాంజ్, ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను నేలపై నిర్మించారు. అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ అణుకేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది. ఈ అంశాన్ని ఇరాన్ సైతం ఒప్పుకుంది. అయితే భూగర్భంలో నిర్మించిన నతంజ్, ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది. బయటివైపు నిర్మించిన విద్యుత్, ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి. కానీ భూగర్భంలోని సెంట్రిఫ్యూజ్ నిర్వహణ వ్యవస్థలు నిక్షేపంగా ఉన్నాయని, అక్కడి సెంట్రీఫ్యూజ్లను దాడులకు ముందే తరలించారని నివేదిక వెల్లడించింది. ఈ లెక్కన ఇరాన్ అణుకార్యక్రమం తాత్కాలికంగా వాయిదాపడిందిగానీ శాశ్వతంగా ఆగిపోలేదు. మరికొన్ని నెలల్లో రిపేర్లు, పునర్నిర్మాణాల తర్వాత భూగర్భ కేంద్రాల్లో మళ్లీ యురేనియం శుద్ధి కార్యక్రమం మొదలయ్యే అవకాశముందని నివేదిన అంచనావేసింది. అదంతా అబద్ధం: ట్రంప్ అంతపెద్ద బాంబులేసినా ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు తన సొంత సామాజికమాధ్యమం ట్రూత్ సోషల్’లో పలు పోస్ట్లు పెట్టారు. ‘‘అణురియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్ధం. నకిలీ వార్తలను నమ్మకండి. ఇరాన్లోని అణుకేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి. తప్పుడు, అబద్ధాలు కథనాలు వండివార్చినందుకు న్యూయార్క్ టైమ్స్, సీఎన్ఎన్ వార్తాసంస్థల చెంపలను అమెరికా పౌరులు చెళ్లుమనిపించాలి. బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించడం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనికదాడి. ఇంతటి గొప్పదాడిని ఈ మీడియాసంస్థలు తక్కువచేసి చూపిస్తున్నాయి. లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేలి్చన పైలెట్లను అభినందించాల్సిందే. పైలెట్లు అద్భుతంగా పనిచేశారు. వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోంది’’అని అన్నారు. ముఖ్యంగా సీఎన్ఎన్పై ట్రంప్ తిట్లదండకం మొదలెట్టారు. ‘‘సీఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారంచేస్తుంది. నేను కూడా సీఎన్ఎన్ ఛానలే చూస్తా. మరో ప్రత్యామ్నాయం లేదుమరి. అందులో అంతా చెత్తే ఉంటుంది. అన్ని నకిలీ వార్తలే’’అని అన్నారు. స్పందించిన శ్వేతసౌధం నివేదిక రూపకల్పనను ఒప్పుకున్న వైట్హౌస్.. ఆ నివేదికలోని అంశాలతో మాత్రం విబేధించడం విశేషం. ట్రంప్ సర్కార్ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అసత్యాలను మీడియాలో ప్రచారంచేస్తున్నారని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అన్నారు. ‘‘అత్యంత రహస్యమైన ఆ నివేదికలోని అంశాలు లీక్ అయిన మాట వాస్తవమే. అంతర్గత నిఘా విభాగ కిందిస్థాయి సిబ్బందిలో కొందరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అధ్యక్షుడు ట్రంప్ను అపకీర్తి పాలుచేద్దామని కొందరు కుట్ర పన్ని ఇలా లీక్ చేశారు. ఇరాన్ అణుకార్యక్రమాలను అడ్డుకునేందుకు వేలకిలోమీటర్లు ప్రయాణించి, తెగించి బాంబులేసిన యుద్ధవిమాన పైలట్ల ధైర్యసాహసాలను ఈ లీక్వీరులు కించపరిచారు. ఒక్కోటి 13,600 కేజీల బరువుండే 14 భారీ బాంబులను పేలిస్తే ఎంతటి వినాశనం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా పనికిరాకుండా పోయాయి’’అని కరోలిన్ చెప్పారు. లీక్కు పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు ఎఫ్బీఐతో దర్యాప్తు చేయిస్తున్నామని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. లీక్ అయిన నివేదిక కేవలం అంచనా నివేదిక అని ఆయన వ్యాఖ్యానించారు. నిజం దాస్తున్న ఇరాన్! శత్రు దేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్పనష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెబుతారు. ఆ లెక్కన ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భఘైల్ సైతం తమ అణుకేంద్రాలు తక్కువస్థాయిలోనే ధ్వంసమయ్యాయని చెప్పాలి. కానీ ఆయన భారీ నష్టం వాటిల్లిందని బుధవారం మీడియాతో అన్నారు. దీని వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అణుకార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొద్దనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా అబద్ధాలు చెబుతున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అణుకార్యక్రమాన్ని మొదలెట్టే విషయం బయటకు పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్ధాలు చెబుతున్నారని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
స్పేస్లోకి శుభాంశు శుక్లా.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము ఏమన్నారంటే
సాక్షి,ఢిల్లీ: ఇస్రో-నాసా సంయుక్త యాక్సియం-4 మిషన్ కోసం అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా(Shubhanshu Shukla)కు రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ శుభాకంక్షలు తెలిపారు. శుభాంశు శుక్లా స్పేస్లోకి 1.4 బిలియన్ల మంది భారతీయుల శుభాకాంక్షల్ని,నమ్మకాల్ని, ఆకాక్షంల్ని మోసుకెళ్తున్నారని ప్రధాని మోదీ కొనియాడారు. శుభాంశు శుక్లాతో పాటు మిషన్ కమాండర్ అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్కు చెందిన మిషన్ స్పెషలిస్ట్స్లావోష్ ఉజ్నాన్స్కీ,హంగేరీ మిషన్ స్పెషలిస్ట్ టిబోర్ కాపులకు మోదీ శుభాంక్షలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాంశు శుక్లా అంతరిక్ష ప్రయాణంపై స్పందించారు. గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా భారత అంతరిక్ష విభాగంలో సరికొత్త రికార్డ్లను సృష్టించారు. అంతరిక్షంలోకి ఈ భారతీయుడి ప్రయాణం పట్ల మొత్తం దేశం ఉత్సాహంగా గర్వంగా ఉంది. శుభాంశు తన ఆక్సియం మిషన్ 4లోని అమెరికా, పోలాండ్, హంగేరీ వ్యోమగాములుతో తమదంతా ‘వసుధైవ కుటుంబం (ఒకే కుటుంబం)’గా నిరూపించారని ముర్ము అన్నారు.భారత సంతతికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా. ఆయన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అమెరికా ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ నిర్వహిస్తున్న Ax-4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి వెళుతున్నారు. ఈ మిషన్ ద్వారా రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలవనున్నారు. We welcome the successful launch of the Space Mission carrying astronauts from India, Hungary, Poland and the US. The Indian Astronaut, Group Captain Shubhanshu Shukla is on the way to become the first Indian to go to International Space Station. He carries with him the wishes,…— Narendra Modi (@narendramodi) June 25, 2025 As Group Captain Shubhanshu Shukla creates a new milestone in space for India, the whole nation is excited and proud of an Indian’s journey into the stars. He and his fellow astronauts of Axiom Mission 4 from the US, Poland and Hungary prove the world is indeed one family –…— President of India (@rashtrapatibhvn) June 25, 2025 -
పాక్ టార్గెట్ అమెరికా??.. ఇది జోక్ కాదు బాస్!
ఎవ్వడ్రా వీడు.. ఘోల్లుమనే జోక్ వేశాడు అనుకుంటున్నారా?. కానీ ఇదే నిజం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రపంచమంతా దృష్టిసారించిన వేళ..పాక్ రహస్యంగా శక్తివంతమైన.. అదీ న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల తయారీ చేపట్టింది!. ఈ విషయాన్ని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించినట్లు ఫారిన్ ఎఫైర్స్ అనే పత్రిక కథనం ప్రచురించింది. దీర్ఘ శ్రేణి నూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్ల(ICBM) తయారీని పాకిస్థాన్ రహస్యంగా చేపడుతోంది. వీటి సామర్థ్యం ఏకంగా.. అమెరికాకు చేరుకోగలదని వెల్లడించింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా సాయంతో పాక్ వీటిని అభివృద్ధి చేస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ అలాంటి క్షిపణులను సమకూర్చుకుంటే.. ఆ దేశాన్ని అణ్వస్త్ర శత్రువుగా అమెరికా గుర్తించడం ఖాయమని వాషింగ్టన్ నిఘా వర్గాలు స్పష్టం చేశాయని సదరు కథనం పేర్కొంది.అమెరికాను తాకగలిగే అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఏదైనా సరే.. అమెరికాకు శత్రువుగానే చూడాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలను సదరు నివేదిక ప్రముఖంగా పేర్కొంది. ఈ కథనాన్ని వైట్హౌజ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది. ఐసీబీఎం అంటే.. ఖండాలను దాటగలిగే సామర్థ్యం ఉన్న క్షిపణులు. ఇందులో అణ్వాయుధాలతో పాటు సాధారణ యుద్ధ క్షిపణులు కూడా ఉంటాయి. వీటి లక్ష్యం.. 5,500 కిలోమీటర్లు దాకా ఉండొచ్చు. అయితే ప్రస్తుతానికి పాక్ దగ్గర అలాంటి క్షిపణలేం లేవు. ప్రస్తుతం అమెరికా జాబితాలో రష్యా, చైనా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ తన ఆర్థికాభివృద్ధిని పణంగా పెట్టి.. ఆయుధాల కొనుగోళ్లపై దృష్టిపెట్టిందని ఆ దేశ మీడియా నుంచే కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే దేశ రక్షణ బడ్జెట్ను 20 శాతం పెంచింది. ఏకంగా 9 బిలియన్ డాలర్లకు కేటాయించింది. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వం ఆ దేశ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ డిమాండ్లను సంతృప్తిపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఈ బడ్జెట్లో పెంచిన నిధులతో ఆపరేషన్ సిందూర్లో దెబ్బతిన్న టెర్రర్ క్యాంప్లను మళ్లీ పునరుద్ధరించనుందని తెలుస్తోంది. అలాగే చైనా నుంచి భారీగా ఆయుధ సంపత్తిని పాక్ దిగుమతి చేసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే ఆ దేశ విధానంలో.. షార్ట్, మీడియం రేంజ్ మిస్సైల్స్ మాత్రమే ఉన్నాయి. చివరగా.. 2022లో పాక్ మీడియం రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్ షాహీన్-3ను ప్రయోగించింది. దీని పరిధి.. 2,700 కిలోమీటర్లు. ఇదిలా ఉంటే.. తమ దేశం చేపట్టే అణు పరీక్షలు భారత్ ముప్పును ఎదుర్కొనేందుకేనని పాక్ పలుమార్లు బాహాటంగానే ప్రకటించుకుంది. కిందటి ఏడాది.. పాక్ మీద లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్స్ కార్యక్రమంపై అమెరికా ఆంక్షలు విధించగా.. పాక్ వాటిని పక్షపాత ధోరణిగా ప్రకటించింది.ప్రస్తుతం పాక్ దగ్గర 170 న్యూక్లియర్ వార్హెడ్స్ ఉన్నాయి. తద్వారా న్యూక్లియర్ నాన్ ప్రొలైఫ్రేషన్ ట్రీటీ(NPT)కి పరిధిని ఉల్లంఘించింది. న్యూక్లియర్ వెపన్స్ను కట్టడి చేయడం, తద్వారా అణు శక్తిని పరిమితంగా(శాంతి పరిధికి లోబడి) ఉపయోగించుకోవాలని చెప్పడం ఈ ఒప్పంద ఉద్దేశం.ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం.. మే నెలలో పాక్ ఉగ్రశిబిరాలపై, ఆ దేశ ప్రధాన ఎయిర్బేస్లపై దాడులు జరిపింది. ఆ సమయంలో పాక్ తన హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందని.. అయితే భారత రోబస్ట్ ఎయిర్డిఫెన్స్ సిస్టమ్ దానిని అడ్డుకుందనే ప్రచారం జోరుగా నడిచింది. అటుపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్రమంత్రులు పాక్ న్యూక్లియర్ కార్యకలాపాలపై దృష్టిసారించాలని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కోరారు. పాక్ అలాంటి ఆయుధాల విషయంలో హద్దులు మీరి ప్రవర్తించదనే ఆశిస్తున్నట్లు రాజ్నాథ్ కూడా వేరుగా ఓ ప్రకటన చేశారు. -
మా ట్రంప్కు నోబెల్ ఇవ్వండి.. అమెరికా నుంచి నామినేషన్
-
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. నష్టం ఎవరికి? నెగ్గిందెవరు?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధానికి తాత్కాలికంగానైనా తెరపడింది. క్షిపణి మోతలు, సైరన్ల హోరు కాస్త తగ్గింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలతో ఇరుపక్షాలూ కాల్పుల విరమణకు అంగీకరించాయి. కానీ పరిస్థితి ఇప్పటికీ నివురుగప్పిన నిప్పు చందంగానే ఉందన్నది నిపుణుల అంచనా. అయితే... పదమూడు రోజులపాటు సాగిన ఈ యుద్ధంలో నెగ్గిందెవరు? తగ్గిందెవరు? కష్టమెవరికి? నష్టమెవరికి?.. ఇరాన్ అణుకార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా జూన్ 13వ తేదీన ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో ఇరాన్పై దాడులు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. కేవలం అయిదంటే అయిదు రోజుల్లో ఇజ్రాయెల్ ఇరాన్లోని వందకుపైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 330 వరకూ క్షిపణులు ప్రయోగించింది. ప్రతిగా ఇరాన్ జూన్ పదమూడుతో మొదలుపెట్టి వరుసుగా వారం రోజులపాటు ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం కురిపించింది. ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థ ఐరన్ డోమ్ కొన్నింటిని నిరోధించగలిగినా... మిగిలినవి ప్రాణ, ఆస్తినష్టానికి కారణమయ్యాయి. అయితే.. జూన్ ఇరవైన అమెరికా రంగ ప్రవేశంతో యుద్ధం తీరుతెన్నులు మారాయి. అణుస్థావరాలపై దాడులు చేయడం ద్వారా అమెరికా అతిపెద్ద తప్పు చేసిందని, ఈ దాడులు యుద్ధ ప్రకటనేని హూంకరించిన ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ స్థావరాలపై బాంబుల వర్షం కురిపించింది కూడా. అయితే ఆ తరువాత జూన్ 22న రోజు గడవకముందే ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంతో సర్వత్ర ఆశ్చర్యం వ్యక్తమైంది. అయితే ఈ కాల్పుల విరమణ అమెరికా ఒత్తిడితో బలవంతంగా కుదిరిందే కానీ స్వచ్ఛందంగా ప్రకటించింది కాదని దౌత్య, మిలటరీ వర్గాలు అంటున్నాయి. ఇరాన్ క్షిపణి దాడులతో బెంబేలెత్తిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ జోక్యం చేసుకోవాల్సిందిగా అమెరికాను అభ్యర్థించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ట్రంప్ ఈ అభ్యర్థనను మన్నించి ఇరాన్ అణుస్థావరాలపై దాడులు చేశారు. ఇలా ట్రంప్ నెతన్యాహ్యూ తన మాట వినేలా చేసుకున్నాడని, అందుకే ఇష్టం లేకపోయినా కాల్పుల విరమణకు అంగీకరించాలని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా.. ఇజ్రాయెల్ రెచ్చగొట్టనంత వరకూ తాము ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించమని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియన్ స్పష్టం చేయగా... ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ ‘యుద్ధం ముగియలేదు’ ప్రకటించడం గమనార్హం. ఇందుకు తగ్గట్టుగానే ఇరాన్ మళ్లీ దాడులకు దిగిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ టెహ్రాన్పై క్షిపణులను ప్రయోగించింది. ఒక అణుశాస్త్రవేత్త మృతికి కారణమైంది కూడా. ఇదిలా ఉంటే... ఫొర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణు స్థావరాలపై ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్ సమీప భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయలేదని ట్రంప్ ప్రకటించగా... జరిగిన నష్టం తక్కువేనని, కొన్ని నెలల్లోపే అణ్వాయుధాలకు కావాల్సినంత శుద్ధ యురేనియంను సిద్ధం చేసుకోగలమని ఇరాన్ చెబుతోంది. ఇందులో ఏమాత్రం వాస్తవమున్నా అటు అమెరికా, ఇటు ఇజ్రాయెల్ రెండు ఇరాన్పై దాడుల పరంపర కొనసాగించే అవకాశాలే ఎక్కువ.మొత్తమ్మీద చూస్తే ఈ యుద్ధంలో ఇరాన్దే పైచేయిగా కనిపిస్తోంది. అణ్వాయుధ కార్యక్రమాల నిలిపివేత, ఇరాన్లో ప్రభుత్వ మార్పు అనే రెండు లక్ష్యాలతో యుద్ధం మొదలుపెట్టిన ఇజ్రాయెల్ వాటిని సాధించలేకపోయింది. అణు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రభుత్వ మార్పు ఉండబోదని స్పష్టం చేయడం ద్వారా ఇరాన్ అమెరికాను కూడా తోసిరాజు అనగలిగింది!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
వలస ఖైదీలను మూడో దేశానికి పంపొచ్చు.. అమెరికా సుప్రీంకోర్టు
వాషింగ్టన్: వలసదారులను వారి స్వదేశాలకు కాక ఇతర దేశాలకు తిరిగి పంపించే ప్రక్రియకు అమెరికా సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. వలసదారులను మూడో దేశానికి పంపడం వల్ల వారు ఎదుర్కొనే ప్రమాదాలను అధికారులకు చెప్పడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును తోసిపుచ్చింది. ఇది అక్రమాలకు వారు అనుభవించే ప్రతిఫలమని కోర్టు వ్యాఖ్యానించింది.వలసదారుల బహిష్కరణలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఊరటను ఇచ్చింది. ఈ కేసులో మయన్మార్, దక్షిణ సూడాన్, క్యూబా, మెక్సికో, లావోస్, వియత్నాం దేశాలకు చెందిన ఎనిమిది మంది వలసదారులు ఉన్నారు. వీరిని మే నెలలో దక్షిణ సూడాన్కు వెళ్తు విమానంలో పంపించారు.అయితే వలసదారులను మూడో దేశాలకు తరలిస్తే అక్కడ వారు హింసకు లేదా హత్యకు గురయ్యే అవకాశం ఉందన్న అప్పీళ్లను సుప్రీం కొట్టిపారేసింది. కోర్టు తీర్ప భయంకరమైనదని నేషనల్ ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ అలయన్స్ తెలిపింది. ఈ నిర్ణయం తమ క్లయింట్లను హింసకు, మరణానికి గురిచేసిందన్నారు. ఈ తీర్పు అమెరికా ప్రజల భద్రత, రక్షణకు విజయమని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పేర్కొంది. ఎనిమిది మంది వలసదారులు అమెరికాలో హత్య, దహనం, సాయుధ దోపిడీతో సహా క్రూరమైన నేరాలకు పాల్పడ్డారని తెలిపింది. కానీ, ఖైదీలలో చాలా మందిపై ఎటువంటి నేరారోపణలు లేవని వలసదారుల న్యాయవా దులు సుప్రీంకోర్టుకు వినిపించారు. -
ఇంతకీ గెలిచిందెవరు?
పన్నెండు రోజులపాటు భీకరంగా సాగి కాల్పుల విరమణ ఒప్పందం దిశగా పయనించిన ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో తామే విజయం సాధించామని ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఎవరికి వారు ప్రకటించుకున్నారు. తన వల్లే యుద్ధం ఆగిందని ట్రంప్ ఇప్పటికే ప్రకటించుకోగా, తమ ప్రయత్నం కారణంగానే సమరం సమసిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ ప్రకటించారు.దీంతో ఈ ఘర్షణలో నిజంగా గెలుపు జెండా ఎవరు ఎగరేశారనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత విజయం సాధించారనే వాదనా వినిపిస్తోంది. అణుక్షేత్రాలను కుప్పకూల్చి ఇరాన్ కోలుకోలేని దెబ్బతీశానని అమెరికా ప్రకటించుకుంది. సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలుసహా వైమానిక స్థావరాలు, క్షిపణి లాంచర్లను నాశనంచేసి ఇరాన్కు బుద్ధి చెప్పానని ఇజ్రాయెల్ గొప్పలు పోయింది. అమెరికాను సైతం ఎదిరించి పోరాడి తమ సత్తా చూపామని ఇరాన్ ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో యుద్ధాగ్ని నుంచి ఎవరు ఏ ప్రయోజనాలు పొందారనేది ఆసక్తికరంగా మారింది.ట్రంప్కు శాంతిదూతగా మార్కులుఇజ్రాయెల్– హమాస్ యుద్ధం, ఉక్రెయి న్–రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని శాంతిస్థాపనకు శతథా ప్రయత్నించానని ట్రంప్ చెప్పుకున్నారు. అయితే అక్కడ విఫలమైనా ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధాన్ని ఆపి సఫలీకృతుడిని అయ్యానని ట్రంప్ చెబుతున్నారు. శాంతిని కోరుకుంటూనే ఫోర్డో అణుకేంద్రంపై బాంబులేయడమేంటని అమెరికాలోనూ ట్రంప్కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి.దోహాలోని తమ స్థావరంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినా ట్రంప్ సంయమనం కోల్పోలేదు. ఈ విషయంలో ట్రంప్కు మంచి మార్కులు పడ్డాయి. శాంతికాముకులు ట్రంప్ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. శాంతి నోబెల్ కోసం ఎదురుచూస్తున్న ట్రంప్ ఆశలు ఈ కాల్పుల విరమణతో చిగురించినట్లే భావించాలి.గగనతలంపై ఇజ్రాయెల్ విజయంక్షిపణి లాంచర్లను నాశనం చేయడం ద్వారా ఇరాన్ గగనతలంపై తాము పూర్తి పట్టుసాధించామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ప్రకటించారు. ఇది తన ఘన విజయమని చెప్పారు. ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఉన్నతాధి కారులు, అణు శాస్త్రవేత్తలను అంతంమొందించారు. సైనిక, వైమానిక స్థావరాలను ధ్వంసంచేశారు. అణుకేంద్రాలు, మౌలిక వసతు లను కోలు కోనంతగా దెబ్బ తీశారు.ఇవన్నీ తన విజ యాలేనని నెతన్యా హూ సొంత డబ్బా భజా యించారు. శత్రుదేశాన్ని పలు రకాలుగా దెబ్బ కొట్టడం ద్వారా ఒక రకంగా నెతన్యా హూ భారీ స్థాయిలో పాపులారిటీ, ప్రజాదరణను పెంచుకున్నారు. వచ్చే ఏడాది తమ దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఈ యుద్ధపర్వం నెతన్యాహూ పార్టీ విజయావకాశాలు అమాంతం పెంచింది. యుద్ధంలో తనకు తోడుగా అగ్రరాజ్యం కలిసివచ్చేలా ట్రంప్ను ఒప్పించడంలోనూ నెతన్యాహూ విజయం సాధించారు.అగ్రరాజ్యాన్నీ ఢీకొట్టగలనని ఇరాన్ సంకేతంతమ ఉనికే ప్రశ్నార్థకమైతే అగ్రరాజ్యం అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహా యూఎస్ స్థావరంపై క్షిపణి దాడులతో ఇరాన్ నిరూపించింది. ఘర్షణ మరింతగా విస్తరించకుండా గౌరవప్రదంగా యుద్ధక్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకూ తెలుసునని ఇరాన్ రుజువు చేసింది. పశ్చిమాసి యాలో ఎ న్నో దేశాల్లో అమెరికా స్థావరా లున్నా తమకు మిత్రదే శమైన ఖతార్లోని స్థావ రం మీదనే ఇరాన్ వ్యూహా త్మకంగా క్షిపణుల్ని ప్రయోగించింది.అమెరికా, ఇరాన్ కయ్యా నికి తమ భూభాగం రణక్షే త్రంగా మారొద్దని ఖతార్ సైతం మధ్యవర్తిత్వానికి ముందుకు రావాలనే వ్యూహంతో ఇరాన్ కేవలం అల్ ఉదేయిద్ బేస్పైనే దాడులు చేసింది. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తి త్వానికి తన వైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పింది.కొసమెరుపుఇప్పటికే హమాస్– ఇజ్రాయెల్ పోరు, ఉక్రెయిన్–రష్యా రణం, హౌతీ తిరుగుబాటుదారులు చమురునౌకలపై దాడులతో అధిక పెట్రో ధరల కత్తి గుచ్చుకుంటుందన్న భయాలతో ప్రపంచదేశాలు అల్లాడుతున్న వేళ 12 రోజులకే ఇజ్రాయెల్, ఇరాన్ వార్ కంచికి చేరడం అందరికీ పెద్ద ఊరట. అయితే అంతెత్తున ఎగసిన యుద్ధజ్వాలలు పూర్తిగా ఆరిపోతాయో లేదోనన్న అనుమానాలూ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్నాయి.ఈ దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్న విద్వేషాలను మళ్లీ రాజేసుకుని పశ్చిమాసియా ప్రశాంతతకు గండి కొడతాయేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ దాడులతో పాఠం నేర్చుకున్న ఇరాన్ మళ్లీ అత్యంత రహస్యంగా యురేనియంను వేరే చోట శుద్ధిచేస్తే పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా శాంతిచర్చలు మొదలెట్టి దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవడం అత్యావశ్యకం. -
విరమణ... నిజంగానా?!
ఎప్పటిలాగే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బహుపాత్రాభినయంతో అందరినీ మెప్పిస్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు సాగించిన కొన్ని గంటలకే ఇరాన్–ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అంగీకరించాయని, దాన్ని తాము స్వాగతిస్తున్నా మని మంగళవారం మధ్యాహ్నం ట్రంప్ ప్రకటించారు. దీనికి ఇరాన్ సానుకూలంగా స్పందించినా ఇజ్రాయెల్ మౌనం పాటించింది. ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఇరాన్ రాజధాని తెహ్రాన్పై అది బాంబుల వర్షం కురిపించింది. రెండు దేశాలూ పరస్పరం ‘ఎందుకో కూడా తెలియని’ విధంగా కాల్పుల విరమణ ఒడంబడికను ఉల్లంఘిస్తున్నాయని ట్రంప్ నిందించి తన ‘తటస్థతను’ చాటు కున్నారు! ఇంతకూ కాల్పుల విరమణ నిజమేనా? ఒక సమాచారం ప్రకారం ఖతార్లోని అమెరికా స్థావరంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించాక ట్రంప్ చొరవ తీసుకుని ఇరాన్తో మాట్లాడి కాల్పుల విరమణకు ఒప్పించమని ఖతార్ను కోరారు. ఖతార్ తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఇరాన్ అంగీకారం తెలిపింది. ఇరాన్ ఈ సంగతి బాహాటంగానే చెప్పింది. కాల్పుల విరమణ గురించి ట్రంప్ బతిమా లుకున్నారని వెల్లడించింది. అయితే ట్రంప్ ప్రకటన తర్వాత కాసేపటికే దాడులకు దిగడాన్నిబట్టి ఇజ్రాయెల్కు ఈ పరిణామం ససేమిరా ఇష్టం లేదని బోధపడుతోంది. యుద్ధం ఆపటం సులభ మేమీ కాదు. కాల్పుల విరమణ ప్రకటనకూ, దాని ఆచరణకూ మధ్య గంటలు మాత్రమే కాదు... రోజుల వ్యవధి కొనసాగటం రివాజే. మొన్న భారత్–పాక్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పంద మైనా, రష్యా–ఉక్రెయిన్ల కాల్పుల విరమణ అయినా ఈ సంగతే చెబుతాయి.యుద్ధానికి ముందు నెల నుంచి ట్రంప్ ఇరాన్కు రోజువారీ హెచ్చరికలు జారీచేస్తూ వచ్చారు. అణు ఒప్పందంపై మొండి పట్టుదలకు పోతే దేశం సర్వనాశనమవుతుందని బెదిరించారు. ఆఖరికి ఒకపక్క ఇరాన్ అమెరికాతో చర్చలు సాగిస్తుండగానే పన్నెండు రోజుల క్రితం ఇజ్రాయెల్ ఎలాంటి కవ్వింపూ లేకుండా ఆ దేశంపై దాడులు సాగించి ఇరాన్ సైనిక దళాల చీఫ్లు ఇద్దరినీ, అణు శాస్త్రవేత్తలతోసహా పలువురినీ హత్య చేసింది. ఇది తప్పని చెప్పాల్సిన ట్రంప్... ప్రతీకార దాడులకు దిగితే ఖబడ్దార్ అంటూ తిరిగి ఇరాన్నే హెచ్చరించారు. ఆఖరికి శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా తానే రంగంలోకి దిగి బంకర్ బస్టర్ బాంబులతో ఇరాన్లో మూడు అణు స్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటించింది. ఇంతా అయినాక హఠాత్తుగా ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. ఏకపక్ష యుద్ధం ప్రారంభానికి పూర్వమే ఇరాన్ బలహీనతలు బయటపడ్డాయి. దశాబ్దాల ఆంక్షలతో అన్నివిధాలా దెబ్బతిన్న దేశం మెరుగ్గా ఉండగలదని ఎవరూ భావించలేరు. ఒకపక్క నేరుగా అమెరికా, ఇజ్రాయెల్ కుటిలత్వం తెలుస్తున్నా మిత్రులనుకున్నవారు కూడా ఖండించ టానికి సిద్ధపడకపోవటం... అండగా ఉండగలవని భావించిన రష్యా, చైనాలు ప్రకటనలకే పరిమితం కావటం, గల్ఫ్ దేశాలు నామమాత్రంగా ఖండించి ఊరుకోవటం ఇరాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి ఉంటాయి. అణు ఒప్పందానికి సిద్ధపడతామని ప్రకటించి ఆ దిశగా అడుగులేస్తున్న దేశం ప్రపంచంలో ఇలా ఏకాకిగా మిగిలిపోవటం వర్తమాన విషాదం. యుద్ధం పర్యవసానంగా ఇరాన్లో పలు దేశాల పెట్టుబడులు దెబ్బతింటాయి. పైగా ప్రపంచానికి పెద్ద పోలీసుగా వ్యవహరిస్తూ తాము చెప్పిందే ఒప్పందమని ఒత్తిడి తెచ్చే ధోరణి రేపన్నరోజు ఎవరికైనా ముప్పే. ఇజ్రాయెల్ దగ్గర... ఆ మాటకొస్తే పశ్చిమాసియాలో అణుబాంబుల జాడలేకపోతే, ఇరాన్ మాత్రమే ఆ పని చేస్తే దాన్ని నియంత్రించటంలో హేతుబద్ధత ఉన్నదని నమ్మినా తప్పుబట్టనవసరం లేదు. కానీ అసలు అమెరికా, రష్యా మొదలుకొని ఏకపక్ష యుద్ధాలతో అందరూ తమ బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టుకుంటుండగా ఒక్క ఇరాన్ మాత్రమే ధూర్త దేశమని ఎందుకు భావించాలి? ఇంతకూ ట్రంప్ హఠాత్తు నిర్ణయం వెనకున్న కారణాలేమిటి? సైనిక స్థావరంపై దాడి చేస్తున్నా మని ఇరాన్ ముందస్తు సమాచారం ఇవ్వటం, అందుకు అనుగుణంగా అమెరికా తన సైనికుల్ని తరలించటంతోపాటు క్షిపణుల్ని కూల్చే ఏర్పాటు చేసుకోవటం సాధ్యమైంది. ఒకే ఒక్కటి పేలినా దానివల్ల నష్టం లేదు. అది ట్రంప్కు నచ్చినట్టుంది. దానికితోడు ఆయన అందలం ఎక్కటంలో కీలకపాత్ర పోషించిన ‘మాగా’ ఈ యుద్ధంపై చీలిపోయింది. గట్టి మద్దతుదారైన స్టీవ్ బెనన్ లాంటివారు సైతం ట్రంప్ను తప్పుబట్టారు. ఆ ఒత్తిళ్ల మాటెలావున్నా యూరప్ నుంచి వస్తున్న వార్తలు అమెరికాను భయపెట్టి ఉండాలి. అమెరికా తర్వాత బంగారం నిల్వల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ (3,352 టన్నులు), ఇటలీ (2,452 టన్నులు) ఆ నిల్వల్లో మూడోవంతు భాగాన్ని అమెరికా ఫెడరల్ రిజర్వ్లో ఉంచాయి. దాన్ని వెనక్కుతేవాలని ఆ దేశాల్లో డిమాండ్లు బయల్దేరాయి. నిల్వల విలువ 24,500 కోట్ల డాలర్ల పైమాటే. ఫెడరల్ రిజర్వ్ స్వతంత్రతను దెబ్బతీసేలా ట్రంప్ వ్యవహరించటం, ప్రపంచాన్ని అస్థిరపరిచే నిర్ణయాలు తీసుకోవటం తదితర కారణాల వల్ల అమెరికాలో బంగారం ఉంచటం సురక్షితం కాదని విపక్షాలు వాదిస్తున్నాయి. అది ఆచరణ రూపందాలిస్తే అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత కుంగిపోవటం ఖాయం. పైగా లండన్తో పాటు ప్రపంచంలోనే కీలకమైన బంగారం కేంద్రంగా వెలిగిపోతున్న న్యూయార్క్ కళ అడుగంటు తుంది. అందుకే ట్రంప్ పునరాలోచనలో పడ్డారా? లేక ముందస్తు సమాచారం ఇచ్చిన ఇరాన్ ‘మంచితనం’ నచ్చిందా? మొత్తానికి అగ్ని గుండం కాబోతున్న పశ్చిమాసియాలో సామరస్య గాలులు వీచటం ఆహ్వానించదగ్గది. ఇది పూర్తి స్థాయిలో సాకారం కావాలని ఆశించాలి. -
ట్రంప్ సహనం కోల్పోయిన వేళ.. అంత మాట అనేశారేంటి?
వాషింగ్టన్: ఇజ్రాయెల్-ఇరాన్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ అంత ఎత్తున లేచారు. తన మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ అని ఇరు దేశాలు ప్రకటించిన కాసేపటికే మళ్లీ క్షిపణులతో యుద్ధానికి దిగడంపై ట్రంప్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ‘నాకు చెప్పిందేమిటి?.. మీరు చేస్తున్నదేంటి? అని ట్రంప్ మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడిన ట్రంప్.. సహనాన్ని కోల్పోయి అభ్యంతరకర పదజాలాన్ని కూడా వాడారు. ఇక వారి ఇస్టం.. వారికిష్టమొచ్చింది చేస్కుంటారు అంటూ ట్రంప్ మీడియా సాక్షిగా అసహనం ప్రదర్శంచారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ః మీడియాలో వైరల్గా మారింది. Trump is absolutely FUMING that Israel & Iran have broke the ceasefire:“We basically have two countries that have been fighting so long and so hard that they don't know what the f*ck they're doing.”He also warned Israel directly on Truth Social: “DO NOT DROP THOSE BOMBS.” pic.twitter.com/yHQeUybgUK— J Stewart (@triffic_stuff_) June 24, 2025 అయితే ఆటు తర్వాత ఇరు దేశాల కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చినట్లు తెలిపారు. ఇక ఒకరిపై ఒకరు కత్తులు దూసుకోరంటూ ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు తిరిగి సొంత గడ్డపైకి వచ్చేస్తాయని, అదే సమయంలో ఇరాన్ కూడా ఒక మెట్టు దిగిందన్నారు. ఇక తక్షణమే ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. -
ఆ అదృశ్య యుద్ధ విమానం వెనుక భారతీయ మేధావి!
వార్ టెక్నాలజీలో అత్యద్భుతం.. నార్త్రోప్ B-2 స్పిరిట్ బాంబర్. తాజాగా ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ప్రయోగించడంతో వీటి గురించి మరోసారి చర్చ నడుస్తోంది. అయితే ఈ యుద్ధ విమానాల రూపకల్పనలో భారతీయ మూలాలున్న మేధావి కూడా ఉన్నారు. కాలక్రమంలో.. గూఢచర్యం ఆరోపణలతో ఆయన జైలు పాలు కావడం ఇక్కడ ప్రముఖంగా చెప్పుకోదగిన అంశం.నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia).. ముంబైలోని ఓ పార్శీ కుటుంబంలో 1944లో జన్మించారీయన. ఆపై 19 ఏళ్ల వయసులో ఉన్నత విద్య కోసం అమెరికాకు వలస వెళ్లి.. అక్కడ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివారు. 1969లో ఆయనకు అమెరికా పౌరసత్వం లభించింది. ఇంజినీరింగ్ మేధావిగా నార్త్రోప్ గ్రుమ్మన్ కార్పొరేషన్లో B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్కు సంబంధించిన ప్రొపల్షన్ సిస్టమ్ను రూపకల్పన చేయడంలో గోవాడియా కీలక పాత్ర పోషించారు. అయితే..దశాబ్దంన్నర తర్వాత.. అనారోగ్య కారణాలతో నార్త్రోప్ గ్రుమ్మన్ నుంచి తప్పుకున్న ఆయన న్యూమెక్సికోలో డిఫెన్స్ కన్సల్టింగ్ సంస్థ ప్రారంభించారు. అయితే 1997లో DARPAతో వివాదం కారణంగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయింది. దీంతో.. చాలా కాలం ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారు. 2005 అక్టోబర్ 15వ తేదీన హవాయ్లోని విల్లాపై దాడి చేసిన ఎఫ్బీఐ డబ్బుతో రహస్య సమాచారానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకుంది. చైనాతో రహస్య సంబంధాల నేపథ్యంలో ఆయన్ని అదే తేదీన అరెస్ట్ చేసింది. విచారణలో నివ్వెరపోయే విషయాలు అధికారులకు తెలిజేశారు. గోవాడియా చైనాలోని చెంగ్డూ, షెన్జెన్ వంటి నగరాలకు ఆరు సార్లు ప్రయాణించి, స్టెల్త్ మిసైల్ ఎగ్జాస్ట్ డిజైన్ చేయడంలో సహాయం చేశారని నిర్ధారించారు. బదులుగా చైనా నుంచి కనీసం $110,000 పొందారని తేలింది. మొత్తం 14 అభియోగాలలో ఆయన దోషిగా తేలడంతో 2011లో హోనోలులు కోర్టు ఆయనకు 32 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అలా ఒక మేధావి జీవితం.. గూఢచారిగా కటకటాల పాలైంది. కీలకంగా గోవాడియానే.. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ను అమెరికా డిఫెన్స్ కంపెనీ నార్త్రోప్ (ఇప్పటి నార్త్రోప్ గ్రుమన్) రూపొందించింది. ఈ ప్రాజెక్టులో అనేక మంది శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు పనిచేశారు. మరీ ముఖ్యంగా హాల్ మార్కేరియన్ (Hal Markarian),నోషిర్ షెరియర్జీ గోవాడియా(Noshir Sheriarji Gowadia) గురించి చెప్పుకోవాలి. మార్కేరియన్.. 1979లో B-2 బాంబర్కు సంబంధించిన తొలి డిజైన్ స్కెచ్లు రూపొందించారు. ఆయన ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారు. విమానం యొక్క ప్రాథమిక ఆకృతికి బీజం వేశారు. అయితే.. భారతీయ మూలాలున్న ఇంజినీర్ గోవాడియా B-2 బాంబర్లోని స్టెల్త్ ప్రొపల్షన్ సిస్టమ్ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, విమానం ఎగ్జాస్ట్ను రాడార్, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేయడంలో ఆయన టెక్నాలజీ కీలకమైంది. వీళ్లిద్దరితో పాటు ఇర్వ్ వాలాండ్, జాన్ కాషెన్, హాన్స్ గ్రెల్మాన్ వంటి స్టెల్త్ టెక్నాలజీ నిపుణులు కూడా భాగస్వాములయ్యారు.వియత్నాం, యోమ్ కిప్పూర్ యుద్ధాల సమయంలో అమెరికా ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించేందుకు నోషిర్ గోవాడియా నేతృత్వంలో.. ‘స్టెల్త్’ సాంకేతికతను అభివృద్ధి చేయడం ప్రారంభమైంది. ‘బ్లూబెర్రీ మిల్క్షేక్’ అనే కోడ్ నేమ్తో సాగిన గోప్యమైన ప్రాజెక్టులో గోవాడియా కీలకపాత్ర వహించారు. బాంబర్ ఇంజిన్ ఎగ్జాస్ట్ను రాడార్, హీట్ సెన్సర్లకు దృశ్యమవకుండా చేయడం ఆయన ప్రాథమిక లక్ష్యం. ఈ ప్రయత్నంలో ఆయన ఘన విజయం సాధించారు. B-2 బాంబర్ ప్రత్యేకతలుబీ2 బాంబర్.. దట్టమైన యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ డిఫెన్స్లలోకి చొచ్చుకుపోవడానికి తక్కువ-పరిశీలించదగిన స్టీల్త్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అందుకే దీనిని స్టెల్త్ బాంబర్ అని పిలుస్తారు. స్టెల్త్ డిజైన్: ఇది ఫ్లయింగ్-వింగ్ ఆకృతిలో ఉండి, రాడార్కు కనిపించకుండా ఉండేలా రూపొందించబడింది. దీని రాడార్ క్రాస్ సెక్షన్ ఒక చిన్న పక్షి స్థాయిలో మాత్రమే ఉంటుంది.ఇన్ఫ్రారెడ్ & హీట్ సిగ్నేచర్ తగ్గింపు: ఎగ్జాస్ట్ సిస్టమ్ను ప్రత్యేకంగా రూపొందించి, హీట్ సెన్సర్లకు కనిపించకుండా చేస్తుంది.అత్యధిక పరిధి: ఒకసారి మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్తో 10,000 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగలదు.అత్యంత ఖచ్చితమైన దాడులు: 40,000 పౌండ్ల బాంబులు మోసే సామర్థ్యం ఉంది, అందులో న్యూక్లియర్ బాంబులు కూడా ఉంటాయి.క్రూ సౌకర్యాలు: దీన్ని “ఫ్లయింగ్ హోటల్” అని కూడా పిలుస్తారు—ఇందులో బెడ్, మైక్రోవేవ్, ఫ్రిడ్జ్, టాయిలెట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎందుకంటే కొన్ని మిషన్లు 40 గంటలపాటు సాగుతాయి.తయారీ ఖర్చుబీ2 బాంబర్ ఖర్చు: సుమారు $2.1 నుండి $2.2 బిలియన్ (2025 నాటికి ₹17,000 కోట్లకు పైగా).మొత్తం ప్రోగ్రాం వ్యయం: అభివృద్ధి, పరీక్షలు, ఉత్పత్తి కలిపి $79 బిలియన్ ఖర్చయింది.ప్రతి మిషన్ ఖర్చు: ఒక B-2 మిషన్కు సగటున $3–4 మిలియన్ ఖర్చవుతుంది. ఎందుకంటే ఒక్క గంట ఫ్లైట్ ఖర్చే $150,000 ఉంటుంది.చైనా డ్రోన్ నిజంగా B-2ని పోలి ఉందా?అవును.. 2025 మేలో చైనాలోని మలాన్ టెస్ట్ బేస్ వద్ద శాటిలైట్ చిత్రాల్లో కనిపించిన స్టెల్త్ డ్రోన్ B-2 స్పిరిట్ను పోలి ఉంది. దీని వింగ్స్పాన్(సుమారు 52 మీటర్లు), టెయిల్లెస్ ఫ్లయింగ్-వింగ్ డిజైన్, ఇన్ఫ్రారెడ్-సిగ్నేచర్ తగ్గింపు లక్షణాలు.. ఇవి అన్నీ B-2 లక్షణాలను ప్రతిబింబిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది చైనా యొక్క H-20 ప్రాజెక్ట్ లేదా కొత్త హై-ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ కావచ్చు. అయితే ఈ డ్రోన్ రూపకల్పనకు నోషిర్ గోవాడియా అందించిన గోప్య సమాచారం ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇరాన్ కంటే ముందు.. అమెరికా దీనిని ప్రయోగించిన సందర్భాలు🕊️ 1999 – కొసోవో యుద్ధం (Operation Allied Force)- B-2 బాంబర్లు తొలిసారిగా యుద్ధంలో పాల్గొన్న సందర్భం.- మిస్సోరీలోని వైట్మాన్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి నేరుగా సెర్బియాకు వెళ్లి, కీలక లక్ష్యాలపై ఖచ్చితమైన బాంబింగ్ చేశారు.- ఒక్కో మిషన్ 30 గంటలకు పైగా సాగింది. 🏔️ 2001–2002 – ఆఫ్ఘానిస్తాన్ (Operation Enduring Freedom)- తాలిబాన్ స్థావరాలు, శిక్షణ శిబిరాలు, గుహలపై దాడులు.- అమెరికా నుంచి నేరుగా ఎగిరి, మిడ్-ఎయిర్ రీఫ్యూయలింగ్తో లక్ష్యాలను చేరుకున్నారు. 🏜️ 2003 – ఇరాక్ యుద్ధం (Operation Iraqi Freedom)- ప్రారంభ దాడుల్లో భాగంగా సద్దాం హుస్సేన్కు చెందిన కమాండ్ సెంటర్లు, మిస్సైల్ సదుపాయాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి. 🌍 2011 – లిబియా (Operation Odyssey Dawn)- మూడు B-2 బాంబర్లు లిబియాలోని ఎయిర్ఫీల్డ్స్, ఫోర్టిఫైడ్ షెల్టర్లపై దాడి చేసి, నో-ఫ్లై జోన్ అమలు ప్రారంభానికి దోహదం చేశాయి. ⚔️ 2017 – సిరియా (అధికారికంగా నిర్ధారణ కాలేదు)- ఐసిస్ స్థావరాలపై B-2 బాంబర్లు GBU-57 బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయని నివేదికలు ఉన్నాయి. 🚀 2024 – యెమెన్- హౌతీ తిరుగుబాటుదారులపై దాడి. ఈ మిషన్ ద్వారా బీ-2 బాంబర్ సామర్థ్యాన్ని మళ్లీ ప్రపంచానికి చూపించారు. 🌑 2025 – ఇరాన్ (Operation Midnight Hammer)- 7 B-2 బాంబర్లు 37 గంటల పాటు ఎగిరి, ఇరాన్లోని Fordow, Natanz, Isfahan న్యూక్లియర్ కేంద్రాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేశాయి. -
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. కొనసాగుతున్న యుద్ధం?
జెరూసలేం: పశ్చిమాశియాలో యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరాన్ తూట్లు పొడిచింది. ఇజ్రాయెల్పై దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయెల్ కాల్పుల్ని తిప్పికొట్టింది. ఇరాన్పై ప్రతిదాడులకు దిగింది. దీంతో గంటల వ్యవధిలో ఇరు దేశాల మధ్య యుద్ధం పున:ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇరాన్కు ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఇరాన్ దాడులకు దిగిందని హెచ్చరించింది. దాడులు ఇలాగే కొనసాగితే కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అయితే, ఇజ్రాయెల్ వార్నింగ్ ఇరాన్ స్పందించింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విమరణ ఒప్పందం జరిగిన తరువాత తాము ఎలాంటి కాల్పులు జరపలేదని . అయినప్పటికీ ఇరుదేశాల మధ్య కాల్పుల మోత మోగూతూనే ఉంది. ⭕️"In light of the severe violation of the ceasefire carried out by the Iranian regime, we will respond with force."-The Chief of the General Staff, LTG Eyal Zamir in a situational assessment now— Israel Defense Forces (@IDF) June 24, 2025 12 రోజులుగా కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు. ఇరు దేశాలు తన మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిపోయింది.ఇజ్రాయెల్, ఇరాన్లు కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని తన ట్రూత్ సోషల్ వేదికగా పోస్టు పెట్టారు. దీంతో పశ్చిమాశియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగిసినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్పై భీకరదాడి చేసింది. ఇజ్రాయెల్ సైతం అదే తరహాలో ఇరాన్ దాడుల్ని ప్రతిఘటించింది. ఇరాన్ దాడుల్ని జ్రాయెల్ భూభాగంలోకి క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇరాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్)మంగళవారం ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పూర్తి కాల్పుల విరమణ అని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలు.. ఖతార్లోని అమెరికా స్థావరంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు... కువైట్, ఇరాక్, బహ్రెయిన్లోని యూఎస్ ఎయిర్ బేస్లపైనా దాడి జరిపినట్లు వార్తలు
-
ఎవరి కోసం ఈ యుద్ధం?
అకారణ యుద్ధాలతో నిండా మునిగి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకున్న అమెరికా, మరోసారి పశ్చిమాసియా రణరంగంలో దూకి తన మూర్ఖత్వాన్ని చాటుకుంది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ‘నాకెందుకో నోబెల్ బహుమతి రావటం లేద’ని వగచి 48 గంటలు కాలేదు... తన యుద్ధోన్మాదాన్ని ప్రదర్శించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇంటా బయటా ‘వద్దుగాక వద్ద’ని మొత్తుకుంటున్నా, ఆంక్షలతో బక్కచిక్కిన ఇరాన్పై తన ప్రతాపాన్ని చూపారు. ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ పేరిట శనివారం అర్ధరాత్రి దాటాక అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ కొండప్రాంతాల్లోని భూగర్భంలో వున్న ఫోర్దో, నతాంజ్, ఇసాఫన్ అణుస్థావరాలపై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో అమెరికా చెబుతున్నట్టు ఆ స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సివుంది. కానీ ఫోర్దో కేంద్రంపై సోమవారం ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు మరోసారి దాడి చేశాయన్నది గమనిస్తే తీవ్ర నష్టం కలిగివుండొచ్చనిపిస్తోంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ నగరాలపై క్షిపణులతో విరుచుకుపడింది. ఎన్నడూలేని విధంగా హోర్ముజ్ జలసంధిని మూసేయాలని ఇరాన్ కేబినెట్ నిర్ణయించటం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై పిడుగుపాటే. ఇరాన్పై అమెరికా పగ ఈనాటిది కాదు. 1979లో ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అమెరికా రాయబార కార్యాలయంపై దాడిచేసి 52 మంది దౌత్యవేత్తలనూ, పౌరులనూ 444 రోజుల పాటు బందీలుగా చేసిన వైనాన్ని ఆ దేశం మరిచిపోలేకపోతోంది. బందీలను విడిపించ టానికి అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ సైతం విఫలమైంది. ఆ పరాభవంనుంచి కోలుకోలేక ఏదో సాకుతో ఆంక్షలు విధిస్తూనేవుంది. ఆ తర్వాత 1980లో అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ను ఇరాన్పైకి ఉసిగొల్పింది. ఎనిమిదేళ్ల ఆ యుద్ధం రెండు దేశాలనూ దెబ్బతీయగా, అమెరికా ఆయుధ విక్రయంతో బాగుపడింది. అటుపై అడపా దడపా ఇజ్రాయెల్తో దాడులు చేయిస్తూనే ఉంది. కొత్త కొత్త ఆంక్షలతో ఇరాన్ను దెబ్బతీస్తూనే ఉంది. తీరికూర్చుని వేరే దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం, వనరుల కైంకర్యానికి ప్రయత్నించటం అమెరికా విదేశాంగ విధానంలో భాగం. ఇరాన్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన జాతీయవాది ప్రధాని మహమ్మద్ మొసాదిని 1953లో బ్రిటన్తో చేతులు కలిపి సైనికకుట్రతో కూల్చిన పాపం అమెరికాదే. అప్పట్లో బ్రిటన్ చేతుల్లోవున్న ఇరాన్ చమురు కంపెనీని జాతీయం చేయటంతో రెండు దేశాలూ ఈ దుస్సాహసానికి ఒడిగట్టాయి. అటుపై తమ కీలు బొమ్మ మహ మ్మద్ రెజా పెహ్లవీని అందలమెక్కించాయి. రెండు దశాబ్దాలు గడవకుండానే అతగాడు పదవీభ్ర ష్టుడయ్యాడు. ఇస్లామిక్ దేశాల్లో అమెరికా జోక్యంతో ఛాందసవాదుల ప్రాబల్యం పెరగటం 1953 నాటి ఇరాన్తో మొదలుపెట్టి ఇటీవలి బంగ్లాదేశ్ వరకూ కనబడుతూనే ఉంది. అఫ్గానిస్తాన్, ఇరాక్, లిబియా, లెబనాన్, సోమాలియా, సిరియా వగైరాలన్నీ ఇందుకుదాహరణ. అఫ్గాన్లో తాలిబన్లు మొదలుకొని సిరియాలో ఐఎస్ వరకూ అన్ని ఉగ్రవాద సంస్థల పుట్టుకకూ అమెరికాయే కారణం. డెమాక్రాట్లు మళ్లీ నెగ్గితే అమెరికాను సర్వనాశనం చేస్తారని, మూడో ప్రపంచయుద్ధానికి కారకు లవుతారని అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద మనిషి ఇప్పుడు తానే ఆ పెను ముప్పు వైపు అడుగులేశారు. అమెరికన్ కాంగ్రెస్కు మాట మాత్రమైనా చెప్పలేదు. అంతర్జాతీయ చట్టాల్ని లేశమాత్రమైనా గౌరవించలేదు. చివరకు ఏమవుతుందోనన్న చింత అసలే లేదు. యుద్ధాల్ని ప్రారంభించటం తేలిక. వాటి ముగింపు ఎవరి వల్లా కాదు. వ్యక్తుల ఇష్టానిష్టాలకు అది లోబడి ఉండదు. అసలే పశ్చిమాసియా వైరుద్ధ్యాల పుట్ట. పరస్పరం కలహించుకునే దేశాలు అక్కడ డజనుకు పైగా ఉంటాయి. అలాంటిచోట ‘తగుదునమ్మా...’ అంటూ ట్రంప్ వేలెట్టి పెద్ద తప్పు చేశారు. కానీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సింది... అమెరికన్ పౌరులూ, ప్రపంచ ప్రజానీకం.మూడున్నర దశాబ్దాల ఏలుబడిలో అలీ ఖమేనీకి ఇది పరీక్షా సమయం. దాడులకు లొంగి ట్రంప్తో దౌత్యానికి సిద్ధపడతారా లేక ఇజ్రాయెల్ అంతు చూసేదాకా వదలరా అన్నది తేలటానికి సమయం పడుతుంది. కానీ శక్తిమంతమైన అమెరికాపై ప్రతీకార దాడులకు దిగి భారీ నష్టానికి సిద్ధ పడకపోవచ్చు. అకారణ దాడులపై రౌద్రంగా ప్రకటనలిస్తున్నా ఆచరణ రూపం దాల్చక పోవచ్చు. అటు అమెరికా సైతం ఇరాన్ అణ్వాయుధ ప్రయత్నాలపై యుద్ధమే తప్ప ఆ దేశంపై యుద్ధం తమ ఉద్దేశం కాదంటోంది. కానీ ఇజ్రాయెల్, అమెరికాల ఉమ్మడి దురాలోచన ఇరాన్లో నాయకత్వ మార్పు... అమెరికా ప్రాపకంతో నడిచే ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు వంటి ఆర్థిక సంస్థల ప్రమేయం లేకుండా సర్వస్వతంత్రంగా, నిటారుగా నిలబడగల్గిన ఇరాన్ను ‘ప్రధాన స్రవంతి’కి మళ్లించటం. ఆ రెండూ మాత్రం నెరవేరే అవకాశం లేనే లేదు. ఇరాన్లో పెట్టుబడులు లేవు గనుక అమెరికా ఎంతకైనా తెగిస్తుంది. కానీ మనకు ఆ దేశంతో ఆర్థికబంధం ఉంది. పాకిస్తాన్ ప్రమేయం లేకుండా మధ్య ఆసియా దేశాలతో, అఫ్గాన్తో నేరుగా, చౌకగా వాణిజ్యాన్ని నెరపగలిగే చాబహార్ పోర్టు ఇరాన్లో నిర్మించింది మనమే. కానీ ఆంక్షల కారణంగా అది అరకొరగా ఉంది. ఇరాన్ చౌకగా ఇచ్చే చమురును కూడా ఆ ఆంక్షల పర్యవసానంగానే కాలదన్నుకున్నాం. ఈ యుద్ధం ఉగ్రరూపం దాలిస్తే ఆర్థికంగా మరింత నష్టపోతాం. చైనా, రష్యాల పరిస్థితి కూడా ఇదే. అటు నాటో కూటమి సైతం అయోమయంలో పడింది. అందుకే ఈ మతిమాలిన యుద్ధం చాలించమని ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలన్నిటిపైనా ఉంది. -
అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు
టెహ్రాన్/టెల్ అవీవ్/దోహా/వాషింగ్టన్/న్యూఢిల్లీ: కీలక అణుక్షేత్రంపై భారీ బాంబులేసి వినాశనం సృష్టించిన అగ్రరాజ్యంపై ఇరాన్ యుద్ధాగ్రహంతో దూసుకెళ్లింది. తన క్షిపణులకు పనిచెప్పింది. ఖతార్లోని అమెరికా వైమానికస్థావంపై సోమవారం రాత్రి క్షిపణులతో విరుచుకుపడింది. కువైట్, ఇరాక్, బమ్రెయిన్లోని అమెరికా సైనిక, వైమానిక స్థావరాలపైనా దాడిచేసినట్లు వార్తలొచ్చాయి. దోహా నగర సమీపంలోని అల్–ఉదేయిద్ అమెరికా ఎయిర్బేస్పై ఆరు స్వల్ప శ్రేణి, మధ్యస్థాయి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడులకు ఇరాన్ ‘ఆపరేషన్ బేషరత్ ఫతాహ్’ అని పేరుపెట్టింది. ఇరాక్లోని అయిన్ అల్ అసద్ బేస్పై ఇరాన్ రాకెట్లను ప్రయోగించింది. అయితే ఇక్కడ ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందనేది తెలియరాలేదు. అయితే క్షిపణులను తమ గగనతల రక్షణవ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయని అమెరికా ప్రకటించింది. తమ స్థావరాలపై దాడుల నేపథ్యంలో శ్వేతసౌధంలోని సిచ్యుయేషన్ రూమ్కు వెళ్లి తాజా పరిస్థితిపై రక్షణ మంత్రి హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డ్యాన్ కెయిన్, ఉన్నతాధికారులతో అధ్యక్షుడు ట్రంప్ సమీక్ష జరుపుతున్నట్ల తెలుస్తోంది. మరోవైపు పలు దేశాల్లోని స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దూసుకొస్తుండటంతో సమీప దేశాలు అప్రమత్తమయ్యాయి. తమ గగనతలాలను మూసేశాయి. తమ పైనా యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు కువైట్, ఖతార్, బహ్రెయిన్ ప్రకటించాయి. అల్ ఉదేయిద్ ఎయిర్బేస్ నుంచి జూన్ 19వ తేదీలోపే కీలక యుద్ధ, ఇంధన విమానాలను అమెరికా సురక్షితంగా వేరే చోటుకు తరలించినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఉదేయిద్ బేస్లో ఏకంగా 10,000 మంది అమెరికా సైనికులు ఉంటారు. గత పాతికేళ్లుగా దీనిని అమెరికా వాడుతోంది. ఈ బేస్పై దాడులు చేయబోతున్నట్లు ఖతార్ ప్రభుత్వానికి ఇరాన్ కొన్నినిమిషాల ముందే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పేలుళ్ల శబ్దాలు దోహా సిటీదాకా వినిపించాయి. దీంతో ఎవరూ బయటకు రావొద్దని సంస్థలు, విద్యాలయాలు, ఆఫీస్లకు ప్రభుత్వం వెంటనే సందేశాలు పంపింది. ఆరుబయటకు రావొద్దని ఖతార్లోని తమ పౌరులకు భారత్, అమెరికా, బ్రిటన్ ఎంబసీలు అడ్వైజరీలు జారీచేశాయి. ఖతార్ గగనతలాన్ని మూసేయడంతో దోహాసిటీకి వెళాల్సిన రెండు ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు మార్గమధ్యంలో వెనుతిరిగాయి. కొచ్చి నుంచి మస్కట్కు అక్కడి నుంచి కన్నూర్కు తిరిగి వచ్చినట్లు ఎయిర్ఇండియా తెలిపింది. ప్రస్తుతం ఖతార్లో తమ విమానమేదీ లేదని పేర్కొంది.అమెరికా అండతో చెలరేగిన ఇజ్రాయెల్అగ్రరాజ్యం అమెరికా భీకర బాంబుదాడులు చేసి, అండగా ఉన్నానని అభయ హస్తమివ్వడంతో సోమవారం ఇజ్రాయెల్ ఇరాన్పై చెలరేగిపోయింది. కారాగారం, మిలటరీ విమానాశ్రయాలు, స్వచ్ఛంద సంస్థ, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయం, అణుకేంద్రం, ప్రభుత్వ ఆఫీస్... ఇలా ఇరాన్లోని భిన్న రంగాల భవనాలపై క్షిపణి దాడులతో ఇజ్రాయెల్ పేలుళ్ల మోత మోగించింది. కీలక ఫోర్డో పర్వతగర్భ యురేనియం శుద్ధి కర్మాగారంపై తన వంతుగా క్షిపణి దాడులు చేసి మరింత వినాశనానికి పాల్పడింది. వేల కేజీల బాంబులను అమెరికా పడేసి విధ్వంసం సృష్టించిన మరుసటిరోజే ఇజ్రాయెల్ ఇదే న్యూక్లియర్ సెంటర్పై దాడులకు దిగింది. టెహ్రాన్లోని మిలటరీ కేంద్రాలపై ఏకంగా 50 యుద్దవిమానాలతో ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఆరు ఇరాన్ ఆర్మీ ఎయిర్పోర్ట్లలో నిలిపి ఉంచిన ఎఫ్–15, ఎఫ్–5, ఏహెచ్–1 విమానం సహా 15 యుద్దవిమానాలు, హెలికాప్లర్లను ధ్వంసంచేసింది. రన్వేలపై బాంబులేసింది. టెహ్రాన్లోని పాలస్తీన్ స్క్వేర్, రెవల్యూషనరీ గార్డ్ కోర్ ప్రధాన కార్యాలయంపై, బసీజ్ వాలంటీర్ కోర్ భవనంపై దాడులు చేసింది. ఉత్తర టెహ్రాన్లోని ప్రముఖ మానవతా సంస్థ ‘ఇరానియన్ రెడ్ క్రిసెంట్’ భవనంపైనా ఇజ్రాయెల్ నిర్దయగా బాంబులేసింది. దీంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ సైతం దీటుగా బదులిచ్చింది. ‘ఆపరేషన్ ట్రూ ప్రామిస్3’ పేరిట హైఫా, టెల్ అవీవ్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులను ఉధృతం చేసింది. వ్యూహాత్మకంగా కారాగారంపై..యుద్ధంలో సాయుధ బలగాలతోపాటు నిరాయుధ ఖైదీలుండే ఎవిన్ జైలు పైనా ఇజ్రాయెల్ గురిపెట్టింది. అయితే ఖైదీల గదులపై కాకుండా కారాగారం ప్రధాన ద్వారాన్ని బద్దలకొడుతూ డ్రోన్ దాడులుచేసింది. దీంతో గేటు తునాతునకలైంది. ఇరాన్ పాలకుల నిరంకుశపాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుపాలైన ఉద్యమకారులు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలను విడిపించేందుకే ఇలా డ్రోన్తో గేటును ధ్వంసంచేశారని తెలుస్తోంది.ప్రభుత్వాన్ని పడగొట్టడంపై ట్రంప్ దృష్టిఇరాన్ను ఏలుతున్న సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీ రాజకీయవర్గాన్ని గద్దె దింపాలని ట్రంప్ భావిస్తున్నట్లు ఆయన మాటల్లో స్పష్టమైంది. సోమవారం ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘ ఇరాన్ను ప్రస్తుత ప్రభుత్వం గొప్ప దేశంగా అవతరింపజేయడంలో ఘోరంగా విఫలమైంది. ఇలాంటి విఫల ప్రభుత్వం అధికారంలో కొనసాగడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుంది?’ అని ట్రంప్వ్యాఖ్యానించారు. ఇరాన్ను ప్రభుత్వాన్ని కూల్చేఉద్దేశం తమకు లేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి హెగ్సెత్ మాట్లాడిన కొన్ని గంటలకే ట్రంప్ ఇలా తన మనసులో మాట బయటపెట్టారు.ఘర్షణ తగ్గేందుకు కృషిచేస్తానన్న పుతిన్అమెరికా జోక్యం చేసుకోవడంతో రష్యా మద్దతు కూడగట్టేందుకు మాస్కోకు వెళ్లి అధ్యక్షుడు పుతిన్తో సమావేశమైన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రయత్నం కొంతమేర ఫలించింది. పశ్చిమాసియాను రణరంగం నుంచి శాంతిపథంలోకి పయనింపజేసేందుకు తన వంతు కృషిచేస్తానని, ఈ విషయంలో ఇరాన్కు సాయపడతానని పుతిన్ సోమవారం ప్రకటించారు. ‘‘ ఇరాన్పై దుస్సాహసంతో అమెరికా, ఇజ్రాయెల్ దాడులుచేశాయి. అణుబాంబు తయారీకి ఎలాంటి ఆధారాలు లేకున్నా, సరైన కారణాలు లేకుండా పశ్చిమాసియాను కదనరంగంగా మార్చేసి ఇజ్రాయెల్, అమెరికా అంతర్జాతీయ ఒడంబడికల తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడ్డాయి’’ అని పుతిన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ట్రంప్ ఏకధ్రువ ప్రపంచ కలలు
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్ష జోక్యానికి కారణం ఏమై ఉంటుందని విశ్లేషిస్తూ పోతే అంతిమంగా తోస్తున్నది ఒకటే. అది – క్రమంగా బలహీనపడుతున్న ఏకధ్రువ ప్రపంచాన్ని తిరిగి స్థిరపరచుకోవా లన్న అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం. ఇరాన్ అణ్వస్త్రాల ఉత్పత్తికి సమీపంలో ఉందా దూరంగానా, శాంతి చర్చలకు సిద్ధమా కాదా, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్కు అస్తిత్వ ప్రమాదం ఏర్పడిందా లేదా అనేవన్నీ పైకి కనిపించే మిథ్యా సంవాదాలు. ఇంతవరకు దౌత్య చర్చల తెర వెనుక దాగి తన యుద్ధ మంత్రాంగాన్ని సాగించిన ట్రంప్, ఇరాన్ను ఇజ్రాయెల్ ఓడించటం తేలిక కాదని అర్థమవుతుండటంతో, నిజ స్వరూపంతో తెర ముందుకు వచ్చారు. తాము, ఇజ్రాయెల్ ‘ఒక టీమ్గా పని చేస్తూ వస్తున్నా’మని ఎటువంటి దాపరికం లేకుండా, జూన్ 21 నాటి దాడుల తర్వాత 22న ప్రకటించారు. బిట్వీన్ ద లైన్స్ఎదుటిపక్షంతో చర్చలు జరుగుతుండగానే మధ్యలో వారిపై బాంబు దాడులు జరిపిన ఉదంతాలను ప్రపంచ దౌత్య చరిత్రలోనే ఎపుడైనా విన్నామా? ఇరాన్ అణుశక్తి కార్యక్రమంపై వారికి, అమె రికాకు అయిదు విడతల చర్చలు జరిగి ఆరవది ఈ నెల 15న జరగనుండగా రెండు రోజుల ముందు 13న ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికాకు చెప్పి మరీ దాడి చేసింది. ఈసారి నేరుగా అమెరికాయే దాడి జరిపింది. తమ దాడికి సరిగా ఒకరోజు ముందు స్వయంగా ట్రంప్ మాట్లాడుతూ, చర్చల కోసం వచ్చేందుకు ఇరాన్కు 15 రోజుల సమయం ఇస్తున్నామన్నారు. అయినా మరునాడే దాడి చేశారు. ఇదే ఒక ద్వంద్వ నీతి కాదా? ఇంతకూ గత అమెరికన్ ప్రభుత్వాలు సాగించిన యుద్ధాలను తీవ్రంగా ఖండించి, తన హయాంలో ఆ పని జరగబోదని తన ఎన్నికల ప్రచార సమయం నుంచే పదేపదే హామీ ఇస్తూ వచ్చిన ట్రంప్, ఇపుడీ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది అసలు ప్రశ్న. పశ్చిమాసియాలో అమెరికాతో పాటు పాశ్చాత్య సామ్రాజ్య వాదపు ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ అవసరం ఎటువంటిదనే చర్చలు తరచూ జరిగేవే గనుక ఇపుడు తిరిగి చెప్పుకోనక్కర లేదు. కానీ అంతకుమించిన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. అవి స్వయంగా ట్రంప్ మాటలు, చేతల ద్వారా రూపుదిద్దుకుంటున్నవే. తన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదానికి, అమెరికా తన ఏకధ్రువ ప్రపంచాధిపత్య స్థాయిని కోల్పోతుండటానికి, ప్రస్తుతం ఇరాన్తో ఘర్షణకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఇది కేవలం ఇజ్రాయెల్, ఇరాన్, అణు పరిశోధనలు, పశ్చిమాసియా, చమురు నిల్వలు, ఆ ప్రాంతపు భౌగోళికతలకు పరిమితమైనది కాదు. 21 నాటి తమ సైనిక శక్తి ప్రద ర్శనతో అమెరికా మొత్తం ప్రపంచానికి హెచ్చరికల సందేశం పంప దలచింది. తన ఏకధ్రువ ఆధిపత్యాన్ని సైనిక బలంతో నిలబెట్టుకో గలమని చెప్పటమే ఆ సందేశం.ఈ మాటపై సందేహం గలవారు 21 నాటి దాడుల తర్వాత మొదట ట్రంప్ చేసిన ప్రసంగాన్ని, తర్వాత అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ అధిపతి జనరల్ కురిల్లాతో కలిసి రక్షణమంత్రి పీట్ హెగ్సెట్ మీడియా సమావేశంలో అన్న మాటలను జాగ్రత్తగా గమనించండి. ఇంగ్లిష్లో ‘రీడింగ్ బిట్వీన్ ద లైన్స్’ అనే మాట ఉంది. పైకి చెప్పే మాటల అర్థాన్నే గాక వాటి అంతరార్థాన్ని కూడా చూడటమన్నమాట. వారు ఇరాన్ అణు కేంద్రాల విధ్వంసం, శాంతి చర్చల రూపంలో ఇరాన్ తమకు బేషరతుగా లొంగటం, కాదని దాడులు జరిపితే సర్వనాశనానికి ఇరాన్ సిద్ధపడటం అని చెప్పేందుకే పరిమితం కాలేదు. ఆ తరహా దాడులు ఎంత ఘనమైనవో, తమ వంటి సైనిక శక్తి యావత్ ప్రపంచంలో మరే దేశానికి ఎట్లా లేదో, అటువంటి దాడులు మరెవరు ఎట్లా చేయలేరో ఒకటికి నాలుగుసార్లు కఠిన స్వరంతో, తీక్షణమైన ముఖ కవళికలతో చెప్తూ పోయారు. గత యుద్ధాల చరిత్రను గమనిస్తే సామ్రాజ్యవాదులు తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోదలచిన ప్రతిసారీ, లేదా అటువంటి ఆధిపత్యానికి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ, అంతర్జాతీయ చట్టాలూ రూల్ ఆఫ్ లా అని తామే సృష్టించి జపించేవాటిని బాహాటంగా ఉల్లంఘిస్తూ, కేవలం సైనిక బలంతో ఆధిపత్యం కోసం సరిగా ఇటువంటి మాటలే చెప్తూ వచ్చారు. గత 10–15 సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని క్రమంగా కోల్పోతూ మథనపడుతున్న అమెరికాకు, ఆ స్థాయిని తిరిగి చతురోపాయాలతో నిలబెట్టుకోవటం అన్నింటికీ మించిన పరమ లక్ష్యంగా మారింది.సామ్రాజ్యవాద డైనమిక్స్ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదాన్ని ప్రపంచం కేవలం ఆర్థిక సంబంధమైనదిగా చూస్తూ వస్తున్నది. తాను యుద్ధాలు ఆపానని, ఇంకా ఆపుతానని, శాంతి దూతనని చెప్పే మాటలను చాలామంది అమాయకంగా విశ్వసించారు. కానీ అర్థం చేసుకోని విషయాలు రెండున్నాయి. ఒకటి–తాము కోల్పోతున్నట్లు ట్రంప్ సరిగానే భావిస్తున్న గొప్పతనం చాలా వరకు సైనిక బలం ఆధారంగా సంపా దించినదే. రెండు – అట్లా కోల్పోవటం చారిత్రక పరిణామాల వల్ల ఏర్పడుతున్న సహజ స్థితి అని గుర్తించి అందుకు అనుగుణంగా సర్దు బాట్లు చేసుకోవటానికి బదులు, పూర్వ వైభవాన్ని సాధించాలనుకుంటే అందుకు చివరి ఆధారం తిరిగి సైనిక శక్తే అవుతుంది. అంతర్జాతీయ చట్టాలకు, నాగరికమైన ప్రజాస్వామ్య వ్యవహరణకు కట్టుబడే డైనమిక్స్ ఒక విధంగా ఉంటే, అన్నింటినీ ఒకవైపు వల్లిస్తూనే యథేచ్చగా ఉల్లంఘించే సామ్రాజ్యవాదపు డైనమిక్స్ ప్రస్తుతం మనం చూస్తున్న విధంగానే ఉంటాయి. అది ‘సామ్రాజ్య వాదం’ అనే వ్యవస్థలోనే అంతర్నిహితమై భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటా దర్శనమిస్తుంది.ప్రపంచంలోకెల్లా అతిగొప్ప ప్రజాస్వామ్యాలని చెప్పుకునే అమెరికా, బ్రిటన్లు, పశ్చిమాసియాలో ఏకైక ప్రజాస్వామ్యమని చాటుకునే ఇజ్రాయెల్ల అప్రజాస్వామిక చర్యల చరిత్ర ఒక ఉద్గ్రంథ మవుతుంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం ఎన్నెన్నో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సీఐఏ, ఎంఐ–6ల ద్వారా కూలదోసి నియంతలను అధికారానికి తెచ్చాయి. అందుకు ఇరానే ఒక ముఖ్య ఉదాహరణ. అక్కడ ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాది చమురు బావులను జాతీయం చేయగా, తనపై 1953లో సైనిక కుట్ర జరిపించి షా పెహ్లవీ నియంతృత్వాన్ని తెచ్చారు. ఇపుడు ‘రెజీమ్ ఛేంజ్’ (ప్రభుత్వ మార్పిడి) పేరిట మరొక పెహ్లవీ వంశ వారసుడిని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.నిజానికి ట్రంప్ ‘మాగా’ నినాదంలోనే, పదవీ బాధ్యతలు స్వీకరించి తొలినాళ్ల నుంచి తీసుకుంటున్న చర్యలలోనే ఇదంతా తార్కికంగా కనిపిస్తుంది. వలసదారుల నిరోధానికి, పంపివేతకు సైన్యాన్ని నియోగించటం వరకు వెళ్లారు. ట్యారిఫ్ల యుద్ధంతో యావత్ ప్రపంచం ఒకేసారి తమకు పాదాక్రాంతం కావాలనుకున్నారు. రష్యా, చైనాల వద్ద అణ్వస్త్రాలతో కూడిన సైనిక బలం లేనట్లయితే గత కాలపు సామ్రాజ్యవాద పద్ధతులలోనే వనరులు, మార్కెట్ల కోసం దాడులు జరిపే వారే! టారిఫ్లకు సంబంధించి కాకున్నా, వనరులూ, మార్కెట్ల విషయమై ఆ రెండు దేశాలతో కాకున్నా, ఇతరత్రా సైనిక బలాన్ని ట్రంప్ మార్కు సామ్రాజ్యవాదం వినియోగిస్తూనే ఉంది. ప్రభుత్వాన్ని కూలదోస్తాం, మొత్తం దేశాన్నే రాతియుగపు పరిస్థితికి నిర్ధూమధామం చేస్తాం అనే హెచ్చరికలన్నీ కేవలం అమెరికా సైనిక శక్తిని కేంద్రం చేసుకున్నవి కావా? ఆఫ్రికాలోని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ను కొనసాగిస్తామనటం అక్కడి అపారమైన వనరుల కోసం కాదా? బహుళ ధ్రువ ప్రపంచం కోసం ఆర్థిక ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్న బ్రిక్స్, డీ–డాల రైజేషన్లను బాహాటంగా బెదిరిస్తూ చిన్న దేశాలపై సైనికమైన ఒత్తిడి తేవటంలో కనిపించేది సైనిక శక్తి కాదా? అందువల్ల ట్రంప్ ‘మాగా’ నినాదాన్ని ప్రపంచం కొత్త దృష్టితో చూడటం అవసరం. ఈ జూన్ 21 నాటి బంకర్ బస్టర్ల సైనిక బల సందేశం, క్రమంగా బలపడు తున్న బహుళ ధ్రువ ప్రపంచానికి సామ్రాజ్యవాదపు ‘బిట్వీన్ ద లైన్స్’ సందేశం!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మీరు ఇచ్చే సందేశం ఏమిటి? : అమెరికాపై చైనా ధ్వజం
ఇరాన్పై అమెరికా చేస్తున్న దాడులను చైనా తీవ్ర స్థాయిలో ఖండించింది. ఆపరేషన్ మిడ్నైట్ హమ్మర్ పేరుతో ఇరాన్పై యూఎస్ చేస్తున్న దాడులు ఎంతమాత్రం సరికాదని హెచ్చరించింది. అసలు ఈ దాడులతో ప్రపంచానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారని చైనా ప్రశ్నించింది. ‘ మీరు చేస్తున్న దాడులతో ప్రపంచానికి తప్పుడు సందేశం పంపించారు. ఇది చెడు సంకేతాన్ని సృష్టించారు’ అంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి పేర్కొన్నారు. ఇప్పటికే యుద్ధం భీకర రూపం దాల్చిన తరుణంలో దాన్ని శాంతింప చేయాల్సింది పోయి.. అగ్నికి ఆజ్యం పోస్తారా? యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను వాంగ్ యి ప్రశ్నించారు. ప్రస్తుతం ఇజ్రాయిల్, అమెరికాలు చేస్తున్న యుద్ధంతో భవిష్యత్లో పెను ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. సోమవారం బీజింగ్లో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్తో జరిగిన సమావేశంలో వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిన విషయాన్ని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరాన్ అణుస్థావరాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న దాడులతో టెహ్రాన్లో భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడ ప్రజలు కూడా తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. అదే సమయంలో ఇజ్రాయిల్ సైతం.. టెహ్రాన్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో ఇరాన్ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. అటు రష్యాతో ఇప్పటికే చర్చలు జరిపిన ఇరాన్.. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్తో అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇరాన్కు సాయం చేస్తాంఇరాన్పై అమెరికా దాడులను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇరాన్పై అమెరికా దాడులను తాము సమర్ధించడం లేదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇరాన్ ప్రజలకు సాయం చేయడానికి తాము అండగా ఉంటామన్నారు. -
Khamenei: ఈ రక్తపాతం చాలు.. ఇక తప్పుకో..!
టెహ్రాన్ : అమెరికాకు లొంగిపోయే ప్రసక్తే లేదు.. అనే పదే పదే చెబుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి నిరసన సెగ మొదలైంది. యుద్ధం ఆరంభమైన తర్వాత ఖమేనీ సాధించిందేమీ లేదంటూ ఆ దేశ బహిష్కృత ప్రిన్స్ రెజా పహ్లవి సంచలన ఆరోపణలు చేశారు. ఇరాన్పై ఇజ్రాయిల్, ఆమెరికా దాడుల తర్వాత ఖమేనీ ఏం సాధించారంటూ ప్రశ్నించారు. ఇరాన్ ప్రతిపక్ష నాయకుడు, ఇరాన్ చివరి షా అయిన మొహమ్మద్ రెజా పహ్లవి కుమారుడు రెజా పహ్లవి ఈరోజు( సోమవారం, జూన్ 23వ తేదీ) పారిస్ నుంచి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇక్కడ(ఇరాన్) రక్తపాతంతో తడిసి ముద్దవడం తప్పితే ఖమేనీ కారణంగా దేశానికి ఒరిగిందేమీ లేదని దేశ బహిష్కరణకు గురైన ప్రిన్స్ రెజా పహ్లవి పేర్కొన్నారు. ఇక ఖమేనీ దిగిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. నిజాయితీగా విచారణ ఎదుర్కోవడానికి ఖమేనీ సిద్ధంగా ఉండాలి. ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ముగింపు దశకు వచ్చేసింది. ఖమేనీతో పాటు మరికొంతమంది ఆయన మద్దతుదారులు దేశం విడిచి పోవడానికి సిద్ధపడుతున్నారు. నువ్వు(ఖమేనీ) ఇక దిగిపో.. చట్ట ప్రకారం విచారణకు సిద్ధం అవ్వు’ అని హెచ్చ,రించారు.పశ్చిమ దేశాలు అనేవి పలు దేశాలకు జీవితాను ఇచ్చే దేశాలుగా ఉండేవి. ఈ పరిపాలనలో అదేమీ లేదు. అంతా రక్తపాతమే. ఎవరికీ లొంగిపోను అనే నినాదంతో విధ్వంసానికి కారణమయ్యాడు. ఇలా సుదీర్ఘకాలం ఒక దేశాన్ని అట్టిపెట్టుకోవాలని చూడటం మంచిది కాదు. ఇలా ఏ ఒక్కరి చేతుల్లోనూ బందీ అయిన దేశాలు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అని పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితం 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత తన వంశం పతనం అయినప్పటికీ ఇరాన్ క్రౌన్ ప్రిన్స్గా రెజా ఫహ్లావి పరిగణించబడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇరాన్లో అధికార మార్పుకు సమయం ఆసన్నమైందనే సంకేతాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయాలని కూడా రెజా పిలుపునిచ్చారు. ఖమేనీ పీడకలని అంతం చేయాలంటే దేశ వ్యాప్తంగా ప్రజలే తిరగబడాలన్నారు. ప్రజలచే జాతీయ, ప్రజాస్వామ్య ప్రభుత్వ స్థాపనకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని రెజా వ్యాఖ్యానించారు. -
భారత్లో బిందాస్గా బతకొచ్చు..! అమెరికా మహిళ ప్రశంసల జల్లు
భారతదేశంపై చాలామంది విదేశీయులు తమ అభిమానాన్ని పలు రకాలుగా చాటుకుంటున్నారు. ఇక్కడకు సరదాగా పర్యాటనకు వచ్చి మన భారతావనిపై మనసు పారేసుకోవడం విశేషం. ఇక్కడి భిన్నత్వంలోని ఏకత్వమే మమ్మల్ని కట్టిపడేస్తోందంటూ..నచ్చిన విషయాలను చెబుతున్నారు. అలానే ఒక అమెరికా మహిళ భారత్పై మాములుగా పొగడ్తల జల్లు కురిపించడం లేదు. ఆమె ఇలా ప్రశంసించడం మొదటిసారి కాకపోయినా..ఈసారి మాత్రం భారత్ని ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసల వర్షం కురిపించింది. ఆమె మాటలు వింటే ప్రతి ఒక్క భారతీయుడి హృదయం గర్వంతో ఉప్పొంగక మానదు.అమెరికాలో లైఫ్ సౌకర్యవంతంగా ఉన్నా..భారతదేశంలోనే అంతకుమించిన జీవితాన్ని గడపగలమని అంటోంది క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ మహిళ. ఆమె భారత్కి నాలుగేళ్ల క్రితం తన కుటుంబంతో సహా వచ్చి ఇక్కడే ఉంటోంది. తానెప్పుడూ ఈ నిర్ణయానికి చింతించలేదని, అమెరికాలో సగటు జీవితం కంటే భారత్లోనే జీవితం అద్భుతంగా ఉంటుందని చెబుతోంది. తన జీవితాన్ని ఏవిధంగా తీసుకువెళ్లాలనే దానిపై తనకు పూర్తి నియంత్రణ ఉందని అంటోంది. తాను యూఎస్నే ఎంచుకోవచ్చు గానీ, తాను అంతకుమించిన గొప్పగా ఉండే జీవితాన్ని కోరుకున్నా అందుకే భారత్ని ఎంచుకున్నానని పేర్కొంది. ఇక్కడ ఇప్పటివరకు చాలా అద్భుతమైన వ్యక్తులను కలుసుకున్నా..పైగా గొప్పగొప్ప ప్రదేశాలను, వెరైటీ వంటకాలను చూశానని అన్నారామె. భారతదేశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆనందంగా చెబుతోంది. ఎప్పటికీ తాను ఒకేలా ఉండకపోయినప్పటికీ..ఇక్కడి లైఫే నచ్చిందని పోస్ట్లో పేర్కొంటూ..మెహందీ పెట్టుకుని చీరకట్టులో ఢిల్లీలో ప్రయాణిస్తున్నవీడియోని కూడా జత చేసింది. అంతేగాదు ఆ వీడియోలో ఫిషర్ హోలీ పండుగను జరుపుకుంటూ..తన పిల్లలతో ఇతర ఉత్సవాల్లో కూడా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ఆమె పోస్ట్ని చూసిన నెటిజన్లు ఇలా స్పందించారు. భారతీయురాలిగా నా దేశాన్ని చాలా మిస్ అవుతున్నా..అని యూరప్లో నివశిస్తున్న ఒక భారతీయురాలు, మరొకరు..మేము త్వరలో భారత్కి వచ్చేస్తున్నాం అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: ఆనంద్ మహీంద్రా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! తప్పనిసరిగా ఓ 20 నిమిషాలు..) -
భీకర దాడులతో దద్దరిల్లుతున్న టెహ్రాన్.. దట్టంగా కమ్మేసిన పొగ
అమెరికా జోక్యంతో.. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం 11వ రోజు కొనసాగుతోంది. తాజాగా సోమవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం.. భారీ పేలుళ్లతో శబ్దాలు వినిపించాయి. ఆపై పొగ నగరాన్ని దట్టంగా అలుముకుంది. నష్టం వివరాలు తెలియ రావాల్సి ఉంది. నగరంలోని జన రద్దీ ఉండే ప్రాంతం నుంచే ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే.. టెల్ అవీవ్ మాత్రం ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ప్రకటించుకుంది. 🚨#UltimoMinuto | 🇮🇷 #Tehran pic.twitter.com/BWz8bA5NDW— INTERACTIVA NEWS (@interactivanew) June 23, 2025ఇరాన్ మీడియా సంస్థలు కూడా అందుకు సంబంధించిన దృశ్యాలు ప్రసారం చేస్తున్నాయి. ఐఆర్జీసీ, పోలీస్ నిఘా కేంద్రాలు, విద్యా సంస్థలు, విద్యుత్ కేంద్రాలపై దాడి జరిగినట్లు ఇరాన్ ఇంటర్నేషనల్ ఛానెల్ కథనాలు ఇస్తోంది. ఇవెన్ జైలు పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించాయి.జూన్ 13వ తేదీ నుంచి ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటిదాకా తీవ్ర ప్రాణనష్టం సంభవించింది. తాజా సమాచారం ప్రకారం.. ఇరాన్లో 585 మంది మరణించారు. వీళ్లలో 126 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య సుమారు 1326గా ఉంది.👇జూన్ 13, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" ప్రారంభించింది.ఇరాన్లోని 12కు పైగా సైనిక స్థావరాలు, పౌర మౌలిక సదుపాయాలపై బాంబుల దాడులు.మృతుల సంఖ్య 224కి చేరింది, వీరిలో 90 మందికిపైగా పౌరులు.👇జూన్ 14, 2025ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభం – "టూ ప్రామిస్ 3" ఆపరేషన్దాదాపు 100 బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడి.టెల్ అవీవ్, జెరూసలెం, రమత్గాన్ వంటి నగరాల్లో పేలుళ్లు.ఇజ్రాయెల్ 70% క్షిపణులను గాల్లోనే కూల్చివేసినట్టు ప్రకటించింది.👇జూన్ 15, 2025ఇరాన్ 150కు పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది.ఇజ్రాయెల్ వైమానిక స్థావరాలు, కమాండ్ సెంటర్లు లక్ష్యంగా మారాయి.ఇరాన్ సైనిక జనరల్స్ బ్రిగేడియర్ మెహ్రబి, రబ్బాని మరణించారు.👇జూన్ 16, 2025ఇజ్రాయెల్ టెహ్రాన్పై గగనతల దాడులు కొనసాగించిందని నివేదికలు.ఇరాన్ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది.ప్రపంచ దేశాలు శాంతి చర్చల కోసం పిలుపునిచ్చాయి.👇జూన్ 17, 2025ఇజ్రాయెల్ దాడుల్లో 585 మంది మృతి, 1326 మంది గాయాలు – మానవ హక్కుల సంఘాల నివేదిక.టెహ్రాన్లోని చమురు శుద్ధి కేంద్రాలు, అణు పరిశోధనా కేంద్రాలు ధ్వంసం.👇జూన్ 18, 2025ఇరాన్ హైపర్సోనిక్ క్షిపణితో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడి చేసినట్టు ప్రకటించింది.టెల్ అవీవ్, హైఫా ప్రాంతాల్లో పేలుళ్లు.జెరూసలెంలోని అమెరికా ఎంబసీ తాత్కాలికంగా మూసివేత.👇జూన్ 19, 2025ఇజ్రాయెల్ "ఆపరేషన్ సైలెంట్ స్టార్మ్" ప్రారంభించింది.ఇరాన్ కమ్యూనికేషన్ హబ్లు, రాడార్ కేంద్రాలపై దాడులు.ఇరాన్ సైనికాధికారి బ్రిగేడియర్ హుస్సేన్ అబ్దోల్లాహీ మరణం.👇జూన్ 20, 2025ఇరాన్ డ్రోన్లతో ఇజ్రాయెల్ నౌకాదళ స్థావరాలపై దాడి.ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వ్యవస్థ 80% క్షిపణులను అడ్డుకుంది.ఇరాన్ 40 మంది సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది.👇జూన్ 21–22, 2025పరస్పర క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి.ఇరాన్ అణు శాస్త్రవేత్త డాక్టర్ అమీర్ హొసేన్ ఫెక్హీ హత్య.ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు: “ఖమేనీ హతమైతేనే యుద్ధం ముగుస్తుంది” అని ప్రకటన.అమెరికా, జూన్ 22, 2025 (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 4:10 గంటలకు) ఇరాన్పై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడులను "ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్" అనే కోడ్ పేరుతో నిర్వహించారు.📍 దాడి జరిగిన ముఖ్య ప్రాంతాలు:ఫోర్డో అణు కేంద్రం – పర్వతాల లోతులో ఉన్న ఈ కేంద్రంపై B-2 బాంబర్లతో బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించారు.నతాంజ్ యురేనియం శుద్ధి కేంద్రం – జలాంతర్గాముల నుంచి ప్రయోగించిన టోమాహాక్ క్షిపణులు ఈ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి.ఇస్ఫహాన్ అణు పరిశోధనా కేంద్రం – ఇదే విధంగా టోమాహాక్ క్షిపణులతో ధ్వంసం చేశారు.✈️ దాడి వివరాలు:7 B-2 స్టెల్త్ బాంబర్లు అమెరికా నుంచి నేరుగా ప్రయాణించి లక్ష్యాలను ఛేదించాయి.30 టోమాహాక్ క్షిపణులు రెండు జలాంతర్గాముల నుంచి ప్రయోగించబడ్డాయి.మొత్తం 125కి పైగా యుద్ధ విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి.👇జూన్ 23, 2025టెహ్రాన్లో భారీ పేలుళ్లు, ప్రజలు నగరం విడిచి తరలింపు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ: “యుద్ధం మొదలైంది” అంటూ సోషల్ మీడియాలో ప్రకటన.యుద్ధం మరింత తీవ్రతరమవుతుందన్న అంచనాలు.ఇరాన్ తరఫున మరణించిన ఉన్నతాధికారులు:మేజర్ జనరల్ హుస్సేన్ సలామీ – ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) చీఫ్.మేజర్ జనరల్ మొహమ్మద్ బాగెరీ – ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్.అలీ షమఖానీ – మాజీ జాతీయ భద్రతా చీఫ్.జనరల్ ఘోలం అలీ రషీద్ – ఖతమ్ అల్-అన్బియా రాష్ట్ర ప్రధాన కార్యాలయ అధిపతి.వీళ్లతో పాటు ఆరుగురు ప్రముఖ అణు శాస్త్రవేత్తలు కూడా ఈ దాడుల్లో హతమయ్యారు. వీరిలో అబ్దొల్హమీద్ మినౌచెహ్ర్, అహ్మద్రెజా జోల్ఫాఘరీ, అమీర్హొస్సేన్ ఫెక్హీ తదితరులు ఉన్నారు. ఈ స్థాయి నాయకుల మరణం ఇరాన్కు వ్యూహపరంగా పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ఇక.. ఇజ్రాయెల్ వైపు ప్రాణనష్టం వివరాలు స్పష్టంగా తెలియరావడం లేదు. కానీ ఇరాన్ క్షిపణి దాడుల వల్ల రాజధాని టెల్ అవీవ్ సహా చాలా ప్రాంతాల్లోప్రాణ నష్టం సంభవించి ఉంటుందనేది ఒక అంచనా. -
అమెరికా దాడి చేస్తుందని ముందే జాగ్రత్తపడిన ఇరాన్
-
ఇరాన్ జెండాలతో వైట్హౌజ్ ఆవరణలో ప్రదర్శనలు
ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమంది. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్ మద్దతు ప్రదర్శనలు జరుగుతుండడం తీవ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం ఆవరణలోనే ట్రంప్ వ్యతిరేక నినాదాలతో ఓ ప్రదర్శన జరగడం గమనార్హం. ఇరాన్పై యుద్ధం వద్దు.. ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం ఆపండి.. గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే అంటూ అధ్యక్షుడు ట్రంప్ను ఉద్దేశించి పలువురు నినాదాలు చేశారు. మరికొందరు ఇరాన్కు మద్దతుగా పాటలు పాడుతూ తమ నిరసన గళం విప్పారు. ప్రస్తుతం యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికా ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.బోస్టన్, చికాగోతో పాటు న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద హ్యాండ్స్ ఆఫ్ ఇరాన్ స్లోగన్లు ఉన్న బ్యానర్లు ప్రదర్శిస్తూ కొందరు ఈ ప్రదర్శనలు చేపట్టారు. వైట్హౌజ్ వద్ద జరిగిన నిరసనల్లో పశ్చిమాసియా ఉద్రిక్తతల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దంటూ నినాదాలు చేశారు.HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB— Ron Smith (@Ronxyz00) June 22, 2025ఇరాన్పై అమెరికా యుద్ధ విమానాలు దాడులు జరిపి.. తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. ఆపరేషన్ మిడ్నైట్ హామర్ పేరుతో కేవలం 25 నిమిషాల్లోనే ఇరాన్ అణుశుద్ధి కేంద్రాలను (ఫోర్దో, ఇస్ఫాహాన్, నటాంజ్) దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యంలో.. యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు.. నిరసనల నేపథ్యంలో అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పలువురు నిరసనకారుల్ని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG— BreakThrough News (@BTnewsroom) June 18, 2025అయితే అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో ఇరాన్కు భారీ నష్టమే వాటిల్లిందని స్వయంగా ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ యుద్ధంలో జోక్యంతో అమెరికా ఘోర తప్పిదం చేసిందంటూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమనీ మండిపడగా.. ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో తాము చేపట్టిన యుద్ధం సుదీర్ఘంగా కొనసాగబోదని.. దాడుల్లో తాము లక్ష్యానికి చేరువైనట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ తాజాగా ఓ ప్రకటన చేశారు. వెల్లడించారు.ఇరాన్పై అమెరికా బాంబు దాడుల చేసిన తర్వాత.. యుద్ధాన్ని ఆపేది అప్పుడే: నెతన్యాహుఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఫోర్డో అణుకేంద్రాన్ని అమెరికా (USA) తీవ్రంగా ధ్వంసం చేసింది. అణ్వాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టాం. ముప్పును తొలగించుకున్నాం. లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబోం. మా టార్గెట్ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే. అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది. ప్రస్తుత ఇరాన్ పాలకులు మమ్మల్ని తుడిచిపెట్టాలని చూశారు. అందుకే ఈ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. ఇందులో ప్రధానంగా మా అస్థిత్వానికి పొంచి ఉన్న రెండు ముప్పులను తొలగించాలనుకున్నాం. ఒకటి అణ్వాయుధాలు.. రెండు బాలిస్టిక్ క్షిపణులు. ఈ లక్ష్యాలను సాధించే దిశగా మేం ఒక్కో అడుగు వేస్తూ ముందుకుసాగుతున్నాం. వాటికి మేం చేరువయ్యాం. టెహ్రాన్తో సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగించబోం. అయితే, అనుకున్న ఫలితం రాకముందే పోరాటం నుంచి నిష్క్రమించేది లేదు. ఐరాస స్పందన.. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరవానీ మాట్లాడుతూ.. ‘‘అమెరికా విదేశాంగ విధానాన్ని హైజాక్ చేసి.. నెతన్యాహు అగ్రరాజ్యాన్ని ఈ యుద్ధంలోకి లాగారు. అమెరికా చరిత్రలో ఇది మాయని మచ్చగా మిగిలిపోనుంది. దౌత్యాన్ని నాశనం చేయడానికి అగ్రరాజ్యం కంకణం కట్టుకుంది. దీనికి సరైన సమయంలో దీటుగా బదులిస్తాం’’ అని హెచ్చరించారు.ఖమేనీ ఏమన్నారంటే.. యూదు శత్రువులు ఘోర తప్పిదం చేశారు. తీవ్ర నేరానికి పాల్పడ్డారు. దీనికి శిక్ష తప్పదు. తక్షణమే శిక్షించాల్సిన అవసరం ఉంది అని అమెరికా పేరును ప్రస్తావించకుండానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఏమన్నారంటే.. తాజా దాడులకు అగ్రరాజ్యం మూల్యం చెల్లించుకోవాల్సిందే. అమెరికాకు దీటుగా బదులిస్తాం అని అన్నారు. -
Israel-Iran: అణుయుద్ధం.. నిజమెంత?
ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం రోజు రోజుకు మరింత ముదురుతోంది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా మెరుపుదాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. తాజాగా.. సోమవారం తెల్లవారుజామున ఇరాన్ అర గంట వ్యవధిలోనే ఇజ్రాయెల్పై 22 క్షిపణులతో దాడి చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చాలామంది మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే.. ఈ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? అని!. ఈ ప్రశ్నకు సమాధానం అంత తేలిక కాదు. చాలా విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవేంటో.. ఒక్కటొక్కటిగా చూద్దాం.1.ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి దౌత్యవర్గాల్లో అణుయుద్ధంపై చర్చ జరుగుతూనే ఉంది. దశాబ్దాల తరువాత మధ్యప్రాచ్య పరిస్థితులు అణుయుద్ధానికి దారితీసేలా ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినపిస్తున్నాయి. అయితే ఆ దారుణం జరక్కుండా చూసేందుకు ప్రభుత్వాధినేతలు చాలామంది తమవంతు ప్రయత్నాలూ చేస్తున్నారు. 2.‘‘అణుస్థావరాలపై అమెరికా దాడి యుద్ధం ప్రకటించడమే!’’ అని ఇరాన్ చెప్పడమే కాకుండా.. అణ్వాయుధాలకు సంబంధించిన అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగే ఆలోచన కూడా చేస్తోంది. 1970 నుంచి అమల్లో ఉన్న ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక చట్టం నుంచి వైదొలగడం అంటే.. ఇరాన్ తనకు నచ్చినట్టుగా అణు ఇంధనాన్ని శుద్ధి చేసుకోగలదు. అణ్వాస్త్రాలూ తయారు చేసుకోగలదు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) వంటి ఐరాస సంస్థల పర్యవేక్షణను అనుమతించదన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇరాన్ మరింత వేగంగా అణ్వాయుధాలను తయారు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.3. ఇదిలా ఉంటే ప్రస్తుత యుద్ధ వాతావరణంలో ఏ దేశం ఎటువైపున ఉన్నదన్నది కూడా అణుదాడులు జరిగే అవకాశాలను నిర్ణయిస్తుంది. ఇరాన్పై అమెరికా దాడులను రష్యా, చైనా తీవ్రంగా ఖండించాయి. అయితే ప్రస్తుతానికి ఈ రెండు దేశాలూ ఇరాన్కు నేరుగా మిలటరీ సాయం చేసే స్థితికి చేరలేదు. టర్కీ, ఖతార్, సౌదీ అరేబియాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మరోవైపు భారత్సహా అనేక ఆసియా దేశాలు ఇరు పక్షాలకూ దూరంగా ఉంటున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఇరుదేశాలకు సూచిస్తున్నాయి. 4. అమెరికా నిన్న ఇరాన్ అణు స్థావరాలపై బంకర్ బాంబులతో విరుచుకుపడ్డ నేపథ్యంలో ఐఏఈఏ ఒక హెచ్చరిక చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇరాన్-ఇజ్రాయెల్ ప్రాంతంలో రేడియోధార్మిక ప్రభావం పెరిగిపోవడం ఖాయమని స్పష్టం చేసింది. ఫోర్డో, నటాన్జ్, ఇస్ఫహాన్లలోని అణుస్థావరాలను తాము ధ్వంసం చేసినట్లు అమెరికా ప్రకటించినప్పటికీ ఆ ప్రాంతాల్లో రేడియోధార్మిక పదార్థాలేవీ లేవని ఇరాన్ ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం. సరిగ్గా దాడులు జరిగే ముందే ఇరాన్ ఫర్డో స్థావరం నుంచి సుమారు 400 కిలోల యురేనియం (60 శాతం శుద్ధత కలిగినది. ఆయుధాల తయారీకి కనీసం 90 శాతం శుద్ధమైన యురేనియం 235 అవసరం.)ను అక్కడి నుంచి తరలించినట్లు వార్తలొచ్చాయి. ఇంకోపక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో ఇజ్రాయెల్ తన వైఖరిని సమర్థించుకోగా.. వాటిని సార్వభౌమత్వంపై దాడులుగా ఇరాన్ అభివర్ణించింది. మొత్తమ్మీద చూస్తే ప్రపంచం అణుయుద్ధపు అంచుల్లో ఉందని చెప్పలేము. ఇప్పటివరకూ యుద్ధం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికాలకే పరిమితమై ఉంది. మధ్యప్రాచ్య దేశాలు, రష్యా, చైనా వంటి అభివృద్ది చెందిన దేశాలు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇందులో మార్పు లేనంత వరకూ అణుయుద్ధం జరిగే అవకాశం తక్కువే!. :::గిళియారు గోపాలకృష్ణ మయ్యా! -
అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి
వాషింగ్టన్ డీసీ: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ ఇరాన్లోని అణుస్థావరాలను ధ్వంసం చేసింది. దీనిని ఉపగ్రహ చిత్రాలు స్పష్టం చేస్తూ, అక్కడ ‘అసాధారణ కార్యాచరణ’ సాగినట్లు వెల్లడించాయి. అమెరికా దాడి జరపకముందు, దాడి జరిపిన తరువాతకు సంబంధించిన చిత్రాలు అక్కడి పరిస్థితిని తెలియజేస్తున్నాయి.ఈ వాణిజ్య ఉపగ్రహ చిత్రాలు ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రం యూఎస్ దాడితో తీవ్రంగా దెబ్బతినడాన్ని చూపిస్తున్నాయి. బంకర్-బంకింగ్ బాంబులు పర్వతంలోకి చొచ్చుకుపోయినట్లున్న ఆరు రంధ్రాలు ఈ చిత్రాలలో కనిపిస్తున్నాయి. అలాగే దుమ్ముతో మూసుకుపోయిన భూమిని కూడా చూపిస్తున్నాయి. అమెరికా ఎంఓపీలతో దాడి చేసిందని ఇన్స్టిట్యూట్ఫర్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీకి నాయకత్వం వహిస్తున్న యూఎన్ మాజీ అణు తనిఖీదారు డేవిడ్ ఆల్బ్రైట్ తెలిపారు. ఉపగ్రహ చిత్రాలలో నైపుణ్యం కలిగిన పరిశోధకుడు డెక్కర్ ఎవెలెత్ మాట్లాడుతూ ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా అక్కడ జరిగిన నష్టం స్థాయిని అంచనా వేయడానికి తాము మరింతగా అధ్యయనం చేయాలన్నారు.ఇప్పటికైనా టెహ్రాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేస్తుందని తాము భావిస్తున్నామని యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్లు పేర్కొన్నాయి. అయితే ఈ దాడికి ముందే ఇరాన్.. ఫోర్డో నుండి యురేనియం నిల్వలను తరలించి ఉండవచ్చని ఇజ్రాయెల్, అమెరికా, ఐక్యరాజ్యసమితి అణు తనిఖీదారులు అనుమానిస్తున్నారు. ఈ ఉపగ్రహ చిత్రాలు మాక్సర్ టెక్నాలజీస్ నుండి వచ్చాయి. కాగా ఇరాన్ తన అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసమేనని గత కొంతకాలంగా చెబుతూవస్తోంది.ఇది కూడా చదవండి: Punjab: కారులో భీతావహ దృశ్యం.. స్థిరాస్థి వ్యాపారి ‘క్షణికావేశం’? -
ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా మెరుపుదాడి... ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ న్యూక్లియర్ సైట్లు ధ్వంసం... హోర్ముజ్ జలసంధిని మూసేసేందుకు సిద్ధమైన ఇరాన్
-
భారత్కు వెళ్తున్నారా? జాగ్రత్త!
వాషింగ్టన్: భారత్లో పర్యటించాలనుకునే తమ పౌరులకు అమెరికా కొత్త అడ్వైజరీ జారీ చేసింది. ఇటీవలి కాలంలో అత్యాచారాలు, హింస, ఉగ్రవాదం పెరిగిపోతున్నాయని, భారత్కు వెళ్లాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఆ దేశ ప్రభుత్వం సూచించింది. ప్రత్యేకించి మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని హెచ్చరిస్తూ అమెరికా విదేశాంగ శాఖ లెవల్ 2 సలహా జారీ చేసింది.జూన్ 16న జారీ చేసిన ఈ అడ్వైజరీలో ‘‘భారత్లో మరింత జాగ్రత్తగా ఉండండి. కొన్ని ప్రాంతాల్లో నేరాలు, ఉగ్రవాదం పెరిగాయి. అక్కడ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేరాలలో అత్యాచారం ఒకటి. పర్యాటక ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో లైంగిక వేధింపులతో సహా హింసాత్మక నేరాలు జరుగుతాయి. అలాగే పర్యాటక ప్రదేశాలు, రవాణా కేంద్రాలు, మార్కెట్లు/షాపింగ్ మాల్స్లో ఎప్పుడైనా ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉంది’’ అని హెచ్చరించింది.జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన 2 నెలల తర్వాత అమెరికా ఈ కొత్త అడ్వైజరీ విడుదల చేసింది. ‘‘ఉగ్రవాదం, అశాంతి నెలకొన్న కారణంగా కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్లో ప్రయాణించవద్దు. తూర్పు లద్దాఖ్, రాజ«దాని లేహ్ తప్ప పర్యాటక ప్రదేశాలైన శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం వంటి ప్రాంతాలకు వెళ్లొద్దు. భారత్–పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి హింస సర్వసాధారణం. భారత్–పాక్ మధ్య సాయుధ ఘర్షణలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రాంతాలకు ప్రయాణించవద్దు’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.ముఖ్యంగా మహిళలు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చింది. ఒంటరిగా ప్రయాణించవద్దని హెచ్చరించింది. ఇక ‘‘తూర్పు మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న ప్రాంతంలో మావోయిస్టు తీవ్రవాద గ్రూపులు చురుకుగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పౌరులకు అత్యవసర సేవలను అందించే సామర్థ్యం అమెరికా ప్రభుత్వానికి లేదు. ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే మంచిది’’ అని సూచించింది. భారత్కు వెళ్లాలనుకునేవారు శాటిలైట్ ఫోన్ తీసుకెళ్లొద్దని సలహా ఇచ్చింది.ఖండించిన కాంగ్రెస్.. భారత్ పట్ల అమెరికా వైఖరిని కాంగ్రెస్ ఖండించింది. ఆ దేశ అడ్వైజరీ షాక్ కలిగించడమే కాదు, ఇబ్బందికి గురి చేసిందని ఎక్స్లో పోస్ట్ చేసింది. యూఎస్ ట్రావెల్ అడ్వైజరీ దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొంది. భారత్లో మహిళలు ఒంటరిగా ప్రయాణించొద్దని సూచించడం.. ప్రధాని నరేంద్రమోదీ ‘సురక్షిత భారత్’ పతనమైనట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేసింది. -
రష్యా నుంచి పెరిగిన చమురు దిగుమతులు
న్యూఢిల్లీ: రష్యా, అమెరికా నుంచి చమురు దిగుమతులను భారత్ గణనీయంగా పెంచుకుంది. జూన్ నెలలో మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల కంటే రష్యా నుంచే అధిక చమురు దిగుమతి కావడం గమనార్హం. మొత్తం మీద ఈ నెలలో రోజువారీ 2–2.2 మిలియన్ బ్యారెళ్ల చమురును రష్యా నుంచి దిగుమతి చేసుకోవచ్చంటూ అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషణ సంస్థ ‘కెప్లెర్’ వెల్లడించింది. గత రెండేళ్ల కాలంలో రష్యా నుంచి ఈ స్థాయి దిగుమతులు తిరిగి ఈ నెలలోనే అధికమయ్యాయని వివరించింది. ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్కు మించి రష్యా నుంచి దిగుమతులే అధికంగా ఉన్నట్టు తెలిపింది. మే నెలలో రష్యా నుంచి చమురు దిగుమతులు రోజువారీగా 1.96 మిలియన్ బ్యారెల్స్గా ఉన్నాయి. మరోవైపు అమెరికా నుంచి ఈ నెలలో రోజువారీ 4,39,000 బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, గత నెలలో ఇది 2,80,000 బ్యారెల్స్గానే ఉండడం గమనార్హం. మధ్యప్రాచ్యం నుంచి భారత్కు ఈ నెల మొత్తంమీద చమురు దిగుమతులు సగటున రోజువారీ 2 మిలియన్ బ్యారెళ్లుగా ఉండొచ్చన్నది కెప్లెర్ నివేదిక అంచనా. చమురు దిగుమతుల్లో ప్రపంచంలో భారత్ మూడో స్థానంలో ఉంది. రోజువారీ 5.1 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. సంప్రదాయంగా మధ్యప్రాచ్యం, గల్ఫ్ దేశాల నుంచే భారత్ అధికంగా చమురు దిగుమతి చేసుకునేది. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి అనంతరం మారిన సమీకరణాల నేపథ్యంలో.. రష్యా నుంచి చమురు దిగుమతులను గణనీయంగా పెంచుకుంది. అంతకుముందు మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతమే ఉండగా, ఆ తర్వాత 40–44 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ధర కంటే తక్కువ రేటుకే చమురును భారత్కు రష్యా ఆఫర్ చేయడం గమనార్హం. సరఫరాపై ప్రభావం పడొచ్చు.. ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇప్పటి వరకు మధ్యప్రాచ్యం నుంచి చమురు సరఫరాలపై లేదని కెప్లెర్ నివేదిక స్పష్టం చేసింది. వెసెల్స్ కార్యకలాపాలను గమనిస్తే రానున్న రజుల్లో సరఫరా తగ్గే అవకాశం కనిపిస్తున్నట్టు కెప్లెర్ ముఖ్య పరిశోధన విశ్లేషకుడు సుమిత్ రితోలియా తెలిపారు. షిప్ యజమానులు గల్ఫ్ ప్రాంతానికి ఖాళీ ట్యాంకర్లు పంపేందుకు వెనుకాడుతున్నట్టు, దీంతో వెసెల్స్ సరఫరా 69 నుంచి 40కు తగ్గినట్టు తెలిపారు. దీంతో సమీప కాలంలో సరఫరాలు కఠినంగా మారొచ్చని.. ఇది భారత దిగుమతుల్లో సర్దుబాట్లకు దారితీయొచ్చని అంచనా వేశారు. హర్ముజ్ జలసంధిని మూసివేస్తామంటూ ఇరాన్ ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జలసంధి ద్వారానే వస్తోంది. మన దేశ ముడి చమురు దిగుమతుల్లో 40 శాతం, ఎల్ఎన్జీ దిగుమతుల్లో సగం సరఫరా ఈ ప్రాంతం నుంచే ఉంటోంది. ఇరాన్పై దాడుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూసివేసే రిస్క్ ఉందని.. అదే సమయంలో పూర్తిస్థాయి దిగ్బంధనం అవకాశాలు తక్కువే ఉండొచ్చని కెప్లెర్ నివేదిక తెలిపింది. ఎందుకంటే ఇరాన్కు చైనా అతిపెద్ద కస్టమర్గా ఉందని, చైనా సముద్ర మార్గ చమురు దిగుమతుల్లో 47% ఇరాన్ నుంచే వస్తుండడాన్ని ప్రస్తావించింది. ఇరాన్ 96% చమురు ఎగుమతులు ఈ జలసంధి నుంచే ఉంటున్నందున పూర్తిస్థాయి దగ్బంధనం ఇరాన్కే నష్టం కలిగిస్తుందని పేర్కొంది. -
25నిమిషాల్లో ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’
వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా చేపట్టిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ విజయవంతమైందని అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డేనియల్ కెయినీ చెప్పారు. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 25 నిమిషాల్లోనే ముగిసిందని తెలిపారు. ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ సైన్యానికి ఇరాన్లో గగన తల రక్షణ వ్యవస్థ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాలేదని, ఆపరేషన్ పూర్తయిన వెంటనే తమ విమానాలు క్షేమంగా తిరిగివచ్చా యని స్పష్టం చేశారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామ ర్లో ఏడు స్టెల్త్ బి–2 బాంబర్లు పాల్గొన్నాయని తెలిపా రు. ఈ బాంబర్లు 14 భారీ ఆర్డినెన్స్ పెనెట్రేటర్ బాంబులను(బరువు 13,600 కిలోలు) ఫోర్డో, నతాంజ్ అణు కేంద్రాలపై జారవిడిచాయని పేర్కొన్నారు. అలాగే టోమాహాక్ క్షిపణులు ఇస్ఫహాన్ అణు కేంద్రాన్ని ధ్వంసం చేశాయని వివరించారు. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లు ‘‘2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత బి–2 స్టెల్త్ బాంబర్లు ఈ స్థాయిలో భారీ ఆపరేషన్లో పాల్గొనడం ఇదే మొదటిసారి. మిస్సోరీ నుచి బాంబర్లు బయలుదేరాయి. అమె రికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6.40 గంటలకు మూడు అణు కేంద్రాలపై దాడులు మొదల య్యాయి. 7.05 గంటలకు మా విమానాలు ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేశాయి. 14 బంకర్– బస్టర్ బాంబులు, 24కుపైగా టోమాహాక్ క్షిపణులు ప్రయో గించాం. పశ్చిమాసి యాలో ఇటీవల ఉద్రిక్తతలు ప్రారంభమైన అనంతరం ఇరాన్పై మా అతిపెద్ద దాడి ఇదే. ఏడు బి–2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడ్డాం. ఒక్కోదాంట్లో ఇద్దరు సిబ్బంది ఉన్నారు. నిశ్శబ్దంగా వెళ్లి పని పూర్తి చేసుకొని వచ్చారు. కొద్దిమందికే తెలుసు ఇరాన్పై ఆపరేషన్ గురించి అమెరికా ప్రభుత్వ ముఖ్యుల్లో, సైనిక వ్యూహకర్తల్లో చాలా కొద్దిమందికే తెలుసు. అమెరికా జలాంతర్గామి నుంచి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై 24కుపైగా టోమాహాక్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైళ్లు ప్రయోగించాం. ఉపరితలంపైనున్న మౌ లిక సదుపాయాలను నేలమట్టం చేశాం. సాయంత్రం 6.40 గంటలకు బి–2 బాంబర్లు రెండు భారీ బంకర్–బస్టర్ బాంబులను ఫోర్డో న్యూక్లియర్ సైట్పై జారవిడిచాయి. మిగిలిన బాంబర్లు వాటి లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయి. చివరి దాడి ఇస్పహాన్పై టోమాహాక్ క్షిపణితో జరిగింది. రాత్రి 7.05 గంటల కల్లా ఆపరేషన్ ముగిసింది. ఇరాన్కు చెందిన సర్ఫేస్–టు–ఎయిర్ క్షిపణి వ్యవస్థ మా యుద్ధ విమానాల రాకను గుర్తించలేదు’’ అని డాన్ కెయినీ వివరించారు.ఆపరేషన్ విజయవంతం: పీట్ హెగ్సెత్ ఇరాన్పై ‘ఆపరేషన్ మిడ్నైట్ హామర్’ పూర్తిస్థాయిలో విజయవంతమైందని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. మూడు ఇరాన్ అణు కేంద్రాలు నాశనమయ్యాయని అన్నారు. ఇరాన్ అణ్వయుధాలు దక్కించుకోవడానికి వీల్లేదని డొనాల్డ్ ట్రంప్ మొదటనుంచీ చెబుతూనే ఉన్నారని గుర్తుచేశారు. ఇరాన్తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు వస్తుందని భావిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ చెప్పారు. చర్చలకు ఇరాన్ను ఒప్పించాలంటూ డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో ఇప్పటివరకు 430 మంది మరణించారని, 3,500 మంది గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నౌర్న్యూస్ వెల్లడించింది. ఇరాన్ దాడుల్లో ఇజ్రాయెల్లో 24 మంది మృతిచెందారని, 1,272 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఏమిటీ టోమాహాక్ క్షిపణులు?అమెరికా నావికా దళంలో కీలకమైనవి బీజీఎం–109 టోమాహాక్ ల్యాండ్ అటాక్ లాంగ్రేంజ్ మిస్సైళ్లు. యుద్ధనౌకలు, జలాంతర్గాముల నుంచి వీటిని అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో భూఉపరితలంపైనున్న లక్ష్యాలపై ప్రయోగించవచ్చు. 1970వ దశకంలో తొలిసారిగా జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారుచేసింది. 12కుపై వేరి యంట్లు ఉన్నాయి. టోమాహాక్ క్షిపణి బరువు 1,300 కిలోలు. బూస్టర్తో కలిపి రూ.1,600 కిలోలు. పొడవు 5.56 మీటర్లు గంటకు 920 కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణించి 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు.మాట వినకపోతే మళ్లీ దాడులు: ట్రంప్వాషింగ్టన్: ఇరాన్లో కీలకమైన అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశామని, శిథిలా లుగా మార్చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా సైన్యం దాడులు చేసిన అనంతరం శనివారం రాత్రి ట్రంప్ వైస్హౌస్లో మాట్లాడారు. అమెరికాపై ప్రతీకార దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ను హెచ్చరించారు. శాంతి కావాలో, యుద్ధం కావాలో తేల్చుకోవాలని ఆ దేశానికి సూచించారు. భీకర స్థాయి దాడులతో ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పే శక్తి అమెరికాకు మాత్రమే ఉందన్నారు. పశ్చిమాసియాలో ఇరాన్ ఒక దుష్టశక్తిగా మారిందని, ఇతర దేశాలకు ప్రమాదకరంగా పరిణమించిందని మండిపడ్డారు. మాట వినకపోతే ఇకపై జరగబోయే దాడులు మరింత భయాన కంగా ఉంటాయని ఇరాన్కు తేల్చిచెప్పారు.ట్రంప్ నిర్ణయం అద్భుతం: నెతన్యాహూజెరూసలేం: ఇరాన్ అణు కేంద్రాలపై అమె రికా దాడి చేయడం పట్ల ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెత న్యాహు హర్షం వ్యక్తంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. శాంతి కోసమే ఇరాన్పై బలప్రయోగం చేపట్టాల్సి వచ్చిందన్నారు. ఈ దాడులతో పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో శాంతి, సౌభాగ్యం, స్థిరత్వం, భద్రత చేకూరుతాయని స్పష్టంచేశారు. నెతన్యాహు ఆదివారం మీడియాతో మాట్లాడారు. చరిత్రను మలుపు తిప్పే నిర్ణయం తీసుకుందని అమెరికాను కొనియాడారు. ప్రపంచంలో ఏ దేశం కూడా చేయలేని సాహసోపేత కార్యాన్ని అమెరికా చేసి చూపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలతో ప్రాణాంతక శక్తిగా మారిన ఇరాన్కు బుద్ధి చెప్పిన గొప్ప నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఉద్ఘాటించారు.బాధ్యతారాహిత్యంఅమెరికాపై రష్యా ధ్వజంమాస్కో/బీజింగ్: ఇరాన్లోని మూడు అణు స్థావరాలపై భారీ బాంబులతో అమెరికా జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే అనేక సంక్షోభాలతో అట్టుకుతున్న పశ్చిమాసియాను మరింత ప్రమాదంలోకి నెట్టడమేనని పేర్కొంది. అమెరికా తన బాధ్యతారాహిత్యంతో అంతర్జాతీయ చట్టాలు, ఐరాస పీఠికను, తీర్మానాలను ఉల్లంఘించిందని మండిపడింది. ‘ఒక సార్వభౌమ దేశంపై క్షిపణులు, బాంబులతో దాడులు చేయడం బాధ్యతారహిత చర్య. దీనిని సమర్థించుకునేందుకు ఎన్ని వాదనలు వినిపించినా సరే, ఇది అంతర్జాతీయ చట్టాలకు ఐరాస చార్టర్, భద్రతా మండలి తీర్మానాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశం ఈ దాడులు చేయడం ఆందోళనకరం’అని అమెరికా పేరును ప్రస్తావించకుండా పేర్కొంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరి కా బాంబు దాడులను చైనా సైతం తీవ్రంగా ఖండించింది. ఐరాస చార్టర్ను ఉల్లంఘించిన అమెరికా పశ్చిమాసియాలో ఉద్రిక్తత లను మరింత రాజేసిందని పేర్కొంది. -
బాహుబలి బాంబు
ఎప్పుడెప్పుడా అని ఇజ్రాయెల్ ఎంతో ఆశగా ఎదురుచూసినా బంకర్ బస్టర్ బాంబులను అమెరికా మోసుకొచ్చింది. అనుకున్న లక్ష్యాలపై అమాంతం పడేసింది. పర్వతప్రాంతాన్ని పిండిముద్దలా బద్దలుకొట్టింది. అత్యంత పటిష్టమైన కఠినశిలలను సైతం తునాతునకలు చేసే వేల కేజీల బరువైన భారీ బాంబులతో ఇరాన్ అణుకేంద్రాలపై భీకర దాడులుచేసిన అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాల గురించి, అవి ప్రయోగించిన భారీ బంకర్ బస్టర్ బాంబుల గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. భూతలం మీది లక్ష్యాలను తునాతునకలుచేసే బాంబులను ప్రయోగించడం సర్వసాధారణం. కానీ ఇలా భూగర్భంలోని లక్ష్యాలను సైతం అలవోకగా చేధించి ఛిన్నాభిన్నంచేయగల శక్తివంతమైన పేలుడు ఆయుధాన్ని అమెరికా ఇటీవలికాలంలో ఎప్పుడూ ప్రయోగించలేదు. మిత్రదేశానికి సాయంగా ఇరాన్ యుద్ధంలో అడుగుపెట్టిన తొలిరోజే భారీబాంబులతో యుద్ధాన్ని అమెరికా కొత్త మలుపు తిప్పింది. బాంబు బరువు 13,600 కిలోలుఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ యురేనియం శుద్ధికర్మాగారాలపై ప్రయోగించిన జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబు బరువు ఏకంగా 13,600 కిలోలు. ఒక్కో బాంబు ఖరీదు రూ.170 కోట్లు. భూమిలోపల మరింత లోతుల్లో నిర్మించిన బంకర్లు, సొరంగాలను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా అమెరికా వైమానికదళం కోసం ఈ బాంబులను రూపొందించారు. ఒక గది పరిమాణంలో పిండిముద్దపై ఎంతపెద్ద రాయి పడేస్తే అంతలోతుకు అది వెళ్తుందికదా. అలాగే ఎంత భారీ బరువైన బాంబును పడేస్తే తొలుత అది అంతలోతుకు వెళ్తుంది. తర్వాత అది పేలుతుంది. అత్యంత లోతుల్లోకి చేరేందుకు అనువుగా ఈ బాంబును అత్యంత ఎత్తులోంచి జారవిడుస్తారు. అడ్డంగా పడిపోకుండా నిటారుగా, బాణంలాగా భూమికి గుచ్చుకునేలా బాంబు కొనకు జీపీఎస్ ట్రాకర్ అమర్చుతారు. మెరుపువేగంతో దూసుకొచ్చి..ఈ బాంబు పొడవు 20 అడుగులు. మొత్తం బాంబు బరువులో 80 శాతం బాడీ బరువే ఉంటుంది. మొత్తం వార్హెడ్లో కేవలం 20 శాతం మాత్రమే పేలుడుపదార్థం ఉంటుంది. తొలుత ఎక్కువ లోతుల్లోకి వెళ్లాలనే ఉద్దేశ్యంతో ఇలా దీనిని డిజైన్చేశారు. నేలను తాకినప్పుడు బయటిపొర ధ్వంసంకాకుండా ఉండేందుకు అత్యంత పటిష్టమైన ఫెర్రో–కోబాల్ట్ లోహమిశ్రమ కవచాన్ని అమర్చుతారు. చాలా లోతుకు వెళ్లాలంటే మరింత వేగంగా కిందకు పడాలి. అందుకోసం ఇది సూపర్సోనిక్ వేగంతో కిందకు దూసుకొస్తుంది. బరువు, వేగం, దిశ ఇలా అన్ని కలిసి దీనిని అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మార్చేశాయి. . ఆగకుండా 61 మీటర్లు చొచ్చుకెళ్లి..అత్యంత కఠినమైన శిలాప్రాంతంపై పడినా ఇది ఖచ్చితంగా 61 మీటర్ల లోతు అంటే 200 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. అక్కడ ఇది పేలి ఆ ప్రాంతం మొత్తాన్ని నామరూపాల్లేకుండా తునాతు నకలు చేస్తుంది. అయితే ఆ లోతులో అణుకేంద్రంలేకుంటే ఎలా అనే సందేహం రావొచ్చు. మొదటి బాంబు పేలిన చోటే అత్యంత ఖచ్చితంగా మరో బాంబును పడేస్తారు. అది పేలి మరింత లోతు వరకు భూమిని పెకలించివేసి పెను విస్ఫోటనం సృష్టిస్తుంది. అలా అవసరమైనన్ని బాంబులను ఒకేచోట ఒకదాని వెంట మరోటి పడేసి లక్ష్యాన్ని ఎలాగైనా బద్దలుకొడతారు. కొత్తింటి కోసం బోరు వేసినప్పుడు ఉక్కు కేసింగ్లు ఎలాగైతే ఒకదాని వెంట మరోటి జతచేస్తూ రంధ్రం లోతును పెంచుకుంటూ పోతారో యుద్దంవేళ ఈ బాంబులతో అలా భూగర్భ నిర్మాణాలను నాశనంచేసే దాకా ఒకేచోట బాంబులను ప్రయోగిస్తారు. ఆదివారం అమెరికా జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) బాంబు ఇదే పనిచేసింది. బాంబుకు తగ్గ విమానంఇంతటి బరువైన బాంబులను అలవోకగా మోస్తూ అత్యంత ఎత్తుల్లో ప్రయాణించగల సామర్థ్యమున్న బాంబర్విమానానికి మాత్రమే ఇంతటి సత్తా ఉంటుంది. అమెరికా అమ్ము ల పొది లోని బీ–2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమా నం మాత్ర మే ఈ పనిచేయగలదు. అందుకే ట్రంప్సేన వీటిని కదనరంగంలో మొహరించి ఇరాన్ అణుక్షేత్రాలపై మెరుపుదాడులు చేయించింది. బాంబులను అమర్చకముందు ఈ స్టెల్త్ విమానం బరువు ఏకంగా 71,000 కేజీలు. ఇది ఒకేసారి రెండు ఎంఓపీ బాంబులను మోసుకెళ్లగలదు. ఒక్కో విమానం ఖరీదు ఏకంగా రూ.18,000 కోట్లు. ఈ విమానాన్ని నార్త్రోప్ గ్రూమ్మన్ అనే ఆయుధ తయారీసంస్థ తయారుచేసి అమెరికా ఆర్మీకి విక్రయించింది. ఈ విమానం ఎక్కడా ఆగకుండా ఏకధాటిగా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. మార్గమధ్యంలో ఇంధనాన్ని గాల్లోనే నింపుకుంటే మరో 7,500 కి.మీ.లు ప్రయాణించి బాంబులేస్తుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా మెరుపుదాడి.. ఖండించిన ప్రపంచదేశాలు
టెహ్రాన్/టెల్ అవీవ్/వాషింగ్టన్/న్యూఢిల్లీ/మాస్కో: పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే శత్రుత్వంతో పరస్పర దాడులు చేసుకుంటున్న ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలోకి అగ్రరాజ్యం హఠాత్తుగా వచ్చి భీకరదాడులతో పశ్చిమాసియాలో యుద్ధజ్వాలలను మరింత ఎత్తుకు ఎగదోసింది. పర్వతగర్భంలో పటిష్టంగా, రహస్యంగా ఉన్న ఫోర్డో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని బద్దలుకొట్టే లక్ష్యంతో అమెరికా యుద్ధవిమానాలు వేల కేజీల బరువైన అతిభారీ బాంబులతో విరుచుకుపడ్డాయి. ఇరాన్ రాజధాని సమీప ఫోర్డో అణుకేంద్రంపై శనివారం అర్ధరాత్రిదాటాక గంటలకు జీబీయూ–57 ఏ/బీ మ్యాసివ్ ఆర్డ్నెన్స్ పెనిట్రేటర్(ఎంఓపీ) గైడెడ్ బాంబులను అమెరికా బీ–2ఏ స్పిరిట్ స్టెల్త్ బాంబర్ విమానాలు జారవిడిచాయి. ఈ బాంబులు 200 అడుగుల లోతుకు చొచ్చుకెళ్లి అక్కడి భూగర్భాన్ని బద్దలుకొట్టాయి. నతాంజ్ అణుకేంద్రంపైనా అమెరికా ఇవే బాంబులను వేసింది. మొత్తంగా 14 జీబీయూ బాంబులను ఉపయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్, జనరల్ డేనియల్ కెయిన్ వెల్లడించారు. ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్.. శనివారం అర్ధరాత్రిదాటగానే ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’పేరిట ఈ దాడులను చేసింది. అమెరికాలోని మిస్సోరీలోని వైట్హ్యాన్ వైమానిక స్థావరం నుంచి ఆరు బీ–2ఏ విమానాల దండు దండయాత్ర మొదలైంది. ఏకధాటిగా 37 గంటలపాటు ప్రయాణించి, మార్గమధ్యంలో గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంటూ 11,400 కిలోమీటర్లు ప్రయాణించిమరీ ఫోర్డో, నతాంజ్ అణుకేంద్రాలపై ఒక్కోటి దాదాపు 14,000 కేజీల బరువుండే 14 బంకర్ బస్టర్ బాంబులను పడేశాయి. ఆ తర్వాత ఇస్ఫహాన్ అణుకేంద్రంపై అమెరికా జలాంతర్గామి 30 టోమాహాక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ మూడు అణుకేంద్రాలపై 75 దాకా గైడెడ్ క్షిపణులను ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. మొత్తంగా 125 విమానాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. కొన్ని విమానాలు దాడిచేయగా మిగతావి శత్రుసేనలను తికమక పెట్టేందుకు వేర్వేరు దిశల్లో చక్కర్లు కొట్టాయి. మెరుపువేగంతో దాడులుచేసి తిరిగి తమతమ స్థావరాలకు చేరుకున్నాయి. యుద్ధ, రవాణా, ఇంధన విమానాలు ఈ ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’లో పాల్గొన్నాయి. అమెరికా దాడుల్లో అణుకేంద్రాల్లో మౌలికవసతులు ఏ స్థాయిలో నాశనమయ్యాయో ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే పర్వతం పైభాగంలో ఆరు భారీ రంధ్రాలు పడ్డట్లు తాజాగా తీసిన ‘ప్లానెట్ ల్యాబ్స్ పీబీసీ’ఉపగ్రహ ఫొటోల్లో కనిపించింది. అయితే అణుబాంబు తయారీని అడ్డుకునేందుకు బాంబులేశామని, ఇరాన్లో యుద్ధాన్ని ఎగదోసి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశ్యం తమకు లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. అయితే అణుబాంబు తయారీ సామర్యాన్ని ఇరాన్ సంతరించుకోవద్దనే లక్ష్యంతోనే తాము యుద్ధంలో పాల్గొన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ సైనికచర్యను సమర్థించుకున్నారు. తమపై ప్రతిదాడి చేస్తే మిగతా లక్ష్యాలపై దాడులు తప్పవని ఇరాన్ను హెచ్చరించారు. అయితే దాడుల తర్వాత ఆయా అణుకేంద్రాల నుంచి ఎలాంటి అణుధారి్మకత వెల్లడైన ఛాయలు కనిపించలేదని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ స్పష్టంచేసింది. దాడికి ముందే అక్కడి నుంచి యురేనియం నిల్వలను తరలించినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఊహించనిస్థాయిలో దెబ్బకొడతాం: అబ్బాస్ ఓవైపు అణు మధ్యవర్తిత్వం కోసం స్వాగతం పలుకుతూ మరోవైపు సమరాగ్నిని రాజేస్తున్న అగ్రరాజ్యాన్ని ఊరికే వదిలిపెట్టబోమని ఇరాన్ ప్రతిజ్ఞచేసింది. చరిత్రలో ఎన్నడూలేని స్థాయిలో దాడులుచేసి బదులు తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ప్రకటించారు. ఇస్తాంబుల్లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోపరేషన్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన అబ్బాస్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘దౌత్యనీతిని కాలరాస్తూ అమెరికా మాపై దాడులకు తెగబడింది. మేం దౌత్యాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టి దేశ రక్షణ కోసం భీకరపోరు చేయాల్సిన తక్షణావసరమిది. దుస్సాహసంతో దారుణంగా దాడులు చేసిన యుద్ధోన్మాద అమెరికా తదుపరి తీవ్ర పర్యావసానాలకు బాధ్యతవహించాల్సి ఉంటుంది. అమెరికా చర్యలకు ఇరాన్ తన సైన్యంతో బదులుతీర్చుకుంటుంది. దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఇరాన్ పాటుపడుతుంది’’అని అబ్బాస్ అన్నారు. మరోవైపు తమపై దాడిచేసిన ఇజ్రాయెల్పైనా ఇరాన్ ఆదివారం మిస్సైళ్లను ప్రయోగించింది. తన అమ్ములపొదిలోని మధ్యస్థ శ్రేణి ఖుర్రమ్షహర్–4 క్షిపణిను సైతం ఇరాన్ ప్రయోగించింది. ఇది ఒకేసారి 1,500 కేజీల బరువైన వేర్వేరు వార్హెడ్లను ఏకంగా 2,000 కిలోమీటర్లదాకా మోసుకెళ్లగలదు. ఈ క్షిపణిని ఈ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. దాడులను పొగిడిన ఇజ్రాయెల్ ఇరాన్పై అమెరికా దాడి చేయడాన్ని ఇజ్రాయెల్ స్వాగతించింది. ఇదొక అద్భుత, సాహసోపేత, చరిత్రాత్మక ఘటనగా అభివర్ణించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ మీడియాతో మాట్లాడారు. ‘‘దాడులు చేయాలని కోరాం. కానీ అమెరికా నిర్ణయం ముందస్తుగా మాకుతెలీదు. ఇదొక చారిత్రక నిర్ణయం. అమెరికా నేరుగా దాడులు చేస్తున్నందున ఇక మేం దాడులు చేయబోమని అనుకోవద్దు. ఇరాన్ మా భూభాగాలపై క్షిపణులు వేస్తోంది. మేం వాటికి బదులు చెప్పాలి’’అని ఇసాక్ అన్నారు. ఆదివారం సైతం ఇరాన్లోని డజనుకుపైగా మిలటరీ స్థావరాలపై దాడులుచేశామని చెప్పారు. అయితే ఆస్పత్రులు, మెడికల్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఆదివారం నాటికి ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా ఇరాన్లో 865 మందిదాకా చనిపోయారని, 3,396 మంది గాయపడ్డారని వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’సంస్థ ప్రకటించింది. మరోవైపు ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీని అత్యంత సురక్షిత బంకర్కు తరలించినట్లు తెలుస్తోంది. తమ దేశంలో 24 మంది చనిపోయారని, వేయి మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ పాత లెక్కలనే చెబుతోంది మద్దతు కూడగట్టే పనిలో ఇరాన్ ఇరాన్పై దాడులను చైనా, రష్యా తీవ్రంగా ఖండించాయి. దాడుల తర్వాత ఇరాన్కు ప్రపంచదేశాల నుంచి సైనిక సాయం పెరుగుతుందని రష్యా వ్యాఖ్యానించింది. ఈ మేరకు రష్యా మాజీ అధ్యక్షుడు, దేశ భద్రతామండలి అధ్యక్షుడు దిమిత్రీ మెద్వదెవ్ ‘ఎక్స్’ లో ఒక పోస్ట్ పెట్టారు. ‘‘దాడుల కారణంగా ఆ అణుకేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదు. పైగా ఇరాన్కు బయటి మద్దతు పెరుగుతోంది. అణువార్హెడ్లు సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి’’అని అన్నారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్తో మంతనాలు జరిపేందుకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆదివారం మాస్కోకు వెళ్లారు. భేటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జలసంధి దిగ్భందం!! ప్రపంచ చమురు జీవనాడికి పేరొందిన హోర్ముజ్ జలసంధిని మూసేస్తామని ఇరాన్ బెదిరించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపింది. అయితే జాతీయ ప్రయోజనాలపై కీలక నిర్ణయాలు తీసుకునే ‘సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్’ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అది కూడా ఆమోదిస్తే జలసంధి ద్వారా ముడి చమురు, సహజవాయువు రవాణా నౌకల రాకపోకలు స్తంభించిపోనున్నాయి. దాంతో ఇంధన కొరత ఎక్కువై, గిరాకీ పెరిగి, పెట్రో ధరలు మరింత అధికంకానున్నాయి. భారత్పై దీని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముంది. మరోవైపు, అమెరికా జోక్యం, బాంబు దాడులతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆదివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్తో భారత ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతలపై మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. చర్చలు, దౌత్యం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ వివరాలను మోదీ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించారు. -
అమెరికా దాడులు.. ఇరాన్కు అండగా రష్యా..!
టెహ్రాన్: ఇరాన్పై యుద్ధం వద్దూ అంటూ ఇది వరకే అమెరికాను హెచ్చరించిన రష్యా... ఈ మేరకు దిద్దబాటు చర్యలు చేపట్టడానికి నడుంబిగించింది. ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని రష్యా మరోసారి హెచ్చరికలు పంపింది.రష్యాకు ఇరాన్ రక్షణమంత్రిఇజ్రాయిల్, అమెరికాలు.. ఇరాన్ను అతలాకుతులం చేసే దిశగా యుద్ధాన్ని తీవ్రతరం చేయడంతో ఇరాన్ ఏం చేయాలనే దానిపై ఆలోచనలో పడింది. దీనిలో భాగంగా తమకు అండగా ఉన్న రష్యా సహకారం కోసం ఇరాన్ ప్రయత్నాలు ఆరంభించింది. ఈ మేరకు ఇరాన్ రక్షణమంత్రి అబ్బాస్ అరాగ్చీ.. అగమేఘాల మీద రష్యాకు బయల్దేరారు. రేపు(సోమవారం) రష్యా అధ్యక్షుడు పుతిన్తో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని ఇరాన్ రక్షణశాఖ అధికారికంగా వెల్లడించింది. రక్షణమంత్రి అరాగ్చీ.. రష్యాకు వెళ్లే విషయాన్ని వెల్లడించారు. మూడు ఇరాన్ కీలక అణుస్థావరాలపై అమెరికా బాంబుల దాడితో విరుచుకుపడిన తరుణంలో.. రష్యా ఆదేశాలతో ఇరాన్ ముందుకెళ్లే అవకాశం ఉంది.‘ఇరాన్కు రష్యా మిత్రదేశం. మేము ఎప్పుడూ రష్యాను ఆశ్రయిస్తూనే ఉంటాం. నేను మాస్కోకు అత్యవసరంగా బయల్దేరి వెళుతున్నా. రష్యా అధ్యక్షుడు పుతిన్తో కీలక సమావేశం ఉండనుంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాపై అమెరికా చేసే దాడి కచ్చితంగా అతిక్రమణ కిందకే వస్తుంది. మా అణుస్థావరాలపై దాడులకు దిగిన అమెరికా రెడ్ లైన్ క్రాస్ చేసింది. ఐక్యరాజ్యసమితిలో మాకున్న హక్కులను కాపాడుకోవడమే మా తదుపరి కర్తవ్యం. మేము కచ్చితంగా వారికి బుద్ధి చెబుతాం’ అని అరాగ్చీ స్పష్టం చేశారు. ట్రంప్ మరో యుద్ధాన్ని మొదలుపెట్టారు..ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఖండించారు. ఇరాన్పై దాడులతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో యుద్ధానికి తెరలేపారని విమర్శించారు. ఈ యుద్దంతో అమెరికా సాధించింది ఏమీ లేదనే విషయం తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎటువంటి గణనీయమైన సైనిక లక్ష్యాలను ఛేదించడంలో విఫలమైందన్నారు. ఇక్కడ ఇరాన్ స్వల్ప నష్టాన్ని మాత్రమే చవిచూసిందన్నారు.ఆ దుస్సాహసం వద్దు.. రష్యా వార్నింగ్ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా దాడులు చేయడానికి దిగడానికి ముందుగానే రష్యా క్లియర్ మెస్సేజ్ ఇచ్చింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా ఇదివరకే స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. ఏదైనా జరగొచ్చు..ఇరాన్కు అణ్వాయుధాలు సరఫరా చేయడానికి చాలా దేశాలే సిద్ధంగా ఉన్నాయని అమెరికాను పరోక్షంగా హెచ్చరించిన రష్యా.. నేరుగా రంగంలోకి దిగితే యుద్ధం మరింత ముదరడం ఖాయం. ఇరాన్కు ఆది నుంచి మద్దతు ఇస్తూ వస్తున్న రష్యా.. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తోంది. ఇరాన్ రక్షణమంత్రితో భేటీ అనంతరం రష్యా తదుపరి కర్తవ్యం ఏమటనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రష్యా యుద్ధంలోకి దిగి ఇరాన్కు మద్దతిస్తే మాత్రం భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ శాంతి చర్చలు అనేది చాలా కీలకమని వారు భావిస్తున్నారు. ఇరాన్ రక్షణమంత్రితో జూన్ 23వ తేదీన పుతిన్ భేటీలో ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధాన్ని ఇక్కడితో ముగిస్తే మంచిదని ఇరాన్కు పుతిన్ ఆదేశాలు ఇస్తే ఫర్వాలేదు కానీ, నేరుగా రష్యా కూడా యుద్ధంలోకి వస్తే మాత్రం సైనిక పరంగా రెండు అగ్రదేశాల మధ్య వార్ మరింత హీట్ పుట్టించే అవకాశాలు కూడా లేకపోలేదు. -
‘నోబెల్ శాంతి’కి నామినేట్ చేద్దామనుకుంటే.. ఇలా చేశారేంటి?
కరాచీ: ఇరాన్పై అమెరికా దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసలతో ముంచెత్తిన తర్వాతే రోజే ఇరాన్పై అగ్రరాజ్యం దాడులకు దిగడాన్ని పాకిస్తాన్ వ్యతిరేకించింది. నోబెల్ శాంతి పురస్కరానికి డొనాల్డ్ ట్రంప్ అన్ని విధాలా అర్హుడేనని పాక్ ప్రకటించిన రోజు వ్యవధిలోనే.. ఇరాన్పై బాంబుల వర్షం కురిపించిన అమెరికా వైఖరిని పాక్ తప్పుబట్టింది. ఈ మేరకు ఇరాన్పై అమెరికా దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇది ఎంతమాత్రం సమంజసం కాదని ‘ఎక్స్’ లో పేర్కొంది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. 🔊PR No.1️⃣8️⃣2️⃣/2️⃣0️⃣2️⃣5️⃣Pakistan Condemns the US Attacks on the Nuclear Facilities of the Islamic Republic of Iran.🔗⬇️https://t.co/2qpo27WzVQ pic.twitter.com/ugtFomQ5HO— Ministry of Foreign Affairs - Pakistan (@ForeignOfficePk) June 22, 2025 డొనాల్డ్ ట్రంప్కు ‘నోబెల్ శాంతి’ ఇవ్వాల్సిందే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన పేరును అధికారికంగా ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వం శనివారం(జూన్ 21వ తేదీ) వెల్లడించింది. ఇటీవల నిర్ణయాత్మక దౌత్యపరమైన జోక్యంతో భారత్–పాకిస్తాన్ ఘర్షణ ఆగేలా ట్రంప్ కృషి చేశారని, అందుకు నోబెల్ శాంతి బహుమతికి ఆయన అర్హుడేనని తేల్చిచెప్పింది. అయితే నాలుగురోజుల క్రితం ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్కు వైట్హౌస్లో విందు ఇచ్చిన సంగతి తెలిసిందే.ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆ సమయంలో అసిమ్ మునీర్ విజ్ఞప్తి చేశారు. తాజాగా పాక్ ప్రభుత్వం అధికారికంగా దీనిపై ప్రకటన చేసింది. భారత్–పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరించారని, ఇరు దేశాలతో మాట్లాడి శాంతికోసం కృషి చేశారని పేర్కొంది. అణ్వ్రస్తాలు కలిగిన రెండు దేశాల మధ్య యుద్ధం జరగకుండా నివారించారని కొనియాడింది. భారత్–పాక్ మధ్య అమల్లోకి వచి్చన కాల్పుల విరమణకు ట్రంప్ చొరవే కారణమని తెలిపింది. మరి ఇప్పుడు అదే ట్రంప్.. ఇరాన్పై దాడులకు దిగడంతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. కొన్ని దేశాల మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ కారణమయ్యారని నిన్న, మొన్నటి దాకా భావించిన పాక్.. ఇరాన్పై అమెరికా యుద్ధాన్ని ఖండించింది. ట్రంప్ నోబెల్ శాంతి పురస్కారానికి అర్హుడని అనుకున్న వేళ.. ఆయన ఇరాన్పై యుద్ధానికి సిద్ధం కావడంతో ఇలా జరిగేందటనే భావనలో పడింది పాక్. తమకేదో సాయం చేశాడని నోబెల్కు సిఫార్సు చేద్దామనుకుంటే.. ట్రంప్ ఇలా చేశారేంటని అనుకోవడం ఇప్పుడు పాక్ వంతైంది. తాము ఓ అధికార ప్రకటన చేసిన రోజు వ్యవధిలోనే ట్రంప్ ‘ఎంత పని చేశారు’ అని తలలు పట్టుకోవడే తప్పితే ఏమీ చేసేది లేకుండా పోయినట్లైంది పాక్ పరిస్థితి. ఇదీ చదవండి:‘మీరు ఓకే అంటే నేను రంగంలోకి దిగుతా’.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్! -
ఇజ్రాయెల్,అమెరికా విరుచుకు పడుతున్న వేళ.. ఇరాన్కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!
సాక్షి,ఢిల్లీ: ఇరాన్పై ఇజ్రాయెల్,అమెరికా దాడులకు తెగబడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరు దేశాలు శాంతి నెలకొల్పేలా చర్చలు జరపాలంటూ భారత ప్రధాని మోదీ (Narendra Modi) ఇరాన్ అధ్యక్షుడితో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో (Masoud Pezeshkian) ఫోన్లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ‘ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్తో నేను మాట్లాడాను. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా జరుపుతున్న దాడుల గురించి చర్చించాం. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేశాం. ప్రాంతీయంగా శాంతి, భద్రత, స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించడానికి, తక్షణ ఉద్రిక్తతలను తగ్గించడం, శాంతి చర్చలు జరపాలని చెప్పినట్లు ’ పేర్కొన్నారు. Spoke with President of Iran @drpezeshkian. We discussed in detail about the current situation. Expressed deep concern at the recent escalations. Reiterated our call for immediate de-escalation, dialogue and diplomacy as the way forward and for early restoration of regional…— Narendra Modi (@narendramodi) June 22, 2025సుదీర్ఘకాలం నుంచి ఇరాన్తో పాటు ఇరాన్ మద్దతిస్తున్న హమాస్, హెజ్బొల్లా వంటి మిలిటెంట్లు గ్రూపులు ఇజ్రాయెల్పై దాడులకు తెగబడుతున్నాయి. ఈ దాడులు తన భద్రతకు ముప్పుగా భావిస్తోంది. అందుకే ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లాతో పాటు ఇరాన్పై దాడుల్ని తీవ్రతరం చేసింది.ఇరాన్పై అమెరికా ఎందుకు దాడులు చేస్తోంది?ఈ ఇరు దేశాల యుద్ధంలో ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం శనివారం (జూన్ 21, 2025న) ఇరాన్లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అనే అణు కేంద్రాలపై B-2 స్పిరిట్ బాంబర్లతో భారీ బాంబుల వర్షం కురిపించింది. ట్రంప్ సైతం ఈ దాడి విజయవంతమైందని పేర్కొన్నారు. ( ఫొటొ:ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా ప్రయోగించిన బీ-2 స్పిరిట్ బాంబార్స్), image source: (యూఎస్ఏ టుడే)ఈ దాడి ద్వారా అమెరికా అధికారికంగా యుద్ధంలోకి దిగినట్టయింది. ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడమే ప్రధాన ఉద్దేశమని ట్రంప్ తెలిపారు. అయితే, ఈ చర్యపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇది యుద్ధాన్ని మరింత పెంచుతుందా లేక శాంతికి దారి తీస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కావొచ్చని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇరాన్పై ఇజ్రాయెల్ యుద్ధానికి కారణంఇరాన్ ప్రధానంగా హమాస్ (పాలస్తీనా), హెజ్బొల్లా (లెబనాన్) వంటి మిలిటెంట్ గ్రూపులకు ఆర్థిక సహాయం, ఆయుధాలు, శిక్షణ అందిస్తోంది. ఈ శిక్షణను ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ)లోని ఖుద్స్ ఫోర్స్ అనే విభాగం నిర్వహిస్తోంది.హమాస్: ఇజ్రాయెల్పై అక్టోబర్ 7,2023న జరిగిన దాడికి ముందు, హమాస్ మిలిటెంట్లు ఇరాన్లో శిక్షణ పొందినట్లు ఇజ్రాయెల్ ఆరోపించింది. వీరికి డబ్బు,ఆయుధాలు,సాంకేతిక సహాయం కూడా అందించినట్లు ఆరోపించింది. హెజ్ బొల్లా: ఇది లెబనాన్లో ఉన్న షియా మిలిటెంట్ గ్రూప్. దీనికి ఇరాన్ మద్దతు ఇస్తుంది. హెజ్ బొల్లాకు ఆయుధాలు, శిక్షణతో పాటు వ్యూహాత్మక సలహాలు సూచనలు ఇస్తోంది.అందకు హెజ్బొల్లా, హమాస్తో పాటు ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల్ని తీవ్రతరం చేసింది. హెజ్బొల్లా,హమాస్ గ్రూపుల్ని నిర్విర్యం చేసింది. ఆ రెండు గ్రూపులకు కీలకంగా వ్యవహరిస్తున్న టాప్ కమాండర్లను హతమార్చింది. ఇప్పుడు ఇరాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. -
ఏఐ మాయకు బ్లూబుక్ విరుగుడు
చాట్ జీపీటీ వచ్చాక చదువు మెషిన్ల పని అయిపోయింది. ‘హోంవర్క్ ఎంతున్నా ఏఐ ఉంది కదా!’ అంటున్నారు విద్యార్థులు. ఇది చూసిన టీచర్లు అసహనంతో ‘ఇవాళ చదువు కంటే చీటింగ్ ట్రిక్స్ ఎక్కువ అయిపోతున్నాయి’ అని రుసరుసలాడుతున్నారు. అందుకే, టీచర్లు ఈ చాట్ జీపీటీ ఏఐ మాయాజాలానికి విరుగుడుగా ‘బ్లూ బుక్ ’ను రంగంలోకి దించారు. ఈ పద్ధతిలో విద్యార్థులు హోంవర్క్ ఇంట్లో కాదు, స్కూల్లోనే చేయాలి. ఇందుకోసం ప్రత్యేకమైన సమయం, పుస్తకాలను కేటాయిస్తారు. ఇక ఆ హోంవర్క్ చేయాల్సింది విద్యార్థులు పూర్తిగా వారి సొంత తెలివితేటల మీద ఆధారపడి మాత్రమే! ఇది విద్యార్థులకే కాదు, టీచర్లకు కూడా ఒక సవాలే! ఎందుకంటే వాళ్లు పోరాడుతున్నది, ప్రపంచమే గిరగిర తిరిగిపోతున్న చాట్ జీపీటీ మాయతో! అయినా, ఫలితం మాత్రం ఆశాజనకంగానే ఉంది. 2022 చాట్ జీపీటీ వచ్చిన తర్వాత టెక్సస్ యూనివర్సిటీలో బ్లూ బుక్స్ కొనుగోలు ముప్పై శాతం, కాలిఫోర్నియాలో ఎనభై శాతం పెరిగాయి! దీంతో, ఇప్పుడు చదువు మళ్లీ పాత పద్ధతిలోకి వస్తోంది. పుస్తకాలను మరచిపోయిన తరం ఇప్పుడు చేతిరాతకు తిరిగి పదును పెడుతోంది.(చదవండి: గాల్లో ఎగిరే బైక్..! 'స్కై స్కూటర్'..) -
అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్పై దాడుల ఫలితం
వాషింగ్టన్: అమెరికా తాజాగా ఇరాన్లోని అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని, దాడులను చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా, ఇజ్రాయెల్ హై అలర్ట్లో ఉన్నాయి. మూడు ఇరానియన్ అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు నిర్వహించిన దరిమాలా న్యూయార్క్, వాషింగ్టన్తో సహా అమెరికాలోని ప్రధాన నగరాల్లోని అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.ఇరాన్లో జరుగుతున్న పరిస్థితులను తాము ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఇక్కడి మతపరమైన, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాలకు అదనపు బలగాలను మోహరిస్తున్నామని తెలిపారు. అలాగే కొలంబియాలోని ప్రజలకు రక్షణ కల్పించేందుకు, నిఘాను పర్యవేక్షించడానికి, సమాఖ్య చట్ట అమలు భాగస్వాములతో సమన్వయ చేసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది.ఇరాన్లోని ఫోర్డో, ఇస్ఫహాన్, నటాంజ్లోని అణు సౌకర్యాలపై అమెరికన్ సైన్యం విజయవంతమైన దాడి నిర్వహించిందని,ఇది ప్రపంచానికి చారిత్రక క్షణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరాన్ ఈ దాడులపై స్పందిస్తూ, అమెరికా వైమానిక దాడులో స్థానికులెవరికీ ఎటువంటి ప్రమాదం వాటిల్ల లేదని పేర్కొంది. దాడుల అనంతరం ఇజ్రాయెల్ కూడా మరింత అప్రమత్తం అయ్యింది. దేశంలోని వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. ఇజ్రాయెల్, అమెరికా సైన్యాల సంపూర్ణ సమన్వయంతో ఈ దాడులు జరిగాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.ఇది కూడా చదవండి: ధ్వంసమైన ఇరాన్ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే.. -
ఇరాన్ లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా అటాక్
-
ధ్వంసమైన ఇరాన్ అణుకేంద్రాల సామర్థ్యం ఇదే..
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య భీకరయుద్ధం జరుగుతోంది. తాజాగా అమెరికా టెహ్రాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై బాంబు దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచింది. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వివాదంలో అమెరికా సైనిక జోక్యం తొలిసారిగా ఈ దాడులలో ప్రత్యక్షంగా కనిపించింది.ట్రూత్ సోషల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్లో అమెరికన్ విమానాలు విజయవంతమైన దాడిని పూర్తి చేశాయని పేర్కొన్నారు. ఇప్పుడు అన్ని విమానాలు ఇరాన్ వైమానిక స్థలం వెలుపల ఉన్నాయి. బాంబుల పేలోడ్ను ప్రాథమిక సైట్ అయిన ఫోర్డోలో ఉంచారు. విమానాలన్నీ సురక్షితంగా తిరిగి వెళ్తున్నాయి. అమెరికన్ వారియర్స్కు అభినందనలు. ఇంతటి సత్తాచాటిన సైన్యం ప్రపంచంలో మరోచోట లేదు. ఇప్పుడు శాంతికి సమయం వచ్చిందని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్కు మద్దతుగా అమెరికా ఈ వివాదంలోకి ప్రవేశించాలా వద్దా అని నిర్ణయించుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని ట్రంప్ గతంలో చెప్పారు. అయితే ఇంతలోనే అమెరికా ఈ దాడులను చేసింది. ఇజ్రాయెట్ గతవారం రోజులుగా ఇరాన్ అణు సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని, దాడులు కొనసాగిస్తోంది. తాజాగా అమెరికా సాగించిన దాడులలో ఇరాన్లోని మూడు అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయి.ఫోర్డో అణు సామర్థ్యంఇరాన్లోని అత్యంత రక్షణతో కూడిన అణు కేంద్రం ఇది. ఇది ఒక పర్వతం కింద ఉంది. ఫోర్డోను ఢీకొట్టేందుకు అమెరికా బీ-2 బాంబర్లను ఉపయోగించిందని వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. ఫోర్డో అణు కేంద్రంలో దాదాపు మూడు వేల సెంట్రిఫ్యూజ్లను ఉంచగల సామర్థ్యం ఉంది. వైమానిక దాడులను ఎదుర్కొనే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. 2009లో కొన్ని విదేశీ నిఘా సంస్థలు ఈ ప్లాంట్ వివరాలను బహిర్గతం చేశాయి. ఫలితంగా ఇరాన్ అధికారికంగా అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) దీనిని బహిర్గతం చేయకతప్పలేదు.నటాంజ్ అణు సామర్థ్యంనటాంజ్.. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక యురేనియం నిల్వ కేంద్రం. ఈ కేంద్రం ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులకు గురైంది. 50 వేలకుపైగా సెంట్రిఫ్యూజ్లను ఇది నిర్వహిస్తోంది. చాలా కాలంగా అంతర్జాతీయ ఆందోళనకు కేంద్ర బిందువుగా నిలిచింది. వైమానిక దాడుల నుండి రక్షణ కల్పించేందుకు దీనిని భూగర్భంలో నిర్మించారు.ఇస్ఫహాన్ అణు కేంద్రం1984లో చైనా సహకారంలో ఇస్ఫహాన్ సైట్ ఏర్పడింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 350 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రం ఉంది. ఇది చైనా పరిశోధన రియాక్టర్లు, ప్రయోగశాలలకు నిలయంగా ఉంది. ఇరాన్ అణు కార్యక్రమంలో ఈ అణు కేంద్రం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ యురేనియం మార్పిడి కేంద్రం, అణు ఇంధన తయారీ కర్మాగారం ఉన్నాయి.ఇది కూడా చదవండి: ‘అంతర్జాతీయ చట్టానికి తూట్లు’.. అమెరికా దాడులను ధృవీకరిస్తూ ఇరాన్ -
ఇరాన్ పై యుద్ధంలో ఇజ్రాయెల్ తో జతకట్టిన అమెరికా
-
శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే: ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్ అణు స్థావరాల ధ్వంసమే అమెరికా టార్గెట్ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. దాడులను అధికారికంగా ప్రకటించారు. ఇరాన్పై దాడులు అమెరికా మిలటరీ విజయమని ప్రశంసలు కురిపించారు. ఇదే సమయంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై అమెరికా దాడుల తర్వాత అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ట్రంప్ వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఇరాన్పై మేము దాడులు చేశాం. కీలకమైన ఇరాన్ అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే మా లక్ష్యం. అమెరికా, ఇజ్రాయెల్, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణం. ఇది మా మిలటరీ విజయం. మేం చేసిన దాడులు చాలా కష్టతరం. ప్రపంచంలో ఏ దేశానికి ఇది సాధ్యం కాదు. మేము ఇజ్రాయెల్తో కలిసి పనిచేస్తాం. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే బాధ్యత ఇరాన్దే. ఇరాన్ శాంతి మార్గం వెళ్లకపోతే భవిష్యత్లో మరిన్ని ఎక్కువ దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.#WATCH | US strikes Iran's three nuclear facilitiesUS President Donald Trump says, "Our objective was the destruction of Iran's nuclear enrichment capacity and a stop to the nuclear threat posed by the world's number one state sponsor of terror. Tonight, I can report to the… pic.twitter.com/KQdMgczaJo— ANI (@ANI) June 22, 2025యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చింది. ఇక, యుద్ధం కొనసాగకూడదు. గత 40 ఏళ్లుగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల కారణంగా అక్కడ ఉంటున్న అమెరికన్లు చనిపోయారు. ఇంకా చనిపోతూనే ఉన్నారు. ఇప్పటికైనా ఇరాన్ దాడులను ఆపాలి. ఇప్పటికి శాంపిల్ మాత్రమే చూపించారు. ఇరాన్ తన తీరు మార్చుకోకపోతే మరిన్ని దాడులు జరుగుతున్నాయి. మా టార్గెట్స్ మాకు ఉన్నాయి. మేము తలుచుకుంటే అన్నింటినీ నాశనం చేయగలం. మా లక్ష్యాలు ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. #WATCH | US strikes Iran's three nuclear facilities President Donald Trump says, "This cannot continue. There will be either peace or there will be tragedy for Iran, far greater than we have witnessed over the last eight days. Remember, there are many targets left. Tonight's… pic.twitter.com/koWkXYjXBA— ANI (@ANI) June 22, 2025 -
ఇరాన్పై విరుచుకుపడిన అమెరికా.. బీ-2 స్పిరిట్ బాంబర్లతో ఆకస్మిక దాడులు
టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయెల్ వేళ సంచలన ఘటన చోటుచేసుకుంది. ఇరాన్పై ముప్పెట దాడి మొదలైంది. అంతా అనుకున్నట్టుగానే ఇరాన్పై తాజాగా అమెరికా విరుచుకుపడింది. ఇరాన్లోని అణు కేంద్రాలే టార్గెట్గా అమెరికా భారీ దాడులు చేసింది. దాడుల అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై అమెరికా విజయవంతంగా దాడులు చేసిందని ట్రంప్ చెప్పుకొచ్చారు.ఇక, ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడుల అనంతరం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ క్రమంలో ట్రంప్ ట్విట్టర్ వేదికగా.. ‘ఇరాన్పై అమెరికా దాడులు చేసింది. భారీ బాంబులు ఫోర్డోపై వేశాం. ఇరాన్ గగనతలం బయట నుంచే ఈ దాడులు చేశాం. విమానాలు సురక్షితంగా అమెరికాకు తిరుగుముఖం పట్టాయి. అమెరికా యోధులకు అభినందనలు. ప్రపంచంలో మరే దేశానికి చెందిన మిలిటరీకి ఇది సాధ్యంకాదు. ఇప్పుడు శాంతికి సమయం’ అని చెప్పుకొచ్చారు.pic.twitter.com/wu9mMkxtUg— Donald J. Trump (@realDonaldTrump) June 21, 2025మరో పోస్టులో ‘ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఫోర్డో నాశనమైంది’ అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ వైమానిక సైన్యంతో కలిసి దాడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తమ విమానాలు సురక్షితంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇక, ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా కూడా ఇరాన్పై దాడులు ప్రారంభించడంతో భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. కాగా, ఈ దాడి నేపథ్యంలో ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ ప్రకటించింది. ఇదిలా ఉండగా.. నిన్న రాత్రే అమెరికాలోని వైట్మన్ ఎయిర్ బేస్ నుంచి మరిన్ని బీ-2 స్పిరిట్లు, ఎనిమిది కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్లు ఇండో-పసిఫిక్లోని డియాగో గార్సియా దిశగా బయల్దేరి వెళ్లాయి. ఇవి మైటీ11, మైటీ21 అనే కాల్సైన్లు వాడినట్లు ఫ్లైట్ రాడార్ 24 పేర్కొంది. గతంలో కూడా బీ-2 స్పిరిట్లు ప్రత్యేక ఆపరేషన్ల కోసం బయల్దేరిన సమయంలో ‘మైటీ’ కాల్సైన్లను వాడాయి. ఈ దాడితో అమెరికా కూడా యుద్ధ రంగంలోకి ప్రవేశించినట్లైంది. అగ్రరాజ్య ప్లానింగ్కు పూర్తిగా సహకరించినట్లు ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ఫోర్డో అణుకేంద్రం క్వామ్ నగరానికి అత్యంత సమీపంలో ఉంది. అక్కడి ప్రజలు పేలుళ్ల చప్పుళ్లు విన్నట్లు మీడియాకు వెల్లడించారు. ఈ అణుకేంద్రం ఇరాన్కు చాలా కీలకమైంది. అక్కడి పర్వతాన్ని తొలిచి కొన్ని వందల అడుగుల లోతులో దీనిని నిర్మించారు. 1981లో బాగ్దాద్లో ఇజ్రాయెల్ ఎఫ్15, ఎఫ్16 యుద్ధ విమానాలు అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్తగా దీన్ని నిర్మించారు. 2023లో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఇన్స్పెక్టర్లు ఇక్కడ 83.7శాతం శుద్ధిచేసిన యురేనియంను గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన అణుబాంబుల్లో వాడే 90శాతం శుద్ధి చేసిన యురేనియంకు ఇది చాలా దగ్గర్లో ఉంది. అణువ్యాప్తి నిరోధక ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన నేపథ్యంలో ఆ దేశం ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం.బీ-2 బాంబర్లు..ఒక చిన్న పక్షికి సమానంగా బీ-2 బాంబర్ల రాడార్ క్రాస్ సెక్షన్ ఉంటుంది. ఒక్కో బీ-2 బాంబర్ రెండు ఆయుధాలను మోసుకెళ్లగలుగుతుంది. 15 టన్నుల బరువున్న రెండు బంకర్ బ్లాస్టర్లను మోసుకెల్లే సామర్థ్యం వీటికి ఉంది. తాజాగా ఆరు బీ-2 బాంబర్లు ఇరాన్పై దాడులు చేసినట్టు తెలుస్తోంది. ఇవి ఒక్కసారిగా 11,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. B-2 Spirit Stealth Bomber🇺🇸 U.S. Air Force heavy strategic bomberDesigned for stealth, it can penetrate dense enemy air defenses undetectedCarries conventional and nuclear weaponsRange: ~11,000 km (6,800 miles) without refuelingCost: ~$2 billion per unitOnly 21 were… pic.twitter.com/IcF5FsYxED— Israel MyChannel (@IsraelMychannel) June 21, 2025అంతకుముందే ఇరాన్ను ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఇజ్రాయెల్పై ప్రశంసలు కురిపించారు. ఇజ్రాయెల్ విజయపథంలో ఉందని, ఇప్పుడు ఆ దేశాన్ని యుద్ధం ఆపమని తాను చెప్పలేనని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్ అద్భుతంగా రాణిస్తోంది. ఇరాన్ అంతగా ప్రభావం చూపడం లేదు. ఇప్పుడు యుద్ధాన్ని ఆపడం కష్టమే అని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకుండా ఇరాన్కు చెందిన ఫోర్డ్ భూగర్భ అణుకేంద్రాన్ని నాశనం చేసే సామర్థ్యం టెల్అవీవ్కు లేదన్నారు. ఒకవేళ వారు దాడులు చేసినా అది పెద్ద ప్రభావం చూపించవన్నారు. వారికి ఆ సామర్థ్యం లేదన్నారు.Visuals: Huge US airstrikes on Fordow, Natanz, and Esfahan Iranian nuclear facilities. pic.twitter.com/fSIcAHu3X3— Black Cobra ⚡ (@Blackcobra00007) June 22, 2025అలాగే, ఐరోపా నేతలు జరుపుతున్న చర్చలు కూడా ఫలవంతం కావని అన్నారు. వారు ఇరాన్కు ఎలాంటి సాయం చేయలేరని తెలిపారు. ఇదే సమయంలో ‘ఐరోపాతో ఇరాన్ మాట్లాడాలని అనుకోవడం లేదు. మాతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ విషయంలో ఐరోపా ఏ రకంగానూ సాయం చేయలేదు. నేను శాంతి దూతను. కొన్ని పరిస్థితుల్లో శాంతిదూత కూడా కఠినంగా ఉండాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు. -
అమెరికాతో పాక్ ‘దోస్తానా’.. నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదన
ఇస్లామాబాద్: అగ్రరాజ్యం అమెరికా, దాయాది దేశం పాకిస్తాన్ మధ్య ఉన్న అనుబంధం మరోసారి బహిర్గతమైంది. ట్రంప్ విషయంలో పాకిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరు పాక్ ప్రతిపాదించింది. దీంతో, ఈ విషయంలో హాట్ టాపిక్గా మారింది.వివరాల ప్రకారం.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును పాకిస్తాన్ ప్రతిపాదించింది. ఈ సందర్బంగా పాకిస్తాన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్ కుదిర్చారని తెలిపింది. ఆయన వల్లే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ప్రశంసలు కురిపించింది. భారత్ మాత్రం పాకిస్తాన్పై దాడికి పాల్పడి ప్రాణ నష్టానికి కారణమైందని ఆరోపించింది. ట్రంప్ దౌత్యం వల్లే యుద్దం ముగిసిందని చెప్పుకొచ్చింది.🇵🇰 BREAKING: Pakistan nominates Donald Trump for Nobel Peace Prize! 🏆Because obviously, “ceasefire magic” happened just on Trump’s request 🙃No military diplomacy, no DGMOs, no backchannel talks - just one phone call from The Donald, and India-Pakistan hugged it out! 💥📞🕊️… pic.twitter.com/BQSkJt936b— Raksha Samachar | रक्षा समाचार 🇮🇳 (@RakshaSamachar) June 21, 2025రెండు దేశాల మధ్య జోక్యం నిజమైన శాంతి స్థాపకుడిగా అధ్యక్షుడు ట్రంప్ పాత్రను స్పష్టం చేసింది. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించాలనే ఆయన నిబద్ధతకు ఇది నిదర్శనం అని కీర్తించింది. కశ్మీర్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించడానికి ట్రంప్ పదే పదే చేసిన ప్రతిపాదనలకు ఇస్లామాబాద్ కూడా ప్రశంసించింది. ఆయన ప్రమేయంతో దక్షిణాసియాలో శాశ్వత శాంతి నెలకొంటుందని పేర్కొంది. చివరగా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాల ప్రకారం కశ్మీర్ వివాదం పరిష్కారం కాకుండా.. ఈ ప్రాంతంలో ఎప్పటికీ శాంతి నెలకొనదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.JUST ANNOUNCED: Pakistan nominates President Donald Trump for 2026 Nobel Peace Prize 🇺🇸PEACEMAKER-IN-CHIEF TRUMP! 🇺🇸 pic.twitter.com/ihGlDz1iZp— Ape𝕏 (@CubanOnlyTrump) June 20, 2025అయితే, ట్రంప్ పేరును ప్రతిపాదించిన సందర్భంగా భారత్ విషయాలు, కశ్మీర్ అంశంపై ప్రస్తావించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ట్రంప్.. కశ్మీర్ అంశమై పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ మధ్య కశ్మీర్ వివాదంపై తాను మధ్యవర్తిత్వం కూడా తీసుకుంటాని చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలు, తాజాగా పాక్ సైతం ఇదే ప్రస్తావన తేవడంతో కొత్త ప్లాన్ ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక, ఆపరేషన్ సిందూర్ సమయంలో కశ్మీర్, పీఓకే విషయంలో భారత్ పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ట్రంప్కు నోబెల్ అంటే ఎంత ఇష్టమంటే.. అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ అవార్డుపై ఎప్పటినుంచో ఆసక్తిగా ఉన్నారు. పలుమార్లు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి దీనికోసం తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహుతో సమావేశం సందర్భంగా వాళ్లు నాకు ఎప్పటికీ నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. అది ఏమాత్రం బాగోలేదు. నేను అర్హుడను అని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు ఒబామాకు దీనిని ఇవ్వడాన్ని ఆయన తప్పుపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచంలోని పలు వివాదాల సమయంలో తానే సంధి కుదిర్చానని చెప్పుకోవడం ఆయనకు అలవాటుగా మారింది. దీనిని పాక్ బాగానే గమనించింది. ఇటీవల ఫీల్డ్ మార్షల్ అసిం మునీర్ మాట్లాడుతూ భారత్-పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపిన ట్రంప్ నోబెల్ ప్రైజ్కు పూర్తిగా అర్హుడంటూ ఓ సర్టిఫికెట్ జారీ చేశారు. ఆ తర్వాత ఆయనకు శ్వేతసౌధం నుంచి భోజనానికి ఆహ్వానం అందింది. -
అణు ఉపద్రవం
‘‘ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా (అమెరికా) పరిస్థితిని నిరంతరం మదింపు చేస్తోంది. (ఇరాన్) 2003 లో పక్కనపెట్టిన అణ్వాయుధాల నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు సర్వోన్నత నాయకుడు ఖొమేనీ ఆదేశించలేదు’’ అని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబార్డ్ ఈ ఏడాది మార్చి 26న చెప్పారు. అయినా, ఇరాన్ అణ్వాయుధాల నిర్మాణ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకు ‘ముందస్తు’ చర్యగా పేర్కొంటూ ఇజ్రాయెల్ ఈ జూన్ 13న దాడులు ప్రారంభించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ చర్యను నిర్లక్ష్యపూరిత దుందుడుకు చర్య. ఇరాన్లో ఉన్న ప్రభుత్వం అక్కడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైందని చెప్పలేం. ఇజ్రాయెల్లో ఉన్న ప్రభుత్వం కూడా అలాంటిదే. అయినా ఇరాన్పై దాడికి దిగే హక్కు దానికి లేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. అణ్వాయుధాన్ని నిర్మించగలిగిన స్థితికి ఇరాన్ చాలా దగ్గరలో ఉందనే ఇజ్రాయెల్ అభిప్రాయం ట్రంప్ మనసులో నాటుకుంది. దాంతో ఆయన ఇంటెలిజెన్స్ అంచనాను పక్కనపెట్టేశారు. చేయాలనుకుంటే ఆపగలరా?ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం, అక్కడ అధికారం చేతులు మారేటట్లు చూడటం ఇజ్రాయెల్ ఆశయాలు. ఆ రెంటిలో ఏదీ తేలికైనది కాదు. ఇరాన్ అణ్వాయుధాన్ని నిర్మించకుండా జాప్యం చేయగలిగిన సత్తా ఇజ్రాయెల్ సొంతం ఏమీ కాదని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎహుద్ బరాక్ ఈమధ్య అన్నారు. ‘‘బహుశా కొన్ని వారాలు ఆపగలం... ఓ నెల ఆపగలం... అమెరికా కూడా దాన్ని కొద్ది నెలలపాటే అడ్డుకోగలదేమో’’ అన్నారాయన. ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థతోపాటు నటాంజ్లో ఉన్న ముఖ్యమైన యురేనియం శుద్ధి సదుపాయాన్ని, ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను ఇజ్రాయెల్ తీవ్రంగా ధ్వంసం చేయగలిగిందని ప్రస్తుత మదింపులు సూచిస్తున్నాయి. కానీ అరాక్ న్యూక్లియర్ కాంప్లెక్స్ చాలా వరకు చెక్కుచెదరకుండానే ఉందని చెబుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా, ఫర్దోలో ఉన్న ఇంధన శుద్ధి భూగర్భ కేంద్రానికి కూడా ఇంతవరకు వాటిల్లిన నష్టం ఏమీ లేదు. ఈ సదుపాయం చాలా కీలకమైంది. ఎందుకంటే, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ధి అయిన యురేనియం ఉంది. అణ్వాయుధాన్ని నిర్మించడానికి 90 శాతం శుద్ధి అయిన యురేనియం అవసరం. ఆ పనిని ఫర్దో సదుపాయం వారం రోజుల్లో చేసిపెట్టగలదు. ఇరాన్ వద్ద 2025 మే నాటికి 408.6 కిలోల శుద్ధి చేసిన యురేనియం ఉందని అంచనా. దానిని మరింత శుద్ధి చేస్తే, రానున్న వారాల్లో తొమ్మిది అణ్వాయుధాల తయారీకి సరిపోతుంది. అమెరికా భాగస్వామ్యం ఎంత?భారీ మందుగుండు సామగ్రితో కూడిన ఎయిర్ బ్లాస్ట్ బాంబు (ఎంఓఏబి) మాత్రమే ఫర్దోను ధ్వంసం చేయగలదు. అది ఇజ్రాయెల్ వద్ద లేదు. అమెరికా రంగంలోకి దిగితేనే దాన్ని ధ్వంసం చేయడం సాధ్యం. అణ్వాయుధాలను సమకూర్చుకునేందుకు ఇరాన్ ఇరవై ఏళ్ళ పైనుంచి కృషి చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కుచెదరని భూగర్భ సదుపాయాలను కూడా అది నిర్మించుకుంది. గగనతల దాడులొక్కటే ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించలేవు. పదాతి దళాలతో భూతల ఆక్రమణ కూడా అవసరమవుతుంది. అమెరికా పాత్ర ఇక్కడే అవసరం పడుతుంది. ఇరాన్ ‘బేషరతుగా లొంగిపోవడం’ ట్రంప్ డిమాండ్లలో ముఖ్యమైంది. వెనుతిరిగి చూస్తే, ఇరాన్పై యుద్ధం అమెరికా–ఇజ్రాయెల్ కలసి చేసిన పనేనేమో అనిపిస్తుంది. బేషరతుగా లొంగిపొమ్మనడం, ప్రభుత్వాన్ని మార్చుకొమ్మని చెప్పడం వల్ల, ఇరాన్ నిజంగానే అణ్వాయుధ నిర్మాణ దిశగా అడుగు వేయవచ్చు. ఇరాన్ అలాంటి ఆయుధాలను నియోగించకుండా నివారించేందుకు ఇజ్రాయెల్, అమెరికాలు అణ్వాయుధాలను అమ్ములపొదుల నుంచి బయటకు తీయవలసి రావచ్చు. అణ్వాయుధాల ప్రయోగమే జరిగితే అది ప్రపంచాని కంతటికీ వినాశకరం. నిజానికి, ఇజ్రాయెల్ను దృష్టిలో పెట్టుకుని ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదు. ఇరాక్ కారణంగా ఆ పని చేసింది. ఇరాన్–ఇరాక్ల మధ్య 1980–88 వరకు సాగిన యుద్ధం అందుకు ప్రేరణగా నిలిచింది. అమెరికా సాయంతోనే ఇరాన్పై దాడికి ఇరాక్ ఉపక్రమించింది. ఇరాన్లోని నగరాలపై ఇరాక్ రసాయనిక ఆయుధాలు, క్షిపణులతో దాడులకు దిగినా ప్రపంచ దేశాలు చాలావరకు మిన్నకుండిపోయాయి. దాంతో 1980ల మధ్య నుంచి ఇరాన్ సైనిక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే, ఇరాక్పై 2003లో అమెరికా దాడి చేసిన తర్వాతనే, అణ్వాయుధాలు లేనిదే తన భద్రతకు పూచీ ఉండదని ఇరాన్ భావించడం మొదలుపెట్టింది. ఇరానియన్లకు చరిత్ర పట్ల చక్కని అవగాహనతోపాటు జాతీయతా భావాలు మెండు. ఇరాక్లో మాదిరిగానే ఇరాన్లో కూడా అపార విధ్వంసానికి పాల్పడటంలో, ఆ దేశాన్ని బలహీనపరచడంలో అమెరికా–ఇజ్రాయెల్ విజయం సాధించవచ్చు. ప్రభుత్వాన్ని మార్చడంలోనూ సఫలం కావచ్చు. కానీ, కథ అంతటితో కంచికి పోదు.మనోజ్ జోషీవ్యాసకర్త ఢిల్లీలోని అబ్జర్వర్ రిసెర్చ్ ఫౌండేషన్లో విశిష్ఠ సభ్యుడు -
‘ ఇది పాకిస్తాన్కు అత్యంత చిరాకు కల్గించే అంశం’
న్యూఢిల్లీ: ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికాలో పర్యటించడమే కాకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో డిన్నర్ మీట్లో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. దీనిపై ప్రజల్లో ఆసక్తికర చర్చ ఇంకా సాగుతూనే ఉంది. పాక్ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు వెళ్లకుండా ఒక ఆర్మీ చీఫ్ వెళ్లడం ఏంటనే ప్రశ్న చాలా మందిలో తలెత్తింది. పాకిస్తాన్లో నియంత పాలన మనకు కొత్తేమీ కాదు. గతంలో పర్వేజ్ ముష్రాఫ్.. పాకిస్తాన్ పీఠాన్ని ఎలా అధిరోహించారో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆ తరహా లక్షణాలున్న వ్యక్తి అసిమ్ మునీర్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు అత్యంత సన్నిహితుడైన అసిఫ్ మునీర్కు అత్యంత క్రూరుడు, నియంత అనే అపవాదు కూడా ఉంది. మరి ఈ తరహా లక్షణాలుండటమే కాకుండా ఆర్మీ చీఫ్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని అగ్రరాజ్యం ఆహ్వానించడమే ప్రధానంగా చర్చ. అది కూడా భారత్తో జరిగిన యుద్ధం అనంతరం చోటు చేసుకున్న పరిణామం ఇది. అంటే ఇక్కడ పాకిస్తాన్కు అమెరికా ఏ తరహా సహకారం అందిస్తుందో అనేది క్లియర్గానే తెలిసిపోతుంది.ఇదిలా ఉంచితే, ఈ అంశంపై భారత డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ పరోక్షంగా స్పందించారు. ‘ ప్రధాని కనిపించకుండా ఒక ఆర్మీ చీఫ్ దేశ అంతర్గత విషయాలు చర్చించడం నిజంగానే పాకిస్తాన్కు అత్యంత చిరాకు కల్గించే అంశమన్నారు. ‘ ఇది నా అభిప్రాయం కాకపోయినా, ఏ దేశమైనా ఇలానే అనుకుంటుంది. ప్రధానికి స్థానం లేకుండా ఆర్మీ చీఫ్కు ప్రత్యేక స్థానం ఇవ్వడం అనేది ఆశ్చర్యం కల్గిస్తుంది. ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది కూడా’ అని రాజేశ్ కుమార్ తెలిపారు. -
క్లస్టర్ బాంబుతో ఇజ్రాయెల్ గజగజ
ఇరాన్- ఇజ్రాయెల్ (Iran-Israel) పరస్పర దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా రణరంగంగా మారింది. యుద్ధం 8వ రోజుకి చేరగా.. తమ భూభాగంలోకి ఏకంగా క్లస్టర్ బాంబులను ఇరాన్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ సంచలన ఆరోపణలు దిగింది. అసలు ఈ క్లస్టర్ బాంబు అంటే ఏమిటి? వాటి ప్రమాద తీవ్రత ఎంత?. ఆ బాంబును చూసి ఇజ్రాయెల్ ఎందుకు వణికిపోతోంది? వాటిని నిషేధం నిజంగానే అమల్లో ఉందా?.. క్లస్టర్ బాంబు అనేది ఒక క్షిపణిలా కనిపించినా.. అది గాలిలోనే తెరుచుకుని చిన్న చిన్న పేలుళ్లతో కూడిన సబ్మ్యూనిషన్లు (submunitions) అనే మినీ బాంబులను నేల మీదకు వదిలిపెడుతుంది. భూమిని తాకిన వెంటనే అవి పేలిపోతాయి. ఇరాన్ ఇజ్రాయెల్పై జరిపిన తాజా దాడిలో.. ఒక మిసైల్ సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలి, దాని నుండి సుమారు 20 చిన్న పేలుడు పదార్థాలు (submunitions) సెంట్రల్ ఇజ్రాయెల్లో 8 కిలోమీటర్ల పరిధిలో పడ్డాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ఇలాంటి బాంబులను వాడినట్టు నమోదైన ఇది మొట్టమొదటి కేసు.మోస్ట్ డేంజర్ఇరాన్కు చెందిన ఇతర బాలిస్టిక్ క్షిపణుల కంటే ఈ క్లస్టర్ బాంబు క్షిపణులు భారీ ముప్పును కలిగిస్తాయనేది ఇజ్రాయెల్ వాదన. యుద్ధ తీవ్రతను పెంచేందుకు.. భారీ ముప్పును కలిగించేందుకు.. ఇరాన్ ఈ ఆయుధాలను ఉపయోగిస్తోందని, తమ పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. డ్యామేజ్ ఏంటంటే.. ఇజ్రాయెల్ వార్తా సంస్థ ప్రకారం.. జూన్ 19న జరిగింది ఇదే. క్షిపణుల్లో ఒకటి అజోర్లోని మధ్య పట్టణంలో ఓ నివాసాన్ని తాకినట్లు తెలుస్తోంది. అయితే, దీని కారణంగా పెద్దగా ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. కాగా.. ఇందులోని కొన్ని బాంబులు పేలకుండా ఉన్నాయని, ఇవి పౌరుల ప్రాణాలకు నష్టం కలిగిస్తాయని అధికారులు తెలిపారు. ఈక్రమంలో తమ ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించింది. అలాంటివాటిని గుర్తిస్తే పౌరులు వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజలను హెచ్చరించింది. వివాదాలకు కేరాఫ్గా..క్లస్టర్ బాంబులను వివాదాలకు కేంద్ర బిందువుగా చెబుతుంటారు. అందుకు కారణం.. ఇవి కలిగించే నష్టమే. సాధారణ క్షిపణి ఒక్క స్థలంలో పెద్ద పేలుడు కలిగిస్తుంది. కానీ క్లస్టర్ బాంబు చిన్న చిన్న మ్యూనిషన్లను పెద్ద ప్రాంతంలో చల్లుతుంది. ఒక్కో submunition శక్తి తక్కువైనా, దాని విస్తృత పరిధి కారణంగా ఎక్కువమందికి ప్రమాదం కలిగించవచ్చు. మరీ ముఖ్యంగా జనావాసాలపై గనుక పడితే వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వీటిలో కొన్నివాటిని భూమిని తాకిన వెంటనే పేలకుండా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఇవి తరువాత కాలంలో కూడా పౌరులకు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే వీటి వినియోగంపై ఆంక్షలున్నాయి. 2008లో జరిగిన క్లస్టర్ మ్యూనిషన్లపై సమావేశ ఒప్పందం ప్రకారం.. ఈ బాంబులను ఉపయోగించడం, నిల్వ చేయడం, అమ్మకాలు-కొనుగోలు జరపడం పూర్తిగా నిషేధించబడింది. ఈ ఒప్పందంపై 111 దేశాలు, 12 ఇతర ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని అంగీకరించాయి. కానీ ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, చైనా, భారత్ కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేయలేదు. 2023లో ఉక్రెయిన్ సంక్షోభంలో రష్యాకు వ్యతిరేకంగా క్లస్టర్ బాంబులను అందించిందనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే రష్యా కూడా తమపై క్లస్టర్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ సైతం ఆరోపించింది. U.S. President Joe Biden is under scrutiny for providing Ukraine with cluster bombs.But what makes cluster bombs so controversial?#clusterbomb #joebiden #internationaltreaty #treaty pic.twitter.com/JCuAe0RM9H— CGTN Europe Breaking News (@CGTNEuropebreak) July 11, 2023 -
అయ్యా బాబోయ్.. ఆ విమానం దిగింది
-
ఎయిరిండియా ఘటన: బ్లాక్బాక్స్ ఎపిసోడ్లో ట్విస్టులు
279 మంది ప్రాణాలు బలిగొన్న అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదంలో కీలకంగా భావిస్తున్న విమానపు బ్లాక్బాక్స్(Air India Black Box) తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీంతో డాటా సేకరణ కష్టతరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఎక్స్క్లూజివ్గా కథనం ప్రచురించింది.జూన్ 12వ తేదీన బోయింగ్ సంస్థకు చెందిన డ్రీమ్లైనర్ విమానం(ఏఐ 171 సర్వీస్) ప్రమాదంలో నేలను తాకగానే పేలిపోయి.. కాలి బూడిదైన సంగతి తెలిసిందే. అయితే ఘటన జరిగిన 28 గంటల తర్వాత శకలాల నుంచి బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రమాదం ధాటికి అందులో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిన్నట్లు అధికారులు ఇప్పుడు గుర్తించారు. ఇదిలా ఉంటే.. బ్లాక్బాక్స్ను డీకోడ్ చేసేందుకు అమెరికాకు పంపించబోతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని కేంద్రం గురువారం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దానిని టెక్నికల్, సెక్యూరిటీ అంశాలను పరిశీలించాకే బ్లాక్బాక్స్ను ఎక్కడికి పంపించాలనే విషయాన్ని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) మాత్రమే నిర్ణయిస్తుందని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే..డిజిటల్ ఫ్లైట్ డాటా రికార్డర్(DFDR), కాక్పిట్ వాయిస్ రికార్డర్(CVR)లను కలిపి బ్లాక్బాక్స్గా వ్యవస్తారు. పేరుకు బ్లాక్బాక్స్ అనే కానీ.. ప్రమాదం తర్వాత శకలాల నుంచి సేకరణ కోసం సులువుగా బ్రైట్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది అది. ఇక ఇందులో.. ఇప్పుడొస్తున్న సీవీఆర్లు 25 గంటలపాటు కాక్పిట్ సంభాషణలను నమోదు చేయగలవు. 2021లో తీసుకొచ్చిన నిబంధనే అందుకు కారణం. కానీ, ప్రమాదానికి గురైన బోయింగ్ 787 విమానం అంతకు ముందు మోడల్. ఇందులో కేవలం రెండున్నర గంటల రికార్డును మాత్రమే రికార్డుచేయగలదు. ఇక ఏడీఆర్.. విమానం వేగాన్ని, నియంత్రణ క్షణాలు తదితరాలను నమోదు చేస్తుంది. బ్లాక్బాక్స్లోని డాటాను ఇంజినీరింగ్ ఫార్మట్లోకి మార్చిన తర్వాతే సమాచారాన్ని సేకరించడానికి వీలవుతుంది. సేకరణ టైంలో ఏదైనా పొరపాటు దొర్లితే.. డాటా మొత్తం కనిపించకుండా పోతుంది(ఎరేస్ అవుతుంది).AAIB ముందు ఆప్షన్లు ఇవేలక్నోలోని హాల్(HAL) సెంటర్కు పంపడంఅమెరికాలోని ఎన్టీఎస్బీకి (National Transportation Safety Board) జాతీయ రవాణా భద్రతా సంస్థకి పంపడంయూకే లేదంటే సింగపూర్లోని సివిల్ ఏవియేషన్ అథారిటీకి పంపడంబ్లాక్బాక్స్లో ఓ పార్ట్ పైభాగం బాగా దెబ్బతిందని.. ఇక్కడ దానిని రికవరీ చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చని ఏఏఐబీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అడ్వాన్స్డ్ డాటా రికవరీ కోసం దానిని అమెరికాకే పంపించే యోచనలో ఏఏఐబీ ఉన్నట్లు సదరు కథనం వెల్లడించింది.ఇదీ చదవండి👉: దక్షిణ కొరియా విమాన ప్రమాద ఘటనలో బ్లాక్బాక్స్ ట్విస్ట్! -
టార్గెట్ ‘ఫోర్డో’
ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత ఫోర్డో ఫ్యూయెల్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఇరాన్లోని నతాంజ్, ఇస్ఫహాన్ అణుశక్తి కేంద్రాలు చాలావరకు ధ్వంసమయ్యాయి. అక్కడ అణుబాంబులు తయారు చేసే పరిస్థితి లేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మిగిలిన అతిపెద్ద అణుకేంద్రం ఫోర్డో. అందుకే ఇజ్రాయెల్ సైన్యం దీనిపై గురిపెట్టింది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే ఫోర్డో అణుకేంద్రం గురించి స్పష్టంగా తెలిసిపోతోంది. కొండ చుట్టూ రహదారులు, సొరంగాల ప్రవేశ మార్గాలు, పక్కనే సహాయక భవనం, సెంట్రీఫ్యూజ్లు భద్రపర్చిన స్థలంగా భావిస్తున్న ప్రాంతం ఇందులో కనిపిస్తున్నాయి. పర్వతాల అంతర్భాగంలో అత్యంత దుర్భేద్యంగా నిర్మించిన ఫోర్డో న్యూక్లియర్ సైట్ను ధ్వంసం చేయాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం అమెరికానే. ఏమిటీ అణుకేంద్రం? అణు బాంబు తయారీపై ఇరాన్ ఎప్పటినుంచో దృష్టి పెట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ సహా పశ్చిమ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ప్రయోగాలు కొనసాగిస్తోంది. ఇరాన్లో షియా ముస్లింల పవిత్ర నగరం ఖోమ్కు 20 మైళ్ల దూరంలోని ఫోర్డో అనే గ్రామం వద్ద కొండ కింద 80 నుంచి 90 మీటర్ల(262 నుంచి 295 అడుగుల) లోతున అణుకేంద్రం నిర్మించింది. దీని గురించి తొలిసారిగా 2009లో అందరికీ తెలిసింది. ఇరాన్ నుంచి కొన్ని కీలక డాక్యుమెంట్లను ఇజ్రాయెల్ నిఘా సంస్థలు చేజిక్కించుకోవడంతో ఫోర్డో గురించి కొంత సమాచారం బయటకు వచి్చంది. కానీ, 2002 నుంచే ఇక్కడ నిర్మాణాలు మొదలైనట్లు తెలిసింది. ఫోర్డోలో 2,700 సెంట్రీఫ్యూజ్లు ఫోర్డో కేంద్రంలో అణుబాంబు తయారీకి అవసరమైన సెంట్రీఫ్యూజ్లు 2,700 ఉన్నట్లు ఐఏఈఏ ఇటీవల తెలియజేసింది. 3,000 సెంట్రీఫ్యూజ్లు ఏర్పాటు చేసే వెసులుబాటు ఫోర్డోలో ఉంది. ఇరాన్ అణు శాస్త్రవేత్తలు ఇక్కడ యురేనియంను 60 శాతం వరకు శుద్ధిచేశారు. దాన్ని 90 శాతంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇప్పుడున్న యురేనియంను 233 కిలోల వెపన్–గ్రేడ్ యురేనియంగా మూడు వారాల్లో మార్చొచ్చు. 9 అణు బాంబులు తయారు చేయడానికి ఈమాత్రం యురేనియం చాలు. అణ్వస్త్ర రహిత దేశమైన ఇరాన్ ఈ స్థాయిలో యురేనియం నిల్వ చేసుకోవడం ఆందోళనకరమని ఐఏఈఏ ఈ ఏడాది మే 31న పేర్కొంది. అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత చేరువలోకి రావడమే ఇజ్రాయెల్ భయానికి అసలు కారణం. ఫోర్డో అణుకేంద్రాన్ని సర్వనాశనం చేస్తే తప్ప తమ భద్రతకు ఢోకా ఉండదని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ, అది ఇజ్రాయెల్ వల్ల సాధ్యమేనా? ప్రత్యామ్నాయ మార్గం ఇదే.. ఒకవేళ ఫోర్డోను పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడం సాధ్యం కాకపోతే కనీసం నిరీ్వర్యం చేయడానికి ఒక అవకాశం ఉంది. అది ఏమిటంటే.. అణుకేంద్రం లోపలికి దారితీసే సొరంగాల ఎంట్రన్స్లను ధ్వంసం చేయడం. అలాగే గాలి ప్రసరణ కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థను దెబ్బతీయొచ్చు. సొరంగాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థను ధ్వంసం చేస్తే లోపల కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అణుబాంబు ప్రయోగాలు హఠాత్తుగా ఆగిపోవచ్చు. దెబ్బతిన్న వ్యవస్థలను పునరుద్ధరించుకోవాలంటే చాలా సమయమే పడుతుంది. ఇరాన్ అణుశక్తి ప్రయోగాల్లో ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్పై జరుగుతున్న యుద్ధంలోకి అమెరికాను సైతం ఎలాగైనా లాగడానికి ఇజ్రాయెల్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం ఫోర్డో అణుకేంద్రాన్ని ధ్వంసం చేయడమేనని తెలుస్తోంది. ఏకైక అస్త్రం జీబీయూ–57 పెనిట్రేటర్ బాంబుఉపరితలం నుంచి 90 మీటర్ల లోతులో రాతికొండల కింద ఉన్న అణుశక్తి కేంద్రాన్ని ధ్వంసం చేయాలంటే సాధారణ క్షిపణులు, డ్రోన్లు, బాంబులు సరిపోవు. దానికి శక్తివంతమైన బాంబు కావాలి. ఇది అమెరికా వద్ద మాత్రమే ఉంది. ఈ విషయాన్ని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచీల్ లీటెర్ స్వయంగా చెప్పారు. సొంతంగా పనిపూర్తి చేసే సామర్థ్యం ఇజ్రాయెల్కు లేదు కాబట్టి అమెరికాపై ఆధారపడక తప్పదు. అమెరికా వద్ద జీబీయూ–57 ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ఉన్నాయి. ఇవి భూమిలోకి దూసుకెళ్లి పేలుళ్లు సృష్టిస్తాయి. ఒక్కో బాంబు 60 మీటర్ల లోతు వరకు దూసుకెళ్లగలదు. అమెరికా వైమానిక దళానికి చెందిన బి–2 స్టెల్త్ బాంబర్ల ద్వారా జీబీయూ–57 బాంబులను ప్రయోగించాల్సి ఉంటుంది. ఫోర్డో న్యూక్లియర్ సెంటర్ను ధ్వంసం చేయాలంటే కేవలం ఒక్క బాంబు సరిపోదు. ఒకేచోట వెన్వెంటనే కనీసం రెండు బాంబులు ప్రయోగిస్తేనే ఆశించిన ఫలితం ఉంటుంది. మొదటి బాంబు 60 మీటర్ల వరకు వెళ్లి పేలుడు జరిగిన వెంటనే మరో బాంబును ప్రయోగించాలని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రిపీటెడ్ స్ట్రైక్స్ తప్ప మరో మార్గం లేదని అమెరికా ఎయిర్ఫోర్స్ మాజీ కల్నల్ సెడ్రిక్ లైటన్ తెలిపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ రెడీ!
వాషింగ్టన్: అత్యంత అరుదైన సందర్భాల్లో వాడే శత్రు దుర్భేద్య ఈ–4బీ రకం విమానం హఠాత్తుగా అగ్రరాజ్య గగనతలంలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది. యుద్ధంలో ఇరాన్పై అమెరికా బాంబులేస్తే ప్రతిదాడిగా ఇరాన్ సైతం అమెరికాపై బాంబుల వర్షం కురిపించొచ్చు. అలాంటి సందర్భాల్లో భూమిపై ఎక్కడా దిగకుండా గాల్లో చక్కర్లు కొడుతూనే అమెరికా రక్షణ మంత్రిసహా కీలక ఉన్నతాధికారులు పాలన సాగించేందుకు ఈ విమానాన్ని వినియోగిస్తారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోబోతోందన్న వార్తల నడుమ ఈ అధునాతన లోహవిహంగం ప్రత్యక్షమవడం గమనార్హం. ఈ విమానాన్ని బోయింగ్ 747–200బీ మోడల్లో మార్పులు చేసి తయారు చేశారు. అమెరికాలో యుద్ధంవస్తే అంటే ప్రళయకాలంలో వాడే విమానంగా దీనికి డూమ్స్డే ఎయిర్క్రాఫ్ట్ అనే పేరుంది. దీనిని ‘నైట్వాచ్’, ‘ఫ్లయింగ్ పెంటగాన్’ అని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఈ విమానం మంగళవారం లూసియానాలోని బోస్సియర్ వైమానిక స్థావరం నుంచి మేరీల్యాండ్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్కు చేరుకుంది. ఎన్నెన్నో ప్రత్యేకతలు.. ఈ విమానం ఏకధాటిగా 7,000 మైళ్ల దూరం ప్రయాణించగలదు. సిబ్బంది సహా 112 మంది వరకు ప్రయాణించే సదుపాయం ఉంది. గతంలో ఈ విమానం అత్యధికంగా ఏకధాటిగా 35 గంటలపాటు ఎగిరింది. శత్రుదాడులను తట్టుకునేలా అంటే సైబర్ దాడులు, అణుబాంబుపేలుళ్ల ప్రకంపనలు, విద్యుదయస్కాంత ప్రభావాలకు లోనుకాకుండా దీనిని పటిష్టంగా నిర్మించారు. న్యూక్లియర్, థర్మల్ కవచాలు దీనికి తొడిగారు. గాల్లో ప్రయాణిస్తూనే ఇందులోని అధికారులు ప్రపంచం నలుమూలల ఉన్న స్వదేశీ, విదేశీ నేతలు, అధికారులకు ఆదేశాలు జారీచేయొచ్చు. దీనిలో ఏకంగా 67 ఉపగ్రహ డిష్ వ్యవస్థలు ఉన్నాయి. యుద్ధవిమానంగానూ.. అత్యవసర సందర్భాల్లో యుద్ధవిమానంగానూ మారిపోతుంది. వెంటబడే శత్రు విమానాలపై బాంబులను ప్రయోగించగలదు. మళ్లీ ల్యాండింగ్ చేయాల్సిన పనిలేకుండా గాల్లోనే ఇంధనాన్ని నింపుకోగలదు. ఈ మొత్తం విమానంలో ఉన్నతాధికారుల విశ్రాంతి కోసం 18 పడకలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు పెద్ద సమావేశ గది ఏర్పాటుచేశారు. ఈ విమానం మొత్తంగా మూడు అంతస్తుల్లో ఉంటుంది. 9/11 దాడుల తర్వాత ఈ సిరీస్ విమానంలో నాటి అధ్యక్షుడు జార్జ్ బుష్ పలుమార్లు ప్రయాణించారు. 1995లోనూ హరికేన్ ఓపెల్ ఘటన సమయంలో ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఉన్నతాధికారులు ఇందులోంచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా వాయుసేనలో ఇలాంటివి నాలుగు విమానాలు ఉన్నాయి. యుద్ధ సన్నద్థతను పరీక్షించేందుకే ఈ విమానాన్ని వాషింగ్టన్కు తీసుకొచ్చారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. -
ఇదెక్కడి దౌత్యనీతి?!
దేన్నయినా ఒకటికి పదిసార్లు చెబితే అది నిజమై కూర్చుంటుందని, ప్రపంచం దాన్ని మాత్రమే విశ్వసిస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. పాకిస్తాన్ ఉగ్ర ఎత్తుగడను తిప్పికొట్టడానికి మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’తో అక్కడి ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు నిర్వహించింది. దానికి ప్రతిగా భారత్పై పాక్ సైన్యం చేసిన దాడుల్ని తిప్పి కొట్టడంతోపాటు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. గత నెల 6న మొదలై 9వరకూ సాగిన ఈ ఘర్షణలు... ఇరుపక్షాలూ 11న కాల్పుల విరమణ ప్రకటించటంతో ముగిశాయి. కానీ ట్రంప్ వేరే పనిలేనట్టు ఆనాటి నుంచీ ‘కాల్పుల విరమణ’ తన ఘనతేనంటూ చెప్పుకు తిరుగు తున్నారు. అక్కడితో ఆగలేదు. సంధి కుదుర్చుకోనట్టయితే వాణిజ్య ఒప్పందం ఉండబోదని భారత్ను హెచ్చరించాకే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. మన దేశం దాన్ని ఖండించినప్పుడు ‘అవును... నిజమే. వారిద్దరూ మాట్లాడుకొని సంధి కుదుర్చుకున్నారు. ఇందులో మాపాత్ర లేద’ని నాలుక మడతేస్తుంటారు. మళ్లీ నాలుగు రోజులు గడిచేసరికల్లా పాత పాటే అందుకుంటారు. భారత్, పాకిస్తాన్లు కాల్పుల విరమణ ప్రకటించటానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఆ సంగతి వెల్లడించటమైతే వాస్తవం. ప్రకటించటంలో రెండు దేశాలూ కొంత వ్యవధి తీసుకోవటాన్ని ఆసరా చేసుకున్న ట్రంప్ దాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా బుధవారం మరోసారి ఆ పనే చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం 35 నిమిషాలసేపు ఆయనతో ఫోన్లో సంభాషించారు. ‘కాల్పుల విరమణ ప్రతిపాదన ఏ దశలోనూ మీ నుంచి రాలేదు. అలాగే వాణిజ్య ఒప్పందం గురించి ఇంతవరకూ మీ దేశంతో చర్చించలేదు’ అని వివరణనిచ్చారు. అక్కడితో అయిందనుకుంటే... మరికొన్ని గంటలు గడిచాక మరోసారి ట్రంప్ పాత పాటే వినిపించారు.రష్యా–ఉక్రెయిన్ల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధాన్ని ఆపటానికి ప్రయత్నించి ఆయన అభాసుపాలయ్యారు. అక్కడ యథావిధిగా పోరు సాగుతోంది. గాజాలో ఇప్పటికి 56,000 మంది పౌరుల్ని ఊచకోత కోసిన ఇజ్రాయెల్పై చర్యకు అడ్డుపడటమే కాదు... వారంరోజుల క్రితం దాన్ని ఉసిగొల్పి ఇరాన్పై దాడులు చేయించారు. ప్రతి దాడులు చేస్తున్న ఇరాన్ను బెదిరిస్తున్నారు. పైగా ఆ దేశంపై సైనిక దాడికి పథక రచన చేస్తున్నారు. పశ్చిమాసియా ఊబిలోకి దేశాన్ని దించవద్దంటూ స్వదేశంలో, స్వపక్షంలో అనేకులు హెచ్చరిస్తున్నా ట్రంప్కు పట్టడం లేదు. ఇలాంటి వ్యక్తి భారత్, పాకిస్తాన్ల మధ్య సంధి కుదిర్చానని ఎలా చెప్పుకుంటారో అనూహ్యం. కశ్మీర్ సమస్యపై గానీ, భారత్–పాక్ల మధ్య ఉన్న ఇతరేతర సమస్యలపై గానీ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించ బోమని దశాబ్దాలుగా భారత్ చెబుతూనే ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ వైఖరే కొనసాగుతోంది. తాజాగా మోదీ ప్రభుత్వం దీన్ని మరికాస్త సవరించింది. మూడో పక్షం జోక్యాన్ని ఒప్పుకోబోమని చెబుతూనే మున్ముందు పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే ఆక్రమిత కశ్మీర్(పీఓకే) పైనా, ఉగ్రవాదుల అప్పగింత పైనా మాత్రమేనని స్పష్టం చేసింది. ట్రంప్తో సంభాషించినప్పుడు పెహల్గామ్ ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుకొని అన్ని విషయాలూ మోదీ పూసగుచ్చినట్టు చెప్పారని, ఇక నుంచి ఉగ్రదాడిని పరోక్ష యుద్ధంగా పరిగణించదల్చుకోలే దని, దాన్ని యుద్ధంగానే చూస్తామన్నారని మన విదేశాంగ కార్యదర్శి మిస్రీ తెలియజేశారు. జిత్తులమారితనం దౌత్యం అనిపించుకోదు. స్పష్టంగా, పారదర్శకంగా, అరమరికలు లేకుండా వ్యవహరించినప్పుడే ఎంతటి సంక్లిష్ట సమస్యయినా దారికొస్తుంది. దౌత్యం విజయవంతమవుతుంది. బెదిరింపులకు దిగటం, బెదిరించానని గొప్పలుపోవటం దౌత్యమెలా అవుతుంది? తన వ్యాపారాన్ని విస్తరించుకోవటానికీ, ప్రత్యర్థులపై పైచేయి సాధించటానికీ పూర్వాశ్రమంలో నేర్చు కున్న కళలన్నీ ట్రంప్ వైట్హౌస్లో ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. దీన్ని వదిలించుకోనట్టయితే నవ్వులపాలవుతానన్న ఆలోచన ఆయనకు స్ఫురిస్తున్నట్టు లేదు. ఉగ్రవాదులకు పాక్ సైన్యం ఊత మిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతున్నా ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్కు బుధవారం విందుకు ఆహ్వానించారు. అది ఆయన ఇష్టం. కానీ అదే రోజు మోదీ అక్కడుండాలని కోరుకోవటం, వేరే దేశాల పర్యటన రద్దుచేసుకుని వాషింగ్టన్ రమ్మనటం హుందాతనం అనిపించుకుంటుందా? పర స్పరం కత్తులు దూసుకుంటున్న వైరిపక్షాలను ఒకేసారి పిలవటం తెలివితక్కువతనం అను కోవాలా? అతి తెలివి అనుకోవాలా? ఒకపక్క కశ్మీర్ సమస్యను అంతర్జాతీయం చేయటం సమ్మతం కాదని మన దేశం పదే పదే చెబుతున్నా ఈ మూర్ఖత్వం దేనికి? రేపో మాపో ఇరాన్పై తాము దండెత్తితే రీఫ్యూయలింగ్ కోసం పాకిస్తాన్ అవసరపడుతుంది. అందుకోసం ఆ దేశాన్ని దువ్వుతూ మనల్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్నట్టు ఈ కపటనాటకం ఎందుకు?జీ7 శిఖరాగ్ర సదస్సు నుంచి హడావిడిగా నిష్క్రమించనట్టయితే, అక్కడ మోదీ ప్రసంగాన్ని నేరుగా విన్నట్టయితే ట్రంప్కు విషయం కాస్తయినా అర్థమయ్యేది. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమా ణాలు పాటిస్తున్న పాశ్చాత్య దేశాలను మోదీ నిశితంగా విమర్శించారు. సొంత కారణాలతో కొన్ని దేశాలపై ఆంక్షలు పెడుతూ, ఉగ్రవాదుల్ని ఉసిగొల్పే దేశాలను మాత్రం నెత్తిన పెట్టుకుంటున్నారని మోదీ చెప్పారు. అయినా ట్రంప్ ధోరణి మారలేదు. ఈ పరిస్థితుల్లో ఇరాన్తో సహా అన్ని అంతర్జాతీయ అంశాల్లోనూ స్వతంత్ర విధానం పాటించటమే మనకు శ్రేయస్కరం. ద్వంద్వ నీతిని అనుసరించేవారికి తమ స్థానం ఏమిటో చెప్పనట్టయితే మనమే నష్టపోతాం. -
ఆ దుస్సాహసం వద్దు.. అమెరికాకు రష్యా వార్నింగ్
మాస్కో: ‘ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధంలో తాము భాగస్వాములం కావొచ్చు. కాకపోవచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఒకడుగు ముందకేసి మరీ హెచ్చరించింది. ఇరాన్పై అమెరికా సైనిక చర్యకు దిగడం సరైన చర్య కాదంటూ హెచ్చరించింది. ఇజ్రాయిల్-ఇరాన్ల యుద్ధంలో అమెరికా సైనిక చర్యకు దిగితే అది ఎంతమాత్రం సమర్థనీయంగా కాదని రష్యా విదేశాంగా ప్రతినిధి మారియా జకారోవా స్పష్టం చేశారు. ‘అమెరికాను ముందుగా హెచ్చరించే విషయం ఏంటంటే.. ‘ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య జరుగుతున్న యుద్ధానికి అమెరికా దూరంగా ఉండటం మంచిది. ఒకవేళ అమెరికా సైనిక చర్యకు దిగితే అది దుస్సాహసమే అవుతుంది. ఈ యుద్ధంలో ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా సైనిక చర్యకు దిగడం అనేది చాలా ప్రమాదకరం. ఊహించని పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. ఆ యోచనను పక్కన పెడితేనే మంచిది’ అని ఆమె స్పష్టం చేశారు.మరొకవైపు ఇరాన్లోని బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్పై ఇజ్రాయెల్ దాడి చెర్నోబిల్(1986లో ఉక్రెయిన్లో సంభవించిన ఒక పెద్ద అణు విపత్తే చెర్నోబిల్. అణు విద్యుత్ కేంద్రంలోని రియాక్టర్ పేలిపోయి, రేడియోధార్మిక పదార్థాలు గాలిలోకి విడుదలయ్యాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన అణు ప్రమాదాలలో ఒకటిగా లెక్కించబడింది) తరహా విపత్తుకు దారితీయవచ్చని రష్యా అణుశక్తి కార్పొరేషన్ సైతం హెచ్చరించింది. కాగా, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధం భీకర రూపాన్ని దాల్చింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు ఇజ్రాయెల్లోని పలు నగరాల్లో బీభత్సం సృష్టించాయి. టెలీ అవీవ్, రామత్గాన్, హోలోన్, బెర్జీబా నగరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దీంతో, భయానక వాతావరణం నెలకొంది. బీర్షెబాలోని సోరోకా ఆసుప్రతిపై ఇరాన్ దాడి చేయడంతో భవనం పూర్తిగా దెబ్బతింది. ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపిస్తోంది. చాలా నగరాలు నిశ్శబ్దంగా రోదిస్తున్నాయి. వలసదారులు తప్పితే ఇరాన్ నగరాల రోడ్లపై ఎవరూ కనిపించడం లేదు. -
లాడెన్ను అంత తేలికగా మరిచిపోయారా?
పహల్గాం ఘటన తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తన మధ్యవర్తిత్వంతోనే చల్లారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న మ్యాటర్ తెలిసిందే. అంతేకాదు.. అందుకు సహకరించారంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను వైట్హౌజ్కు ఆహ్వానించి మరీ భోజనం పెట్టారు. ఈ పరిణామంపై తిరువనంతపురం(కేరళ) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు.‘‘పాకిస్తాన్ అనేది గతంలో ఒసామా బిన్ లాడెన్ను తమ సైనిక శిబిరం సమీపంలో దాచిన దేశం. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యమివ్వడం విడ్డూరం. ఈ పరిణామం.. బహుశా అమెరికా ప్రజలు ఒసామాను మరిచిపోయారా? అనే సందేహాన్ని కలిగిస్తోంది’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. .. పాక్ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంతమంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఉన్నారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అనే పేరును అమెరికన్లు అంత త్వరగా మరచిపోయి ఉండరని నేను అనుకోను. ఇది అమెరికన్లకు అంత సులభంగా మరిచిపోలిగిన విషయమైతే కాదు. పాక్ లాడెన్ను తన ఆర్మీ శిబిరం దగ్గర దాచిన విషయంలో బాధ్యత వహించాల్సిందే. వారు(పాక్) అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని రహస్యంగా దాచారు. పైగా భారత్పై ఉగ్రదాడులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు... కనీసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకుని అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్ను హెచ్చరించి ఉండాలి. వాళ్ల దేశం నుంచి ఉగ్రవాదులను ఆర్థికంగా, సాయుధంగా, శిక్షణ ఇచ్చి మరీ భారత్కు పంపడం మంచిది కాదని చెప్పి ఉండాలి. మందు, విందుతో పాటు పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి. ఎందుకంటే ఇదంతా అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కూడా’’ అని థరూర్ ఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత.. పాక్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో తెలియజేసేందుకు ఎంపీల అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు కేంద్రం పంపుతోంది. అందులో శశిథరూర్ కూడా ఉన్నారు.#WATCH | Thiruvananthapuram, Kerala | On US President Donald Trump's lunch meeting with Pakistan Army Chief Asim Munir, Congress MP Shashi Tharoor says, "I hope the food was good and he gets some food for thought in the process. I hope that in these interactions, the Americans… pic.twitter.com/QJn6BHEjoY— ANI (@ANI) June 19, 20252001 సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్పై ఉగ్రదాడి జరిగి 3 వేల మందికిపైగా మరణించారు. ఈ దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా ఉందని తేలింది. పదేళ్ల తర్వాత.. 2011, మే 2వ తేదీన అమెరికా నేవీ సీల్ బలగాలు పాకిస్తాన్లోని అబోట్టాబాద్ అనే పట్టణంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్లో లాడెన్ను హతమార్చాయి. ఇందుకోసం జరిపిన ఆపరేషన్కు Operation Neptune Spear అనే కోడ్ పేరు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఈ దాడిని పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తానే చెబితేనే యుద్ధం ఆగిందని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ల చొరవతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ఇద్దరినీ వైట్హౌజ్ లంచ్ ఈవెంట్కు ఆహ్వానించారు. అసిమ్ మునీర్ అప్పటికే అమెరికా చేరుకోగా.. జీ7 సదస్సుకు హాజరైన మోదీతో ట్రంప్ ఫోన్లో 35 నిమిషాలపాటు సంభాషించారు. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారన్న ప్రకటనను తోసిపుచ్చారు. పాక్ ఆర్మీ బతిమాలినందు వల్లే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని, భారత్-పాక్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరగలేదని.. ఇక మీదటా జరగబోదని ట్రంప్తో స్పష్టం చేశారు. -
ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్ అవీవ్ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్ అవీవ్లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్తో ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్గా పగ్గాలుసుప్రీం లీడర్గా.. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి. -
చరిత్ర సృష్టించిన మోనాంక్ పటేల్.. మేజర్ లీగ్ క్రికెట్లో అత్యధిక స్కోర్
మేజర్ లీగ్ క్రికెట్లో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఆటగాడు మోనాంక్ పటేల్ చరిత్ర సృష్టించాడు. 2025 ఎడిషన్లో భాగంగా ఇవాళ (జూన్ 19) సియాటిల్ ఓర్కాస్తో జరిగిన మ్యాచ్లో 93 పరుగులు (50 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసిన అతను.. ఈ లీగ్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన అమెరికన్ ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు కోరె ఆండర్సన్ పేరిట ఉండేది. 2023 ఎడిషన్లో ఆండర్సన్ శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్కు ఆడుతూ ముంబై ఇండియన్స్ న్యూయార్క్పై అజేయమైన 91 పరుగులు (52 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు) చేశాడు. ఎంఎల్సీలో అత్యధిక పరుగులు చేసిన అమెరికన్ ఆటగాళ్ల జాబితాలో మోనాంక్, ఆండర్సన్ తర్వాతి స్థానాల్లో సంజయ్ కృష్ణమూర్తి (79 నాటౌట్), ఉన్ముక్త్ చంద్ (68) ఉన్నారు.ఓవరాల్గా ఎంఎల్సీలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన రికార్డు ఫిన్ అలెన్ పేరిట ఉంది. అలెన్ ఇదే సీజన్లో వాషింగ్టన్ ఫ్రీడంపై 151 పరుగులు (51 బంతుల్లో) చేశాడు. ఎంఎల్సీ చరిత్రలో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు నికోలస్ పూరన్ పేరిట ఉంది. పూరన్ 2023 ఎడిషన్లో అజేయమైన 137 పరుగులు చేశాడు. అలెన్, పూరన్ తర్వాతి స్థానాల్లో క్లాసెన్ (110 నాటౌట్), మ్యాక్స్వెల్ (106 నాటౌట్), రికెల్టన్ (103 నాటౌట్), ఫిన్ అలెన్ (101), డుప్లెసిస్ (100) ఉన్నారు. పైన పేర్కొన్న ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఇప్పటివరకే ఎంఎల్సీలో సెంచరీలు చేశారు. ఇందులో అలెన్ ఒక్కడు రెండు సెంచరీలు చేశాడు. ఇదిలా ఉంటే, ఇవాళ జరిగిన మ్యాచ్లో సియాటిల్ ఓర్కాస్పై ఎంఐ న్యూయార్క్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో మోనాంక్ పటేల్ అద్భుతమైన ఇన్నింగ్స్ (93) ఆడి ఎంఐను గెలిపించాడు. మోనాంక్కు మైఖేల్ బ్రేస్వెల్ (35 బంతుల్లో 50 నాటౌట్), కీరన్ పోలార్డ్ (10 బంతుల్లో 26 నాటౌట్) తోడవ్వడంతో ఓర్కాస్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎంఐ న్యూయార్క్ మరో ఓవర్ మిగిలుండగానే ఛేదించింది.అంతకుముందు కైల్ మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్ (46 బంతుల్లో 88) ఆడటంతో ఓర్కాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఓర్కాస్ ఇన్నింగ్స్లో షాయాన్ జహంగీర్ 43, క్లాసెన్ 27 (నాటౌట్), హెట్మైర్ 21, వార్నర్ 4, ఆరోన్ జోన్స్ 10 పరుగులు చేశారు. ఎంఐ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ ధారాళంగా పరుగులు సమర్పించుకొని (4 ఓవర్లలో 64) 2 వికెట్లు తీశాడు. -
ఐ లవ్ పాకిస్థాన్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
అమెరికాలో స్టూడెంట్ వీసాలు జారీ.. ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం
వాషింగ్టన్: అమెరికాలోని డొనాల్ట్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా కొన్ని హెచ్చరికలు చేసింది.అమెరికాలో ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ను మళ్లీ ప్రారంభించింది. ఈ సందర్భంగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా తనిఖీ చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది. సోషల్ మీడియా పోస్టులు.. వీసాలపై ప్రభావం చూపిస్తాయని హెచ్చరించింది.ఈ నేపథ్యంలో విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాల విషయమై విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ..‘ఈ సోషల్ తనిఖీలతో అమెరికాలో వచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా(సోషల్ మీడియా వెట్టింగ్) ఖాతాలను యూఎస్ కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ప్రొఫైళ్ల ప్రైవేటు సెట్టింగ్స్ను మార్చుకుని ‘పబ్లిక్’ ఆప్షన్ పెట్టుకోవాలి. దీని బట్టే సదరు విద్యార్థులకు వీసా అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే అంచనా వేయవచ్చు’ అని చెప్పుకొచ్చారు. కాగా, సోషల్ మీడియా వెట్టింగ్ అంటే.. వీసా దరఖాస్తుదారులకు అనుమతి ఇవ్వొచ్చా.. లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్లైన్ యాక్టివిటీని అధికారులు తనిఖీ చేయనున్నారు.U.S. to resume processing foreign student visas, will review applicants onlineThe United States will resume processing visas for foreign students and has notified U.S. embassies and consulates abroad that all #US #Visa #Harvard #Foreign students pic.twitter.com/WvlZHKVmpQ— Emily Johnson (@djdfresh72) June 19, 2025ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మే చివరి వారం నుంచి విదేశీ విద్యార్థుల ఇంటర్వ్యూలను అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. కొత్తగా వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే, వీసాలు ఇచ్చేందుకు సదరు విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించాల్సి ఉందని.. అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో తాజాగా మళ్లీ వీసాల అమలు ప్రక్రియను ప్రారంభించినట్టు చెప్పుకొచ్చింది.సోషల్ మీడియా ఖాతాపై నజర్..వీసాలు ఇచ్చే విషయంలో సంబంధిత విద్యార్థుల ప్రొఫైళ్లను పరిశీలించిన తర్వాతే వీసా మంజూరు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాలస్తీనా జెండాను పోస్ట్ చేసినట్లయితే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాతే వారికి వీసా లభిస్తుంది. ఇజ్రాయెల్, పాలస్తీనాకు మద్దతు తెలిపిన విద్యార్థులను మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. -
మధ్యవర్తిత్వం మాటే లేదు
కననాస్కీస్(కెనడా): ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన పరస్పర సైనిక చర్యల ముగింపు పర్వంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాక్తో పోరులో శాంతిస్థాపన కోసం తానే చొరవ తీసుకుని ఇరుదేశాల మధ్య ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడం, అమెరికా జోక్యంపై విపక్షాలు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ట్రంప్తో మోదీ మాట్లాడటం విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్తో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. అత్యవసరంగా, అర్ధంతరంగా జీ7 భేటీ నుంచి ట్రంప్ నిష్క్రమించిన నేపథ్యంలో ట్రంప్తో మోదీ మంగళవారం ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ట్రంప్తో మోదీ సంభాషణ వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తర్వాత వెనువెంటనే భారత్, పాక్ మధ్య మొదలైన పరస్పర కాల్పుల ఉదంతంలో ఇరుదేశాల మిలిటరీ విభాగాల చర్చల తర్వాత దాడులు ఆగాయి. ఇందులో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు. అయినా మూడోవర్గం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లే భారత్ కాల్పుల విరమణకు ఒçప్పుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగానే భావించబోం. ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తాం’’ అని ట్రంప్కు మోదీ స్పష్టంచేశారు.వాణిజ్య అంశాల ఊసేలేదుయుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యాన్ని ఆపేస్తానని భారత్ను ట్రంప్ బెదిరించారని వచ్చిన వార్తలపై మోదీ ట్రంప్కు స్పష్టతనిచ్చారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో అమెరికా అస్సలు జోక్యంచేసుకోలేదు. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా అందలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రస్తావన అస్సలు లేదు. భారత్ ఇంతకుముందుగానీ ఇకమీదటగానీ మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగానూ అంగీకరించే ఆస్కారంలేదు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా భారత్లో ఏకాభిప్రాయం ఉంది. మే9వ తేదీ రాత్రి మీ దేశ ఉపాద్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్చేశారు. పాకిస్తాన్ ప్రతిదాడులకు సంసిద్ధ్దమవుతోందని నాతో అన్నారు. అదే నిజమైతే పాక్కు కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టంచేశా. మే 9 అర్ధరాత్రిదాటాక పాకిస్తాన్లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులుచేసి నాశనం చేశాం. మా దాడుల్లో వాళ్ల సైనిక ఎయిర్బేస్లు బద్దలయ్యాయి. నిరుపయోగంగా మారాయి. దీంతో దిక్కుతోచక మాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే తొలుత అభ్యర్థించారు’’ అని ట్రంప్తో మోదీ చెప్పారు.అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్35 నిమిషాలకుపైగా జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణలో చివర్లో మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోదీని ట్రంప్ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్కు మోదీ సుతిమెత్తగా చెప్పి అభ్యర్థనను తిరస్కరించారు. -
మీ ప్రమేయం లేదు.. ఇక మీదట ఉండబోదు కూడా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను మోదీ ట్రంప్కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే.. మోదీ ట్రంప్తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు. ట్రంప్-మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారుఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేశాయి కూడా. -
నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ భేటీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో నేడు (బుధవారం) పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్తో భేటీకానున్నారు. జూన్ 14న జరిగిన అమెరికా సైన్యం 250వ వార్షికోత్సవ వేడుకలకు మునీర్ ఆహ్వానంపై పలు ఆరోపణలువచ్చిన దరిమిలా వాటిని వైట్ హౌస్ ఖండించింది.అయితే ఇది జరిగిన తర్వాత అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ను నేడు(జూన్ 18) కలుసుకోనున్నారు. బుధవారం మధ్యాహ్నం 1:00 గంటకు (వాషింగ్టన్ సమయం) వైట్ హౌస్ క్యాబినెట్ రూమ్లో జరిగే విందులో పాకిస్తాన్ సైనిక నేత మునీర్ను ట్రంప్ కలుసుకోనున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మునీర్ తన అమెరికా పర్యటనలో విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్లను కూడా కలుసుకోనున్నారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్కు నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్ మునీర్ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇప్పుడు మునిర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే మునీర్కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు.ఇది కూడా చదవండి: G7 Summit: కెనడా ప్రధాని కార్నీతో మోదీ భేటీ.. సంభాషణ సాగిందిలా.. -
‘ఇరాన్’ పని ఖతం.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మరింత భీకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా కూడా ఇరాన్పై విరుచుకుపడేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భద్రతా బృందంతో 80 నిమిషాల పాటు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇరాన్పై దాడుల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది.ఇక, జీ-7 కూటమి శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు కెనడాకు చేరుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే హఠాత్తుగా స్వదేశానికి వెళ్లిపోయారు. కెనడాలో జరగాల్సిన కీలక భేటీలను రద్దు చేసుకున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఉధృతంగా మారుతుండటంతో తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడానికే ఆయన అమెరికా చేరుకున్నారు. అమెరికా వెళ్లిన అనంతరం, అమెరికా జాతీయ భద్రతా బృందంతో ట్రంప్ సమావేశమయ్యారు. దాదాపు 80 నిమిషాల పాటు యుద్ధ పరిస్థితులపై సమీక్షించారు. చర్చల అనంతరం టెహ్రాన్లోని న్యూక్లియర్ కేంద్రాలపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీనియర్ నిఘా అధికారి ఒకరు తెలిపారు. దీంతో, ఇరాన్పై దాడులు మరింత తీవ్రతరం కానున్నాయి.ఇదిలా ఉండగా.. అంతకుముందే ట్రంప్.. ఇజ్రాయెల్ దాడులు భీకరంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని చెప్పారు. యుద్ధం ఆగాలా? లేక కొనసాగాలా? అనేది ఇరాన్ చేతుల్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు పరోక్షంగా తేల్చిచెప్పారు. ఇంకా ఆలస్యం కాకముందే ఆణు కార్యక్రమానికి తెరదించాలని ఇరాన్కు ట్రంప్ హితవు పలికారు. దాడులు ఆగాలంటే అణ్వస్త్రాల ఆలోచన మానుకోవాలని, ఇజ్రాయెల్తో ఒప్పందానికి రావాలని సూచించారు. ఒప్పందం విషయంలో ఇప్పటికే 60 రోజుల సమయం లభించినా ఇరాన్ పాలకులు సద్వినియోగం చేసుకోలేదని తప్పుపట్టారు. మరో గత్యంతరం లేక ఇజ్రాయెల్ సైన్యం ఇరాన్పై దాడులకు దిగిందని అభిప్రాయపడ్డారు.ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో మాకు స్పష్టంగా తెలుసు. ఆయన్ను లక్ష్యంగా చేసుకోవడం మాకు చాలా తేలిక. ఆయన సురక్షితంగానే ఉన్నారు. ప్రస్తుతానికి ఆయన్ను తొలగించే (చంపే) ఉద్దేశం మాకు లేదు. అయితే, పౌరులు లేదా అమెరికా సైనికులపై క్షిపణి దాడులు చేయడాన్ని సహించే ప్రసక్తే లేదు. మా సహనం నశిస్తోంది. ఈ విషయంపై దృష్టి సారించినందుకు ధన్యవాదాలు. సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోతే మంచిది అని స్పష్టం చేశారు.ఇరాన్కు అణుబాంబు దక్కదు అణు బాంబు తయారీకి ఇరాన్ అత్యంత సమీపంలోకి వచ్చిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయినప్పటికీ ఇరాన్ అణు బాంబును తయారు చేసుకొనే అవకాశం ఎంతమాత్రం లేదని స్పష్టంచేశారు. కెనడా నుంచి స్వదేశానికి వస్తూ ఎయిర్ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయడం లేదంటూ అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఈ ఏడాది మార్చి నెలలో చేసిన ప్రకటనను ట్రంప్ కొట్టిపారేశారు. ఆమె ఏం చెప్పారో తాను పట్టించుకోనన్నారు. -
అసిమ్ మునీర్.. యూఎస్ పర్యటనకు వస్తావా?, నీకు సిగ్గుందా?
వాషింగ్టన్ డీసీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్.. జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్. నియంతగా, అత్యంత కఠినాత్ముడిగా పేరుంది. పాకిస్తాన్లో ప్రధాని పేరు కంటే కూడా అసిమ్ మునీర్ పేరే ఎక్కువగా వినిపిస్తుందనేది కాదనలేని సత్యం. ఇదంతా ఒకటైతే, ఇప్పుడు మునిర్ అమెరికా పర్యటనలో ఉన్నారు. అధికారిక అమెరికా పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఆ దేశంలో ఉన్నారు మునీర్. అయితే మునీర్కు అమెరికాలో నిరసన సెగ మామూలుగా లేదు. పెద్ద ఎత్తును మునీర్ అమెరికా పర్యటనపై వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నాయి. భారీగా హోర్డింగ్లు వెలవడంతో పాటు నిరసనకారులు కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అసలు అమెరికా పర్యటనకు రావడానికి నీకు సిగ్గుందా..? అని మనీర్ బస చేస్తున్న చోట నిరసనకారులు ఆందోళన చేపట్టారు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాకిస్తాన్ ప్రజలు ప్రాణాలు తీసే నీవు ఇక్కడ ఏం మాట్లాడాతావ్, ఇక తుపాకీలు మాట్లాడితే ప్రజాస్వామ్యం చచ్చిపోయినట్లే’ అని వెలసిన హోర్డింగ్లు మునీర్పై తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తున్నాయి. WATCH: Failed Asim Munir gets humiliated by the Pakistani Diaspora during his trip to USA.He was called 'Murderer of Pakistanis'. pic.twitter.com/NSRKywNuh3— Sensei Kraken Zero (@YearOfTheKraken) June 17, 2025 pic.twitter.com/poIqJuGdnv Asim Munir has fallen into the hands of Pakistanis in America—exposed as the dictator, traitor, and butcher of his own people that he truly is!" From Pakistan #11YearsofInjustice Trump and Israel— ⁱᴵⁿˢᵃᶠ فکر (@shaoooohoor) June 17, 2025 ఐదు రోజుల అమెరికా పర్యటనపాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఐదు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆదివారం ఇక్కడకు వచ్చారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా అమెరికాతో సైనిక, వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో అధికారిక పర్యటన కోసం మునీర్ వాషింగ్టన్ చేరుకున్నారు. -
కాల్పుల విరమణ కాదు.. ట్రంప్ రియల్ ఎండ్ వ్యాఖ్యలు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఐదో రోజు కొనసాగుతోంది. యుద్ధం తీవ్రతరం కావొచ్చని.. పశ్చిమాసియా నుంచి ఈ ఉద్రిక్తతలు మిగతా ప్రపంచానికి విస్తరించవచ్చనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస ప్రకటలను, చేష్టలను, చర్యలను అన్వయించుకుంటున్నారు. అయితే..ట్రంప్ మాత్రం ఊహకందని రీతిలో స్పందిస్తున్నారు. జీ7 సదస్సు నుంచి ఎయిర్ఫోర్స్ వన్లో బయల్దేరే ముందు తాను కాల్పుల విరమణ కోసం ప్రయత్నించడం లేదని.. అంతకు మించి ఉత్తమమైన మార్గం కోసం ప్రయత్నిస్తున్నానని మీడియా ప్రతినిధులతో అన్నారు. కాల్పుల విరమణ కాదు.. నిజమైన ముగింపు కోసం ప్రయత్నిస్తున్నాం. అది నిజమైన ముగింపుగా ఉండనుంది అని ట్రంప్ పేర్కొన్నట్లు బీబీసీ ఒక కథనం ప్రచురించింది.ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు ప్రకటించడంపై ట్రంప్కు ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతానికి అంతా సవ్యంగానే జరుగుతోంది. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో అణు ఆయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదు అని స్పష్టం చేశారాయన. ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయన్న ట్రంప్.. రాబోయే రెండు రోజుల్లో మీరే చూస్తారని, అప్పటిదాకా ఎవరూ వెనక్కి తగ్గకపోవచ్చని సీబీఎస్ జర్నలిస్టును ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. ట్రంప్ వ్యాఖ్యలను బట్టి అమెరికా నుంచి దౌత్య వేత్తలను ఇరాన్తో చర్చలకు పంపించవచ్చని రాయిటర్స్ ఓ కథనం ఇచ్చింది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ లేదంటే పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్లలో ఎవరో ఒకరిని పంపొచ్చని ఆ కథనం ఉటంకించింది.ఇరాన్ నుంచి ప్రపంచానికి అణు ముప్పు పొంచి ఉందని చెబుతూ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట జూన్ 13వ తేదీ నుంచి దాడులు మొదలు పెట్టింది ఇజ్రాయెల్. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్పై డ్రోన్లు, మిస్సైల్స్తో దాడులు జరుపుతోంది. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలతో ఒకవైపు ఇరుదేశాల్లో ప్రాణ నష్టంతో పాటు మరోవైపు చమురు మార్కెట్ కుదేలు అవుతోంది. ఈ క్రమంలో..జీ7 సదస్సును కుదించుకుని మరీ హడావిడిగా వాషింగ్టన్ బయల్దేరారు అధ్యక్షుడు ట్రంప్. అయితే కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదన చేశారంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. కాసేపటికే అందులో వాస్తవం లేదని ట్రంప్ కొట్టిపారేశారు. జరగబోయేది మేక్రాన్కు తెలియదని.. అది కాల్పుల విరమణకు మించే ఉంటుందని ట్రంప్ సోషల్ ట్రూత్ వేదికగా ప్రకటించారు.న్యూక్లియర్ ఎలాంటి అణ్వాయుధాలను కలిగి ఉండడానికి వీల్లేదంటున్న ట్రంప్.. టెహ్రాన్ను తక్షణమే ఖాళీ చేయాలంటూ అక్కడి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈలోపు.. ఆయన సిట్యుయేషన్ రూమ్లో జాతీయ భద్రతా మండలితో భేటీ అవుతుండడంతో ‘ఏదో జరగబోతోందంటూ’ చర్చ నడుస్తోంది.ఇదీ చదవండి: టైం లేదు.. భారతీయులకు ఎంబసీ అడ్వైజరీ -
ఏం జరగబోతోంది?.. ట్రంప్ గరం గరం.. సిట్యుయేషన్ రూమ్ రెడీ
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతోందనే భయాలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. జీ 7 సదస్సు నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అర్ధాంతరంగా నిష్క్రమించడం.. పైగా ఆయన నేతృత్వంలోని సిట్యుయేషన్ రూమ్ హడావిడిగా సమావేశం అవుతుండడమే అందుకు కారణం. ఇరు దేశాల మధ్య శాంతి చర్చల కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించగా.. ఆ ప్రకటనను తోసిపుచ్చుతూ ‘అంతకు మించే జరగబోతోంది’ అని ట్రంప్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయి చేరుకున్న నేపథ్యంలో.. జీ7 సదస్సు నుంచి ముందుగానే ట్రంప్ నిష్క్రమించారు. పర్యటనను కుదించుకున్న ఆయన.. తాను జీ7 సదస్సు నుంచి వచ్చేలోపు సిట్యువేషన్ రూమ్లో సిద్ధంగా ఉండాలని జాతీయ భద్రతా మండలి(NSC)ని ట్రంప్ ఆదేశించినట్లు తెలుస్తోంది. మరికొన్నిగంటల్లో ట్రంప్ చేరుకుంటారని, ఈ సమావేశం తర్వాత ఆయన కీలక ప్రకటన చేస్తారని వైట్హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ట్రంప్ ఆఫర్ ఉత్తదే.. పరిస్థితి చేజారిందా?అంతకు ముందు.. ఇజ్రాయెల్-ఇరాన్ కాల్పుల విరమణకు ట్రంప్ ఆఫర్ చేశారని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ అధికారికంగా ఓ ప్రకటన చేశారు. తొలుత కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుని.. ఆ తర్వాత సరిహద్దు చర్చలు ప్రారంభించాలని ట్రంప్ ప్రతిపాదించారని, అయితే ఈ ఆఫర్ను ఇరు దేశాలు అనుసరిస్తాయా? లేదా? అనేది చూడాలని మేక్రాన్ అన్నారు. అయితే.. మేక్రాన్ ప్రకటనను ట్రంప్ తోసిపుచ్చారు. పబ్లిసిటీ కోసమే మేక్రాన్ అలాంటి ప్రకటన చేసి ఉంటారని, అసలేం జరగబోతోందో ఆయన ఊహించలేరని, తాను వాషింగ్టన్ వెళ్లేది కాల్పుల విరమణ కోసం కాదని.. అంతకు మించిందే జరగబోతోందని ట్రంప్ సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిణామాలపై ట్రంప్ గరం గరంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో.. ఈ వారంలో న్యూక్లియర్ డీల్పై ఇరాన్ ప్రతినిధులతో ఆరో దఫా ట్రంప్ చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఆ వార్తలను తోసిపుచ్చారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అలాంటి చర్చల ప్రస్తావన కనుమరుగైందని స్పష్టత ఇచ్చారాయన. ఇక.. టెహ్రాన్ను వీడాలని ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పరిస్థితి చేజారిందనే సంకేతాలు అందిస్తున్నాయి. ట్రంప్ ఆ ప్రకటన చేసిన కాసేపటికే టెహ్రాన్లో బాంబుల వర్షం కురుస్తోందని సమాచారం. అమెరికా రంగంలోకి దిగి భారీ బంకర్ బస్టర్ బాంబులను ఇరాన్ అణుస్థావరాలపై ప్రయోగించవచ్చనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.ట్రంప్పై ఒత్తిడి..ఇరాన్ మాస్టర్ ప్లాన్గల్ఫ్ దేశాలతో ట్రంప్ను దారిలోకి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఖతర్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలను ఆశ్రయించింది. ఇజ్రాయెల్ తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తీసుకురావాలని అరబ్ దేశాలను ఇరాన్ కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని ఆ దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేయడం గమనార్హం. -
..మా ఊరొచ్చింది ఏనుగు!
‘ఏనుగమ్మ ఏనుగు.. మా ఊరొచ్చింది ఏనుగు’ అని భలే సంబరపడిపోతున్నారు అమెరికన్లు. చూడటానికి పరిమాణంలోనూ, రాజసంలోనూ అచ్చం గజరాజుల్లా జీవం ఉట్టిపడేలా కనిపిస్తున్న ఇవన్నీ చెక్కతో చేసినవి. ఒకటికాదు, రెండు కాదు.. ఏకంగా 100 బొమ్మలు! ఆసియాలో వన్యప్రాణుల పరిరక్షణకు పనిచేస్తున్న యూకేకు చెందిన ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ అనే స్వచ్ఛంద సంస్థ ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్’ పేరుతో వినూత్నంగా నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కుంజర సమూహం యూఎస్లోని ప్రముఖ నగర వీధుల్లో జనానికి వింత అనుభూతిని కలిగిస్తోంది. ప్రదర్శన మాత్రమే కదా, గొప్ప ఏముంది అని కొట్టిపారేయకండి.. ఎందుకంటే ఇవి మనదేశంలోనే రూపుదిద్దుకున్నాయి.మనదేశంలోని ఆసియా ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచినవి. అలాంటి ఏనుగులు రైలు ఢీకొట్టడం, విద్యాదాఘాతాల వంటివాటి వల్ల మరణించడం చూసి తట్టుకోలేక వాటికోసం 2002లో అప్పటి జైపూర్ రాజకుటుంబం, బ్రిటన్కు చెందిన ప్రముఖ ఫైన్షాయర్ సర్ ఎవలిన్ డి రాస్చైల్డ్ సంయుక్తంగా ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ని ఏర్పాటుచేశాయి. ఈ సంస్థ ఏనుగుల సంరక్షణలో భాగంగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో ఒకటి ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’. ఈ ప్రాజెక్టు కోసం.. భారత్లో తయారైన ఈ భారీ ఏనుగుల బొమ్మలు ఇప్పుడు అమెరికన్లు కట్టిపడేస్తున్నాయి.ఖరీదు కాస్త ఎక్కువే!ప్రదర్శన అంటే కేవలం చూడటమే కాదు.. ఔత్సాహికులు తమకు నచ్చిన బొమ్మను బుక్ చేసుకోవచ్చు కూడా. ఏనుగు పిల్ల నుంచి భారీ కరిరాజు వరకు శిల్పులు నాలుగు రకాల బొమ్మలు తయారుచేశారు. వీటి ధరలు రూ.6,88,000లతో మొదలై రూ.18,92,000 వరకు ఉన్నాయి. బొమ్మ తయారుచేసి, ఇవ్వడానికి 4–6 నెలల సమయం పడుతుందని ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ సంస్థ చెబుతోంది. తమిళనాడు నీలగిరిలోని గూడలూర్కు చెందిన 200 మంది స్థానిక గిరిజన కళాకారుల సంఘం ‘కో ఎగ్జిస్టెన్ ్స కలెక్టివ్’ చేతిలో ఇవి రూపుదిద్దుకున్నాయి. నీలగిరి ప్రాంతంలో తిరిగే ఏనుగులను పోలిన ఈ బొమ్మలను.. శిల్పులు అయిదేళ్లు శ్రమించి తీర్చిదిద్దారు.నగరాల వారీగా..గజరాజుల శిల్పాలను అమెరికా అంతటా తిప్పి, ప్రదర్శనలు ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2024 జూలైలో న్యూపోర్ట్తో మొదలై న్యూయార్క్ సిటీ, మియామీ బీచ్, హ్యూస్టన్ లలో ఎగ్జిబిషన్ జరిగింది. మోంటానాలోని బ్రౌనింగ్లో జూన్ 4న ప్రారంభమైన ప్రదర్శన జూన్ 16తో ముగిసింది. పశ్చిమ యూఎస్ వయోమింగ్లోని జాక్సన్ హోల్లో మే 17 నుంచి జూన్ 20 వరకు జరుగుతుంది. జులై 1 నుంచి ఈ గజరాజులు కాలిఫోర్నియా వాసులకు కనువిందు చేయనున్నాయి.సంచరించడానికి స్థలం..లాంటానా కామరా పుష్పించే ఈ కలుపు మొక్క వేగంగా వ్యాపిస్తుంది. జలావరణాల్లో ఇవి వేగంగా విస్తరించడం వల్ల జంతువులు జనావాసాల్లోకి రావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందుకే, ఈ మొక్కలను ఏనుగు బొమ్మల తయారీకి వాడటం ద్వారా.. వన్యప్రాణుల సంచారానికి ఎక్కువ స్థలం ఉంటుందని, అటవీ పునరుద్ధరణకు దోహదపడుతుందనేది ‘ఎలిఫెంట్ ఫ్యామిలీ’ ఆలోచన. ‘ద గ్రేట్ ఎలిఫెంట్ మైగ్రేషన్ ’ ద్వారా సేకరించే నిధులను.. మానవులు, వన్యప్రాణుల సామరస్య సహజీవనాన్ని ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా చేపట్టే కార్యక్రమాల కోసం వెచ్చిస్తారు. -
యుద్ధం కాదు... చర్చలే దిక్కు!
ఏ యుద్ధంలోనైనా కనబడే దూకుడే అయిదోరోజుకల్లా ఇజ్రాయెల్–ఇరాన్ ఘర్షణలో కనబడుతోంది. ఎవరికెవరూ తీసిపోకుండా క్షిపణులు, బాంబులు యథేచ్ఛగా ప్రయోగిస్తున్నారు. జనావా సాలను గురిచూస్తున్నారు. ప్రత్యర్థుల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నట్టు ప్రకటించుకుంటున్నారు. ఇజ్రా యెల్ విమానాల బాంబుదాడుల్లో 406 మంది ఇరాన్ పౌరులు మరణించగా, 654 మంది గాయపడ్డారని వాషింగ్టన్లోని మానవహక్కుల కార్యకర్తలు ప్రకటించారు. అటు రాజధాని టెల్ అవీవ్తో పాటు పలు నగరాలపై ఇరాన్ సాగించిన క్షిపణి దాడులకు ఇజ్రాయెల్లో 14 మంది మర ణించగా, 390 మంది గాయపడ్డారని అక్కడి సైన్యం తెలియజేసింది. తొలుత అణుకేంద్రాలపై దాడులు చేశామన్న ఇజ్రాయెల్ రెండోరోజు నుంచి నగరాలూ, పట్టణాలూ లక్ష్యంగా చేసుకుని బాంబులు ప్రయోగిస్తోంది. తయారీరంగ పరిశ్రమలనూ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలనూ, పోలీస్ స్టేషన్లనూ, మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తోంది. ఒక్క తెహ్రాన్లోనే శని ఆదివారాల్లో 250 లక్ష్యాలను దెబ్బతీశామని చెబుతోంది. దక్షిణ ఇరాన్లోని ప్రపంచంలోనే అతి పెద్ద సహజవాయు క్షేత్రాన్ని, తెహ్రాన్ వెలుపల ఒక చమురు డిపోను ఇజ్రాయెల్ సైన్యాలు పేల్చివేశాయి.అణ్వస్త్రాల తయారీకి ఇరాన్ చేరువలో ఉన్నదని, అందుకే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ఇస్తున్న సంజాయిషీ బూటకం. వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అది శుద్ధిచేసిన యురే నియం నిల్వలు ఉంచుకున్నా, బాంబు తయారీకి దరిదాపుల్లో లేదని సాక్షాత్తూ అమెరికా ఇంటెలి జెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ కొన్ని వారాల క్రితం తెలిపారు. అణు ఒప్పందం గురించి అమెరికా– ఇరాన్ల మధ్య చర్చలు సాగుతుండగానే హఠాత్తుగా ఇరాన్పై ఇజ్రాయెల్ అణు ఆరోపణ ఎందుకు చేసినట్టు? ఇరాక్లో సద్దాం హుస్సేన్ను అడ్డు తప్పించటానికి ఆ దేశంలో రసాయన ఆయుధాలున్నాయని కపట నాటకమాడిన అమెరికా అడుగుజాడల్లో ఇజ్రాయెల్ నడుస్తోంది. ఆ సాకుతో సద్దాంను తప్పించి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్ఠిద్దామని అప్పట్లో అమెరికా, నాటో దేశాలు భావించాయి. కానీ జరిగిందంతా వేరు. రసాయన ఆయుధాల జాడలేదు సరిగదా... ఉగ్రవాదం మరింతగా విజృంభించింది. ఇప్పటికీ ఇరాక్ కుదుట పడలేదు. అఫ్గాన్, లిబియా, యెమెన్, సిరియాలు సైతం అదే దుఃస్థితిలో ఉన్నాయి. ప్రధాని నెతన్యాహూ రెండు లక్ష్యాలతో ఇరాన్పై విరుచుకుపడ్డారు. మతాచార్యుడు ఖమేనీ కనుసన్నల్లోని పాలకవ్యవస్థను పడగొట్టి అక్కడ తమకు అనుకూలమైన ప్రభుత్వం ప్రతిష్ఠించటం అందులో ఒకటైతే, రెండోది స్వదేశంలో తాను కోల్పోయిన పరువు తిరిగి పొందటం. అమెరికా, ఇజ్రాయెల్లు కలిసినా ఇరాన్లో తమకు అనుకూలమైన వారిని ప్రతిష్ఠించటం అసాధ్యం. ఆ రోజులు పోయాయి. 1970వ దశకం వరకూ ఇరాన్ను పాలించిన షా రెజాపెహ్లావీ వంటి అమెరికా కీలుబొమ్మ ఆ దేశంలో కొత్తగా పుట్టుకొచ్చే అవకాశం లేదు. ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తే నెతన్యాహూ రెండో లక్ష్యం కూడా నెరవేరే అవకాశం కనబడటం లేదు. పాలస్తీనాలో దిక్కూ మొక్కూలేని నిస్సహాయ పౌరులపై అమెరికా సరఫరా చేసిన మారణా యుధాలతో విరుచుకుపడటం వేరు. ఇప్పుడు ఇరాన్ జోలికి పోవటం వేరు. ఇరాన్ పౌరులకు తమ ప్రభుత్వంపై ఎంతైనా వ్యతిరేకత ఉండొచ్చుగానీ, కొన్ని దశాబ్దాలుగా వారంతా నిత్యం యుద్ధ రంగంలోనే ఉన్నారు. ఇప్పుడంటే సౌదీతో ఒక మేరకు స్నేహసంబంధాలు ఏర్పడ్డాయిగానీ ఆ దేశం కూడా ఇరాన్పై కత్తికట్టినదే. గతంలో ఇరాక్తో వైరం ఏర్పడినప్పుడు వరసగా పదేళ్లపాటు యుద్ధం సాగించిన దేశం ఇరాన్. ఎంతగా అమెరికా మద్దతున్నా ఈ మాదిరి సుదీర్ఘ యుద్ధాన్ని ఇజ్రాయెల్ ఆర్థికవ్యవస్థ తట్టుకోవటం అసాధ్యం. ఆ మాటకొస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థే అంతటి మహాయుద్ధాన్ని భరించే స్థితిలో లేదు. ‘ఉగ్రవాదంపై యుద్ధం’ పేరిట పలు దేశాల్లో నాటో కూటమితో కలిసి సాగించిన యుద్ధాల పర్యవసానంగా ఇప్పటికే అమెరికా నిండా మునిగింది. దాని ప్రస్తుత రుణం 36 లక్షల కోట్ల డాలర్లు. ఆర్థికవ్యవస్థకొచ్చే ఆదాయంలో సింహ భాగం దానిపై వడ్డీలకే ఖర్చవుతోంది. ఇజ్రాయెల్కు వత్తాసుగా ఇరాన్తో వైరం పెట్టుకుంటే ఆ సుదీర్ఘ పోరు మరో పదిలక్షల కోట్ల డాలర్లను ఆవిరిచేస్తుంది. తాను అధికారంలోకొస్తే ‘అనవసర యుద్ధాల’ నుంచి అమెరికాను తప్పిస్తానని, ఒక్క సైనికుడు కూడా విదేశీగడ్డపై ఉండే అవసరం రాదని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ ఊదరగొట్టారు. అందుకే ‘ఇజ్రాయెల్ జోలికెళ్తే ఖబడ్దార్’ అంటూ ట్రంప్ ఇరాన్ను హెచ్చరించటాన్ని స్వపక్షంలో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది లేదు. అణు చర్చలకు సిద్ధమంటోంది ఇరాన్. కాకపోతే ఇజ్రాయెల్ వద్ద పుష్కలంగా అణ్వాయుధాలుండగా... పౌర అవసరాలకు సైతం యురేనియం వాడకాన్ని అను మతించబోమనటం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయటమే అంటున్నది. నిజానికి ఒబామా హయాంలో అమెరికా ఆ వెసులుబాటు ఇవ్వటం వల్లనే 2015లో అణు ఒప్పందం సాకారమైంది. క్రితంసారి ఏలుబడిలో ట్రంప్ ఆ ఒప్పందాన్ని కాలరాశారు. ఇజ్రాయెల్ సృష్టించిన ఈ ఊబి నుంచి బయటపడాలంటే ఇప్పటికీ ట్రంప్కు ఆ ఒప్పందమే దిక్కు. ఈ నాలుగు రోజుల్లో డాలర్ విలువ పదిశాతం తరిగిపోయింది. ఇరాన్తో చర్చించి సమస్య పరిష్కారానికి సాయపడతామని జర్మనీ విదేశాంగమంత్రి యోహాన్ వాదెఫుల్ ముందుకొచ్చారు. అందుకు సిద్ధపడటమే అమెరికా ముందున్న ఏకైక మార్గం. కాదంటే ఇవాళ పశ్చిమాసియా కావొచ్చుగానీ... రేపు ప్రపంచమే పెను సంక్షోభంలో పడుతుంది. అప్పుడు ఆర్థిక పతనం నుంచి అమెరికాను ఎవరూ కాపాడలేరు. -
తలొగ్గుతారా? తయారు చేస్తారా?
పరిస్థితి ఇంతవరకు వచ్చిన తర్వాత ఇరాన్ ఎదుట మిగిలిన మార్గాలు రెండే! అమెరికా, ఇజ్రాయెల్ల ఒత్తిడికి లొంగిపోయి జీవించటమా? లేక స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవించటం కోసం అణ్వాయుధాలను తయారు చేసుకోవటమా? అణ్వస్త్ర తయారీని ఇరాన్ కోరుకోవటం లేదు. అటువంటి సామూహిక హనన శక్తి గల ఆయుధ ఉత్పత్తి ఇస్లాం బోధనలకు విరుద్ధమనే సైద్ధాంతిక వైఖరి తీసుకున్న ఇరాన్ అధినేత అయతొల్లా ఖొమేనీ ఆ మేరకు ఆదేశాలు ఎన్నడో జారీ చేశారు. అణుశక్తిని శాంతియుత అవసరాల కోసమే ఉపయోగించగలమని పలుసార్లు ప్రకటించారు. కానీ అమెరికా శిబిరానికి మౌలికంగా ఇరాన్ పట్లనే శత్రుత్వం ఉంది. అక్కడ అణు పరిశోధనలన్నవి సాకు మాత్రమే!అమెరికా అండతోనే...ఒకసారి ఇటీవలి పరిణామ క్రమాన్ని చూద్దాం. అణు పరిశోధ నలు, వాటి పరిమితుల విషయమై ఇరాన్, అమెరికాల మధ్య ఖతార్లో అయిదు విడతల చర్చలు జరిగాయి. ఆరవ విడత ఈ నెల 15న జరగాల్సి ఉండగా, రెండు రోజుల ముందు 13న ఇజ్రాయెల్ దాడులు మొదలయ్యాయి. దాడుల గురించి తమకు ముందే తెలుసు నని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూన్ 14న స్వయంగా ప్రకటించారు. తాము అమెరికాతో సమన్వయం చేసుకునే దాడులు చేస్తున్నా మని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ అంతకుముందు 13 నాడే అన్నారు. తమ ఇంటెలిజెన్స్ సమాచారంతో, తాము సరఫరా చేస్తున్న ఆయుధాలతోనే దాడులు సాగుతున్నాయని ట్రంప్ 14న వెల్లడించారు. దాడులకు రెండు రోజుల ముందే అమెరికా ప్రభుత్వం పశ్చి మాసియా ప్రాంతంలోని తమ పౌరులకు, దౌత్య కార్యాలయాలకు జాగ్రత్తలు చెప్పి, తమ సైనిక స్థావరాలకు తగు హెచ్చరికలు చేసింది. అయినా తమకు దాడులతో నిమిత్తం లేదని వాదిస్తున్నది.దీన్ని బట్టి కొన్ని ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. పాల స్తీనాతో ముడిబడిన చర్యలకు ఇరాన్ మిత్ర సంస్థలు ఇతర భూభాగాల నుంచి దాడులకు పాల్పడుతుండటం, వాటిపై ఇజ్రాయెల్ ప్రతి చర్యలు కొత్తవి కాదు. అవి ఎట్లున్నా, అణు పరిశోధనల విషయమై ఇరాన్ – అమెరికాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అవి ఈ 15 నాటి ఆరవ విడతలో ఫలించే అవకాశం ఉందని ట్రంప్ సైతం కొద్ది రోజులుగా అంటూ వస్తున్నారు. ఇదంతా నెతన్యాహూకు తెలిసినదే. అటువంటపుడు చర్చలకు సరిగ్గా రెండు రోజుల ముందు దాడులే మిటి? ఈ ప్రశ్నలపై నిపుణుల నుంచి రెండు అభిప్రాయాలు విన వస్తున్నాయి. ఒకటి, అమెరికా–ఇరాన్ చర్చలను, ఒకవేళ పరిష్కారం కుదిరే అవకాశం ఉంటే దానిని భంగపరచటం కోసమే ఇజ్రాయెల్ ఆ పని చేసిందన్నది. రెండు, ముందస్తు దాడులతో ఇరాన్ను భయపెట్టి చర్చలతో దారికి తెచ్చుకోవటం ట్రంప్ ఎత్తుగడ అన్నది. ఈ రెండింటిలో దేనికి అదిగా నిజం కాగల అవకాశాలు ఉన్నాయి కూడా. ఇరాన్తో రాజీ ఇజ్రాయెల్కు ఎంత మాత్రం ఇష్టం లేనిది. అందుకోసం వారు అమెరికానైనా ధిక్కరించగలరు. ఎందుకంటే, పాలస్తీ నాకు నిజమైన మిత్ర దేశంగా మిగిలింది ఆ ప్రాంతంలో ఇరాన్ ఒక్కటే. వేర్వేరు అరబ్ దేశాలను అమెరికా ద్వారా మిత్రులుగా మార్చుకుంటున్నా, ఎంత మాత్రం రాజీ పడనిది ఇరాన్ మాత్రమే. కనుక దానిని ధ్వంసం చేయాలి. అమెరికాకు సంబంధించి, ఇజ్రా యెల్తో వైరాన్ని వదిలి, పాలస్తీనా కోసం పట్టుబట్టనట్లయితే సరి పోతుంది. ఆ విధంగా ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొద్దిపాటి వ్యత్యాసం ఉంది.వైఖరుల్లో తేడా!అణుశక్తి విషయంలోనూ ఇదే పరిస్థితి. ఇరాన్ అణుశక్తి పరిశో ధనలు ఒక పరిమితికి లోబడి జరగాలని, అణ్వాయుధాల ఉత్పత్తికి అవసరమయ్యే యురేనియం 90 శాతం శుద్ధి జరగరాదని 2016లో ఇరాన్కు, అమెరికా తదితర దేశాలకు మధ్య అంగీకారం కుదిరింది. అందుకు బదులు ఇరాన్పై ఆంక్షలు సడలించాలన్నారు. కానీ రెండేళ్ల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ కూడబలుక్కోవటంతో ఆ ఒప్పందం నుంచి అమెరికా ఉపసంహరించుకుంది. అప్పుడు కూడా అధ్యక్షుడు ట్రంప్. అప్పటినుంచి ఈ ఏడేళ్లుగా అణు రాజకీయం నడుస్తూనే ఉంది. అణ్వస్త్రాల కోసం యురేనియంను 90 శాతానికి, అంతకన్నా మించి శుద్ధి చేయవలసి ఉంటుంది. శాంతియుత అవసరాలకు అంత కులోపు అయితే సరిపోతుంది. ఇరాన్ కేంద్రాల్లో ప్రస్తుతం శుద్ధి 60 శాతంగా ఉంది. ఆ మాట ఇరాన్ ప్రభుత్వం చెప్పటమే కాదు అణుశక్తి సంస్థ కూడా ధ్రువీకరించింది. అయినప్పటికీ ఇజ్రాయెలీ నిఘా సంస్థలు మాత్రం తొమ్మిది అణ్వస్త్రాలకు కావలసినంత శుద్ధి ఇప్పటికే జరిగిపోయిందనీ, త్వరలో పదిహేనింటికి జరుగుతుందనీ ప్రచారం మొదలు పెట్టాయి. గమనించదగినదేమంటే అమెరికా మాత్రం ఈ మాట నేటికీ అనటం లేదు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయ కూడదనేది ఒక్కటే తమ షరతని ప్రకటిస్తోంది. ఈ విషయమై ఇజ్రాయెల్, అమెరికా వైఖరుల మధ్య తేడా కనిపిస్తుంది. కనీసం శాంతియుత ప్రయోజనాల కోసమైనా సరే ఇరాన్ పరిశోధనలు ససేమిరా చేయరాదని, స్వయంగా శుద్ధి చేయక పోవటమేగాక, పరిమిత శుద్ధి గల ఇంధనాన్ని అయినా ఇతరుల నుంచి దిగుమతి చేసుకునేందుకు వీలు లేదన్నది ఇజ్రాయెల్ వాదన. ట్రంప్ వైఖరిలో ఇతర అంశాలకు సంబంధించి వలెనే ఇందులోనూ చంచలత్వం కనిపిస్తుంది. ఒకవేళ ఖతార్ చర్చలు సాగి ఉంటే అంగీ కారం ఏదైనా కుదిరేదేమో తెలియదు. అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేయబోమని మాత్రం ఇరాన్ స్పష్టం చేస్తోంది. తాము జోక్యం చేసుకుని ఏదైనా మధ్యే మార్గానికి ప్రయత్నించగలమని రష్యా కూడా అంటున్నది. ఇపుడు అకస్మాత్తుగా ఇజ్రాయెల్ దాడులు చేయటంతో, అందుకు అమెరికా తోడ్పడినట్లు ట్రంప్ మాటలలోనే కనిపిస్తుండటం వల్ల, తాము చర్చలకు 15న వెళ్లబోవటం లేదని ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో, ఇది శాశ్వత బహిష్కరణ అనక పోవటం గమనించదగ్గది. ఇరాన్ నిజాయతీని, దౌత్య మార్గంలో పరిష్కారానికి కట్టుబడటాన్ని అది చెప్తున్నది.రహస్య అణు కేంద్రాలు?అయితే, ఇరాన్ అణుశుద్ధి అణ్వస్త్ర తయారీ గురించి చెప్పు కోవలసినవి మరికొన్ని ఉన్నాయి. యురేనియం శుద్ధి 90 శాతం మేర ఇప్పటికే జరిగిందనేందుకు ఎటువంటి ఆధారాలూ అమెరికన్ల వద్ద సైతం లేవు. అణు ఇంధన సంస్థ కూడా ఆ మాట అనటం లేదు. కానీ, ఇరాన్ తమకు చూపకుండా దాచి పెడుతున్న విభాగాలు కొన్ని ఉన్నాయని ఆ సంస్థ అంటున్నది. ఆ మాట నిజం కాదని ఇరాన్ కూడా ఖండించటం లేదు. ఇజ్రాయెల్ దాడుల దరిమిలా ఒక కొత్త విషయం వెల్లడించారు. అది, ఎవరికీ తెలియని మరొకచోట కూడా శుద్ధి కేంద్రం నిర్మిస్తున్నామని! ఇవన్నీ నిజమైనా, చివరకు వారు అణ్వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారనుకున్నా, ఇజ్రాయెల్, అమెరికా సహా ఎన్నో దేశాలకు భారీ సంఖ్యలో అణ్వస్త్రాలు ఉన్నపుడు, తన రక్షణ కోసం ఇరాన్ మాత్రం ఎందుకు తయారు చేసుకోరాదన్నది మౌలికమైన ప్రశ్న. ఉత్తర కొరియా ఉదాహరణ ఇపుడు మరోసారి చర్చకు వస్తున్నది. అదే విధంగా ఇరాన్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నట్లయితే దాడికి ఇజ్రాయెల్, అమెరికాలు సాహసించగలవా? అణువ్యాప్త నిరోధక ఒప్పందాలను ఉల్లంఘించి, ఇజ్రాయెల్ అణ్వస్త్ర తయారీకి రహస్యంగా సహకరించింది అమెరికా, యూరప్లు కాదా? ప్రస్తుత యుద్ధానికి వస్తే, అమెరికా తోడ్పాటుతో ఇజ్రాయెల్ ఏకపక్ష విధ్వంసాలు సృష్టించగలగటం వట్టి మాట అని ఇరాన్ తన ఎదురు దాడులతో రుజువు చేస్తున్నది. ఇజ్రాయెల్ ఎంతో ఘనంగా చెప్పుకునే ఐరన్ డ్రోమ్ బలహీనతలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక బలం మహాశక్తిమంతమైనదే గానీ, రెండవరోజు నుంచి కూడదీసుకున్న ఇరానియన్ రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చివేయటం మొదలైంది. బహుశా వీటన్నింటి కన్నా ముఖ్యమైన వార్తలు, ఇరాన్ అణు కేంద్రాలకు ఇజ్రాయెల్ దాడులతో వాటిల్లిన నష్టం స్వల్పమైనదేనని, భూగర్భంలో, కొండ లలో చాలా లోతున గల కేంద్రాలు యథాతథంగా ఉన్నాయన్నది. ఇరాన్ చివరకు అణ్వస్త్రాలు ఉత్పత్తి చేయక తప్పదా?టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అమెరికాలో ఎమ్మెస్ టాపర్గా తెలుగమ్మాయి
అమలాపురం టౌన్: అమెరికా దేశం వాషింగ్టన్ విశ్వ విద్యాలయానికి చెందిన ఫాస్టర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి అమలాపురం అమ్మాయి చావలి శ్రీకావ్య ఎమ్మెస్ డిగ్రీలో టాపర్గా నిలిచింది. ఆమె కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ మనమరాలు. అమెరికాలోని ఆ స్కూల్లో శనివారం జరిగిన కాన్వగేషన్లో శ్రీకావ్యకు ఎమ్మెస్ డిగ్రీతోపాటు మాస్టర్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ డిగ్రీ ప్రదానం చేశారు. శ్రీకావ్య ఇప్పటికే వివిధ దేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చేసింది.హైదరాబాద్ జేఎన్టీయూ నుంచి ఎంటెక్, స్వీడన్ బ్లెకింజ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి టెలీ కమ్యూనికేషన్స్ సిస్టమ్లో ఎమ్మెస్ డిగ్రీ చేసింది. కోచ్ కోడ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ చేసింది. ఈ ఇనిస్టిట్యూట్లో శ్రీకావ్య ఆటోమేషన్ ఆఫ్ క్లౌడ్ హాస్టెడ్ అప్లికేషన్స్ అనే పరిశోధనా పత్రాన్ని సమర్పించింది. ఈమె స్పోర్ట్స్లో కూడా విజేతే. జాతీయ స్థాయి ఎయిర్ రైఫిల్ షూటర్గా, తెలంగాణ రాష్ట్రం నుంచి అఖిల భారత పది మీటర్ల మహిళా షూటింగ్ చాంపియన్ షిప్ గెలుచుకుంది. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి -
అమెరికా అతలాకుతలం.. వాతావరణ మార్పుతో వరద బీభత్సం
వాషింగ్టన్ డీసీ: అమెరికాలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరద బీభత్సానికి పశ్చిమ వర్జీనియా, టెక్సాస్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. వర్జీనియాలో కురిసిన కుండపోత వర్షాలు, వరదలకు ఐదుగురు మృతిచెందారు. ఫెయిర్మాంట్లో ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది. అమెరికాలో ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.భారీ వరదల కారణంగా పశ్చిమ వర్జీనియాలోని వీలింగ్ క్రీక్ నదిలో 90 నిముషాల వ్యవధిలో ఏడు అడుగుల మేరకు నీటిమట్టం పెరిగి, మౌలిక సదుపాయాలను దెబ్బతీసింది. ఒహియో కౌంటీలో భారీ వర్షాల కారణంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆస్టిన్, వాకోతో సహా సెంట్రల్ టెక్సాస్లు ఆకస్మిక వరద ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఈ ప్రాంతాల్లో నాలుగు అంగుళాల మేరకు వర్షపాతం నమోదయ్యింది. కాన్సాస్లో, ఆకస్మిక వరదల కారణంగా ప్రభుత్వం అత్యవసర సహాయ చర్యలు చేపట్టింది.ఎల్ డొరాడోలో వాల్నట్ నది ఉప్పొంగి సమీపంలోని ఇళ్లను ముంచెత్తింది. టెక్సాస్లోని శాన్ ఆంటోనియోలో జూన్ 11 రాత్రి నుండి జూన్ 12 ఉదయం వరకు 10 అంగుళాల వర్షపాతం కురిసింది. ఇది ఇక్కడి సాధారణ నెలవారీ సగటు కంటే చాలా ఎక్కువ. అలబామా, లూసియానా, న్యూయార్క్లను కూడా తుఫాను ముప్పు వెంటాడుతోంది. అమెరికాలో వాతావరణ మార్పు కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలతో పాటు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. శాన్ ఆంటోనియోలో 12 గంటల వ్యవధిలో 10 అంగుళాల వర్షం కురిసింది. ఇది జూన్ నెల మొత్తం సగటు వర్షపాతం కంటే రెండింతలు అధికం.అమెరికాలో ఆకస్మిక వరదలకు గల ప్రధాన కారణాలలో వాతావరణ మార్పు ఒకటి. పసిఫిక్ ఇన్స్టిట్యూట్ తెలిపిన వివరాల ప్రకారం వాతావరణ మార్పు వల్ల అధిక వర్షపాతం నమోదు కావడం, సముద్ర మట్టాల పెరుగుదల, వరద ముప్పు లాంటివి చోటుచేసుకుంటున్నాయి. సముద్ర మట్టం పెరగడం కారణంగా తీరప్రాంతాల్లో వరద ముప్పు అంతకంతకూ పెరుగుతోంది. అధిక ఆటుపోట్లు, తుఫానులు ఏర్పడే పరిస్థితుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతోంది. వాతావరణ మార్పుల కారణంగా తుఫానులు మరింత విధ్వంసకరంగా మారి, భారీ వర్షపాతం కురవడంతో పాటు వరదలు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో వాతావరణ మార్పు కారణంగా నేలలోని తేమ తగ్గుతుంది, దీంతో వర్షపు నీరు భూమిలోకి చొచ్చుకుపోయే బదులు ఉపరితలంపైకి వెళ్లిపోతుంది. ఇది ఆకస్మిక వరదలకు దారితీస్తోంది.అటవీ నిర్మూలన, పట్టణీకరణ వరదల ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. పట్టణ ప్రాంతాలలోని కాంక్రీటు నిర్మాణాలు వర్షపు నీటిని భూమిలోనికి వెళ్లకుండా నిరోధిస్తాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం, అటవీ నిర్మూలనను నిరోధించడం, పట్టణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరచడం లాంటివి తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: పాక్ ముస్లిం లీగ్.. జైరామ్ రమేష్ ఒక్కటే: బీజేపీ ఘాటు విమర్శ -
హోరెత్తిన నో కింగ్స్
ఫిలడెల్ఫియా: ట్రంప్ సర్కారు వలస వ్యతిరేక చర్యలపై అమెరికావ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనలు క్రమంగా దేశమంతటికీ విస్తరిస్తున్నాయి. శనివారం దేశవ్యాప్తంగా వందలాది చోట్ల నిరసన కార్యక్రమాల్లో లక్షలాదిగా ప్రజలు పాల్గొన్నారు. న్యూయార్క్, టెక్సాస్, మిసిసిపి, పోర్ట్లాండ్, మిన్నెసొటా, నార్త్ కరొలినా తదితర ప్రాంతాలు ఆందోళనలతో అట్టుడికిపోయాయి.వీధులు, పార్కు లు, ప్లాజాలు... ఇలా అన్ని చోట్లా జనం నిరసనలకు దిగారు. ట్రంప్ నియంతృత్వ పోకడలను దుయ్యబట్టారు. ‘నో కింగ్స్ (నియంతృత్వం వద్దు)’ అంటూ నినదించారు. ప్రజాస్వామ్యా న్ని, వలసదారుల హక్కు లను కాపాడుకుంటామని ప్రతినబూనారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా ఆందోళనలు ఆగబోవని ‘నో కింగ్స్ కోయెలిషన్’ నిర్వాహకులు తెలిపారు. ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని రాష్ట్రాల గవర్నర్లు కోరారు. పలు ప్రాంతాల్లో నేషనల్ గార్డులను మోహరించారు. ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారుల దాడులకు నిరసన్ఛఠి వారం క్రితం లాస్ఏంజెలెస్లో మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెల్సిందే.రగడ, ఉద్రిక్తతలుశనివారం లాస్ఏంజెలెస్లో ర్యాలీలో పాల్గొన్న నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. పోర్ట్ల్యాండ్లో ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉటాహ్లోని సాల్ట్లేక్ సిటీలో ర్యాలీలో కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. వర్జీనియాలో నిరసనకారులపై వాహనం నడిపి ఒకరిని గాయపరిచిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఆర్మీ డే, ట్రంప్ బర్త్ డే!అమెరికా ఆందోళనలతో అట్టుకుతుంటే ట్రంప్ మాత్రం ఆర్మీ 250వ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్నారు. శనివారం ఆయన 79వ పుట్టినరోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఏకంగా 4.5 కోట్ల డాలర్ల వ్యయంతో వాషింగ్టన్లో అట్టహాసంగా జరిగిన సైనిక పరేడ్లో భార్య మెలానియాతో కలిసి ఆయన పాల్గొన్నా రు. ఉక్రెయిన్కు అందజేసిన అత్యాధునిక సైనిక సంపత్తిని ఈ సందర్భంగా ప్రదర్శించారు. పరేడ్ మార్గంపై 9 అపాచీ హెలికాప్టర్లు జనానికి కనువిందు చేశాయి. ‘‘అమెరికా కంటే సాహసోపేతమైన సైన్యం భూ ప్రపంచంలోనే లేదు. మమ్మల్ని బెదిరించాలని చూసేవారికి హెచ్చరిక. మా సైన్యం మీ అంతు చూస్తుంది. దుర్మార్గ దేశాల గుండెల్లో బాయ్నెట్లు గుచ్చుతుంది’’ అని ట్రంప్ హెచ్చరించారు. మెక్సికో జెండాలున్యూయార్క్, డెన్వర్, షికాగో, ఆస్టిన్, లాస్ఏంజెలెస్ నగరాల్లో జనం ‘నో కింగ్స్’ బ్యానర్లు, మెక్సికో జెండాలు చేబూనారు. సియాటెల్లో జరిగిన అతిపెద్ద ర్యాలీలో 70 వేల మందికి పైగా పాల్గొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. అట్లాంటా ర్యాలీకి 5 వేల మంది వచ్చారు. మిన్నెసొటాలో మాత్రం తగు కారణం లేకుండా నిరసనల్లో పాల్గొవద్దని గవర్నర్ టిమ్ వాల్జ్తోపాటు భద్రతాధికారులు ప్రజలను కోరారు. అయినా స్టేట్ కాపిటల్ భవన సముదాయం సహా పలుచోట్ల నిరసనలు జరిగాయి. నార్త్ కరొలినాలో ‘నో కింగ్స్. నో క్రౌన్స్. వియ్ విల్ నాట్ బౌ డౌన్’ అంటూ నినదించారు. ‘ట్రంప్ మస్ట్ గో నౌ’ అనే బ్యానర్ను ప్రదర్శించారు. -
నాన్నా.. డబ్బు పంపండి!
అప్పులు చేస్తున్నాం... డబ్బులు పంపుతున్నాంమా బాబును అమెరికా పంపినప్పుడు ఎంతో సంతోషించాం. కానీ ఇప్పుడు ప్రతీ రోజూ ఏడుస్తున్నాం. ఫీజులు పెరిగాయి. ఉద్యోగాల్లేవు. అమ్మా డబ్బులు పంపు అనడం మాత్రమే ప్రతీ ఫోన్ కాల్లో విన్పిస్తోంది. అప్పులు చేసి మరీ పంపుతున్నాం. ఈ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్తుందో అనే ఆందోళన ఉంది. – వరలక్ష్మి పల్లవ (విద్యార్థి తల్లి, హైదరాబాద్)సాక్షి, హైదరాబాద్: అమెరికాలో మన విద్యార్థులు అనుకున్నదొకటి... అక్కడ జరుగుతున్నది మరోటి. భౌగోళిక పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు మన విద్యార్థులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ ఇబ్బందులు భారత్లో ఉన్న తల్లిదండ్రులకూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రానురాను డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోంది. దీంతో విద్య కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. 2014లో డాలర్ విలువ రూ.60.95 ఉంటే, ఇప్పుడు రూ.86.25కు చేరింది. దీంతో విదేశీ విద్య కోసం వెళ్లిన మన విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. దీనికితోడు పార్ట్ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిల్లడంతో భారత్లోని తల్లిదండ్రుల వైపు విద్యార్థులు దీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫోన్ చేసి డబ్బులు పంపండి అని అడుగుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ అన్ని దేశాల్లోనూ భారత విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. విదేశీ విద్యకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విద్యార్థులూ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. ఏటా రూ.4.32 లక్షల కోట్లు.. ఏటా 13 లక్షల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో టూరిస్టులు, విద్యార్థులూ ఉన్నారు. అయితే, విదేశీ చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు ఉంటే.. 2022 నాటికి ఇది రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. రూపాయి మారకం విలువ పెరగడంతో 2024లో చేస్తున్న ఖర్చు 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ.4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం లెక్కగట్టింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ.5.86 లక్షల మేర భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాకు వెళ్లడానికి ముందు విద్యార్థులు అక్కడి వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆ్రస్టేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. దీనికితోడు వసతి ఖర్చులు 15 శాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లింది. ప్రధాన సమస్య అదే.. అమెరికాలో చదవడం కంటే ముందు పార్ట్టైం ఉద్యోగంపైనే మన దేశ విద్యార్థులు ఆధారపడుతున్నారు. భారత్లో ఉద్యోగాలు రాని వాళ్లు, వస్తాయనే నమ్మకం లేని వాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్తున్నారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. అమెరికాకు దాదాపు 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువాళ్లే ఉంటున్నారు. 2024లో భారత్తోపాటు ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. ఇక్కడ అమెరికాతో పోలిస్తే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. దిగితే గానీ లోతు తెలియదు: కూర్మం దామోదర్ (అమెరికాలో ఎంఎస్ చేస్తున్న వరంగల్ విద్యార్థి) అమెరికా చదువు కోసం కలలు కన్నాం. ఇక్కడికి వస్తే చాలు ఎన్ని అప్పులు చేసినా తీర్చి, ఎంతో కొంత వెనకేసుకుని వెళ్తామని ఆశించాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పార్ట్టైం ఉద్యోగాల్లేవు. డాలర్ ధర పెరగడంతో ఫీజులూ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఏంటో మాకే అంతుబట్టడం లేదు. -
మళ్లీ ట్రంప్ నోట.. భారత్-పాక్ యుద్ధం మాట!
ఇరాన్కు గట్టిగా బుద్ధి చెప్పాలి. మాతో అణు ఒప్పందాన్ని తిరస్కరించింది. ప్రపంచానికి పెనుముప్పుగా మారే అణు ఒప్పందానికి ఇరాన్ దూరంగా ఉంటుంది. ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడి సరైనదే. ఇరాన్పై ఇజ్రాయిల్ ఇంకా విరుచుకుపడాలి. ఈ దాడులు సరిపోవు.. అని రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తనకు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే మరొక రకంగా ఉండటం ట్రంప్కు అలవాటే. ఇరాన్ను ఏదో రకంగా లొంగదీసుకోవాలనే ప్రయత్నమే ట్రంప్ వ్యాఖ్యల్లో కనబడింది. అంటే ఇక్కడ ఇజ్రాయిల్ను అడ్డుపెట్టుకని ఇరాన్ను ఎలాగైనా తమ చెప్పుచేతల్లోకి తీసుకోవాలనేది ట్రంప్ వ్యాఖ్యల్నే బట్టే అర్థమైంది. ఇప్పుడు డీల్ అంటూ కొత్త పాట..!ఇరాన్పై ఇజ్రాయిల్ వరుసపెట్టి దాడులు చేస్తూనే ఉంది. వందల సంఖ్యలో ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఇరాన్ చవిచూసింది. మరి ట్రంప్ టార్గెట్ పూర్తయ్యిందో ఏమిటో గానీ, ఇక ఇజ్రాయిల్-ఇరాన్లు డీల్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కొత్త పల్లవి అందుకున్నారు. దానికి తానే మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకొచ్చారు. ఎలాగైతే భారత్- పాకిస్తాన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చానో, అలాగే వీరి మధ్య కూడా ఒక ఒప్పందంగానీ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు(పాకిస్తాన్తో యుద్ధ విరమణలో ట్రంప్ ప్రమేయం ఏమీ లేదని భారత్ అప్పుడే స్పష్టం చేసింది. మిలటరీ డైరెక్టర్ల పరస్పర అంగీకారంతోనే ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందం జరిగిందని పేర్కొంది). తాను ఎన్నో శాంతి ఒప్పందాలు చేశానని, క్రెడిట్ మాత్రం తనకు అవసరం లేదని అంటున్నారు ట్రంప్.నేను చాలా యుద్ధాలు ఆపాను..!తాను తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో కొసావో, సెర్బియాల మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని, వారి మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని పరిష్కరించాను. బైడెన్(మాజీ అధ్యక్షుడు) తెలివి తక్కువ నిర్ణయాల కారణంగా కొన్ని చోట్ల దీర్ఘకాలిక ఘ్రయోజనాలు దెబ్బతిన్నాయి. నేను దాన్ని మళ్లీ పరిష్కరిస్తా. ఇక ఈజిప్టు, ఇధియోఫియాల మధ్య నైలు నదీ వివాదం ఉంది. భారీ ఆనకట్టకు సంబంధించి వారి మధ్య వివాదం నడుస్తోంది. ప్రస్తుతానికి నా జోక్యంతో కనీసం శాంతి వాతావరణం ఏర్పడింది’ అని శాంతి మంత్రాన్ని మళ్లీ జపించారు.మాట వింటే శాంతి.. వినకపోతే యుద్ధంఇప్పుడు ఇరాన్ విషయంలో జరుగుతున్నది అదే. అమెరికా మాట వినలేదనే కారణంతో ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడిన ట్రంప్.. ఇప్పుడు వారి మధ్య శాంతి ఒప్పందం కుదర్చాల్సిన బాధ్యత తనపైనే ఉందంటున్నారు. ట్రంప్ మాట వింటే భాంతి.. లేకపోతే యుద్ధం అనే పద్ధతిని ఆచరిస్తున్న ట్రంప్ను చూస్తే ఏమనాలో అర్థం కావడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఉస్కో అని ఒక దేశాన్ని రెచ్చగొట్టడం.. కాస్కో అని మరో దేశాన్ని హెచ్చరించడం.. ఇక చివరగా డీల్కు వస్తారా అంటూ పెద్దన్న పాత్రకు రెడీ కావడం ఇవే ట్రంప్ వైఖరిలో కనబడటంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఆఫీస్ స్థలాలకు డిమాండ్.. అమెరికన్ కంపెనీల హవా..
దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి.ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సర్వీసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
ఆఫీస్ స్పేస్కి అమెరికన్ సంస్థల దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్లో అమెరికన్ కంపెనీల హవా నడుస్తోంది. 2022–24 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో 64.5 మిలియన్ చ.అ. స్పేస్ను సదరు సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఈ వ్యవధిలో మొత్తం వర్క్స్పేస్ లీజింగ్లో ఇది మూడో వంతు కావడం గమనార్హం. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022–24 క్యాలెండర్ సంవత్సరాల్లో హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పుణెలో మొత్తం 190 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ను కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. ఇందులో చాలా మటుకు అమెరికన్ సంస్థలు ప్రధానంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు చేశాయి. అమెరికన్ కార్పొరేట్లకు ఐటీ సిటీ బెంగళూరు అత్యంత ప్రాధాన్య లొకేషన్గా ఉంటోంది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) కంపెనీలు టాప్ నగరాల్లో ఆఫీస్ డిమాండ్కి ప్రధాన చోదకాలుగా నిలుస్తున్నాయి. ప్రతిభావంతులైన నిపుణుల లభ్యత, అనుకూల వ్యవస్థ, వ్యయాలు తక్కువగా ఉండటం, వృద్ధికి దోహదపడే విధానాల దన్ను మొదలైన అంశాల వల్ల అమెరికన్ సంస్థలకు భారత్ ఆకర్షణీయ కేంద్రంగా మారుతోందని జేఎల్ఎల్ హెడ్ (ఆఫీస్ లీజింగ్, రిటైల్ సరీ్వసెస్), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ (కర్ణాటక, కేరళ) రాహుల్ ఆరోరా చెప్పారు. అమెరికన్ సంస్థలు తీసుకున్న ఆఫీస్ స్పేస్లో 70 శాతం భాగాన్ని జీసీసీల కోసం వినియోగించుకోవడమనేది భారత్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడంపైనా, దేశ వృద్ధి అవకాశాలపైనా వాటికి గల నమ్మకానికి నిదర్శనమని ఆయన వివరించారు. -
అమెరికాలో చట్టసభ్యులపై కాల్పులు
బ్లెయిన్/బ్రూక్లిన్: అమెరికాలో ఘోరం జరిగింది. ఇద్దరు మిన్నెసోటా రాష్ట్ర చట్టసభల సభ్యులపై ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన రాష్ట్ర ప్రతినిధుల సభ సభ్యురాలు, మాజీ స్పీకర్ మెలిసా హార్ట్మన్, ఆమె భర్త మార్క్ కాల్పులకు బలి కాగా రాష్ట్ర సెనేట్ సభ్యుడు, డెమొక్రటిక్–ఫార్మర్–లేబర్(డీఎఫ్ఎల్) పార్టీ నేత జాన్ హాఫ్మన్ దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. మిన్నెసోటా రాష్ట్రంలోని బ్రూక్లిన్ పార్క్, ఛాంప్లిన్ పట్టణాల్లో ఈ దారుణాలు జరిగాయి. తొలుత సెనేటర్పై... దుండగుడు పోలీస్ స్క్వాడ్ తరహా ఎస్యూవీ వాహనంలో పోలీసు యూనిఫాంలో ఘాతుకాలకు పాల్పడ్డాడు. ముందుగా శుక్రవారం తెల్లవారుజాము 2 గంటల ప్రాంతంలో ఛాంప్లిన్ పట్టణంలోని సెనేటర్ జాన్ ఇంటికి వెళ్లాడు. పోలీసు వాహనం, పోలీస్ అధికారి యూనిఫాం చూసి జాన్ తలుపు తీశారు. వెంటనే దుండగుడు లోనికి చొరబడ్డాడు. జాన్ దంపతులపై పలుమార్లు కాల్పులు జరిపి వచ్చిన కార్లోనే పారిపోయాడు. రక్తమోడుతున్న జాన్ దంపతులను పోలీసులు వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. పలు సర్జరీల తర్వాత కాస్త కోలుకున్నా వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం తెల్లవారుజామున 3.35 గంటలకు దుండగుడు బ్రూక్లిన్ పార్క్ పట్టణంలో హార్ట్మన్ ఇంటికెళ్లాడు. అతన్ని పోలీసుగా భ్రమించి లోపలికి రానిచ్చిన హార్ట్మన్ దంపతులపై కాల్పులు జరిపాడు. దాంతో వాళ్లు అక్కడిక్కడే మరణించారు. అదే సమయానికి సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు హార్ట్మన్ ఇంటివైపు వచ్చారు. ఇంట్లోంచి బయటికొస్తున్న దుండగుడు వారిపై కాల్పులకు దిగాడు. తర్వాత ఇంటి వెనుక తలుపు గుంఒడా పారిపోయాడు. ఇంటి ముందు నిలిపి ఉంచిన అతని కార్లో పలువురు చట్టసభస భ్యుల పేర్లతో కూడిన చీటీ పోలీసులకు దొరికింది. అబార్షన్ చేసే వైద్యులు, వాటిని సమ రి్థంచే లాయర్లు, పలు రాష్ట్రాల చట్టసభల సభ్యులు... ఇలా 70 మంది పేర్లు అందులో ఉన్నాయి. తూటాలున్న బ్యాగు కూడా దొరికింది. దుండగున్ని ప్రిటోరియన్ గార్డ్ సెక్యూరిటీ సంస్థలో సెక్యూరిటీ పెట్రోల్స్ విభాగం డైరెక్టర్ వాన్స్ బోల్టర్ (57)గా అనుమానిస్తున్నారు. అతనికోసం వేట మొదలెట్టారు. ఇవి రాజకీయ ప్రేరేపిత హత్యలేనని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఆరోపించారు. దుండగున్ని వెంటనే పట్టుకుంటామని చెప్పారు.‘నో కింగ్స్’ కరపత్రాలూ.. దుండగుని కారులో ‘నో కింగ్స్’ కరపత్రాలు కూడా కనిపించాయి. అక్రమ వలసదారుల అరెస్టులను నిరసిస్తూ మొదలైన ఉద్యమంలో భాగంగా అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘నో కింగ్ పేరిట ర్యాలీలు జరుగుతుండటం తెల్సిందే. కాల్పుల ఘటన నేపథ్యంలో మిన్నెసోటాలో ర్యాలీలను విరమించుకున్నారు. -
అమెరికాలో ఆగని రగడ
వాషింగ్టన్/అస్టిన్: అమెరికాలో వలసదారుల ఆందోళనలు, నిరసన కార్యక్రమాలతో ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. మరోవైపు ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) ఆధ్వర్యంలో అక్రమ వలసదారుల అరెస్టులు, గెంటివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని వాషింగ్టన్ డీసీలో శనివారం భారీ ఎత్తున మిలటరీ పరేడ్ జరుగనుంది. విదేశాల నుంచి అతిథులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ‘నో కింగ్స్’కార్యక్రమాలు నిర్వహించాలని, నిరసనలు ఉధృతం చేయాలని వలసదారులు నిర్ణయించారు. దాదాపు 2 వేల ప్రాంతాల్లో ర్యాలీలు చేపట్టేలా వ్యూహం రూపొందించారు. ఫిలడెల్ఫియాలో భారీ ర్యాలీకి సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొన్నిచోట్ల శాంతియుతంగానే జరుగుతున్నప్పటికీ, మరికొన్నిచోట్ల హింసాత్మకంగా మారుతున్నాయి. లాస్ ఏంజెలెస్, స్పాకేన్ సిటీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, ఒత్తిళ్లకు లొంగిపోయే ప్రసక్తే లేదని, ఇమ్మిగ్రేషన్ రైడ్స్, డిపోర్టేషన్లు యథాతథంగా కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. అక్రమ వలసదారులు దేశం విడిచి వెళ్లిపోవాలని, లేకపోతే బలవంతంగా పంపించక తప్పదని స్పష్టంచేసింది. అధికారులపై రాళ్లు, టపాకాయలతో దాడులు అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. లాస్ వెగాస్లో 94 మంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పలు అభియోగాలు మోపారు. బుధవారం రాత్రి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు 800 మంది వలసదారులు అధికారులపై విరుచుకుపడ్డారు. రాళ్లు, మంచినీటి సీసాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో నలుగురు అధికారులు గాయపడ్డారు. జనాన్ని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. మిషగాన్లో గురువారం ఆందోళనలు జరిగాయి. వందలాది మంది పార్క్ ప్లాజాలో గుమికూడారు. ట్రంప్ ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోశారు. తమను బలవంతంగా బయటకు వెళ్లగొట్టాలని చూస్తే చట్టపరంగా పోరాడుతామని హెచ్చరించారు. సియాటెల్ డౌన్టౌన్లో సైతం నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తమను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు పెప్పర్స్ప్రే చల్లారు. టపాకాయలు, రాళ్లు విసిరారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ను రద్దు చేయాలని నినదించారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని స్పాకేన్ సిటీలో 30 మందికిపైగా నిరసనకారులు అరెస్టయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో, అరిజోనా రాష్ట్రంలోని టక్సన్లో ఆందోళనలు శాంతియుతంగా జరుగుతున్నాయి. అలాస్కాలో 40 మంది వలసదారులను పోలీసులు నిర్బంధించారు. లాస్ ఏంజెలెస్లో గత వారం రోజుల్లో 470 మంది అరెస్టయ్యారు. న్యూజెర్సీలో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ను నిరసనకారులు చుట్టుముట్టారు. ఈ కేంద్రంలో చాలామంది అక్రమ వలసదారులను అధికారులు నిర్బంధించారు. వీరిని వినిపించేందుకు నిరసనకారులు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో న్యూజెర్సీలో వెయ్యి పడకలతో డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు. శనివారం ఆందోళనలు మరింత ఉధృతరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు రావడంతో పలు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్తగా నేషనల్ గార్డు దళాలను మోహరిస్తున్నారు. ‘నో కింగ్స్’ర్యాలీలకు అనుమతి లేదని గవర్నర్లు చెబుతున్నారు. హింస, విధ్వంసానికి పాల్పడేవారిపై త్వరగా విచారణ చేపట్టాలని అమెరికా న్యాయ శాఖ అన్ని రాష్ట్రాల అటారీ్నలకు గురువారం సందేశం పంపించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ట్రంప్ నిర్ణయానికి కోర్టు మద్దతు ఆందోళనలు అణచివేయడానికి లాస్ఏంజెలెస్కు 4 వేల నేషనల్ గార్డు దళాలను, 700 మంది మెరైన్ గార్డులను రంగంలోకి దించాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కాలిఫోరి్నయాకు నేషనల్ గార్డు సిబ్బందిని పంపించాలన్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఫెడరల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వును తొమ్మిదో యూఎస్ సర్క్యూట్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. ట్రంప్ నిర్ణయానికి పరోక్షంగా మద్దతు పలికింది. కోర్టు నిర్ణయంతో నేషనల్ గార్డు సిబ్బందికి అడ్డంకి తొలగిపోయింది. నిరసనకారులను ఎక్కడికక్కడ అరెస్టు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. -
Donald Trump: నచ్చితే ఒక రకంగా.. నచ్చకపోతే ఇలా..!
డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ పాటే వినాలనే పంతం. ఏ అంశాన్ని తీసుకున్నా ‘వామ్మో ట్రంప్’ అనుకోవాల్సిన పరిస్థితి. అటు సుంకాలు పెంపు దగ్గర్నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం.. ఇలా ప్రతీది ట్రంప్కు ముడిపడే ఉంది.ఇటీవల కాలంలో ట్రంప్ శాంతి మంత్రం జపిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం.. ఆపై భారత్, పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని తెగ చెప్పేసుకున్నారు. ఇది దొంగ జపమా.. నిజమైన తపనా?, ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడానికి ట్రంప్ ఇలా చేస్తున్నారనేది ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఉవ్విళూరుతున్నది ట్రంప్ నేతృత్వంలోని అమెరికా. ఎటువంటి ప్రయోజనం లేకుండా అగ్రరాజ్యం ఇలా చేస్తుందా అనేది కూడా మిలియన్ డాలర్ల ప్రశ్న.మరి ఇరాన్పై కక్ష ఎందుకు?ఇక్కడ ఇరాన్పై మాత్రం ట్రంప్ పగ కనబడుతూనే ఉంది. తాజాగా ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధాన్ని ట్రంప్ సమర్ధిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయిల్ ేచేసిన దాడి అద్భుతమని కొనియాడారు. అదే సమయంలో ఇంకా ఇరాన్పై దాడిని ఇజ్రాయిల్ పెంచాల్సిన అవసరం ఉందని కూడా నొక్కి చెప్పారు. మొన్నటి వరకూ రష్యా- ఉక్రెయిన్ల సుదీర్ఘ యుద్ధం, ఆపై భారత్-పాకిస్తాన్ల మధ్య జరిగిన యుద్ధం.. ప్రపంచానికి పెనుముప్పు అని కనువిప్పు కల్గించిన ట్రంప్.. ఇప్పుడు ఇజ్రాయిల్-ఇరాన్ల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా ట్రంప్కు నచ్చితే ఒక రకంగా, నచ్చకపోతే ఇలా వ్యవహరిస్తారనేది తాజా ప్రకటనతో తేటతెల్లమైంది. అణు ఒప్పందంపై ఇరాన్కు చాన్స్ ఇచ్చామని, కానీ దాన్ని వారు పట్టించుకోలేదన్నారు ట్రంప్. తమతో అణు ఒప్పందాన్ని చేసుకోవడానికి నిరాకరించారని, అందుకు తగిన ప్రతిఫలమే ఇజ్రాయిల్ చేసిన దాడి అంటూ ఏబీసీతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. వారు(ఇరాన్) ఇంకా మూల్యం చెల్లించుకుంటుందంటూ ఇజ్రాయిల్ చేస్తున్న దాడిని నేరుగా అభినందిస్తూ ఇరు దేశాలను మరింత రెచ్చగొట్టేలా మాట్లాడారు. తాము చెప్పిన మాట విననందుకు ఇరాన్ ఏమైపోయినా ఫర్వాలేదన్న వైఖరి ట్రంప్లో స్పష్టంగా కనబడుతోంది. ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారనేది తాజా పరిణామాలతో రుజువైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు.. ఎమర్జెన్సీ విధింపు..ఇజ్రాయెల్-ఇరాన్ రెండూ భారత్కు మిత్రదేశాలే, కానీ.. -
AMA తొలి భారతీయ ప్రెసిడెంట్గా శ్రీనివాస్ ముక్కామల రికార్డ్, ఎవరీ ‘బాబీ’
భారత సంతతికి చెందిన డాక్టర్ ముక్కామల శ్రీనివాస్ (Srinivas Mukkamala) అమెరికా వైద్యసంఘం ( AMA-American Medical Association) తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 179 సంవత్సరాల చరిత్రలో తొలిసారి ఎన్నికైన భారతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ “బాబీ” ముక్కామల రికార్డు సృష్టించారు. ఇటీవలి AMA వార్షిక సమావేశంలో ఆయన180వ అధ్యక్షుడిగా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇది అమెరికా వైద్య చరిత్రలో ఒక మైలురాయి అని అందరూ ప్రశంసిస్తున్నారు.ముక్కామల మిచిగాన్లోని ఫ్లింట్లో అనుభవజ్ఞుడైన ENT స్పెషలిస్ట్. రెండు దశాబ్దాలకు పైగా క్లినికల్ అనుభవం ఉన్న నిపుణుడు. ఆంధ్రప్రదేశ్ నుండి వలస వచ్చిన తల్లిదండ్రులకు 1972లో జన్మించారు. మెక్లారెన్ ఫ్లింట్ , హర్లీ మెడికల్ సెంటర్ వంటి అనేక ప్రముఖ ఆసుపత్రులతో ఆయనకు సంబంధం ఉంది. ఆయన మిచిగాన్ విశ్వవిద్యాలయ మెడిసిన్లో పట్టభద్రుడు. ఓటోలారిన్జాలజీ రంగంలో ఆయనకు మంచి పేరు ఉంది.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!స్వయంగా కేన్సర్ సర్వైవర్గత సంవత్సరం, ముక్కామలకు మెదడులోని టెంపోరల్ లోబ్లో 8-సెంటీమీటర్ల కణితి కనిపించింది. రోగ నిర్ధారణ జరిగిన మూడు వారాల తర్వాత హై-రిస్క్ సర్జరీ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్లో 90 శాతం కణితిని విజయవంతంగా తొలగించారు.ఆరోగ్య సంరక్షణ పట్ల అతని నిబద్ధతను బలోపేతం చేసేలా తాజా నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ప్రపంచ స్థాయి చికిత్స అందినప్పటీ లక్షలాది మందికి ఇలాంటి చికిత్సలో ఆలస్యం జరుగుతోందనీ, ఆర్థిక పరిమితులు, అనిశ్చితులను ఎదుర్కొంటున్నారని ముక్కామలకు హైలైట్ చేశారు. అలాగే చాలా మంది రోగులు తమ బీమా కవరేజీ వస్తుందా, లేదా మందులకు ఎంత ఖర్చవుతుంది, ఔషధానికి ,నిపుణుడిని చూడటానికి ఎంతకాలం వేచి ఉండాలో అనే భయాలు వెంటాడుతున్నాయని అన్నారు. ఈ అనుభవం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని శ్రీనివాస్ వెల్లడించారు. వైద్యుల హక్కులు, వనరుల కోసం పోరాడే వేదికగాఆధునిక టెక్నాలజీ వినియోగం ద్వారా ఆరోగ్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు మార్గం వేయనుందనీ, సమగ్ర ఆరోగ్య సంరక్షణకు, సమానత్వానికి ప్రాధాన్యత ఇస్తూ AMA ప్రాధాన్యతను పెంచుతుందని హామీ ఇచ్చారు. అలాగే AMA ప్రజారోగ్యంలో విస్తృతమైన సంస్కరణల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ముక్కామల అధ్యక్ష పదవిని చేపట్టడం విశేషం. అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల ప్రమాదాలు, సరైన పోషకాహారం ప్రాముఖ్యత గురించిఅవగాహన పెంచడానికి అసోసియేషన్ ఇటీవల ఒక విధానాన్ని స్వీకరించింది.ఇదీ చదవండి: అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్గతంలో ఏఎంఏ ఫౌండేషన్ నుంచి ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ లీడర్షిప్ అవార్డు (Excellence in Medicine Leadership Award )ను ఆయన అందుకున్నారు. 2009లో ఏఎంఏ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ పబ్లిక్ హెల్త్కు సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2017 నుంచి 2021 వరకు ఏఎంఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్ బాబీ తల్లిదండ్రులు 1970ల్లో ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. -
ప్రశ్నించినందుకు! ఈడ్చుకెళ్లి, బేడీలేసి..
అమెరికా రాజకీయాల్లో ఓ ఘటన కలకలం రేపింది. కాలిఫోర్నియా సెనేటర్, డెమొక్రటిక్ సభ్యుడు అలెక్స్ పాడిల్లా(Alex Padilla)తో భద్రతా సిబ్బంది ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. బలవంతంగా లాక్కెళ్లి మరీ ఆయన్ని నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి బేడీలు వేశారు అధికారులు. అమెరికా కాలమానం ప్రకారం.. గురువారం లాస్ ఏంజెల్స్లో హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ప్రెస్మీట్ నిర్వహించారు. గత వారం రోజులుగా అక్కడ వలసదారుల నిరసనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ఎంత మంది వివరాలు సేకరించారో గణాంకాలను నోయెమ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి ‘‘నా పేరు అలెక్స్ పాడిలా. సెనేటర్ని. సెక్రటరీకి నాదో ప్రశ్న అంటూ మాట్లాడబోయారు. ఇంతలో..URGENT BREAKING: Democrat US Senator Alex Padilla was just thrown to the ground and arrested for trying to speak at a DHS Press Conference by Secretary Kristi Noem. This is Trump’s America. This is so incredibly pathetic. I am so sad for the state of this country. pic.twitter.com/yI9fKdoYoW— Brian Krassenstein (@krassenstein) June 12, 2025అక్కడున్నన సిబ్బందిని ఆయన్ని బయటకు లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఆయనకు, వాళ్ల మధ్య పెనుగులాట జరిగింది. అనంతరం.. ఎఫ్బీఐ సిబ్బంది ఆయన్ని బలవంతంగా నేల మీద పడుకోబెట్టి.. చేతులు వెనక్కి విరిచి.. బేడీలు వేసి అదుపులోకి తీసున్నారు. అయితే కాసేపటికే ఆయన్ని అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.డీహెచ్ఎస్ ఈ చర్యలను సమర్థించుకుంది. పాడిల్లాను దాడి చేయడానికి వచ్చిన వ్యక్తిగా భావించి అధికారులు అలా ప్రవర్తించారని చెప్పుకొచ్చింది. ఆయన చర్యను పొలిటికల్ డ్రామాగా అభిర్ణించింది. అయితే కాసేపటికే ఆయన్ని విడుదల చేశామని, నోయెమ్-పాడిల్లా 15 నిమిషాలపాటు భేటీ అయ్యారని ప్రకటించింది. మరోవైపు ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో కూడా తమ సిబ్బంది చర్యను వెనకేసుకొచ్చారు. ఈ ఘటనపై అలెక్స్ పాడిల్లా స్పందించారు. ఒక సెనేటర్ విషయంలోనే ఇలా జరిగితే.. సాధారణ వర్గాల ప్రజలతో ఇంకెలా వ్యవహరిస్తారో? అని నిలదీశారాయన. వలసవాదులతో ఎలా వ్యవహరిస్తున్నారో.. ఈ దేశ పౌరులతోనూ అలాగే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. మరోవైపు డెమొక్రటిక్ పార్టీ నేతలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ట్రంప్ పాలనలో ఇలాంటి దుర్మార్గాలు కూడా మొదలయ్యాయ వ్యాఖ్యానిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కమలా హారిస్, సెనేట్లో మైనారిటీ నేత చుక్ షూమర్ తదితరులు ఈ ఘటనను ఖండించారు. ఇంకోవైపు రిపబ్లికన్ పార్టీలోనూ ఈ ఘటనపై పలువురి నుంచి ప్రతికూల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించాల్సి ఉంది. -
ఆపరేషన్ రైజింగ్ లయన్.. రేడియేషన్ రిలీజ్ అయ్యిందా?
ఆపరేషన్ రైజింగ్ లయన్.. అప్డేట్స్అణు ధార్మికత విడుదలైందా?ఇరాన్ న్యూక్లియర్ సెంటర్లపై ఇజ్రాయెల్ దాడులుకీలక స్థావరాలను నాశనం చేసినట్లు ప్రకటించుకున్న ఇజ్రాయెల్అందులో నతాంజ్, ఇస్ఫహాన్, బుషెహర్ కేంద్రాలు కూడాదీంతో రేడియేషన్ విడుదలైందంటూ ప్రచారంఖండించిన యూఎన్ విభాగం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీఎలాంటి అణు ధార్మికత విడుదల కాలేదని ఐఏఈఏ స్పష్టీకరణఅణు కేంద్రాలకు పెద్దగా నష్టమూ వాటిల్లలేదని ప్రకటన ఒక్క విమానం తిరగట్లేదు!!ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో గంభీరంగా గగనతలంఇజ్రాయెల్, ఇరాన్తో పాటు జోర్డాన్ మీదుగా సంచరించని విమానం విమానాలు తిరకపోవడాన్ని ధృవీకరించిన ఫ్లైట్రాడర్24As has been the case during previous hostilities between Iran and Israel, Jordan has also closed its airspace to flights. NOTAM read JORDAN AIRSPACE CLSD DUE TO OPS REASONS pic.twitter.com/JIWDUVhJjk— Flightradar24 (@flightradar24) June 13, 2025 ఇరాన్ ఎయిర్ డిఫెన్స్పై దాడి పూర్తి!ఇరాన్ వైమానిక దళంపై దాడి పూర్తైందని ప్రకటించిన ఇజ్రాయెల్ఇరాన్ పంపిన డ్రోన్లను నేలకూల్చినట్లు ప్రకటించిన ఐడీఎఫ్ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై భారత్ ఆందోళన ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ముగ్గురు సైనికాధికారులు, పలువురు సైంటిస్టులు దుర్మరణంప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ఇరు దేశాల ఉద్రిక్తతలపై భారత్ ఆందోళనరెండు మిత్రదేశాలేనని స్పష్టీకరణఅయితే ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దూరంగా ఉండాలని కోరిన భారత్దౌత్య మార్గాన చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచనఅంతకు ముందు.. ఇరాన్లోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ👉పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులు మొదలుపెట్టిన ఇరాన్వంద డ్రోన్లతో ఇజ్రాయెల్పై విరుచుకుపడిన ఇరాన్ సైన్యండ్రోన్ దాడుల్ని తిప్పికొడుతున్న ఇజ్రాయెల్ఇరాన్ అణు ముప్పు తొలగించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టిన ఇజ్రాయెల్ఇరాన్ మిలిటరీ చీఫ్, ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్, మరికొందరు అగ్ర అణు సైంటిస్టుల దుర్మరణం ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇరాన్ సుప్రీం ఖమేనీగంటల వ్యవధిలోనే ఇరాన్ కౌంటర్ ఎటాక్స్ఇజ్రాయెల్-ఇరాన్ పరస్పర దాడులతో అట్టుడుకున్న పశ్చిమాసియాఆపరేషన్ రైజింగ్ లయన్పై నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్పై ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ దాడులుమళ్లీ రగులుతున్న పశ్చిమాసియాఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కీలక ప్రకటన ఇరాన్ ముప్పును తిప్పి కొట్టేందుకే ఈ సైనిక చర్యఇరాన్ అణు కార్యక్రమానికి గుండె కాయ లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశాంనంతాజ్లోని అణు శుద్ధి కేంద్రాన్ని పూర్తిగా నాశనం చేశాంటెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి ప్రోగ్రాంకు కారణమైన కేంద్రాలను ధ్వంసం చేశాంఅగ్ర అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాంఇటీవలె అధిక మొత్తంలో శుద్ధి చేసిన యురేనియంను తయారు చేసిన ఇరాన్ఆ యురేనియంతో 9 అణు బాంబులు తయారు చేసే కెపాసిటీఇరాన్ను ఇప్పుడు ఆపకపోతే పెను ముప్పు తప్పదుముప్పును పూర్తిగా తొలగించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందన్న నెతన్యాహు 1980 తర్వాత..ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులుఇప్పటికే 30-40 యుద్ధ విమానాలతో విరుచుకుపడిన ఇజ్రాయెల్ సైన్యంఅణు కేంద్రాలతో పాటు మిస్సైల్స్ స్థావరాలపైనా కొనసాగుతున్న దాడులు1980 ఇరాన్-ఇరాక్ యుద్ధం తర్వాత ఇరాన్ అణుస్థావరాలపై దాడి జరగడం ఇదేఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ జనరల్ హోసెయిన్ సలామీ మృతిదాడుల్లో ఇరాన్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి, మరికొందరు అణు శాస్త్రవేత్తలు మృతి చెందినట్లు సమాచారం #BREAKING Iran armed forces chief of staff Mohammad Bagheri killed in Israel attack, reports state TV pic.twitter.com/nlGlzZmLqT— AFP News Agency (@AFP) June 13, 2025ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటాం: అయతొల్లా ఖమేనీ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు దాడుల్లో మృతి చెందిన ఇరాన్ మిలిటరీ చీఫ్, పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధిపతిఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీకఠిన శిక్ష తప్పదని ఇజ్రాయెల్ను హెచ్చరించిన ఖమేనీ With this crime, the Zionist regime has prepared for itself a bitter, painful fate, which it will definitely see.— Khamenei.ir (@khamenei_ir) June 13, 2025 ఇరాన్ గగన తలం నుంచి విమానాల మళ్లింపుఇరాన్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులుదాడుల నేపథ్యంలో పలు విమానాల దారి మళ్లింపుఎయిరిండియాకు చెందిన 16 విమానాలను దారి మళ్లించినట్లు సమాచారం. దాడులకు ముందు ట్రంప్ పోస్టు వైరల్ఇరాన్పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించి అణు స్థావరాలపై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్దీనికి కొన్ని గంటల ముందు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ఇరాన్ న్యూక్లియర్ సమస్యను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించిన ట్రంప్ఇరాన్ గొప్ప దేశమే కావొచ్చు.. కానీ అణ్వాయుధాలు కలిగి ఉండాలనే ఆశను వదులుకోవాలని వ్యాఖ్యఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభంఇరాన్పై సైనిక చర్య ప్రారంభించిన ఇజ్రాయెల్ఆపరేషన్ రైజింగ్ లయన్ మొదలుపెట్టినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుఇరాన్ అణు ముప్పును తొలగించేందుకేనని స్పష్టీకరణఇజ్రాయెల్ సైనిక చర్యతో తమకు సంబంధం లేదని ప్రకటించిన అమెరికా -
ఏ క్షణంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు.. ‘ట్రంప్ చెప్పినా వెనక్కి తగ్గబోం’
జెరుసలేం: పశ్చిమాశియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది. ఈ క్రమంలో ఏ సమయంలోనైనా ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయొచ్చంటూ అమెరికన్ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ దాడి ఆపాలంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు. నెతన్యాహు మాత్రం ఇరాన్పై దాడి విషయంలో వెనక్కి తగ్గబోమని తేల్చేశారు. ఈ నేపథ్యంలో, అమెరికా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇజ్రాయెల్ త్వరలోనే ఇరాన్పై దాడి చేయనుందని.. ఈ దాడి అమెరికా అనుమతి లేకుండానే జరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. ఇరాన్- అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. ఆ చర్చలు విఫలమైతే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి చేయనున్నట్లు కథనాలు హైలెట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్లో ఉన్న అమెరికన్లు తిరిగి సొంత దేశం వచ్చేయాలంటూ ట్రంప్ పిలుపునిచ్చారు. అక్కడి నుంచి అమెరికన్ సిబ్బందిని తరలించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ప్రముఖ మీడియా హౌస్ ఆక్సియోస్ నివేదిక ప్రకారం.. ఇరాన్తో అమెరికా అణుఒప్పందం కుదుర్చుకునేందుకు గత కొంత కాలంగా చర్చలు జరుపుతూ వస్తోంది. తాజాగా జరిపే చర్చలు విఫలమైతే.. ఇరాన్పై దాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని ట్రంప్ అనుమతి కోరననున్నారు.ఇజ్రాయెల్ హెచ్చరికలపై ఇరాన్ సైతం అదే రీతిలో బదిలిస్తోందని ఆదేశ ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్జాదె హెచ్చరించారు. ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. అమెరికా మిలిటరీ బేసులపై నేరుగా దాడులు చేస్తామని పునరుద్ఘాటించారు. ఇరాన్ హెచ్చరికలతో అమెరికా విదేశాంగ శాఖ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో ఉన్న దౌత్య కార్యాలయాల్లో అత్యవసర చర్యల కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మధ్యప్రాచ్యం, తూర్పు యూరోప్, ఉత్తర ఆఫ్రికాలోని యుఎస్ దౌత్య కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు పంపించాయి. అంతేకాక, బహ్రెయిన్, కువైట్ వంటి ప్రాంతాల నుంచి అవసరం లేని సిబ్బందిని స్వచ్ఛందంగా వెనక్కు పంపేందుకు అనుమతి ఇచ్చింది.అమెరికా మిలిటరీ బేసులు ప్రస్తుతం ఇరాక్, కువైట్, ఖతార్, బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇటువంటి సున్నితమైన పరిస్థితుల్లో ఇజ్రాయెల్ నిర్ణయంతో పశ్చిమాసియా దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలతో భయాందోలన నెలకొంది. -
భారత్కు కొత్త టెన్షన్!.. పాక్కు అండగా అమెరికా భారీ ప్లాన్?
వాషింగ్టన్: భారత్, పాకిస్తాన్ విషయంలో అగ్ర రాజ్యం అమెరికా.. మరోసారి తన వక్రబుద్దిని చాటుకుంది. అమెరికాకు భారత్ మిత్ర దేశం అంటూనే.. వెనుక మాత్రం గోతులు తీసే ప్లాన్ చేస్తోంది. ఓవైపు పాక్ ఉగ్రవాదంపై భారత్ ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడిస్తుంటే.. అమెరికా మాత్రం దాయాదికి మద్దతు పలికింది. పాకిస్తాన్పై అమెరికా అధికారి ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశంగా మారింది.అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్తాన్ ఓ అసాధారణ భాగస్వామి అంటూ ప్రశంసించారు. ఐసిస్, ఖొరాసన్కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్లో పాక్ పాత్రను ఆయన కొనియాడారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పాత్ర గురించి వివరించారు. అందుకే అమెరికా భారత్తోపాటు పాకిస్తాన్తో సత్సంబంధాలను కలిగి ఉండాలని నొక్కి చెప్పారు. భారత్తో అమెరికా సంబంధం ఉన్నంత మాత్రాన పాకిస్తాన్తో సంబంధం ఉండకూడదని తాను అనుకోవడం లేదని ప్యానెల్ సభ్యుల ముందు వెల్లడించారు. తమకు భారత్, పాకిస్తాన్ రెండు దేశాలతోనూ సంబంధాలు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి."Pakistan has been a phenomenal counter-terrorism partner for America," argues General Michael Kurilla pic.twitter.com/VOzTy8vVli— Shashank Mattoo (@MattooShashank) June 11, 2025కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్తాన్ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది. అమెరికా తీరు సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ అలర్ట్ అయినట్టు తెలుస్తోంది."Ties with India cannot cost ties with Pakistan" General Michael Kurilla commander of United States Central Command.Seems the news about Indian Missiles ripping US’s Fissile materials and Nuclear Warhead at Nur Khan Air Base is proving to be True. pic.twitter.com/Ffp7lVdltS— BRADDY (@braddy_Codie05) June 11, 2025అమెరికా భారీ స్కెచ్..ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్ను కోరనుంది. అయితే, అమెరికా ఆర్మీ డేకు పాక్ ఛీఫ్ను పిలవడం వెనుక అమెరికా ఉద్దేశమేంటనే చర్చ నడుస్తోంది. మొన్నటి వరకు తమ మద్దతు భారత్కే అంటూ చెప్పిన అమెరికా ఇప్పుడు ఇలా ప్లేట్ ఫిరాయించడం వెనుక ఉద్దేశం ఏంటో తెలియడం లేదు. అయితే, దీని వెనుక అగ్రరాజ్యం పెద్ద ప్లాన్ వేసిందని చెబుతున్నారు. దీంతో పాటుగా చైనా, పాక్ మధ్య పెరుగుతున్న ఆర్థిక, సైనిక సంబంధాలను కూడా దెబ్బ తీయాలని అమెరికా భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
యూఎస్లో లాటిన్ రగడ
వలసదారుల రగడతో అమెరికా భగ్గుమంటోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే క్రమంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన చర్యలు వివాదాలకు దారితీస్తున్నాయి. మెక్సికో వంటి లాటిన్ అమెరికా దేశాల వలసదారులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్రమ వలసదారులనే అభియోగాలతో లాస్ ఏంజెలెస్లో గత శుక్రవారం పదుల సంఖ్యలో లాటిన్ ప్రజలను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ (ఐసీఈ) విభాగం అరెస్టు చేసింది. వాటిని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళనలు చూస్తుండగానే తీవ్ర రూపు దాలుస్తున్నాయి. లాటిన్లు భారీ సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలకు విధ్వంసానికి పాల్పడుతున్నారు. జాతీయ బలగాల మోహరింపు, మూకుమ్మడి అరెస్టులతో కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. అల్లర్లు ఇతర నగరాలకూ విస్తరిస్తుండటంతో లాస్ ఏంజెలెస్లో తాజాగా కర్ఫ్యూ విధించాల్సి వచి్చంది. ఈ నేపథ్యంలో అమెరికాలో మొత్తం అక్రమ వలసదారులు, వారిలో లాటిన్ అమెరికన్లు ఎందరన్న దానిపై చర్చ జరుగుతోంది. అంతటా మెక్సికన్ జెండాలే! లాస్ ఏంజెలెస్ అల్లర్లలో పాల్గొంటున్న నిరసనకారుల్లో ఎవరి చేతుల్లో చూసినా మెక్సికో జెండాలే కన్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలవారికి కలల గమ్యస్థానం అమెరికా. దాంతో అనేక దేశాల నుంచి వలసదారులు అక్కడికి సమక్రమ, అక్రమ మార్గాల్లో పోటెత్తుతూ వచ్చారు. 2022 గణాంకాల ప్రకారమే అమెరికాలో కోటి 10 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులున్నారు. వారిలో ఏకంగా 77 శాతం, అంటే 79 లక్షల పై చిలుకు లాటిన్ అమెరికన్లే. వారిలోనూ ఏకంగా 41 లక్షలతో మెక్సికో తొలిస్థానంలో ఉంది. సెంట్రల్ అమెరికా దేశాల వారు 21 లక్షలు, దక్షిణ అమెరికా నుంచి 10 లక్షలు, కరీబియన్ దీవుల నుంచి 7.3 లక్షల మంది ఉన్నారు. మరోవైపు మూడేళ్లుగా అమెరికాకు వెళ్తున్న శరణార్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. 2016లో 85 వేలుగా నమో దైన శరణార్థులు 2021 నాటికి 11 వేలకు తగ్గారు. కానీ 2024లో ఏకంగా లక్ష మంది పొట్ట చేతపట్టుకుని అమెరికాలో ప్రవేశించారు. వీరిలో ఆఫ్రికా, దక్షిణాసియా దేశాల వారి సంఖ్యే ఎక్కువ. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చైనాతో డీల్: ట్రంప్
బీజింగ్/వాషింగ్టన్: అమెరికా, చైనా నడుమ రెండు నెలల వాణిజ్య యుద్ధానికి ఇక తెరపడ్డట్టే. ఇరుదేశాల మధ్య వర్తక ఒప్పదం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘లండన్లో రెండు రోజుల సంప్రదింపుల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇక నేను, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తుది ఆమోదముద్ర వేయడమే తరువాయి’’ అని ఆయన వెల్లడించారు. ఈ మేరకు ట్రూత్సోషల్లో ట్రంప్ పోస్ట్ చేశారు. ఇకపై చైనా దిగుమతులపై అమెరికా 55 శాతం సుంకాలు విధిస్తుంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 10 శాతం టారిఫ్లు వసూలు చేస్తుంది’’ అని వివరించారు. విభేదాలు ముదిరిన నేపథ్యంలో అమెరికాకు మ్యాగ్నెట్లు మొదలుకుని 17 రకాల అరుదైన ఖనిజాలు తదితరాల ఎగుమతులపై నిషేధాన్ని కూడా చైనా ఎత్తేయనుందని తెలిపారు. ‘‘బదులుగా చైనాకు కూడా గత ఒప్పందాల మేరకు అన్ని విషయాల్లోనూ తలుపులు తెరుస్తాం. చైనా విద్యార్థులను అమెరికా కాలేజీలు, యూనివర్సిటీలు, ఇతర విద్యా సంస్థల్లోకి ఎప్పట్లాగే సాదరంగా ఆహ్వానిస్తాం’’ అని ప్రకటించారు. ‘‘ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. ఇరుదేశాలకూ లాభదాయక రీతిలో ఒప్పందం కుదిరింది’’ అంటూ హర్షం వెలిబు చ్చారు. అంతర్జాతీయ ఇంధన సంస్థ అంచనాల ప్రకారం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మొత్తం అరుదైన ఖనిజ నిల్వల్లో 61 శాతం, ఉత్పత్తిలో ఏకంగా 91 శాతం వాటా చైనాదే. -
లూటీ.. విధ్వంసం.. కర్ఫ్యూ
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నగరంలో సరైన పత్రాలులేని వలసదారుల అరెస్ట్లతో మొదలైన ఆందోళనలు మరింత తీవ్రరూపం దాల్చాయి. మంగళవారం రాత్రి ఆందోళనకారులు వేల సంఖ్యలో పాల్గొని తమ ఉద్యమాన్ని మరింత ఉధృతంచేశారు. అయితే దీనిని అదునుగా చూసుకుని కొందరు దుండగులు ముసుగులు ధరించి లాస్ఏంజెలెస్ డౌన్టౌన్లో లూటీలకు తెరలేపారు. యాపిల్ ఐఫోన్ స్టోర్సహా పలు దుకాణాలపై దాడులు చేసి లూటీలు చేశారు. విలువైన వస్తువులను అందినకాడిని దోచుకెళ్లారు. ఉద్యమంవేళ యథేచ్ఛగా లూటీలు, విధ్వంసం జరగడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దుకాణ సముదాయాల నుంచి పారిపోతున్న ముసుగు ధరించిన దుండగులను అరెస్ట్చేశారు. పలువురు ఆందోళనకారులను సైతం అరెస్ట్ చేసినట్లు వార్తలొచ్చాయి. దుకాణాలను యువకులు లూటీలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారాయి. గత నాలుగు రోజుల్లో మొత్తంగా 23 పెద్ద వ్యాపార సముదాయాలు లూటీకి గురయ్యాయని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ చెప్పారు. నగరంలో తాత్కాలిక కర్ఫ్యూస్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటలదాకా పాక్షిక కర్ఫ్యూను విధిస్తున్నట్లు మేయర్ కరెన్ ప్రకటించారు. ప్రతిరోజూ ఇదే సమయానికి కర్ఫ్యూను అమలుచేయనున్నారు. ఇలా కొద్దిరోజులపాటు పాక్షిక కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. లూటీలు, విధ్వంసానికి పాల్పడిన వారికి గుర్తిస్తూ పోలీసులు అరెస్ట్లపర్వాన్ని మొదలెట్టారు. అడ్డొచ్చిన వారిపైకి రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. డౌన్టౌన్ జిల్లాలోని ఆర్ట్స్ డిస్ట్రిక్, చైనా టౌన్, స్కిడ్ రో, ఫ్యాషన్ డిస్ట్రిక్ ప్రాంతాల్లో కర్ఫ్యూను అమలుచేశారు. కర్ఫ్యూ మొదలయ్యాక కనీసం 200 మందిని పోలీసులు అరెస్ట్చేశారని మేయర్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ 2,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించగా అత్యధిక లూటీలు, విధ్వంసం జరిగిన 2.5 చదరపు కిలోమీటర్ల పరిధిలోనే రాత్రి కర్ఫ్యూను అమలుచేస్తామని నగర పోలీస్ చీఫ్ జిమ్ మెక్డోనెల్ చెప్పారు. నగరంలో మరింత ఉద్రిక్తంగా మారడానికి ట్రంప్ ‘నేషనల్ గార్డ్’ తరలింపు’ నిర్ణయమే కారణమని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆరోపించారు. సైనికఛత్రంలోకి నగరాన్ని ఇరికించి సమస్యను జటిలంచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై ట్రంప్ స్పందించారు. ‘‘ఆందోళనకారులు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. దేశానికి శత్రువుల్లా తయారయ్యారు. అల్లరిమూకల అరాచకత్వం ఇక ఎంతమాత్రం సాగనివ్వను. అవసరమైతే తిరుగుబాటు అణచివేత చట్టం,1807ను తీసుకొచ్చి యావత్ సైన్యాన్ని రాష్ట్రంలోకి దింపుతా. లాస్ ఏంజెలెస్లో ఇలాగే అల్లర్లు, ఆందోళనలు కొనసాగితే సిటీని రాష్ట్ర పాలన పరిధి నుంచి తప్పించి కేంద్రప్రభుత్వ అధీనంలోకి తీసుకొస్తా’’ అని శ్వేతసౌధంలో ట్రంప్ హెచ్చరించారు.కోర్టులో గవర్నర్కు చుక్కెదురున్యూయార్క్ గవర్నర్ అనుమతిలేకుండా అసా ధారణ అధికారాలతో లాస్ ఏంజెలెస్లోకి నేషనల్ గార్డ్, మెరైన్లను పంపుతూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను తక్షణం నిలుపుదలచేయాలన్న న్యూయార్క్ అటార్నీ అభ్యర్థనను జడ్జి తిరస్కరించారు. ఈ అంశాన్ని గురువారం మరోసారి పరిశీలిస్తామని శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా కోర్టు జడ్జి చార్లెస్ బ్రేయర్ చెప్పారు. మరోవైపు భద్రతా బలగాల మోహరింపు మున్ముందు మరింత ఎక్కువగా ఉంటుందని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చెప్పారు. ఇప్పటికే నేషనల్గార్డ్, మెరైన్లను రప్పించినందుకు ఏకంగా రూ.1,146 కోట్లు ఖర్చయిందని ఆయన వెల్లడించారు. అక్రమవలసదారుల కోసం గాలింపు, అరెస్ట్ విధుల్లో ఉన్న ఫెడరల్ ఏజెంట్లు, ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ అధికారుల రక్షణ, కేంద్రప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యతలను మాత్రమే నేషనల్ గార్డ్లకు అప్పగించడంతో వాళ్లు ఆందోళనకారులను అరెస్ట్చేయట్లేదు. అరెస్ట్చేసే అధికారం వీళ్లకు లేదు. దీంతో నిరసనకారులు రెచ్చిపోతున్నారు. ఈ సందర్భంగానే ముసుగు ధరించిన ఆగంతకులు లూటీలు చేయగలిగారు.ఇతర నగరాల్లో ఆందోళనలుకర్ఫ్యూతో లాస్ ఏంజెలెస్లో ఉద్రిక్తత రాత్రివేళ కాస్తంత తగ్గుముఖం పట్టినా ఇతర నగరాల్లో మాత్రం ఉధృతంగా కొనసాగుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో మొదలు సియాటెల్, న్యూయార్క్, షికాగో, డెన్వర్, శాంటా అనా, ఆస్టిన్, డాలస్, బోస్టన్, వాషింగ్టన్ డీసీదాకా చాలా ప్రధాన నగరాల్లో వందలాది మంది ఆందోళనకారులు రోడ్లపైకి చేరి ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమాలు కొనసా గిస్తున్నారు. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు తక్కువ ప్రాణహాని ఉండే ఉపకరణాలనే వాడుతున్నారు. భాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రే, టేజర్, లాఠీలు, జల ఫిరంగులు, చెవులు చిల్లులు పడే శబ్దాలు వెదజల్లే పరికరాలు, రబ్బర్బుల్లెట్లు బీన్–బ్యాంగ్ రౌండ్లను ప్రయోగిస్తున్నారు.టిక్టాక్ స్టార్పై బహిష్కరణ వేటు16.24 కోట్ల మంది టిక్టాక్ ఫాలోవర్లు ఉన్న ప్రఖ్యాత ఇన్ఫ్లుయెన్సర్ ఖబీ లేబ్ను సైతం అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు దేశం నుంచి వెళ్లగొట్టారు. వీసా గడువు ముగిశాక సైతం అమెరికా ఉంటున్నందుకు ఆయనపై బహిష్కరణ వేటు వేశారు. దీంతో ఆయనే స్వయంగా అమెరికాను వీడారని వార్తలొ చ్చాయి. సెనెగల్– ఇటాలియన్ మూలాలున్న ఇతను చేసే టిక్టాక్ వీడియో లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇతను యూనిసెఫ్ గుడ్విల్ అంబాసి డర్గా ఉన్నారు. మరోవైపు టెక్సాస్ రాష్ట్రంలోనూ నేషనల్ గార్డ్లను రప్పించామని ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ చెప్పారు. -
మస్క్ ‘కాల్పుల విరమణ’!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది. వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు. ట్రంప్–మస్క్ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు. ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ట్రంప్–మస్క్ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు. ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు. ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి. -
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన ఎలాన్ మస్క్.. యూటర్న్ ఇలా..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులను ప్రపంచమంతా చూసింది. వీరిద్దరి వ్యవహార శైలితో ఏమి జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళనకు గురయ్యారు. అయితే ఇప్పుడు దీనికి భిన్నమైన సంగతి ఆసక్తికరంగా మారింది. బిలియనీర్ ఎలాన్ మస్క్ తాజాగా తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చేసిన పోస్ట్లలో కొన్నింటిపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘గత వారం అధ్యక్షుడు @realDonaldTrump గురించి నేను చేసిన కొన్ని పోస్ట్ల విషయంలో చింతిస్తున్నాను. అవి చాలా దుమారం రేపాయి’ అని మస్క్ ‘ఎక్స్’లో రాశారు. I regret some of my posts about President @realDonaldTrump last week. They went too far.— Elon Musk (@elonmusk) June 11, 2025ట్రంప్ పరిపాలనా విభాగం తీసుకువచ్చిన కీలక వ్యయ బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తరువాత వీరిద్దిరి మధ్య వైరం మరింత ముదిరింది. దేశీయ ఎజెండాకు మద్దతునిచ్చే వ్యయ బిల్లుకు సహకరించే రిపబ్లికన్ చట్టసభ సభ్యులపై రాజకీయ ప్రతీకారం తీర్చుకోవాలని మస్క్ పిలుపునివ్వడం అధ్యక్షుడు ట్రంప్కు ఆగ్రహం కలిగించింది. ట్రంప్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బడ్జెట్ బిల్లుకు ఓటు వేసే రిపబ్లికన్లపై చర్యకు ప్రయత్నిస్తే, తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని తన మాజీ సలహాదారు ఎలాన్ మస్క్ను హెచ్చరించారు.ఇది కూడా చదవండి: ‘హనీమూన్’ కేసు: ‘కొండ మీంచి తోసేస్తా’.. సోనమ్ ‘ప్లాన్ బీ’ -
భారత విద్యార్థిపై అమెరికా అరాచకం.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: భారత విద్యార్థిని నేలపై పడేసి, పెడరెక్కలు వెనక్కు విరిచి కట్టి బేడీలు వేయడాన్ని అమెరికా సమర్థించుకుంది. ‘‘అతనిపై అలాంటి చర్యలు తీసుకోవడంలో తప్పేమీ లేదు. అమెరికాలోకి అక్రమ ప్రవేశాలను, వీసా ఉల్లంఘనలను సహించే ప్రసక్తే లేదు’’ అని ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. కాకపోతే బాధిత విద్యార్థి ఎటువంటి వీసా ఉల్లంఘనకు పాల్పడిందీ వివరించలేదు.శనివారం రాత్రి భారత్కు తిప్పి పంపించే క్రమంలో సదరు విద్యార్థి పట్ల నెవార్క్ విమానాశ్రయంలో పోలీసులు, భద్రతా సిబ్బంది అత్యంత అనుమాషంగా వ్యవహరించడం తెలిసిందే. తాను నేరగాన్ని కాదని బాధితుడు అరుస్తున్నా పట్టించుకోలేదు. కునాల్ జైన్ అనే ప్రవాస భారతీయుడు దీన్నంతటినీ వీడియో తీసి ఎక్స్లో పంచుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిస్సహాయుడైన ఒక అమాయకున్ని కరడుగట్టిన నేరస్తునిలా చూశారంటూ ఆయన ఆవేదన వెలిబుచ్చారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నా అమెరికా మాత్రం సమర్థించుకోవడం గమనార్హం.I witnessed a young Indian student being deported from Newark Airport last night— handcuffed, crying, treated like a criminal. He came chasing dreams, not causing harm. As an NRI, I felt helpless and heartbroken. This is a human tragedy. @IndianEmbassyUS #immigrationraids pic.twitter.com/0cINhd0xU1— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025‘‘చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే పర్యాటకులకు ఎప్పుడూ స్వాగతం పలుకుతాం. కానీ ఎవరికైనా సరే, మా దేశంలోకి ప్రవేశం ఒక హక్కు కాదని గుర్తుంచుకోవాలి’’ అంటూ దౌత్య కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ ఉదంతంపై న్యూయార్క్లోని భారత కాన్సులేట్ స్పందించింది. ‘‘దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులను చూశాం. దీనిపై స్థానిక అధికారులతో సంప్రదిస్తున్నాం’’ అని భారత కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పేర్కొన్నారు. భారతీయుల సంక్షేమానికి కాన్సులేట్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ విద్యార్థులపై ట్రంప్ సర్కారు కొన్నాళ్లుగా కొరడా ఝళిపిస్తుండటం తెలిసిందే. ట్రాఫిక్ ఉ ల్లంఘనల వంటి చిన్నాచితకా కారణాలకు కూడా కనీసం ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే వీసాలు రద్దు చేసి స్వదేశాలకు పంపించేస్తోంది. వీటిపై అక్కడి కోర్టులో న్యాయ పోరాటాలు కూడా సాగుతున్నాయి.Yes, I offered to help pacify the situation, but unfortunately, they called more police and humiliated that poor guy. pic.twitter.com/kHBGoAG8fk— Kunal Jain (@SONOFINDIA) June 8, 2025ట్రంప్తో మోదీ మాట్లాడాలి: కాంగ్రెస్ ఈ ఉదంతంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. భారత విద్యార్థులపై అమెరికాలో నిర్బంధం నానాటికీ పెరిగిపోతోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ గడ్డపై భారత్, భారతీయుల గౌరవ మర్యాదలను కాపాడటంతో మోదీ ప్రభుత్వం వరుసగా విఫలమవుతూ వస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలి. తక్షణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడి వీటికి ఫుల్స్టాప్ పెట్టించాలి’’ అని డిమాండ్ చేశారు. -
ట్రంప్ ‘ఫెడరల్’ పరీక్ష!
వలసలను అరికట్టి తీరతానని వాగ్దానం చేసి గద్దెనెక్కిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అందుకోసం ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడుతున్నారు. క్యాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ఏంజెలెస్ నగరంలోని ఒక ప్రాంతంలో అక్రమ వలసదారుల ఏరివేతకు వచ్చిన ప్రతిఘటన సాకుతో ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆ రాష్ట్రం అనుమతి లేకుండా ఆదివారం కేంద్ర బలగాలను పంపారు. డెమాక్రటిక్ ఏలుబడిలోని ఆ రాష్ట్రానికి అలా సవాలు విసిరారు. దీన్ని తీవ్రంగా తప్పుబట్టిన గవ ర్నర్ గావిన్ న్యూసమ్ను అరెస్టు చేయిస్తానని, ఆ రాష్ట్రానికి నిధులు నిలిపేస్తానని హెచ్చరించారు. అందుకు ప్రతిగా క్యాలిఫోర్నియా నుంచి పన్నుల రూపంలో ఫెడరల్ ప్రభుత్వానికి వెళ్లే 8,000 కోట్ల డాలర్ల నిధుల్ని ఆపేస్తామని న్యూసమ్ జవాబిచ్చారు. అంతేకాదు... చట్టవిరుద్ధంగా ఫెడరల్ బలగాలను పంపిన ట్రంప్ తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు. మొత్తానికి అమల్లో ఉన్న వలస విధానంపై కొన్నేళ్లుగా అంతర్గతంగా రాజుకుంటున్న అసంతృప్తి క్యాలిఫోర్నియాలో భళ్లున బద్దలైంది. నాలుగు లక్షల కోట్ల డాలర్ల జీడీపీతో సొంతంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోనే నాలుగో స్థానాన్ని ఆక్రమించగలిగిన క్యాలిఫోర్నియాలో అపరిమితమైన సంపద ఉన్నట్టే దాన్ని ఆశ్రయించి వలసలూ అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో నుంచి ఏటా వచ్చే వేలాదిమంది అక్కడ చిన్నాచితకా పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటారు. స్థానికంగా ఉండే శ్వేత జాతి అమెరికన్లకు ఈ వలసలపై ఆగ్రహావేశాలున్నాయి. దీన్ని సకాలంలో సరిచేయటంలో డెమాక్రాట్లు విఫలమైన కారణంగానే ట్రంప్ వంటి దూకుడైన నేత అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించారు. వర్తమాన స్థితిని ఇలాగే కొనసాగనీయదల్చుకుంటే ట్రంప్ ప్రత్యేకతేముంది? దీన్ని సాకుగా తీసుకుని మరింత ముందుకు చొచ్చుకుపోయేందుకు ఆయన రెడీ అయ్యారు. అలబామాలో పౌర హక్కుల యాత్రకు అక్కడి ప్రభుత్వం ఆటంకం కలిగించవచ్చునన్న సంశయంతో ఆరున్నర దశాబ్దాల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ గవర్నర్ అనుమతి లేకుండా ఫెడరల్ బలగాలను పంపారు. ఇంకా వెనక్కివెళ్తే 1860ల్లో అప్పటి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఈ మాదిరే బలగాలను తరలించిన ఉదంతం ఉంది. ఎన్నడో 1807లో అమెరికాలో తిరుగుబాటు చట్టాన్ని రూపొందించారు. ఏ రాష్ట్రమైనా ఫెడరల్ ప్రభుత్వంపై తిరగబడి ఆత్యయిక స్థితి ఏర్పడితే మెరైన్లను రంగంలోకి దించి వాటిని అణిచేయటం దీని ఉద్దేశం. అప్పట్లో అంతర్యుద్ధాలూ, కొన్ని రాష్ట్రాలు జట్టుకట్టి ఫెడరల్ సర్కారుపై తిరుగుబాటుకు సిద్ధపడటం వగైరా పరిస్థితులను ఎదుర్కొనటానికి ఈ చట్టం తీసుకొచ్చారు. అయితే ఈ అరవయ్యేళ్లలోనూ ఫెడరల్ బలగాలను పంపాల్సిన సందర్భాలు రాలేదని కాదు. 1992లో రోడ్నీ కింగ్ అనే నల్లజాతీయుణ్ణి అత్యంత దారుణంగా హింసించిన కేసులో పోలీసులు నిర్దోషులని తీర్పు వెలువడినప్పుడు ఇదే లాస్ ఏంజెలెస్ దాదాపు వారంరోజుల పాటు అట్టుడికిపోయింది. 50 మంది మరణించటంతో పాటు వందలాది భవంతులు ధ్వంస మయ్యాయి. వేలాది కార్లకు నిప్పుపెట్టారు. ఇప్పుడలా కాదు. నగరంలోని ఒక బ్లాక్లో దాదాపు 200 మంది మెక్సికన్ కార్మికులు ఆదివారం ఆందోళనకు దిగారు. కార్లు తగలబెట్టడం, లూటీలు, ఫెడరల్ భవంతులపై రాళ్లు రువ్వటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాలిఫోర్నియా పోలీ సులే చాలావరకూ అదుపులోకి తెచ్చారు. ఆ ఆందోళన పెద్దగా విస్తరించింది కూడా లేదు.కానీ ట్రంప్ దీన్ని వదలదల్చుకోలేదు. 2020లో తన తొలి ఏలుబడి కాలంలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ను శ్వేతజాతి పోలీసులు ఊపిరాడకుండా చేసి హతమార్చిన ఉదంతం సమయంలో తీవ్ర హింస చెలరేగినా ట్రంప్ ముందుకు కదల్లేకపోయారు. ఆనాటి రక్షణమంత్రి మార్క్ ఏస్పర్, సైనిక బలగాల చీఫ్, అటార్నీ జనరల్ ఫెడరల్ బలగాలను పంపటం ప్రమాదకరమని వారించారు. అందుకే ఈసారి అలాంటివారిని దూరంకొట్టి నిర్విచక్షణగా తనకు మద్దతునిచ్చేవారిని చేరదీశారు. ఇప్పుడు క్యాలిఫోర్నియాకు కేంద్ర బలగాలను పంపాలని నిర్ణయించగానే రక్షణమంత్రి హెగ్సెత్, అటార్నీ జనరల్ బోండీ మద్దతుగా నిలిచారు. ట్రంప్ పని సులభమైంది. రెండోసారి అధికారంలోకొచ్చాక చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న విధానాన్ని ట్రంప్ పాటిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని నిరసిస్తూ విశ్వవిద్యాలయాల్లో చెలరేగిన ఉద్యమం విషయంలో ఆయన ఏం చేశారో ప్రపంచమంతా చూసింది. అందులో పాల్గొన్నవారిని దేశద్రోహులుగా పరిగణించి, సంకెళ్లువేసి జైళ్లకు తరలించటం, దేశం నుంచి గెంటేయటం రివాజుగా మారింది. ప్రస్తుత క్యాలిఫోర్నియా అల్లర్లపైనా ఆయన ఆ వైఖరే తీసుకున్నారు. అసలు తిరుగు బాటు చట్టం అమలును ప్రకటించకుండానే, గవర్నర్కు వర్తమానం పంపకుండానే 2,000 మంది బలగాలను అక్కడికి తరలించటం అమల్లోవున్న సంప్రదాయాలను ధిక్కరించటమే! ఏ పార్టీకి చెందిన దేశాధ్యక్షులైనా గతంలో ఇలాంటి దుస్సాహసానికి దిగలేదు. కానీ ఉన్న అధికారాలను మాత్రమే కాదు... ఎక్కడాలేని, ఏనాడూ ఎవరూ వినియోగించని అధికారాలను సైతం దబాయించి అమలు చేయించే నైజం ట్రంప్ది. లాస్ ఏంజెలెస్ అల్లర్ల వంటివి ట్రంప్కు చేజేతులా ఆ అవకాశాన్నిస్తున్నాయి. అక్కడ చెలరేగిన హింస, అందులో మెక్సికన్ జాతీయ జెండాల ప్రదర్శన స్థానికుల్లో ఆగ్రహావేశాలను రగిలించాయి. విద్వేషాన్ని పెంచాయి. హింసతో దేన్నయినా సాధించు కోవచ్చన్న మనస్తత్వం వికటిస్తుందని ఉద్యమకారులు తెలుసుకోవటం అవసరం. పరిస్థితిని అదుపు చేయటానికి క్యాలిఫోర్నియా ప్రభుత్వానికి సహకరించటమే వారికి శ్రేయస్కరం. -
ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు. -
Dusting challenge : 19 ఏళ్ల యువతి బలి, అసలేంటిది, లక్షణాలేంటి?
‘డస్టింగ్’ పేరుతో మరో సోషల్మీడియా భూతం అమాయక యువతీ యువకుల పారిట ప్రాణాంతకంగా మారుతోంది. అమెరికాలో ప్రమాదకరమైన డస్టింగ్ కారణంగా 19 ఏళ్ల యువతి మృత్యువాత పడింది. ఈ ఘటన అరిజోనాలో చోటుచేసుకుంది. మృతురాలిని రెన్నా ఓరూర్కేగా గుర్తించారు.ది ఇండిపెండెంట్ ప్రకారం, 19 ఏళ్ల రెన్నా ఓ'రూర్కే (Renna O'Rourke) ఏరోసోల్ వకారణంగా గుండెపోటుకు గురైంది. ఆ తరువాత ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో అపస్మారక స్థితిలో నాలుగు రోజులు చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరికి బ్రెయిన్ డెడ్గావైద్యులు ప్రకటించారు. ప్రియుడితో కలిసి రెన్నా తమకు తెలియకుండానే ఏరోసోల్ కీబోర్డ్ క్లీనర్ను ఆర్డర్ చేశారని,రెన్నా తల్లిదండ్రులు చెప్పారు. "ఆమె ఎప్పుడూ, 'నేను ఫేమస్ అవుతాను నాన్నా.. చూడండి. ' అని తరచూ చెప్పేదని అమ్మాయిల తండ్రి ఆరోన్ ఓ'రూర్కే అన్నారు.అసలేంటీ డస్టింగ్ డస్టింగ్ - క్రోమింగ్ లేదా హఫింగ్ అని కూడా పిలుస్తారు - ఈ డస్టింగ్ చాలెంజ్ ఇపుడొక వైరల్ ట్రెండ్. ఈ ఛాలెంజ్లో సరదా, ఆనందం కోసం కీబోర్డ్ క్లీనర్ల వంటి ఇంట్లో ఉండే రసాయనాలను స్ప్రే చేసి ముక్కుద్వారా పీల్చుతున్నారు. అమెరికా, ట్విటర్లో ట్రెండింగ్గా మారింది. దీంతో అనేక అనారోగ్యాల బారిన పడతారు. గుండె పనిచేయడం మానేసి, ప్రాణాలు పోయే దాకా వస్తుంది. తాము పొందే స్వల్పకాలిక ఆనందం కన్నవాల్లకి తీరని శోకం మిగుల్చుతుందని గమనించలేకపోతున్నారు. .19 ఏళ్ల రెన్నాకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టమని, ఉత్సాహంగా, ఉల్లాసంగా చాలా సందడిగా ఉండేదని తండ్రి గుర్తు చేసుకున్నారు. మరోబిడ్డకు ఇలా కాకూడదనే సదుద్దేశంతో ఓరూర్కే కుటుంబం రెన్నా జ్ఞాపకార్థం, టీనేజర్లు మరియు తల్లిదండ్రులకు 'హఫింగ్' వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. గోఫండ్మీ పేజీని కూడా ప్రారంభించారు. "లోతుగా వెతకండి. వారి గదులను శోధించండి. అలా చేయడం వారి ప్రాణాలను కాపాడుతుంది" అని రెన్నా తల్లి సూచించారు.డస్టింగ్ లేదా క్రోమింగ్లో ఏమి జరుగుతుంది?క్రోమింగ్ చేసేటప్పుడు, ప్రజలు మెటాలిక్ పెయింట్స్ ఇతర ఉత్పత్తులలోని హైడ్రోకార్బన్లను పీల్చడానికి ప్రయత్నిస్తారని నిపుణులు అంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. తీవ్రమైన స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలు, మరణానికి దారి తీస్తుంది. క్రోమింగ్ అనే భావన చాలా సంవత్సరాలుగా వివిధ పేర్లతో ఉంది.మాదకద్రవ్యాల వినియోగం, ఆరోగ్యంపై జాతీయ సర్వే ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది - ముఖ్యంగా టీనేజర్లు - ప్రతి సంవత్సరం ఇన్హేలెంట్లను ఉపయోగిస్తారు. అమెరికాలో 2015 నుండి 2022 వరకు 12 -17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు అత్యధికంగా వాడుతున్నారు. అలాగే 2024 మార్చిలో యూకేలో 11 ఏళ్ల బాలుడు సోషల్ మీడియాలో వీడియోలు చూసి విషపూరిత పదార్థాలను పీల్చి మరణించాడు.డస్టింగ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏరోసోల్ పెయింట్, పెయింట్ థిన్నర్, ఇంజీన్ ఫ్యూయల్, జిగురు వంటి అనేక గృహోపకరణాలలో హైడ్రోకార్బన్లు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి భారీ మత్తును కలిగిస్తాయి. ఊపిరి ఆడకపోవడం నిద్రలేమి, తలనొప్పి, బద్ధకం, కండరాల బలహీనత, కండరాల నియంత్రణ కోల్పోవడం, వికారం, వాంతులు లాంటి ప్రారంభ లక్షణాలు ముదిరి చివరకు ప్రాణాలను హరిస్తాయి. తీవ్ర లక్షణాలు : ఊపిరాడకపోవడం, గుండె ఆగిపోవడం, ఉక్కిరిబిక్కిరి, కోమా, మూర్ఛలు , ప్రాణాంతక గాయంనిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అలవాటు బాడీలో ఆక్సిజన్ను పూర్తిగా తొలగిస్తుంది. ఊపిరాడకుండా చేసి మరణానికి గురి చేస్తుంది. క్రోమింగ్ శరీరంలోని ఎలక్ట్రోలైట్లను కూడా ప్రభావితం చేస్తుంది. పొటాషియం స్థాయిలను తగ్గించేస్తుంది. ఇది గుండె కొట్టుకోవడంలో మార్పులు, కండరాల బలహీనత, ఇతర హానికరమైన ప్రభావాలకు దారితీస్తుంది. -
న్యాయ వ్యవస్థ స్వతంత్రత కాపాడేందుకే కొలీజియం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి ఉద్దేశించిన కొలీజియం వ్యవస్థలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇది ముఖ్యమైన భద్రతా వ్యవస్థగా కొనసాగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. కొలీజియం వ్యవస్థపై విమర్శలు వస్తున్నాయని అంగీకరించారు. ఈ వ్యవస్థ పరిపూర్ణం కాదని చెప్పారు. కానీ, కార్యనిర్వాహక వర్గం జోక్యం నుంచి న్యాయమూర్తులను రక్షించడంలో కొలీజియం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ తాజాగా సియాటెల్ యూనివర్సిటీలోని ‘రౌండ్ గ్లాస్ ఇండియా సెంటర్’లో జరిగిన కార్యక్రమంతోపాటు మరో రెండు చోట్ల కీలక ప్రసంగాలు చేశారు. సుప్రీంకోర్టు ఇటీవల చేపట్టిన పలు చర్యలను ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను మెరుగుపర్చేందుకే వీటిని అమల్లోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచుకోవడానికి న్యాయవ్యవస్థ పదే పదే తమ పారదర్శకతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కొలీజియంపై వస్తున్న విమర్శలను నిరాకరించలేమని, ఈ వ్యవస్థను మరింత మెరుగుపర్చాలన్న సంకల్పంతో న్యాయ వ్యవస్థ ముందడుగు వేస్తోందని ఉద్ఘాటించారు. న్యాయం అంటే సిద్ధాంతం, బాధ్యత న్యాయమూర్తులు అంటే అపరిమిత అధికారం కలిగినవారు కాదని... వారు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమేనని జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలను నిలబెట్టే విధంగా వ్యవహరించాలని న్యాయమూర్తులకు సూచించారు. కోర్టులు అధికారాన్ని ప్రదర్శించే వ్యవస్థలుగా కాకుండా, ప్రజాస్వామ్య ప్రయాణంలో భాగస్వాములై ఉండాలని పేర్కొన్నారు. న్యాయం అనేది తాత్కాలికంగా పంపిణీ చేయాల్సిన ఉత్పత్తి కాదని.. అది ఒక సిద్ధాంతం, ఒక బాధ్యత అని తేలి్చచెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, స్వయంపాలన అనేవి అనుకోకుండా వచ్చినవి కాదని, ఇవన్నీ సుదీర్ఘమైన పోరాటాల ఫలితంగా సమాజానికి లభించాయని జస్టిస్ సూర్యకాంత్ గుర్తుచేశారు. సుప్రీంకోర్టులో సీనియారిటీ ఆధారంగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ తరువాత జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్లో భారత సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. -
అమెరికాకు ఎగుమతులు 35 శాతం పతనం: చైనా
బీజింగ్: అమెరికా–చైనా మధ్య వాణిజ్యంలో అనిశ్చితి నెలకొంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో అమెరికాకు ఎగుమతులు 35 శాతం పడిపోయినట్లు చైనా వెల్లడించింది. ఈ ఎగుమతుల విలువ 28.8 బిలియన్ డాలర్లు. గత ఏడాది మే నెలలో ఎగుమతుల విలువ 44 బిలియన్ డాలర్లుగా ఉంది. మరోవైపు అమెరికా–చైనా మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమవుతోంది. అతిత్వరలో లండన్లో ఈ చర్చలు జరుగనున్నట్లు తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా ఉత్పత్తులపై భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే. -
అమెరికాలో భారత విద్యార్థులు 11.8% పెరిగారు
వాషింగ్టన్: అమెరికాలో భారత విద్యార్థుల సంఖ్యలో 2024లో 11.8 శాతం పెరుగుదల నమోదైంది. ప్రస్తుతం అమెరికాలో 4,22,335 మంది భారత విద్యార్థులున్నట్టు యూఎస్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) విడుదల చేసిన స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్ఈవీపీ) తాజా వార్షిక నివేదిక వెల్లడించింది. అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో ఇది 27 శాతం. ఈ విషయంలో భారత్ గత 15 ఏళ్లలో తొలిసారిగా చైనా (20 శాతం)ను దాటేసి అగ్రస్థానంలో నిలవడం విశేషం. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ మెటిక్స్ (స్టెమ్) కోర్సుల్లో అత్యధికంగా 48 శాతం మంది భారత విద్యార్థులే. 20.4 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చైనా విద్యార్థుల సంఖ్య 2023తో పోలిస్తే 0.25 శాతం తగ్గడం విశేషం.ఆసియా దేశాల హవా..అమెరికాలో చదువుతున్న విదేశీయుల్లో ఆసియా దేశాల హవా కొనసాగుతోంది. మొత్తం 15.8 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో 71.7 శాతం, అంటే 11,34,953 మంది ఆ దేశాలవారేనని నివేదిక తెలిపింది. -
లాస్ ఏంజెలెస్ రణరంగం
లాస్ ఏంజెలెస్: అధ్యక్షుడు ట్రంప్ తన అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపడంతో మరింత పేట్రేగిపోయిన ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఉదృతంచేశారు. రోడ్లపై కనిపించిన కారునల్లా దహనంచేసి ఉద్యమాగి్నజ్వాలల్ని మరింత రగిలించారు. దీంతో లాస్ ఏంజెలెస్ నగర వీధులు ఒక్కసారిగా రణరంగంగా మారిపోయాయి. అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు, ఎఫ్బీఐ, పోలీసులు అరెస్ట్చేయడాన్ని వేలాది మంది ఆందోళనకారులు నిరసించడంతో మొదలైన ఉద్యమం నెమ్మదిగా ఉగ్రరూపం దాల్చుతోంది. ఓవైపు సరైన డాక్యుమెంట్లులేని వలసదారులను అధికారులు అదుపులోకి తీసుకుంటూ, ఆ అధికారులు, ప్రభుత్వ భవనాలకు రక్షణగా నేషనల్ గార్డ్లను ట్రంప్ సర్కార్ రంగంలోకి దింపడంతో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. ఫ్రీవే మూసివేత పారామౌంట్ పట్టణంలోని ప్రధాన రహదారిని దిగ్బంధించారు. దక్షిణదిశలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే 101 నంబర్ ఫ్రీవే రహదారిని మూసేశారు. అడ్డుకునేందుకు వచ్చిన కాలిఫోర్నియా హైవే పెట్రోల్ అధికారులపైకి నిరసనకారులు చేతికొచ్చిన వస్తువుతో విరుచుకుపడ్డారు. కాంక్రీట్ ముక్కలు, రాళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్ విడిభాగాలు, బాణసంచాను అధికారులపైకి విసిరేశారు. వేలాదిగా ఆందోళనకారులు గుమికూడడంతో వెంటనే అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేదంటే అరెస్ట్లు తప్పవని పోలీసులు మెగాఫోన్లో ప్రకటించారు. అక్రమవలసల ఏరివేత కోసం నేషనల్ గార్డ్లను ఉపయోగించబోమని, కేవలం అధికారులు, డిటెన్షన్ సెంటర్ భవనాల రక్షణ నిమిత్తమే వాళ్లను రప్పించామని లాస్ఏంజెలెస్ పోలీస్ చీఫ్ జిమ్ మెక్డొనెల్ చెప్పారు. డజన్ల కొద్దీ ఆందోళనకారులను అరెస్ట్చేశామని తెలిపారు. పెట్రోల్ బాంబు విసిరినందుకు ఒకరిరి, అధికారులను బైక్తో ఢీకొట్టినందుకు మరొకరిని అరెస్ట్చేశారు. ఫేస్ మాస్క్ లు ధరించొద్దు ఫేస్మాస్క్ ధరించి ఆందోళనల్లో పాల్గొంటే ఉపేక్షించేది లేదని అధ్యక్షుడు ట్రంప్ స్పష్టంచేశారు. ఫేస్మాస్క్తో ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండని అధికారులకు ట్రంప్ తన సొంత సోషల్ మీడియా మాధ్యమం ‘ట్రూత్ సోషల్’ ద్వారా సూచించారు. ఉదయాన్నే నేషనల్ గార్డ్లు రావడంతో ఆందోళనకారుల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. రాష్ట్ర పోలీసులు ఉండగా ఫెడరల్ సాయుధవిభాగమైన మీకు ఇక్కడేం పని అంటూ అందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. ‘‘ సిగ్గులేదు. ఇంటికి పొండి’’ అంటూ ఎద్దేవాచేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బలగాలు పొగబాంబులు, భాష్పవాయుగోళాలు, ఫ్లాష్బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. దీంతో వాహనాల రాకపోకలను ఆందోళనకారులు 101 ఫ్రీవేపై నిలిపేశారు. సాయంత్రంకల్లా రాష్ట్ర పెట్రోల్ అధికారులు వారిని చెదరగొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్దరించారు. దీంతో ఆగ్రహించిన నిరననకారులు అక్కడే నిలిపి ఉంచిన నాలుగు స్వయంచోదిత(సెల్ఫ్ డ్రైవింగ్) వేమో సంస్థ కార్లకు నిప్పంటించారు. మంటలు అంతటా అంటుకోవడంతో ఆ కార్ల నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి. గూగుల్కు చెందిన ఈ కార్లు రోబోట్యాక్సీ సేవలందిస్తున్నాయి. ఉద్యమకారులు రెచ్చిపోతుండటంతో అధికారులు వెంటనే లాస్ఏంజెలెస్ డౌన్టౌన్ ప్రాంతాల్లో జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించారు. గుమికూడితే అరెస్ట్చేస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సమాఖ్య విధానాన్ని కాలరాయడమే ‘‘ కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉద్యమాలు వెల్లువెత్తితే సద్దుమణిగేలా చేసే బాధ్యత ఆ రాష్ట్రానిదే. మా రాష్ట్రంలో సమస్యలుంటే మేం పరిష్కరించుకుంటాం. నేషనల్ గార్డ్లను రంగంలోకి దింపాల్సిన అవసరమేంటి?. గార్డ్లను దింపి సమాఖ్య విధానానికి ట్రంప్ సర్కార్ తూట్లుపొడుస్తోంది. ఇది రాష్ట్రాల సార్వ¿ౌమత్వానికి తీవ్ర విఘాతం కల్గించడమే. అధ్యక్షుడి నిర్ణయాన్ని నేను న్యాయస్థానంలో సవాల్ చేస్తా’’ అని డెమొక్రటిక్ పార్టీ నేత, కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ నూసమ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గవర్నర్ అనుమతి, ఆమోదంలేకుండా కాలిఫోర్నియా రాష్ట్రంలోకి నేషనల్ గార్డ్లను కేంద్రప్రభుత్వం రప్పించడం ఇటీవలి దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 1965లో నాటి దేశాధ్యక్షుడు లిండన్ బి.జాన్సన్ అలబామాలో పౌరహక్కుల ఉద్యమాన్ని అదుపులోకి తెచ్చేందుకు అమెరికాసైన్యంలో రిజర్వ్ బలగాలైన ‘నేషనల్ గార్డ్’లను రప్పించారు. ‘‘ఆందోళనకారులు శాంతించాలి. నేషనల్ గార్డ్లను తీసుకొచ్చి ఆందోళనకారుల ఆగ్రహజ్వాలలను ట్రంప్ మరింత రాజేశారు. ప్రజలకు రక్షణగా వాళ్లను రప్పించినట్లు కనిపించట్లేదు. ట్రంప్కు మరేదో ఎజెండా ఉన్నట్లుంది’’ అని లాస్ ఏంజెలెస్ నగర మహిళా మేయర్ కరెన్ బాస్ వ్యాఖ్యానించారు. ఆందోళనలు తొలుత లాస్ ఏంజెలెస్ డౌన్టౌన్లో మొదలు తర్వాత పారామౌంట్ పట్టణానికి పాకి ప్రస్తుతం సమీప కాంప్టన్ పట్టణంలో విస్తరిస్తున్నాయి. గత వారంతానికి 100 మందికిపైగా అక్రమవలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేసి డిటెన్షన్ సెంటర్లకు తరలించారు. శాన్ ఫ్రాన్సిస్కోలో 60 మందిని అరెస్ట్చేశారు.విదేశీ జర్నలిస్ట్లకు గాయాలు డౌన్టౌన్ లాస్ఏంజెలెస్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ నుంచి వలసదారులను విడిచిపెట్టాలని ఉద్యమకారులు నినాదాలుచేశారు. అప్పుడు అక్కడ ఆ్రస్టేలియాకు చెందిన 9న్యూస్ టీవీఛానెల్ మహిళా పాత్రికేయురాలు లారెన్ థామస్ రిపోరి్టంగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యమకారులను చెదరగొట్టేందుకు నగర పోలీసులు, నేషనల్ గార్డ్ బలగాలు రబ్బర్ బుల్లెట్ల గన్లను పేల్చారు. దీంతో ఒక రబ్బర్ బుల్లెట్ లారెన్కు తగిలింది. ప్రత్యక్ష ప్రసారం వేళ ఈ ఘటన జరిగింది. విలవిల్లాడుతున్న ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. బ్రిటిష్ ఫొటోజర్నలిస్ట్ నిక్ స్టెర్న్కు సైతం రబ్బర్ బుల్లెట్ తగలి ఐదు సెంటీమీటర్ల లోతు గాయమైంది. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించాక దేశవ్యాప్తంగా 1,00,000 మందిని అరెస్ట్చేసినట్లు ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్(ఐసీఈ) విభాగం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడైన తొలి 100 రోజుల్లో రోజుకు 660 మంది చొప్పున అరెస్ట్చేశారు. గురువారంనాటికి డిటెన్షన్ సెంటర్లలో ఏకంగా 54,000 మంది వలసదారులున్నారు. నేషనల్ గార్డ్లను రప్పించడానికి శ్వేతసౌధం సమరి్థంచుకుంది. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ అసమర్థ పాలన కారణంగా ఇమిగ్రేషన్ అధికారులకు రక్షణ కరువైంది. అందుకే గార్డ్లను అనుమతించాం’’ అని శ్వేతసౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లెవిట్ చెప్పారు. లాస్ ఏంజెలెస్లో కొన్ని చోట్ల ఆందోళనకారులు దుకాణాలను లూటీచేశారని పోలీసులు చెప్పారు. పరిస్థితి చేయిదాటితే 500 మంది నేవీ మెరైన్లను రప్పిస్తామని యూఎస్ నార్తర్న్ కమాండ్ హెచ్చరించింది. -
కర్మ అంటే ఇదేనేమో.. ట్రంప్పై మాస్ ట్రోలింగ్
వాషింగ్టన్: ‘కర్మ’ ఎవరినీ వదలదు అంటారు. అచ్చంగా ఇలాంటి అనుభవమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురైంది. అంతకుముందు, మాజీ అధ్యక్షుడు జో బైడెన్.. విమానం ఎక్కుతున్న సమయంలో కిందపడిన సందర్భంలో ట్రంప్ ఆయనపై సెటైర్లు వేశారు. తాజాగా ట్రంప్ కూడా విమానం ఎక్కుతూ అలాగే కింద పడబోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ క్రమంలో పలువురు నెటిజన్లు ట్రంప్పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూజెర్సీలోని ఎయిర్ఫోర్స్ వన్ విమానం మెట్లు ఎక్కుతున్న సమయంలో జారిపడ్డాడు. ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయివేసి పైకి లేచారు. అనంతరం, రూబియో సైతం కిందపడ బోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను పలువురు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.Here is the whole video. Rubio stumbled as well. Was raining before.Post the whole thing pic.twitter.com/RKVLBZR29Y— Adi 🎗 (@Adi13) June 8, 2025ఇక, జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మెట్లు ఎక్కుతున్న సమయంలో బైడెన్ పలు సందర్భాల్లో కింద పడిపోయారు. దీంతో, బైడెన్ను టార్గెట్ చేసిన ట్రంప్.. పలుమార్లు ఎగతాళి చేసి మాట్లాడారు. ఇప్పుడు అలాంటి విచిత్ర పరిణామామే ట్రంప్కు కూడా ఎదురైంది. 🚨 BREAKING: DOWN GOES DONALDTrump just stumbled and almost faceplanted boarding Air Force One. I’ve been telling you — he drags his legs and he’s clearly not well.When Biden stumbled, the media lost its mind and Tapper wrote an entire fake “nonfiction” book.Where are they… pic.twitter.com/MZlHfbfDUJ— Chris D. Jackson (@ChrisDJackson) June 8, 2025WATCH: President Joe Biden stumbles and falls up the stairs while boarding Air Force One pic.twitter.com/1m7tecpsxc— The Post Millennial (@TPostMillennial) March 19, 2021 -
లాస్ ఏంజెలెస్లో...ముదురుతున్న రగడ
పారామౌంట్(యూఎస్): అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వారిని పట్టుకునేందుకు ట్రంప్ సర్కార్ మొదలెట్టిన ఏరివేత కార్యక్రమం మరింత ఉద్రిక్తంగా మారింది. అక్రమ అరెస్ట్లను ఆపితే ఆందోళనలు తగ్గుముఖం పడతాయని, బలగాలను మొహరించి సమస్యను మరింత జఠిలతరం చేయొద్దని విపక్ష డెమొక్రటిక్ పాలిత నగరాల మేయర్లు మొత్తుకుంటున్నాసరే ట్రంప్ ప్రభుత్వం ‘నేషనల్ గార్డ్’ బలగాలను రంగంలోకి దింపింది. ఒక్క లాస్ ఏంజెలెస్ పరిధిలోనే ఏకంగా 2,000 మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్ సభ్యులు మొహరించారు. దీంతో వీరికి దీటుగా వందలాది మంది ఆందోళనకారులు తమ నిరసనలను ఉధృతంచేశారు. రెండో రోజూ రోడ్లపై చేరి ఫెడరల ఏజెంట్లు, ఎఫ్బీఐ, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పారామౌంట్ పట్టణంలోనూ.. లాస్ ఏంజెలెస్ సిటీ శివారులోని పారామౌంట్ పట్టణంలో హోంశాఖ వద్ద వందలాది మంది నిరసనకారులు గుమిగూడి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు అత్యంత తీక్షణ కాంతిని వెదజల్లే ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను విసిరారు. రబ్బర్ బుల్లెట్లను షూట్చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాస్ ఏంజెలెస్లో పలు ప్రాంతాల్లో ఆందోళనకారులపైకి పోలీసులు ఇలా భాష్పవాయు గోళాలు, పెప్పర్ బాల్స్, పొగ బాంబులను ప్రయోగించారు. పోలీసులు ప్రయాణిస్తున్న బోర్డర్ పెట్రోల్ వాహనాలపైకి ఆందోళనకారులు ఇటుకలు, రాళ్లు విసిరారు. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల రాకపోకలు స్తంభింపజేస్తూ వలసదారులు రోడ్లపై టైర్లను కాలి్చపడేశారు. ఇటీవలికాలంలో లాస్ ఏంజెలెస్ పరిధిలో 118 మంది వలసదారులు, ఐదుగురు నేరస్తులను అరెస్ట్చేసినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రకటించింది. సైన్యాన్ని దింపుతాం: రక్షణ మంత్రి హెచ్చరిక ‘అక్రమ వలసదారులు, నేరగాళ్లను పట్టుకునేందుకు ఫెడరల్ ఏజెంట్లు చేస్తున్న ముమ్మర గాలింపు చర్యలను ఆందోళనకారులు ఇలాగే అడ్డుకుంటే అనివార్యపరిస్థితుల్లో మేం సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి ఉంటుంది. క్యాంప్ పెడల్టన్లోని మెరైన్లనూ రప్పిస్తాం’ అని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. మరోవైపు పారామౌంట్, కాంప్టన్ పట్టణాల్లో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఒక కారుకు నిప్పంటించారు. పారామౌంట్ బిజినెస్ పార్క్ వద్ద ఇమిగ్రేషన్ అధికారులను ఆందోళనకారులు అడ్డుకున్నారు. బాణసంచా కాలుస్తూ, షాపింగ్ కార్ట్లను రోడ్లపై పడేశారు. బోర్డర్పెట్రోల్ వాహనశ్రేణిపై రాళ్లు రువ్వారు. లాస్ ఏంజెలెస్ ఫెడరల్ డిటెన్షన్ భవనం వద్ద సైతం గుమిగూడి అరెస్టయిన వాళ్లను విడుదలచేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో వారిలో కొందరు పోలీసులు అరెస్ట్చేశారు. ‘‘వారెంట్ల ప్రకారం సైతం చాలా మంది అక్రమవలసదారులను ఆదివారం సైతం అరెస్ట్చేశాం. డ్యూటీ నిర్వహణకు అడ్డుపడిన డజన్లకొద్దీ జనాలనూ అరెస్ట్చేశాం’’ అని యూఎస్ అటార్నీ బిల్ ఈజీలీ ప్రకటించారు. అరెస్ట్ అయిన వారి ఫొటోలను తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్చేశారు. అక్రమ వలసదారుల ఏరివేత వేళ ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులకు ఎన్జీ బలగాలు తాత్కాలికంగా రక్షణగా ఉంటాయని ట్రంప్ చెప్పారు.నేషనల్ గార్డ్ రంగప్రవేశంపై అభ్యంతరాలు రాష్ట్రాల్లో శాంతి భద్రతల అంశాన్ని రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయి. కానీ ట్రంప్ ఇలా అధ్యక్షుడి అసాధారణ అధికారాలను ఉపయోగించి నేషనల్ గార్డ్ను రప్పించడంపై లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్, కాలిఫోరి్నయా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ బలగాలపై గవర్నర్కే అధికారాలుంటాయి. కానీ టైటిల్ 10 అధికారాన్ని ఉపయోగించి నేషనల్ గార్డ్ బలగాలను ట్రంప్ రప్పించారు. గతంలో పౌరహక్కుల ఉద్యమం సమయంలోనూ దేశాధ్యక్షుడు ఈ టైటిల్10ను వాడి నేషనల్ గార్డ్ బలగాలను ఆయా ఉద్యమప్రాంతాలకు తరలించారు. గత అధ్యక్షులు ఐసన్హోవర్, జాన్ ఎఫ్.కెన్నడీ, జాన్సన్లూ ఈ నిబంధనను ప్రయోగించారు. 1967 డెట్రాయిట్ ఆందోళనలు, మారి్టన్ లూథర్ కింగ్ జూనియర్ హత్యానంతరం సైతం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎన్జీ బలగాలను రప్పించారు. 1970 న్యూయార్క్ పోస్టల్ ఉద్యమాన్ని అణచివేసేందుకు ఆనాడు ఎన్జీ రంగంలోకి దిగింది. చివరిసారిగా 1992లో ఒక నల్లజాతీయుడిని నలుగురు శ్వేతజాతి పోలీసులు దారుణంగా కొట్టినప్పుడు లాస్ ఏంజెలెస్లో అల్లర్లు చెలరేగినప్పుడు ఎన్జీ బలగాలొచ్చాయి. -
అమెరికా రెట్టింపు సుంకాలతో భారత్పై తీవ్ర ప్రభావం: జీటీఆర్ఐ
న్యూఢిల్లీ: స్టీల్, అల్యూమినియంపై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో భారతీయ ఎగుమతులు ప్రభావితం అవుతాయని ఆర్థిక మేధోసంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్(జీటీఆర్ఐ) తెలిపింది. ముఖ్యంగా వాల్యూ యాడెడ్, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల రంగాలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. యూఎస్ స్టీల్ పరిశ్రమ మనుగడ దృష్ట్యా తమ దేశంలోకి దిగుమతి అవుతున్న స్టీల్, అల్యూమినియంపై ప్రస్తుతం ఉన్న 25% టారిఫ్ను 50 శాతానికి పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ మే 30న ప్రకటించారు. సుంకాల పెంపు జూన్ 4 నుంచి అమల్లోకి వస్తాయన్నారు ‘‘భారత్పై సుంకాల పెంపు పరిణామం ప్రత్యక్షంగా ఉంటుంది. ట్రంప్ నిర్ణయంపై భారత ప్రభుత్వం అమెరికా అధికారులతో ద్వైపాక్షిక చర్చలు జరపాలి. ఈ సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై భారత్ ప్రతీకార సుంకాలను విధిస్తుందో లేదో చూడాలి’’ అని జీఆర్టీఐ వ్యవస్థాపకులు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. గతంలో విధించిన ఉక్కు సుంకాలకు ప్రతిస్పందనగా అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను విధించే ఉద్దేశాన్ని సూచిస్తూ భారత్ ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్యూటీఓ)లో అధికారిక నోటీసు జారీ చేసింది. భారత్ 2024–25లో 4.56 బిలియన్ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కు మరియు అల్యూమినియం ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. వీటిలో 587.5 మిలియన్ డాలర్ల ఇనుము, ఉక్కు, 3.1 బిలియన్ డాలర్లు ఇనుము లేదా ఉక్కు ఉత్పత్తులు, 860 మిలియన్ డాలర్లు అల్యూమినియం సంబంధిత ఉత్పత్తులున్నాయి. ధరల పోటీతత్వం తగ్గుతుంది: ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్సీ రల్హాన్ భారతీయ స్టీల్ ఎగుమతులైన స్టెయిన్లెస్ స్టీల్ పైపులు, స్ట్రక్చరల్ స్టీల్ విడిభాగాలు, ఆటోమోటివ్ స్టీల్ భాగాలైన సెమీ ఫినిష్డ్, ఫినిష్ట్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అధ్యక్షుడు ఎస్సీ రాల్హన్ తెలిపారు. అధిక పన్నులు అమెరికా మార్కెట్లో ధరల పోటీతత్వాన్ని తగ్గించడంతో పాటు ప్రపంచ వాణిజ్యం, తయారీ సప్లై చైన్ను నిరాశపరుస్తాయన్నారు. -
స్పేష్ మిషన్లో భాగస్వామ్యంనా అదృష్టం: శుభాన్షు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్జియం–4 స్పేష్ మిషన్లో భాగస్వామి కావడం తన అదృష్టంగా భావిస్తున్నానని భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (39) చెప్పారు. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి స్పేస్ఎక్స్ డ్రాగన్ ఎయిర్క్రాఫ్ట్లో ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి మంగళవారం సాయంత్రం 5.52 గంటలకు ఫాల్కన్–9 రాకెట్ ద్వారా వారి ప్రయాణం ప్రారంభం కానుంది. ఇదొక అద్భుతమైన ప్రయాణం అవుతుందని భావిస్తున్నట్లు శుభాన్షు చెప్పారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్లో గ్రూప్ కెపె్టన్ అయిన శుక్లా రాకేశ్ శర్మ అనంతరం 41 ఏళ్లకు అంతరిక్షంలోకి చేరుకోబోతున్న రెండో భారతీయుడిగా రికార్డు సృష్టించబోతున్నారు. ఆగ్జియం మిషన్ నిమిత్తం అమెరికాలో కొద్ది నెలలుగా ప్రత్యేక శిక్షణ పొందారు. రాకేశ్ శర్మ సోవియట్ యూనియన్కు చెందిన సోయజ్ స్పేస్క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్లి 8 రోజులుండి తిరిగొచ్చారు. ఆయనను శుభాన్షు తన స్ఫూర్తిప్రదాతగా భావిస్తుంటారు. శుక్లాతోపాటు కమాండర్ పెగ్గీ విట్సన్, మిషనల్ స్పెషలిస్టులు టిబోర్ కపూ, స్లావోజ్ ఉజ్నాన్స్కీ–విస్నీవెస్కీ స్పేస్ఎక్స్ మిషన్లో భాగంగా డ్రాగన్ క్యాప్సూల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోబోతున్నారు. డ్రాగన్ క్యాప్సూల్కు శుక్లా పైలట్గా వ్యవహరిస్తారు. -
క్వీన్ కోకో.. ఫ్రెంచ్ ఓపెన్ విజేత
-
దాడి.. అరెస్ట్.. ఆందోళన.. లాఠీచార్జ్
లాస్ ఏంజెలెస్: చట్టవ్యతిరేకంగా అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను గు ర్తించి, అరెస్ట్చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులకు స్థానికుల నుంచి తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. లాస్ ఏంజెలెస్ నగర పరిసరాలు ఇందుకు వేదికయ్యా యి. శుక్రవారం లాస్ ఏంజెలెస్ ప్రాంతాల్లో కొందరు అక్రమ వలసదారులను అరెస్ట్చేయడం ఒక్కసారిగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఫెడరల్ ఏజెన్సీ, పోలీసులు, ఎఫ్బీఐ సంయుక్తంగా జరిపిన ఆకస్మిక దాడుల్లో పలువురు అక్రమవలసదారులను అరెస్ట్చేయడంతో అక్కడే ఉన్న స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. వీరికి వందలాది మంది విపక్ష డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ పోలీసు చర్యను తీవ్రంగా తప్పుబట్టారు. ఆగ్రహంతో ఊగిపోయిన నిరసనకారులు ప్యాకింగ్ కార్ట్లు, కాంక్రీట్ ముక్కలుసహా దొరికిన వస్తువులతో పోలీసులపైకి దాడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. వందల మంది నిరసనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కంటితో చూడలేనంత కాంతిని వెదజ్లే, కళ్లు బైర్లు కమ్మేలా మెరుపులు వెదజల్లే ప్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను విసిరేశారు. దీంతో ఆ ప్రాంతమంతా రణరంగాన్ని తలపించింది. నగర వ్యాప్తంగా దావానంలా వ్యాపించిన ఈ అక్రమవలసదారుల ఆందోళనలను అణచివేసేందుకు మరింతగా పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. పలు చోట్ల బ్యారీకేడ్లను ఏర్పాటుచేసి వాహనాల రాకపోకలను నిలిపేశారు. మధ్యాహ్నంతో మొదలు తొలుత శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు సిటీలోని ఫ్యాషన్ డిస్ట్రిక్ట్లో ఒక వ్రస్తాల టోకు వ్యాపారిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేశారు. ఈ అరెస్ట్ను అడ్డుకున్న అక్కడి ఉద్యోగులనూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చూస్తున్న ప్రజల్లో పట్టరాని ఆవేశం పెరిగి ఆందోళనకు దిగారు. పందుల్లారా, పిడివాదం చేసే పోలీసుల్లారా అంటూ కొందరు తిట్ల పురాణం మొదలెట్టారు. ‘‘కుటుంబాలను వేరు చేస్తూ రాత్రిళ్లు మీరు హాయిగా నిద్రపోగలరా?. మీ కుటుంబసభ్యులను కూడా ఇలా అరెస్ట్చేస్తే మీకెలా ఉంటుంది?’’అని అక్కడి ఓ మహిళ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అరెస్ట్లను అడ్డుకున్న కార్మిక నేత, సరీ్వస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయెరా్టనూ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కారి్మకులు, స్థానికులు మధ్యాహ్నం నాలుగు గంటలకు పెద్ద ఎత్తున గుమిగూడి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ లాస్ ఏంజెలెస్ ఫెడరల్ డిటెన్షన్ సెంటర్ భవనానికి చేరుకున్నారు. అరెస్ట్చేసి లోపల బంధించిన వారిని వెంటనే విడిచిపెట్టాలని నినాదాలుచేశారు. ఫెడరల్ కోర్ట్హౌస్ భవనంపై ఆందోళనకారులు స్ప్రే పెయింట్తో రాతలు రాశారు. అనుమతిలేకుండా జనం రోడ్లపై గుమిగూడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలీసులు హెచ్చరించినా జనం అక్కడి నుంచి వెళ్లిపోలేదు. దీంతో వీళ్లను చెదరగొట్టేందుకు పోలీసులు పెప్పర్ స్ప్రేలు, ఫ్లాష్ బ్యాంగ్ గ్రనేడ్లను ప్రయోగించారు. ‘‘అక్రమ వలసదారులను అరెస్ట్చేయడానికి మేం రాలేదు. శాంతిభద్రతల పరిరక్షణకు వచ్చాం. ఇక్కడి నుంచి వెళ్లకపోతే అరెస్ట్ తప్పదు’’అని పోలీసుల అధికార ప్రతినిధి డ్రాక్ మేడిసన్ హెచ్చరించారు. సెంట్రల్ లాస్ ఏంజెలెస్లో మూడు చోట్ల తనిఖీలు, సోదాలను పూర్తిచేశామని అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్లోని హోమ్ల్యాండ్ సెక్యూరిటీస్ ఇన్వెస్టిగేషన్స్ విభాగ మహిళా అధికార ప్రతినిధి యాస్మీన్ పిట్స్ ఒకీఫ్ చెప్పారు. అయితే అధికారులు నగరంలో చాలా చోట్ల ఆకస్మిక దాడులు చేశారని వలసదారుల హక్కుల ఐక్యవేదిక(చిర్లా) పేర్కొంది. ఏడు ప్రాంతాలు, రెండు హోమ్ డిపోర్ట్స్, ఒక వేర్హౌస్, ఒక డోనట్ షాప్లో ఈ దాడులు జరిగాయని చిర్లా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏంజిలికా సలాస్ ఆరోపించారు.44 మంది అరెస్ట్ సెర్చ్ వారెంట్ ప్రకా రం 44 మందిని ఫెడరల్ ఏజెంట్లు అరెస్ట్చేశారు. అరెస్ట్లను అడ్డుకున్నందుకు ఒకరిని అరెస్ట్ చేశారు. రోజుకు కనీసం 3,000 మంది అక్రమ వలసదారులను అరెస్ట్చేయాలని అధ్యక్షభవనం అధికార ప్రతినిధి స్టీఫెన్ మిల్లర్ ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని ఆదేశించడంతో ఫెడ రల్ ఏజెంట్లు ఇలా రంగంలోకి దిగాల్సి వచ్చిందని యాస్మీన్ పేర్కొన్నారు. ప్రస్తు తం రోజుకు సగటున 1,600 మందిని అరెస్ట్చేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది తీవ్రమైన నేరాలుచేసిన వాళ్లేనని మిల్లర్ చెప్పారు. ఒక వ్యాపారి తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి తప్పుడు పత్రాలను సృష్టించాడని యూఎస్ అటార్నీ ఆఫీస్ అధికారి సియారన్ మెక్ఎవీ చెప్పారు. ఇవన్నీ తీవ్రమైన చర్యలని లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ వ్యాఖ్యానించారు. -
‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్ను ఉద్దేశిస్తూ ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరు రాజకీయ వేత్త. మరొకరు వ్యాపార వేత్త. నిన్నమొన్నటి వరకు వాళ్లిద్దరూ ఆప్తమిత్రులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. ట్రంప్ ఏ ముహూర్తాన బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారో నాటి నుంచి వాళ్లిద్దరి మధ్య సఖ్యత దెబ్బ తింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఆ పిచ్చోడితో నేను మాట్లాడేంది అని ట్రంప్ అంటుంటే.. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ మస్క్ బాంబు పేల్చారు. సంబంధిత ఆధారాల్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొద్ది సేపటికే ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్తో మస్క్ రాజీకి సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఢీ అంటే ఢీ అంటున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారా? ట్రంప్తో రాజీకి రెడీ అయ్యారా?. అంటే అవుననే అనిపిస్తున్నాయి మస్క్ చర్యలు.జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో ట్రంప్ పేరుందంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఫైల్స్ను మస్క్ డిలీట్ చేశారు. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్లో తన పేరు ఉండడం వల్లే ఆ డాక్యుమెంట్ను ట్రంప్ బహిర్ఘతం చేయడం లేదంటూ మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్ కొద్ది సేపటిక్రితం ఆ పోస్టును డిలీట్ చేశారు. దీంతో మస్క్ వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది.టెస్లాలో భారీ నష్టాలు, స్పేస్ ఎక్స్లో ప్రాజెక్ట్లపై ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ట్రంప్తో విభేదాల విషయంలో మస్క్ ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు నేను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అమెరికాకు అధ్యక్షుడు అయ్యే వారు కాదు. కొత్త పార్టీ పెడతానంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు.Trump responds that he has been too busy to think about Elon Musk but added “I just wish him well.”The President is showing so much class, restraint and grace. pic.twitter.com/CfYCqH3aKN— Cassie N (@cass_nguyen_) June 6, 2025 మస్క్ చేసిన వ్యాఖ్యల్ని ఏబీసీ మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. మీపై మస్క్ ఆరోపణలు గుప్పిస్తున్నారు కదా. మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. మీరు మాట్లాడేది ఆ పిచ్చోడి గురించేనా. ప్రత్యేకంగానే కాదు. అసలు మాట్లాడేందుకే నేనే ఇష్టపడడం లేదు. ఒకవేళ మస్క్ నాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు నేను సుముఖంగా లేనన్నారు. ఈ క్రమంలో మస్క్- ట్రంప్ వార్ ఎటుకి దారి తీస్తుందోనని రాజకీయ వేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్,మస్క్లు మళ్లీ ఏం కొంపముంచుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రంప్ కు బిగ్ షాక్.. ఎలన్ మస్క్ కొత్త పార్టీ
-
మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో యూఎస్లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన రష్యా -
ట్రంప్తో ఫైటింగ్.. మస్క్కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు. -
డిన్నర్కి వెళ్తూ కోటీశ్వరులయ్యారు!
వాషింగ్టన్: అదృష్టం అంటే నిజంగా ఇదేనేమో! డిన్నర్ చేద్దామని సరదాగా హోటల్కు వెళ్తూ మధ్యలో ఆగి కొన్న లాటరీ టికెట్కు ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల(రూ.12.86 కోట్లు) సొమ్ము లభించింది. అమెరికాలోనూ న్యూజెర్సీలో ఈ సంఘటన జరిగింది. న్యూజెర్సీ దంపతులు డిన్నర్ కోసం హోటల్కు బయలుదేరారు. మధ్యలో ఓ దుకాణం వద్ద ఆగి 3 డాలర్లు(రూ.257) పెట్టి లాటరీ టికెట్ కొనేశారు. నిజానికి వారిద్దరిలో ఒకరికి ఇదే దుకాణంలో కొనడం ఇష్టంలేదు. మరోచోట చూద్దామని చెప్పారు. కాసేపు ఇద్దరూ చర్చించుకొని చివరికి ఇక్కడే కొనాలని నిర్ణయించుకున్నారు. టికెట్ కొన్న తర్వాత స్క్రాచ్ చేసి చూడగా, ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల సొమ్ము గెలుచుకున్నట్లు తెలిసిపోయింది. దంపతులు ఒక్కసారిగా కోటీశ్వరులుగా మారిపోయారు. తమ కష్టాలన్నీ తీరిపోయినట్లేనని వారు ఆనందం వ్యక్తంచేశారు. బిల్లులు చెల్లించడానికి ఇన్నాళ్లూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, ఇకపై ఆ పరిస్థితి ఉండదని చెప్పారు. తమ జీవితం ఇక సుఖమయం అవుతుందని సంతోషపడ్డారు. 1.5 మిలియన్ డాలర్ల సొమ్మును 25 ఏళ్లపాటు విడతలవారీగా తీసుకొనేలా లాటరీ నిర్వాహకులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. -
60 ఏళ్ల తర్వాత డిగ్రీ పట్టా సాధించిన 88 ఏళ్ల బామ్మ
న్యూహాంప్షైర్: అమెరికాలోని మెయిన్ రాష్ట్రానికి చెందిన ఓ బామ్మ ఎట్టకేలకు డిగ్రీ పట్టా అందుకున్నారు. వాస్తవానికి ఈమెకీ పట్టా 1959 లోనే అందాల్సి ఉంది. అనివార్య కారణాలతో డిగ్రీ పూర్తి చేయలేకపోయారు. కుమార్తె చొరవ తో దాదాపు 60 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈమె కల నిజమైంది. న్యూహాంప్షైర్కు చెందిన జోన్ అలెగ్జాండర్(88) సాధించిన ఘనత ఇది. ఈమె మెయిన్ యూనివర్సిటీలో సైన్స్ ఇన్ ఎడ్యుకేషన్ కోర్సులో 1950ల్లో చేరారు. 1959 కల్లా ఈ డిగ్రీని పూర్తి చేయాల్సి ఉంది. పట్టా చేతికి రావాలంటే కోర్సు చివర్లో విద్యారి్థనీ విద్యార్థులు కొద్దికాలంపాటు ఉపాధ్యాయులుగా పనిచేయాలనే నిబంధన ఉంది. అప్పటికి గర్భవతిగా ఉన్న జోన్ను అధికారులు బోధించేందుకు అనుమతించలేదు. ఆ రోజుల్లో జోన్ వంటి వారందరిదీ ఇదే పరిస్థితి. దీంతో, డిగ్రీ పట్టాను అందుకోవాలన్న జోన్ కల అలాగే మిగిలిపోయింది. కుమార్తె సాయంతో.. ఈ ఏడాది ఆరంభంలో జోన్ అలెగ్జాండర్ కుమార్తె ట్రేసీ తల్లి కలను నిజం చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. మెయిన్ యూనివర్సిటీ అధికారులను సంప్రదించారు. కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ విభాగం అసోసియేట్ డీన్గా ఉన్న జస్టిన్ డిమ్మెల్ సానుకూలంగా స్పందించారు. జోన్ అలెగ్జాండర్కు సంబంధించిన విద్యార్హతల వివరాలను క్షుణ్నంగా పరిశీలించారు. 1980ల్లో ఆమె ఓ ప్రీసూ్కల్లో పూర్తిస్థాయి సహాయకురాలిగా పనిచేసినట్లుగా గుర్తించారు. ఈ అనుభవాన్ని బోధనతో సమానమైన అర్హతగా భావించి, జోన్ అలెగ్జాండర్కు డిగ్రీ పట్టా ప్రదానం చేసేందుకు వర్సిటీ యాజమాన్యం అంగీకరించింది. ఈ ఏడాది మేలో జోన్ అలెగ్జాండర్ను గ్రాడ్యుయేట్గా గుర్తిస్తున్నట్లు మెయిన్ వర్సిటీ ప్రకటించింది. మే 11వ తేదీన జరిగిన స్నాతకోత్సవానికి జోన్ వెళ్లలేకపోయారు. బదులుగా ఆమె కుమార్తె ట్రేసీ, మనవరాలు ఇసాబెల్ వర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా జోన్ అలెగ్జాండర్ పేరును ప్రస్తావించారు. విద్యారంగానికి జీవితాన్ని అంకితం చేసిన జోన్ ఎన్నో సేవలందించారని కొనియాడారు. చిట్టచివరికి తన కృషిని గుర్తించడం ఎంతో ముఖ్యమైన అంశమని జోన్ పేర్కొన్నట్లు యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. స్నాతకోత్సవంలో తల్లి తరఫున పట్టా అందుకున్న వేళ ఎంతో ఉద్వేగానికి గురైనట్లు ట్రేసీ పేర్కొన్నారు. యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరూ ఎంతో మద్దతిచ్చారన్నారు. కాగా, జోనీ అలెగ్జాండర్ భర్త తీర రక్షక దళం అధికారి. ఈ దంపతులకు నలుగురు కుమార్తెలు. భర్త ఎక్కువ సమయంలో విధుల్లో ఉండాల్సి రావడంతో నలుగురు కూతుళ్ల భారం జోనీయే మోశారు. న్యూ హాంప్షైర్లోనే ఉంటున్న జోనీ ఇప్పటికీ చర్చి, స్థానిక లైబ్రరీ, స్కూళ్లలో జరిగే సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ‘డిగ్రీ సంపాదించడం నా వ్యక్తిగత లక్ష్యం. మా కుటుంబంలోని వారంతా గ్రాడ్యుయేట్లే. ఎట్టకేలకు నేను సైతం గ్రాడ్యుయేట్నయ్యా’అని గర్వంగా చెప్పుకుంటున్నారు జోనీ అలెగ్జాండర్..! -
వీసా మోసగాళ్లున్నారు జాగ్రత్త!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని వీసా దరఖాస్తుదారులను ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం హెచ్చరించింది. ఇటీవల మారిన నిబంధనలను ఆసరాగా చేసుకునేందుకు మోసగాళ్లు ప్రయతి్నస్తున్నారంటూ ఓ ప్రకటనలో అలర్ట్ చేసింది. బెంగళూరుకు చెందిన ఓ ఇంజినీర్ను సైబర్ నేరగాడు బీ1/బీ2 నాన్ ఇమిగ్రాంట్ వీసా ఇంటర్వ్యూ ముందుగానే ఇప్పిస్తామని మోసం చేశారని వివరించింది. అమెరికా వీసా దరఖాస్తు పోర్టల్లో వ్యక్తిగత వివరాలను, అర్హతలను షేర్ చేయవద్దంటూ శుక్రవారం అమెరికా ఎంబసీ ‘ఎక్స్’లో కోరింది. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగానే వచ్చేందుకు ఎక్కువ ప్రాసెస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎవరైనా చెబితే నమ్మవద్దని, అది వట్టి మోసమని వెల్లడించింది. ఇంజినీర్ ఎలా మోసపోయారంటే.. బెంగళూరు ఆర్ఆర్ నగర్కు చెందిన ఇంజినీర్(45) అమెరికా సందర్శనకు అవసరమైన బీ1/బీ2 నాన్ ఇమిగ్రాంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ఇంటర్వ్యూ షెడ్యూల్ 2026 మార్చిలో ఖరారైంది. టెలీగ్రామ్ యాప్లో వచ్చిన ఓ ప్రకటనను చూసి ఆయన.. ఓ వ్యక్తిని మే 22న సంప్రదించాడు. ఆ మోసగాడు తన పేరు వనం శ్రవణ్ కుమార్గా పరిచయం చేసుకున్నాడు. వీసా ఇంటర్వ్యూ తేదీ ముందుగా రావాలంటే అడ్వాన్స్గా రూ.10వేలు చెల్లించాలన్నాడు. ఆ మేరకు డబ్బు పంపగా, వ్యక్తిగత వివరాలు కావాలడిగాడు. అమెరికా వీసా అప్లికేషన్ పోర్టల్ లాగిన్ పాస్వర్డ్ కూడా తీసుకున్నాడు. ఫేక్ అపాయింట్మెంట్ రీషెడ్యూల్ పత్రం పంపించిన మోసగాడు...మరో రూ.10 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. లేదంటే లాగిన్ పాస్వర్డును మారుస్తానని బెదిరించాడు. ఆ మేరకు రూ.10వేలు చెల్లించిన తర్వాత కూడా ఆ మోసగాడు లాగిన్ పాస్వర్డును మార్చేశాడు. దీంతో, బాధితుడు చేసేదిలేక మే 24న పోలీసులను ఆశ్రయించాడు.అవకాశం కోల్పోయిన బాధితుడు ఈ విషయంలో బాధితుడికి అమెరికా ఎంబసీ నుంచి ఎటువంటి సాయం అందదని సీనియర్ సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. బాధితుడు ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తొందరగా వచ్చేందుకు తనంతట తానే థర్డ్ పార్టీని ఆశ్రయించాడని, అధికారిక ప్రక్రియను కాదని దొడ్డిదారిన పని పూర్తి చేసుకునే ఇటువంటి వారిని ఎంబసీ అధికారులు ప్రోత్సహించరన్నారు. వ్యక్తిగత వివరాలతోపాటు పాస్వర్డ్ సైతం మోసగాడికి ఇవ్వడం మరీ దారుణమన్నారు. బాధితుడు మరోసారి వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. ఇలా ఉండగా, విద్యార్థి వీసా ఇంటర్వ్యూలతోపాటు విజిటర్ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం గత నెలలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులందరి సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయాలంటూ విదేశాంగ శాఖ నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, నాన్ ఇమిగ్రాంట్ వీసా దరఖాస్తుదారుల నుంచి ప్రాసెసింగ్ ఫీజుగా ఇకపై వెయ్యి డాలర్లు వసూలు చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇందులో వీసా ఇంటర్వ్యూలు తొందరగా పూర్తవ్వాలని కోరుకునే పర్యాటక వీసా దరఖాస్తు దారులు సైతం ఉన్నారు. -
మరో కరోనా మహమ్మారి!
బీజింగ్: ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్ల క్రితం ఉధృతంగా మొదలై ఇప్పటికీ మరణశాసనం రాస్తున్న కరోనా వైరస్ కుటుంబానికి చెందిన కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నట్లు అమెరికా పరిశోధకులు గుర్తించారు. కోవిడ్–19కు మూలకారణంగా భావిస్తున్న చైనాలోని గబ్బిలాల్లో ఈ వైరస్ల ఉనికిని కనిపెట్టారు. వీటిలో మరొక్క చిన్నపాటి ఉత్పరివర్తనం(మ్యుటేషన్) జరిగితే మనుషులకు ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా పరిశోధనలు నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలను నేచర్ కమ్యూనికేషన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ మిస్టరీ వైరస్లు కరోనా మాదిరిగానే మెర్స్–కోవ్ కుటుంబానికి చెందుతాయని తెలిపారు. కరోనా వైరస్ సృష్టిస్తున్న ఉత్పాతం గురించి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడిన వారిలో 34 శాతం మంది మరణించినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. → మెర్స్–కోవ్ కుటుంబంలోని ఉపవర్గమైన మెర్బికో వైరస్లపై అమెరికా సైంటిస్టులు నిశితంగా దృష్టిపెట్టారు. ఈ ఉపవర్గంలోని హెచ్కేయూ5 వైరస్లతో ముప్పు ముంచుకొస్తున్నట్లు పేర్కొంటున్నారు. → హెచ్కేయూ5 వైరస్ల గురించి ఇప్పటిదాకా తెలిసింది తక్కువే. మనుషుల్లో కణాలను తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి వీటికి ఉందని వైరాలజిస్టు డాక్టర్ మైఖేల్ లెట్కో చెప్పారు. వీటిలో మరో మ్యుటేషన్ జరిగి, మనుషులకు సోకితే ప్రాణాంతకంగా మారే పరిస్థితిని కొట్టిపారేయలేమని వెల్లడించారు. → సార్స్–కోవ్–2 అనే వైరస్ కోవిడ్–19 వ్యాధిని కలిగించినట్లుగానే హెచ్కేయూ5 వైరస్లు స్పైక్ ప్రొటీన్ ఆధారంగా మనుషుల కణాల్లోకి ప్రవేశించి, నాశనం చేయగలవు. → చైనాలో గబ్బిలాల నుంచి మింక్స్ అనే జంతువులకు వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు. ఇతర జీవులకు సైతం వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. → హెచ్కేయూ5 వైరస్ల విషయంలో ఇప్పటికిప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ మైఖేల్ లెట్కో సూచించారు. అయినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. -
ట్రంప్కు చుక్కెదురు.. హార్వర్డ్కు ఊరట
బోస్టన్: విదేశీ విద్యార్థులకు హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University) ప్రవేశం నిషేధించిన వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు చుక్కెదురైంది. ఆయన నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ విధిస్తూ బోస్టన్(మసాచుసెట్స్) ఫెడరల్ కోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో హార్వర్డ్కు తాత్కాలిక ఊరట లభించింది.హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ట్రంప్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన నిర్ణయం సహేతుకం కాదని న్యాయస్థానంలో హార్వర్డ్ సవాల్ చేసింది. అయితే వాదనలు ఇరు పక్షాల వాదనలు వినడానికి ముందే జడ్జి అలిసన్ బర్రౌస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ నిర్ణయం యూనివర్సిటీ ప్రతిష్టను, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బ తీస్తుందని వ్యాఖ్యానిస్తూ.. ఆ ఉత్తర్వులపై తాత్కాలిక నిషేధం విధిస్తునన్నట్లు ప్రకటించారు. ఈ కేసులో తదుపరి విచారణ జూన్ 16వ తేదీన జరగనుంది.కాగా.. హార్వర్డ్లో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఫెడరల్ కోర్టు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలోనే యూనివర్సిటీలో చదవాలనుకొనే విదేశీ విద్యార్థుల వీసాలపై ఆంక్షలు విధిస్తూ ఓ కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. మసాచుసెట్స్లోని కేంబ్రిడ్జిలో ఉన్న క్యాంపస్లో విదేశీ విద్యార్థులను హార్వర్డ్లో చేర్చుకోవడం వల్ల జాతీయ భద్రతను ప్రమాదంలోకి నెట్టే ముప్పుందని ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అమెరికాలోనే అతి పురాతనమైన యూనివర్సిటీగా హార్వర్డ్కి పేరుంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఈ యూనివర్సిటీ లక్ష్యంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఉగ్రవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా హార్వర్డ్ మారిందని ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి ఇచ్చే 2.2 బిలియన్ డాలర్ల కోత విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఆపై మరో 450 మిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. విదేశీ విద్యార్థుల అక్రమ, హింసాత్మక కార్యకలాపాల రికార్డులను సమర్పిస్తేనే కొత్తగా విదేశీయులను చేర్చుకునేందుకు అనుమతిస్తామని వైట్హౌజ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి స్పష్టం చేసింది. రికార్డులను సమర్పించకపోతే వర్సిటీకున్న ప్రవేశాల అర్హతను రద్దు చేస్తామని హెచ్చరించింది కూడా. అదే సమయంలో విశ్వవిద్యాలయంలో జాతి వివక్షపై ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై ఫెడరల్ అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొంది. అయితే ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను హార్వర్డ్ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొడుతూ వస్తున్నారు. ఏ రాజకీయ భావజాలంతో యూనివర్సిటీ పని చేయట్లేదని.. విద్యార్థులను ఎంపిక చేయడంలో తాము జాతిని కాకుండా వారి ప్రతిభ, ప్రత్యేక లక్షణాలను చూసి ఎంపిక చేస్తామని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వ డిమాండ్లకు ఏమాత్రం తలొగ్గేది లేదని.. తమ స్వాతంత్య్రం, రాజ్యాంగ హక్కుల విషయంలో రాజీ పడలేమని పేర్కొంది. తాము చట్ట ప్రకారమే నడుచుకుంటామని.. ప్రభుత్వ యంత్రాంగం కూడా వాటికి అనుగుణంగానే వ్యవహరించాలని కోరింది. మరోవైపు.. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ నిర్ణయాలపై హార్వర్డ్ దావా వేసింది. -
బాంబు పేల్చిన మస్క్.. ట్రంప్పై సంచలన ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.వాషింగ్టన్: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సంచలన ఆరోపణలకు దిగాడు. ‘‘పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES)లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం’’ లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరునుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.Have a nice day, DJT!— Elon Musk (@elonmusk) June 5, 2025 ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అంతకు ముందు.. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ‘నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారు’ అని ఆయన గురువారం స్పష్టం చేశారు. అయితే.. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు(మస్క్ను ఉద్దేశించి..) లేకపోవడం విచారకరమని ట్రంప్ సైతం వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్లో స్పందించారు. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ఎస్ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు.In light of the President’s statement about cancellation of my government contracts, @SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately pic.twitter.com/NG9sijjkgW— Elon Musk (@elonmusk) June 5, 2025 అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టవచ్చా? అని అభిమానులను ప్రశ్నించారు. ‘80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగాడు. అలాగే ట్రంప్ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు. Yes https://t.co/rqRsX8B4Hg— Elon Musk (@elonmusk) June 5, 2025తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)కు మస్క్ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్ శ్వేత సౌధంలోని ఓవల్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్కు అభ్యంతరాలు లేవని అన్నారు.‘మస్క్కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ ఎక్స్లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు. -
దేశ సేవ నేరమా?
వాషింగ్టన్: దేశ ప్రయోజనాల కోసం పని చేయడం నేరమా? అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ప్రశ్నించారు. దేశానికి సేవ చేయడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా భావించేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ నాయకత్వానికి చురక అంటించారు. వారిని వారు ప్రశ్నించుకుంటే అసలు నిజం ఏమిటో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేసే ఉద్దేశం లేదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్పై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష బృందానికి నేతృత్వం వహిస్తున్న శశిథరూర్ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. మోదీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానంటూ తనపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై స్పందించారు. దేశానికి సేవ చేస్తున్నప్పుడు ఇలాంటి చిల్లరమల్లర విమర్శలు, ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తాను బీజేపీలో చేరబోతున్నానంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రజలు తనను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకున్నారని, ఎంపీగా పదవీ కాలం మరో నాలుగేళ్లు ఉందని, ఇలాంటి సమయంలో పార్టీ మార్పు ప్రశ్న ఎందుకు చర్చకు వస్తోందో తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ మారాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని తేల్చిచెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలు ‘చిన్న విషయం’అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుట ప్రధాని నరేంద్ర మోదీ లొంగిపోయారని, అందుకే పాకిస్తాన్పై యుద్ధం హఠాత్తుగా ఆపేశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన ఆరోపణల పట్ల శశి థరూర్ స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పారీ్టలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడం సహజమేనని కొట్టిపారేశారు. అయినా తాము ఇక్కడికి రాజకీయ కార్యక్రమం కోసం రాలేదని, ఐక్య భారత్ ప్రతినిధులుగా వచ్చామని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశ సందేశానికి ప్రపంచ దేశాలకు చేరవేస్తున్నామని ఉద్ఘాటించారు. అఖిలపక్ష బృందంలో వేర్వేరు పార్టీల నేతలు సభ్యులుగా ఉన్నారని గుర్తుచేశారు. ఇది కూడా భిన్నత్వంలో ఏకత్వానికి సంకేతమని వివరించారు. మన మధ్య రాజకీయ విభేదాలు ఏవైనా ఉంటే అవి దేశ సరిహద్దుల్లోనే ఆగిపోవాలని, సరిహద్దు దాటితే మనమంతా భారతీయులమేనని గతంలో ఒక సందర్భంలో తాను చెప్పినట్లు గుర్తుచేశారు. భారత్–పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని ఆపేశానంటూ ట్రంప్ పదేపదే చెబుతుండడంపై ప్రశ్నించగా, ‘‘ట్రంప్ వ్యాఖ్యలు, వాటిపై రాహుల్ విమర్శలు నిజానికి చిన్న విషయాలు’’ అంటూ థరూర్ ఆసక్తికరంగా స్పందించారు. ‘‘అమెరికా అధ్యక్షునిగా ట్రంప్పై భారత్కు ఎంతో గౌరవముంది. ఇలాంటి ఉదంతంతో ద్వైపాక్షిక సంబంధాలు సంక్లిష్టం కావడం భారత్కు ఇష్టం లేదు. ఒక్కటి మాత్రం సుస్పష్టం. మధ్యవర్తిత్వం కోసం ఎవరినో ప్రాధేయపడాల్సిన అవసరం భారత్కు లేదు. పాక్ దాడి చేస్తే గట్టిగా బదులిస్తామని, ఆపేస్తే తామూ ఆపేస్తామని భారత్ మొదట్లోనే చెప్పింది. అలాంటప్పుడు పాక్పై దాడులు ఆపాలని మాకు ఇంకెవరో చెప్పే సందర్భమే తలెత్తదు’’ అని కుండబద్దలు కొట్టారు. ఆపరేషన్ సిందూర్ను తట్టుకోలేక పాకే అమెరికా శరణుజొచ్చిందేమో. లేదంటే కాల్పుల విరమణ కోసం అమెరికాయే పాక్పై ఒత్తిడి చేసి ఉండొచ్చు’’ అన్నారు. -
డొనాల్డ్ ట్రంప్ ట్రాప్లో జిన్పింగ్!
వాషింగ్టన్: అమెరికా-చైనాలు తమకు అవకాశం వచ్చినప్పుడల్లా కత్తులు దూసుకుంటూ ఉంటాయనేది జగమెరిగిన సత్యం. అమెరికా పేరెత్తితే చైనా, డ్రాగన్ పేరెత్తితే అగ్రరాజ్యం అంత ఎత్తున పైకి లేచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాంలో వీరి మధ్య మాటల యుద్ధం ఎంతటి తారాస్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో సుంకాల ఆంక్షలు ఒకటి. ఈ నిర్ణయాలను చైనా తీవ్రంగా విభేదించింది కూడా. జిన్పింగ్కు ట్రంప్ ఫోన్..అయితే తాజాగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. జిన్పింగ్తో ట్రంప్ ఫోన్లో సంభాషించిన విషయాన్ని ఈరోజు(గురువారం) ట్రంప్ తన సోషల్ మీడియా సైట్ ‘ట్రూత్’లో వెల్లడించారు. “నాకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంటే ఇష్టం. ఆయన ఎప్పుడూ ఇష్టమే, ఆయనతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా కష్టం” అని ట్రంప్ పోస్ట్ చేశారు. సంకాల ‘వార్’సుంకాల ఆంక్షలతో చైనాను విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టే యత్నం చేశారు ట్రంప్. అయితే చైనా కూడా ట్రంప్ చర్యలకు ప్రతీ చర్యగా అమెరికా వస్తువులపై కూడా సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. ఈ క్రమంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్.. అమెరికాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ‘ భయపెడితే భయపోతాం అనుకుంటున్నారా.. చర్యకు ప్రతిచర్య సిద్ధం’ అంటూ సవాల్ చేశారు. అక్కడ నుంచి ఇరు దేశాల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. చైనా వస్తువులపై 145 సుంకాన్ని ట్రంప్ విధించగా, అమెరికా వస్తువులపై 125 శాతం సుంకాన్ని చైనా విధించింది. అయితే ఆ తర్వాత 145 శాతం సుంకాన్ని 30 శాతానికి తగ్గించగా, 125 శాతం సుంకాన్ని 10కి పరిమితం చేసింది చైనా . ఇలా ఇరు దేశాలు ఒక రాజీకి రావడంతో సమస్య తెరపడినట్లయ్యింది. -
102 ఏళ్ల డాక్టర్..ఇప్పటికీ వైద్య సేవలోనే..! చిరకాలం బతకాలంటే..
ఎవ్వరైన రిటైర్మెంట్ ఏజ్ వరకు పనిచేస్తారు. ఆ తర్వాత పదవీవిరణ చేసి..రెస్ట్ తీసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఈ శతాధికుడు విరామం ఎరుగని వైద్యుడు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రెండొవ ప్రపంచకాలం నాటి ఈ వృద్ధ డాక్టర్ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అంతకంతకు పురోగమిస్తున్నారు. యువకుడి మాదిరిగా చురుగ్గా అన్నిపనులు చురుగ్గా చేసుకుంటారాయన. అంతేగాదు సుదీర్ఘకాలం ఆరోగ్యంగా బతకాలంటే ఆ పనులు చేయొద్దని సూచనలిస్తున్నారాయన.అతడే. అమెరికాలో క్లీవ్ల్యాండ్కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ హోవార్డ్ టక్కర్. ఆయనకు 102 ఏళ్లు. ఇప్పటికీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ..ఎందరో వైద్య విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. అంతేగాదు టక్కర్ అత్యంత వృద్ధ ప్రాక్టీస్ డాక్టర్(Worlds Oldest Practicing Doctor)గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను కూడా దక్కించుకున్నాడు. 1922లో జన్మించిన డాక్టర్ టక్కర్ మహా మాంద్యం, రెండో ప్రపంచ యుద్ధం, కోవిడ్-19 మహమ్మారితో సహా ఒక శతాబ్ద నాటి చారిత్రక సంక్షోభాలకు నిలువెత్తు సాక్ష్యం ఆయన. విశేషం ఏంటంటే..ఇప్పటివరకు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నారు డాక్టర్ టక్కర్. తాను ఇంతవరకు ఎలాంటి భయానక వ్యాధులతో బాధపడలేదన్నారు. అయితే 80లలో మాత్రం మెడ సమస్యతో కొన్నాళ్లు ఇబ్బంది పడ్డానని, అయితే సునాయాసంగా ఆ సమస్యను జయించానని చెప్పారు. తన జీవితానుభవంతో నేర్చుకున్న ఆ నాలుగు పాఠాలే తన దీర్ఘాయువు రహస్యంగా విశ్వసిస్తారాయన. అంతేగాదు పదవీవిరమణ గురించి కూడా అస్సలు ఆలోచించరట. ఎందుకంటే దీర్ఘాయువు ప్రధాన శత్రువే పదవీ విరమణ అని నొక్కి చెబుతున్నారాయన. మరి టక్కర్ దీర్ఘాయువు రహస్యం ఏంటో తెలుసుకుందాం..👉 ఈ వృద్ధ డాక్టర్ తన జీవితాంతం వ్యాయామాన్ని స్కిప్ చేయలేదన్నారు. ఈత కొట్టడం దగ్గర నుంచి జాగింగ్, స్కీయింగ్, జిమ్, ట్రెడ్మీల్ వరకు అన్నింటి ని చేస్తారట ఆయన.👉 అలాగే ఉద్యోగానికి పదవీవిరమణ ఇవ్వొద్దు..ఏదో ఒక వ్యాపకంతో ఉండండి. చేయగలిగిన ఉద్యోగం ఏదో ఒకటి చేయండి అని అంటున్నారు. లేదంటే మెదడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడవ్వుతుందట. తద్వారా అనారోగ్యాల బారినపడతామట. 👉 ఎల్లప్పుడూ పనిజీవితం, కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించండి. అలాగే ఎల్లప్పుడూ సానుకూలత, ఆశావాదానికే ప్రాముఖ్యత ఇవ్వండి. 👉 భవిష్యత్తు గురించి చిత్తించకుండా చేసే పనిలో సంతోషాన్ని వెతకండి. అలాగే కుటుంబసభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపండి. 👉 ఈ వృద్ధ డాక్టర్ వ్యక్తిగత జీవితానికి వస్తే..మానసిక నిపుణురాలైన సారా అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆ దంపతులకు నలుగురు పిల్లలు, పదిమంది మనవరాళ్లు ఉన్నారు. అయితే ఇప్పటికీ తన భార్యతో గొడపడటం, ప్రేమించడం వంటివి చేస్తానన్నారు.👉 చివరగా ప్రతిఒక్కరు తమ జీవిత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. ప్రతి ఉదయం సాధారణంగా సాగిపోకూడదన్నారు. అప్పుడే జీవితానికి సార్థకత ఉంటుందని చెప్పారు. 👉 అలాగే ఆయన సాధ్యమైనంత వరకు స్మార్ట్ఫోన్, ఇంటర్నెట్ని వినియోగిస్తారు. సోషల్ మీడియా స్టార్గా మాత్రం ఉండనున్నారు. ఎందుకంటే స్వానుభవాలే..గొప్ప పాఠాలనేది ఆయన అభిమతం. 👉 వీటన్నింటి తోపాటు ధూమపానం, మద్యపానం సేవించొద్దని అన్నారు. తాను జీవితాంతం వాటి జోలికిపోలేదన్నారు. అలాగే మితంగానే ఆహారం తీసుకుంటానని చెప్పారు. 👉 అంతేగాదు డాక్టర్ టక్కర్ "జీవితమే ప్రాణాంతక వ్యాధి , దానికి విరుగుడు జీవించడమే" అని చమత్కారంగా చెప్పారు. ఈ వృద్ధ డాక్టర్ మాములు గ్రేట్ కాదు. అద్భుతమైన జీవిత పాఠాలు, ఆరోగ్య విధానం గురించి బహు చక్కగా వివరించారు డాక్టర్ టక్కర్. (చదవండి: ఆక్సియమ్ స్పేస్ మిషన్లో ఈసారి సరస్వతి దేవి వాహనం..) -
‘తలపై గురిపెట్టేవారితో మాట్లాడేదే లేదు’: ఎంపీ శశి థరూర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ తీరుపై ఎంపీ శశిథరూర్(MP Shashi Tharoor) మండిపడ్డారు. ఉగ్రవాద బెదిరింపులు కొనసాగుతున్నంత కాలం పాకిస్తాన్తో భారత్ మాట్లాడే ప్రస్తకే లేదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న అఖిలపక్షానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు. తమ ప్రతినిధి బృందం వివిధ దేశాల్లో పర్యటిస్తూ, పాక్ తీరును ఎండగడుతున్నదన్నారు.వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ ‘మా తలపై తుపాకీ గురిపెట్టేవారితో చర్చలు జరిపేదేలేదని’ ఆయన స్పష్టం చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై భారతదేశ వైఖరిని అమెరికాతో సహా అన్ని భాగస్వామ్య దేశాల ఎదుట స్పష్టం చేసినట్లు థరూర్ పేర్కొన్నారు. భారత్-పాక్ చర్చలను ప్రోత్సహించడంలో అమెరికా ప్రమేయంపై ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ విషయంలో భారత వైఖరిని అమెరికా అర్థం చేసుకున్నదన్నారు. భారత్ సూత్రప్రాయంగా సంభాషణకు సిద్ధంగా ఉందని, అయితే అది బలవంతంగా ఎప్పటికీ జరగదని ఆయన అన్నారు.వాణిజ్యాన్ని సాకుగా చూపిస్తూ, భారత్-పాక్ యుద్ధాన్ని నియంత్రించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) చేసిన వాదనను కాంగ్రెస్ ఎంపీ తిరస్కరించారు. తనకు అలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. ఉద్రిక్తతల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్లకు వచ్చిన పోన్ కాల్స్ చూపిస్తూ, ఆ సంభాషణల్లో ఎప్పుడూ వాణిజ్యాన్ని ప్రస్తావించనే లేదని ఆయన అని పేర్కొన్నారు. భారతదేశానికి ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం లేదని, వారు ఆగిపోతే, మేము ఆగిపోతామని, తాము ఆత్మరక్షణ దిశగా వ్యవహరించామని థరూర్ పేర్కొన్నారు.భారత్కు చెందిన కొందరు ఎంపీలు, అమెరికాలోని మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో కూడిన భారత ప్రతినిధి బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందిన దరిమిలా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ గురించి భాగస్వామ్య దేశాలకు వివరించడమే లక్ష్యంగా అఖిలపక్ష సభ్యుల పర్యటన సాగుతోంది. ఈ బృందంలో థరూర్తో పాటు, బీజేపీ ఎంపీలు తేజస్వి సూర్య, భువనేశ్వర్ కలిత, శశాంక్ మణి త్రిపాఠి ఉన్నారు. అలాగే శివసేన నుంచి మిలింద్ దేవరా, మల్లికార్జున్ దేవరా, శాంభవి చౌదరి (లోక్ జనశక్తి పార్టీ), సర్ఫరాజ్ అహ్మద్ (జార్ఖండ్ ముక్తి మోర్చా),జీఎం హరీష్ బాలయోగి (తెలుగు దేశం పార్టీ) ఉన్నారు.ఇది కూడా చదవండి: బెంగళూరు తొక్కిసలాట: మృతులంతా 40 ఏళ్లలోపు వారే.. -
‘వీసా’ భయాలతో భారతీయ విద్యార్థులు ఏం చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) వరుస నిర్ణయాలతో విదేశీ విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉన్నవాళ్లను సొంత దేశాలకు పంపించేయడం.. కొత్త వాళ్లను అమెరికాలో అడుగుపెట్టనివ్వకుండా కఠిన ఆంక్షల దిశగా అడుగులేస్తున్నారాయన. ఈ క్రమంలో వీసాల కోసం ప్రయత్నిస్తున్న భారతీయ విద్యార్థులు(Indian Students) అప్రమత్తం అయ్యారు. కొందరు తాము చేసిన పోస్టులు తొలగిస్తుండగా.. మరికొందరు ఏకంగా సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులకు వీసాలు(American Visas) మంజూరు చేయడానికి ముందు వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీలు చేసే పనిలో అమెరికా అధికార యంత్రాంగం ఉంది. ఇందుకోసం అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఉపయోగిస్తోంది. పాలస్తీనా మద్దతుదారుల దగ్గరి నుంచి.. యూఎస్ క్యాంపస్లలో జరిగిన వివిధ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను ఈ సాంకేతికత ఉపయోగించే బయటకు పంపించేసింది. ఈ క్రమంలో.. అతిగా ఉన్న పోస్టులు చూస్తే చిక్కుల్లో పడతామనే భావనతో అలాంటి వాటిని భారతీయ విద్యార్థులు డిలీట్ చేస్తున్నారు. ఫేస్బుక్, ఎక్స్, లింక్డిన, టిక్టాక్ ఇలా ఇతర ఫ్లాట్ఫారమ్లన్నింటిని జల్లెడ పడుతున్నారు. వాటిల్లో తమ యాక్టివిటీ( పోస్టులు చేయడంతో పాటు లైకులు, షేర్లు, కామెంట్లు.. వగైరా)ని తొలగిస్తున్నారు. కొందరైతే ఏకంగా అకౌంట్నే తొలగిస్తున్నట్లు సమాచారం.అభిప్రాయాల దగ్గరి నుంచి పొలిటికల్ జోక్స్ దాకా వేటిని తమ టైం లైన్లో ఉంచడం లేదు. అమెరికా అధికారులు వాటిని చూస్తే వీసాలు రిజెక్ట్ అవుతాయని భయపడుతున్నారు. అయితే ఇలా హఠాత్తుగా అకౌంట్లనూ తొలగించడమూ మంచిది కాదనే అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. -
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం
-
భారత్పై అభిమానంతో అమెరికా నుంచి వచ్చేసింది..! కట్చేస్తే..
ఎక్కడ ఉండాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఇండియా అంటే మాత్రం గుండెల నిండా అభిమానం. తట్టాబుట్టా సర్దుకొని ముంబైలో ల్యాండ్ అయింది ఎలిజా కరాజ, ఉద్యోగం వెదుక్కుంటూ ఇండియా నుంచి అమెరికాకు వెళ్లడం అనేది సాధారణం. 19 సంవత్సరాల ఎలిజా కరాజ మాత్రం అమెరికా నుంచి ఇండియాకు వచ్చింది. షికాగోలో పుట్టి పెరిగిన ఈ సిరియన్–అమెరికన్ ఆర్టిస్ట్ ముంబైలోని ఒక స్కూలులో ఆర్ట్ టీచర్గా చేరింది.ఆమె ఉద్యోగంలో చేరేనాటికి ముంబై గురించి బొత్తిగా తెలియదు.తన జీతం గురించి కూడా పట్టించుకోలేదు.కట్ చేస్తే....ఎలిజా కరాజ ముంబైకి వచ్చి పది సంవత్సరాలు అవుతుంది. ముంబై ఇప్పుడు తన సొంత ఇల్లు. హిందీ చాలా బాగా మాట్లాడుతుంది. ముంబైతో పది సంవత్సరాల అనుభవాలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ‘హరకాత్’ ఫ్యాషన్ లేబుల్తో ఎంటర్ప్రెన్యూర్గా విజయం సాధించింది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో వేలాదిమంది ఫాలోవర్లు ఉన్న ఎలిజా కరాజ ఆర్టిస్ట్, స్టోరీ టెల్లర్, ఎంటర్ప్రెన్యూర్గా ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. View this post on Instagram A post shared by 🌑eliza🌙 (@kweenkaraza) (చదవండి: 'ఓపిక'కు మారుపేరుగా ఆర్సీబీ గెలుపు..! ఏకంగా ఢిల్లీ పోలీసులు..) -
ఇరాన్కు ట్రంప్ బిగ్ షాక్.. 12 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఇరాన్ సహా 12 దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పెద్ద షాకిచ్చారు. ఆ దేశాల పౌరులు అమెరికాలో అడుగుపెట్టకుండా ట్రావెల్ బ్యాన్(Travel Ban) విధిస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. రాబోయే సోమవారం(జూన్ 9వ తేదీ) నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ జాబితాలో ఇరాన్(Trump Travel ban on Iran), లిబియా, అఫ్గనిస్తాన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, హైతీ, సోమాలియా, సూడాన్, యెమెన్, ఎరిత్రియా సైతం ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాలపైనా ఆయన తాత్కాలిక నిషేధం విధించారు. ఇందులో.. బూరుండి, వెనిజులా, క్యూబా, లావోస్, సియెరా లియోన్, టోగో, టుర్కిమేనిస్తాన్ ఉన్నాయి.ఈ మేరకు అధ్యక్ష భవనం వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా పొందుతున్న వ్యక్తుల సమాచారాన్ని తగిన విధంగా పరిశీలించే అవకాశాలు తక్కువగా ఉండడం, అదే సయమంలో వీసా గడువు ముగిసినా కూడా తిరిగి వెళ్లకుండా అమెరికాలోనే ఉండిపోతుండడం.. ఈ రెండు కారణాల వల్ల భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. ప్రమాదకరమైన విదేశీ శక్తుల నుంచి అమెరికన్లను రక్షిస్తానని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. ఇప్పుడు ఆయన ఆ హామీని నిలబెట్టుకుంటున్నారు అని వైట్హౌజ్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల నియంత్రణలో ఉండడం, ఇరాన్ క్యూబా దేశాల్లో ఉగ్రవాదాన్ని ప్రభుత్వాలే ప్రోత్సాహిస్తుండడం, చాద్.. ఎరిత్రియాలాంటి దేశాల పౌరులు వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోతుండడం.. లాంటి కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ట్రంప్ ‘విదేశీ ఉగ్రవాదుల నుంచి అమెరికాను రక్షించడం కోసమే’ అంటూ ప్రకటించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. అధ్యక్షుడిగా ట్రంప్ తన తొలి టర్మ్లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. 2017లో ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ఇరాక్, ఇరాన్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాల పౌరులను అమెరికాలోకి రాకుండా నిషేధించారు. అయితే ఆ తర్వాత జో బైడెన్ అధికారంలోకి వచ్చాక 2021లో దానిని ఎత్తివేశారు. -
కోర్టులోనూ అమెరికాది అదే పాట!
భారత్–పాకిస్తాన్లను ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరింపజేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టముకు వేసుకోవడంపై ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. ఆయన మాటల్లో వాస్తవం లేదని భారత్ చెబుతున్నా, ట్రంప్ మాత్రం తాను శాంతి దూతగా వ్యవహరించినట్లు చెప్పుకుంటూనే ఉన్నారు. ‘‘ఈ ఒప్పందం కుదర్చగలగడం నాకెంతో గర్వంగా ఉంది. ఎందుకంటే, బులెట్లకు బదులు వాణిజ్యం ద్వారా భారత్–పాకిస్తాన్లను దారికి తేగలిగాను. ఆ రెండింటి మధ్య ఘర్షణ అణ్వస్త్ర యుద్ధంగా పరిణమించకుండా ఆపగలిగాను’’ అని ట్రంప్ మే 30న ప్రకటించారు. నేనే శాంతిదూతను!మే 10న ప్రకటించిన కాల్పుల విరమణ సందర్భంగా ఆయన చెప్పిన మూడు అంశాల సారాంశంగా ఈ వ్యాఖ్య నిలుస్తోంది. ఒకటి – తానే పెద్దమనిషిగా వ్యవహరించినట్లు చెప్పుకోవడం. రెండు – ఘర్షణ అణు యుద్ధంగా మారగల అవకాశం ఎంతైనా ఉందని భావించడం. మూడు – రెండు దేశాలతోను వాణిజ్య సంబంధాలను తెగతెంపులు చేసుకుంటానని తాను హెచ్చరించినట్లు చెప్పడం. ఆ విధంగా రెండు దేశాలను కాల్పుల విరమణకు అంగీకరించేట్లు చేయడం. పాకిస్తాన్కు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్ (డీజీఎంఓ) భారత్లోని తన సహచరునికి మే 10న ఫోన్ చేసిన తర్వాతనే దాడి ప్రతిదాడులు ఆగాయని భారత్ ప్రకటించింది. ఘర్షణ సంప్రదాయ చట్రం లోపలికే పరిమితమైందనీ, అణ్వస్త్రాన్ని బయటకు తీస్తాననే సంకేతం పాక్ నుంచి ఏమీ రాలేదనీ కూడా భారత్ తేటతెల్లం చేసింది. ‘‘ఆపరేషన్ సిందూర్ మే 7న మొదలైనప్పటి నుంచి, కాల్పులు, సైనిక చర్యను నిలిపివేయాలని మే 10న ఒక అవగాహనకు వచ్చేంత వరకు, మారుతూ వస్తున్న సైనిక పరిస్థితులపై భారత్–అమెరికా నాయకుల మధ్య సంభాషణలు కొనసాగుతూ వచ్చాయి. ఈ మాటల్లో వాణిజ్య అంశం ప్రస్తావనకు రానేలేదు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మే 13న చెప్పిన సంగతి గమనార్హం. కాల్పుల విరమణ కుదిర్చేందుకు ట్రంప్ వాణిజ్య అంశాన్ని లేవనెత్తారని అమెరికా వాణిజ్య మంత్రి హవర్డ్ లట్నిక్ ఒక అమెరికన్ కోర్టులో వాఙ్మూలం ఇచ్చిన సంగతిని మే 29న జైస్వాల్ దృష్టికి తెచ్చినపుడు, ‘‘కోర్టు ఉత్తర్వును కూడా మీరు చూసే ఉంటారు’’ అని ఆయన జవాబిచ్చారు. తర్వాత, జైస్వాల్ తాను మే13న చేసిన వ్యాఖ్యలనే పునరుద్ఘాటించారు. కోర్టు ఉత్తర్వు గురించి ప్రస్తావించడంలో ఆయన తొందరపడ్డారనిపించింది. ఎందుకంటే, అమెరికాలోని మరో పైకోర్టు అదే రోజు (మే 29)న దిగువ కోర్టు ఉత్తర్వుపై స్టే ఇచ్చింది. ఆ అధికార ప్రతినిధి భారత్ వైఖరిలోని సత్యసంధతను నిరూపించేందుకు దిగువ కోర్టు నిర్ణయంపై ఆధారపడకుండా ఉండాల్సింది. ఇంకో ఆరు దేశాలు!వివిధ దేశాలు జోక్యం చేసుకున్న ఫలితంగా కాల్పుల విరమణ సాధ్యమైందని పాకిస్తాన్ వెల్లడించింది. పాకిస్తాన్ సైనిక దళాల సంయుక్త కమిటీ చైర్మన్ జనరల్ సాహిర్ షంషాద్ మీర్జా, గత వారం సింగపూర్లో సాగిన షాంగ్రి–లా డైలాగ్ సందర్భంగా, ఆరు దేశాల పేర్లను ప్రస్తావించారు. అవి – అమెరికా, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, తుర్కియే, చైనా. తాను కుదిర్చిన ఉత్తమ ‘ఒప్పందానికి’ మొత్తం ఘనత తనదేనని చెప్పుకుంటున్న ట్రంప్కు ఆ మాటలు ఇంపైనవి కావని వేరే చెప్పనవసరం లేదు. ఈ ఘర్షణ సంప్రదాయ చట్రం పరిధిని మించగల ప్రమాదం ఉందని ఇస్లామాబాద్ అనలేదు. జోక్యం చేసుకునేందుకు విదేశీ శక్తులు తగినంత సమయాన్ని వెచ్చించకపోతే, భారత్ చలన శక్తి, పరస్పర అణ్వాయుధ ప్రయోగాలకు దారితీయగల అవకాశముందని తనకున్న సాధారణ ఆందోళనను పాక్ ఈ సందర్భంగా పునరు ద్ఘాటించింది. ఘర్షణలను నిలిపివేయకపోతే వాణిజ్య సంబంధాలను నిలిపివేస్తానని బెదిరించినట్లు ట్రంప్ చెప్పుకోవడంపై పాకిస్తాన్ ఏ విధమైన వ్యాఖ్యా చేయలేదు. మరోవైపు పాకిస్తాన్–అమెరికాల మధ్య వాణిజ్య చర్చలకు రంగం సిద్ధమైంది. వాణిజ్యానికి సంబంధించి భారత్ సంవేదనలపై ట్రంప్ ప్రభుత్వం ఎందుకంత ఉపేక్ష వహించినట్లు? పైగా, లట్నిక్ ఒక అమెరికా కోర్టుకు మే 23న సమర్పించిన అఫిడవిట్లో కూడా దాన్ని ఎందుకు చేర్చినట్లు? ట్రంప్ అనుసరిస్తున్న సుంకాల విధానాలకు ఎదురవుతున్న చట్టపరమైన సవాల్కు సంబంధించిన కేసు అది.అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (ఐ.ఇ.ఇ.పి.ఏ.) అని అమెరికాలో ఓ చట్టం ఉంది. దానికింద, ట్రంప్ సుంకాల విధా నాలను సమర్థించుకుంటున్నారు. సాంకేతికంగా చూస్తే, లట్నిక్ ఒక డిక్లరేషన్ ఇచ్చినట్లే లెక్క. ‘‘అంతకుముందు పేర్కొన్న మాటలు సత్యమైనవి, సరైనవి’’ అని ఆయన ప్రకటించారు. కాల్పుల విరమణను అమలులోకి తెచ్చేందుకు వాణిజ్యాన్ని ఆయుధంగా వాడుకున్నట్లు ట్రంప్ చేసిన లాంటి రాజకీయ ప్రకటనను ఒక దేశం లీగల్ డాక్యుమెంట్గా మార్చడం కనివిని ఎరుగనిదని నా దౌత్యపరమైన అనుభవం సూచిస్తోంది. దీని వల్ల ట్రంప్ చెప్పుకుంటున్న గొప్పను అమెరికా కాదనలేని అనివార్య స్థితి ఏర్పడుతోంది. ట్రంప్ నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తూ ఉంటారు. తరచూ తన ప్రకటనలకు తానే విరుద్ధంగా మాట్లాడు తూంటారు. కానీ, లీగల్ డాక్యుమెంట్ను తారుమారు చేయడం కుదరదు. పైగా, భారత్–అమెరికాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు సాగిస్తున్న సమయంలో, అమెరికా అలాంటి వాఙ్మూలం ఇవ్వడం ఈ అంశంపై భారత్ వైఖరికి విరుద్ధంగా ఉంది. స్నేహం ఉన్నట్టేనా?‘‘పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించేందుకు అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకుని అమెరికాతో వాణిజ్య సౌలభ్యాన్ని రెండు దేశాలకు ఇవ్వచూపబట్టే కాల్పుల విరమణ సాధ్యమైంది. ఈ కేసులో, అధ్య క్షుడి అధికారాన్ని నిరోధించే విధంగా ఎటువంటి ప్రతికూల తీర్పు నిచ్చినా, ట్రంప్ ఇచ్చిన ఆఫర్ చట్టబద్ధతను భారత్–పాకిస్తాన్లు ప్రశ్నించగల స్థితి తలెత్తుతుంది. అది ఒక మొత్తం ప్రాంత భద్రతకు, కోట్లాది మంది జీవితాలకు ముప్పుగా పరిణమిస్తుంది’’ అని కూడా లట్నిక్ పేర్కొన్నారు. లట్నిక్ డిక్లరేషన్పై మే 29న అడిగిన మరో ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మొహం ముటకరించుకుని ‘‘నేను నా వైపు నుంచి పరిస్థితిని వివరించాను. రెండు వైపుల దేశ పతాకాలను పెట్టుకుని, భారతదేశ ప్రభుత్వ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిగా నేను ఆ పని చేసినట్లు లెక్క. దానికి పర్యవసానాలుంటాయి. అవి చాలా పెద్దవిగా ఉంటాయని అర్థం చేసుకోవాలి’’ అన్నారు.నిజమే! అమెరికా వాణిజ్య మంత్రి ఒక అమెరికన్ కోర్టులో తప్పుడు డిక్లరేషన్ ఇచ్చారని మోదీ ప్రభుత్వం అధికారికంగా ప్రక టిస్తే, వ్యవహారం మరింత పెద్దదవుతుంది. భారత్ విషయానికి వస్తే – ఆపరేషన్ సిందూర్ నుంచి ట్రంప్ చర్యలు, ప్రకటనలు చూసి, నమ్మక ద్రోహానికి గురయ్యామనిభావించడం తప్ప చేయగలిగింది లేదు. హిందీ సినిమా ‘సంగమ్’ లోని ‘దోస్త్ దోస్త్ న రహా...’ పాట నేటి భారత్ స్థితికి అద్దంపడుతుంది. ‘హోడీ మోదీ’, ‘నమస్తే ట్రంప్’ అంటూ జబ్బలు చరుచు కున్న ఘట్టాల రోజులు ఇపుడు సుదూర జ్ఞాపకాలుగానే ఉంటాయి. వివేక్ కాట్జూ వ్యాసకర్త విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్పై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్)చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్ మస్క్కు డోజ్ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు బిగ్,బ్యూటిఫుల్’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. I’m sorry, but I just can’t stand it anymore.This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.Shame on those who voted for it: you know you did wrong. You know it.— Elon Musk (@elonmusk) June 3, 2025ట్రంప్ నిర్ణయం మారదుఅయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్కు పెంచుతుంది. అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచిందిమస్క్ ఈ బిల్లుపై డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్ న్యూస్తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. -
నా పిల్లలు.. మోదీ తాతను మిస్ అవుతున్నారు: ఉషా వాన్స్
వాషింగ్టన్ : తన పిల్లలు వాళ్ల మోదీ ( భారత ప్రధాని నరేంద్ర మోదీ) తాతను మరిచిపోలేకపోతున్నారని, మిస్ అవుతున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) సతీమణి ఉషా వాన్స్ (Usha Vance) గుర్తు చేశారు. జేడీ వాన్స్ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో భారత్లో పర్యటించారు. భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తమ పట్ల వ్యక్తిగతంగా చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేమంటూ.. ఉషా వాన్స్ అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఈ సారి తన మూలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.Usha Vance about Modi ji 🔥 pic.twitter.com/44qcmseFFX— desi mojito 🇮🇳 (@desimojito) June 3, 2025అమెరికా వాషింగ్టన్ డీసీలో యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్ పర్యటన అనుభూతిని పంచుకున్నారు. కుమారులు ఇవాన్, వివేక్ కుమార్తె మీరాబెల్లు భారత్ పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నట్లు తెలిపారు. 'నా పిల్లలు భారత పర్యటనలో ఉండగా ప్రధాని మోదీని తమ తాత లాగా భావించారు. ముఖ్యంగా నా కుమారుడు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తీసుకున్నాడు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని' అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. తన ఐదేళ్ల కుమార్తె మీరాబెల్ పుట్టిన రోజుకు ప్రత్యేక బహుమతి ఇచ్చిన నరేంద్ర మోదీ తమ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. మరోసారి భారత్లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను పర్యటిస్తానన్నారు. -
అక్కడ ఏడాదికి 25,000 రోజులు
వాషింగ్టన్: భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగిరావడానికి 365 రోజులు పడుతుందని తెల్సిందే. అదే మాదిరి ఒక చిన్నపాటి మరుగుజ్జు గ్రహం లాంటి ఖగోళ వస్తువు మన సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతోంది. ఎంతగా అంటే ఒక చుట్టు చుట్టేయడానికి ఏకంగా 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 ఓఎఫ్201 అని పేరుపెట్టారు. అయితే దీనిని గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే దీనిని పూర్తిస్థాయిలో గ్రహ లక్షణాలు లేవని తేలింది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతోందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం మన సూర్యుని చుట్టూ తిరుగుతోంది. ఇది చాలా నెమ్మదిగా పరిభ్రమిస్తోంది. ఒకసారి సూర్యుడిని చుట్టిరావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోంది. దీని వెడల్పు ఏకంగా 700 కిలోమీటర్లు. ‘‘ కోట్ల సంవత్సరాలుగా ఒకే కక్షలో పరిభ్రమిస్తోంది. ఆ లెక్కన చూస్తే బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కాస్తంత దీనికి ఉంది’’ అని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో ఖగోళ భౌతిక శాస్తవేత్త సిహావో చెంగ్ అన్నారు. మరుగుజ్జు గ్రహాల హోదా పొందిన ఐదింటిక కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్తంత చిన్నగా ఉంది. గతంలో గ్రహంగా చెలామణి అయిన ఇటీవల మరుగుజ్జు గ్రహంగా స్థిరపడిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లుకాగా ఈ 2017 ఓఎఫ్201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లే! -
అమెరికాలో మరోసారి కాల్పులు మోత..
-
అమెరికాలో ‘పాలస్తీనా టెన్షన్’.. బాంబు దాడి కలకలం
వాషింగ్టన్: అమెరికాలోని కొలరాడో(Colorado)లో కలకలం చెలరేగింది. ఇక్కడి బౌల్డర్లో చోటుచేసుకున్న దాడిలో పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ)డైరెక్టర్ కాష్ పటేల్ దీనిని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.ఎప్బీఐ పబ్లిక్ అఫైర్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బెన్ విలియమ్సన్ సోషల్ మీడియా సైట్ ‘ఎక్స్’లో ఈ విషయాన్ని తెలియజేస్తూ నిందితుడు యూదులపై బాంబులు విసురుతూ ‘ఫ్రీ పాలస్తీనా’ అని అరిచాడని తెలిపారు. కొలరాడో అటార్నీ జనరల్ ఫిల్ వీజర్ మాట్లాడుతూ ఈ ఘటనలో కొందరిని లక్ష్యంగా చేసుకోవడం చూస్తుంటే ఇది విద్వేషపూరిత నేరంగా కనిపిస్తున్నదన్నారు. కాగా నిందితుడిని 45 ఏళ్ల మొహమ్మద్ సబ్రీ సోలిమాగా ఎప్బీఐ గుర్తించింది.ఈ ఘటనపై బౌల్డర్ పోలీస్ చీఫ్ స్టీఫెన్ రెడ్ఫెర్న్ మాట్లాడుతూ గాజాలో ఇజ్రాయెల్ బందీలను గుర్తుచేసుకుంటూ ప్రదర్శన జరుగుతుండగా, దానికి సమీపంలోనే ఈ దాడి జరిగిందన్నారు. గాజా- ఇజ్రాయెల్ యుద్ధం నేపధ్యంలో అమెరికాలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న తరుణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ఇజ్రాయెల్(Israel) మద్దతుదారులు.. ఈ పాలస్తీనా అనుకూల నిరసనలను యూదు వ్యతిరేక నిరసనలుగా పేర్కొంటున్నారు. 🚨Disturbing scenes of panic and chaos! Stay away & Safe.⚠️Developing: Police are asking the public to avoid Pearl and 13th in Boulder after a reported attack as it's show here! pic.twitter.com/8ZBYzYKdgZ— Mohanad Shaabani (@MohanadShaabani) June 1, 2025బౌల్డర్లో జరిగిన ఘటనను చూసిన కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన 19 ఏళ్ల బ్రూక్ కాఫ్మన్ మాట్లాడుతూ, దాడి జరిగిన సమయంలో నలుగురు మహిళలు కాలిన గాయాలతో బాధపడుతుండటాన్ని చూశానని తెలిపారు. దాడి చేసిన వ్యక్తి ప్రాంగణంలో చొక్కా లేకుండా నిలుచుని, ఏదో ద్రవం ఉన్న గాజు సీసాలను పట్టుకుని అరిచాడని ఆమె వివరించారు. కాగా ప్రముఖ యూదు డెమొక్రాట్, సెనేట్ మైనారిటీ నేత చక్ షుమెర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ పోటీ -
మార్కెట్లపై జీడీపీ ఎఫెక్ట్
గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. మరోవైపు ఆర్బీఐ పాలసీ సమీక్షపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఎఫ్పీఐ పెట్టుబడులు, యూఎస్ టారిఫ్ పరిస్థితులు తదితర అంశాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం బలపడింది. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) 7.4 శాతం వృద్ధి చూపింది. జీడీపీ విలువ 3.9 లక్షల కోట్ల డాలర్లకు చేరడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గత వారాంతాన వెలువడిన జీడీపీ గణాంకాలు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపనున్నట్లు తెలియజేశారు. ఇక మరోపక్క ఆర్బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) మూడు రోజుల సమావేశం బుధవారం(4న) ప్రారంభంకానుంది. శుక్రవారం(6న) పాలసీ సమీక్షా నిర్ణయాలు వెలువడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు వడ్డీ రేట్ల నిర్ణయాలపై దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా తెలియజేశారు. ఈ వారం మే నెల తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ గణాంకాలు వెలువడనున్నాయి. ఆర్బీఐ గత(ఏప్రిల్) సమీక్షలో రెపో రేటును 0.25 శాతం తగ్గించి 6 శాతానికి దించిన సంగతి తెలిసిందే.గణాంకాలు కీలకం మే నెలకు ఆటో అమ్మకాల గణాంకాలు వెలువడుతున్నాయి. వీటికితోడు జీఎస్టీ వసూళ్లు తదితర అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయగలవని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. ఇటీవల ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో యూఎస్ డాలరు ఆటుపోట్లను చవిచూడటం, 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ క్షీణించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉన్నట్లు వివరించారు. దేశీయంగా ఆర్బీఐ రెపో రేటులో 0.25 శాతం కోత పెట్టవచ్చన్న అంచనాలున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పీఎస్యూ బ్యాంకులు యాక్టివ్గా కదిలే వీలున్నట్లు ఖేమ్కా అభిప్రాయపడ్డారు. జీఎస్టీ వసూళ్లు, ఆటో విక్రయాలు, జీడీపీ తదితర ఆర్థిక గణాంకాలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చే వీలున్నట్లు అధిక శాతంమంది నిపుణులు అంచనా వేశారు. ఇతర అంశాలు గత నెల(మే)లో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) దేశీ స్టాక్స్లో కొనుగోళ్లకు ఆసక్తి చూపడం సానుకూల అంశమని విశ్లేషకులు పేర్కొన్నారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చివరకూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిచ్చిన ఎఫ్పీఐలు ఇటీవల నికర పెట్టుబడిదారులుగా నిలుస్తుండటం సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ముడిచమురు ధరలు దిగిరావడం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వగలవని అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ గతేడాదికి సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ ప్రభుత్వానికి భారీ డివిడెండ్ చెల్లించడం ప్రభుత్వ పెట్టుబడులకు దన్నునిస్తుందని తెలియజేశారు. ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ల విధింపునకు యూఎస్ ఫెడరల్ కోర్టు చెక్ పెట్టిన నేపథ్యంలో విదే శీ పెట్టుబడులు పుంజుకోవచ్చని అంచనా వేశారు.పెట్టుబడులకే ఎఫ్పీఐల మొగ్గు మే నెలలో రూ. 19,860 కోట్లు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) గత నెలలో పెట్టుబడులకే ఆసక్తి చూపా రు. వెరసి మే నెలలో నికరంగా రూ. 19,860 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఏప్రిల్లో అమ్మకాలు, కొను గోళ్ల మధ్య నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 2024 అక్టోబర్లో అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చిన ఎఫ్పీఐలు ఈ ఏడాది (2025) జనవరిలో రూ. 78,027 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 34,574 కోట్లు, మార్చిలో రూ. 3,973 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. అయితే ఆపై ఏప్రిల్ చివరి నుంచి కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! -
అమెరికాలో కాల్పులు.. ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఒక పోలీసు అధికారి సహా ముగ్గురు చనిపోగా పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. లాస్ ఏంజెలెస్ నగరంలోని బాల్డి్వన్ పార్క్లో శనివారం రాత్రి 7 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి రైఫిల్తో కాల్పులకు దిగాడు. ఘటనలో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయపడ్డారు. అనంతరం అధికారులు మరో మృతదేహాన్ని గుర్తించారు. ఘటనకు సంబంధించి ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రుడికి ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. మరో ఘటన..నార్త్ కరోలినాలోని కటౌబా కౌంటీలో శనివారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకున్న మరో కాల్పుల ఘటనలో ఒకరు చనిపోయారు. మరో 12 మందికి గాయాలయ్యాయి. -
చైనాతో పెట్టుకోవద్దు.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
బీజింగ్: అమెరికా, చైనా మధ్య మరోసారి మాటల యుద్ధం చోటుచేసుకుంది. తాజాగా అమెరికాకు డ్రాగన్ చైనా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ విషయంలో అమెరికా తలదూర్చడం సరికాదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇందులో మూడో దేశం జోక్యం చేసుకోవడం తగదని వార్నింగ్ ఇచ్చింది.చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తైవాన్ అంశాన్ని హెగ్సెత్ ప్రస్తావించడం కరెక్ట్ కాదు. చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదు. తైవాన్ అంశం చైనా అంతర్గత వ్యవహారం. ఇందులో మూడో దేశం జోక్యం మానుకోవాలి. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.Chinese Foreign Ministry Spokesperson’s Remarks on US Defense Secretary Pete Hegseth’s Negative Comments on China at the Shangri-La DialogueHegseth deliberately ignored the call for peace and development by countries in the region, and instead touted the Cold War mentality of… pic.twitter.com/PaO14RW6kE— Lin Jian 林剑 (@SpoxCHN_LinJian) June 1, 2025ఇక, అంతకుముందు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెగ్సెత్ మాట్లాడుతూ.. భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. భవిష్యత్తులో ఆ దేశం నుంచి వచ్చే ముప్పును.. ముఖ్యంగా తైవాన్పై దాని దూకుడు ప్రదర్శనను ఎదుర్కోవడానికి అమెరికా.. విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందన్నారు.MUST-SEE: Pete Hegseth declares the US will not be pushed out or intimidated by China."We do not seek conflict with communist China. We will not instigate nor seek to subjugate or humiliate." "President Trump and the American people have immense respect for the Chinese… pic.twitter.com/l6USFabG66— Resist the Mainstream (@ResisttheMS) June 1, 2025ఇదే సమయంలో తైవాన్ను స్వాధీనం చేసుకోవడానికి చైనా దాని చుట్టూ సముద్రజలాల్లో యుద్ధ విమాన వాహక నౌకలను మోహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు. లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందనీ.. పనామా కాలువపై తన ఆధిపత్యాన్ని పెంచుకునేందుకు కృషి చేస్తోందని చెప్పారు. చైనా నుంచి ఆర్థిక, సైనిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఇండో పసిఫిక్ ప్రాంత మిత్రదేశాలను గాలికి వదిలేయలేం. ఆయా దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలి. చైనా దూకుడు ప్రదర్శిస్తే అమెరికా దాన్ని అడ్డుకుంటుంది అని చెప్పుకొచ్చారు. దీనికి చైనా కౌంటర్ ఇచ్చింది. -
జాగ్రత్త.. 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి
వాషింగ్టన్: మల్లాది ‘నత్తలొస్తున్నాయ్ జాగ్రత్త’ నవల గుర్తుందా? కెన్యా నుంచి వచ్చిన భయంకరమైన రాక్షస నత్తలు ఓ రైలు ప్రమాదంలో తప్పించుకుని ఆంధ్ర రాష్ట్రంపై పడతాయి. చూస్తుండగానే అసంఖ్యాకంగా పెరిగిపోయి అల్లకల్లోలం చేసిపారేస్తాయి. అదీ, ఇదీ అని తేడా లేకుండా దొరికిన దాన్నల్లా తినేస్తూ భయోత్పాతం సృష్టిస్తాయి. అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలో కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా 25 కోట్ల తేనెటీగలు తప్పించుకున్నాయి! 31,751 కిలోల తేనెతుట్టెలతో వెళ్తున్న వాహనం లిండెన్ సమీపంలో కెనడా సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మూలమలుపు వద్ద వేగాన్ని డ్రైవర్ నియంత్రించలేకపోవడంతో బోల్తా పడింది. తేనెతుట్టెలన్నీ చెల్లాచెదురుగా పడిపోవడంతో తేనెటీగలు బయటికొచ్చి జారుకున్నాయి. విషయం తెలియగానే పోలీసులు తేనెటీగల నిపుణులతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అంతా కలిసి తేనెతుట్టెలను ఒక్కచోటికి చేర్చారు. తప్పించుకున్న తేనెటీగల కోసం ఎదురుచూస్తూ గడుపుతున్నారు. అవి తప్పకుండా తుట్టెల వద్దకు తిరిగొస్తాయని నిపుణులు చెప్పారు. ‘‘తేనెటీగలు రాణి ఈగను విడిచి ఉండలేవు. దాన్ని తీసుకొని రెండు మూడు రోజుల్లో వచ్చేస్తాయి’’ అని వివరించారు. కనుక రెండు మూడు రోజులపాటు పరిసర ప్రాంతాలకు రావొద్దని స్థానికులకు పోలీసులు సూచించారు. అమెరికాలో లక్షలాది తేనెటీగలను తరచుగా ఇలా ఒకచోటి నుంచి మరోచోటికి తరలిస్తుంటారు. వ్యవసాయంలో తేనెటీగలది కీలక పాత్ర. పరాగ సంపర్కానికి, పంటలు పండడానికి దోహదపడతాయి. ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య భారీగా తగ్గిపోతుండటంతో మే 20ని ‘ప్రపంచ తేనెటీగల దినం’గా జరుపుకోవాలని ఐరాస 2018లో పిలుపునిచ్చింది. -
వీడ్కోలు వేళ ఎలాన్ మస్క్ ముఖంపై గాయం.. ఏం జరిగింది?
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ వీడ్కోల వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మస్క్ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్ను ప్రశ్నించారు.But what happened to Elon Musk’s eyes? Black eye? Or am I seeing something else….pic.twitter.com/Dc5SgG1IjH— Chewy Veetton (@bebem00m00) May 31, 2025ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ గాయం నా కుమారుడు చేసింది. నేను, నా ఐదేళ్ల కుమారుడు X Æ A-Xii బీచ్లో గుర్రపు స్వారీ చేస్తున్నాం. ఈ క్రమంలో అతడు నా ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడు. దీంతో, అక్కడ గాయం ఏర్పడింది. ఆ సమయంలో దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా? అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం స్పందిస్తూ.. ఇన్ని రోజులు తాను కూడా గాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. కానీ, మస్క్ కుమారుడు అలా చేయగలడు అని అన్నారు. ఇక, ట్రంప్, టెక్ మాగ్నెట్ కుమారుడే X Æ A-Xii.Elon Musk was seen with a noticeable black eye, showing visible bruising and discoloration around the area while at the White House with President Trump.President Trump presented him with the White House Key, calling it a gift from the nation.Musk will continue to serve as an… pic.twitter.com/CjcR1g9aK6— Shadow of Ezra (@ShadowofEzra) May 30, 2025అయితే, ఎలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్హౌస్లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా? అని మస్క్ను విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాస్క్ స్పందిస్తూ.. అది తప్పుడు కథనం అంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ, మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.Elon Musk's 5-year-old son, X, punched him so hard he got a black eye😂Reporter: "Mr. Musk, is your eye okay?"Elon: "Well, I wasn't anywhere near France... I was just walking around with Lil X, and I said, 'Go ahead,' punch me in the face, and he did. Turns out even a… pic.twitter.com/m7u2PSTluy— George (@BehizyTweets) May 30, 2025ఇదిలా ఉండగా.. వీడ్కోలు సందర్బంగా ట్రంప్.. మస్క్కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా..డోజ్కు వీడ్కోలు సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్నకు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్’కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు. -
ప్లీజ్ మమ్మీ ఆపండి.. అమెరికా స్కూల్లో వింత ప్రవర్తన..
వాషింగ్టన్: అమెరికాలోకి ఎలిమెంటరీ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. చిన్నారుల గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా అక్కడికి వచ్చిన పేరెంట్స్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, ఇది కాస్తా కొట్లాటకు దారి తీసింది. పేరెంట్స్ ఫైటింగ్ కారణంగా చిన్నారులు భయంతో ఏడుస్తూ.. వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.వివరాల ప్రకారం.. అమెరికాలో ఆర్కాన్సాస్ రాష్ట్రంలోని వెస్ట్ మెంఫిస్ నగరంలో ఉన్న ఫాల్కీ ఎలిమెంటరీ స్కూల్లో.. ఈనెల 28వ తేదీన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సదరు స్కూల్ యాజమాన్యం చిన్నారులు సహా వారి తల్లిదండ్రులకు ఆహ్వానం కల్పించారు. ఈ క్రమంలో పిల్లలతో పాటుగా వారి పేరెంట్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం, కార్యక్రమం జరుగుతుండగా.. కొందరు మహిళల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం మొదలైంది.దీంతో, మాటాలమాటా పెరిగి.. గొడవ పెద్దదిగా మారింది. ఆగ్రహంతో రగిలిపోయిన పేరెంట్స్.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పురుషులు కూడా కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈవెంట్లో పేరెంట్స్ గొడవపడటంతో చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. కన్నీరుపెట్టుకుంటూ వారిని ఆపివేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.Brawl breaks out after a Kindergarten Graduation at West Memphis’ Faulk Elementary. Children can be heard screaming “Stop” to the adults. <- Read that again. The news reported that the “Police are investigating the situation further.” 🙄 pic.twitter.com/PL43g2zZdx— The Facts Dude (@The_Facts_Dude) May 30, 2025మరోవైపు.. ఈ ఘటనను సదరు పాఠశాల యాజమాన్యం ఖండించింది. ఇటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. విద్యార్థులు, సిబ్బంది రక్షణ, పాఠశాల ప్రాంగణం భద్రత మొదటి ప్రాధాన్యం అని.. ఈ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్గా మారింది. వీరికి గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
ఇంటర్వ్యూ స్లాట్ల కోసం చెక్ చేసుకోండి
న్యూయార్క్: అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసు కున్న విదేశీ విద్యార్థులకు ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్వ్యూ స్లాట్లు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, స్లాట్లు ఎప్పుడైనా తెరిచే అవకాశం ఉందని, అందుకోసం తరచుగా తనిఖీ చేసుకోవాలని విదేశీ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం తాజాగా సూచించింది. ఇంటర్వ్యూ స్లాట్లు ఎప్పుడు మొదలవుతాయో కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. స్లాట్ల కోసం ఆన్లైన్లో చెక్ చేసుకోవడం మంచిదని తెలియజేసింది. -
ఇదంతా ట్రంప్పై ద్వేషంతో చేసిందే!
లిబరేషన్ డే సుంకాలకు లైన్ క్లియర్ అయినప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కోపం చల్లారలేదు. తన ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా మాన్హట్టన్ ట్రేడ్ కోర్టు నిలుపుదల చేయడంపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తీర్పు రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదని, అధ్యక్షుడి అధికారాలను న్యాయమూర్తులు అణగదొక్కారని మండిపడ్డారు.‘‘అంతర్జాతీయ వాణిజ్యపు న్యాయస్థానం అమెరికాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. అదృష్టవశాత్తూ.. మాన్హట్టన్ వాణిజ్యపు న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేయాలని 11 మంది న్యాయమూర్తులతో కూడిన ఫెడరల్ సర్క్యూట్ కోర్టు ఆదేశించింది. అసలు ఆ ముగ్గురు న్యాయమూర్తులు(మాన్హట్టన్ బెంచ్) ఎక్కడి నుంచి వచ్చారు?. అమెరికాకు తీవ్ర నష్టం చేకూర్చే పనిని చేయడం వాళ్లకు ఎలా సాధ్యమైంది?. ఇదంతా ట్రంప్పై ద్వేషంతో చేసిందే. ఇది తప్పుడు చర్య. రాజకీయ పక్షపాతంతో కూడుకున్నదే’’ అని ఆయన ఓ పోస్ట్ చేశారు. ఏప్రిల్ 2న లిబరేషన్ డే పేరుతో ట్రంప్ పలు దేశాలపై సుంకాలను(Liberation Day tariffs) విధించిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని, దేశ వాణిజ్య విధానం తన వెర్రి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని కోరుకుంటున్నారంటూ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన మాన్హట్టన్ వాణిజ్య న్యాయస్థానం(Manhattan Trade Court).. సుంకాల విధింపునకు కత్తెర వేసింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి ప్రపంచదేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని తేల్చిచెప్పింది. అయితే.. సుంకాలకు సంబంధించి ప్రస్తుతం పలు దేశాలతో చర్చలు జరుగుతున్నాయనే విషయాన్ని ట్రంప్ సర్కారు కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ ట్రేడ్ డీల్స్ను ఖరారు చేసుకునేందుకు జులై 7 వరకు గడువు ఉందని, అప్పటివరకు దీన్ని చాలా సున్నితమైన అంశంగా పరిగణించాలని కోర్టును కోరింది. కానీ, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేసిన అన్ని వాదనలను కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో.. ‘‘టారిఫ్ అధికారం వల్లనే ఇటీవల భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ సాధించగలిగారు’’ అని న్యాయధికారులు కోర్టుకు తెలిపారు. కానీ, ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలు అమలుకాకుండా నిలుపుదల చేసింది. అయితే.. .. మాన్హట్టన్ కోర్టు ఆదేశాలపై ట్రంప్ సర్కారు అప్పీల్ దాఖలు చేసింది. గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. దీనిపై జూన్ 5లోగా ఫిర్యాదుదారులు, జూన్ 9లోగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు స్పందించాలని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి!