breaking news
USA
-
Trump: అశ్వత్థామ హతః.. కుంజరః!
కురుక్షేత్ర యుద్ధంలో.. అశ్వత్థామ అనే ఏనుగు మరణిస్తుంది. అయితే.. ద్రోణాచార్యుడిని మట్టుబెట్టడానికి ఇదే మంచి తరుణమని శ్రీకృష్ణుడు భావిస్తాడు. ఆయన సూచన మేరకు అశ్వత్థామః హతః అని గట్టిగా.. కుంజరః(ఏనుగు)అని ధర్మరాజు నెమ్మదిగా విలపిస్తాడు. తన కుమారుడే చనిపోయాడని భావించి యుద్ధాన్ని వదిలిపెట్టి ధ్యానంలోకి వెళ్తాడు ద్రోణుడు. అదను కోసం ఎదురు చూస్తున్న ధృష్టద్యుమ్నుడు (ద్రుపదరాజు కొడుకు) ద్రోణుడ్ని హతమారుస్తాడు. అమెరికా మిత్రదేశం ఖతార్ విషయంలోనూ ట్రంప్ ఇదే తరహా స్ట్రాటజీ ఫాలో అయ్యారా? అనే చర్చ నడుస్తోంది ఇప్పుడు.. 2025 సెప్టెంబర్ 9న.. ఇజ్రాయెల్ సైన్యం ఖతార్ రాజధాని దోహాపై వైమానిక దాడులు జరిపింది. హమాస్ నేతలే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు ఆ దేశ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు స్పష్టమైన ప్రకటన చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన ఘటన అని అభివర్ణించారు. ఈ క్రమంలోనే ఆ రెండు దేశాల డబుల్ గేమ్ బయటపడింది.గాజా కాల్పుల విమరణ ఒప్పందం ప్రతిపాదనల్లో భాగంగా.. ట్రంప్ హమాస్కు చివరి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో హమాస్ అగ్రనేతలు హుటాహుటిన దోహాలో భేటీ అయ్యారు. సరిగ్గా ఆ సమయంలోనే దాడి జరిగింది. ఫలితంగా.. హమాస్ కీలక నేత ఖలీల్ అల్-హయ్యా కుమారుడితో సహా ఆరుగురు మృతి చెందారు. అయితే ఈ దాడికి సంబంధించి అమెరికాకు సమాచారం ఉన్నప్పటికీ.. ఖతార్కు దాన్ని చెప్పడంలో ఆలస్యం చేసిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు.. దాడి గురించి అమెరికాకు ముందే సమాచారం ఇచ్చాం: టెల్అవీవ్(ఇజ్రాయెల్ రాజధాని) వర్గాలుఅవును.. ఇజ్రాయెల్ సమాచారం అందించిన వెంటనే.. దాడి గురించి ఖతార్(Qatar)కు సమాచారం ఇచ్చాం: అమెరికాదాడులు మొదలైన 10 నిమిషాల తర్వాత యూఎస్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. పేలుళ్లు కొనసాగుతుండగానే అమెరికా అధికారి ఒకరు ఆ సమాచారం అందించారు: ఖతార్ విదేశాంగ శాఖ అధికారిఅమెరికా- ఖతార్ల మధ్య బంధం ఇటీవల బలపడింది. అధ్యక్ష హోదాలో తొలిసారి గల్ఫ్ దేశంలో పర్యటించిన ట్రంప్.. 400 మిలియన్ డాలర్ల విలువ చేసే విలాసవంతమైన విమానాన్ని ఖతార్ నుంచి బహుమతిగా అందుకున్నారు. ప్రతిగా.. ఆ దేశ పర్యటనలో 243 బిలియన్ డాలర్ల కీలక ఒప్పందాలు కుదుర్చుకొన్నారు. పైగా ట్రంప్ కొడుకు ఎరిక్ కూడా అక్కడ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటునకు ఒప్పందం చేసుకున్నాడు. పైగా ఇరాన్కు ఖతార్ మిత్రదేశం కావడంతో.. టెహ్రాన్ బ్యాక్ చానెల్ కమ్యూనికేషన్లాగా ట్రంప్ పరిగణిస్తున్నారు. వీటన్నింటికి తోడు.. పశ్చిమాసియాలో తన దౌత్య ప్రయత్నాలకు ఈ గల్ఫ్ దేశం కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటప్పుడు.. ఖతార్పై ఇజ్రాయెల్ దాడి చేయడం, శాంతిదూత ట్రంప్ దానిని చూస్తూ ఉండిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో.. ఈ దాడులకు సంబంధించి అమెరికా నుంచి గందరగోళమైన ప్రకటనలు వెలువడ్డాయి. దాడి గురించి తాము సమాచారం ఇచ్చామని.. తమకు సమాచారం అందిందని చెప్పిన ఇజ్రాయెల్, అమెరికాకు కొద్దిగంటలకే మాట మార్చాయి. వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ దాడి గురించి తెలియజేయాలని పశ్చిమాసియా రాయబారి విట్కాఫ్ను ట్రంప్ ఆదేశించారని పేర్కొన్నారు. ఈ ఘటన అనంతరం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. దాడి గురించి ముందే చెప్పామంటూ హడావుడిగా వివరణ ఇచ్చారు. అనంతరం దాడికి సంబంధించిన నిర్ణయం తాను తీసుకోలేదని.. మరోసారి ఇలాంటి దాడులు జరగవని హామీ ఇస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు. ఇక.. ఈ దాడి పూర్తిగా తమ చర్యేనని, ఇందులో యూఎస్ ప్రమేయం లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటమార్చారు.మెహ్దీ హసన్ అనే జర్నలిస్టు.. ‘ట్రంప్ ఖతార్ నుంచి విమానం తీసుకున్న తర్వాత అదే దేశంపై బాంబింగ్కు అంగీకారం ఇచ్చాడా?’’ అంటూ విమర్శించారు. డాక్టర్ అండ్రెస్ క్రెయిగ్ అనే విశ్లేషకుడు: ‘‘ఖతార్కు ముందుగా సమాచారం ఇచ్చినట్లైతే, ప్రాణనష్టం జరగకుండా చూసుకునేవారు’’ అని ట్వీట్ చేశారు.ఏది ఏమైనా.. ఈ దాడి నేపథ్యంలో అరబ్ దేశాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఖతార్పై జరిగిన దాడుల్ని ముక్తకంఠంతో ఖండించాయి. ఇది అమెరికాకు ఒకరకంగా మింగుడు పడని విషయమే. మరోవైపు.. ఖతార్లో గాజా చర్చల కోసం హమాస్ నేతలు భేటీ అయినప్పుడే ఈ దాడి జరిగింది. దీంతో.. శాంతి చర్చలు నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. -
ఎవరీ టీనేజర్ తేజస్వి మనోజ్? వృద్ధుల రక్షణ కోసం..
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎంతలా ఉన్నాయో తెలిసిందే. ముఖ్యంగా ఒంటిరిగా ఉండే వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వాళ్ల డబ్బుని కాజేస్తున్న సైబర్ నేరగాళ్లు ఆగడాలు అంత ఇంత కాదు. పైగా వయసు మళ్లడంతో వస్తున్న కాల్స్, మెసేజ్లు ఒక స్కామ్ అని గ్రహించలేనితనం, టెక్నాలజీ లేమి తదితరాలను ఆసరా చేసుకుని ఈ నేరాగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఆగడాలకు చెక్పెట్టేలా పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది ఈ టీనేజర్. తన తాతమామల్లాంటి ఎందరో వృద్ధులకు భరోసానిచ్చే వెబ్సైట్ని నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాదు వాళ్లు కూడా సులభంగా టెక్నాలజీపై పట్టు సాధించేలా ఈ 16 ఏళ్ల అమ్మాయి చేస్తున్న కృషికి మేధావులు సైతం ఆశ్చర్యపోవడమే కాదు, అవార్డులతో ప్రశంసించారు కూడా. ఎవరా ఆ టీనేజర్ అంటే..ఆ అమ్మాయే 16 ఏళ్ళ తేజస్వి మనోజ్. టెక్సాస్ ఫ్రిస్కోలో హైస్కూల్ జూనియర్గా ఉండగా ఆమె ఎదుర్కొన్న సంఘటనే ఆమె జీవితాన్ని మలుపుతిప్పింది. తన తాతగారిలాంటి వృద్ధులు సైబర్ నేరాగాళ్ల వలలో ఎలా చిక్కుకుంటున్నారో అనుభవపూర్వకంగా తెలుసుకుని, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ రోజు తన 85 ఏళ్ల తాతాగారి మాదిరిగా ఓ వ్యక్తి ఫోన్ చేసి తన వద్ద డబ్బులు అయిపోయాయని, ఒక లక్ష రూపాయాలు పంపించాల్సిందిగా మెయిల్ ఐడీ, ఫోన్ కాల్స్ రెండూ వచ్చాయి. దాంతో ఆమె డబ్బు పంపేందుకు రెడీ అవుతుండగా, ఎందుకైనా మంచిది ఒకసారి డబుల్ చెక్చేసి పంపు అని తండ్రి సూచన మేరకు చెక్చేయడంతో..అదిస్కామ్ అని తేలింది. దాంతో తేజస్వి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నాన్న అలా సూచించి ఉండకపోతే..అంతేగా పరిస్థితి అంటూ ఊపిరి పీల్చుకుంది. వృద్ధుల సంరక్షణ కోసం..ఇక ఆ తర్వాత అలాంటి సైబర్ క్రైం నేరాల గురించి ఆరా తీసింది తేజస్వి. ఒక్క 2024 ఏడాదిలోనే ఆన్లైన్ స్కామ్లకు సంబంధించిన సుమారు రూ. 8 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిసి కంగుతింది. అంతేగాదు వాటిల్లో వృద్ధులే ఎక్కువ మొత్తం డబ్బు నష్టపోతున్నట్లు గుర్తించింది. దాంతో తేజస్వి తన తాతా లాంటి వాళ్లు ఇలాంటి సైబర్ క్రైంలో చిక్కుకోకుండా ఏదైనా చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యింది. ఆ నేపథ్యంలోంచి వచ్చిందే "షీల్డ్ సీనియర్స్" అనే వెబ్సైట్. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా పోరాడటం కోసం వృద్ధుల సేఫ్టీనే ప్రధాన లక్ష్యంగా చేసుకుని నెలల తరబడి కోడింగ్ రాసి దీన్ని డిజైన్ చేసింది. ఈ వెబసైట్ సాయంతో పెద్దలు ఎలాంటి మోసాల్లో చిక్కుకుండా, సులభంగా వినియోగించే సాంకేతికతను అభివృద్ధి చేసింది. సీనియర్ సిటీజన్లు సులభంగా పాస్వర్డ్లు, సెట్టింగులు, స్కామ్ వ్యూహాలు గుర్తించేలా మార్గదర్శకాలను కూడా రూపొందించింది. అలాగే తరుచుగా సాంకేతిక పరిభాష సమస్య రాకుండా తక్కవ వాక్యాల సమాధానాల చాట్బాట్ని కూడా డిజైన్ చేసింది. ఈ వెబ్సైట్లోని ఏఐ ఆధారిత సాధనం అనుమానాస్పద సందేశాలు, ఇమెయిల్లను 95% కచ్చితత్వంతో స్కాన్ చేస్తుంది. అంతేగాదు సీనియర్ సిటీజన్లు కూడా ధైర్యంగా ఆన్లైన్ ప్రపంచాన్ని నావిగేట్ చేసేలా తయారుచేసింది. ప్రస్తుతం ఆమె దాన్ని వాణిజ్య ఏఐ ఫ్లాట్ఫాంగా మార్చేలా నిధులను సేకరిస్తున్నందున ఈ "షీల్డ్ సీనియర్స్ వెబ్సైట్" ప్రివ్యూ మోడ్లో ఉంది. అయితే ఇది అమెరికా అసోసీయేషన్ ఆఫ్ రిటైర్డ్ పర్సన్స్ దృష్టిని ఆకర్షించడమే కాదు, వాళ్లు నేరుగా ఆమెని సంప్రదించి తమ ఫీడ్బ్యాక్ని ఇచ్చి లింక్డ్ఇన్లో షేర్ చేశారు కూడా. దాంతో తేజస్వి సేవనిరతి ప్రయత్నాలకుగానూ టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2025 గౌరవం లభించడమే కాదు ఇలా టైమ్ ఫర్ కిడ్స్ సర్వీస్ స్టార్గా పేరొందిన తొలి గ్రహితగా ఘనతను కూడా దక్కించుకుందామె. అంతేగాదు సీనియర్ సిటీజన్లకు ఈ టీనేజర్ సైబర్ సెక్యూరిటీ పాఠాలను కూడా బోధిస్తూ..తన సేవనిరతిని చాటుకుంటోంది కూడా. జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉండే ఈ టీనేజ్ వయసులో పెద్దల పట్ల ఇంతలా బాధ్యతతో వ్యవహరిస్తూ..సాంకేతిక సాయం అందిస్తున్న ఆ అమ్మాయి యువతరానికి గొప్ప స్ఫూర్తి కదూ..!.(చదవండి: ఇది ఫ్యామిలీ ఫ్లైట్..!) -
భారత్ పట్ల ట్రంప్ మరో ట్విస్ట్.. 100 శాతం సుంకాలు విధించాలని..
వాషింగ్టన్: భారత్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోదీ తనకు మిత్రుడు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి చర్చలు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్పై 100 శాతం సుంకం విధించాలని ఈయూ దేశాలకు సూచించినట్లు తెలుస్తోంది.కాగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ముగింపునకు డొనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రష్యా నుంచి వాణిజ్యం చేస్తున్న పలు దేశాలను ట్రంప్ చేశారు. భారత్, చైనాలపై సుంకాల భారాన్ని పెంచి రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై సీనియర్ అమెరికన్, ఈయూ అధికారులు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈయూ అధికారులతో ట్రంప్ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్, చైనాలపై 100 శాతం సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. చమురు కొనుగోలు చేయడం ఆపేస్తామనే వరకు ఈ టారిఫ్లను కొనసాగించాలన్నారు. ‘మేము ఇలా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, యూరోపియన్ భాగస్వాములతో కలిసి ముందుకువస్తేనే దీన్ని అమలుచేద్దాం’ అని యూఎస్ అధికారి ఒకరు తెలిపారు. అమెరికా సూచనలు అమలుచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఈయూ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్లో త్వరగా శాంతి నెలకొల్పాలని ఈయూ కూడా భావిస్తుంది. ఈ క్రమంలో రష్యాపై ఒత్తిడి తెస్తేనే అది సాధ్యమవుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీంతో యూరోపియన్ నేతలు కూడా ఆ దిశగా ఆలోచన మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అయితే భారత్, చైనా వంటి దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధిస్తే నెలకొనే పరిణామాలపై వారు చర్చలు జరుపుతున్నారు.మరోవైపు.. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ అంశంపై తన మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు రెండు గొప్పదేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. -
అమెరికా టూరిజం.. ఫాల్ ఫాల్ ఫాల్
ప్రపంచ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. యునైటెడ్ స్టేట్స్ ఊహించని తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చేవారి సంఖ్య 8.2 శాతం తగ్గింది. ఫలితంగా పర్యటక ఆదాయం గణనీయంగా తగ్గింది. టూరిస్ట్లు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, చౌకైన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అమెరికాకు పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే..వీసా ఆలస్యం, పెరిగిన ఖర్చులు, రాజకీయ ప్రభావం, భద్రతకు సంబంధించిన ఆందోళనలు ప్రధానంగా పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.యూఎస్కు వెళ్లే జర్మన్ల సంఖ్య 12 శాతం తగ్గింది. వీరంతా పోర్చుగల్, కెనడా, వియత్నాం దేశాలను సందర్శిస్తున్నారు. జపనీస్ సందర్శకుల సంఖ్య.. కోవిడ్ మహమ్మారి సమయం నుంచే 35 శాతం తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వీరందరూ.. దక్షిణ కొరియా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలను సందర్శిస్తున్నారు. అంతే కాకుండా అమెరికాకు వెళ్లే కెనడా పర్యాటకుల సంఖ్య 20.2 శాతం పడిపోయింది.వీసా ఆలస్యం కారణంగా.. బ్రెజిల్ ప్రజలు అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుక్కుని, యూరప్, సౌత్ అమెరికా దేశాలకు వెళ్తున్నారు. ఈ దేశీయులు అమెరికా వీసా కోసం 300 రోజులు నిరీక్షించాల్సి ఉంది. ఇది బ్రెజిలియన్ ప్రయాణికులను వేరే మార్గం వెతుక్కునేలా చేసింది.ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను విధించడమే కాకుండా, వీసా ఆంక్షలను కూడా మరింత కఠినం చేశారు. ఇప్పుడు వీసా కోసం భారతీయులు ఏకంగా 400 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రూపాయి కూడా బలహీనపడటం.. అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల, ఇండియన్స్.. ఆగ్నేయాసియా, యూరప్ దేశాలను ఎంచుకుంటున్నారు.ఇదీ చదవండి: అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందంపర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. అమెరికాలోని ప్రధాన నగరాలు ఇబ్బంది పడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య 17 శాతం తగ్గడంతో న్యూయార్క్ నగరం 4 బిలియన్ డాలర్ల నష్టం చొసింది. శాన్ ఫ్రాన్సిస్కో & లాస్ ఏంజిల్స్ కూడా ఇలాంటి నష్టాలనే చవిచూస్తున్నాయి. వీసా విధానాలు సడలించకపోతే.. పర్యాటక రంగంలో అమెరికా కోలుకోవడానికి మరో రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
జీన్ కరోల్ పరువు నష్టం కేసు.. ట్రంప్కు ఎదురు దెబ్బ
కాలమిస్ట్ ఈ. జీన్ కరోల్ వేసిన పరువు నష్టం కేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ 8.33 కోట్ల డాలర్లు(సుమారు రూ.733 కోట్లు) చెల్లించాలంటూ సివిల్ జ్యూరీ ఇచ్చిన తీర్పును న్యూయార్క్లోని ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ట్రంప్ చేసిన అప్పీల్ను తోసిపుచ్చింది. జ్యూరీ పేర్కొన్న పరిహారం సహేతుకంగానే ఉందని సోమవారం రూలింగ్ వెలువరించింది.అధ్యక్షుడిగా తనకు మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపిందని, పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదంటూ ట్రంప్ చేసిన వాదనను తిరస్కరించింది. 1996లో మన్హట్టన్ డిపార్టుమెంట్ స్టోర్లో జీన్ కరోల్పై ట్రంప్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీనిపై కోర్టు ఆయనకు 5 మిలియన్ డాలర్ల(రూ.400 కోట్ల) జరిమానా విధించింది. గత డిసెంబర్లో అప్పీల్స్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది కూడా.అయితే, సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పదేపదే జీన్ కరోల్ లక్ష్యంగా ఆరోపణలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై ఆమె పరువు నష్టం కేసు వేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం రూ.733 కోట్లు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. -
అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందం
పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజాలకు సంబంధించి.. పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్, యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని పాకిస్తాన్లోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది."ఈరోజు ప్రధాన మంత్రి నివాసంలో పాకిస్తాన్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ (FWO)తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేయడానికి యూఎస్ స్ట్రాటజిక్ మెటల్స్ (USSM) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ రాయబార కార్యాలయం యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జాచ్ హార్కెన్రైడర్ వచ్చారు" అని ప్రకటన పేర్కొంది."అమెరికా భద్రత, శ్రేయస్సుకు కీలకమైన ఖనిజ వనరుల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ పరిపాలనలో ఇటువంటి ఒప్పందాలను రూపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్లోని కీలకమైన ఖనిజాలు.. మైనింగ్ రంగంలో యూఎస్ కంపెనీలు, వాటి సహచరుల మధ్య భవిష్యత్తులో ఒప్పందాలను కుదుర్చుకోవడానికి కూడా మేము ఎదురుచూస్తున్నాము" అని ఛార్జ్ డీ అఫైర్స్ నటాలీ బేకర్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ఎస్ఎమ్ అనేది మిస్సోరిలో ఉన్న ఒక సంస్థ. ఇది కోబాల్ట్, నికెల్, రాగి, లిథియం వంటి కీలకమైన ఖనిజాలను ఉత్పత్తి చేయడం, రీసైక్లింగ్ చేయడం వంటివి చేస్తుంది. ఈ ఖనిజాలను యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ.. వివిధ సాంకేతిక పరిజ్ఞానాలలో తమకు అవసరమైనవిగా లేబుల్ చేసుకుంటుంది.Excited to see U.S. companies like USSM deepening economic ties with Pakistan! USSM’s visit to Islamabad marks an important milestone as they sign an MOU to collaborate on critical minerals production. A forward-looking partnership with great potential for both nations. -NB…— U.S. Embassy Islamabad (@usembislamabad) September 8, 2025 -
స్వదేశీ మేళాకు పట్టం కట్టండి
న్యూఢిల్లీ: స్నేహితుడు, శత్రువు అనే బేధం లేకుండా అమెరికా ప్రభుత్వం అందరిపై సుంకాలతో బాదేస్తున్న వేళ ప్రధాని మోదీ స్వదేశీరాగం అందుకున్నారు. విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని స్వదేశీ వస్తువులకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో సోమవారం ఎన్డీఏ కూటమి ఎంపీలతో సమావేశంలో పలు అంశాలపై ప్రధాని మాట్లాడారు. ‘‘దేశవాళీ ఉత్పత్తులకు ఆదరణ పెరిగేలా చూడండి. స్వదేశీ మేళాను ఉద్యమస్థాయికి తీసుకెళ్లండి. విదేశాల అధిక టారిఫ్ల వంటి ప్రతికూలతలు, సవాళ్ల సమయంలో భారత్ స్వావలంబన ద్వారా తన శక్తిసామర్థ్యాలను మరింతగా సంతరించుకోవాల్సిన తరుణమిది. మేడిన్ ఇండియా ఉత్పత్తులను ప్రోత్సహించండి. జీఎస్టీ రేట్లు భారీగా తగ్గిన చక్కటి తరుణంలో స్వదేశీ వస్తువుల గొప్పతనాన్ని జనాన్ని తెలిసేలా చేయండి. ముఖ్యంగా నవరాత్రి, దీపావళి వంటి పండుగల సీజన్లో మీమీ నియోజకవర్గాల్లో ప్రజలతో, వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటుచేసి తగ్గిన జీఎస్టీ రేట్ల ప్రయోజనాలను వివరించండి’’అని మోదీ అన్నారు. మోదీ ప్రసంగ వివరాలను తర్వాత కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు మీడియాకు వివరించారు. అమెరికా 50 శాతం టారిఫ్ భారం మోపిన వేళ మోదీ స్వదేశీ వస్తువుల ప్రాశస్థ్యాన్ని ప్రస్తావించడం గమనార్హం. శక్తివంతమయ్యేవేళ సవాళ్లు సాధారణం ‘‘భారత్ శక్తివంతంగా ఎదిగే క్రమంలో సవాళ్లు ఎదురవడం సాధారణం. అయినాసరే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే క్రమంలో ఇలాటి సవాళ్లను ఎదుర్కొంటూ ఆత్మనిర్భర్ను సాధించాలి. సొంత నియోజకవర్గాల్లో దేశీయ ఉత్పత్తుల ప్రచారాన్ని మీరే నాయకులుగా ముందుండి నడపాలి. గతంలో భారత్లో జపాన్ తయారీ వస్తువుల వినియోగం అధికంగా ఉండేది. అలాంటి భారత్లో ఇప్పుడు దేశీయోత్పత్తులను అధికంగా ఉపయోగించగల్గుతున్నామని గర్వపడేలా మనం చేయాలి. మీరు పాల్గొనే ప్రతి కార్యక్రమంలో స్వదేశీ ఉత్పత్తులు కనిపించాలి. ఉపయోగించాలి’’అని ఎంపీలకు మోదీ సూచించారు. ‘‘జీఎస్టీ శ్లాబుల తొలగింపు అనేది ప్రజల్లో పెను సంచలనంగా మారింది. ప్రజలతో ‘స్వదేశీ మేళాలు’, వ్యాపారులతో ‘వ్యాపారీ సమ్మేళన్’లు నిర్వహించండి. గాల్లో తుపాను చెలరేగినాసరే మనం వాహన టైరులో మళ్లీ గాలి కొట్టాల్సిందే. అలాగే దేశీయంగా ‘స్వదేశీ వాతావరణం’ఉన్నాసరే మన మళ్లీ విడిగా మన వంతు తోడ్పాటు అందించాల్సిందే’’అని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జాగ్రత్త ‘‘ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేటప్పుడు ఎంపీలు జాగ్రత్త వహించండి. తప్పులు దొర్లకుండా ఓటేయండి. పార్లమెంట్ సభ్యులే ఓటింగ్లో తప్పులు చేస్తే ప్రజలకు తప్పుడు సందేశం వెళ్తుంది. మన అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల్లో ఉత్తమ అభ్యర్థిగా పేరుతెచ్చుకున్నారు. ఆయన ఉపరాష్ట్రపతిగా చక్కటి సేవలు అందిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. తన పాలనాదక్షతతో ఆయ ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తేగలరని నేనూ విశ్వసిస్తున్నా’’అని అన్నారు. ఇటీవల పార్లమెంట్లో ఆన్లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందం వెనుక అధికార కూటమి ఎంపీల కృషిదాగి ఉందని మోదీ ప్రశంసించారు. హిమాచల్, పంజాబ్కు నేడు మోదీ వరద విలయంలో చిక్కుకుని అల్లాడిపోతున్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని మోదీ మంగళవారం పర్యటించనున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకూ మోదీ వెళ్లి అక్కడి బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. హిమాచల్లోని కంగ్రాకు మోదీ వెళ్లనున్నారు. అక్కడే ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. -
ట్రంప్ తీరుతో ఇబ్బందిపడ్డ మనవరాలు!
యూఎస్ ఓపెన్ 2025 ఫైనల్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. న్యూయార్క్ క్వీన్స్ వేదిక వద్దకు ట్రంప్ రాక సందర్భంగా భద్రతా తనిఖీలతో అభిమానులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో.. అర్థర్ యాష్ స్టేడియం రోల్స్ బాక్స్ వద్దకు వచ్చి అభివాదం చేసిన ఆయనకు.. చీర్స్తో పాటు బూస్(నిరసనగా చేసే నినాదాలు) స్వాగతం పలికాయి. తమను ఇబ్బందిపెట్టినందుకు టెన్నిస్ అభిమానులు ఆయన్ని తిట్టిపోశారు. ఈ క్రమంలో.. మరో ఆసక్తికరమైన అంశమూ తెర మీదకు వచ్చింది.ట్రంప్ మనవరాలు అరబెల్లా కుష్నర్(18) ఆయన తీరుతో ఇబ్బందిపడినట్లుగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ మొదటి భార్య ఇవానా కూతురు ఇవాంకా. ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్ కాగా.. వీళ్లిద్దరికి ముగ్గురు సంతానం. అందులో పెద్ద కూతురు అరబెల్లా. ట్రంప్ కుటుంబంతో తరచూ ఈమె మీడియా కంట కనిపిస్తుంటుంది. ఈ క్రమంలో యూఎస్ ఓపెన్ పురుషుల ఫైనల్ మ్యాచ్ కోసం ట్రంప్ అల్లుడిని, మనవరాలిని, వైట్హౌజ్ సిబ్బందినీ వెంటపెట్టుకుని వచ్చారు. ఆ సమయంలో అరబెల్లా ఆందోళనగా కనిపించగా.. ట్రంప్ ఆమెతో ఏదో అన్నారు. దీంతో ఆమె ముఖం చిన్నబోయింది. ఆపై ట్రంప్ పక్కన నిల్చునేందుకు కూడా ఆమె అయిష్టంగా కనిపించింది. అప్పటి నుంచి ఈవెంట్ అయ్యేదాకా ఆమె ముభావంగా ఉండిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోనే ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. లిప్ రీడర్ నికోలా హిక్లింగ్ చెబుతోంది ఏంటంటే.. అరబెల్లా తన బ్యాగ్, ఫోన్ కోసం ఆందోళన వ్యక్తం చేసింది. Where is my bag?(నా బ్యాగ్ ఎక్కడ?) అని అడిగింది. దానికి ఆమె తండ్రి కుష్నర్ I don’t have it(నాకు తెలియదు) అని సమాధానమిచ్చారు. ఈలోపు.. తాత ట్రంప్ను తనకు దారి ఇవ్వమని కోరగా.. ఆయన నువ్వు అక్కడే ఉండు అని చెప్పారు. దీంతో ఆమె అయిష్టంగా అలా నిలబడి పోయారు. ఇదిలా ఉంటే.. యూఎస్ ఓపెన్ నిర్వాహకులు ట్రంప్ అక్కడ ఉన్న సమయంలో జరిగిన పరిణామాలను టెలికాస్ట్ చేయొద్దని బ్రాడ్కాస్టర్లకు సూచించింది. అయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా ప్రెసిడెంట్ ట్రంప్నకు తగిలిన నిరసన సెగ, అంతకుమించి అరబెల్లా వైరల్ వీడియో బయటకు వచ్చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో, నెటిజన్లు ట్రంప్ కుటుంబ సంబంధాలపై చర్చ ప్రారంభించారు. ఆమె ముఖంలో ఆందోళన, అసౌకర్యం స్పష్టంగా కనిపించిందని.. పాపం అంటూ మరొక యూజర్ కామెంట్ చేశాడు. అరబెల్లాకు ట్రంప్ పక్కన నిలబడడానికి ఇష్టపడలేదని.. అందుకే తండ్రి చెంతకు చేరిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీలైనంత త్వరలో ట్రంప్ కుటుంబం నుంచి ఆమె బయటకు రావడం ఖాయమంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. Arabella Kushner aged 13 in the green dress does not want to stand next to the pedophile. pic.twitter.com/seJ35nY1SB— KT "Special MI6 Operation" (@KremlinTrolls) September 7, 2025 -
'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'
అమెరికా ఉద్యోగ మార్కెట్ పరిస్థితి గురించి.. ప్రముఖ ఆర్ధిక సంస్థ మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ 'మార్క్ జాండీ' ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ఉద్యోగుల భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణ (హెల్త్కేర్), ఆతిథ్య (హాస్పిటాలిటీ) రంగాలపై ఎక్కువగా ఆధారపడుతోందని వెల్లడించారు. ఈ పరిస్థితి ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందని స్పష్టం చేశారుఈ ఏడాది ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్య రంగాలలో ఆరు లక్షల ఉద్యోగాలు పుట్టాయి. ఈ రెండు రంగాలు లేకపోతే.. ఇక్కడ ఉద్యోగాల సృష్టి సున్నాకు పడిపోయే అవకాశం ఉందని మార్క్ జాండీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితి ఆర్థికమాంద్యం సమయంలోనే కనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.అమెరికా ఉద్యోగ మార్కెట్ మాంద్యం ఎదుర్కొంటుందా?అమెరికా ఉద్యోగ పరిస్థితి మాంద్యంలోకి ప్రవేశించినట్లు జాండీ ట్వీట్ చెబుతోంది. జూన్ నెలలో ఉద్యోగాలు తగ్గినప్పటికీ.. జులై, ఆగస్టు నెలలో స్వల్ప వృద్ధి ఉంది. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా?, తగ్గుతుందా?, అనేది ప్రశ్నార్ధకంగా ఉంది. జీడీపీ, ఆదాయాలు కొంత పెరుగుతున్నప్పటికీ.. తయారీ, మైనింగ్, నిర్మాణం వంటి రంగాల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం మాత్రమే ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. కాబట్టి ఇది పూర్తి మాంద్యం కాదని మార్క్ అన్నారు.ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!యూఎస్ ఉద్యోగాల డేటాయూఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (BLS) శుక్రవారం.. ఉద్యోగ డేటాను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత రేటు ఆగస్టులో 4.3% ఉంది. జూలై 2025లో 79,000గా ఉన్న ఉద్యోగాల వృద్ధి.. ఆగస్టులో 22,000కు పడిపోయింది. దీన్నిబట్టి చూస్తే అమెరికాలో ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా అవగతం అవుతోంది.What’s perhaps most disconcerting about the flagging job market is how dependent it is on healthcare and hospitality for what little job growth is occurring. Since the beginning of the year, the economy has created a paltry 600k jobs, but without the job growth in these… pic.twitter.com/lmheiipugG— Mark Zandi (@Markzandi) September 7, 2025 -
యూఎస్ టూర్లో ఎంజాయ్ చేస్తున్న మహేశ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
అమెరికా కొత్త మెలికతో వీసా గోస..!
వాషింగ్టన్: కోవిడ్ సంక్షోభం వేళ త్వరగా వలసేతర వీసాల జారీ ప్రక్రియను ముగించాలనే సదుద్దేశంతో భారతీయులకు కల్పించిన ఒక చక్కటి వెసులుబాటుకు అమెరికా సర్కార్ హఠాత్తుగా మంగళం పాడింది. దీంతో భారతీయ వీసా దరఖాస్తుదారులకు మళ్లీ నిరీక్షణ కష్టాలు పెరగనున్నాయి. భారత్లోని వీసా ఇంటర్వ్యూ కేంద్రాల్లో భారీ షెడ్యూలింగ్ జాబితా ఉండటంతో విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకునేందుకు కోవిడ్ వేళ అమెరికా అనుమతిచ్చింది. దాంతో భారతీయులు చాలా మంది విదేశాలకు వెళ్లి అక్కడి అమెరికా కాన్సులేట్లు, రాయబార కార్యాలయాల్లో వీసా ఇంటర్వ్యూలను త్వరగా ముగించుకుని వీసాలను సాధించారు. ఇకపై అలా కుదరదని ఏ దేశం వాళ్లు ఆ దేశంలోనే దరఖాస్తు చేసుకోవాలని, అక్కడే ఇంటర్వ్యూలను పూర్తిచేసుకోవాలని అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో స్వదేశంలో వీసా అపాయింట్మెంట్ల షెడ్యూలింగ్ మరింతగా పెరగనుంది. దరఖాస్తుదారులు తమ వంతు వచ్చేదాకా వేచిచూడాల్సిన నిరీక్షణ కాలం ఊహించనంతగా పెరిగిపోనుంది. త్వరగా వీసా పొంది అమెరికాలో వాలిపోదామనుకున్న భారతీయ వలసేతర వీసా దరఖాస్తు దారుల ఆశలు అడియాసలు కానున్నాయి. ‘‘వలసేతర వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇకపై కచ్చితంగా స్వదేశంలో లేదంటే రెసిడెన్సీ హోదా ఎక్కడ ఉందో ఆ ప్రాంతం నుంచే దరఖాస్తు చేసుకోవాలి. విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేయడం కుదరదు’’అని తాజా నోటిఫికేషన్లో అమెరికా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది. పర్యాటకం(బీ2), వ్యాపారం(బీ1), విద్యార్థి, తాత్కాలిక ఉద్యోగులుసహా అన్ని వలసేతర వీసా విభాగాల దరఖాస్తుదారులకు తాజా సవరణ వర్తిస్తుందని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ‘‘నిబంధనలు మారాయని తెల్సి కూడా విదేశాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే అక్కడి నుంచి వీసా అనుమతి రావడం గగనమే. అర్హత సాధించడం చాలా కష్టం. ఒకవేళ దరఖాస్తును స్వీకరించి, పరిశీలించినా నిరీక్షణకాలం ఎంతనేది చెప్పలేం. విదేశాల నుంచి చేసే దరఖాస్తుకు సంబంధించిన ఫీజు రీఫండ్ చేయడంగానీ స్వదేశంలో దరఖాస్తు చేసినట్లుగా ఆ ఫీజును పరిగణించడంగానీ జరగదు’’అని అమెరికా ప్రభుత్వం స్పష్టంచేసింది. ఇదీ చదవండి: డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రకటన: వాటిపై సుంకాలు ఎత్తివేత!వీసా షాపింగ్ భారతీయులకు కష్టమే తాత్కాలిక వీసా ఇంటర్యూల తంతును పూర్తిచేసుకోవాలంటే భారత్లోని అమెరికా రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో కనీసం మూడున్నర నెలలు వేచి ఉండక తప్పని పరిస్థితి ఉందని వీసా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో స్వదేశం నుంచి కాకుండా ఇతర దేశానికి వెళ్లి అక్కడి నుంచి యూఎస్ వీసా కోసం దరఖాస్తు భారతీయుల సంఖ్య ఎక్కువైంది. ఇలా ‘వీసా షాపింగ్’చేసే భారతీయులకు ఇప్పుడు సమస్యలు తప్పవు. భారత్లో వీసారావాలంటే వారాల తరబడి వెయిట్ చేయక తప్పదు. అంతకాలం నిరీక్షించే ఓపికలేక థాయ్లాండ్, సింగపూర్, జర్మనీ, బ్రెజిల్ వంటి పలు దేశాలకు భారతీయులు పొలోమని వెళ్తున్నారు. అక్కడ త్వరగా వీసా సాధించి లబి్ధపొందిన ఉదంతాలు కోకొల్లలు. వలసేతర వీసా ఇంటర్వ్యూ కోసం 14 ఏళ్ల లోపు చిన్నారులు మొదలు 79ఏళ్లు పైబడిన వృద్దులదాకా తప్పనిసరిగా స్వయంగా వచ్చి కాన్సులేట్ ఆఫీసర్ ఎదుట హాజరవ్వాల్సిందే. -
మోదీజీ.. ట్రంప్ అవమానాలు మర్చిపోయారా?: శశిథరూర్
ఢిల్లీ: అమెరికా, భారత్ మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త మాటల మర్మమేమిటో తెలుసుకోవాలన్నారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తతోనే స్వాగతించాలని.. ఆయన సిబ్బంది చేసిన అవమానాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీకి సూచించారు. ఇదే సమయంలో రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు చేయాల్సిన తీవ్రమైన మరమ్మతులు మిగిలి ఉన్నాయని గుర్తు చేశారు.భారత్, అమెరికా సంబంధాలపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడగానే ప్రధాని మోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ట్రంప్ పాదరస స్వభావం కలిగిన వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. భారత్ అనుకూల వ్యాఖ్యలపై ప్రధాని మోదీ చాలా త్వరగా స్పందించారు. ట్రంప్ కొత్త స్వరాన్ని జాగ్రత్తగా స్వాగతిస్తున్నాను. భారతీయులు ఎదుర్కొన్న వాస్తవ పరిణామాలు చాలా ఉన్నాయి. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం అనే ప్రాథమిక సంబంధం గురించి విదేశాంగ మంత్రి కూడా నొక్కి చెప్పారు. అది ఇప్పటికీ అలాగే ఉంది. అదే మనం ఇవ్వాల్సిన ముఖ్యమైన సందేశం.రెండు దేశాల ప్రభుత్వాలు, దౌత్యవేత్తలు కలిసి పరిష్కరించుకోవాల్సిన తీవ్రమైన అంశాలు కొన్ని ఉన్నాయని నేను భావిస్తున్నాను. కాబట్టి అంత త్వరగా క్షమించలేరు. ఆ పరిణామాలను అధిగమించాల్సి ఉంది. భారతీయులు ఎదుర్కొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ వల్ల కలిగిన బాధ, అవమానాన్ని త్వరగా మర్చిపోలేం అని కీలక వ్యాఖ్యలు చేశారు.#WATCH | Thiruvananthapuram: On PM Modi's response to US President Donald Trump speaking positively on India-US relationship, Congress MP Shashi Tharoor says, "The Prime Minister was very quick to respond, and the Foreign Minister has also underscored the importance of the basic… pic.twitter.com/Iju3uZUkzl— ANI (@ANI) September 7, 2025ఇదిలా ఉండగా.. భారత్పైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ఉన్నట్టుండి ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘భారత్తో అమెరికాకు ప్రత్యేక బంధం ఉంది. ముఖ్యంగా మోదీ ఓ అద్భుతమైన ప్రధాని. ఓ గొప్ప వ్యక్తి కూడా. ఆయనతో నాకు గొప్ప స్నేహ బంధముంది. అదెప్పటికీ కొనసాగుతుంది’ అని చెప్పుకొచ్చారు. దీనిపై మోదీ వెంటనే స్పందిస్తూ.. ‘అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిని ఎంతగానో అభినందిస్తున్నా. భారత-అమెరికా భాగస్వామ్యంపై ఆయన సానుకూల వ్యాఖ్యలు, రెండు దేశాల ప్రత్యేక బంధాన్ని అభినందించిన తీరు ప్రశంసనీయం’ అని పేర్కొన్నారు. ట్రంప్ మీడియా భేటీ తర్వాత కొద్ది గంటలకే ఈ మేరకు ఎక్స్లో ప్రధాని పోస్టు పెట్టారు. -
ట్రంప్కు టెన్షన్.. అదే జరిగితే వసూలు చేసిందంతా కక్కాల్సిందే!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై పన్నులు విధిస్తూ ఎంజాయ్ చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తోంది. సుంకాల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పు వస్తే.. ఇప్పటి వరకు వచ్చిన బిలియన్ డాలర్ల ఆదాయం రీఫండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే విషయాన్ని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ వెల్లడిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ తాజాగా మీట్ ది ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల విషయమై సుప్రీంకోర్టులో తీర్పు రావాల్సి ఉంది. కోర్టు తీర్పును ట్రంప్కు అనుకూలంగా వస్తే మంచిదే. ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే మాత్రం.. మేము దాదాపు సగం సుంకాలకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇది అమెరికా ట్రెజరీకి భయంకరంగా మారుతుంది. తిరిగి చెల్లింపులను జారీ చేయడానికి పరిపాలన సిద్ధంగా ఉందా లేదా? అనేది తేలాలి. అదే జరిగితే పలు దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిందంతా అమెరికా కక్కాల్సి ఉంటుంది. అయితే, సుప్రీంకోర్టులో ట్రంప్ అనుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక, 1977 అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద ట్రంప్కు భారీ సుంకాలను విధించే అధికారం లేదని రెండు ఫెడరల్ కోర్టులు తేల్చిన తర్వాత బెసెంట్ ఇలా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇదిలా ఉండగా.. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు బ్రేకులు పడుతుండటంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫెడరల్ చట్టం ప్రకారం అధ్యక్షుడికి దిగుమతులపై సుంకాలు విధించే హక్కు ఉందని పేర్కొంటూ ఈ కేసును అత్యవసరంగా విచారణ జరపాలని కోరింది. ఎమర్జెన్సీ అధికార చట్టం ప్రకారం ట్రంప్ సుంకాలు విధించారని ఇటీవల అప్పీల్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఆ సుంకాలు చట్టవిరుద్ధమని పేర్కొనడంతో ట్రంప్ యంత్రాంగం సుప్రీం తలుపుతట్టింది.నవంబర్ ప్రారంభంలోనే ఈ కేసుపై వాదనలు వినాలని సొలిసిటర్ జనరల్ డి.జాన్ సావర్ న్యాయమూర్తిని కోరారు. ‘అప్పీల్స్ కోర్టు నిర్ణయం అధ్యక్షుడు ఐదు నెలలుగా విదేశాలతో కొనసాగిస్తున్న చర్చలను అనిశ్చితిలోకి నెడుతుంది. ఇప్పటికే పూర్తయిన చర్చలను, జరగబోయే చర్చలను ప్రమాదంలో పడేస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ వాదనను లిబర్టీ జస్టిస్ సెంటర్ వ్యాజ్య డైరెక్టర్, సీనియర్ న్యాయవాది జెఫ్రీ ష్వాబ్ తోసిపుచ్చారు. ‘చట్టవిరుద్ధమైన సుంకాలు చిన్న వ్యాపారాలకు తీవ్ర హాని కలిగిస్తున్నాయి. వాటి మనుగడ ప్రమాదంలో పడుతోంది. ఈ కేసులో మా క్లయింట్లకు సత్వరం పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై వ్యాపార వర్గాలు ఇప్పటికే రెండు న్యాయస్థానాల్లో పైచేయి సాధించాయి. -
శ్రుతి మించుతున్న ట్రంప్... వెనెజువెలాపై యుద్ధం!
వాషింగ్టన్: ఆసియా, యూరప్ అనంతరం అమెరికా ఖండాన్ని సైతం యుద్ధ మేఘాలు వేగంగా కమ్ముకుంటున్నాయి. తమకు చిరకాలంగా కొరకరాని కొయ్యగా మారిన పొరుగు దేశం వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. వెనెజులాలో డ్రగ్స్ కార్టెళ్ల విధ్వంసం ముసుగులో అక్కడి అపార చమురు నిక్షేపాలను చేజిక్కించుకునే దిశగా డొనాల్డ్ ట్రంప్ శరవేగంగా పావులు కదుపుతున్నారు. అమెరికా సైన్యం ఇప్పటికే వందల సంఖ్యలో భీకర, భారీ క్షిపణులను వెనెజువెలాపైకి ఎక్కుపెట్టింది. ట్రంప్ ఊ అన్న మరుక్షణమే విరుచుకుపడేందుకు అమెరికా యుద్ధనౌకలు, అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలు సర్వ సన్నద్ధంగా ఉన్నాయి. ఈ బాహుబలి దాడిని కాచుకునేందుకు నిరుపేద వెనెజువెలా కాలూ చేయీ కూడదీసుకుంటోంది. యుద్ధాలను ఆపేస్తానంటూ ఆదర్శాలు వల్లించి రెండోసారి గద్దెనెక్కిన ట్రంప్ ఈ ఎనిమిది నెలల్లో ఏ యుద్ధాన్నీ ఆపలేకపోగా ఇలా పొరుగు ఖండంలోనే స్వయంగా రణన్నినాదాలకు దిగుతుండడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.8 యుద్ధ నౌకలు, 10 యుద్ధ విమానాలు మాదకద్రవ్యాలను తమ దేశంలోకి అక్రమంగా సరఫరా చేస్తున్న వెనెజువెలా డ్రగ్స్ ముఠాల ధ్వంసానికి సైనిక చర్యకూ వెనుకాడబోమని ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అన్నట్టుగానే వెనెజువెలాను సముద్ర మార్గాన చుట్టుముట్టాల్సిందిగా నేవీని ఆదేశించారు. దాంతో అత్యాధునిక యుద్ధ నౌకలు యూఎస్ఎస్ గ్రేవ్లీ, యూఎస్ఎస్ జాసన్ డన్హమ్ ఆగమేఘాలపై దక్షిణ కరేబియన్ సముద్రంలోకి ప్రవేశించి వెనెజువెలాపైకి గైడెడ్ మిసైల్స్ ఎక్కుపెట్టాయి. అప్పటికే అక్కడున్న డి్రస్టాయర్ నౌక యూఎస్ఎస్ సామ్సన్ వాటికి తోడైంది. ఇవి చాలవన్నట్టు పసిఫిక్ మహా సముద్రం నుంచి యూఎస్ఎస్ లేక్ ఏరీ నౌకను రప్పిస్తున్నారు. యూఎస్ఎస్ ఇవో జిమా, యూఎస్ఎస్ సాన్ ఆంటోనియో, యూఎస్ఎస్ ఫోర్ట్ లాడెర్డేల్ వంటి యుద్ధ నౌకలూ యుద్ధ ప్రాతిపదికన వచ్చి చేరుతున్నాయి. ఇలా 8 అత్యాధునిక యుద్ధ నౌకలు వెనెజువెలా తీరం వెంబడి అంతర్జాతీయ జలాలను అష్టదిగ్బంధనం చేశాయి. 4,000 మంది సెయిలర్లు, మెరైన్ కమెండోలు సిద్ధంగా ఉన్నారు. వెనెజువెలా డ్రగ్స్ ముఠాలపై ఆకాశ మార్గంలో కూడా విరుచుకుపడేందుకు 10 అత్యాధునిక ఎఫ్–35 యుద్ధ విమానాలను కూడా అమెరికా శనివారమే ప్యూర్టోరికోకు తరలించి ఉంచింది!వెనెజువెలా ‘తగ్గేదే లే’! సైనికపరంగా అమెరికాతో వెనెజువెలా ఏమాత్రం తూగలేదు. అమెరికా, యూరప్ కఠిన ఆంక్షల దెబ్బకు నికొలాస్ మదురో సారథ్యంలోని కమ్యూనిస్టు ప్రభుత్వం అత్యాధునిక ఆయుధ, సైనిక సంపత్తిని సమకూర్చుకోలేకపోయింది. ఉన్నవల్లా కాలం చెల్లిన పాతకాలపు ఎఫ్–16 యుద్ధ విమానాలే! సైన్యం కూడా 1.5 లక్షల కన్నా లేదు. అన్ని విభాగాలూ కలిపినా 3.5 లక్షల లోపే! అయినా సరే, అమెరికా వంటి తిరుగులేని సైనిక శక్తిని యథాశక్తి ప్రతిఘటించి తీరతామని మదురో ఇటీవలే ప్రకటించారు. అతి త్వరగా ఏకంగా 50 లక్షల సైన్యాన్ని సిద్ధం చేస్తానని చెప్పారు! చమురు నిక్షేపాలపై కన్ను పేద దేశమైనా ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలకు వెనెజువెలా కేంద్రం. దేశంలో దాదాపు 48 వేల మిలియన్ టన్నుల చమురు నిల్వలున్నట్లు గుర్తించారు. అమెరికా కఠిన ఆంక్షల వల్ల వాటిని వెలికితీయటం సాధ్యపడటం లేదు. ట్రంప్ తొలిసారి అమెరికా అధ్యక్షుడైనప్పుడే ఆ చమురు నిల్వలపై కన్నేశారు. వెనెజువెలా చమురంతా అమెరికాకే దక్కాలని అప్పట్లోనే బహిరంగ ప్రకటనలు చేశారు. అందుకోసం అవసరమైతే అక్కడి చమురు క్షేత్రాలను ఆక్రమించుకుంటామన్నారు! మరోవైపు కమ్యూనిస్టు నాయకుడైన అధ్యక్షుడు మదురో అగ్రరాజ్యానికి కొరకరాని కొయ్యగా మారాడు. ట్రంప్ మద్దతుదారులైన ప్రతిపక్ష నేతలను తీవ్రంగా అణచివేశారు. దాంతో మదురోను పట్టించినవారికి రూ.450 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది. వెనెజువెలాలో చైనా భారీ పెట్టుబడులు పెట్టడంతోపాటు 90 శాతం చమురు కొనుగోలు చేస్తోంది. ఇది అమెరికాకు కంటగింపుగా ఉంది. -
‘మోదీజీ దేశం మొత్తం మీ వెనకే ఉంది.. మీ దమ్మేంటో ట్రంప్కు చూపించండి’
న్యూఢిల్లీ: ‘మోదీజీ..ట్రంప్కు మీ దమ్మేంటో చూపించండి. యావత్దేశం మొత్తం మీ వెంట ఉంది’అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్కు మీ దమ్మేంటో చూపించండి. దేశం మొత్తం మీ వెనుక ఉంది. అమెరికా మన ఎగుమతులపై 50 శాతం సుంకం విధిస్తోంది. మీరు అమెరికా దిగుమతులపై 75 శాతం సుంకం విధించండి. ట్రంప్ తలవంచుతాడో లేదో చూడండి’అని అన్నారు.ఈ సందర్భంగా..కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమెరికా పత్తి దిగుమతులపై 11 శాతం సుంకం మినహాయింపు ఇచ్చిన నిర్ణయాన్ని కేజ్రీవాల్ తీవ్రంగా విమర్శించారు. అమెరికా పత్తి దిగుమతి వల్ల మన రైతులకు మార్కెట్లో రూ.900 కన్నా తక్కువ ధర వస్తుంది. అమెరికా రైతులు ధనవంతులు అవుతారు, గుజరాత్ రైతులు బీదవుతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.పత్తి పంట చేతికొచ్చే సమయం అక్టోబర్-నవంబర్లో ఉండటంతో మార్కెట్ లేకపోవడం వల్ల రైతులు అప్పుల బారిన పడతారని, చివరికి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి అప్పులు తీసుకున్నారు. ఇప్పుడు వారు అప్పు ఎలా తీర్చాలి?’అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ట్రంప్ ప్రభుత్వానికి దాసోహమైందని ఆరోపించిన కేజ్రీవాల్ .. ట్రంప్కు మోదీ తలవంచారు. ట్రంప్ 50 శాతం సుంకం విధించారు. మోదీ 100 శాతం సుంకం విధించాలని సూచించారు. -
'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..
ప్రపంచంలోని కొన్నిచోట్ల ఇటీవలి కాలంలో చిత్ర విచిత్రమైన వింత భవంతులు పుట్టుకొస్తున్నాయి. వాస్తుకళా నైపుణ్యానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జతచేసి నిర్మించిన ఈ అద్భుత భవంతులు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. వీటిలో కొన్నింటి విశేషాలను తెలుసుకుందాం.ది డ్యాన్సింగ్ హౌస్ఇది చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో ఉంది. ఈ భవనం 1996లో పూర్తయింది. దీని ఆకృతి డ్యాన్స్ చేస్తున్న జంటను పోలి ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. అయితే దీన్ని మొదట్లో ‘జింజర్ అండ్ ఫ్రెడ్‘ అని పిలిచేవారు. ఆ పేరు ప్రముఖ డ్యాన్సర్లు జింజర్ రోజర్స్, ఫ్రెడ్ ఆస్టైర్ల పేర్ల నుంచి వచ్చింది. ఇది ఒక కార్యాలయ భవనం. అయితే, దీని పై అంతస్తులో ఒక రెస్టరెంట్ ఉంటుంది. ఆ రెస్టరెంట్లో కూర్చుని భోంచేస్తూ, ప్రేగ్ నగర అందాలను తిలకించడం మరపురాని అనుభూతిగా ఉంటుంది.ది వేవ్ బిల్డింగ్ఇది డెన్మార్క్లోని వెజ్లే నగరంలో ఉంది. దీనిని హెన్నింగ్ లార్సెన్ ఆర్కిటెక్ట్స్ సంస్థ డిజైన్ చేసింది. పేరుకు తగ్గట్టుగానే, ఇది వెజ్లే నౌకాశ్రయం పక్కన, సముద్ర కెరటాల ఆకారంలో ఉంటుంది. దీని నిర్మాణం 2009లో మొదలైంది. ఇది రెండు దశల్లో పూర్తయింది. మొదట ఒక వైపు నిర్మాణం పూర్తయిన తర్వాత, 2018లో రెండవ వైపు నిర్మాణం కూడా పూర్తయింది. వేవ్ బిల్డింగ్లో మొత్తం 140 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ భవనం తన డిజైన్, లైటింగ్తో ఆ ప్రాంతానికి ఒక కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రిపూట ఈ భవనం విద్యుత్ కాంతులతో మరింత అద్భుతంగా కనిపిస్తుంది. ఈ భవనం డిజైనింగ్ నైపుణ్యానికి అనేక అంతర్జాతీయ అవార్డులు దక్కాయి.ఎలిఫెంట్ బిల్డింగ్ఇది థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంది. దీని నిర్మాణం 1997లో పూర్తయింది. థాయ్ ఆర్కిటెక్ట్ ఒంగ్–అర్డ్ సత్రాబంధు, ఇంజినీర్ డాక్టర్ అరుణ్ చైసెరితో కలిసి దీనిని రూపొందించారు. ఈ భవనం మూడు టవర్లను కలిగి ఉంటుంది, ఇవి ఏనుగు కాళ్లు, తొండంలా కనిపిస్తాయి. దీనికి ఏనుగు చెవులు, కళ్లు, దంతాలలాంటి డిజైన్ కూడా ఉంది. ఇది కేవలం ఒక ఆకర్షణీయమైన కట్టడం మాత్రమే కాదు, ఇందులో నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు, కార్యాలయాలు, షాపింగ్ సెంటర్లు, బ్యాంక్, పోస్టాఫీసు వంటివి చాలానే ఉన్నాయి. ఏనుగు థాయ్లాండ్ జాతీయ జంతువు కావడంతో ఈ భవనం థాయ్ జాతీయ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోని అత్యంత విచిత్ర, విలక్షణ భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.క్రాస్ టవర్స్ఇది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఉంది. ఈ భవనాన్ని డానిష్ ఆర్కిటెక్ట్ సంస్థ బ్యార్కే ఇంగెల్స్ గ్రూప్ 2012లో డిజైన్ చేసింది. రెండు వేర్వేరు టవర్లు ఒకదానికొకటి ఎదురుగా ఉండేలా, వాటి మధ్యలోని కొన్ని గదులు ఒకదానితో ఒకటి కలిసేలా డిజైన్ చేశారు. ఇది బయట నుంచి చూడటానికి హ్యాష్ట్యాగ్లా కనిపిస్తుంది. అందుకే దీన్ని ‘హ్యాష్ట్యాగ్ టవర్స్’ అని కూడా అంటారు. గాలి, సూర్యరశ్మి భవనంలోకి ధారాళంగా వెళ్లేలా దీన్ని నిర్మించారు. దాంతో విద్యుత్ వినియోగం తగ్గుతుంది. ఇందులో పలు కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, నివాసయోగ్యమైన అపార్ట్మెంట్లు ఉన్నాయి.జిగ్జాగ్ టవర్స్ఇది ఖతార్ రాజధాని దోహాలో ఉంది. ఈ టవర్స్ను 2009లో నిర్మించారు. ఈ టవర్స్ రూపకల్పన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. భవనం నిర్మాణం బయట నుంచి చూస్తే జిగ్జాగ్ ఆకారంలో ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. మాల్స్, రెస్టారెంట్లు, కేఫ్లు, వివిధ రకాల దుకాణాలు ఇందులో ఉంటాయి. ఈ రెండు టవర్స్లో మొత్తం 748 లగ్జరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి.లాంగాబెర్గర్ బిల్డింగ్ ఇది అమెరికాలోని ఒహాయోలో ఉంది. ఈ భవనం లాంగాబెర్గర్ కంపెనీ ప్రధాన కార్యాలయం. ఈ కంపెనీ చేతితో తయారు చేసే చెక్క బుట్టలకు ప్రసిద్ధి చెందింది. తమ ప్రత్యేకతకు గుర్తుగా వారు తమ ప్రధాన కార్యాలయాన్ని ఒక పెద్ద బుట్ట ఆకారంలో 1997లో నిర్మించారు. ఇది నిజంగానే చూడటానికి బుట్టలా కనిపిస్తుంది. ఈ భవనం సుమారు 192 అడుగుల పొడవు, 126 అడుగుల వెడల్పు, 79 అడుగుల ఎత్తుతో ఉంటుంది. లాంగాబెర్గర్ కంపెనీ కార్యకలాపాలను నిలిపివేసిన తర్వాత, ఈ భవనాన్ని 2018లో అమ్మకానికి పెట్టింది. ప్రస్తుతం ఇది ఖాళీగా ఉంది, కాని, దాని ప్రత్యేకమైన డిజైన్ కారణంగా ఇది ఇప్పటికీ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. సంహిత నిమ్మన -
అమెరికాలో దారుణం..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతున్న కారణంగా యుద్ధభూమిలో ఉండలేక ప్రశాంతమైన జీవితం కోసం ఉక్రెయిన్ మహిళ ఇరినా జరుత్స్కాను (23) అమెరికాకు శరణార్థిగా వచ్చారు. అయితే, ఆగస్టు 22న నార్త్ కరోలినాలోని షార్లెట్లో ఆమె రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.Look at this tragedy, Iryna Zarutska, a 23-year-old Ukrainian war refugee, brutally stabbed to death on a train in Charlotte, North Carolina. And by whom? Decarlos Brown Jr., a career criminal who’s spent his life bouncing in and out of jail like it’s a revolving door!Why on… pic.twitter.com/9CvcgzFKGb— Grim (@MadWokeNews) September 6, 2025ఆమె వెనుక కూర్చున్న నిందితుడు డెకార్లోస్ బ్రౌన్ జూనియర్.. ఇరినాను కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం నిందితుడు తర్వాతి స్టాప్లో దిగిపోయాడు. ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. దాడికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని.. అతడికి నేరచరిత్ర ఉన్నట్లు వివరించారు. -
భారత్కు ‘ఎలాన్ మస్క్’ మద్దతు.. నవారో అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్
వాష్టింగన్: ఇటీవలి కాలంలో భారత్ను టార్గెట్ చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు, యూఎస్కు చెందిన పలువురు నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రష్యా చమురు కొనుగోలు విషయంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాట్లాడుతున్న వారి లిస్టులో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మొదటి స్థానంలో ఉన్నారు. భారత్పై నవాలో పదే పదే నోరుపారేసుకుంటున్నారు. అయితే.. తాజాగా ఆయనకు బిగ్ షాక్ తగిలింది. నవారో ఆరోపణలు అబద్ధమని ‘ఎక్స్’ తన ఫ్యాక్ట్ చెక్ చేసి తిప్పికొట్టింది. దీంతో, నవారోకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది.రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఓవరాక్షన్ కామెంట్స్ చేశారు. కొద్దిరోజుల క్రితమ నవారో ట్విట్టర్(ఎక్స్) వేదికగా..‘భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి. లాభం కోసమే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది. ఉక్రెయిన్తో మాస్కో చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది. యుద్ధంలో ఇరుదేశాల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’ అని పోస్టు పెట్టారు. అంతటితో ఆగకుండా.. ‘రష్యాకు భారత్ లాండ్రోమ్యాట్లా పనిచేస్తోంది. మీకు తెలుసా.. ఓ వర్గం లబ్ధి పొందేందుకు భారత ప్రజలను పణంగా పెడుతోంది. మనం దానిని అడ్డుకోవాలి. అది ఉక్రెయిన్ వాసులను చంపుతోంది. మనం (అమెరికన్లు) చెల్లింపుదారులుగా ఏం చేయాలో అది చేయాలి’ అంటూ ఇష్టానుసారం ఆరోపణలు గుప్పించారు.Trump aide Peter Navarro lashes out at India over Russian oil, accuses it of “profiteering” & fueling Moscow’s war machine. Musk’s X fact-checks him, calling out US double standards. Navarro fumes: “Elon is letting propaganda in.” https://t.co/0Bq0SIgPGm via @indiatoday pic.twitter.com/r4jCnATbBm— Ashok Upadhyay (@ashoupadhyay) September 7, 2025ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోంది ఇంధన భద్రత కోసమేనని పేర్కొంది. ఆ దేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని స్పష్టం చేసింది. అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమని తేల్చింది. అనంతరం, ఈ ఫ్యాక్ట్ చెక్పై నవారో భగ్గుమన్నారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ ఒక చెత్తగా అభివర్ణించారు. భారత్ లాభపేక్ష కోసమే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందంటూ తన ఆరోపణలను సమర్థించుకున్నారు. ఉక్రెయిన్ భూభాగాన్ని మాస్కో ఆక్రమించక ముందు.. ఈ కొనుగోళ్లు జరగలేదన్నారు.ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రజలను చంపడం, అమెరికన్ల ఉద్యోగాలు తీసుకోవడం ఆపాలంటూ పిచ్చి ప్రేలాపణలు చేశారు. దీనిపై కూడా ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం భారత్ సొంత నిర్ణయమని, అది ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. చమురు కొనుగోలు చేయొద్దంటూ భారత్పై ఒత్తిడి తెస్తూనే.. అమెరికా రష్యా నుంచి యురేనియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటోందని తెలిపింది. యూఎస్ ద్వంద్వ ప్రమాణాలకు ఇది అద్దంపడుతోందని మండిపడింది. ఇక, భారత ఉత్పత్తుల దిగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. -
మోదీ నేను భాయీ భాయీ..! ప్లేట్ మార్చిన ట్రంప్
-
ట్రంప్ వ్యాఖ్యలను అభినందించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ న్యూస్ఏజెన్సీ ప్రచురించిన కథనంపై మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి స్పందించడం గమనార్హం. తనను గొప్ప ప్రధాని అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ట్రంప్ భావాలను, ఇరు దేశాల సంబంధాలపై సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నట్లు తెలిపారు. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. అంతకు ముందు.. భారత్, రష్యాలు అమెరికాకు దూరం అవుతున్నట్లు అనిపిస్తోందంటూ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిగంటలకే ఆయన ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చుతూ అలాంటిదేం లేదంటూ వ్యాఖ్యానించడం కొసమెరుపు. భారత్తో తిరిగి సంబంధాలు మెరుగుపడతాయా? అని రిపోర్టర్ల నుంచి ఎదురైన ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ‘‘భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటాను. మోదీ గొప్ప ప్రధాని. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు’’ అన్నారు. ఈ నేపథ్యంలో ఐరాస కీలక సమావేశానికి మోదీ గైర్జారు అవుతారనే విషయం తెరపైకి వచ్చింది. దీంతో ట్రంప్ వైఖరికి నిరసనగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తుండగా.. మోదీ తాజా ట్వీట్తో ఇరు దేశాధినేతల మధ్య గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారానికి పుల్స్టాప్ పడినట్లయ్యింది. Deeply appreciate and fully reciprocate President Trump's sentiments and positive assessment of our ties.India and the US have a very positive and forward-looking Comprehensive and Global Strategic Partnership.@realDonaldTrump @POTUS https://t.co/4hLo9wBpeF— Narendra Modi (@narendramodi) September 6, 2025 -
ట్రంప్ కామెంట్లు.. మోదీ కీలక నిర్ణయం
నరేంద్ర మోదీ గొప్ప ప్రధాన మంత్రి అని, తనకు మంచి స్నేహితుడని, అయినా ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పనులు ఎందుకనో నచ్చడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. ప్రధాని మోదీ తీసుకున్న ఓ కీలక నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది.ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీ(UNGA) వార్షికోత్సవ హైలెవల్ సెషన్కు హాజరై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజాగా విడుదలైన ప్రసంగ కర్తల జాబితాలో ఆయన పేరు లేదు. ఆయన స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ పేరును చేర్చారు. దీంతో మోదీ ఉద్దేశపూర్వకంగానే ఆ పర్యటన నుంచి తప్పుకున్నారనే చర్చ జోరందుకుంది.సెప్టెంబర్ 9వ తేదీన ఐరాస సాధారణ అసెంబ్లీ 80వ సెషన్ ప్రారంభం కానుంది. ‘‘ఒక్కటిగా ఉన్నప్పుడు మెరుగ్గా ఉంటుంది.. శాంతి, అభివృద్ధి & మానవ హక్కుల కోసం 80 సంవత్సరాలు.. అంతకంటే ఎక్కువ’’(Better together: 80 years and more for peace, development and human rights )అనే థీమ్తో ఈ ఏడాది సెషన్ జరగనుంది. ఇక.. హైలెవల్ జనరల్ డిబేట్ సెప్టెంబర్ 23-29 తేదీల మధ్య జరగనుంది. ఆనవాయితీ ప్రకారం బ్రెజిల్ ఈ డిబేట్లో మొదట ప్రసంగించనుంది. అటుపై యూఎన్జీఏ పొడియంలో ప్రపంచ దేశాధినేతలను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. రెండో దఫా అధ్యక్షుడు అయ్యాక ఐరాస నుంచి ఆయన ప్రసంగించడం ఇదే తొలిసారి కానుంది. జులైలో విడుదల చేసిన ప్రొవిజనల్ లిస్ట్లో భారత్ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ హాజరై.. సెప్టెంబర్ 26వ తేదీన ప్రసంగిస్తారని ఉంది. అయితే తాజా లిస్ట్లో ఆయన పేరుకు బదులు జైశంకర్ పేరు చేరింది. సెప్టెంబర్ 27వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రసంగించనున్నారు. అంతకు ఒక్కరోజు ముందుగానే.. ఇజ్రాయెల్, చైనా, పాక్, బంగ్లాదేశ్ అధినేతలు ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే.. భారత ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. అయితే.. 50 శాతం సుంకాల విధింపు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారింది. రష్యా చమురు, ఆయుధాల కొనుగోలు నేపథ్యంతో ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తక్షణమే కొనుగోళ్లు ఆపాలంటూ అల్టిమేటం జారీ చేశారు. కానీ.. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధమని మోదీ ప్రకటించారు. తాజా షాంగై సదస్సులో పుతిన్, జిన్పింగ్తో మోదీ దోస్తీపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భారత్, రష్యాలు అమెరికాకు దూరమై.. కుటిలమైన చైనాకు దగ్గరవుతున్నారనే ఆరోపణ గుప్పించారు. అయితే కొన్నిగంటలకే మాటమార్చా.. అలాంటిదేం లేదన్నారు. భారత్తో బంధం ప్రత్యేకమైందన్నారు.అదే సమయంలో.. భారత్-పాక్ ఉద్రిక్తతలను తానే ఫోన్ కాల్ చేసి చల్లార్చానంటూ ట్రంప్ ప్రకటించుకుంటూ వస్తుండగా.. భారత్ ఆ వాదనను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ వ్యవహారం భారత్లో రాజకీయ దుమారానికి కూడా కారణమైంది. ఈ క్రమంలోనే కెనడాలో జరిగిన జీ7 సదస్సు నుంచి ట్రంప్ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించి.. ప్రధాని మోదీ భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. ఇక కొత్త రక్షణ ఒప్పందం కోసం రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికాలో పర్యటించాల్సి ఉండగా.. అది వాయిదా పడింది. ఇప్పుడు ఐరాస కార్యక్రమానికి మోదీ గైర్హాజరు అవుతుండడం ట్రంప్ వైఖరికి నిరసనగానే అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. -
మోదీ గొప్పే.. కానీ పనులే నచ్చడం లేదు: ట్రంప్
భారత్తో సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ను కోల్పోయామని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా నాలుక మడతేసేశారు. నిజంగా అలాంటిదేమీ జరగలేదని భావిస్తున్నాను అంటూ ట్రంప్ గత వ్యాఖ్యలను తిరస్కరించారు. స్థానిక కాలమానం ప్రకారం.. శుక్రవారం రక్షణశాఖ పేరును యుద్ధశాఖగా మారస్తూ అధికారిక ఉత్తర్వులపై ఆయన సంతకాలు చేశారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ నేనెప్పుడూ మోదీతో స్నేహంగా ఉంటా. మోదీ గొప్ప ప్రధానమంత్రి. కానీ, ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు. భారత్తో మాకు ప్రత్యేక బంధం ఉంది.. ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదించాయి’’ అని ట్రంప్ అన్నారు. భారత్ రష్యా నుండి భారీగా చమురు కొనుగోలు చేస్తుండటం నన్ను నిరాశపరిచింది. నేను వారికి ఇది తెలియజేశాను అని అన్నారు. ఈ క్రమంలోనే అమెరికా భారత్పై 50 శాతం టారిఫ్ విధించినట్లు ట్రంప్ తెలిపారు. అయినా కూడా ప్రధాని మోదీతో తన సంబంధాలు మంచి స్థాయిలో ఉన్నాయన్నారు. ఇదిలా ఉంటే.. చైనా టియాంజిన్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమావేశంలో భారత్, రష్యా, చైనా అధినేతలు కలిసికట్టుగా కనిపించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ‘‘భారత్, రష్యాలను చైనాకు కోల్పోయాం’’ అని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే ట్రంప్ సీనియర్ కౌన్సిలర్ పీటర్ నవారో భారత్పై విమర్శలు చేశారు. రష్యా చమురు కొనుగోలుతో లాభాలు పొందుతున్నదని, భారత టారిఫ్లు అమెరికన్ ఉద్యోగాలను కోల్పోయేలా చేస్తున్నాయని ఆరోపించారు. ఇంకోవైపు.. అమెరికా వైట్హౌస్ ఆర్థిక సలహాదారు కెవిన్ హాసెట్ కూడా భారత్ రష్యా చమురు కొనుగోలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఇది ప్రజాస్వామ్య సంబంధిత అంశమని భావిస్తున్నాం. త్వరలో సానుకూల పరిణామాలు కనిపిస్తాయని ఆశిస్తున్నాం’’ అని పేరొన్నారు. అయితే.. తాజాగా తన వ్యాఖ్యలను ట్రంపే తోసిపుచ్చడం గమనార్హం. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం ట్రంప్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించడం లేదు. రష్యా చమురు కొనుగోళ్ల విషయంలోనూ వెనకడుగు వేయడం లేదు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య అంశాలపై భారత్ చర్చలు కొనసాగిస్తోందని స్పష్టం చేసింది. భారత్-రష్యా సంబంధాలను మూడో దేశం దృష్టికోణంలో చూడకూడదని భారత ప్రభుత్వం అంటోంది. -
జార్జియాలో నిర్బంధంలోకి 475 మంది విదేశీయులు
వాషింగ్టన్: అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నవారి కోసం వేట కొనసాగుతోంది. చట్టవిరుద్ధంగా వలస వచ్చినవారిని గుర్తించి, వెనక్కి పంపించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అమెరికాలోని జార్జియాలో 475 మంది అక్రమవలసదార్లను నిర్బంధించినట్లు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారి స్టీవెన్ ష్రాంక్ శుక్రవారం వెల్లడించారు. జార్జియాలో దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ కంపెనీ ప్లాంట్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేస్తుంటారు. ఇందులో దక్షిణ కొరియా పౌరులు అక్రమంగా పని చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. తాజాగా నిర్బంధంలోకి తీసుకున్నవారి అక్రమ వలసదార్లతో ఎక్కువ మంది దక్షిణ కొరియా పౌరులే ఉన్నట్లు స్టీవెన్ ష్రాంక్ తెలిపారు. జార్జియాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు స్థానికులకు దక్కాలి తప్ప అక్రమంగా వలసవచ్చినవారు సొంతం చేసుకోవడం సరైంది కాదని అన్నారు. ఒకేచోట 475 మంది అదుపులోకి తీసుకోవడం హోంల్యాండ్ సెక్యూరిటీ ఆపరేషన్ల చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అమెరికాలో తమపౌరులను అక్కడి అధికారులు నిర్బంధించినట్లు దక్షిణ కొరియా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. అయితే, ఎంతమంది అనే విషయం బయటపెట్టలేదు. డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు సోదాలు ముమ్మరంచేశారు. ప్రధానంగా విదేశీయులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. -
జస్ట్ 32 ఏళ్లకే కోటీశ్వరురాలిగా యూట్యూబర్.! ఆ సీక్రెట్ ఇదే..
చాలామంది ఎక్కువ డబ్బు సంపాదించాలని, లక్షాధికారి కావాలనే అనుకుంటారు. అయితే ఎక్కడో ఒకచోట అంచనా తప్పడం, ఆ తర్వాత డబ్బులు చాలక ఇక్కట్లుపడటం జరుగుతుంటుంది. ఒక్కోసారి పక్కాప్లాన్తో ఆర్జించడమే ధ్యేయంగా ప్రయత్నించినా కూడా..అందిరికీ అంత ఈజీగా వర్కౌట్ కాదు. దాంతో సంపాదనలో వెనుకబడుతుంటారు. మధ్యతరగతి లేదా ఓ మోస్తారుగా ఇంటి అవసరాలకు సరిపోయే డబ్బును మాత్రమే కూడబెట్టగలుగుతుంటారు. అలా ఇబ్బందిపడుతున్న వాళ్లకి ఈ యూట్యూబర్ చెప్పే అమోఘమైన ఆర్థిక పాఠాలు ఉపయోగపడొచ్చు. అయితే ఆమె చెబుతున్న విషయాలు వింటే..ఇదేంటి ఈమె ఇలా అంటోందేంటీ అని విస్తుపోవడం మాత్రం ఖాయం. అయితే మనం తేలిగ్గా చూసేవి మన సంపాదనకు అత్యంత కీలమైనవని ఆమె ఆర్థిక చిట్కాల ద్వారా తెలుస్తుంది. ఇంతకీ అదేంటంటే..యూట్యూబ్లో మంచి ఆర్థిక విద్యావేత్తగా పేరు తెచ్చుకున్న మాజీ వాల్స్ట్రీట్ వ్యాపారి రోజ్ హాన్ అద్భుతమైన ఫైనాన్షియల్ పాఠాలను చెబుతోంది. మనం అంతంగా పట్టించకోనివే..మన డబ్బు సంపాదనకు అత్యంత కీలకం అంటోందామె. మనం సాధారణంగా ఖర్చు చేసే వాటిపై దృష్టిపెట్టం. మనం గనుక ఆ బిల్లులపై ఫోకస్ పెట్టి చవకగా పొందే ప్రయత్నం చేస్తే..కోట్లాధికారి కావడం ఈజీ. ఇదేంటీ అనుకోకండి..మనం చేసే కొనుగోళ్లపై కాస్త జాగురకతతో వ్యవహరించమని అంటోంది. ఒక వేళ్ల మీరు కొనాలనుకున్న వస్తువు రేటు చూసి..కాస్త మంచిగా బేరమాడాలి. అతడు మన ప్రపోజల్ని అంగీకరించేలా మన వాక్ఛాతుర్యం ఉండాలట. ఇలాంటిదే తక్కువ ధరకు చూశానని ఒప్పించాలి. అలాగే ఒక వస్తువుని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాననేది వివరించాలి. అలాగే ఈ ప్రొడక్ట్ పై ఉన్న అభిమానం గురించి చెప్పి ఇంప్రెస్ చేసి తక్కువ ధరకే వస్తువుని పొందే ప్రయత్నం చేస్తే..సగం వృధా ఖర్చులు ఆదా అవుతాయట. వాటిలోకి ఇంటర్నెట్, ఫోన్ ప్లాన్లు, బీమా, క్రెడిట్ కార్డ్ APRలు, స్ట్రీమింగ్ సేవలు, వైద్య బిల్లులు తదితరాలన్ని ఉంటాయి. అయితే ఇలాంటి వాటికి బ్రదర్ కాస్త తగ్గించి వేయమని అడగలేం కదా అని భావించకూడదని అంటోంది రోజ్హాన్. అధిక మొత్తంలో సేవింగ్స్ చేయాలనుకున్నా లేదా డబ్బుని ఆర్జించాలన్నా..ఈ మాత్రం జాగ్రత్త ఉండాలంటోంది. అలాగే సదరు ఓనర్ పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని, మాటలతో అతడి మనసుని గెలుచుకునే ప్రయత్నం చేస్తే..మనకు నచ్చిన వస్తువు తక్కువ ధరకే లభిస్తుందని చెబుతోందామె. ఒకవేళ మీ మాటలకు అతడు పడ్డట్లు కనిపించలేదంటే.అతడి సూపర్వైజర్ లేదా రిటెన్షన్ విభాగాన్ని అడగండి. తప్పక మంచి ఫలితాలు లభిస్తాయని అన్నారు. అదే సమయంలో ఒక్కోసారి విభిన్నకరమైన ఫలితాలు కూడా రావొచ్చు. కానీ ఏదోరకంగా మనీ సేవింగ్ అనేదే వారి లక్ష్యం అయితే..కచ్చితంగా ఇలాంటి వాటిపై ఫోకస్ పెడితే మంచి ఫలితాలను సత్వారంగా అదుకుంటారని చెబుతోందామె. ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు నెట్టింట హాట్టాపిక్గా మారి చర్చలకు తెరలేపాయి. కాగా, కొరియన్ అమెరికన్ రోజ్ హాన్ 32 ఏళ్లకే సుమారు రూ. 88 లక్షల విద్యార్థి రుణాన్ని చెల్లించి స్వీయ నిర్మిత కోటీశ్వరురాలు అయ్యిందామె. ఆమె ఇలాంటి ఆర్థిక పాఠాలతో యూట్యూబ్లో ఫేమస్ అవ్వడమే కాదు, ఆ నేపథ్యంలోనే ఆమె ఛానెల్కి మిలయన్కిపైగా ఫాలోవర్లు ఉండటం విశేషం. (చదవండి: కైరాన్ అంటే మాటలు కాదు!) -
ఫేస్బుక్లో జుకర్ బర్గ్ బ్యాన్.. కేసేసిన జుకర్ బర్గ్
వాషింగ్టన్: ఫేస్బుక్లో తనని బ్యాన్చేయడంపై జుకర్ బర్గ్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసు ఇప్పటిది కాదు.. గత ఎనిమిదేళ్లుగా కోర్టులో నలుగుతూనే ఉంది. ఇంతకీ.. ఫేస్బుక్ తనని బ్యాన్ చేయడంపై జుకర్ బర్గ్ కేసు ఎందుకు పెట్టారని అనుకుంటున్నారా? అమెరికాలో 38వ అతిపెద్ద రాష్ట్రం ఇండియానా. ఇప్పుడీ రాష్ట్రానికి చెందిన మార్క్ స్టీవెన్ జుకర్బర్గ్ అనే న్యాయవాది.. మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్పై న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మెటా(గతంలో ఫేస్బుక్) తన అకౌంట్ను బ్యాన్ చేసిందని, ఫలితంగా భారీ మొత్తంలో నష్టపోయినట్లు కోర్టులో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ న్యాయవాది పేరు మార్క్ జుకర్ బర్గ్. కానీ అతను మెటావర్స్ నిర్మించడంలో కాదు. దివాళా కేసుల్లో వాదిస్తుంటారు. 2017 నుండి తన న్యాయ సేవలను ప్రచారం చేసేందుకు ఫేస్బుక్ పేజీని ప్రారంభించారు. ఇందుకోసం 11వేల డాలర్ల కంటే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేశాడు. కానీ అతని పేజీని తరచూ ఫేస్బుక్ బ్లాక్ చేస్తూనే ఉంది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. మీరు ఫేస్బుక్ అధినేత జుకర్బర్గ్ను అనుకరిస్తున్నారనే సమాధానం చెబుతోంది. తనను తానే నిరూపించుకోవడం అతనికి రోజువారీ తలనొప్పిగా మారింది.ఇదే విషయంపై స్థానిక టీవీ ఛానల్కు మాట్లాడుతూ, "బిలియనీర్ జుకర్బర్గ్ స్కూల్ పూర్తిచేసేలోపే నేను న్యాయవాదిగా పని చేస్తున్నాను’ అని చెప్పారు. ఇది మీకు వ్యంగ్యంగా అనిపించవచ్చు. కానీ ఆర్ధికంగా నష్టపోయేది నేనే కదా. డబ్బుపోయా, శనిపట్టుకుంది అన్న చందంగా ఫేస్బుక్ నా అకౌంట్ను బ్యాన్ చేయడంతో బిజినెస్ను కోల్పోయాను. iammarkzuckerberg.com అనే వెబ్సైట్ను ప్రారంభించి అందులో తన సర్వీసులు అందిద్దామంటే ఆఫ్లైన్లో క్లయింట్స్కాల్స్ చేస్తే ప్రాంక్ కాల్ అనుకుని కట్ చేస్తున్నారని కోర్టులో వాపోతున్నారు. ‘నేను మార్క్ స్టీవెన్, అతను మార్క్ ఎలియట్. ఇది సరదాగా చెప్పడం లేదు. మెటా నిర్ణయం వల్ల నేను వేలాది డాలర్లు నష్టపోవడం నాకు కోపం తెప్పించింది. 40 ఏళ్లుగా న్యాయవృత్తిలో ఉన్నా. ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ ఎలియట్ జుకర్బర్గ్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే నేను ఈ వృత్తిలో ఉన్నా. నన్ను మెటాలో బ్యాన్ చేయడం తగదు అని అన్నారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ వ్యవస్థాపకుడికి ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ గ్రహం మీద అత్యంత ధనవంతులలో ఒకరైన జుకర్బర్గ్ తనని క్షమించమని కోరవచ్చు. లేదంటే అతని పడవలో గడిపేందుకు నాకు ఓ వారం రోజుల పాటు అనుమతిస్తే.. కోర్టులు, కేసులు అవసరం ఉండదని చెప్పాడు. మార్క్ స్టీవెన్ దావా వేయడంపై మెటా స్పందించింది. జుకర్బర్గ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ సమస్య మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం'అని పేర్కొంది. -
‘డిఫెన్స్ కాదు.. ఇకపై యుద్ధమే’.. ట్రంప్ సంచలన నిర్ణయం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరిపాలనలో మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖను ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’గా నామకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు త్వరలో ఎగ్గిక్యూటీవ్ ఆర్డర్ను పాస్ చేయనున్నారు. అనంతరం, ప్రస్తుతం రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ ఇకపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మినిస్టర్గా పిలిపించుకోనున్నారు. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం.. ట్రంప్ త్వరలోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేయనున్నారు. తద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించేందుకు అనుమతి లభిస్తుంది. దీంతో పాటు ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థగా పేరొందిన పెంటగాన్ (Pentagon) రక్షణ కార్యాలయం అధికారిక పోర్టల్స్, సైన్య సంబంధిత బోర్డులు, మీడియా రూమ్లు కూడా ఈ మార్పుకు అనుగుణంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ కాస్తా.. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ మారుస్తూ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్, రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్ మీడియాతో మాట్లాడారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతో అమెరికా గతంలో ప్రపంచ యుద్ధాల్లో విజయాలు సాధించింది. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’ అనే పేరు మారిన తర్వాత ఆ పోరాట స్పూర్తి తగ్గిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హెగ్సెత్ కూడా ఈ మార్పును సాంస్కృతిక మార్పుగా అభివర్ణించారు. మేము కేవలం రక్షణ మాత్రమే కాదు.. దాడులు కూడా చేస్తాం. వాటికి అనుగుణంగా పేర్లు ఉండటం చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు.పేరు మార్పు దేనికి సంకేతం1949 వరకు అమెరికా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ వార్’ అనే పేరుతోనే సైనిక వ్యవహారాలను నిర్వహించేది. తరువాత నేషనల్ సెక్యూరిటీ చట్టం ద్వారా ‘డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్’గా మార్పు జరిగింది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ ఆ చారిత్రక పేరును తిరిగి తీసుకురావాలని భావిస్తోంది. ఈ మార్పు అమెరికా రాజకీయాల్లో, సైనిక విధానాల్లో కొత్త దిశకు సంకేతమా? అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది.ట్రంప్ వ్యూహమారక్షణ శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్) పేరును యుద్ద శాఖ (డిపార్ట్మెంట్ ఆఫ్ వార్)గా మార్చడంలో ట్రంప్ వ్యూహం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ వార్లో ‘వార్’ అనే పదం రక్షణ కంటే దాడి, శక్తి సూచిస్తుంది. అదే సమయంలో ప్రపంచదేశాల ఎదుట తమ దేశ యుద్ధ సామర్థ్యాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తున్నట్లేనని భావించవచ్చు. ఈ పేరు మార్పు రాజకీయ నాయకుడిగా దేశ భద్రతపై అతని దృష్టిని ప్రతిబింబించవచ్చు. ట్రంప్ ఈ మార్పును ప్రతిపాదించినప్పుడు, ఆయన ఉద్దేశం అమెరికా సైన్యానికి మరింత దృఢత్వాన్ని ఇవ్వడమే అని చెప్పారు. మరికొందరు మాత్రం.. ట్రంప్ యుద్ధాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగమేనంటూ పెదవి విరుస్తున్నారు. -
ట్రంప్, మోదీ బంధం.. ఇది అందరికీ గుణపాఠం: బోల్టన్ సంచలన వ్యాఖ్యలు
వాష్టింగన్: భారత్, అమెరికా మధ్య ప్రస్తుతం ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. నేతలు మాధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య వ్యక్తిగతంగా ఉన్న మంచి అనుబంధం ఇప్పుడు మాయమైపోయిందని యూఎస్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తెలిపారు. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘భారత ప్రధాని మోదీతో అధ్యక్షుడు ట్రంప్నకు మంచి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో భారత్ తీసుకున్న కొన్ని చర్యలే ఇందుకు కారణం కావచ్చు. అమెరికా-భారత్ సంబంధాలను వైట్ హౌస్ దశాబ్దాల వెనక్కి నెట్టింది. మోదీని రష్యా, చైనాకు చేరువ చేసింది. అమెరికా, ట్రంప్నకు ప్రత్యామ్నాయంగా బీజింగ్ తనను తాను ప్రదర్శించుకుంది.అయితే, ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను ఆయా నేతలతో తనకున్న వ్యక్తిగత అనుబంధాల కోణంలో చూస్తారు. ఒకవేళ ఆయనకు పుతిన్తో సత్సంబంధాలు ఉంటే.. అమెరికా, రష్యాల మధ్య అనుబంధం ఉంటుంది. కానీ.. వాస్తవానికి ఇది అసాధ్యం. ఇది ప్రతి ఒక్కరికి పాఠం లాంటిదే. సత్సంబంధాలు కొన్నిసార్లు సాయపడొచ్చు.. కానీ, అన్ని వేళలా రక్షించవు. ప్రస్తుతం భారత్ విషయంలో ట్రంప్ చాలా కఠినంగా వ్యవహరించాలని అనుకుంటున్నారు’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా- భారత్ల మధ్య సుంకాల వివాదం వేళ బోల్టన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.ఇదిలా ఉండగా.. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జాన్ బోల్టన్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. అయితే.. ట్రంప్ వ్యవహారశైలి నచ్చకపోవడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. రహస్య పత్రాల దుర్వినియోగం ఆరోపణలపై విచారణలో భాగంగా బోల్టన్కు చెందిన నివాసం, వాషింగ్టన్ కార్యాలయంలో ఎఫ్బీఐ ఇటీవల సోదాలు నిర్వహించింది. -
క్యూ1లో ఎఫ్డీఐల జోరు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐలు) 15 శాతం ఎగశాయి. వెరసి ఏప్రిల్–జూన్(క్యూ1)లో 18.62 బిలియన్ డాలర్లను తాకాయి. వీటిలో యూఎస్ నుంచి మూడు రెట్లు అధికంగా 5.61 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024–25 క్యూ1లో 16.17 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు నమోదయ్యాయి. ఈక్విటీ పెట్టుబడులుసహా మొత్తం ఎఫ్డీఐలు 25.2 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది క్యూ1లో 22.5 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు లభించాయి. టారిఫ్ సవాళ్లున్నప్పటికీ యూఎస్ నుంచి అత్యంత భారీగా 5.61 బిలియన్ డాలర్లు తరలి వచ్చాయి. గత క్యూ1లో ఇవి కేవలం 1.5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది క్యూ1లో ప్రధానంగా సింగపూర్ నుంచి 4.59 బిలియన్ డాలర్లు, మారిషస్ నుంచి 2.08 బిలియన్ డాలర్లు, సైప్రస్ నుంచి 1.1 బిలియన్ డాలర్లు, యూఏఈ నుంచి బిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. కాగా.. 2000 ఏప్రిల్ నుంచి 2025 జూన్వరకూ చూస్తే 76.26 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో యూఎస్ మూడో ర్యాంకులో నిలవగా.. 182.2 బిలియన్ డాలర్లతో మారిషస్ అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ బాటలో సింగపూర్ 179.48 బిలియన్ డాలర్లతో రెండో పెద్ద ఇన్వెస్టర్గా నిలిచింది. రంగాలవారీగా చూస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో పలు రంగాలలోకి విదేశీ పెట్టుబడులు ప్రవహించాయి. ప్రధానంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ 5.4 బిలియన డాలర్లను ఆకట్టుకోగా.. సర్వీసులు 3.28 బిలియన్ డాలర్లు, ఆటోమొబైల్ 1.29 బిలియన్ డాలర్లు, సంప్రదాయ ఇంధనం 1.14 బిలియన్ డాలర్లు, ట్రేడింగ్ 50.6 కోట్ల డాలర్లు, కెమికల్స్ 14 కోట్ల డాలర్లు, టెలికమ్యూనికేషన్లు 2.4 కోట్ల డాలర్లు చొప్పున అందుకున్నాయి. ఇక రాష్ట్రాలవారీగా చూస్తే కర్ణాటక అత్యధికంగా 5.69 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను సమకూర్చుకుంది. జాబితాలో తదుపరి మహారాష్ట్రకు 5.36 బిలియన్ డాలర్లు, తమిళనా డుకు 2.67 బిలియన్ డాలర్లు, గుజరాత్కు 1.2 బిలియన్ డాలర్లు, హర్యానాకు 1.03 బిలియన్ డాలర్లు, ఢిల్లీకి బిలియన్ డాలర్లు చొప్పున లభించాయి. -
యుద్ధం ఆగాలంటే భారత్పై టారిఫ్ల మోత తప్పదు!
న్యూయార్క్/వాషింగ్టన్: టారిఫ్ల బూచి చూపి పలు దేశాలను భయపెడుతున్న ట్రంప్ సర్కార్ చివరకు యూఎస్ సుప్రీంకోర్టును సైతం టారిఫ్లు తగ్గిస్తే అమెరికా వాణిజ్యలోటు సంక్షోభంలో కూరుకుపోతుందని భయపెట్టే దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉక్రెయిన్లో శాంతిస్థాపనే జరగాలంటే భారత్పై టారిఫ్ల మోత మోగాల్సిందేనని ట్రంప్ ప్రభుత్వం గురువారం అమెరికా సుప్రీంకోర్టులో వితండవాదానికి దిగింది. భారత్సహా ఇతర దేశాలపై అధిక టారిఫ్ల భారం మోపకపోతే ఆర్థికలోటు సుడిగుండంలో అమెరికా చిక్కుకోక తప్పదని ట్రంప్ సర్కార్ అనవసరంగా ఆందోళన వ్యక్తంచేసింది. అప్పీళ్ల కోర్టులో తమకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రావడంతో ఇతర దేశాలతో టారిఫ్ల చర్చల్లో ప్రతిష్ఠంబన నెలకొందని, అందుకే కేసును వీలైనంత త్వరగా తేల్చాలని యూఎస్ సుప్రీంకోర్టులో గురువారం డిమాండ్చేసింది. ఈ మేరకే ఏకంగా 251 పేజీల అఫిడవిట్ను కోర్టుకు ట్రంప్ సర్కార్ సమరి్పంచింది. ‘‘ఉక్రెయిన్పై రష్యా దురాక్రమణకు దిగడంతో ప్రత్యక్షంగా అమెరికాలో జాతీయ అత్యయిక పరిస్థితి ఏర్పడింది. దీనిని పరిష్కరించేందుకే భారత్పై టారిఫ్ల మోత మోగించాల్సి వచ్చింది. ఇందుకోసం అధ్యక్షుడు తన ‘1977 అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ను ప్రయోగించారు. అధిక టారిఫ్లతో భారత్పై ఆర్థికపరంగా ఒత్తిడి తెస్తేనే భారత్ మరో గత్యంతరంలేక చివరకు రష్యా యుద్ధవిరామం చేసేలా ఒప్పించగల్గుతుంది. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు, అమెరికా ఆర్థికవ్యవస్థ పటిష్టతకు భారత్పై 50 శాతం టారిఫ్ అవశ్యం’’అని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. ‘‘టారిఫ్ల విధింపును కోర్టులు అడ్డుకుంటే, అన్ని దేశాలపై టారిఫ్లు విధించే అసాధారణ అధికారం అధ్యక్షుడికి లేదని మీరు తేలిస్తే వాణిజ్యలోటు కష్టాల నుంచి అమెరికా బయటపడటం చాలా కష్టమవుతుంది. చివరకు అమెరికా ఆర్థికవినాశనం సంభవిస్తుంది’’అంటూ తమకు వ్యతిరేక తీర్పు రావొద్దనే ధోరణిలో ఏకంగా యూఎస్ సుప్రీంకోర్టునే భయపెట్టేలా ట్రంప్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది. ఆరు కీలక దేశాలు దారికొచ్చాయి ‘‘టారిఫ్ల కొరడా ఝుళిపించడంతో ప్రపంచంలోనే ఆరు ప్రధాన ఆర్థికవ్యవస్థలు(దేశాలు) మా దారికొచ్చాయి. అమెరికాతో 27 సభ్యదేశాలున్న ఐరోపా సమాఖ్యసైతం టారిఫ్ల ఒప్పందంచేసుకుంది. ఈ ఒప్పందం అమెరికాకు భారీగా మేలు చేకూర్చేదే. దీంతోపాటు 2 ట్రిలియన్ డాలర్ల కొనుగోళ్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి భారీ పెట్టుబడులు సాధ్యంకానున్నాయి. ఆయా దేశాలపై మేం విధించే టారిఫ్లు అనేవి అమెరికా మరింతగా 1.2 ట్రిలియన్ డాలర్ల వార్షిక వాణిజ్యలోటు అగాధంలో పడకుండా కాపాడే రక్షారేకులు. టారిఫ్లు విధించే అధికారం అధ్యక్షుడికి ఉండదన్న ‘అప్పీల్స్ ఫర్ ది ఫెడరల్ సర్క్యూట్ కోర్టు’అభిప్రాయాన్ని పట్టించుకోకండి. ఇతర దేశాలపై అధిక టారిఫ్లు మోపితేనే అమెరికా సంపన్న దేశంగా కొనసాగుతుంది. లేదంటే పేదదేశంగా పతనమవుతుంది. ట్రంప్ అధికారంలోకి రాకమునుపు అమెరికా ఆర్థిక వ్యవస్థ స్తబ్దుగా ఉండిపోయింది. ఇప్పుడు అధిక టారిఫ్లతో బిలియన్ల కొద్దీ డబ్బు వచ్చిపడుతోంది. ఇప్పుడు అమెరికా మళ్లీ బలపడుతోంది. ఆర్థికంగా పటిష్టమవుతూ విశ్వవ్యాప్తంగా గౌరవమర్యాదలను పొందుతోంది’’అని ట్రంప్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ డి. జాన్ సాయెర్ వాదించారు. నవంబర్లోపు కేసులో వాదోపవాదనలను ముగించి తీర్పు చెప్పాలని కోర్టును సాయెర్ కోరారు. -
‘భారత్తో రష్యాకు భారీ డ్యామేజ్.. అది చాలదా?’
రష్యా నుంచి చమురు కొనుగోలు నేపథ్యంతోనే భారత్పై ద్వితీయశ్రేణి ఆంక్షలు విధించాల్సి(పెనాల్టీ సుంకాలు) వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నొక్కి చెప్పారు. అయితే ఇది ఇక్కడితోనే అయిపోలేదని అంటున్నారాయన. భారత్ వల్లే రష్యాకు భారీ డ్యామేజ్ కూడా జరిగిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. బుధవారం పోలాండ్ అద్యక్షుడు కరోల్ నావ్రోకితో వైట్హౌజ్లోని తన ఓవల్ ఆఫీస్ ఆఫీస్లో జరిగిన జాయింట్ ప్రెస్మీట్లో ట్రంప్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. రష్యాపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఓ పోలాండ్కు చెందిన విలేకరి ప్రశ్నించారు. ఇండియాపై ద్వితీయ శ్రేణి సుంకాలు విధించాను. చైనా తర్వాత రష్యా చమురు కొనుగోలు చేసే పెద్ద దేశం ఇండియానే. ఇది రష్యాకు వందల బిలియన్ల డాలర్ల నష్టం కలిగించింది. మీరు దీన్ని చర్య కాదు అంటారా?.. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 సుంకాలు మిగిలే ఉన్నాయి. మీరేమో చర్య లేదు అంటున్నారు. బహుశా.. మీకు కొత్త ఉద్యోగం అవసరం అంటూ రిపోర్టర్ను ఉద్దేశించి ట్రంప్ అసహనంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తే ఇండియాకు పెద్ద సమస్యలు వస్తాయి అని రెండు వారాల క్రితమే హెచ్చరించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు అదే జరిగిందని గుర్తు చేశారు. భారత్ తమకు మిత్రదేశమంటూ జులై 30వ తేదీన ట్రంప్ తొలుత 25 శాతం సుంకాలు(ప్రతీకార సుంకాలు) ప్రకటించారు. ఆ సమయంలో రష్యాతో వాణిజ్య సంబంధాలపై తీవ్రంగా ఆక్షేపించారు. ఇక ఆగస్టు 6వ తేదీన రష్యా నుంచి చమురు కొనుగోళ్లు జరుపుతున్న భారత్పై పెనాల్టీగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా ఉక్రెయిన్ యుద్దానికి భారత్ ప్రత్యక్షంగా ఫండింగ్ చేస్తోందని ఆరోపించారాయన. దీంతో ఆగస్టు 27వ తేదీ నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి వచ్చాయి. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్అదే సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన భారత్ను అత్యధిక సుంకాలు విధించే దేశంగా పేర్కొంటూ.. ఇండియా కిల్ల్స్ అస్ విత్ టారిఫ్స్ అంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా వస్తువులపై ఆ దేశం అత్యధికంగా సుంకాలు విధిస్తోందని.. అందువల్లే అమెరికన్ కంపెనీలు ఇండియన్ మార్కెట్లో పోటీ పడలేకపోతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే.. ఇండియా ఇప్పుడు నో టారిఫ్ ఒప్పందానికి దిగి వచ్చిందన్న ఆయన.. అది ఆలస్యంగా జరిగిందంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇండియా రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తోందని, అమెరికా నుంచి చాలా తక్కువగా కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. తన సుంకాల వల్లే భారత్ ఇప్పుడు టారిఫ్లు తగ్గించేందుకు సిద్ధమైంది అని అన్నారు.నిజంగానే చమురు ఆగిందా?ఇదిలా ఉంటే.. తన సుంకాల వల్లే భారత్ దిగొచ్చిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసిందంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తుండడం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సింది. రష్యా ఈ విషయంపై అధికారికంగా ఏం స్పందించలేదు. జాతి ప్రయోజనాల దృష్ట్యా ముందుకు వెళ్తామని, ఆర్థిక లాభదాయకత ఆధారంగా తమ వ్యూహాం ఉంటుందని ఇటు భారత్ చెబుతూ వస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ.. రైతులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలపై రాజీ పడం. ఒత్తిడి పెరిగినా తట్టుకుంటాం అని సుంకాలపై స్పందించారు. మరోవైపు.. చమురు ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడి నుంచే కొనుగోలు చేస్తాం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు పూర్తిగా ఆపలేదు. కానీ కొంతమేర తగ్గించిన సూచనలు కనిపిస్తున్నాయి. ట్రంప్ విధించిన 50% సుంకాలు (25% రెసిప్రోకల్ టారిఫ్ + 25% పెనాల్టీ టారిఫ్) ప్రభావంతో జూలై, ఆగస్టు నెలల్లో రష్యా చమురు దిగుమతులు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ట్రంప్ సుంకాల ప్రభావం తక్షణమే పూర్తిగా కనిపించక పోవచ్చని.. ఎందుకంటే చమురు కొనుగోలు ఒప్పందాలు వారాల ముందే కుదురుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. భారత్తో అలా మాట్లాడాల్సింది కాదుఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన సుంకాలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. చైనా పర్యటన ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ఇండియా, చైనాలాంటి దేశాలతో అలా వ్యవహారించడం సరికాదని అమెరికా వైఖరిని తప్పుబట్టారు. అమెరికా భారత్పై 50% సుంకాలు విధించడం.. ఆర్థిక శిక్షగా అభివర్ణిస్తూనే ఇది అంతర్జాతీయ సమతుల్యతను దెబ్బతీసే ప్రయత్నంగా పేర్కొన్నారు.ఇండియా, చైనా వంటి దేశాలు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలు కలిగి ఉన్నాయి. ఇండియా 1.5 బిలియన్ జనాభా కలిగిన దేశం. వీరి చరిత్ర, రాజకీయ వ్యవస్థలు గౌరవించాల్సినవి. వీటి నాయకత్వాన్ని బలహీనపరచాలనుకోవడం పొరపాటు. శిక్షించేందుకు ప్రయత్నించడం, సుంకాలు విధించడం అనేవి ఆర్థిక బలప్రయోగం. ఇది కాలనీల యుగం కాదు. భాగస్వామ్య దేశాలతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వ్యవహరించాలి అని అమెరికా వైఖరిని పరోక్షంగా విమర్శించారు. -
భారత్కు ట్రంప్ మరోసారి భారీ షాక్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ఉత్పత్తుల విభాగంలో 50శాతం టారిఫ్ను విధించారు. ఇప్పుడు అదే బాటలో సేవల విభాగంపై టారిఫ్లు విధించేందుకు సిద్ధమైంది. వాణిజ్య పరంగా భారత్పై మరింత ఒత్తిడి తెచ్చేలా ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై భారీ సుంకాలు విధించిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు భారత ఐటీ సేవలు, విదేశీ రిమోట్ వర్కర్లపై సుంకాలు విధింనుంది. అందుకు ఊతం ఇచ్చేలా అమెరికా ట్రేడ్ అండ్ మాన్యుఫాక్చరింగ్ సలహాదారు పీటర్ నవారూ.. అన్ని ఔట్సోర్సింగ్ సేవలపై టారిఫ్ విధించాలి’ అనే అభిప్రాయం వ్యక్తం చేయడం అందుకు బలం చేకూర్చుతోంది. దీంతో విదేశీ సేవలపై కూడా వస్తువుల్లాగే టారిఫ్ విధించాలి అనే ఆలోచనలో ట్రంప్ ప్రభుత్వం ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విధానాలు అమలైతే అమెరికా కంపెనీలు ఔట్సోర్సింగ్ ఖర్చులు పెరగడంతో.. భారత్ సంబంధిత కంపెనీలతో కుదుర్చుకునే కాంట్రాక్ట్ల విషయంలో వెనక్కితగ్గుతాయి. ప్రాజెక్టుల ఆలస్యం, లాభాల తగ్గుదల, సరఫరా గొలుసుల అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. భారత ఐటీ కంపెనీలు అమెరికా ఆధారిత వ్యాపారాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.భారత్ నుంచి అమెరికాకు వెళ్లే ఇంజినీర్లు, కోడర్లు, ఐటీ కన్సల్టెంట్లు, విద్యార్థులు ఎక్కువ మంది వెళుతుంటారు. ఇన్ఫోసిస్,టీసీఎస్,విప్రో,హెచ్సీఎల్ వంటి సంస్థలు హెచ్1బీ వీసాల ప్రధాన స్పాన్సర్లు. ఈ వీసాల ద్వారా అమెరికాలో పనిచేసే అవకాశం లభిస్తుంది. కానీ ఇప్పుడు..హెచ్1బీ వీసా వ్యవస్థను పునరుద్ధరించేందుకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.ఈ పరిణామాలు భారత్ తన ఐటీ రంగాన్ని విస్తరించేందుకు,వివిధ దేశాలతో వ్యాపార సంబంధాలు పెంచేందుకు, అమెరికా ఆధారాన్ని తగ్గించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ట్రంప్ పాలనలో భారత ఐటీ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య దృశ్యాన్ని మలుపు తిప్పే అవకాశం కలిగి ఉన్నాయి. -
ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందా..?
విలాసవంతమైన జీవితం కంటే తల్లిదండ్రుల బాగోగులే ముఖ్యం అంటూ భారత సంతతి మహిళ భారత్కి తిరిగి వచ్చేయాలనకుంటున్నా అంటూ తన మనసులో మాటను నెట్టింట షేర్ చేసుకుంది. అయితే ఇక్కడ అంత జీతంతో తాను లైఫ్ని లీడ్ చేయగలనా అనే సందేహాన్ని కూడా వెలిబుచ్చింది. అయితే నెటిజన్లు ఆమె ఆలోచన విధానానికి ఇంప్రెస్ అవ్వగా మరికొందరూ వాళ్లు ఎన్నోత్యాగాలు చేసి పంపితే ఆ కష్టమంతా మట్టిలో కలిపేస్తారా అనే ప్రశ్నను లేవనెత్తడం విశేషం. అసలేం జరిగిందంటే..యూఎస్లోని డెన్వర్లో తన జీవిత భాగస్వామితో విలాసవంతమైన జీవితాన్న గడుపుతున్న భారత సంతతి మహిళ రెడ్డిట్ వేదికగా తన గోడుని వెల్లబోసుకుంది. తాను భారత్కి తిరిగి వచ్చేయాలని చూస్తున్నట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చేశారని, వారి బాగోగులు చూసుకునేందుకు తిరిగి ఇండియాకు వచ్చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ భారత్లో ప్రజలు కొందరు చాలా దురుసుగా, కోపంగా ప్రవర్తించడం చూసి చాలా అసహనానికి గురయ్యానని చెప్పుకొచ్చింది. తాను మాస్టర్స్ పూర్తి చేశానని ఏడాదికి రూ. 3 కోట్లు పైనే సంపాదిస్తానని, తన భర్త ఏడాదికి దాదాపు రూ. 2 కోట్లు వరకు సంపాదిస్తారని అన్నారు. తల్లిదండ్రులను దగ్గరుండి చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలని భావిస్తున్నా..బెంగళూరులో ఉండే అవకాశం లభిస్తోంది. అక్కడ ఏడాదికి సుమారు రూ. 1.2 కోట్లు వేతనం అని, అక్కడ లైఫ్ లీడ్ చేయడానికి ఆ మాత్రం సంపాదన సరిపోతుందా అని సందేహాన్ని వ్యక్తం చేస్తుంది. అయితే తనకు యూఎస్లో మంచి స్నేహితులు ఉన్నారని, సౌకర్యవంతంగా జీవించేదాన్ని అని చెప్పుకొచ్చింది. అదీగాక అమెరికాలో తన జీతం పెద్ద మొత్తం కావడంతో చాలా లగ్జరీ లైఫ్ని లీడ్ చేయగలిగానని, అందువల్లే భారత్తో సహా వివిధ దేశాలకు సులభంగా వెళ్లగలిగేదాన్ని అని చెప్పుకొచ్చింది. అలాగే వర్క్ పరంగా ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదంటూ అమెరికాలోని తన లైఫ్స్టైల్ గురించి తెలిపింది. పైగా తన తల్లిదండ్రులు అమెరికాకు వచ్చేందుకు సిద్ధంగా లేరంటోంది. అదీగాక వాళ్లు ఇక్కడ సంస్కృతికి, స్నేహితులకు అలవాటుపడ్డ మనుషులకు అలా నాలుగు గోడల మధ్య బతకడం అంటే అత్యంత దుర్భరంగా అనిపిస్తుందని వాపోయింది. అందుకే వారి బాగోగులును తాను స్వయంగా చూసుకోవాలనే ఉద్దేశ్యంతో భారత్కి తిరిగి వచ్చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.,అయితే తన సొంతూరిలో ఉద్యోగం చేయడం సాధ్యపడదని ఇలా బెంగళూరులో ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొంది. అయితే మరి బెంగళూరులో బతికేందుకు ఏడాదికి రూ. 1.2 కోట్లు సరిపోతుందంటారా అని సందేహ్నాన్ని లేవనెత్తతూ పోస్ట్ ముగించింది. (చదవండి: నాన్న చెప్పిన కథలే.. స్ఫూర్తి..) -
వర్జీనియాలో అంగరంగ వైభవంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మొట్టమొదటి మహాసభలు అమెరికా, వర్జీనియాలోని లీస్బర్గ్లో ఉత్సాహంగా జరిగాయి. ఆగస్టు 30 నుంచి 31 వరకు రెండురోజుల పాటు భారీ ఎత్తున వీటిని నిర్వహించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది సారథ్యంలో కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA వ్యవస్థాపక సభ్యులు ప్రవీణ్ అండపల్లి, డాక్టర్ జనార్ధన్ , డాక్టర్ గణేష్ తోట, సతీష్ పసుపులేట్, దేవేష్ కుమార్, విజయ్ దండ్యాల, మురళీధర్ రావు , మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ కమలాకర్ నల్లాల, ట్రెజరర్ వినయ్ పటేలోల్ల, జాయింట్ సెక్రటరీ సురేష్ చెంచల, జాయింట్ ట్రెజరర్ చంద్ర మోహన్ ఆవుల, మహాసభ కోర్ టీమ్ జనార్ధన్ పన్నెల , కృష్ణశ్రీ గంధం , అన్వేష్ బొల్లం, రంజిత్ భూముల, ఫౌండర్స్ కమిటీ, మహాసభ ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహాసభ కోర్ కమిటీ, మహాసభ ఛైర్స్, GMA గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో పాటు వందల సంఖ్యలో వాలంటీర్లు అలుపెరుగకుండా కృషి చేసి ఈ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేశారు. వచ్చిన అతిథులను ఆకట్టుకునేలా వినూత్నమైన కార్యక్రమాలను రూపొందించారు.ఈ వేడుకలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ కేంద్ర మంత్రి పల్లంరాజు, ప్రముఖ సినీ గేయ రచయిత,ఆస్కార్ విన్నర్ చంద్రబోస్, ప్రముఖ మ్యూజిక్ డైర్టకర్ కోటి, ప్రముఖ ఇంద్రజాలకులు సామల వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల , గంగవ్వ, జయశ్రీ, తదితర సినీ, రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులతో పాటు సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.GMA మహాసభలను ఆగస్టు 30 న బ్యాంక్వెట్ విందు కార్యక్రమంతో ఘనంగా ప్రారంభించారు. GMA ప్రెసిడెంట్ వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్, GMA టీమ్ పూజ నిర్వహించి మహాసభలకు శ్రీకారం చుట్టారు. ఇక తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ, బోనాలతో.. డప్పు చప్పుళ్ల మధ్య అందరూ నృత్యాలు చేస్తూ.. ఊరేగింపుగా వేదక వద్దకు తరలివచ్చారు.అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కన్వెన్షన్ సావనీర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలు, ఇతర వివరాలతో పొందుపరిచిన ఈ సావనీర్ ను అతిథులు ఆవిష్కరించారు. ఇక మహిళల కోసం ప్రత్యేకంగా అందాల పోటీలు, ముగ్గుల పోటీలతో పాటు సంగీత పోటీలు, చిన్నారుల కోసం మ్యాజిక్ షో నిర్వహించారు. ఇక కార్యకర్తలలో ప్రత్యక ఆకర్షణగా భారతీయతను ఇనుమడింపజేసేలా వేదిక్ మ్యాథ్య్ నిలిచింది. గాయత్రి రజినీకాంత్ ఆధ్వర్యంలో బోధించబడిన క్లిష్టమైన గణిత సమస్యలకు వేదిక్ మ్యాథ్స్ చక్కని పరిష్కారంగా నిలుస్తుంది, గతకొంత కాలంగా అమెరికా వ్యాప్తంగా వేదిక్ మ్యాథ్స్ ఆదరణ పొందుతున్న విషయం విధితమే.! ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన యువత క్రూజ్ ట్రిప్ ఎంతగానో అలరించింది. ఇక బ్యూటీ పేజెంట్, మ్యాట్రిమోనియల్, GMA సరిగమ సంగీత పోటీలు ఎంతోగానో ఆకట్టుకున్నాయి.ఇక వివిధ రంగాలలో అత్యద్భుతమైన ప్రతిభ పాఠవాలు కనబరచిన వారికీ GMA అవార్డ్సుఅందజేశారు. ఈ సందర్భంగా కన్వెన్షన్ కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. డోనార్స్ ని, పలువురు నేతలను శాలువా, పుష్పగుచ్ఛాలతో సన్మానించారు. ఈ సందర్భంగా GMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు.ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్ అవార్డ్ విన్నర్ చంద్రబోస్ తన ప్రసంగంతో అందరినీ అలరించారు. సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఆస్కార్ అవార్డు వరకు సాగిన ఆయన జర్నీ గురించి వివరించారు. ఇక చంద్రబోస్ మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది. GMA ఆధ్వర్యంలో తనకు సన్మానం జరగటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.ఇక ఈ సందర్భంగా నిర్వహించిన కల్చరల్ పోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. ఇక కార్యక్రమంలో మిమిక్రీ ఆర్టిస్ట్ మహేష్ రేగుల హాస్యం పండించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఫైనల్గా తెలంగాణ జానపద లైవ్ బ్యాండ్ షో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ప్రముఖ గాయనీగాయకులు జానపద పాటలు పాడి అందరినీ మెప్పించారు. సూపర్హిట్ తెలంగాణ జానపద పాటలు, సినీ పాటలతో అలరించారు.ఈ మహాసభల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. వేదపండితులచే సంప్రదాయ బద్ధంగా స్వామి వారి కళ్యాణం జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పాటు ఆధ్యాత్మిక భావాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశ్యంగా స్వామి వారి వేడుకల్ని నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని.. స్వామివారి ఆశీస్సులు, తీర్ధప్రసాదాలు అందుకున్నారు. ఈ మహాసభల్లో భాగంగా రెండు రోజు నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఇక వేదికపై స్టూడెంట్స్ కెరీర్ పాత్, పొలిటికల్ ఫోరం, బిజినెస్ ఫోరం, ఇమ్మిగ్రేషన్ అండ్ వాల్ స్ట్రీట్ నిర్వహించారు. ఇక బ్రేకౌట్ సెషన్స్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ సెషన్స్, ఉమెన్ ఫోరం, హెల్త్ సెమినార్, మాట్రిమోనీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులను వేదిపై ఆహ్వానించి, ప్రసంగాల అనంతరం సత్కరించారు.మున్నూరుకాపులతో పాటు బీసీలను మరింత చైతన్య పర్చేందుకు,సంఘటితం చేసేందుకు ఈ మహాసభను ఏర్పాటు చేసిన రజనీకాంత్, వెంకట్, వారి మిత్ర బృందాన్ని పలువురు అభినందించారు. అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో స్థిరపడిన వీరంతా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా మొత్తానికి ఉపయోగపడాలని, బహుజనుల అభ్యున్నతి కోసం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ సందర్బంగా పలువురికి GMA అవార్డులు అందజేశారు. ఇక అమెరికాలో ఉన్న వివిధ తెలుగు సంఘాల నేతలను వేదికపైకి పిలిచి నిర్వాహకులు సత్కరించారు. ఇక ఈ వేడుకల్లో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్స్, హాస్యవల్లరులు జరిగాయి. ఈ మహాసభ సందర్భంగా వేసిన రంగవల్లులు అందరిని ఆకర్షించాయి. ఇక ప్రముఖ ఇంద్రజాలికుడు సామల వేణు.. చిత్ర విచిత్ర జిమ్మిక్కులతో మాయా ప్రపంచాన్ని కళ్ళముందు ఆష్కరించారు. దేశ విదేశాల నుంచి విచ్చేసిన వందలాది మందిని సామల వేణు తన మ్యాజిక్ తో అద్భుత ప్రదర్శన ఇచ్చి అబ్బురపరిచారు.ఆహుతుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాళ్లు, వేర్వేరు ఫుడ్ సెంటర్లు కనువిందు చేశాయి. బతుకమ్మ, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది పండుగలను మరిపించే విధంగా ఉల్లాసభరిత వాతావరణంలో ఈ మహాసభ జరిగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలతో పసందైనా విందు భోజనం అందిచారు. GMA వేడుకలు ఘనంగా జరగడానికి తమకు సహకరించిన కమిటీ సభ్యులకు, EC, BOD, RVPS, సహాయ సహాకారాలు అందించిన దాతలకు, వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరికీ అధ్యక్షులు వెంకట్ పెద్ది, కన్వెన్షన్ కన్వీనర్ సంగని రజనీకాంత్ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ను విజయవంతంగా నడిపిస్తున్న డోనర్లను నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించి.. వారి సేవలను కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలకు విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించి వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అసోసియేషన్ తరపున పలు ప్రాంతాల్లో సేవలందిస్తున్న వాలంటీర్లను సత్కరించారు. ఈ సందర్భంగా 2026కు సంబంధించి అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా ఘనంగా జరిగింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గ సభ్యులు.. సంఘం అభివృద్ధికి కృషిచేస్తామని చెప్పారు.ఈ సందర్భంగా గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, మహాసభల కన్వీనర్ రజనీకాంత్ సంఘని సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులందరినీ ఐక్యం చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా ఐకమత్యంతో ఉండాలని కోరారు. వివిధ ప్రాంతాల సభ్యులను ఒకచోట చేర్చి సహకార స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యమన్నారు. మున్నూరుకాపు కుటుంబాలను అనుసంధానించి, వారి సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ,ప్రోత్సహించడమే సంఘం ప్రధాన ఉద్దేశమని చెప్పుకొచ్చారు. తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ మహాసభలకు విచ్చేసిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు, అధ్యక్షుడు వెంకట్ పెద్ది ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.కన్వెన్షన్ ముగింపు వేడుకలలో భాగంగా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కోటి మ్యూజిక్ కన్సర్ట్ అందరిని మైమరిపించి మధురానుభూతులను అందించింది. కోటి ఆధ్వర్యంలో పలువురు సింగర్స్ సూపర్ హిట్ సాంగ్స్ పాడి ఆడియన్స్ ను మంత్రముగ్థులను చేశారు. సింగర్స్ అద్భుత పాటలతో సంగీతాల ఝురిలో వోలాలడిస్తు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. GMA కన్వెన్షన్లో పాల్గొన్న అతిథులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతిని, ఆనందాన్ని ఈ మహాసభలు అందించాయి. భవిష్యత్తులో జరిగే మహాసభలకు GMA కన్వెన్షన్ సరి కొత్త మార్గాన్ని చూపించింది.(చదవండి: మెల్బోర్న్లో అద్భుతంగా అష్టావధాన కార్యక్రమం) -
భారత్పై మళ్లీ బురద జల్లిన ట్రంప్.. సుంకాలపై అసంబద్ధ వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోమారుతీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా భారతదేశంతో చాలా బాగానే కలిసిపోతుంది.. కానీ న్యూఢిల్లీ వాషింగ్టన్ నుండి విపరీతమైన సుంకాలు వసూలు చేస్తున్నందున చాలా ఏళ్లుగా ఇరుదేశాల సంబంధం ఏకపక్షంగా ఉందని వ్యాఖ్యానించారు.వైట్హౌస్లో భారతదేశంపై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా? అని మీడియా అడినప్పుడు.. తాము భారత్తో బాగానే కలిసిపోతామని, కొన్నేళ్లుగా భారత్- అమెరికా మధ్య సంబంధం ఏకపక్షంగా ఉందని పేర్కొన్నారు. అయితే తాను పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు అది మారిందని వ్యాఖ్యానించారు. భారత్ తమ నుండి అపారమైన సుంకాలను వసూలు చేస్తోందని, అది ప్రపంచంలోనే అత్యధికమని అని ట్రంప్ పేర్కొన్నారు. అందుకే అమెరికా.. భారత్తో పెద్దగా వ్యాపారం చేయడం లేదన్నారు.అయితే తాము వారి నుండి భారీ సుంకాలు వసూలు చేయడం లేదు కాబట్టే వారు మాతో వ్యాపారం చేస్తున్నారు. వారిలా మూర్ఖంగా మేము వసూలు చేయడం లేదన్నారు. ఇక్కడ తయారవని ఉత్పత్తులను భారతదేశం యూఎస్లోకి ‘తరలిస్తోందని’ ట్రంప్ ఆరోపించారు.వారు తమ నుండి 100 శాతం సుంకాలను వసూలు చేస్తున్నందున తాము ఏమీ పంపడం లేదని పేర్కొన్నారు. ఇందుకు హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లే ఉదాహరణ అన్నారు. మోటార్ సైకిళ్లపై 200 శాతం సుంకం ఉన్నందున భారతదేశంలో వీటిని విక్రయించలేమన్నారు.అయితే ఇప్పుడు హార్లే డేవిడ్సన్ భారతదేశానికి వెళ్లి అక్కడ మోటార్ సైకిల్ ప్లాంట్ నిర్మించింది. ఇప్పుడు వారు మన మాదిరిగా సుంకాలు చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
ఏకాకిని చేయడమే ట్రంప్ లక్ష్యం
కొన్నాళ్ళుగా మన కళ్ళెదుట నిలుస్తున్న ఒక ప్రశ్నకు జవాబు కనుగొనవలసిన సమయం ఆసన్నమైంది. భారతదేశం పట్ల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కక్ష సాధింపు వైఖరిని అవలంబిస్తున్నారా? మన దేశం రోగం కుదిర్చానని ఆయన అనుకుంటు న్నారా? ఔనన్నదే దానికి జవాబు అయితే, మనం భావిస్తున్న దానికన్నా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్క. రష్యన్ చమురును దిగుమతి చేసు కుంటున్నందుకు భారత్పై 25 శాతం సెకండరీ సుంకాలు విధించి నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ప్రకటించారు. రష్యాను దృష్టిలో పెట్టుకుని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ‘సమరశీల ఆర్థిక లివ రేజి’ కింద ఆ సుంకాలు మోపుతున్నట్లు చెప్పుకొన్నారు. భారత దేశానికి ఆనుషంగిక నష్టం వాటిల్లుతోందనీ, మన దేశానికి ఏం జరిగినా ట్రంప్ పట్టించుకోదలచుకోలేదనీ అది సూచించడం లేదా?ఒకవేళ, రష్యాపై ‘సమరశీల ఆర్థిక లివరేజి’యే లక్ష్యమైతే, భారతదేశం కన్నా ఎక్కువగా రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న చైనాపై సెకండరీ సుంకాలు విధించలేదు ఎందుకని? పైగా, ‘‘రష్యా నుంచి చమురు దిగుమతులను చైనా కొనసాగించడం మంచిదే. అది అంతర్జాతీయ ఇంధన ధరలలో ద్రవ్యోల్బణం రాకుండా నివారిస్తుం’’దని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో వ్యాఖ్యానించారు. ఇవి ద్వంద్వ ప్రమాణాలు కావా? చైనాకు ఒక న్యాయం, భారతదేశానికైతే మరో న్యాయమా?ఇది ప్రతీకారం కాదా?ఇంకా విడ్డూరం ఏమిటంటే, ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి భారత్ ద్వారానే నిధులు అందుతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించడం. భారత్పై ఆంక్షలు విధించాలని యూరప్ను బిసెంట్ కోరారు. రష్యన్ చమురును కొనుగోలు చేయడం ద్వారా అమెరికా జాతీయ భద్రతకు భారత్ ముప్పు వాటిల్లజేస్తోందనీ, ‘‘భారతదేశానికి ఏది ఎక్కువ నష్టదాయకమో అక్కడే దెబ్బ కొట్టడం’’ తమ అభిమతమనీ ట్రంప్కు వాణిజ్య సలహాదారు పీటర్ నవారో చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆయన ఇపుడు ‘‘మోదీ చేస్తున్న యుద్ధం’’గా అభివర్ణించారు. ‘‘శాంతికి రహ దారి న్యూఢిల్లీ గుండానే పడుతుంది’’ అంటున్నారు. భారతదేశపు ‘‘మృతప్రాయ’’ ఆర్థిక వ్యవస్థ నట్టేట మునిగినా తాను పట్టించుకో నని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. ఇది కక్ష సాధింపునూ, ప్రతీకా రాన్నీ సూచించడం లేదా?భారత్పై 50 శాతం సుంకాలు విధించడంలో, చైనాకు ట్రంప్ ఇవ్వదలచుకున్న సందేశం ఇమిడి ఉందనీ, అది కూడా భారతదేశా నికి ఆనుషంగిక నష్టం వాటిల్లజేసేదేననీ స్ట్రాట్ఫర్ సంస్థ మాజీ చైర్మన్ జార్జ్ ఫ్రైడ్మ్యాన్ ఇటీవల ఒక పాడ్కాస్ట్లో చెప్పారు.చైనాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ట్రంప్ తహతహలాడు తున్నారు. చైనాకు వ్యతిరేకంగా తాము భారత్ పక్షాన చేర బోమనే ట్రంప్ సందేశంలోని ఆంతర్యమని ఫ్రైడ్మ్యాన్ చెప్పారు. ట్రంప్ మనసులో ఉన్న విస్తృత భౌగోళిక రాజకీయ తంత్రంలో, రష్యా, చైనాలకు ప్రాధాన్యం ఉంది. అందుకే భారతదేశాన్ని ‘‘విడిచి పెట్టేయవచ్చు’’.ఫ్రైడ్మ్యాన్ మాటలే నిజమైతే, రష్యాను హెచ్చరించేందుకు, చైనాకు పూర్తిగా వేరే రకమైన సందేశం పంపేందుకు భారతదేశాన్ని వాడుకున్నారు. రెండిందాలా భారతదేశానికే నష్టం. ట్రంప్ లెక్క లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము!అయితే, సుంకాలు, చమురు, భౌగోళిక–రాజకీయాలను మించిన సంకట స్థితినే మనం ప్రస్తుతం ఎదుర్కొంటున్నాం. భారత –అమెరికాల మధ్య సంబంధాలకు పునాది అయిన రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంటోంది. హెచ్1బి వీసా విధానంలో మార్పు తేదలచినట్లు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లట్నిక్ ప్రకటించారు. దాని ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో 70 శాతం మంది భారతీయులే కనుక, అది మనపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యార్థుల వీసాలను నాలుగేళ్ళ కాలానికి మాత్రమే పరిమితం చేయాలని అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ యోచిస్తోంది. అది భారతీయ విద్యార్థుల సంఖ్యను కుంచింపజేస్తుంది. అమెరికాలోని విదేశీ విద్యార్థులలో భారతీయులు పెద్ద వర్గంగానే ఉన్నారు. మరోవైపు ఇపుడున్న సంఖ్య కన్నా దాదాపు మూడింతలు ఎక్కువగా 6,00,000 మంది చైనా విద్యార్థులకు ప్రవేశం కల్పించే అంశాన్ని ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, భారతదేశంలో అమెరికా కొత్త రాయ బారిగా సెర్గియో గోర్ నియామకాన్ని మనం ఎలా అర్థం చేసుకో వాల్సి ఉంటుంది? ఆయన ట్రంప్కు చాలా సన్నిహితుడు. కానీ ఆయనకు దౌత్యపరమైన అనుభవం గానీ, భారతదేశం పట్ల ముందస్తు అవగాహన గానీ లేవు. హెచ్చరించే విరామం తీసుకోకుండా, లేదా ప్రత్యామ్నాయాలను సూచించకుండా ట్రంప్ ఎంచుకున్న బాటలో సెర్గియో పరుగులు పెడతారని చాలామంది భయ పడుతున్నారు. అది మనకు శుభ సూచకం ఏమీ కాదు. ఆయన బాధ్యత అంతటితో తీరిపోవడం లేదు. దక్షిణ, మధ్య ఆసియాకు ప్రత్యేక దూతగా కూడా సెర్గియోను నియమించారు. ఈ అసాధారణ చర్య దేన్ని సూచిస్తోంది? భారతదేశానికి ఇష్టం లేని పనిని బలవంతంగా ఒప్పించడానికి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని భావించాలా? సూటిగా చెప్పాలంటే, భారత–పాకిస్తాన్ల మధ్య తమ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోవాల్సిందేనని చెప్పడమా?ఇది దాడి చేయడమేననే భయం నాలో మొదలైంది. అనేక స్థాయులలో, అనేక విధాలుగా భారతదేశంపై గురిపెడుతున్నారు. ట్రంప్కు ఇక మనం ఎంతమాత్రం ప్రీతిపాత్రులం కాము. అంచ నాలు తలకిందులవడంతో ఆయన ఖంగు తిన్నట్లున్నారు. మనపై కోపానికి కూడా లోనై ఉంటారు.సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారని ట్రంప్కు ధైర్యంగా చెప్ప గలిగినవారు, భారతదేశం పక్షాన నిలిచేందుకు సుముఖంగా ఉన్న వారు అమెరికాలో ఎవరైనా ఉన్నారా? డెమొక్రాటిక్ పార్టీ నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సందేహం లేదు! కానీ, అమెరికాను మళ్ళీ గొప్పదిగా చేయడమనే(మాగా) వర్గంలోని వారి నుంచి గొంతుక వినిపించడం లేదు. అమెరికాలో నివసిస్తున్న భారతీయుల గొంతు పెగలకపోవడం మరింత కలవరపరుస్తోంది. మనల్ని క్లిష్ట పరిస్థితుల్లో వదిలేయాలని ట్రంప్ చూస్తున్నారా? నా వద్ద స్పష్టమైన జవాబు లేదు. కానీ, అలానే అనిపించడం లేదా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
రష్యాతో కాదు.. భారత్ ఉండాల్సింది మాతోనే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చెందిన వాణిజ్య సలహాదారు పీటర్ నవారో..మరోసారి భారత్పై నోరు పారేసుకున్నారు. భారత్-రష్యా సంబంధాలపై తాజాగా విమర్శలు గుప్పించారు. భారత్ ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కాదంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన.భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా తియాంజిన్ (Tianjin) షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు వేదికగా ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ దరిమిలా ఈ భేటీని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. పీటర్ నవారో తీవ్ర విమర్శలు చేశారు.వాషింగ్టన్లో జరిగిన మీడియా సమావేశంలో నవారో మాట్లాడుతూ.. భారత ప్రధాని మోదీ.. పుతిన్, షీ జిన్పింగ్లతో కలిసి ఉండటం సిగ్గుచేటు. ఆయన ఏమి ఆలోచిస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ, భారత్ కలిసి ఉండాల్సింది అమెరికాతో.. రష్యాతో కానేకాదు అని అన్నారు.అమెరికా విధించిన టారిఫ్లపై భారత్ స్పందించిన తీరు.. అలాగే రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడాన్ని నవారో తీవ్రంగా విమర్శించారు. భారత్ ముడి చమురు కొనుగోలు ద్వారా పుతిన్ యుద్ధానికి నిధులు సమకూర్చుతోంది అని మరోసారి ఆరోపించారు. భారత్ను సుంకాల మహరాజుగా అభివర్ణించిన ఆయన.. రష్యా చమురు కొనుగోలు విషయంలో వాస్తవాల్ని దాచిపెడుతోందని అన్నారు. తాజాగా.. భారత్లో కుల వ్యవస్థను ప్రస్తావిస్తూ.. ఓ వర్గం సాధారణ ప్రజల ఖర్చుతో లాభపడుతోంది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక.. ఇండియన్ రిఫైనరీలు రష్యా రాయితీ ధరకు ముడి చమురును ప్రాసెస్ చేసి, అధిక ధరలకు ఎగుమతి చేస్తున్నాయని, ఇది "క్రెమ్లిన్ లాండ్రోమాట్"లా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రెమ్లిన్ లాండ్రోమాట్ ఆరోపణకు అర్థం ఏంటంటే.. భారత రిఫైనరీలు రష్యా డబ్బును "శుభ్రం" చేసి, ప్రపంచ మార్కెట్లో తిరిగి ప్రవేశపెడుతున్నాయి అని. తద్వారా రష్యా చమురు అమ్మకాలు కొనసాగుతాయని, పుతిన్కు ఆర్థిక లాభం కలుగుతుందని, ఇది ప్రత్యక్షంగా రష్యా యుద్ధ వ్యయానికి నిధులు సమకూర్చే మార్గంగా మారుతుందని ఆయన అభిప్రాయం.అయితే.. భారత్ మాత్రం తన చమురు కొనుగోలు నిర్ణయాన్ని సమర్థించుకుంటూ వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై ధర పరిమితి విధించాయి. ఈ నేపథ్యంలో భారత్ రాయితీ ధరలకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. మిగతా దేశాల్లాగే జాతి ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు ఉంటాయని, దేశీయ మార్కెట్ను స్థిరంగా ఉంచేందుకు ఇది అవసరమని భారత్ అంటోంది. ఈ క్రమంలోనే అమెరికా విధించిన 50 శాతం సుంకాలను అన్యాయమని భారత్ అభిప్రాయపడుతోంది. -
టారిఫ్ల ప్రభావం.. ఎదుర్కొనేందుకు పరిష్కారం
అమెరికా విధించిన 50% టారిఫ్ల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అనురాధ ఠాకూర్ తెలిపారు. ‘అధిక ఉపాధి కల్పిస్తున్న కొన్ని పరిశ్రమలు అమెరికాపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. అలాంటి పరిశ్రమలపై ఎక్కువ ప్రభావం పడొచ్చు. ఈ ప్రభావం ఎంతన్నది ప్రభుత్వం మదిస్తోంది. తగిన పరిష్కారాల కోసం కృషి చేస్తోంది’ అని చెప్పారు. -
సుంకాలను భారత్ పూర్తిగా ఎత్తేస్తామంది!
న్యూయార్క్/వాషింగ్టన్: బాధ్యతారహిత వ్యాఖ్యలు, పిల్లచేష్టలతో ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు నిత్యం నవ్వులపాలవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మిగిలి ఉన్న కాస్త పరువూ పూర్తిగా పోగొట్టుకునేలా ప్రవర్తిస్తున్నారు. అమెరికాపై టారిఫ్లను పూర్తిగా ఎత్తేస్తామంటూ భారత్ ప్రతిపాదించిందని సోమవారం మరో మతిలేని ప్రకటన చేశారాయన. పైగా, ‘అది చాలా ఆలస్యంగా వచ్చిన ప్రకటన! ఎందుకంటే పరిస్థితి ఇప్పటికే చేయిదాటిపోయింది’ అంటూ మేకపోతు గాంభీర్యం కూడా ప్రదర్శించారు. భారత్ తన రక్షణ, సైనిక, చమురు అవసరాల్లో అత్యధికం రష్యా నుంచే దిగుమతి చేసుకుంటోంది తప్ప అమెరికా నుంచి పెద్దగా కొనడమే లేదంటూ మరోసారి అక్కసు ప్రదర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయిన కొద్ది గంటలకే సొంత సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్సోషల్లో ఇలాంటి అర్థం పర్థం లేని కామెంట్లకు దిగారు. ‘‘భారత్ మాతో భారీగా వర్తక వ్యాపారాలు జరుపుతోంది. వాళ్లకు అతి పెద్ద క్లయింట్లం మేమే. కానీ భారత్తో మేం చేసే వ్యాపారం మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే మాపై అంత భారీ సుంకాలు విధించింది. మాకు అత్యంత నష్టదాయకమైన ఈ ఏకపక్ష ఉత్పాతపు పోకడ దశాబ్దాలుగా సాగుతూ వస్తోంది. చాలా తక్కువ మందికి తెలిసిన వాస్తవమిది’’ అంటూ వాపోయారు. ‘‘ఇప్పుడు తీరిగ్గా ‘జీరో టారిఫ్’ ప్రతిపాదన చేసి ఏం లాభం? ఆ పని ఏళ్లక్రితమే చేయాల్సింది. ఇదంతా కామన్సెన్స్’’ అంటూ సోషల్ మీడియాలోనే భారత్కు తీరిగ్గా క్లాసు కూడా పీకారు. ట్రంప్ పోస్టులను ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వెంటనే షేర్ చేసి మద్దతుగా నిలిచారు. అయితే ఇలా భారత్ సున్నా సుంకాల ప్రతిపాదన చేసిందంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టడం ట్రంప్కు ఇది కొత్తేమీ కాదు. వాటిని అప్పట్లోనే విదేశాంగ శాఖ నిర్ద్వంద్వంగా ఖండించింది. కాక పుట్టించిన ‘షాంఘై భేటీ’! : తాజా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్లో భాగంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో పాటు అనూహ్యంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కావడం తెలిసిందే. పలు అంశాలపై ఇద్దరు నేతలతో ఆయన లోతుగా చర్చలు జరిపారు. ఈ పరిణామాన్ని అమెరికా కర్రపెత్తనానికి శాశ్వతంగా చెక్ పెట్టే దిశగా పడిన అతి కీలక అడుగుగా పరిశీలకులు ఇప్పటికే అభివరి్ణస్తున్నారు. ఈ పరిణామంతో చిర్రెత్తుకొచ్చి ట్రంప్ ఇలా బాధ్యతారహిత వ్యాఖ్యలకు దిగుతున్నారని వారంటున్నారు. భారత్పై సుంకాలను ఆయన ఇప్పటికే భారీగా 25 శాతానికి పెంచడం తెలిసిందే. దానికి తోడు రష్యా నుంచి భారత్ కొనే చమురుపై మరో 25 శాతం అదనపు సుంకాలు బాదుతున్నట్టు ప్రకటించారు. దాంతో మనపై సుంకాలు ఏకంగా 50 శాతానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. -
భారత్పై విషం చిమ్మిన ట్రంప్ సలహాదారు.. మోదీ, పుతిన్, జిన్పింగ్ దోస్తీ టార్గెట్
వాషింగ్టన్: రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు పీటర్ విషం చిమ్మారు. రష్యా , చైనాలతో ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న సాన్నిహిత్యంపై నవారో పలు ప్రశ్నలు సంధించారు. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో తరచూ భారత్పై ఆరోపణలు చేస్తున్నారు. భారతదేశంలోని కొన్ని వర్గాలు ఈ రష్యన్ చమురు నుండి లాభార్జన చేస్తున్నాయని, ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని తాజాగా నవారో ఆరోపించారు. ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవారో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా, చైనాలతో పెరుగుతున్న సాన్నిహిత్యంపై ప్రశ్నించారు. ‘మోదీ గొప్ప నాయకుడు. ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నేత.. అలాంటప్పుడు పుతిన్, షీ జిన్పింగ్ సరసన ఎందుకు నిలబడుతున్నారో అర్థం కావడంలేదు. ఈ విషయంలో ఏమి జరుగుతున్నదో భారత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. కొంతమంది బ్రాహ్మణులు తమ సొంత ప్రయోజనాల కోసం సామాన్యులకు హాని చేస్తున్నారు. ఇది ఇక్కడితో ఆగిపోవాలి’ అని వ్యాఖ్యానించారు. ‘Brahmins Profiteering...’: Trump Advisor Peter Navarro’s Shocker On India’s Russian Oil Purchaseshttps://t.co/cKaJH1LrnEThis the lowest level of comment..one could make .. in the International politics ….Or may be they are trying to divide us .. as they know our weakness..— Aby (@abyindya) September 1, 2025ఇదేవిధంగా గత ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభానికి ముందు.. రష్యా నుండి భారతదేశ చమురు కొనుగోళ్లు చాలా తక్కువగా ఉన్నాయని, అయితే ఆ తర్వాత భారత్ చమురు దిగుమతులను అనేక రెట్లు పెంచిందని నవారో ఆరోపించారు. భారత్.. రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసి, దానిని శుద్ధి చేసి, ఆఫ్రికా, యూరప్, ఆసియాలోని పలు దేశాలకు అధిక ధరలకు విక్రయిస్తున్నదని, ఇది రష్యా ‘యుద్ధ యంత్రాంగానికి’ బలాన్నిస్తుందని ఆరోపించారు. -
మరణం, అనారోగ్య వార్తల వేళ.. ట్రంప్ పోస్ట్ వైరల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్య వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని రోజులుగా ట్రంప్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో ‘మిస్సింగ్’ అంటూ ప్రచారం జరిగింది. అనంతరం, ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు తన ఆరోగ్యంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. సోషల్ మీడియా ట్రుత్ వేదికగా ట్రంప్.. తన జీవితంలో ఎన్నడూ ఇంత బెటర్గా అనిపించలేదంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, సోషల్ మీడియా వార్తలకు చెక్ పడినట్టు అయ్యింది.ఇక, అంతకుముందు.. ట్రంప్ మద్దతుదారుడు, ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత డీసీ డ్రైనో ట్రంప్ ఆరోగ్యంపై ఓ పోస్టు పెట్టారు. ఈ సందర్భంగా డైసీ.. ‘అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వారాల పాటు ప్రజల ముందుకు రాకుండా ఉంటారు. కానీ మీడియా ఆయన 'చురుగ్గా' ఉన్నారు.. ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెబుతారు. ఇలాగే ఆయన డైపర్లు ధరించి నిద్రపోతున్నారు. అయినా ఇదేమీ పెద్ద సమస్య కాదు. కానీ ట్రంప్ 24 గంటలు కనిపించకపోతే మీడియా గగ్గోలు పెడుతోంది. ఇది హాస్యాస్పదమైన ద్వంద్వ ప్రమాణం. అమెరికా చరిత్రలోనే అందరి అధ్యక్షుల కంటే ట్రంప్ ఎక్కువ సమయం ప్రజా పనుల్లో గడిపారు అని వివరించారు. దీనికి స్పందించిన ట్రంప్.. ‘నా జీవితంలో ఇంత ఆరోగ్యంగా ఎప్పుడూ లేను’ అని సమాధానం ఇచ్చారు.ఇదిలా ఉండగా.. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన చేతులు, కాళ్లపై గాయాలు ఉండడం, వాటిని కవర్ చేసేందుకు ట్రంప్ మేకప్ వేసుకుని మీడియాకు దొరికిపోవడంతో.. అంతా ఆయన ఏదో అనారోగ్య సమస్యతో బాధ పడుతున్నారని భావించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ట్రంప్ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా దీనిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. కానీ ఏదైనా అనుకోని భయంకరమైన విషాదం జరిగితే తానే అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపడతానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ ఆరోగ్యంపై మరింత అనుమానం పెరిగింది. -
చాట్ జీపీటీ చెప్పిందని తల్లిని చంపాడు
కనెక్టికట్: చాట్జీపీటీ చెప్పిందని తల్లిని చంపిన ఓ వ్యక్తి, ఆ తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కనెక్టికట్లో జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా దీన్ని భావిస్తున్నారు. ఆ వ్యక్తిని 56 ఏళ్ల స్టెయిన్ ఎరిక్ సోయెల్బర్గ్గా గుర్తించారు. గతంలో యాహూలో మేనేజర్గా పనిచేసిన సోయెల్.. ఏఐ చాట్బాట్ నిరంతరం మాట్లాడుతూ ఉండేవాడు. దానికి బాబీ అని పేరు పెట్టుకున్నాడు. బాబీతో చేసిన సంభాషణలను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేవాడు. అప్పటికే మానసిక అనారోగ్యంతో ఉన్న సోయెల్.. తల్లి సుజాన్ ఎబెర్సన్ ఆడమ్స్ తనను చంపేందుకు కుట్ర చేస్తోందని భావించాడు. ఈ విషయంపై ఏఐతో మాట్లాడాడు. అది అతని అనుమానాన్ని పెంచింది. మానసిక అనారోగ్యానికి వాడే మందుల్లో విషం కలిపి ఇవ్వొచ్చని చెప్పింది. దీంతో సోయెల్ తల్లిపై దాడి చేశాడు. తలకు, మెడకు బలమైన గాయాలవ్వడంతో ఆమె మరణించింది. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మెడ, ఛాతీపై బలమైన గాయాలవ్వడంతో ఆయన చనిపోయాడు. 2.7 మిలియన్ డాలర్ల విలువైన వారి ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఆగస్ట్ 5న దొరికాయి. పదునైన ఆయుధంతో దాడిచేయడంతోపాటు, తనను తాను కోసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. -
అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలు బంద్
న్యూఢిల్లీ: అమెరికా కస్టమ్స్ శాఖ తాజాగా ప్రకటించిన నిబంధనల్లో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ ప్రకటించింది. 100 డాలర్లకంటే ఎక్కువ విలువైన బహుమతులను అమెరికా భూభాగంలోకి డెలివరీ చేసేందుకు తొలుత ఇండియాపోస్ట్ తాత్కాలిక విరామం ఇవ్వగా తాజాగా అన్ని కేటగిరీల పార్శిళ్లను అమెరికాకు డెలివరీ చేయడం ఆపేసింది. ‘‘ఆగస్ట్ 22న జారీచేసిన బహిరంగ నోటీస్ ప్రకారమే అమెరికాకు పార్శిళ్ల డెలివరీను ఆపేశాం. అయితే అమెరికా కస్టమ్స్ శాఖ విడుదలచేసిన తాజా నిబంధనల్లో స్పష్టత కొరవడింది. ఇలాంటి అస్పష్ట పరిస్థితుల్లో అమెరికాకు లేఖలు, డాక్యుమెంట్లు, బహుమతుల వంటి ఎలాంటి వస్తువులను పంపడం సమర్థనీయం కాదు. అందుకే అన్నిరకాల పార్శిళ్లను అమెరికాకు పంపడం నిలిపేస్తున్నాం. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. అమెరికా విభాగాల స్పందనకు అనుగుణంగా వీలైనంత వరకు త్వరగా సేవల పునరుద్ధరణకు కట్టుబడిఉన్నాం’’అని ఇండియాపోస్ట్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
రానున్నది మహా సంక్షోభం!.. కియోసాకి హెచ్చరిక
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఇప్పటి వరకు ధనవంతులు కావాలంటే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయం వెల్లడించారు. ఇప్పుడు దిగ్గజ దేశాల్లో తలెత్తే ఆర్థిక సంక్షోభం గురించి వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఫ్రాన్స్ చారిత్రాత్మక బాస్టిల్ డే తిరుగుబాటును గుర్తుచేసే.. ఒక ముఖ్యమైన మలుపు దగ్గర పడుతోందని సూచించారు. ఈ అశాంతి నాటకీయ సామాజిక తిరుగుబాటుకు దారితీయవచ్చు. ఎందుకంటే ఫ్రాన్స్ ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. బాండ్ల భద్రత గురించి కియోసాకి ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడిదారులు బాండ్లపై అంత విశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. ఇది భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేస్తుందని అన్నారు. బాండ్స్ ఎప్పుడూ సేఫ్ కాదు అని అన్నారు.2020 నుంచి అమెరికన్ ట్రెజరీ బాండ్లు 13% తగ్గాయి. యూరోపియన్ బాండ్లు 24%, బ్రిటిష్ బాండ్లు 32% తగ్గాయిని కియోసాకి పేర్కొన్నారు. జపాన్, చైనాలు అమెరికా బాండ్లను వదులుకుని బంగారం & వెండిని కొనుగోలు చేస్తున్నాయి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే.. బంగారం, వెండి, బిట్కాయిన్లలోనే పెట్టుబడులు పెట్టుకోవాలని చెబుతూనే ఉన్నానని ఆయన అన్నారు.ఇదీ చదవండి: డబ్బు పేదవాళ్లను చేస్తుంది!.. రాబర్ట్ కియోసాకిఅమెరికాలో పెరుగుతున్న రుణ సవాళ్ల గురించి రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. ఇది చరిత్రలో అతిపెద్ద రుణగ్రహీత దేశంగా మారిందని హైలైట్ చేసింది. ఆర్థిక స్థిరత్వం ప్రస్తుతం ముప్పులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులను జాగ్రత్తగా మూల్యాంకనం చేయాలని పిలుపునిచ్చాయి.EUROPE is TOAST:French people are on verge of Bastille Day revolt. They’re bringing out their guiottinesand heads will roll as France may be forced to admit bankruotcy. BONDS are not safe: America is now the biggest debtor nation in world history. Since 2020 American…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 31, 2025 -
ల్యాబ్ మేడ్ ఫిష్
ఒకప్పుడు చేపల కోసం సముద్రంలోకి వల వేసేవారు. ఇప్పుడు ల్యాబ్లో ‘సెల్’ వేస్తున్నారు. అది కూడా ఎంతో రుచికరమైన సాల్మన్ ఫిష్ కోసం. తాజాగా అమెరికాలో ల్యాబ్ గ్రోన్ సీ ఫుడ్కి ‘ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ (ఎఫ్డీఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, త్వరలోనే ఈ చేప వంటకాలు డైనింగ్ టేబుల్ మీదకు రావడమే తరువాయి. ‘వైల్డ్టైప్’ అనే సంస్థ 2018లో కోహో సాల్మన్ కణజాలంతో ఈ కృత్రిమ చేప మాంసం తయారీని మొదలు పెట్టింది. దానికి స్పెషల్ డైట్, ప్రొటీన్ షేక్స్, పక్కా బయో రియాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చి, చేపను పెద్దదిగా తయారు చేస్తారు. ఇది జీవహింస లేని పద్ధతి, పైగా ఈ ప్రక్రియలో కర్బన ఉద్గారాలు తక్కువగా కూడా ఉండటంతో, చాలామంది పర్యావరణ ప్రేమికులు ‘ఇంకాస్త పరిశోధన కావాలి కానీ ఐడియా సూపర్!’ అంటున్నారు. ఈ మధ్యనే ఇలా తయారు చేసిన చేప మాంసంతోనే, ఒక రెస్టరెంట్లో ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ‘ఏం తేడా లేదు, సూపర్గా ఉంది’ అని ఎంజాయ్ చేస్తుంటే, ఇంకొంతమంది రకరకాల అనుమానాలతో ‘ల్యాబ్ ఫుడ్? నో థ్యాంక్స్’ అనేస్తున్నారు. ఇది చూస్తుంటే, రేపటికి ల్యాబ్లే అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ తయారయ్యే కిచెన్లుగా మారిపోతాయని కనిపిస్తోంది.కంటి శుక్లాలకు చుక్కల మందునడి వయసు దాటిన వారిలో చాలామందికి కళ్లలో శుక్లాలు ఏర్పడతాయి. వీటిని తొలగించుకోవడానికి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న మార్గం శస్త్రచికిత్స మాత్రమే! అయితే, ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు కంటి శుక్లాలను పూర్తిగా నయం చేయగల చుక్కల మందును సృష్టించారు. యూనివర్సిటీ ఆఫ్ శాన్ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్లకు చెందిన శాస్త్రవేత్తలు కంటి శుక్లాలను కరిగించగల చుక్కల మందును విజయవంతంగా తయారు చేయగలిగారు. ‘లానోస్టెరాల్’ అనే ఔషధ రసాయనంతో కూడిన ఈ చుక్కల మందు త్వరలోనే కేటరాక్ట్ సర్జరీకి ప్రత్యామ్నాయం కాగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వయసు మళ్లిన వారిలో అంధత్వానికి కేటరాక్ట్ ప్రధాన కారణంగా ఉంటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతున్న నేపథ్యంలో ఈ చుక్కల మందు వైద్యరంగానికి ఆశాకిరణంగా మారింది.(చదవండి: రాతిపై చెక్కిన అద్భుతం..!) -
ట్రంప్ వచ్చేశారు.. అదంతా ఫేక్ ప్రచారమే..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చనిపోయారంటూ, కనిపించడం లేదంటూ వస్తున్న వార్తలకు తెర పడింది. ఎట్టకేలకు అధ్యక్షుడు ట్రంప్.. దర్శనమిచ్చారు. ఈ మేరకు వైట్హౌస్ కీలక ప్రకటన చేసింది. తాజాగా ట్రంప్ తన వర్జీనియా క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ఫోటోను సోషల్ మీడియాలో వైట్హౌస్ షేర్ చేసింది. దీంతో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తకు క్లారిటీ వచ్చేసింది.ఇక, వైట్హౌస్ ఈ సందర్బంగా స్పందిస్తూ.. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన హుషారుగా గోల్ఫ్ కూడా ఆడుతున్నారని పేర్కొంది. ట్రంప్ తన మనుమరాలు కయి ట్రంప్, మనువడు ఫ్రెడరిక్ ట్రంప్తో కలిసి గోల్ఫ్ ఆడేందుకు వెళ్లారని తెలిపింది. ఇక, ఫోటోలో ట్రంప్ తెల్లటి పోలో షర్ట్, రెడ్ కలర్ టోపీ, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి, అమెరికా గ్రేట్ క్యాప్ ధరించి కనిపించారు. కాగా, తెల్లవారు జామున ఉదయం 8.49 గంటలకు ట్రంప్ గోల్ఫ్ ఆడినట్టు టైం స్టాంప్ కనిపిస్తోంది. ఇక ట్రంప్ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అన్నీ ఫేక్ అని తేల్చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం క్షీణించిందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ డెడ్ అంటూ ట్విట్టర్ ట్రెండింగ్ లోకి రావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో, ట్రంప్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు. మీమ్స్, వీడియోలు చక్కర్లు కొట్టాయి.#JUSTIN: Trump is aliveDonald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30, 2025, heading to Trump National Golf Club in Sterling, Virginia.#Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump… pic.twitter.com/rDvhVWgPXX— upuknews (@upuknews1) August 30, 2025 -
వాణిజ్య చర్చలపై వెనక్కి తగ్గిన భారత్: ట్రంప్ తీరుపై మాజీ ఆర్థిక కార్యదర్శి ఫైర్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై అదనపు సుంకాలు విధించడంతో ఆ దేశంతో భారత్ వాణిజ్య సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకే భారత్.. అమెరికాతో వాణిజ్య చర్చల నుండి వెనక్కు తగ్గిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ గార్గ్ వ్యాఖ్యానించారు.ఎన్డీటీవీతో సుభాష్ గార్గ్ మాట్లాడుతూ ట్రంప్ ఏకపక్ష సుంకాలు 50 శాతం వరకు ఉండటంతో న్యూఢిల్లీ ఇప్పటికే చర్చల నుండి సమర్థవంతంగా వైదొలిగిందన్నారు. భారత్ ముడి చమురును రష్యా నుంచి కొనుగోలు చేస్తూ, భారీగా లాభాలు పొందుతోందంటూ ట్రంప్ పదేపదే చేసిన వాదనలను సుభాష్ గార్గ్ తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణ ఆర్థిక వాస్తవికత కాదని, ఇదొక రాజకీయ నాటకమని ఆయన పేర్కొన్నారు. రష్యా ముడి చమురు కొనుగోలు వలన భారత వాస్తవ పొదుపు సంవత్సరానికి 25 బిలియన్ అమెరికన్ డాలర్లు కాదని, 2.5 బిలియన్ అమెరికా డాలర్లకు దగ్గరగా ఉందని గార్గ్ అన్నారు.ఈ విధంగా తప్పుడు సంఖ్యను చెప్పవచ్చుగానీ, ట్రంప్ దీనిని భారతదేశాన్ని శిక్షించడానికి కత్తిగా ఉపయోగిస్తున్నారని గార్గ్ ఆరోపించారు. గార్గ్ తెలిపిన వివరాల ప్రకారం షిప్పింగ్, భీమా, బ్లెండింగ్ ఖర్చులను పరిగణనలోకి తీసుకున్నాక భారత్.. రష్యన్ బారెల్స్ నుంచి అందుతున్న డిస్కౌంట్ బ్యారెల్కు కేవలం మూడు నుంచి నాలుగు అమెరికన్ డాలర్లు మాత్రమేనని అన్నారు. భారత్ చమురు కొనుగోలు విషయంలో అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడం లేదని గార్గ్ స్పష్టం చేశారు.అమెరికా విధిస్తున్న సుంకాల స్థాయిలలో ఎవరూ వ్యాపారం చేయలేదని, అమెరికా ఒత్తిడిని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని, ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రయోజనాల కోసం ఎప్పుడూ రాజీ పడనని ప్రతిజ్ఞ చేశారని గార్గ్ పేర్కొన్నారు. ట్రంప్ సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులను బహిష్కరించాలని వస్తున్న పిలుపులపై గార్గ్ మాట్లాడుతూ అది పిచ్చితనమని, అమెరికా- భారత్లు వస్తు వినియోగం, సేవారంగాలలో లోతుగా కలిసిపోయాయన్నారు. అందుకే అమెరికా వస్తు బహిష్కరణ సాధ్యం కాదన్నారు. -
ఏనుగుపై తొడగొట్టిన ఎలుక!
భారత్, అమెరికా దేశాల మధ్య సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్న దశ అనూహ్యంగా మొదలైంది. ఏనుగు కుంభస్థలంపై ఎలుక పిల్ల ఓ మొట్టికాయ వేసిందట! రెండు దేశాలను ఉద్దేశించి ఓ ఆర్థిక నిపుణుడు చేసిన వ్యాఖ్యానం ఇది. అయితే ఇందులో ఏనుగెవరు? ఎలుకెవరు? గత పాతికేళ్లుగా డాలర్ డ్రీమ్స్ను పలవరిస్తూ వస్తున్న మన మిడిల్ క్లాస్ కుటుంబ రావులు ఈ ప్రశ్నకు ఠకీమని సమాధానం చెప్పగలరు. అపారమైన ఆర్థిక – సైనిక బలం, అగ్రరాజ్య హోదా ఉన్న అమెరికా ఎలుకెట్లా అవుతుంది? లక్షల సంఖ్యలో మన వంశోద్ధారకుల్ని కూడా ఉద్ధరిస్తున్న అమెరికా దేశం ఏనుగు కాకుండా ఎలుకవుతుందా అనే సందేహం వారికి ఉంటుంది. మరి నూటా నలభై కోట్ల జనాభా, అందులో 90 కోట్ల మంది యువత ఉన్న భారత దేశాన్ని కూడా ఎలుకతో పోల్చడం సాధ్యంకాదు కదా!వాణిజ్య ట్యారిఫ్లను ఆయుధాలుగా మార్చుకొని కొంత కాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కవ్వింపు చర్యలకు పాల్పడటం, తదనంతర ప్రపంచ పరిణామాల నేపథ్యంలో రిచర్డ్ ఓల్ఫ్ అనే అమెరికన్ ఆర్థికవేత్త చేసిన విశ్లేషణ సంచలనంగా మారింది. భారతదేశంపై ట్రంప్ చేసిన 50 శాతం సుంకాల ‘యుద్ధ ప్రకటన’పై ఆయన ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఈ వ్యాఖ్యానాన్ని విస్తారమైన అర్థంలో చేశార నుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా కలిగే దీని పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగుపై ఎలుక మొట్టికాయ వేసినట్టేనని అన్నారు. ప్రపంచ జనాభాలో నాలుగున్నర శాతం లేని దేశం 95 శాతం ప్రజలను ఆజ్ఞాపించాలని చూసే పెత్తందారీతనం బెడిసి కొడుతుందని ఆయన జోస్యం చెప్పారు.అమెరికా ట్యారిఫ్ కొరడా ప్రయోగం భారత్పై ప్రభావం చూపబోదని దాని అర్థం కాదు. తక్షణ ఫలితంగా భారత్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవలసి వస్తుంది. మొత్తం అంత ర్జాతీయ వాణిజ్యంలో 90 బిలియన్ డాలర్ల పైచిలుకు లోటును భారత్ ఎదుర్కొంటున్నది. ఈ లోటులో సింహభాగం చైనా వాణిజ్యంలోనే! ‘మేకిన్ ఇండియా’ సత్ఫలితాలిస్తే తప్ప ఈ లోటును అధిగమించడం సాధ్యం కాదు. ఒక్క అమెరికా వాణిజ్యంలోనే భారత్ మిగులు భాగస్వామిగా ఉంటున్నది. అమెరికాకు 87 బిలియన్ డాలర్ల సరుకుల్ని ఎగుమతి చేస్తున్న మన దేశం అక్కడి నుంచి 45 బిలియన్ డాలర్ల కిమ్మత్తు చేసే సరుకుల్ని దిగుమతి చేసుకుంటున్నది. 50 శాతం ట్యారిఫ్ ప్రభావం 70 శాతం వ్యాపారంపై పడుతుందని, ఫలితంగా వెనువెంటనే 20 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతామని ఎగుమతిదార్ల సంస్థలు చెబుతున్నాయి. వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి పట్టణాల్లో అప్పుడే ఉద్యోగాల కోత, ఫ్యాక్టరీల మూత మొదలైంది.అమెరికా కొరడా ఝుళిపిస్తుంటే భారత్ చేతులు ముడుచు కొని కూర్చుంటుందా? కూర్చోలేదు కూడా! ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకూ భారత నాయకత్వం పరిణతితో, ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించిందనే చెప్పాలి. భారత్ – పాక్ల మధ్య ఏర్పడిన తీవ్ర ఉద్రిక్తతల సందర్భాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. యుద్ధం మొదలుకావడం, రెండు రోజుల్లోనే పాక్ను భారత్ దారుణంగా దెబ్బతీయడం, ఆ వెనువెంటనే కాల్పుల విరమణ ప్రకటన రావడం జరిగింది. భారత్ – పాక్లు ప్రకటించకముందే తన వల్లనే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ప్రకటించుకున్నారు. దీన్ని భారత్ అధికారికంగా ఖండించ లేదు. ట్రంప్కు మోదీ భయపడ్డారని, ఆయన ఆదేశించగానే కాల్పుల విరమణ అమలు చేశారనే ప్రచారం జరిగింది. చాలా మంది నమ్మారు. తదనంతర పరిణామాలను గమనిస్తే అప్పటి అభిప్రాయం కేవలం అపోహ మాత్రమే కావచ్చనిపిస్తున్నది. గతంలో విధించిన 25 శాతం ట్యారిఫ్కు అదనంగా మరో 25 శాతం విధించడానికి కారణం తాము ఆంక్షలు విధించిన రష్యా నుంచి భారీఎత్తున చమురు కొనుగోలు చేయడమేనని ఇప్పుడు అమెరికా చెబుతున్నది. అసలు కారణం అది కాదన్న సంగతి అందరికీ తెలుసు.అమెరికాలోని వ్యవసాయ, పాల ఉత్పత్తి రంగాలను చిరకాలంగా భారత మార్కెట్ ఊరిస్తున్నది. అవి భారత్లో ప్రవేశించగలిగితే ఇబ్బడిముబ్బడిగా అమెరికా విత్తన కంపెనీలు, పాల ఉత్పత్తుల కంపెనీలు లాభాలు పోగేసుకోగలుగుతాయి. జన్యుమార్పిడి పంటలైన సోయాబీన్, మొక్కజొన్నలను దిగు మతి చేసుకోవాలని అమెరికా భారత్ను డిమాండ్ చేస్తున్నది. వ్యవసాయ రంగాన్ని పరాధీనం చేయగలిగే జీఎమ్ పంటలను ఒక విధానంగా భారత ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లానే పాల ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలని అమెరికా షరతు పెట్టింది. ఈ షరతు అంగీకరిస్తే దేశవాళీ పాడి పరిశ్రమ లక్ష కోట్లకు పైగా నష్టపోతుందని ఒక అంచనా. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న దేశం పాల ఉత్పత్తులను చౌక సుంకాలకు దిగుమతి చేసుకోవడం ఏమిటి? ఇప్పటికీ 40 శాతం మంది ప్రజలు వ్యవసాయ ఆధారిత రంగాలపై ఆధారపడిన దేశం విషతుల్యమైన జీఎమ్ పంటలను దిగుమతి చేసుకో వలసిన అవసరమేమిటి? ట్రంప్ సర్కార్ కోరిన ఈ హిరణ్యాక్ష వరాలకు భారత్ తలాడించలేదు.ఆయన నోబెల్ బహుమతి పిచ్చికి భారత ప్రభుత్వం సహకరించలేదన్న దుగ్ధ కూడా అమెరికా అధ్యక్షుడిని వేధిస్తున్న దట! ట్రంప్ మధ్యవర్తిత్వం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పు కున్నామని భారత్ ఒక మాట అధికారికంగా చెబితే తనకు నోబెల్ శాంతి బహుమతి దక్కుతుందని ట్రంప్ ఆశ. భారత్ – పాక్ వ్యవహారాల్లో మూడో దేశం జోక్యాన్ని చాలాకాలంగా భారత్ అంగీరించడం లేదు. ఒక దేశాధినేత నోబెల్ పిచ్చిని తీర్చడం కోసం తన దేశ సార్వభౌమాధికారంతో రాజీపడడానికి భారత్ అంగీకరించలేదు. ఇటువంటి రాజీ పట్ల పాక్కు ఎటు వంటి అభ్యంతరమూ లేదు. ట్రంప్ కోరుకుంటున్న ప్రకటనను పాక్ మిలిటరీ చీఫ్ అసీఫ్ మునీర్ చేశారు. దాంతో మునీర్ను పొగడ్తల్లో ముంచడమే గాక ఆయన్ను వైట్హౌస్లో భోజనానికి ప్రత్యేకంగా ట్రంప్ ఆహ్వానించారు.ఏకధ్రువ ప్రపంచం నుండి బహుధ్రువ ప్రపంచం వైపు మానవాళి అడుగులు వేస్తున్న కీలకమైన మలుపులో భారతదేశం తన ప్రయోజనాల కోసం అనుసరించవలసిన విదేశీ విధానంపై కేంద్ర సర్కార్కు ఇప్పటికే ఒక స్పష్టత ఉన్నది. అంతర్జాతీయ సంబంధాల్లో సిద్ధాంతాల పాత్ర ప్రచ్ఛన్న యుద్ధంతోపాటే కరిగిపోయింది. భౌగోళిక రాజకీయ అవరోధాలున్న సందర్భా ల్లోనూ ఉభయతారకంగా నెగ్గుకురావడానికి అవసరమైన వ్యూహాలకు మన విదేశాంగ విధానం పెద్దపీట వేస్తున్నది. విదేశాంగ మంత్రిగా ఉన్న జైశంకర్ దీర్ఘకాలం పాటు దౌత్యవేత్తగా పనిచేశారు. ఆ అనుభవ సారాన్ని రంగరించి, ప్రభుత్వ ఆలోచనల్ని కూడా కలబోసి ‘ది ఇండియా వే’ (భారత్ మార్గం : అనిశ్చిత ప్రపంచంలో అనుసరణీయ వ్యూహాలు) అనే పుస్తకాన్ని రాశారు. మారిన అంతర్జాతీయ పరిస్థితుల్లో అనుసరించదగిన వ్యూహాలపై అందులో చర్చించారు. భారత విదేశాంగ విధానం ఇప్పుడీ తాజా పంథాలోనే కొనసాగు తున్నట్టు కనిపిస్తున్నది.ఇంకెంతోకాలం అగ్రరాజ్యంగా అమెరికా మనలేదని, డాలర్ పెత్తనానికి కూడా రోజులు దగ్గరపడినట్టేనని పలువురు ఆర్థిక నిపుణులు జోస్యం చెబుతున్నారు. ట్రంప్ చర్యలు ఈ పరిణామాన్ని వేగవంతం చేయగలవని అంచనా వేస్తున్నారు. అమెరికా నాయకత్వంలోని ‘జీ–7’ దేశాల పాశ్చాత్య కూటమిని ఆర్థిక రంగంలో ‘బ్రిక్స్’ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) ఇప్పటికే అధిగమించడాన్ని ఇందుకు రుజువుగా వారు చూపెడుతున్నారు. వచ్చే ఏడాది ‘బ్రిక్స్’ కూటమికి భారత్ నాయకత్వం వహించబోతున్నది. భౌగోళిక రాజకీయాలతోపాటు పలు అంశాలపై వైరుద్ధ్యాలున్న రెండు అతిపెద్ద దేశాలను (భారత్ – చైనా) వ్యూహాత్మక స్నేహం వైపు నడిపించిన ఘనత ట్రంప్దేనని అమెరికన్ నిపుణులే విమర్శి స్తున్నారు. ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తర ణను అడ్డుకోవడానికి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా లతో కలిసి ఏర్పడిన ‘క్వాడ్’ కూటమి తాజా పరిణామాలతో నిర్వీర్యమైనట్టే! గల్వాన్ ఘర్షణ అనంతరం రెండు దేశాల మధ్యన ఏర్పడిన ఉద్రిక్తతలను ఉపశమింపజేయడానికి అవసరమైన కొన్ని చర్య లను రెండు దేశాలూ ఇప్పటికే తీసుకోవడం ఆరంభించాయి. మన విదేశాంగ మంత్రి జైశంకర్ జిన్పింగ్ను కలిశారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీకి వచ్చి మంతనాలు జరి పారు. భారత యాత్రికుల కోసం మానస సరోవరం మార్గాన్ని చైనా తెరిచింది. చైనాకు విమానయానాలను భారత్ పునరు ద్ధరించింది. చైనాలోని తియాంజిన్లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొంటున్నారు. శనివారం నాడాయనకు చైనాలో ఆత్మీయ స్వాగతం లభించింది. భారతదేశపు శాస్త్రీయ సంగీత నృత్యా లతో చైనా యువతీ యువకులు ఆయన్ను అలరించారు. అమె రికా పెత్తందారీతనానికి వ్యతిరేక వేదికను ఈ సదస్సు బలో పేతం చేసే అవకాశం ఉన్నది.ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ–జిన్పింగ్తో మోదీ ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. ద్వైపాక్షిక సమస్యలు, సంబంధాలపై వారి మధ్య చర్చలు జరగవచ్చు. ఎస్సీఓ శిఖ రాగ్ర సభకు అమెరికా బద్ధ శత్రువైన రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా హాజరవు తున్నారు. ఈ నేతలతో కూడా మోదీ చర్చలు జరిపే అవకాశం ఉన్నది. రష్యాతో మనది చెక్కుచెదరని దశాబ్దాల స్నేహబంధం. ఇరాన్తో మనకున్న అనుబంధానికి శతాబ్దాల చరిత్ర ఉన్నది. ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ కొత్త మార్కెట్లకు విస్తరించడం కోసం అందివచ్చిన వేదికలన్నిటినీ ఉపయోగించుకుంటుంది. ఈ ప్రయాణంలో భారత్ వైఖరి వేగిర పడిన చందంగా కాకుండా ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఎస్సీఓ సమావేశం ముగిసిన తర్వాత బుధవారం నాడు బీజింగ్లో మరో భారీ ర్యాలీని చైనా నిర్వహిస్తున్నది. రెండో ప్రపంచ యుద్ధంలో సామ్రాజ్యవాద శక్తులను (ముఖ్యంగా జపాన్ సామ్రాజ్యవాదం) ఓడించి 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చైనా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నది. ఎస్సీఓ సభకు హాజరయ్యే దేశాలన్నీ ఈ ర్యాలీకి హాజరవుతున్నా భారత్ మాత్రం జపాన్ పట్ల స్నేహభావంతో హాజరు కావడం లేదు. పైగా తియాంజిన్ సదస్సుకు ముందు రెండు రోజులపాటు ప్రధాని మోదీ జపాన్లో పర్యటించారు. రెండు దేశాల మధ్య టెక్నాలజీ రంగంలో పలు ఒప్పందాలు కుదిరాయి. జపాన్ కూడా భారత ప్రధానికి ఘనమైన స్వాగతాన్నే ఏర్పాటు చేసింది. జపనీయులు గాయత్రీ మంత్రాన్ని పఠిస్తూ ఆయనకు ఆహ్వానం పలికి ఆకట్టుకున్నారు.ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి, ఒక అభివృద్ధి చెందిన దేశం హోదా వైపు అడుగులు వేయడానికి ఆచరణా త్మకమైన, వివేకవంతమైన విదేశాంగ విధానం ఒక్కటే సరి పోతుందా? దేశీయంగా అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నామా? అనే విషయాలను సమీక్షించుకోవలసిన సమయమిది. జీఎస్టీ శ్లాబుల కుదింపు, స్వదేశీ వాడకం ఉద్యమానికి ప్రధాని పిలుపు నివ్వడం ట్రంప్ ట్యారిఫ్ల నేపథ్యంలో తీసుకున్న చర్యలే కావచ్చు. వాటివల్లనే స్వదేశీ మార్కెట్ బలపడుతుందా? మన దేశ ప్రజల కొనుగోలు శక్తి బలంగా ఉంటే అమెరికా, ఐరోపా దేశాల ఉమ్మడి బలంతో సమానంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థను సృష్టించుకోగలగడమే చైనా విజయ రహస్యంగా ఆర్థికవేత్తలు చెబుతున్నారు. చైనా ఆర్థికాభివృద్ధి పంథా ఒక హైబ్రిడ్ మోడల్. అది పూర్తిస్థాయి పెట్టుబడిదారీ విధానం కాదు. సోషలిస్టు విధానమూ కాదు. ప్రభుత్వ నియంత్రణకు లోబడిన పెట్టుబడి పూర్తి లాభాపేక్షతో కాకుండా సామాజిక వృద్ధికి కట్టుబడి ఉంటుంది. ఈ ఆర్థిక విధానం ఫలితంగా కోట్లాది మంది పేదరికం సంకెళ్ళను తెంచుకొని ఒక బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించుకోగలిగారు. మనం మాత్రం సమాజంలో తీవ్ర అసమానతలకూ,పేదరికానికీ ఒక ముఖ్య కారణ మైన ప్రైవేటీకరణ బాట వెంటనే ఇంకా పరుగులు తీస్తున్నాము. ఈ బాట ఇంకెంతమాత్రమూ పేదరికాన్ని నిర్మూలించలేదనీ, అసమానతల్ని పోగొట్టలేదనీ ఇప్పటికే రుజువైంది. దేశీయంగా బలమైన మార్కెట్ను నిర్మించుకోగలిగినప్పుడే రాచవీధిలో పట్టపుటేనుగు నడిచినంత ఠీవిగా అంతర్జాతీయ సంబంధాల్లో నడవగలం. ఎలుకల మొట్టికాయలు అప్పుడు ఏమీ చేయలేవు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఎగుమతులకు ప్రత్యేక వ్యూహాల బూస్ట్..
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై అమెరికా భారీగా సుంకాలు విధించిన నేపథ్యంలో ఎగుమతిదార్లకు తోడ్పాటు అందించడంపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందుకోసం బహుళ వ్యూహాలపై వాణిజ్య శాఖ కసరత్తు చేస్తోంది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తోంది. అలాగే ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్) సంబంధించిన పలు నిబంధనలను కూడా సరళతరం చేయడాన్ని కూడా పరిశీలిస్తోందని సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. సరళతరమైన రిటర్నుల నిబంధనలతో ఈ–కామర్స్ ఎగుమతి హబ్లను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తోందని వివరించారు. ఎగుమతిదార్లకు ద్రవ్యలభ్యతపరంగా తక్షణం ఊరట కల్పించడం, బలహీనంగా ఉన్న రంగాల్లో ఆర్డర్లు .. ఉద్యోగాలు తగ్గిపోకుండా చూడటం, సంస్కరణలతో సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, కొత్త మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూనే, ప్రస్తుత వాణిజ్య ఒప్పందాల నుంచి గరిష్టంగా ప్రయోజనాలను రాబట్టేందుకు ప్రయతి్నంచడంలాంటి విషయాలపై కార్యాచరణ ప్రణాళికలో ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు అధికారి చెప్పారు. ఇందుకోసం వాణిజ్య శాఖ మరో ద్విముఖ వ్యూహం కూడా రూపొందించింది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్లాంటి ప్రస్తుత మార్కెట్లకు ఎగుమతులను పెంచడంతో పాటు లాటిన్ అమెరికా, ఆఫ్రికా, తూర్పు ఆసియా, తూర్పు యూరప్లోని కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం ఇందులో ఉన్నాయి. పరిశీలనలో ఉన్న మరిన్ని ప్రతిపాదనలు.. → బ్రాండింగ్పరంగా తోడ్పాటు అందించడం. నిబంధనలు, లాజిస్టిక్స్ వ్యయాల భారాన్ని తగ్గించడం. ఎగుమతులతో పాటు దేశీయంగా వినియోగానికి కూడా ఊతమివ్వడం. → స్వల్పకాలిక ప్రణాళికల్లో భాగంగా .. లిక్విడిటీ సమస్యలను తగ్గించడానికి, దివాలా పరిస్థితులను నివారించడానికి, సెజ్లలో యూనిట్లకు నిబంధనలను మరింత సరళతరం చేయడానికి, నిర్దిష్ట దిగుమతులకు ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడానికి తగు చర్యలు తీసుకోవడం. → మధ్యకాలికంగా పరిశీలిస్తున్న అంశాల్లో వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో (ఎఫ్టీఏ) గరిష్టంగా ప్రయోజనాలను రాబట్టడం, దేశ–విదేశాల్లో కొనుగోలుదారులు–విక్రేతలను మరింతగా అనుసంధానించేందుకు ఎగ్జిబిషన్లలాంటివి నిర్వహించడం, పోటీతత్వాన్ని పెంచేలా జీఎస్టీ సంస్కరణలను పటిష్టం చేయడం ఉన్నాయి. చాలా మటుకు చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ) నిర్దిష్ట దేశాలతో టారిఫ్లపరమైన ప్రయోజనాల గురించి అంతగా తెలియకపోవడంతో ఎఫ్టీఏలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనేది మరో ప్రతిపాదన. ఇటీవలి కాలంలో ఆ్రస్టేలియా, యూఏఈ, జపాన్, కొరియాతో పాటు డజను పైగా దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో పొందడంపై వాటి ప్రయోజనాలను పొందడంపై భారత్ దృష్టి పెట్టనుంది. కొనుగోలుదారులను నేరుగా కలిసేందుకు దుస్తుల రంగానికి సంబంధించి ఆ్రస్టేలియాకు, రత్నాల విషయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి, తోలు ఉత్పత్తుల అంశంపై బ్రిటన్కు ఎగుమతిదార్ల ప్రతినిధి బృందాలను పంపించే అవకాశాలు పరిశీలించనుంది. → ఇక దీర్ఘకాలికంగా చూస్తే.. మన ఎగుమతులకు ఆటంకాలు ఉండని మార్కెట్లపై దృష్టి పెట్టడం, తదనుగుణంగా ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ను (ఈపీఎం) బలపేతం చేసుకోవడం, సెజ్ ని బంధనలను సంస్కరించడం, సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవడంలాంటి అంశాలు ఉన్నాయి. → టారిఫ్ల వల్ల పలు ఎగుమతిదార్లకు రావాల్సిన బాకీలు ఆలస్యం కావడం, ఆర్డర్లు రద్దు కావడంలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీని వల్ల ఎగుమతిదార్లకు నిర్వహణ మూలధనం కొరతలాంటి సమస్యలు తలెత్తకుండా చూసేందుకు, ఉద్యోగాలను కాపాడేందుకు పలు చర్యలపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. ప్రతిపాదిత జీఎస్టీ క్రమబద్దీకరణతో దేశీయంగా వినియోగానికి ఊతం లభిస్తుందని, డిమాండ్కి తగ్గట్లుగా ఇక్కడి మార్కెట్లో మరింతగా విక్రయించుకోవడానికి ఎగుమతిదార్లకు అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ప్రభుత్వం ఓవర్టైమ్ పనిచేస్తోంది: సీఈఏ ఎగుమతి రంగాలను టారిఫ్ల ప్రభావాల నుంచి కాపాడేందుకు తగిన వ్యూహాలను రూపొందించడానికి ఆర్థిక శాఖ, ఇతరత్రా శాఖలు మరింతగా పని చేస్తున్నాయని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత నాగేశ్వరన్ తెలిపారు. టారిఫ్లు అమల్లోకి వచ్చాక గత మూడు, నాలుగు రోజుల నుంచి పరిశ్రమ ప్రతినిధులతో సమాలోచనలు జరుగుతున్నాయని పరిశ్రమల సమాఖ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. సంక్షోభాలు చిన్నవైనా, పెద్దవైనా, సాధారణంగా వాయిదా వేసుకునే ప్రణాళికలను సత్వరం అమలు చేసేలా దృష్టి పెట్టేందుకు సమాజంలోని అన్ని వర్గాలను (ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, కుటుంబాలు) ప్రేరేపిస్తాయని పేర్కొన్నారు. ప్రభావిత ఎగుమతి రంగాలు, యూనిట్లకు ఆర్థికంగా, సమయంపరంగా కాస్త వెసులుబాటు లభించేలా చూడాలనేది తక్షణ లక్ష్యంగా ఉందని నాగేశ్వరన్ చెప్పారు.గ్లోబల్ ఎగ్జిబిషన్లకు నిధులు కేటాయించాలి: జీటీఆర్ఐ ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కార్యక్రమాలకు నిధులు తగ్గిపోవడంపై మేధావుల సంఘం గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీíÙయేటివ్ (జీటీఆర్ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో మార్కెట్ యాక్సెస్ ఇనీషియేటివ్ (ఎంఏఐ) కింద గ్లోబల్ ఎగ్జిబిషన్లలో ఎగుమతిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు వీలుగా రూ. 2,500 కోట్లు కేటాయించడాన్ని పరిశీలించాలని సూచించింది. ఎంఏఐకి ఈసారి అస్సలు నిధులే విడుదల చేయకపోవడంతో, సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఏప్రిల్, ఆగస్టుల్లో విదేశీ ఎగ్జిబిషన్లలో ఎగుమతిదార్లు పాల్గొనలేకపోయారని పేర్కొంది. ‘440 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే ఎకానమీ గత అనేక సంవత్సరాలుగా రూ. 250 కోట్ల స్కీముతో నెట్టుకొస్తోంది. దీన్ని ఏటా రూ. 2,500 కోట్లకు పెంచాలి. కనీసం ఏడాది ముందుగా ఆ నిధులను విడుదల చేస్తే, అత్యంత ప్రయోజనకరంగా ఉండే గ్లోబల్ ఎగ్జిబిషన్లలో మన సంస్థలు పాల్గొనేందుకు వీలవుతుంది‘ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ తెలిపారు. వడ్డీ రాయితీ పథకాన్ని (ఐఈఎస్) పునరుద్ధరించాలని, ఈ–కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్లను తక్షణం పూర్తిస్థాయిలో విస్తరించాలని సూచించారు. 2025 ఏప్రిల్లో ఐఈఎస్ను నిలిపివేయడం వల్ల అధిక వడ్డీల భారంతో ఎంఎస్ఎంఈలు సతమతమవుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల కారి్మక శక్తి ఎక్కువగా ఉండే టెక్స్టైల్స్, తోలు, హస్తకళలు, ఇంజినీరింగ్ ఉత్పత్తుల్లాంటి రంగాలపై తీవ్ర ప్రభావం పడుతోందని శ్రీవాస్తవ చెప్పారు. -
ట్రంప్ నిజంగానే క్షేమమా? వైట్హౌజ్ గప్చుప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎక్కడ?.. నిత్యం తనదైన శైలి ప్రకటనలు, నిర్ణయాలు, సోషల్ మీడియాలో పోస్టింగులతో హడావిడి చేసే ట్రంప్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. పైగా 79 ఏళ్ల వయసున్న ఆయన అనారోగ్యంపై ఇటీవల వార్తలు ఎక్కువయ్యాయి. దీనికి తోడు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అవసరమైతే తానే అధ్యక్ష బాధ్యతలు చేపడతానంటూ ప్రకటన చేశారు. ఈ వరుస పరిణామాల నడుమ.. ట్రంప్ మిస్సింగ్పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. గత 24 గంటలుగా సోషల్ మీడియా మామూలుగా ఊగిపోవడం లేదు. ఏకంగా ట్రంప్ ఈజ్ డెడ్ అంటూ ఓ ట్రెండ్ సైతం నడుస్తోంది. పోను పోను ఆ ట్రెండ్ మరింత దారుణంగా మారింది. ట్రంప్ చనిపోయాడనే వార్త ధృవీకరించినవాళ్లకు డాలర్లు ఇస్తామంటూ పలువురు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. ట్రంప్ మీడియా ముందుకురాలేదు. ఏదైనా చెప్పాలనుకుంటే తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. అయితే.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. JD Vance Says He’s Prepared to Assume Presidency if Trump...#Jdvance #vance #prepare #assume #office #president #donaldtrump #trump #health #wellbeing #transitions #rickwilson #conservative #strategist #maga #games #trending #viral #fyp #xviral #viralx pic.twitter.com/Jlt5BbvaZ6— FANmily TV (@FanmilyTV) August 30, 2025ట్రంప్ అనారోగ్యంపై వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటివరకు వైట్హౌజ్గానీ, ఆయన వ్యక్తిగత సిబ్బందిగానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకుంటే.. తన మనవరాలు కై మాడిసన్ ట్రంప్ (Kai Madison Trump) కలిసి వైట్హౌజ్ సౌత్ లాన్లో ఆయన గోల్ఫ్ ఆడినట్లు ఓ వీడియో వైరల్ అవుతోంది. #JUSTIN Trump is alive Donald Trump, accompanied by his granddaughter Kai, boarded the motorcade on the South Lawn of the White House on August 30 #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive #Kai #Virginia pic.twitter.com/fAUCijwwCR— ViralVolt🟦 (@ViralVolT1) August 30, 2025ఆ సమయంలో అక్కడికి వచ్చినవాళ్లకూ ఆయన కరచలనం చేస్తూ కనిపించినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అది తాజా వీడియోనేనా? అనేది ధృవీకరణ కావాల్సి ఉంది. ‘‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టడంతో ఈ వ్యవహారం మొదలైంది. #BREAKING: Trump makes an appearance at his golf club this morning, putting to rest swirling health rumors. #Trump #BreakingNews #Golf #DonaldTrump #POTUS #whereistrump #trumpdead #TrumpIsDead #TrumpisnotDead #TrumpisAlive pic.twitter.com/VfvOaGsVj0— Mukund Shahi (@Mukundshahi73) August 30, 2025మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. కుట్రపూరితంగానే ప్రచారం జరుగుతోందని ఆయన మద్దతుదారులు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని కారణాలుగా పలువురు చెబుతున్నారు.భారత్+రష్యా+చైనా = ట్రంప్నకు పీడకల అంటూ నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. భవిష్యవాణిగా పేరొందిన సింప్సన్ కామిక్ సిరీస్ను ఉద్దేశించి.. ట్రంప్ ప్రాణాలతో లేకపోయి ఉండొచ్చు అని సెటైరిక్ మీమ్స్ వేస్తున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకు వేసి.. జేడీ వాన్స్, ఎలాన్ మస్క్లలో ఎవరు తదుపరి అధ్యక్షుడు అయితే బాగుంటుందంటూ పోల్ పెట్టారు కూడా.Simpsons predicted Donald Trump died of heart attack in 2025 in a forgotten episode & that's why Americans are searching "TRUMP IS DEAD", "TRUMP DIED" Trump#DonaldTrump #Trump #TrumpHealth #TrumpHealthCrisisCoverup #Simpsons #TrumpDead #TrumpDied pic.twitter.com/7vbANhE0wu— Marwdi Londa (@Marwdi45032) August 30, 2025Congratulations 🎉 Donal Trump Donald Trump is alive again after dying#donaldtrumpisdead #DonaldTrump pic.twitter.com/rfTwXSm0OL— Xi Jinping (@xijinpiing_) August 30, 2025 Elon Musk when he checks why Donald Trump is trending💀😂#DonaldTrump pic.twitter.com/Zvotz6n599— The Sarcastic Indian (@_Sarcasticindia) August 30, 2025🚨 Breaking: Senior official says Trump is perfectly fine and will go out to play golf today, according to Axios report.Now imagine after exploding the internet by trending “Trump is Dead” he suddenly appears👇🏻#trump | #trumpdead | #DonaldTrump | #TrumpIsDead pic.twitter.com/zgBLpv4gvK— GeoWireDaily (@geowiredaily) August 30, 2025if "TRUMP IS DEAD" i will give 1000 dollars to anyone who likes this tweet.#DonaldTrump#whereistrump #donaldtrumpisdead pic.twitter.com/enKe7zWGgt— GR Jaam k (@grjaam7) August 30, 2025ఈ మధ్యకాలంలో 79 ఏళ్ల ట్రంప్ అనారోగ్యంపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ట్రంప్ చేతిపై గాయంతో కనిపించారు. గతంలో ఈ గాయాన్ని దాచడానికి ఆయన చేతికి మేకప్ వేసుకొని కనిపించారు. దీనిపై ట్రంప్ వైద్యుడు సీన్ బార్బబెల్లా స్పందించారు. ఆ గాయం నిజమేనని అంగీకరించారు. తరచుగా కరచాలనం చేయడం వల్ల, ఆస్ప్రిన్ వాడటం వల్ల ఇలా జరిగిందని వెల్లడించాడు. అయితే.. ట్రంప్ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. గోల్ఫ్ ఆడిన వీడియో అధికారికమని ధృవీకరణ అయితే.. ఊహాగానాలకు తెర పడినట్లే!. -
‘శాశ్వత మిత్రత్వం కాదు.. ప్రయోజనం’.. రాజ్నాథ్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, లేదా శత్రువులు ఉండరని, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ విధించిన సుంకాలు భారతదేశంతో సహా ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తున్న తరుణంలో రాజ్నాథ్ సింగ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ -2025లో సింగ్ మాట్లాడుతూ నేడు ప్రపంచం చాలా వేగంగా మారుతోందని, ప్రతిరోజూ కొత్త సవాళ్లు ఉద్భవిస్తున్నాయన్నారు. స్వావలంబనకున్న ప్రాముఖ్యత గురించి ప్రస్తావిస్తూ, అది నేటి కాలంలో ఒక ఎంపిక కాదని, అది ఒక అవసరమని అన్నారు. మనం సవాళ్లతో నిండిన కూడిన యుగాన్ని ఎదుర్కొంటున్నామని, మహమ్మారి అయినా, ఉగ్రవాదం, ప్రాంతీయ సంఘర్షణలు అయినా, ప్రతి రంగంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నామన్నారు. ఆగస్టు 10న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై విధించిన సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది తాము అందరికీ బాస్ అని అనుకుంటారని ట్రంప్ను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు. వారు భారతదేశ అభివృద్ధిని చూసి ఇష్టపడలేరన్నారు. -
అమెరికాలో టెన్షన్.. ట్రంప్కు ఏమైంది.. ఎక్కడ?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనారోగ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ.. మూడు రోజులుగా ఆయన కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ ‘మిస్సింగ్’ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి.వివరాల ప్రకారం.. ట్రంప్ అనారోగ్యంపై ఇప్పటికే అనుమానాలు వ్యక్తం అవుతున సంగతి తెలిసిందే. ఆయన చేతిపై గాయాలు కనిపించడంతో పలువురు సోషల్మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ట్రంప్ బయట కనిపించలేదు.. మీడియా ముందుకు సైతం రాలేదు. ట్రంప్ ఏదైనా చెప్పాలనుకుంటే కేవలం తన ‘ట్రూత్’ ద్వారానే వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వారాంతమైన ఆగస్టు 30, 31 తేదీల్లోనూ ఎలాంటి పబ్లిక్ ఈవెంట్లు వైట్హౌస్ షెడ్యూల్లో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. దీంతో, ట్రంప్ విషయమై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు.🚨 BREAKING: Curiosity is rising: Trump hasn’t been seen in 3 days.No public events. No appearances. Silence everywhere.Speculation about his health & power moves grows louder…Is it strategy or concern? 👀What do you think—is this calculated or "Where is Donald Trump" pic.twitter.com/4AvG7heGUw— RX (@TheReal_RX) August 30, 2025నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తూ..‘గత 24 గంటలుగా ట్రంప్ కనిపించలేదు. మరో రెండు రోజులు కూడా ఎలాంటి పబ్లిక్ మీటింగ్లు లేవు. అసలు ఏం జరుగుతోంది?’ అని ఓ వ్యక్తి ఎక్స్లో పోస్టు పెట్టారు. ఈ క్రమంలోనే వేర్ ఈజ్ ట్రంప్ (Where Is Donald Trump, TRUMP IS DEAD) అని ట్యాగ్స్ను ట్రెండింగ్లోకి తెచ్చారు. మరోవైపు ఇవన్నీ ఊహాగానాలే అని.. ఆయన ఎంతో చురుగ్గా ఉన్నారని ఆయన ట్రూత్ సోషల్ పోస్టులు చెబుతున్నాయని మరికొందరు అంటున్నారు. సెప్టెంబర్ 1న కార్మిక దినోత్సవం ఉన్నందున ఆయన ఈ వీకెండ్లో ఎలాంటి బహిరంగ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని చెబుతున్నారు.🚨MAJOR BREAKING: Whispers are traveling through the Washington press pool that Donald Trump has not been seen since Tuesday and has zero publicly planned events through the weekend. This clip is apparently one of the last times Trump was seen by the press. What’s going on? pic.twitter.com/sM4sd0PQMK— CALL TO ACTIVISM (@CalltoActivism) August 30, 2025🚨PRAY FOR PRESIDENT TRUMP 🇺🇸 🙏 Reports coming out of America suggest that Donald trump hasn't been seen publicly or privately since Tuesday Also, the White House website is seemingly out of order.This news is very worrying for MAGA after photos released last week of an… pic.twitter.com/wsM2MYtjrm— BRITAIN IS BROKEN 🇬🇧 (@BROKENBRITAIN0) August 30, 2025 -
అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది.. యూఎస్ కీలక నేత సెటైర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల విషయంలో స్వదేశం నుంచే తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రంప్ చర్యలను ఇప్పటికే పలువురు నేతలు తప్పుపట్టగా.. తాజాగా ఆ లిస్టులో అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా చేరిపోయారు. ట్రంప్ సుంకాల నిర్ణయాల కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.అమెరికా జాతీయ మాజీ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్ చర్యలు అమెరికాకు తీరని నష్టం కలిగిస్తోంది. మిత్ర దేశాలతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు అమెరికాకు భాగస్వామిగా ఉండేందుకు ఇష్టపడటం లేదు. పలు దేశాలు అమెరికాను తమకు విఘాతం కలిగించే దేశంగా చూస్తున్నారు. ట్రంప్ చర్యలు చైనాకు అనుకూలంగా మారుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాలు చైనా వైపు చూస్తున్నాయి. ట్రంప్ తప్పుల కారణంగా భారత్ కూడా చైనా వైపు చూస్తోంది.అమెరికాకు మిత్ర దేశమైన భారత్పై పెద్ద మొత్తంలో సుంకాలు విధించడంతో.. ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. దీంతో, భారత్.. బీజింగ్తో భాగస్వామ్యం బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ బ్రాండ్ టాయిలెట్లో ఉంది. భారత్పై ట్రంప్ భారీ వాణిజ్య దాడి చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా ఢిల్లీ ఇప్పుడు చైనాతో కలవాలని చూస్తోంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో.. భారత్పై ట్రంప్ 50శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. “The American brand globally is in the toilet. Look at India. Trump has executed a massive trade offensive against them. Now, India is thinking shit we have to go sit down with China to hedge against America,” says former US NSA Jake Sullivan on the Bulwark podcast pic.twitter.com/x6bHureqpk— Shashank Mattoo (@MattooShashank) August 29, 2025 -
సుంకాలు ఆపాల్సిందే.. ట్రంప్కు భారీ షాక్
వాషింగ్టన్: తన ఇష్టానుసారం అడ్డగోలుగా సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ విధించిన సుంకాల చాలా వరకు చట్ట విరుద్దమని అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో, ట్రంప్కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA)ను అమలులోకి తెచ్చారు. దీంతో అమెరికా వాణిజ్య భాగస్వాములపై భారీగా సుంకాలు విధించారు. పలు దేశాలను టార్గెట్ చేసిన ట్రంప్ ఇష్టానుసారం సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలపై అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుంకాలు చాలా వరకు చట్ట విరుద్ధమని తెలిపింది. అధ్యక్షుడు ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి అధికంగా టారిఫ్లను పెంచినట్లు పేర్కొంది. ఈ క్రమంలో 7-4 తేడాతో అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పు వెలువరించారు.ఇదే సమయంలో ట్రంప్ సర్కార్ భారీగా విధించిన సుంకాలు పలు దేశాలను ప్రభావితం చేశాయని కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి పెంచిన టారిఫ్లను అక్టోబర్ నెల మధ్య నాటికి కొనసాగించడానికి న్యాయమూర్తులు అనుమతి ఇచ్చారు. దీంతో , ఈ నిర్ణయాన్ని యూఎస్ సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ కోర్టు తీర్పుపై ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.మరోవైపు.. కోర్టుపై తాజాగా ట్రంప్ స్పందించారు. ఈ సందర్బంగా ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా స్పందిస్తూ..‘కోర్టు తీర్పు అమెరికాకు ఎంతో నష్టం కలిగిస్తుంది. అమెరికా విధించిన సుంకాలు ప్రస్తుతం అన్ని దేశాలపై అమలులో ఉంది. ఒకవేళ ఈ టారిఫ్లను తొలగిస్తే దేశ చరిత్రలోనే ఒక విపత్తు అవుతుంది. అమెరికా మరింత బలపడాలి. అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన సుంకాలను తొలగించాలని కోర్టు తీర్పు చెప్పింది. ఈ ప్రక్రియలో చివరకు అమెరికా విజయం సాధిస్తుంది. కానీ, ఈ నిర్ణయం దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తుంది. వాణిజ్య లోటును పూడ్చడానికి, విదేశీ వాణిజ్య అడ్డంకులను ఎదుర్కోవడానికి సుంకాలు ఇప్పటికీ అత్యుత్తమ మార్గం.మన తయారీదారులను, రైతులను అణగదొక్కేందుకు మిత్ర దేశాలైనా, శత్రుదేశాలైనా అనైతికంగా విధించే టారిఫ్లు, అపారమైన వాణిజ్య లోటు, వాణిజ్య అడ్డంకులను అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. ఒక వేళ టారిఫ్లు ఎత్తివేస్తే ఈ నిర్ణయం అమెరికాను నాశనం చేస్తుంది. మన కార్మికులకు సహాయం చేయడానికి ఇదొక్కటే సరైన మార్గం అని గుర్తుపెట్టుకోవాలి. అమెరికా ఉత్పత్తులను తయారు చేస్తున్న మన కంపెనీలకు మద్దతుగా నిలబడాలి. చాలా ఏళ్లుగా మన రాజకీయ నాయకులు టారిఫ్లను మనకు వ్యతిరేకంగా ఉపయోగించారు. యూఎస్ సుప్రీంకోర్టు సహాయంతో టారిఫ్లను మన దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించి అమెరికాను బలమైన, ధనిక, శక్తివంతంగా మారుస్తాను’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అమెరికాలో నడి రోడ్డుపై గట్కా విన్యాసాలు.. సిక్కు వ్యక్తిని కాల్చి చంపిన పోలీసులు
లాస్ఏంజెలెస్: అమెరికాలో నడి రోడ్డుపై ప్రాచీన యుద్ధ విద్యను ప్రదర్శించిన ఓ సిక్కు వ్యక్తిని అమెరికా పోలీసులు కాల్చిచంపారు. జూలై 13వ తేదీన చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీని లాస్ఏంజెలెస్ పోలీసు విభాగం తాజాగా విడుదల చేయడంతో విషయం వెలుగులోకి వచి్చంది. లాస్ఏంజెలెస్లోని క్రిప్టో డాట్ కామ్ అరెనా వద్ద గుర్ప్రీత్ సింగ్(35) వేటకత్తిని పట్టుకుని తిప్పుతుండగా హెచ్చరించామని, లక్ష్య పెట్టకపోగా తమపైకి దాడికి యతి్నంచాడని పోలీసులు అంటున్నారు. ఈ క్రమంలో జరిపిన కాల్పుల్లో అతడు చనిపోయాడని చెబుతున్నారు. పోలీసులు చెబుతున్న వేటకత్తి, పంజాబ్ ప్రాచీన యుద్ధ విద్యలో భాగమైన గట్కాలో వాడే రెండంచుల కత్తి. సిక్కు మత పరమైన, సాంస్కృతిక కార్యక్రమాలప్పుడు దీనిని ప్రదర్శిస్తుంటారు. అయితే, షార్టు, తలపాగాను ధరించిన ఓ వ్యక్తి రెండడుగుల పొడవైన కత్తితో బెదిరించాడంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో తమ సిబ్బంది రద్దీగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్లారని పోలీసు విభాగం తెలిపింది. ‘కత్తిని నేలపై పడేసి, లొంగిపోవాలని పదేపదే కోరగా, నిరాకరించిన అతడు కత్తితో నాలుకను కోసుకునేందుకు యతి్నంచాడు. సమీపంలోకి చేరుకుంటున్న పోలీసులపైకి బాటిల్ విసిరి, తన కారులో అక్కడి నుంచి తప్పించుకునేందుకు యతి్నంచాడు. పోలీసులు వెంబడించగా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తూ పలు వాహనాలను ఢీకొట్టాడు. వేగంతో వెళ్తూనే కారులో నుంచి కత్తిని చూబుతూ బెదిరించాడు. కత్తిని విసిరేందుకు యతి్నంచగా కాల్పులు జరపాల్సి వచ్చింది. బుల్లెట్ గాయాలైన అతడు అనంతరం ఆస్పత్రిలో కన్నుమూశాడు’అని పోలీసులు వివరించారు. -
ఎగుమతులకు త్వరలో బూస్ట్!
న్యూఢిల్లీ: ఎగుమతులకి, దేశీయంగా వినియోగానికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం త్వరలోనే పలు చర్యలు ప్రకటించనున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ తెలిపారు. ఇతర దేశాల ఏకపక్ష నిర్ణయాల వల్ల ప్రతికూల ప్రభావాలు పడకుండా పరిశ్రమను పరిరక్షించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ఎగుమతులపై అమెరికా 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అధిక టారిఫ్ల వల్ల కారి్మక శక్తి ఎక్కువగా ఉండే రసాయనాలు, రొయ్యలు, తోలు, పాదరక్షల్లాంటి పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందనే ఆందోళన నెలకొంది. వస్తు సేవల పన్నుల (జీఎస్టీ) సంస్కరణలతో దేశీయంగా తయారీ రంగానికి మరింత ఊతం లభిస్తుందని పరిశ్రమ వర్గాల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ చెప్పారు. వచ్చే వారమే జీఎస్టీ కౌన్సిల్ భేటీ కానుండటంతో ఈ ప్రభావాలు త్వరలోనే కనిపిస్తాయని మంత్రి తెలిపారు. ిమాండ్ సత్వరం పెరిగేందుకు, దేశీయంగా తయారీకి బూస్ట్నిచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను జీఎస్టీ మండలి సమావేశంలో పరిశీలించనున్నట్లు వివరించారు. ‘ఎవరైనా సరే, సరైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలంటే మనం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. కానీ, మనపై వివక్ష చూపేందుకు ప్రయతి్నస్తే మాత్రం.. ఆత్మ విశ్వాసం, ఆత్మగౌరవం గల 40 కోట్ల మంది భారతీయులు ఎట్టి పరిస్థితుల్లోనూ తలొగ్గరు.. బలహీనపడరు. అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతాం. కొత్త మార్కెట్లను అందిపుచ్చుకుంటాం. గతేడాది కన్నా ఈసారి మన ఎగుమతులు మరింతగా పెరుగుతాయని ధీమాగా చెబుతున్నాను‘ అని మంత్రి తెలిపారు. దిగుమతుల ఆధారిత దేశమైన భారత్ గతంలో కోవిడ్–19 మహమ్మారి, అణ్వాయుధపరమైన ఆంక్షలులాంటి ఎన్నో సవాళ్లను అధిగమించిందని చెప్పారు. ప్రత్యామ్నాయ మార్కెట్లపై దృష్టి.. ప్రత్యామ్నాయ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతున్నామని మంత్రి వివరించారు. భారీ సుంకాలతో అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశి్చతులను అధిగమించడంలో ఎగుమతిదార్లకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని గోయల్ చెప్పారు. ఆస్ట్రేలియాతో ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయని, భారతీయ వ్యాపార సంస్థలు, వర్కర్లు, నిపుణులు వీటిని అందిపుచ్చుకోవాలని సూచించారు. -
భారత్–రష్యా క్రూడ్ బంధం!
భారత్ పాలిట వరంలా మారిన రష్యా చమురు అంతర్జాతీయంగా సెగలు పుట్టిస్తోంది. రష్యా చమురుతో ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ పరోక్షంగా ఆజ్యం పోస్తోందంటూ అమెరికా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఈ సాకుతో మరో 25 శాతం అదనపు సుంకాలను కూడా వడ్డించింది. మరి నిజంగా ఈ చౌక క్రూడ్తో భారతీయ వినియోగదారులు లాభపడుతున్నారా? అంటే సమాధానం కాదనే వస్తోంది. ప్రైవేటు రిఫైనరీ కంపెనీలకు మాత్రం లాభాల పంట పండుతోంది. ఇదే అమెరికా, భారత్ మధ్య ఇప్పుడు ‘క్రూడ్’ యుద్ధానికి దారితీస్తోంది!! రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా దేశీయ ప్రవేటు రంగ రీఫైనలరీ దక్కించుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్తో సహా అనేక దేశాలు ఆంక్షలు, నిషేధం విధించడంతో రష్యా చమురుపై ’మాస్కో రాయితీ’ ప్రకటించింది. ఈ క్రమంలో చమురు దిగుమతి బిల్లు తగ్గించుకునేందుకు భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది. 2002 వరకు కేవలం 1 శాతంగా ఉన్న రష్యా చమురు దిగుమతులు 2025 ఆగస్టు చివరి నాటికి గణనీయంగా 37 శాతానికి చేరుకుంది. గత నాలుగేళ్లుగా భారత్ సగటున రోజుకు 1.5 మిలియన్ బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంటోది. ఇందులో 40 శాతానికి పైగా ప్రయివేటు రంగ రిఫైనరీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, నయరా ఎనర్జీల సొంతం కావడం విశేషం! మిగులు లాభాలన్నీ ప్రయివేటు రిఫైనరీలకే.... రష్యా దిగుమతుల్లో అధిక వాటా పొందుతున్న ప్రయివేటు రిఫైనరీలు చమురు శుద్ధి చేసి ఉత్పత్తులను యూరప్, ఆసియా దేశాలకు భారీగా ఎగుమతి చేసి గణనీయంగా లాభాలు గడించాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడో ఏడాదిలో జీ7+ దేశాలు భారత్, టరీ్కలోని ఆరు రిఫైనరీలు నుంచి 18 బిలియన్ డాలర్లు (21 బిలియన్ డాలర్ల) విలువైన చమురు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాయని ఫిన్లాండ్కు చెందిన సీఆర్ఈఏ థింక్ట్యాంక్ నివేదిక తెలిపింది. ఇందులో దాదాపు 9 బిలియన్ యూరో ఉత్పత్తులు రష్యా ముడి చమురుతో శుద్ధి చేసినవేనని సీఆర్ఆఏ పేర్కొంది. ఈ ఆరు రిఫైనరీలలో రిలయన్స్ చెందిన జామ్నగర్ శుద్ధి కార్మాగారం అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడి నుంచి జీ7+ దేశాలకు ఎగుమతి అయిన 12 బిలియన్ యూరోల్లో 4 బిలియన్ యూరోలకు పైగా రష్యా చమురుతోనే ఉత్పత్తి చేసినవని సీఆర్ఈఏ వివరించింది. ఈ జాబితాలో ప్రభుత్వరంగ ఓఎన్జీసీ మంగళూరు రిఫైనరీ నాలుగో స్థానంలో, నయరా ఎనర్జీ వడినార్ రిఫైనరీ ఆరోస్థానంలో ఉన్నాయి. దీనికి తోడు ‘భారత్లో వ్యాపార కంపెనీలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను (దాదాపు రూ.1.35 లక్షల కోట్లు) పొందాయి’ అంటూ అమెరికా ఆరి్థక మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలు ’రష్యా చౌక చమురు దిగుమతి లాభాల్లో అధిక వాటా ప్రైవేటు కంపెనీలు దక్కించుకుంటున్నాయి’ అనే వాదనలను మరింత బలపరిచాయి. ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయంభారత్కు ఇంధన ఎగుమతులతో వేల కోట్ల ఆదాయం సమకూరుతోందని కస్టమ్స్ గణాంకాలు చెబుతున్నాయి. 2023–24లో 84.1 బిలియన్ డాలర్లు, 2024–25లో 63.3 బిలియన్ల డాలర్లు పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు జరిగాయి. ఇదే ఆరి్థక సంవత్సరంలో 24 బిలియన్ డాలర్లు డిజిల్ ఎగుమతులు, 15 బిలియన్ డాలర్ల జెట్ ఫ్యూయల్ ఎగుమతులు జరిగాయి. రష్యా ఉరల్స్ క్రూడ్ నుంచి నాణ్యమైన డీజిల్, జెట్ ఫ్యూయెల్ వంటి రవాణా ఇంధనాలు ఎక్కువగా తయారవుతున్నాయి. 2024–25లో 15.5 బిలియన్ డాలర్ల గ్యాసోలిన్, ఇతర చమురు ఉత్పతుల ఎగుమతులు జరగడం గమనార్హం.ఎగుమతుల్లో రిలయన్స్ టాప్ ఈ ఏడాది భారత ఇంధన దిగుమతుల్లో వాల్యూమ్ పరంగా రిలయన్స్, నయారా ఎనర్జీలు రెండింటి వాటా 81 శాతంగా ఉన్నాయి. ఎగుమతుల్లో అధిక భాగం డిజిల్, జెట్ ఫ్యూయెల్ ఉన్నాయి. రోజుకు 9.14 లక్షల బ్యారెళ్ల ఎగుమతితో 71 శాతం వాటా రిలయన్స్దే. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ జూన్లో రోజుకు 7.46 లక్షల బ్యారెళ్ల రష్యా చమురు దిగుమతి చేసుకుంది. ఇక్కడి నుంచి తన మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 1.36 మిలియర్ల బీపీడీలో 67 శాతం ఎగుమతి చేసింది. మిగిలిన ఇంధన ఎగుమతుల్లో రోజుకు 1.18 లక్షల బ్యారెళ్లతో నయరా ఎనర్జీ, ఓఎన్జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ రోజుకు 1.14 లక్షల బ్యారెళ్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.పరోక్ష సబ్సీడీలతో పీఎస్యూల లాభాలకు గండి ప్రభుత్వరంగ రిఫైనరీ రష్యా చౌక చమురు మిగులు లాభాలకు కేంద్ర ప్రభుత్వ ‘స్థిర ఇంధన ధరల విధానం’ చిల్లుపెడుతోంది. రష్యా ఆయిల్ ఇప్పటికీ బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ కంటే 2–3 డాలర్లు, యూఈఏ బ్యారెల్ క్రూడాయిల్ కంటే 5–6 డాలర్ల డిస్కౌంట్ ధరకే లభిస్తుంది. సాధారణంగా ఇది రీఫైనరీ సంస్థలకు దండిగా లాభాలను తెచ్చిపెడుతోంది. అయితే ప్రభుత్వ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లు రష్యా చమురు కొనుగోలు మిగులు లాభాలను పెట్రోల్, డిజిల్, ఎల్పీజీ తదితర పరోక్ష సబ్సీడీలకు వినియోగిస్తున్నాయి. గల్ఫ్, అమెరికా క్రూడాయిల్ ధరలతో పోలిస్తే, 2022 జనవరి నుండి 2025 జూన్ వరకు రష్యా డిస్కౌంట్ ధరలతో ముడి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ దాదాపు 15 బిలియన్ డాలర్లు ఆదా చేసిందని పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 2023లో రష్యా రికార్డు స్థాయి డిస్కౌంట్తో భారత్ దాదాపు 7 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేసింది. ఈ మొత్తంలో సింహభాగం రిలయన్స్, నయారా కంపెనీలకే దక్కింది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ట్రంప్ ‘నోబెల్’ ఆశలపై నీళ్లు చల్లిన భారత్!!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం చేస్తున్న నిర్విరామ ప్రయత్నాలపై భారత్ నీళ్లు చల్లిందా? ఆ కోపంతోనే భారత్పై అత్యధిక సుంకాలు విధిస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదికలు. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న కుట్ర వెలుగులోకి వచ్చింది. ట్రంప్ తన వ్యక్తిగత స్వార్ధం కోసమే భారత్పై టారిఫ్లు విధిస్తున్నారని,ఇందులో దేశ ప్రయోజనాలే లేవంటూ అమెరికా ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ జెఫరీస్ ఓ నివేదికను విడుదల చేసింది.ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్-పాక్ల మధ్య ఘర్షణను ఆపేందుకు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించారు. అందుకు భారత్ ఒప్పుకోలేదు. ఫలితంగా తనకు దక్కాల్సిన నోబెల్ ఫ్రైజ్ భారత్ వల్లే దూరమైందన్న అక్కుసతో ఈ టారిఫ్లు విధించినట్లు జెఫరీస్ తన నివేదికలో హైలెట్ చేసింది.భారత్పై ట్రంప్కు వ్యక్తిగత కోపం ఉంది. కాబట్టే ప్రపంచంలోనే భారత్పై అత్యధికంగా 50శాతం సుంకాలు విధించినట్లు జెఫరీస్ నివేదిక పేర్కొంది. తద్వారా దీర్ఘకాలంగా అమెరికా-భారత్ల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబంధాలు విచ్ఛిన్నమయ్యాయనే అభిప్రాయ వ్యక్తం చేసింది. భారత్-పాక్ల మధ్య ఘర్షణ వాతావరణాన్ని పూర్తిస్థాయిలో తగ్గించేలా మధ్యవర్తిత్వం వహిస్తానన్న ట్రంప్ ముందుకు రాగా.. అందుకు భారత్ ఒప్పు కోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ట్రంప్ భారత్పై సుంకాలు విధిస్తున్న విషయాన్ని వెల్లడించింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడ చిన్న ఘర్షణ జరిగినా.. అక్కడ వాలిపోయి పంచాయితీలు చేస్తున్నారు.తనని తాను ప్రపంచానికి శాంతి దూతగా ప్రచారం చేసుకుంటున్నారు. అదే సమయంలో తన శత్రువు బరాక్ ఒబామా.. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తొమ్మిది నెలల్లోనే నోబెల్ శాంతి బహుమతి అందుకోగా లేనిది తన విషయంలో ఎందుకు సాధ్యం కాదని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. -
రూపాయిని గట్టి దెబ్బ కొట్టిన టారిఫ్లు.. ఆల్టైమ్ పతనం
భారత కరెన్సీ రూపాయి విలువపై అమెరికా టారిఫ్ల దెబ్బ గట్టిగా తగిలింది. భారత వస్తువులపై అమెరికా సుంకాల పెంపుపై ఇన్వెస్టర్ల ఆందోళనలతో శుక్రవారం డాలర్ తో పోలిస్తే భారత రూపాయి రికార్డు స్థాయిలో 87.9650కు పడిపోయింది. భారత్ నుంచి వచ్చే వస్తువులపై ఇటీవల 25% సుంకాన్ని విధించిన అమెరికా ప్రభుత్వం ఆ మొత్తాన్ని 50% కు రెట్టింపు చేసింది. ఇది మార్కెట్ ప్రతిస్పందనను తీవ్రంగా ప్రేరేపించింది.టారిఫ్ల పెంపు ప్రభావం డాలర్- రూపాయి మారక విలువ క్షీణత వరకు ఆగిపోలేదు. ఇతర దేశాల కరెన్సీతో ఇండియన్ రూపాయి మారక విలువ పడిపోయింది. ఆఫ్షోర్ చైనీస్ యువాన్తో పోలిస్తే, రూపాయి విలువ మరింత క్షీణించి, 12.3307 ను తాకింది. ఇది వారంలోనే 1.2%, నెలలో 1.6% క్షీణతను సూచిస్తుంది. గత నాలుగు నెలలుగా రూపాయి మారకం విలువ యువాన్ తో పోలిస్తే దాదాపు 6 శాతం క్షీణించింది.డాలర్తో పోలిస్తే భారతీయ రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా 87.9650కి పడిపోవడం అమెరికా టారిఫ్ల ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. డాలతో రూపాయి మారక విలువ ఏడాది కాలంలో 4.24% పడిపోయింది. అమెరికా విధించిన భారీ టారిఫ్ల వల్ల పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగడమే దీనికి కారణంగా తెలుస్తోంది. -
అధ్యక్ష బాధ్యతలకు సిద్ధం: వాన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా భయంకరమైన విషాదం జరిగితే అమెరికా కమాండర్–ఇన్–చీఫ్గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అయితే.. ట్రంప్ తన నాలుగు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేసేంత ఆరోగ్యంగా ఉన్నారని ఆయన స్పష్టంచేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇంటర్వ్యూలో వాన్స్ మాట్లాడుతూ.. జనవరిలో మొదటిసారి ఓవల్ ఆఫీసులో అడుగు పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఆ గొప్పతనం, అద్భుతమైన చరిత్ర చూసి ముగ్ధుడినయ్యాను. అది నిజంగా అద్భుతమైన అనుభవం. అది శీతాకాలం. కర్టెన్లు మూసి ఉండటంతో చాలా చీకటిగా కనిపించింది. ప్రపంచ నాయకుడు పనిచేసే ప్రదేశం ఇలాగే ఉండకూడదు. అది కొంచెం వెలుగుతో, ఉత్సాహంగా ఉండాలనుకున్నా. ఆ తరువాత అధ్యక్షుడు చేసిన మార్పులు నాకు చాలా నచ్చాయి. JUST IN—VP JD Vance said he is prepared to step in if “a terrible tragedy” were to befall Trump, while emphasizing that Trump is “in incredibly good health” and brimming with “incredible energy.” Trump is sicker than we thought. pic.twitter.com/fX9uiauvtp— ADAM (@AdameMedia) August 28, 2025 వైట్హౌస్ను పునరుద్ధరించడంలో ట్రంప్ విలక్షణమైన శైలి నాకు బాగా నచ్చింది’ అని ప్రశంసించారు. అనంతరం 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యం గురించి ఆందోళనలను ప్రస్తావించగా.. ‘ఆయన మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయనకు అద్భుతమైన శక్తి ఉంది. ఆయనతో పనిచేస్తున్నవారు చాలామంది ఆయనకంటే చిన్న వయసువాళ్లే. అయినా వారందరికంటే చివరిగా నిద్రపోయేది, మొదటగా నిద్ర లేచేది ట్రంపే. ఆయన మిగిలిన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారన్న నమ్మకం నాకుంది. అమెరికన్ ప్రజలకోసం ఆయన ఇంకా ఎన్నో గొప్ప పనులు చేస్తారు’ అని వాన్స్ వ్యాఖ్యానించారు. పెద్ద విషాదం ఏదైనా జరిగి, అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని వాన్స్ స్పష్టం చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్తో జరిగిన సమావేశంలో ట్రంప్ చేతికి పెద్ద గాయం కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తాయి. 78 సంవత్సరాల ఏడు నెలల వయసులో ఈ ఏడాది జనవరిలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. అమెరికా చరిత్రలో ట్రంప్ అత్యంత పెద్ద వయస్కుడైన అధ్యక్షుడాయన. అంతకుముందు అధ్యక్షుడు జో బైడెన్ 2021లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాల రెండు నెలలు. ఇక, ఈ నెల ప్రారంభంలో ట్రంప్ మాట్లాడుతూ వాన్స్ను తన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఉద్యమానికి వారసుడిగా చెప్పుకొచ్చారు. కానీ వాన్స్ మాత్రం 2028 అధ్యక్ష ఎన్నికల ప్రణాళికల గురించి ఊహాగానాలను తోసిపుచ్చుతూనే ఉన్నారు. -
విద్యార్థి వీసా నాలుగేళ్లే!
వాషింగ్టన్: అమెరికాలో వీసాల గడువును పరిమితం చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది. దుర్వినియోగాన్ని తగ్గించడానికి, పర్యవేక్షణను మరింత కఠినతరం చేయడానికంటూ బుధవారం కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. అంతర్జాతీయ విద్యార్థులకు ఇచ్చే ఎఫ్–వీసాలు, కల్చరల్ ఎక్ఛ్సేంజ్ కోసం ఇచ్చే జే–వీసాలు, విదేశీ జర్నలిస్టులకు ఇచ్చే ఐ–వీసాలపై కాలపరిమితి విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు విద్యార్థి వీసాలపై ఎలాంటి కాలపరిమితి లేదు. వాళ్లు చదివే కోర్సు ఎన్ని సంవత్సరాలున్నా అంతకాలం వారు ఆ దేశంలో ఉండే అవకాశం ఉంది. అయితే, కొత్త ప్రతిపాదన ప్రకారం విద్యార్థి, ఎక్ఛ్సేంజ్ వీసాలకు నాలుగేళ్ల కాలపరిమితి మాత్రమే ఉంటుంది. ఆ గడువు ముగిశాక పొడిగింపు కోసం దర ఖాస్తు చేసుకోవాలి. ఇక జర్నలిస్టులకు 240 రోజు లు మాత్రమే అనుమతిస్తారు. ఇక చైనీయులకైతే కేవలం 90 రోజుల వీసాకు మాత్రమే అనుమతిస్తారు. గత ఏడాది 16 లక్షల మంది విదేశీ విద్యార్థులు 2024లో ఎఫ్–వీసాలపై దాదాపు 16 లక్షల మంది అంతర్జాతీయ విద్యార్థులు అమెరికా వచ్చారు. అలాగే, దాదాపు 3,55,000 మంది కల్చరల్ ఎక్ఛ్సేంజ్ సందర్శకులు, 13వేల మంది జర్నలిస్టులు అమెరికాకు వచ్చారు. ‘విదేశీ విద్యార్థులు, ఇతర వీసా హోల్డర్లు అమెరికాలో నిరవధికంగా ఉండటానికి చాలాకాలంగా అనుమతి ఉంది. దీనివల్ల భద్రతా ప్రమాదాలు తలెత్తుతున్నాయి. పన్ను చెల్లింపుదారుల డబ్బు వృథాగా ఖర్చవుతోంది. అమెరికా పౌరులకు ఇది నష్టాన్ని కలిగిస్తోంది. ఈ ప్రతిపాదిత కొత్త నిబంధనలు వీసా హోల్డర్లు అమెరికాలో ఉండే సమయాన్ని పరిమితం చేస్తాయి. దుర్వినియోగం ఆగిపోతుంది. విదేశీ విద్యార్థులను పర్యవేక్షించడానికి ప్రభుత్వంపై భారం తగ్గుతుంది’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే దీనిపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు ఉంటుంది. అప్పట్లో పెద్దఎత్తున వ్యతిరేకత డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలం 2020లో కూడా ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 4,300కి పైగా సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న అంతర్జాతీయ విద్యావేత్తల సమూహమైన ఎన్ఏఎఫ్ఎస్ఏ దీనిని తీవ్రంగా వ్యతిరేకించింది. దానిని విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే.. బైడెన్ ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై అణచివేత తీవ్రం చేసిన విషయం తెలిసిందే. ఆ చర్యల్లో భాగంగానే ఈ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఇప్పటికే వేలాది మంది విద్యార్థి వీసాలు, గ్రీన్ కార్డులు రద్దయ్యాయి. లక్షలాది మంది వలసదారుల చట్టపరమైన హోదా కోల్పోయారు. -
సుంకాలపై ‘సమష్టి’ పోరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అన్నంత పనీ చేశారు. మన దేశంపై ఉన్న అదనపు సుంకాల భారాన్ని 50 శాతానికి తీసుకెళ్లారు. ఇప్పటికే ఉన్న 25 శాతం సుంకాలకూ బుధ వారం నుంచి మరో 25 శాతం చేరింది. క్షణానికో రకంగా, రోజుకో విధంగా ప్రవర్తిస్తూ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకోవటంలో సిద్ధహస్తుడైన ట్రంప్ చివరికి ఏం చేస్తారోనన్న ఉత్కంఠ అందరిలో ఉండేది. మూర్ఖత్వం విచక్షణను ఎరుగదు. తన ఆదేశాలను ధిక్క రిస్తూ రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయటం వల్లే ఈ చర్య తీసుకున్నట్టు అమెరికా చెప్పుకొంటోంది. మనల్ని మించి ముడిచమురు కొంటున్న చైనాకు ఆ తర్కం ఎందుకు వర్తించదో ఇంతవరకూ అది సంజాయిషీ ఇవ్వలేకపోయింది. అసలు రష్యా– ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపే శక్తి అమెరికాకు తప్ప మరెవరికీ లేదు. ఎందుకంటే తెరవెనకుండి యూరప్ దేశాల ద్వారా ఉక్రెయిన్ను రష్యాపై ఉసిగొల్పిందీ, ఆ యుద్ధానికి అంకు రార్పణ చేసిందీ తానే. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించటం ద్వారా... లేక ఇక వెనక్కు తగ్గాలని ఉక్రెయిన్ను కోరటం ద్వారా శాంతికి దోహదపడాల్సింది కూడా తానే. కానీ ఆ పని చేయకపోగా ఆ యుద్ధం కొనసాగటానికి మనమే బాధ్యులమంటూ దబాయిస్తోంది. దాన్ని ‘మోదీ యుద్ధం’గా అభివర్ణిస్తూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవరో నోరు పారేసుకున్నారు. మనం చమురు కొనటం వల్లే రష్యా యుద్ధం కొనసాగుతోందని తప్పుడు భాష్యానికి దిగారు. ఏ రకంగా చూసినా ప్రపంచంలో సకల అవలక్షణాలకూ బాధ్యత వహించక తప్పని అమెరికాయే రష్యా– ఉక్రెయిన్ యుద్ధానికి కూడా కర్త, కర్మ, క్రియ. ఏకకాలంలో భిన్న సూచనల్ని పంపి అవతలి పక్షాన్ని గందరగోళపరచటం అమెరికాకు అలవాటైన విద్య. ఈ దబాయింపులకు ముందురోజే ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ‘చివరకు రెండు దేశాలూ ఒక్కటవుతాయి’ అని మాట్లాడారు. అందరికన్నా ముందు ఏప్రిల్లోనే వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మొదలెట్టిన భారత్... మే 1 లేదా జూన్ 1 కల్లా దానిపై సంతకాలు చేయాల్సిందని ఆయన చెబుతున్నారు. చర్చించు కుని ఒప్పందంపై సంతకాలు చేస్తారు తప్ప, తమకు నచ్చినట్టు రాసుకుని, ఒప్పందం పూర్తయినట్టేనని చెబితే అంగీకరించేదెవరు? ఇలాంటివి మాఫియా సామ్రాజ్యాల్లో చెల్లుబాటవుతాయి. నాగరిక ప్రపంచంలో సాధ్యపడదు. భారత్–అమెరికా సంబంధాలు ఆదినుంచీ సంక్లిష్టమైనవే. ఇందుకు అమెరికా తనను తానే నిందించుకోవాలి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాకిస్తాన్కు సాయపడుతూ, మనల్ని చీకాకు పరిచేందుకు నిరంతరం ప్రయత్నించేది. ఆ దశ దాటి ఇరు దేశాల మధ్యా స్నేహం చిగురించి, దృఢమైన బంధంగా మారి దశాబ్దాలు దాటుతోంది. కానీ పాకిస్తాన్ను దువ్వటం ఆపలేదు. ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా మన దేశం డిమాండ్ చేస్తే తాత్కాలికంగా ఆర్థిక సాయం ఆపటం లేదా ఆయుధ సామగ్రి ఎగుమతి నిలిపినట్టు కనబడటం, ఆ తర్వాత పునరుద్ధరించటం అమెరికా దురలవాటు. మొన్నటికి మొన్న పెహల్గాంలో ఉగ్రవాదుల దుశ్చర్యపై ఒక్క మాట మాట్లాడటానికి నోరు పెగలని ట్రంప్, భారత్–పాక్ ఘర్షణల్ని ఆపానని స్వోత్కర్షకు పోవటం ఇప్పటికీ ఆపలేదు. సరిగదా పాక్ ఆర్మీ చీఫ్కు ఘన ంగా మర్యాదలు చేశారు. కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సు నుంచి రావాలన్న ఆహ్వానాన్ని మోదీ తిరస్కరించటం, తమ డెయిరీ ఉత్పత్తులనూ, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులనూ అనుమతించాలన్న ఒత్తిడికి అంగీకరించకపోవటం ట్రంప్ కడుపుమంటకు కారణం. కానీ ముడిచమురు సాకు చెబుతున్నారు. భారత్లో 46 శాతం మంది సాగు రంగంపై ఆధారపడతారు. అమెరికాలో ఇది ఒక్క శాతమే. ఆ ఒక్కశాతం కోసం దేశ జనాభాలో సగంమంది ఆధారపడే రంగాన్ని ధ్వంసం చేయాలట! ఏమైతేనేం తాజా సుంకాల భారం మన దేశంనుంచి పోయే 66 శాతం ఎగుమతులపై తీవ్ర ప్రభావమే చూపగలదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందువల్ల ఈ ఏడాది, వచ్చే ఏడాది మన వృద్ధిపై 0.8 శాతం కోత పడవచ్చంటున్నారు. రత్నాభర ణాలు, దుస్తులు, వాహనాల విడిభాగాలు, స్టీల్, రొయ్యలు, తోలు ఉత్పత్తులు వగైరాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందనీ, ఈ రంగాల్లో అనిశ్చితి ఏర్పడుతుందనీ అంచనా. లక్షలాదిమంది కార్మికుల ఉద్యోగాలకు ముప్పు కలగవచ్చు కూడా. ఈ ఎగుమతుల్ని వేరే దేశాలకు మళ్లించగలిగితే నష్టాన్ని తగ్గించుకోగలం. అదృష్టవశాత్తూ మనది ఎగుమతుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ కాదు. అందుకే దేశ ప్రజానీకమంతా ఒక్కటై పట్టుదలగా ఇక్కడి ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తే ఈ గండాన్ని గట్టెక్కడం కష్టం కాదు. -
అమెరికా స్కూలులో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు మృతి 17 మందికి గాయాలు
మిన్నియాపొలిస్: అమెరికాలోని మిన్నియాపొలిస్ నగరంలోని ఓ స్కూలులో బుధవారం ఉదయం ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 14 మంది చిన్నారులే కావడం గమనార్హం. అనంతరం ఆగంతకుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడు. గాయపడిన 6–15 ఏళ్ల మధ్య చిన్నారులకు ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. అనన్సియేషన్ కాథలిక్ చర్చిలో కాల్పులకు పాల్పడిన వ్యక్తిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్మన్గా గుర్తించారు. అతడికి ఎలాంటి నేరచర్రిత లేదని అధికారులు వివరించారు. తుపాకీపై ‘న్యూక్ ఇండియా’ మిన్నియాపొలిస్ కేథలిక్ చర్చి స్కూలులో హంతకుడు కాల్పులకు వాడిన ఒక తుపాకీపై ‘న్యూక్ ఇండియా’అని రాసుంది. వెస్ట్మన్ తన వద్ద ఉన్న ఆయుధాలను చూపుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అతడి చేతిలో ఉన్న తుపాకీల్లో ఒక దానిపై న్యూక్ ఇండియా అనీ, మరో దానిపై మాషా అల్లా అనీ, ‘ మరో గన్పై ఇజ్రాయెల్ ఓడిపోవాల్సిందే’ అని రాసి ఉంది. -
అమెరికా టారిఫ్ బెదిరింపులకు లొంగకూడదు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల బెదిరింపులకు భారత్ తలొగ్గరాదని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్సీ భార్గవ చెప్పారు. ఇలాంటి వాటికి ప్రజలంతా ఐక్యంగా ఎదురు నిలవాలని, దేశ గౌరవాన్ని కాపాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కంపెనీ 44వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా భార్గవ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన అంశాల్లో తొలిసారిగా టారిఫ్లను ప్రయోగించడం ద్వారా సంప్రదాయ విధానాలు, సంబంధాల విషయంలో దేశాలను పునరాలోచనలో పడేశారన్నారు.ఇలాంటి తరుణంలో ప్రభుత్వానికి మద్దతుగా నిల్చి, దేశ పరువు ప్రతిష్టలను కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులపై ఉందని భార్గవ తెలిపారు. అమెరికా మార్కెట్లో మన ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయేలా, ట్రంప్ సర్కారు భారత ఎగుమతులపై సుంకాలను ఏకంగా 50 శాతానికి పెంచేసిన సంగతి తెలిసిందే. మరోవైపు, దేశీయంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో సంస్కరణలు వేగవంతమైన వృద్ధికి, ఉద్యోగాల కల్పనకి దోహదపడుతుందని భార్గవ తెలిపారు. సంస్కరణలతో చిన్న కార్లపై జీఎస్టీ 18%కి తగ్గుతుందని ఆశిస్తున్నామని, అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదే జరిగితే చిన్న కార్ల మార్కెట్ మళ్లీ పుంజుకోగలదని భార్గవ చెప్పారు. స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా చిన్న కార్లు.. దేశ జనాభాలో సింహభాగం ప్రజలు వ్యక్తిగత అవసరాల కోసం అత్యంత రిసు్కలతో కూడుకున్న ద్విచక్ర వాహనాలపైనే ఆధారపడుతుంటారని భార్గవ చెప్పారు. ఈ నేపథ్యంలో స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే చిన్న కార్లను ప్రవేశపెట్టే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. 1950లలో ’కీయి’ కార్లను ప్రవేశపెట్టడం ద్వారా జపాన్ ఇలాంటి సమస్యను పరిష్కరించిందని తెలిపారు. -
టెక్స్టైల్స్కు కష్టకాలం..!
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల కారణంగా అధిక ప్రభావం పడే టెక్స్టైల్స్, వజ్రాల పాలిషింగ్, టైర్ల పరిశ్రమలు ప్రభుత్వం నుంచి విధానపరమైన సాయం కోరుతున్నాయి. ముఖ్యంగా అమెరికా 50 శాతం టారిఫ్లు దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమపై అధిక ప్రభావం చూపించనుంది. మొత్తం టెక్స్టైల్స్ ఎగుమతుల్లో పావు శాతంపై వచ్చే ఆరు నెలల పాటు టారిఫ్ల ప్రభావం ఉంటుందని పరిశ్రమ పేర్కొంది. దేశ వస్త్ర ఎగుమతులకు అమెరికా అతిపెద్ద మార్కెట్గా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. టారిఫ్ల కారణంగా ఆర్డర్లు రద్దు అవుతున్నట్టు తెలిపింది.వచ్చే డిసెంబర్ 31 వరకు సుంకాల్లేకుండా కాటన్ దిగుమతులకు ప్రభుత్వం అనుమతించడం, దేశీ టెక్స్టైల్స్ పరిశ్రమకు ఉపశమనం ఇవ్వనున్నట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ (సీఐటీఐ) సెక్రటరీ జనరల్ చంద్రిమా ఛటర్జీ చెప్పారు. దీనివల్ల వ్యయాలు తగ్గి కొంత పోటీతత్వం లభిస్తుందన్నారు. ‘వచ్చే 6 నెలలు 20–25% టెక్స్టైల్స్ ఎగుమతులపై ప్రభావం పడొచ్చు’ అని చెప్పారు. 50% టారిఫ్లు టెక్స్టైల్స్, వస్త్ర పరిశ్రమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) చైర్మన్ సుదీర్ శక్రి తెలిపారు. 2024–25లో టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమ ఆదా యం 179 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఇందులో ఎగుమతులు 37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 30 శాతం వ్యాపారంపై ప్రభావం: అమెరికా టారిఫ్ల కారణంగా సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ 28–30% మేర (12.5 బిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోవచ్చని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. 2024–25లో దేశ సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం 16 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు తెలిపింది. అమెరికా, చైనాలో డిమాండ్ బలహీనపడడం, ల్యాబ్లో తయారైన కృత్రిమ వజ్రాల నుంచి పోటీతో గత మూడు ఆర్థిక సంవత్సరాల నుంచి దేశీ సహజ వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ ఆదాయం 40% మేర తగ్గినట్టు క్రిసిల్ రేటింగ్స్ వివరించింది. పాలిపౌడ వజ్రాల పరిశ్రమకు 80 శాతం ఆదాయం ఎగుమతుల నుంచే వస్తోందని.. భారత ఎగుమతుల్లో 35 శాతం వాటాతో అమెరికా కీలక మార్కెట్గా ఉన్నట్టు గుర్తు చేసింది.టైరు... బేజారు!భారత టైర్ల పరిశ్రమకు అమెరికా భారీ టారిఫ్లు పెద్ద ప్రతికూలమని ఆటోమొబైల్ టైర్ల తయారీదారుల సంఘం (ఏటీఎంఏ) పేర్కొంది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు కోసం డిమాండ్ చేసింది. అధిక శాతం టైర్ల ఎగుమతులపై 50 శాతం టరిఫ్లు అమలు కానుండగా, కొన్నింటికి 25 శాతం టారిఫ్ వర్తించనుంది. భారత టైర్ల ఎగుమతుల్లో ఒక్క అమెరికా వాటాయే 17% ఉండడం గమనార్హం. 2024–25లో మొత్తం టైర్ల ఎగుమతుల విలువ రూ.25,000 కోట్లుగా ఉంది. -
ఎగుమతిదారులకు అండ!
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్లు విధించడంతో దేశీ ఎగుమతిదారులకు మద్దతుగా నిలించేందుకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. రుణాలపై మారటోరియం (చెల్లింపులపై తాత్కాలిక విరామం), ఎగుమతి ప్రోత్సాహకాలను అందించడంపై దృష్టి సారించినట్టు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తమకు తక్కువ రేట్లపై రుణసాయం అందించాలని ఎగుమతిదారులు ఎప్పటి నుంచో కోరుతుండగా, వారి డిమాండ్లను పరిశీలిస్తున్నట్టు చెప్పా రు.ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందంటూ.. ఈ దిశగా సానుకూల నిర్ణయాలు వెలువడనున్నట్టు ఆ అధికారి చెప్పారు. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, మరిన్ని దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, ఆర్థిక పరమైన మద్దతు చర్యలకుతోడు దేశీ మార్కెట్ విస్తరణ ద్వారా యూఎస్ టారిఫ్ల ప్రభావం అధిగమించేలా చూడనున్నట్టు వివరించారు. ముఖ్యంగా అమెరికా టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉండే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ)ల ఉద్యోగులకు ప్రత్యక్ష నగదు సాయాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ‘ప్రోత్సాహకాలను ఎలా అందించాలన్నది పరిశీలించాల్సి ఉంది. ఇందుకు ఎంత మొత్తం కేటాయించాలి. రుణ హామీ, తనఖా లేని రుణ పరిమితి పెంపును తొలుత ప్రకటించొచ్చు’ అని ఆ అధికారి తెలిపారు. 2025–26 బడ్జెట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.25,000 కోట్లను ఎగుమతి ప్రోత్సాహకాల కింద ప్రకటించింది.రాయితీ రుణాలు..రుణాలపై వడ్డీ రాయితీని తిరిగి ఐదేళ్ల కాలానికి తీసుకురావాలని ఎగుమతిదారులు కోరుతుండడం గమనార్హం. మూలధన అవసరాలకు వీలుగా రుణాల లభ్యతను పెంచడం, ఏడాది పాటు రుణాల అసలు, వడ్డీ చెల్లింపులపై మారటోరియం తదితర సాయాన్ని అందించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సూచనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, టారిఫ్ల కారణంగా ఏర్పడే నష్టం తాత్కాలికమేనని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు.ముఖ్యంగా అమెరికా ఎగుమతులపై ఎక్కువగా ఆధారపడిన రొయ్యలు, టెక్స్టైల్స్, తోలు, రత్నాభరణాల పరిశ్రమల నుంచి ఎక్కువ ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలల్లో అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు 21 శాతం పెరిగి 33.53 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.2024–25లో ఎగుమతులు 86.5 బిలిన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం వస్తు ఎగుమతులు 437 బిలియన్ డాలర్లలో 20% అమెరికాకే వెళ్లాయి. మరోవైపు సవాళ్లతో కూడిన ఈ తరుణంలో ఎగుమతిదారుల ఆందోళనలను పరిష్కరిస్తామంటూ కేంద్ర ఆర్థిక శాఖ హామీ ఇచి్చనట్టు భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ప్రకటించింది. -
కొనసాగిన టారిఫ్ టెన్షన్
ముంబై: అమెరికా విధించిన 50% సుంకాలు అమల్లోకి రావడంతో గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు ఒకశాతం నష్టపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోప్రతికూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండడం సెంటిమెంట్ను మరింత దెబ్బతీశాయి. సెన్సెక్స్ 706 పాయింట్లు నష్టపోయి 80,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 24,501 వద్ద ముగిశాయి. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. బలహీనంగా మొదలైన సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. వినిమయ మినహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.ఒక దశలో సెన్సెక్స్ 774 పాయింట్లు క్షీణించి 80,013 వద్ద, నిఫ్టీ 230 పాయింట్లు కోల్పోయి 24,482 వద్ద ఇంట్రాడే కనిష్టాలు తాకాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 11 పైసలు బలహీనపడి 87.58 వద్ద స్థిరపడింది. టారిఫ్ సంబంధిత అనిశ్చితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.⇒ సూచీల పతనంతో రెండు రోజుల్లో రూ.9.69 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. దీంతో బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.445.17 లక్షల కోట్లకు దిగివచి్చంది. గురువారం ఒక్కరోజే రూ.4 లక్షల కోట్ల మేర సంపద ఆవిరైంది. ⇒ ట్రాన్స్ఫార్మర్ ఉపకరణాల తయారీ సంస్థ మంగళ్ ఎల్రక్టానిక్స్ లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర (రూ.561)తో పోలిస్తే బీఎస్ఈలో అరశాతం డిస్కౌంట్ రూ.558 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 6% క్షీణించింది, చివరికి 4.50% నష్టంతో రూ. 534 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.1,475.31 కోట్లుగా నమోదైంది. -
Alaska F-35 jet crash: గింగిరాలు తిరుగుతూ కుప్పకూలిన ఫైటర్ జెట్
వాషింగ్టన్: అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. అమెరికా ఎయిర్పోర్స్ ఎఫ్-35 కూలింది. ఈదుర్ఘటనకు ముందు ఫైటర్ జెట్లో తలెత్తిన సాంకేతిక కారణంగా ప్రమాదం తప్పించుకునేందుకు పైలెట్ తీవ్రంగా ప్రయత్నించారు. సుమారు 50 నిమిషాల పాటు గాల్లోనే చక్కెర్లు కొడుతూ ప్రమాదం నుంచి తప్పించునేందుకు టెక్నికల్ టీంతో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడారు.అయినప్పటికీ సమస్య మరింత జఠిలం కావడంతో గింగిరాలు తిరుగుతూ దూసుకొచ్చిన పైటర్ జెట్ అలస్కా రన్వేపై కూలింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. JUST IN: F-35 fighter jet crashes at Eielson Air Force Base in Alaska. The pilot survived pic.twitter.com/zEuPNY8jqk— BNO News (@BNONews) January 29, 2025సీఎన్ఎన్ ప్రకారం.. జెట్ ముక్కు భాగం, మెయిన్ ల్యాండింగ్ గేర్ల హైడ్రాలిక్ లైన్లలో మంచు ఏర్పడింది. ఫలితంగా గేర్ల పనితీరు మందగించింది. టేకాఫ్ అయిన తర్వాత, సాధారణంగా ల్యాండింగ్ గేర్ (అంటే చక్రాలు) విమానలోకి రిట్రాక్ట్ చేస్తారు.. అంటే లోపలికి మడతపెట్టి దాచేస్తారు. ఇది విమానాన్ని గాలి ప్రవాహానికి తక్కువ ప్రతిఘటన కలిగించేలా చేస్తుంది. కానీ ఈ సందర్భంలో, పైలట్ ల్యాండింగ్ గేర్ను లోపలికి మడతపెట్టే ప్రయత్నం చేశాడు కానీ అది పనిచేయలేదు. ఫలితంగా ఈ ప్రమాదం సంభవించింది. మరోవైపు ఫైటర్ జెట్లో సాంకేతిక లోపం పరిష్కరించేందుకు అమెరికా ప్రభుత్వ డిఫెన్స్, ఏరోస్పేస్ కంపెనీ సంస్థ లాక్హీడ్ మార్టిన్కు చెందిన చెందిన ఐదుగురు ఇంజినీర్లతో ఫ్లైట్లోనే వీడియో కాల్ చేసి, గంటకు పైగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాడు. అనంతరం,రెండు సార్లు ల్యాండింగ్ ప్రయత్నాలు చేసినా ముక్కు గేర్ సరిగా సెట్ కాలేదు. ల్యాండింగ్ గేర్ పూర్తిగా ఫ్రీజ్ కావడంతో, పైలట్ విమానం నుంచి సురక్షితంగా దూకేశాడు.ప్రమాదంపై జరిగిన విచారణలో ముక్కుభాగం కుడి ప్రధాన ల్యాండింగ్ గేర్ల హైడ్రాలిక్ ఫ్లూయిడ్లో మూడో వంతు నీరు ఉన్నట్లు తేలింది. ఇది హైడ్రాలిక్లో సమస్యకు దారి తీసింది. ఇదే బేస్లో తొమ్మిది రోజుల ముందు మరో విమానంలో ఇదే సమస్య తలెత్తింది. కానీ ఆ జెట్ సురక్షితంగా ల్యాండ్ అయింది. -
ఫుడ్ డెలివరికి వెళ్లి కస్టమర్కి ప్రపోజ్ చేశాడు ..కట్చేస్తే..!
ఫుడ్ డెలివరి బాయ్ సాధారణంగా కస్టమర్తో మేడమ్ మీ ఆర్డర్ అని అంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇతడు ఏకంగా ఐ లవ్ యు అన్నాడు. ఆ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆ మహిళా కస్టమర్ కూడా ఐలవ్ యు అని అతడికి రిప్లై ఇవ్వడం కొసమెరుపు. సినిమాల్లో చూపించినట్లుగా తొలిచూపులోనే ప్రేమలో పడటం అన్నట్లుగా ఆ ఒక్క క్షణంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. కట్చేస్తే ఆ తర్వాత ఇద్దరూ..ఇదంతా చైనాలో చోటుచేసుకుంది. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్కు చెందిన 27 ఏళ్ల లియు హావో ఫుడ్ డెలివరీ బాయ్. అమెరికా అలబామా నివాసి హన్నా హారిస్ 2024లో షెన్యాంగ్ కు వెళ్లింది. ఆమె అక్కడ కిండర్ గార్టెన్ టీచర్ గా పనిచేస్తోంది. ఆమెకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లినప్పుడే ఈ వింత ఘటన చోటుచేసుకుంది. హన్నా అతడిని చూడటం అదే తొలిసారి. అయితే ఆ రోజు ఆ ఫుడ్ని మేడపైన రూమ్కి డెలిరీ చేయాల్సి ఉంది. ఆ నిమిత్తం లిప్ట్లో వెళ్తుండగా ప్రమాదవశాత్తు హన్నా కూడా అదే లిఫ్ట్లో ఉండటం జరిగింది. దాంతో అతడు ఆమెను ఎలా పలకరించాలో తోచక హాయ్..!.. ఐలవ్ యు అని పలికరించాడు. ఆ సంబోధనకు విస్తుపోతూ..ఆమె కూడా అనాలోచితంగా ఐ లవ్ యు అని రిప్లై ఇచ్చేసింది. అంతే ఇరువురు ఒక్కసారిగా తెల్లబోయనట్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు కాసేపు. అంతే ఆ క్షణం నుంచి ఇరువురి మధ్య విడదీయరాని ప్రేమ బంధం గాఢంగా అల్లుకుపోయింది. డెలివరీ బ్యాకెండ్ యూప్ సాయంతో ఇరువురు చాట్ చేసుకునేవారు. నిజానికి ఇద్దరికి ఒకరి భాష ఒకరికి సరిగా రాదు, అర్థం కాదు. కానీ భాషా అంతరంతో సంబంధంలేని ప్రేమ వారిని ఒక్కటిగా చేయడమే కాదు, కమ్యునికేషన్ సమస్యకు తావులేకుండానే సాంకేతిక సాయంతో వారి వారి భాషల్లోనే సంభాషించుకోవడం విశేషం. ఈ ఏడాది మార్చిలోనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు కూడా. అంతేగాదు జూన్లో తన బాయ్ఫ్రెండ్ పుట్టినరోజుని జరుపుకుంది హన్నా. ఆమె అతడిని యూఎస్ తీసుకువెళ్లాలని భావిస్తున్నప్పటికీ..లియు మాత్రం తమ భవిష్యత్తును చైనాలోనే ప్లాన్ చేయాలని యోచిస్తున్నాడు. ఈ ఇద్దరు లవ్స్టోరీ నెట్టింట వైరల్గా మారడమే కాదు..మనోడు మాములోడు కాదు అంటూ లియూపై ఫన్నీగా సెటైర్లు వేస్తూ..పోస్టులు పెట్టారు.(చదవండి: స్ట్రెంగ్త్ ట్రైనింగ్తో ఆ అమ్మ లైఫే మారిపోయింది..! బీపీ, షుగర్ మాయం..) -
మిన్నియాపాలిస్ ఘటన: భారత్, ట్రంప్ పేర్లు రాసుకుని..
మిన్నియాపాలిస్ ఘటనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. కాల్పుల తర్వాత రాబిన్ వెస్ట్మన్ (Robin Westman) తనంతట తాను కాల్చుకుని చనిపోయాడు. ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపాడు అనే విషయంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. అయితే అతని గురించి విచారించిన అధికారులకు విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం మిన్నసోటా స్టేట్ మిన్నియాపాలిస్ నగరంలోని ఓ స్కూల్ వద్ద ప్రార్థనల్లో పాల్గొంటున్న విద్యార్థులపై దుండగుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. కాల్పుల కోసం రైఫిల్, షాట్గన్, పిస్టల్.. ఉపయోగించాడు. ఆ వెంటనే తనను తాను కాల్చేసుకున్నాడు. ఈ ఘటనలో 8, 10 ఏళ్ల వయస్సు గల ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. 17 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 14 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే.. దుండగుడి ఆయుధాలపై 'న్యూక్ ఇండియా', ‘కిల్ ట్రంప్’ లాంటి భయానక సందేశాలు రాసి ఉన్నాయి.రాబిన్ వెస్ట్మన్.. 2020లో రాబర్ట్ నుండి రాబిన్గా పేరు మార్చుకుని మహిళగా గుర్తింపు పొందినట్లు లీగల్ డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే ఎఫ్బీఐ డైరెక్టర్ కాష్ పటేల్.. నిందితుడు పురుషుడేనని ధృవీకరించారు. కానీ దర్యాప్తు అధికారులు మాత్రం ట్రాన్స్జెండర్గానే విచారణను కొనసాగిస్తున్నారు. ఇక కాల్పులకు ముందు రాబిన్ డబ్ల్యూ అనే యూట్యూబ్ ఛానెల్లో రెండు వీడియోలు పోస్ట్ చేశారు. అందులో ఆయుధాలు, మ్యాగజైన్లు కనిపించాయి. వాటిపై.. కిల్ డొనాల్డ్ ట్రంప్ నౌ Kill Donald Trump Now, న్యూక్(న్యూక్లియర్ వార్) ఇండియాNuke India, ఇజ్రాయెల్ మస్ట్ ఫాల్Israel must fall, బర్న్ ఇజ్రాయెల్Burn Israel, వేర్ ఈజ్ గాడ్Where is your God?, ఫర్ ది చిల్ట్రన్ For the children అని రాసి ఉంది. అంతేకాదు.. గతంలో కాల్పుల ఘటనలకు పాల్పడిన పలువురు దుండగుల పేర్లు కూడా రాసుకుని చూపించాడు. వాటితో పాటు సిరిలిక్ Cyrillic(రష్యా, బల్గేరియా, సెర్బియా, ఉక్రెయిన్, కజకస్తాన్, కిర్గిజ్ వంటి దేశాల్లో అధికారిక లిపి)లో రాసిన సందేశాలు కనిపించాయి. ఒక వీడియోలో.. ఇది నా కోసం. అవసరమైతే ఉపయోగిస్తాను అని రాబర్ట్ చెబుతున్న దృశ్యం ఉండగా.. మరో దాంట్లో రెండు జర్నల్స్ కనిపిచాయి. అవి కూడా సిరిలిక్ లిపిలోనే ఉన్నాయి. యూట్యూబ్ నుంచి ఆ వీడియోలను డిలీట్ చేయించిన అధికారులు.. ఈ సందేశాలను ఎందుకు రాసుకున్నాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కాల్పుల ఘటనను విద్వేషపూరిత దాడిగా ఎఫ్బీఐ భావిస్తోంది. కేథలిక్స్ను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడమే అతని ధ్యేయంగా కనిపిస్తోందని, దీనిని దేశీయ ఉగ్రవాదంగా పరిగణిస్తూ దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఎలాంటి నేర చరిత్ర లేని వెస్ట్మన్.. అధికారికంగానే తుపాకులను కొనుగోలు చేసినట్లు తేలింది. అతని కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం.యూఎస్ హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్ట్రీ నోయెమ్ ఘటనపై స్పందించారు. ఈ స్థాయి హింస ఊహించలేనిది. ఆయుధాలపై అతను రాసిన రాతలను బట్టి మానసికంగా తీవ్రంగా బాధపడుతున్నాడని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన అమెరికాలో స్కూల్ భద్రతపై తీవ్ర ఆందోళనను కలిగిస్తోందని.. దుండగుడి మానసిక స్థితి, ఆన్లైన్ ప్రేరణలు, ఆయుధాల కొనుగోలు వంటి అంశాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు. మిన్నియాపాలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఒహరా స్పందిస్తూ.. ఇది అమాయక పిల్లలపై ఉద్దేశపూర్వకంగా జరిపిన దాడి.. అమానుషం అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల పట్ల గౌరవ సూచికంగా జాతీయ జెండాను సగం ఎగరేయాలని ఆదేశించారు. ఇక.. తాజా ఘటన ఈ ఏడాది విద్యాసంస్థలపై జరిగిన 146వ స్కూల్ కాల్పుల ఘటన కావడం గమనార్హం. -
‘పరిస్థితులు ఎలా ఉన్నా..’.. సుంకాలపై అమెరికా ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: భారతదేశం పై అమెరికా 50 శాతం సుంకాలు అమలు చేయడంపై ఇండియాలోని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఈ సుంకాల విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని, పరిస్థితులు ఎలా ఉన్నా, తాము కలిసే పనిచేస్తామని పేర్కొన్నారు. సుంకాల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు.భారత్పై విధించిన 50 శాతం సుంకాలను అమెరికా బుధవారం (ఆగస్టు 27) నుంచి వీటిని అమలు చేస్తోంది. రష్యా నుంచి ఇకపై ముడి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా భారత్కు సూచించింది. అయితే భారత్.. అమెరికా మాటను లెక్క చేయలేదు. దీంతో అమెరికా అదనపు సుంకాలతో బెదిరింపులకు దిగింది. సుంకాలు అమలవుతున్న సమయంలో అమెరికా ఆర్థిక మంత్రి సామరస్య పూర్వక వ్యాఖ్యలు చేశారు.అమెరికా విధించిన అదనపు సుంకాల కారణంగా భారత్లోని పలు కంపెనీలు మూతపడతాయని, లక్షల మంది ఉపాధి కోల్పోతారనే వాదన వినిపిస్తోంది. తాజాగా అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ .. పరిస్థితులు ఎలా ఉన్నా సరే అమెరికా, ఇండియా చివరకు కలిసి పని చేస్తాయని పేర్కొనడం గమనార్హం. బెసెంట్ ఓ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య ఇంకా వాణిజ్య ఒప్పందం పూర్తి కాలేదన్నారు. ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైతే.. అమెరికా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమన్నారు. ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు ఎలా ఉన్నా చివరకు అమెరికా, ఇండియా కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు.అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోదీ మధ్య ఉన్నత స్థాయి సంబంధాలన్నాయని, అమెరికా విధించిన సుంకాల మీద చర్చలు జరిపేందుకు భారత్ వెంటనే ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. అయినా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదని, మే, జూన్ నాటికి ఇరు దేశాలు ఓ అభిప్రాయానికి వస్తాయని భావించామన్నారు. అయితే డీల్ ఇంకా పూర్తి కాలేదన్నారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం కారణంగా ఇండియా లాభాలు ఆర్జిస్తున్నదన్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోయిందన్నారు. త్వరలోనే సుంకాల అంశంపై ఒక పరిష్కారం వచ్చే అవకాశం ఉందన్నారు. -
పుతిన్ కాదు.. ఇది ‘మోదీ యుద్ధం’.. భారత్పై అమెరికా అక్కసు
వాషింగ్టన్: భారత్ను టార్గెట్ చేసిన అమెరికా మరోసారి మన దేశంపై తన అక్కసును వెళ్లగక్కింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగడానికి భారత్ ప్రధాన కారణం అంటూ వైట్హౌస్ సలహాదారు పీటర్ నవారో సంచలన ఆరోపణలు గుప్పించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని ‘మోదీ యుద్ధం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో అమెరికా సుంకాల నుంచి భారత్ తప్పించుకోవాలంటే రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం వెంటనే ఆపేయాలని సూచనలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.వైట్హౌస్ సలహాదారు పీటర్ నవారో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగేందుకు భారత్ ప్రధాన కారణం. రష్యా నుంచి రాయితీపై భారత్ ముడిచమురు కొనుగోలు చేయడంతో యుద్ధంలో పుతిన్ దూకుడుగా వ్యవహరించారు. భారత్ అలా కొనుగోలు చేయకపోతే యుద్ధం ఇంత కాలం కొనసాగేది కాదు. ఇది మోదీ యుద్ధం. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ ఆపేయాలి. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్యలకు భారత్ కూడా సహకరించాలి. మోదీ తీరు విచిత్రంగా ఉంది. రష్యా విషయంలో మోదీ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. Trump Adviser Peter Navarro: Everyone in America loses because of India buys oil from Russia. US taxpayers have to send money for Modi’s war in UkraineAnchor (confused): You mean Putin’s war? Navarro: No I mean Modi’s war! pic.twitter.com/HVE8EO7W8g— Shashank Mattoo (@MattooShashank) August 28, 2025ఇరుదేశాల మధ్య ప్రశాంత వాతావరణం నెలకొనాలంటే.. భారత్ కూడా అందుకు సహకరించాల్సి ఉంటుంది. భారత్ చర్యల వల్ల అమెరికా పన్ను చెల్లింపుదారులు నష్టపోవాల్సి వస్తుంది. ఒకవేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును నిలిపివేస్తే.. 25 శాతం సుంకాలను పునరుద్ధరిస్తారా? అని ప్రశ్నించగా.. భారత్ ఆ దిశగా చర్యలు తీసుకున్న తర్వాతి రోజు నుంచే 25శాతం సుంకాలు అమలుచేస్తామని స్పష్టంచేశారు.అంతకుముందు కూడా నవారో భారత్పై సంచలన కామెంట్స్ చేశారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొంటూ భారత్ ‘లాభదాయకమైన పథకం’ నడుపుతోందని ఆరోపించారు. భారత్ను సుంకాల ‘మహారాజు’గా అభివర్ణించారు. భారత్తో అమెరికా వ్యాపారం వల్ల అమెరికన్లపై పడే నికర ప్రభావం ఏంటి?. అమెరికా వ్యాపారాన్ని, అమెరికన్ కార్మికులను ఇది దెబ్బతీస్తుంది. అమెరికా నుంచి పొందుతున్న డబ్బును రష్యన్ చమురు కొనుగోలుకు ఉపయోగిస్తున్నారు. ఆ డబ్బును రష్యా ఆయుధాల తయారీకి వాడి ఉక్రేనియన్లను చంపుతోంది. జరుగుతున్న రక్తపాతంలో తన పాత్రను గుర్తించడానికి భారత్ ఇష్టపడటం లేదు. ప్రస్తుతం భారత్ చేస్తున్నది శాంతిని కోరుకునేలా లేదని, యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. -
ట్రంప్ బిగ్ ఆఫర్.. చైనాకు కొత్త టెన్షన్!
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. చైనా విద్యార్థులకు బంపరాఫర్ ప్రకటించారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో, భారీ సంఖ్యలో చైనా విద్యార్థులు.. అమెరికాకు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. తమ విద్యార్థులపై వేధింపులు మాత్రం ఆపాలని విజ్ఞప్తి చేసింది.కాగా, అక్రమ వలసలు, విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. చైనా విద్యార్థుల విషయంలో మాత్రం సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు ఆరు లక్షల మంది చైనా విద్యార్థులను తమ యూనివర్సిటీల్లో చేర్చుకుంటామని ప్రకటించడంపై చైనా స్పందించింది. ఈ సందర్బంగా చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ మాట్లాడుతూ..‘అమెరికాలో చదువుకునేందుకు చైనా విద్యార్థులకు ఆహ్వానిస్తూ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. చైనా విద్యార్థులను వేధించడం, ప్రశ్నించడం, నిరాధార ఆరోపణలతో స్వదేశానికి పంపించడం వంటి చర్యలను ఆపాలి. తద్వారా వారి చట్టబద్ధమైన హక్కులను రక్షించాలి’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వీసాలు, గ్రీన్కార్డులు, విదేశీ విద్యార్థుల విషయంలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల వీసాల ప్రక్రియను కఠినతరం చేశారు. అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపించేశారు. మరోవైపు.. హెచ్-1బీ వీసాలు, గ్రీన్కార్డుల విషయంలో కూడా కొత్త నిబంధనలను తీసుకురానున్నట్టు అధికారులు తెలిపారు. -
United States: స్కూల్లో కాల్పుల కలకలం.. ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన కలకలం రేపింది.మిన్నెసోటా రాష్ట్రంలోని మినియాపొలిస్లోని ఒక క్యాథలిక్ స్కూలులో జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన వ్యక్తి కూడా మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. Those kids should have had guns to protect himself!!!: At least 2 children killed and 17 people injured in shooting at Minneapolis Catholic school Mass - CNN https://t.co/bDEvTe8Wdo via @GoogleNews— Dror Peled (@dror_peled42643) August 28, 2025ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. వారిలో 14 మంది విద్యార్థులే అని అధికారులు ప్రకటించారు. మినియాపొలిస్ పోలీస్ చీఫ్ బ్రియాన్ ఓహారా వెల్లడించిన వివరాల ప్రకారం విద్యార్థులు ప్రార్థనలు చేస్తున్న సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి. పలు ఆయుధాలతో స్కూలుకు వచ్చిన నిందితుడు కిటికీల గుండా పిల్లలపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. తరువాత అనంతరం ఆ నిందితుడు కూడా మృతిచెందాడని, అతని వయసు 20 ఏళ్లు ఉండవచ్చన్నారు. ఈ సంఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. -
అమెరికా సుంకాలకు ఇండియన్ యూనివర్సిటీ ఝలక్
అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలపై నిరసనగా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) తన క్యాంపస్లో అమెరికా బ్రాండ్ల పానీయాలపై పూర్తిస్థాయి నిషేధం విధించింది. కోకా-కోలా, పెప్సీ వంటి ప్రముఖ బ్రాండ్లు ఇకపై విద్యార్థులకు అందుబాటులో ఉండవు.ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయ ఛాన్సలర్, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు అశోక్ కుమార్ మిట్టల్ ప్రకటించారు. “భారతదేశం అమెరికా ఆర్ధిక బలాయింపు ముందు తలవంచదు. ఇది స్వదేశీ 2.0 ఉద్యమం,” అని ఆయన పేర్కొన్నారు.నిషేధానికి కారణంఅమెరికా ఇటీవల భారత దిగుమతులపై సుంకాలను 50%కి పెంచింది. భారతీయ ఉత్పత్తులపై ఈ చర్యను “ఆర్ధిక దౌర్జన్యం”గా అభివర్ణిస్తూ, మిట్టల్ ఈ నిషేధాన్ని ప్రతిస్పందనగా ప్రకటించారు. “అమెరికా కంపెనీలు భారత మార్కెట్ నుండి సంవత్సరానికి రూ.6.5 లక్షల కోట్లకు పైగా ఆదాయం సంపాదిస్తున్నాయి. ఇది ఒకవైపు లాభాలు, మరోవైపు ఆంక్షలు” అని ఆయన ఓ బహిరంగ లేఖలో అమెరికా అధ్యక్షుడికి రాశారు.ఆందోళలో వ్యాపార వర్గాలుయూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. సామాజిక మాధ్యమాల్లో స్వదేశీ2.0 ( #Swadeshi2.0 ) అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ చర్య పంజాబ్లోని విద్యా సంస్థలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇతర విశ్వవిద్యాలయాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. వ్యాపార వర్గాలు, ముఖ్యంగా బాటిల్డ్ డ్రింక్ డిస్ట్రిబ్యూటర్లు, ఈ నిషేధాన్ని ఆందోళనతో చూస్తున్నారు.If the US goes ahead and imposes 50% tariffs on Indian exports, Lovely Professional University will not sit quietly.Let me remind the US once again - we will ban all American soft drinks on campus, if the US doesn’t withdraw the unfair tariffs by 27th August.I urge every… pic.twitter.com/PhBsVNSJHe— Ashok Kumar Mittal (@DrAshokKMittal) August 24, 2025 -
భారత్పై టారిఫ్ల ఎఫెక్ట్: కంపెనీల దివాళా, లక్షల ఉద్యోగాలు ఉష్కాకి!!
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్లతో సంస్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది. -
అమెరికా వీసా, గ్రీన్కార్డులపై కొత్త రూల్స్.. ట్రంప్ బిగ్ షాక్!
వాష్టింగన్: వీసాలు, గ్రీన్ కార్డ్ విషయంలో అమెరికా మరో బాంబు పేల్చింది. అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ రూల్స్ మొత్తం మార్చబోతున్నట్టు యూఎస్ వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సంచలన ప్రకటన చేశారు. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థ పెద్ద కుంభకోణంగా మారిపోయిందని ఆరోపించారు. దీంతో, ఇకపై అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఊహించిన షాక్ తగిలింది.అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. అమెరికాలో హెచ్-1బీ(H-1B) వీసా, గ్రీన్ కార్డ్ అమలు విషయంలో కొత్త రూల్స్ తీసుకువస్తున్నాం. ప్రస్తుత లాటరీ పద్ధతిని రద్దు చేయబోతున్నాం. కేవలం నైపుణ్యం, వేతనం ఆధారంగా వీసాలు జారీ చేసేలా ప్లాన్ చేస్తున్నాం. ప్రస్తుత H-1B వీసా వ్యవస్థ విదేశీ కార్మికులను అమెరికన్ ఉద్యోగ అవకాశాలను భర్తీ చేయడానికి అనుమతించే ఒక స్కాంగా మారిపోయింది. అమెరికన్ కార్మికులను నియమించడమే మొదటి ప్రాధాన్యతగా ఉండాలి. గ్రీన్ కార్డ్ను సైతం మార్చబోతున్నాం. ప్రస్తుత గ్రీన్ కార్డ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయి.The current H1B visa system is a scam that lets foreign workers fill American job opportunities. Hiring American workers should be the priority of all great American businesses. Now is the time to hire American. pic.twitter.com/l27HEhF7C3— Howard Lutnick (@howardlutnick) August 26, 2025ప్రస్తుతం ఉన్న లాటరీ వ్యవస్థ ద్వారా అర్హత లేని, తక్కువ వేతనం పొందే వ్యక్తులకు కూడా గ్రీన్ కార్డ్ లభిస్తోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. సగటు అమెరికన్ వార్షిక ఆదాయం $75,000 ఉండగా, గ్రీన్ కార్డ్ హోల్డర్ సగటు వార్షిక ఆదాయం $66,000 మాత్రమే ఉంది. ఇది తక్కువ సంపాదన ఉన్న వ్యక్తులను ఎంపిక చేయడమే అవుతుంది అంటూ లాజిక్ చెప్పారు. ట్రంప్ ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా, తాము ఈ కొత్త సంస్కరణలను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో అమెరికాకు వెళ్లాలనుకునే వారిపై కొత్త విధానం ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ మార్పులు భారతీయులపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.🚨 BREAKING: Howard Lutnick reveals he will now seek to have the United States federal government OWN a portion of the patents currently owned by universities as a result of new inventions."If we give them the money, don't you think it's fair the USA and taxpayers who funded it… pic.twitter.com/uFKGdj5rV1— Eric Daugherty (@EricLDaugh) August 26, 2025ఇదిలా ఉండగా.. ఈ కొత్త విధానంలో H-1B వీసాలను ఎక్కువ జీతాలు ఉన్న వారికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. దీంతోపాటు, ట్రంప్ ప్రభుత్వం 'గోల్డ్ కార్డ్' అనే కొత్త వీసా ప్లాన్ కూడా తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ గోల్డ్ కార్డ్ ద్వారా అమెరికాలో $5 మిలియన్లు పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తారు. ఈ కార్డ్కు అప్లై చూసుకోడానికి దాదాపు 2,50,000 మంది దరఖాస్తుదారులు సిద్ధంగా ఉన్నారని, దీని వల్ల $1.25 ట్రిలియన్ల పెట్టుబడులు వస్తాయని లుట్నిక్ తెలిపారు. -
అమెరికాకు ఎగుమతి అయ్యే ఉత్పత్తులపై మరో 25 శాతం టారిఫ్లు నేటి నుంచే అమల్లోకి..
-
అమెరికాలో కొత్తరకం వ్యాధి!
మానవ శరీరంలో మాంసాన్ని తినేసే ప్రమాదకరమైన పరాన్నజీవికి సంబంధించిన తొలి కేసు అమెరికాలో నమోదైంది. మేరీలాండ్లో ఓ వ్యక్తి ఈ నెల 4వ తేదీన దీనిబారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యాధిని న్యూవరల్డ్ స్రూ్కవార్మ్(ఎన్డబ్ల్యూఎస్) మియాసిస్ అని పిలుస్తున్నారు. ఒక జాతికి చెందిన ఈగ(మగ్గోట్స్) లార్వా మనిషి శరీరంలోని కణజాలంలో తిష్టవేసి, క్రమంగా మాంసాన్ని భక్షిస్తుందని అంటున్నారు. ఎల్సాల్వెడార్ దేశం నుంచి వ్యక్తికి వ్యాధి సోకినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్(సీడీసీ) సహకారంతో తొలి కేసును నిర్ధారించినట్లు యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్, హ్యూమన్ సర్విసెస్(హెచ్హెచ్ఎస్) తెలియజేసింది. → ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ అనేది సాధారణంగా పాడి పశువులు, ఇతర జంతువుల్లో కనిపిస్తుంది. దక్షిణ అమెరికాతోపాటు కరీబియన్ దీవుల్లో దీని ఉనికి ఉంటుంది. కానీ, ఇటీవల సెంట్రల్ అమెరికా, మెక్సికోతోపాటు అమెరికాకు సైతం విస్తరించినట్లు నిపుణులు గుర్తించారు. → ప్రధానంగా శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నవారికి ఎన్డబ్ల్యూఎస్ మియాసిస్ సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. దీని ప్రభావానికి గురైన పశువులకు, ప్రాంతాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. → కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ లార్వాలే ఈ స్రూ్కవారŠమ్స్. జంతువుల పుండ్లు, గాయాలపై వాలుతుంటాయి. పుండు భాగంలో లేదా సున్నితమైన కణజాలంపై ఒక ఆడ ఈగ ఒకేసారి 300 వరకు గుడ్లు పెట్టగలదు. → గుడ్ల నుంచి బయటకు వచ్చే లార్వాలు పుండ్ల లోపలికి చొచ్చుకెళ్తాయి. క్రమంగా మాంసాన్ని తినేస్తాయి. తీవ్రమైన నొప్పి కలుగుతుంది. సరైన చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం సంభవిస్తుంది. → లార్వాలు మూడు నుంచి ఐదు రోజుల్లో పుండు నుంచి బయటకు వచ్చి కిందపడిపోతాయి. భూమి కిందిభాగంలోకి చేరుకుంటాయి. ఈగలుగా మారి బయటకు వస్తాయి. గుడ్లు పెట్టడానికి పుండ్లు, గాయాలు ఉన్న జంతువులను వెతుక్కుంటాయి. → కొక్లియోమియా హోమినివోరక్స్ ఈగ జీవితకాలం దాదాపు 30 రోజులు. మొత్తం జీవితకాలంలో 3,000కుపైగా గుడ్లు పెడతాయి. → న్యూవరల్డ్ స్రూ్కవార్మ్ మియాసిస్ వల్ల మనుషులకు ముప్పు తక్కువేనని అమెరికా వైద్యులు చెబుతున్నారు. దేశంలో ఈ ఏడాది జంతువులకు ఈ పరాన్నజీవి సోకలేదు. → ఒకసారి సోకితే ఆ ఉధృతి తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థతో కలిసి పని చేస్తున్నారు. → ఈగలకు సంతాన నిరోధక ఆపరేషన్లు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. టెక్సాస్లో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా ఈగల్లో సంతానాన్ని అరికట్టడానికి ఈగలనే ప్రయోగిస్తారు. స్టెరిలైజ్ చేసిన మగ ఈగలు ఆడ ఈగలతో కలిస్తే.. ఆ ఆడ ఈగల్లో సంతాన సామర్థ్యం క్షీణిస్తుంది. → మనుషులు గాయాలు, పుండ్లు బయటకు కనిపించకుండా జాగ్రత్తపడితే ఈగల బారినపడే అవకాశాలు ఉండవు. గాయాలకు సాధ్యమైనంత త్వరగా చికిత్స తీసుకోవాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
టారిఫ్ వేడిలోనూ డీల్ !
వాషింగ్టన్: ఓవైపు సుంకాల సమరంలో అమెరికాతో పోరాడుతున్న భారత్ మరోవైపు అదే అమెరికాతో రక్షణరంగ ఒప్పందానికి మరో అడుగు ముందుకేసింది. అమెరికాకు చెందిన దిగ్గజ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ జనరల్ ఎలక్ట్రిక్(జీఈ)తో ఏకంగా 1 బిలియన్ డాలర్ల భారీ రక్షణరంగ ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ఒప్పందం ఖరారుకానుంది. తేలికపాటి యుద్ధవిమానం తేజస్ మార్క్ 1లో బిగించాల్సిన జీఈ–404 రకం ఇంజిన్లను కొనుగోలు చేసేం దుకు ఒప్పందం చేసుకుంటున్నారు. 1 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా జీఈ సంస్థ నుంచి భారత్ 113 ఇంజిన్లను కొనుగోలుచేయనుంది. వీటిని మొత్తంగా 97 తేజస్ విమానాల కోసం ఉపయోగించనున్నారు. గతంలో ఇదే తరహాలో 83 తేజస్ విమానాల కోసం 99 జీఈ ఇంజిన్లను కొనుగోలుచేశారు. ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు నేటినుంచి అమల్లోకి వస్తున్న ఇదే సమయంలో ఈ భారీ రక్షణరంగ డీల్ తుదిదశకు చేరుకోవడం గమనార్హం. భారత త్రివిధదళాల రక్షణ అవసరాలు తీర్చేందుకు తేజస్ విమానాలను తయారుచేస్తున్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హాల్)కు ఎలాంటి ఇంజిన్ల సరఫరాలో జాప్యంలేకుండా ఉండేందుకు వేగంగా ఈ డీల్ను తుదిదశకు తీసుకొచి్చనట్లు తెలుస్తోంది. పాతతరం మిగ్–21 వంటి యుద్ధవిమానాలను మూలకు పడేస్తున్న వేళ వాటి స్థానంలో అధునాతన తేజస్లను సైన్యంలోకి తీసుకోవాల్సిన తక్షణావసరం ఏర్పడింది. అందుకే టారిఫ్ల వంటి అంశాల్లో అమెరికాతో విభేదాలు ఉన్నప్పటికీ భారత్ ఈ డీల్ కోసం అమెరికన్ కంపెనీతో వాణిజ్యబంధాన్ని కొనసాగించాల్సి వస్తోంది. 2029– 30కల్లా తొలి దఫాలో 83 తేజస్ విమానాలను అందిస్తానని హాల్ గతంలో హామీ ఇచి్చంది. 2033–34 కల్లా మరో 97 తేజస్ యుద్ధవిమానాలను సరఫరాచేయనుంది. ప్రతి 15 రోజులకు ఒకటి చొప్పున ఇంజిన్ను తయారుచేసి జీఈ సంస్థ భారత్కు సరఫరా చేయనుంది. అయితే జీఈ–414 రకం ఇంజిన్ తయారీలోని 80 శాతం సాంకేతికతను భారత్కు బదిలీచేసే అంశంపై జీఈతో హాల్ చర్చలు జరుపుతోంది. తేజస్ మార్క్2 రకం, అధునాతన మధ్యశ్రేణి యుద్ధ(ఏఎంసీఏ) విమానాల్లో బిగించేందుకు కావాల్సిన జీఈ–414 ఇంజిన్లను కొనుగోలుచేసేందుకు ఏకంగా 1.5 బిలియన్ డాలర్ల మరో ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ ఆశిస్తోంది. జీఈ–414 ఇంజిన్లను 162 తేలికపాటి మార్క్2 విమానాలు, 10 నమూనా ఏఎంసీఏ విమానాలకు అమర్చనున్నారు. మరోవైపు ఫ్రాన్స్కు చెందిన సాఫ్రాన్ కంపెనీతో కలిసి దేశీయంగా యుద్ధవిమాన ఇంజిన్ను తయారుచేసేందుకు భారత్ కృషిచేస్తోంది. -
అదనపు సుంకాల మోత షురూ!
రష్యా నుంచి చమురు కొంటున్నామన్న సాకుతో భారత ఎగుమతులపై అమెరికా ప్రకటించిన 25 శాతం అదనపు సుంకాలు నేటి నుంచే (ఆగస్టు 27) అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే ప్రకటించిన 25 శాతానికి ఇవి అదనం కావడంతో టారిఫ్ల భారం 50 శాతానికి పెరిగినట్లవుతుంది. ఫలితంగా ఎగుమతుల్లో ఏకంగా 66 శాతం వాటాతో, కార్మిక శక్తి అత్యధికంగా ఉండే రొయ్యలు, దుస్తులు, తోలు, రత్నాభరణాల్లాంటి ఎక్స్పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడనుంది.‘అమెరికాలో వినియోగానికి భారత్ నుంచి వచి్చన ఉత్పత్తులపై అదనపు సుంకాలు ఆగస్టు 27 ఈస్టర్న్ డేలైట్ సమయం 12:01 గం.ల నుంచి (భారతీయ కాలమానం ప్రకారం ఆగస్టు 27 ఉదయం 9.31 గం.లు) వర్తిస్తాయి‘ అని అమెరికా ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. దీని వల్ల అమెరికా మార్కెట్లో చాలా మటుకు భారతీయ ఉత్పత్తులకు చోటు లేకుండా పోతుందని ఎగుమతిదార్లు ఆందోళన వ్యక్తం చేశారు. మనకన్నా తక్కువ సుంకాలు వర్తించే బంగ్లాదేశ్, వియత్నాం, శ్రీలంక, కాంబోడియా, ఇండొనేషియా లాంటి దేశాలతో పోటీ పడే పరిస్థితి ఉండదని పేర్కొన్నారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ఉత్పత్తుల్లాంటి 30 శాతం ఎగుమతులకు మాత్రమే ప్రస్తుతం మినహాయింపు ఉంటుంది. అమెరికా వాణిజ్య గణాంకాల ప్రకారం గతేడాది భారత్ నుంచి ఎగుమతులు 91.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, జీఎస్టీ రేట్ల సవరణతో దేశీయంగా వినియోగం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, అమెరికా సుంకాల భారం పడినప్పటికీ భారత్ వృద్ధిపై పెద్దగా ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు తెలిపారు. ఈసారి 49 బిలియన్ డాలర్లకు డౌన్.. టారిఫ్ల భారం వల్ల అమెరికాకు 66 శాతం ఎగుమతులపై (దాదాపు 60.2 బిలియన్ డాలర్ల విలువ) ప్రభావం పడుతుందని మేధావుల సంఘం జీటీఆర్ఐ తెలిపింది. ‘ఇటీవలి కాలంలో భారత్కి తగిలిన అత్యంత తీవ్రమైన వాణిజ్య షాక్లలో ఇదొకటి. 86.5 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతుల్లో మూడింట రెండొంతుల వాటిపై భారీ స్థాయిలో 50 శాతం టారిఫ్లు విధించడం వల్ల టెక్స్టైల్స్, రత్నాభరణాలు, రొయ్యలు, కార్పెట్లు, ఫర్నిచర్ మొదలైన కార్మిక శక్తి ఎక్కువగా ఉండే రంగాలు పోటీని దీటుగా ఎదుర్కోలేని పరిస్థితి ఏర్పడి ఉపాధిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ రంగాల నుంచి ఎగుమతులు 70 శాతం పడిపోయి 18.6 బిలియన్ డాలర్లకు క్షీణించవచ్చు. వేల కొద్దీ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతుంది’ అని జీటీఆర్ఐ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. దీనితో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఎగుమతులు గణనీయంగా 49.6 బిలియన్ డాలర్లకు పడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. ఒకవేళ తర్వాతెప్పుడో టారిఫ్లను సవరించినా.. అప్పటికే ఆలస్యమవుతుందని, చైనా, వియత్నాం, మెక్సికోతో పాటు ఆఖరికి పాకిస్తాన్, నేపాల్లాంటి దేశాలు కూడా మన స్థానాన్ని ఆక్రమించేసే అవకాశం ఉందని శ్రీవాస్తవ పేర్కొన్నారు. తిరుపూర్, సూరత్లో నిల్చిపోయిన ఉత్పత్తి.. సుంకాల పెంపు కారణంగా తిరుపూర్, నోయిడా, సూరత్లోని దుస్తుల తయారీ సంస్థలు ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎగుమతి సంస్థల సమాఖ్య ప్రెసిడెంట్ ఎస్సీ రాల్హన్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం రెడీమేడ్ గార్మెంట్స్ పరిశ్రమ ఆదాయ వృద్ధి సగానికి పడిపోయి 3–5 శాతం స్థాయికి పరిమితం కావొచ్చని క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో కంపెనీలు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లాంటి ఇతరత్రా మార్కెట్ల వైపు చూడాల్సి ఉంటుందని వివరించింది. సిబ్బంది.. ఉత్పత్తి కోత .. అదనపు టారిఫ్ల మోత మొదలవుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (బీటీఏ) స్పష్టత వచ్చే వరకు ఉత్పత్తిని నిలిపివేసి, సిబ్బందిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తోలు, పాదరక్షల పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘మనకు అమెరికానే అతి పెద్ద మార్కెట్ కాబట్టి ఆభరణాలు, వజ్రాల రంగంలో ఉద్యోగాల కోత తప్పదు’ అని రత్నాభరణాల ఎగుమతిదారు ఒకరు తెలిపారు. ఇలాంటి భారీ టారిఫ్లను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక ఎగుమతి వ్యూహం అవసరమని పేర్కొన్నారు. వడ్డీ సబ్సిడీ, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, సకాలంలో జీఎస్టీ బకాయిలను రిఫండ్ చేయడం, ప్రత్యేక ఆర్థిక మండలి చట్టాన్ని సంస్కరించడం తదితర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 10.3 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసే టెక్స్టైల్స్ పరిశ్రమ, టారిఫ్ల మోత వల్ల అత్యధికంగా నష్టపోనుందని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఏఈపీసీ) సెక్రటరీ జనరల్ మిథిలేశ్వర్ ఠాకూర్ తెలిపారు. అనిశ్చితి.. సవాళ్లుకొన్ని ఉత్పత్తుల విషయంలో సగానికి పైగా ఎగుమతులకు అమెరికా గమ్యస్థానంగా ఉంటోంది. దీంతో ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవడం సవాలుగా మారనుంది. ప్రధానంగా సోలార్ మాడ్యూల్స్ ఎక్స్పోర్ట్స్లో 98% అమెరికా వాటా ఏకంగా 98%గా (1.6 బిలియన్ డాలర్లు) ఉంది. బ్రిటన్, యూఏఈ, ఆ్రస్టేలియా లాంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) కుదుర్చుకున్నప్పటికీ ఆ మార్కెట్లు ఇంత భారీ స్థాయిలో ఉత్పత్తులను తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల పెద్దగా ఊరట ఉండకపోవచ్చు. అమెరికాపై అత్యధికంగా ఆధారపడే 1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండే ఉన్ని కార్పెట్లు, బెడ్ లినెన్ ఎగుమతులకూ రిసు్కలు నెలకొన్నాయి. సిమెంటు, ఆరి్టఫిషియల్ స్టోన్స్ 88 శాతం ఎగుమతులకు అమెరికానే గమ్యస్థానంగా ఉంటోంది. రొయ్యల ఎగుమతుల్లో 80 శాతం (సుమారు 420 మిలియన్ డాలర్లు) అగ్రరాజ్యానికే వెళ్తున్నాయి. ప్రత్యామ్నాయ మార్కెట్లపై ఫోకస్.. ఎగుమతుల కోసం అమెరికాపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేని ఉత్పత్తులు కూడా కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం అమెరికాకు ఎగుమతుల్లో వీటి విలువ దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉంటోంది. ఇంద్రనీలం, కెంపులు, న్యూమాటిక్ టైర్లలాంటివి వీటిలో ఉన్నాయి. వీటిని వేరే మార్కెట్ల వైపు మళ్లించే అవకాశం ఉంటుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
టారిఫ్ల మోత వేళ.. కీలక భేటీ
న్యూఢిల్లీ: ఉక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను ఏమాత్రం నిలువరించట్లేదని ఆరోపిస్తూ భారత్పై పన్నుల మోత మోగించిన ట్రంప్ సర్కార్ విధించిన ఆగస్ట్ 27 గడువు ముగుస్తుండటంతో ప్రధానమంత్రి కార్యాలయం నేడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించనుంది. ప్రధానమంత్రి ప్రధానకార్యదర్శి సారథ్యంలో ఈ సమీక్ష సమావేశం జరగనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. భారత్పై అమెరికా ప్రభుత్వం తాజాగా విధించిన 50 శాతం దిగుమతి టారిఫ్ ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమల్లోకిరానుంది. ఈ నేపథ్యంలో ఆయా ఎగుమతి సంస్థల లాభాల్లో కోత పడడం, ఆక్వారంగం, లెదర్, వజ్రాభరణాల ఉత్పత్తుల ఎగుమతిపై టారిఫ్ ప్రతికూల ప్రభావం వంటి కీలక అంశాలపై ఆయా రంగాల ప్రతినిధులు, సంస్థలతో ప్రధాని కార్యాలయం సమాలోచనలు జరపనుందని తెలుస్తోంది. ఇప్పటికే అమెరికాకు తమ ఉత్పత్తులను ఎగుమతిచేసే సంస్థలతో, ఎగుమతి రంగ నిపుణులతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సంప్రదింపులు మొదలెట్టింది. అమల్లోకి వచ్చిన 25 శాతం టారిఫ్ కారణంగా తమ లాభాలు పూర్తిగా తగ్గిపోయాయని, నష్టభయాలను ఎదుర్కొంటున్నామని పలువురు కేంద్ర మంత్రిత్వశాఖ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. 50 శాతం టారిఫ్ అమల్లోకి రావడంతో తక్షణం ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొనే వర్గాలను ఆదుకోవాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఎగుమతిదారులు మాత్రం అత్యయిక రుణపరపతి పథకం ద్వారా మూలధనాన్ని అందించాలని, తద్వారా తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు పంపినట్లు తెలుస్తోంది. అయితే రంగాలవారీగా ఆదుకుంటేనే దీర్ఘకాలిక ప్రయోజనాలు దక్కుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. -
భారత్కు అమెరికా టారిఫ్ నోటీసులు
వాషింగ్టన్: భారత్పై అదనంగా మరో 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా నోటీసు జారీ చేసింది. భారత్ నుండి వచ్చే దిగుమతులపై ఈ అదనపు భారం వర్తిస్తుందని అమెరికా అధికారికంగా బహిరంగ నోటీసు విడుదల చేసింది. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27న అర్ధరాత్రి 12:01 నుండి అమల్లోకి వస్తాయని తెలియజేసింది.అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ)ద్వారా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఈ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుపై ఆగస్టు 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. రష్యన్ ఫెడరేషన్ ప్రభుత్వం అమెరికా విషయంలో చేస్తున్న బెదిరింపులకు ప్రతిస్పందించాలని యూఎస్ ఏజెన్సీలను ఈ ఉత్తర్వులో ఆదేశించారు. దీనిలో భాగంగా భారతదేశంపై కొత్త సుంకాల విధింపును కూడా పేర్కొన్నారు.ఈ నోటీసులో పేర్కొన్న పలు భారతీయ ఉత్పత్తులకు ఈ సుంకాలు వర్తిస్తాయని అమెరికా పేర్కొంది. గడువు ముగిసిన తర్వాత వచ్చే లేదా గిడ్డంగులనుండి బయటకు తీసుకెళ్లే ఏ వస్తువులకైనా ఈ సుంకాలు వర్తిస్తాయని కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ ఒప్పందం కుదరని పక్షంలో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై కూడా అదనపు సుంకాలు విధిస్తామని లేదా మాస్కోపై అదనపు ఆంక్షలు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నోటీసు ద్వారా సంకేతాలిచ్చారు. ఈ విషయంలో పురోగతి సాధించలేని పక్షంలో రాబోయే వారాల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.ఇప్పటివరకు యూఎస్.. చైనాతో సహా రష్యన్ చమురు కొనుగోలుదారులపై ఇలాంటి చర్యలను చేప్టటలేదు. ఈ ఏడాది ఆగస్టులో ట్రంప్ భారత్పై అదనంగా 25 శాతం సుంకాలను విధించారు. భారతదేశం నుండి వచ్చే ఉత్పత్తులపై మొత్తం సుంకాన్ని 50 శాతానికి పెంచారు. న్యూఢిల్లీ.. రష్యా చమురు కొనుగోలును కొనసాగించినందుకు జరిమానాగా అమెరికా ఈ చర్య చేపట్టింది. అయితే భారత్ వీటిని ద్వితీయ సుంకాలని పేర్కొంటూ, వీటిని అన్యాయం, అసమంజసం అని పేర్కొంది. అదే సమయంలో చర్చలలో పురోగతి చోటుచేసుకుంటే పెరిగిన సుంకాల అవసరం కూడా ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చింది.కాగా అహ్మదాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ అమెరికా సంకాలపై స్పందిస్తూ.. వాషింగ్టన్ విధించే ఆర్థిక ఒత్తిడిని లెక్క చేయమని, ఇందుకు ప్రతిగా తమ ప్రభుత్వం ఒక మార్గాన్ని కనుగొంటుందని పేర్కొన్నారు. ఎంత ఒత్తిడి వచ్చినా, దానిని తట్టుకునే శక్తిని పెంచుకుంటూనే ఉంటామని, నేడు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఎంతో శక్తిని పొందుతోందని, దీని వెనుక రెండు దశాబ్దాల కృషి ఉందన్నారు. -
భరిస్తాం.. స్వప్రయోజనాలను పణంగా పెట్టం: ప్రధాని మోదీ
అహ్మదాబాద్: అధిక పన్నుల భారం మోపినా భరిస్తాంగానీ దేశ స్వప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ తెగేసి చెప్పారు. భారతీయ ఉత్పత్తులపై ఆగస్ట్ 27వ తేదీ నుంచి అమెరికా మోపిన 50 శాతం దిగుమతి టారిఫ్ భారంగా మారనున్న నేపథ్యంలో ప్రధాని స్పందించారు. సోమవారం సొంతరాష్ట్రంలో పర్యటన ఆరంభించిన ప్రధాని మోదీ రూ.5,477 కోట్ల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత రెండు కిలోమీటర్ల మేర రోడ్షో నిర్వహించారు. తర్వాత అహ్మదాబాద్లోని నికోల్ ప్రాంతంలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ రైతులు, పశుపోషకులు, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజ నాలే భారత్కు ముఖ్యం. అదనపు టారిఫ్ల పేరిట మాపై పెనుభారం మోపినా భరిస్తాం. అంతేగానీ స్వప్రయోజనాలను పణంగా పెట్టబోం’’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ భారత్పై విదేశీ ప్రభావాన్ని మోదీ ప్రధా నంగా గుర్తు చేశారు. ‘‘ ప్ర పంచ దేశాల్లో నేడు రాజకీ యాలు పూర్తిగా ఆర్థిక ప్రయోజనాల చుట్టూతా తిరుగుతున్నాయి. అయినా సరే నేను మహాత్మా గాంధీజీ చూపిన స్వదేశీ వస్తువు లకు పట్టం కట్టాలనే బాటలోనే పయనిస్తున్నా. అందుకే చిన్నపరిశ్రమలు, కర్షకులు, పశుపోష కులకు నేనొక్కటే చెప్పదల్చు కున్నా. మీ ప్రయోజ నాలే నాకు సర్వోన్నతం. మీ ప్రయోజనాల విష యంలో మా ప్రభుత్వం ఏమాత్రం పట్టు సడలించదు. మాపై ఎంతటి ఒత్తిడి పడినా సరే మేం భరిస్తాం. మీ ప్రయో జనాలకు భంగం కల్గకుండా చూసుకుంటాం’’ అని మోదీ అన్నారు. చక్రధారి, చరఖాధారి బాటలో..‘‘దుష్టశిక్షణ, శిష్టరక్షణ, శక్తిసామర్థ్యాలకు, పరి రక్షణకు మారుపేరైన సుదర్శన చక్రధారి అయిన మోహన్ కృష్ణ భగవానుడు, ఛరఖాధారి అయిన మోహన్ మహాత్మా గాంధీ చూపిన అడుగుజాడల్లో భారత్ పయనిస్తోంది. నూలు వడికే రాట్నం చక్రంతో గాంధీజీ స్వాతంత్రోద్యమాన్ని ఉరకలెత్తించారు. పహల్గాంలో ఉగ్ర ముష్కరుల పాశవిక దాడికి దీటుగా బదులిస్తూ భారత సైనికుల తెగువ, ధైర్య సాహసాలకు దర్పణమే ఆపరేషన్ సిందూర్’’ అని మోదీ అన్నారు.కాంగ్రెస్పై విమర్శల జడి‘‘60 నుంచి 65 ఏళ్లపాటు భారత్ను పాలించిన కాంగ్రెస్ కూడా ‘దిగుమతి స్కామ్’లకు పాల్పడి భారత్ను పరాయి దేశాలపై సరుకుల కోసం ఆధారపడేలా మార్చేసింది. పరాధీనంగా మార్చేసి బాపూజీ కీలక ఉపదేశమైన స్వదేశీ మంత్రాన్ని కాంగ్రెస్ మంటగల్పింది. గాంధీజీ పేరు చెప్పుకుని తిరిగే కాంగ్రెస్ పెద్దలు ఆయన సూచించిన స్వచ్ఛత, స్వదేశీ పదాలను గాలికొదిలేశారు’’ అని మోదీ విమర్శించారు. -
కాల్పుల్లో స్టాండప్ కమెడియన్ మృతి
మిస్సిస్సిప్పి: అమెరికాలోని బాల్టిమోర్కు చెందిన స్టాండప్ కమెడియన్ రెజినాల్డ్ ‘రెగ్గీ’కరోల్(54) మిస్సిస్సిప్పిలో జరిగిన కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. బర్టన్ లేన్ ప్రాంతంలో బుల్లెట్ గాయాలైన రెగ్గీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. కాల్పుల ఘటన బుధవారం జరిగినట్లుగా భావిస్తున్నారు. మోనిక్ వంటి వారితో కలిసి దేశవ్యాప్తంగా ఉన్న కామెడీ క్లబ్బుల్లో ప్రదర్శనలు ఇచ్చిన రెగ్గీ అందరికీ సుపరిచితుడు. -
యూఎస్లో రూ.1 కోటి సంపాదిస్తే ఎంత మిగులుతుంది?
భారతీయ నిపుణులు చాలామంది, ముఖ్యంగా టెక్ పరిశ్రమలో సర్వీసులు అందిస్తున్నారు. అమెరికాలో పనిచేయాలని కలలు కంటారు. అందుకు ప్రధాన కారణం అక్కడ వేతనాలు ఎక్కువగా ఉంటాయి. లైఫ్స్టైల్ మెరుగ్గా ఉంటుందనే భావన ఉంది. ఇది నిజమే అయినా అక్కడా కట్టాల్సిన ట్యాక్స్లు, అవసరాలకు చేయాల్సిన ఖర్చులు చాలానే ఉంటాయి. అసలు అమెరికా, ఇండియాలో ఏడాదికి సుమారు కోటి రూపాయల వరకు సంపాదించే ఇద్దరు వ్యక్తులకు ఎంత మిగులుతుందనే అనుమానాలు చాలా మందిలోనే ఉంటాయి. దానికి సంబంధించిన విషయాలు కింద తెలుసుకుందాం.అమెరికాలో ఉద్యోగాలు, వేతనాలుఎంఎస్ గ్రాడ్యుయేట్లు & సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు జీతాలు(నైపుణ్యాలకు అనుగుణంగా వేతనాలు మారుతుంటాయని గమనించాలి)బేస్ జీతం: ఏటా 1,00,000 డాలర్లు - 1,40,000 డాలర్లుబోనస్ + స్టాక్ ఆప్షన్లు: తరచుగా 10,000 డాలర్లు - 30,000 డాలర్లు అదనం.దాంతో ప్రస్తుత మారకం రేటు ప్రకారం ఏటా సుమారు రూ.83 లక్షల నుంచి రూ.1.2 కోట్ల వరకు ఉంటుంది. ఇది చాలా పెద్ద అమౌంట్గా తోస్తుంది. అయితే ఇందులో కొన్ని కటింగ్స్ ఉంటాయి.అమెరికాలో పన్నులు ఇలా..ఏడాదికి 1,20,000 డాలర్ల జీతం వస్తుందనుకుంటే..స్థూల జీతం నెలవారీగా: 10,000 డాలర్లుఫెడరల్ + స్టేట్ ట్యాక్స్(కటింగ్స్): 2,500 నుంచి -3,000 డాలర్లుసోషల్ సెక్యూరిటీ & మెడికేర్(కటింగ్స్): 750 డాలర్లునెట్ టేక్ హోమ్ పే: 6,200 - 6,500 డాలర్లుఅంటే నెలకు భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.5.1 లక్షలు మిగులుతుంది. అదే భారత్లో సంవత్సరానికి రూ.80 లక్షలు (పన్నుకు ముందు నెలకు సుమారు రూ.6.5 లక్షలు) అందించే భారతీయ ఉద్యోగంతో దీన్ని పోల్చుదాం. ఇక్కడ పన్ను నిర్మాణం, తగ్గింపులను బట్టి టేక్-హోమ్ నెలకు సుమారు రూ.4.5-రూ.5 లక్షలు ఉండవచ్చు.యూఎస్, ఇండియాలో నెలవారీ ఖర్చులు ఇలా.. యూఎస్ఏ(డాలర్లు)ఇండియా(రూ.లలో)అద్దె (1BHK)1,500 - 2,50025వేలు – 45 వేలుకిరాణా సరుకులు300 - 5005 వేలు – 10 వేలుయుటిలిటీస్ + ఇంటర్నెట్150 - 2502 వేలు – 5 వేలురవాణా200 - 4002వేలు – 8 వేలుఆరోగ్య బీమా400 - 700వెయ్యి – 2 వేలు (ప్రైవేట్)మొత్తం2,550 - 4,35035 వేలు – 70 వేలు యూఎస్, ఇండియాలోని ఇద్దరు ప్రొఫెషనల్స్ వేతనాలు పోల్చినప్పుడు యూఎస్ఏఇండియానెలవారీ టేక్-హోమ్రూ.5.1 లక్షలు రూ.4.8 లక్షలునెలవారీ ఖర్చులురూ.2.8 లక్షలు(సుమారు)రూ.70వేలు(సుమారు)నెలవారీ పొదుపు రూ.2.3 లక్షలురూ.4.1 లక్షలుయూఎస్కు వెళ్లడం కేవలం ఒక డబ్బు సంపాదనకే కాకుండా చాలామంది గ్లోబల్ వర్క్ కల్చర్ కోసం వెళ్తుంటారని గమనించాలి. కొందరు కెరీర్ ఎదుగుదల కోసం కూడా అమెరికా బాట పడుతుంటారు.ఇదీ చదవండి: టీసీఎస్ లేఆఫ్స్.. కార్మిక సంఘాలు నిరసన -
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు షాకిచ్చిన భారత్
-
భారత్పై సుంకాలు.. ట్రంప్ టార్గెట్ అదే: జేడీ వాన్స్
వాషింగ్టన్: భారత్పై అమెరికా సుంకాల విధింపుపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్పై ఒత్తిడి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ..‘రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదు. రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తెచ్చారు.ఎలా అంటే.. భారత్పై అదనపు సుంకాలు విధించడం ద్వారా , చమురు నుంచి వచ్చే రష్యా ఆదాయాలు తగ్గిపోతాయి. రష్యా దాడులను ఆపివేస్తే, దానిని మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చవచ్చని, కానీ దాడులు కొనసాగితే, అది ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నించారని అన్నారు. ఉక్రెయిన్పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్ ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని తెలిపారు.మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు చేసింది. భారత వస్తువులపై ట్రంప్ సుంకాన్ని 50 శాతానికి రెట్టింపు చేయడం వల్ల భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే చైనాపై ట్రంప్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో, ట్రంప్ తీరును పలు దేశాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. -
ట్రక్కు డ్రైవర్కు క్షమాభిక్ష పెట్టాలని 15 లక్షల సంతకాలు
ఫ్లోరిడా: అమెరికాలో ముగ్గురు మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్ హర్జిందర్ సింగ్ కేసు వివాదాస్పదమవుతోంది. అతనికి క్షమాభిక్ష కోసం వేసిన ఆన్లైన్ పిటిషన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. హర్జిందర్ సింగ్కు మద్దతుగా 15 లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. అయితే.. హత్యానేరం ఎదుర్కొంటున్న వ్యక్తికి క్షమాభిక్ష కోరడంపై స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది ఇమిగ్రేషన్ సంబంధింత విధానాలపై చర్చకు దారి తీసింది. ఫ్లోరిడాలోని ఫోర్ట్ పియర్స్లో భారతీయ డ్రైవర్ 28 ఏళ్ల హర్జిందర్ సింగ్ తప్పుడు యూ–టర్న్ తీసుకోవడంతో అతను నడుపుతున్న ట్రక్కు.. మినీ వ్యాన్ను ఢీకొంది. దీంతో అందులో ఉన్న ముగ్గురు మరణించారు. ఆగస్టు 12న ఈ ప్రమాదం జరిగింది. సింగ్ 2018లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి కాలిఫోరి్నయాలో వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ పొందాడని ఆరోపణలున్నాయి. అయితే ఈ ప్రమాదం కేసులో గతవారం అతన్ని కాలిఫోరి్నయాలోని స్టాక్టన్లో అరెస్టు చేసి ఫ్లోరిడాకు తిరిగి అప్పగించారు. ఈ ప్రమాదం తరువాత పత్రాలు లేని వలసదారుల వల్ల ప్రమాదాల గురించి ఆందోళన తలెత్తింది. వాణిజ్య ట్రక్ డ్రైవర్లకు వర్కర్ వీసాలు జారీకి అమెరికా ప్రభుత్వం తాత్కాలిక విరామం ప్రకటించింది. అయితే.. హర్జిందర్ సింగ్ను విడుదల చేయాలంటూ ఆన్లైన్లో పిటిషన్ వేశారు. అది ఒక విషాదకరమైన ప్రమాదమని, ఉద్దేశపూర్వకమైన చర్యకాదని పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఆ పిటిషన్కు ఎక్కడలేని ఆదరణ లభించింది. ఆయనకు క్షమాభిక్ష పెట్టాలంటూ 15లక్షల మందికి పైగా సంతకాలు చేశారు. దీనిపై స్థానికంగా వ్యతిరకేత వస్తోంది. ముగ్గురు అమెరికన్ పౌరుల మరణానికి కారణమైన వ్యక్తిని విడుదల చేయాలని కోరుకుంటున్నవారి ఇమ్మిగ్రేషన్ స్థితిని తనిఖీ చేయాలంటూ డిమాండ్ మొదలైంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి తెల్లవాడైతే, చనిపోయినవారు భారతీయులైతే వారు ఇలాంటి పిటిషన్పై సంతకం చేయరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురిని హత్య చేసిన వ్యక్తికి శిక్ష పడకూడదని కోరుకోవడం హాస్యాస్పదమంటున్నారు. అతనికి మద్దతు ఇస్తున్నవారిని బహిష్కరించాలని కోరుతూ మరో పిటిషన్ ప్రారంభించారు. అమెరికా ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోదని, దానిని సమరి్ధంచే వారికి ఆశ్రయం ఇవ్వబోదని పిటిషన్లో పేర్కొన్నారు. -
నిలుపుకోవాల్సిన బంధం
ఇండియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నోరుపారేసు కోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఆయన అక్కసు వెనుక ప్రతిసారీ ఒక భూ స్వామ్య పెత్తందారీ విధానం కనిపిస్తుంది. సుంకాలు, జరిమానాలను రక్షణ కవచంగా ధరించి ఆయన విమర్శలకు, బెదిరింపులకు దిగుతూంటారు. అమెరికా అధ్యక్షుడి వదరుబోతుదనంలో ఒక సామ్రాజ్య వాదిలో ఉండే దురహంకారం ప్రతిబింబిస్తూ ఉంటుంది.రష్యా చమురును ఒక బూచిగా చూపిస్తున్నారంతే. అలనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ ధోరణి ఇప్పుడు అమెరికా వ్యవహార శైలిలో కనిపిస్తోంది. వ్యవసాయం, పాడి, మత్స్య పరిశ్రమ పట్ల భారత దేశం అనుసరిస్తున్నట్లు చెబుతున్న సంరక్షణ విధానంపై నిజంగానే అమెరికా విభేదిస్తోందని మనకు ఎక్కడైనా మనసు పొరల్లో చిన్న సందేహం మిగిలి ఉంటే, ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఉపయోగించిన భాషతో అది కాస్తా పటాపంచలైపోతుంది. ‘మహారాజా సుంకాలు’ అనే పద బంధాన్ని గమనిస్తే, భారత దేశాన్ని ప్రాచ్యవాద, పురాతన జాతివాద కళ్ళద్దాలతోనే నవారో చూస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈసారి ఆయన ‘పాములు ఆడించే వాళ్ళ’ ఉపమానాన్ని ఉపయోగిస్తారేమో! ఏదో ఒక పక్షం వైపు రావలసిందిగా భారతదేశాన్ని నేరుగానే హెచ్చరించారాయన. కొత్తగా ఉపయోగించిన మాటలతో భారతీయుల మనసును నవారో మరింత గాయపరచారు. క్రెమ్లిన్కి ‘లాండ్రోమాట్’గా ఆయన భారతదేశాన్ని అభివర్ణించారు. నిజానికి, అప్ప టికి కొద్ది రోజుల క్రితమే అలాస్కాలో వ్లాదిమీర్ పుతిన్కి ట్రంప్ అక్షరాలా ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికిన సంగతిని ఆయన సమయానుకూలంగా మరచినట్లుంది. అమెరికా ఆత్మవంచనమనం రష్యా ముడి చమురు కొని, శుద్ధి చేసిన తర్వాత, ఆ చమురును యూరప్ దేశాలు కూడా కొనుగోలు చేశాయి. అలా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం ద్వారా మనం ‘లాభాలు గడిస్తున్నా’మని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ ఆరోపించారు. కానీ, ఉక్రెయిన్ యుద్ధం వల్ల నిజంగా లబ్ధి పొందు తున్నది వారే! ఐరోపా దేశాలు అమెరికా నుంచి ఆయుధాలు కొని ఉక్రెయిన్కు లాభాలకు అమ్ముతున్నాయి. అందుకే అవి విక్రయిస్తున్న అన్ని ఆయుధాలపైనా (అదనపు వ్యయాలు, లాభం కింద) ట్రంప్ ప్రభుత్వం 10% మొత్తాన్ని తీసుకుంటోందని బిసెంట్ మరో ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించారు. ఇండియా మాత్రం రష్యా చమురు కొనడం తమ ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని చెబుతూంటే... అదే వ్యక్తులు, పుతిన్ యుద్ధాన్ని మనం బలో పేతం చేస్తున్నట్లుగా నిందిస్తున్నారు. ఇక్కడ అమెరికా ఆత్మ వంచన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కపటత్వానికీ స్థిరమైన వాదన అవసరం.ఎవరో ఒక అధ్యక్షుడి చపలచిత్త ధోరణిని పట్టించుకోనక్కర లేదని, భారత–అమెరికా స్నేహ సంబంధాలు సుదీర్ఘమైనవి, గాఢ మైనవని వాదించేవారితో నేనూ ఏకీభవిస్తాను. కానీ, ట్రంప్కు అర్థ మయ్యే భాషలోనే ఆయనకు వ్యతిరేకంగా స్వల్పకాలిక చర్యనైనా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా నేను అర్థం చేసుకోగలను. అలా గని వాషింగ్టన్ ఇవ్వనిది చైనా మనకేదో దోచిపెడుతుందని కూడా నేను అనుకోవడం లేదు. చైనాను నమ్మవచ్చా?ట్రంప్ది దూకుడు తత్త్వం. చైనా సైనికంగా మనకి ప్రత్యర్థి. ట్రంప్వి అవాకులో చవాకులో బహిరంగంగానే ఉంటాయి. జిన్పింగ్వి పారదర్శకం కాని తెరవెనుక చర్యలు. పాకిస్తాన్ పట్ల ట్రంప్ మెతక వైఖరిని అర్థం చేసుకోవచ్చు. దాని పొగడ్తలకు ఆయన ఉబ్బి పోయాడు, లేదా అది ఇవ్వజూపిన ప్రయోజనాలకు ప్రలోభపడ్డాడు అనుకుందాం. కానీ, ఇటీవలి ‘ఆపరేషన్ సిందూర్’లో కూడా పాకి స్తాన్తో చైనా చెట్టపట్టాలేసుకుని తిరిగింది.కనుక, ట్రంప్ను, ప్రస్తుత లోటుపాట్లను పక్కనపెట్టి అమెరికా – భారత్ స్నేహ సంబంధాన్ని కాపాడుకోవాలని కోరుకోవడంలో ఔచిత్యం ఉంది. ఇప్పటి అమెరికా స్పందన ఒకటే పాఠం నేర్పుతోంది. అది: ప్రపంచంలో ఓ మూలనున్న ప్రాంతంపై లేదా ఒకే దేశంపై ఆశలన్నీ పెట్టుకోవద్దు. అది ప్రమాదకరం.మనవాళ్లు ఏం చేస్తున్నట్టు?ట్రంప్ను భారత్ ఎందుకు దారికి తెచ్చుకోలేకపోయింది అనే దానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆపరేషన్ సిందూర్ ఆగి పోవడంలో ట్రంప్ స్వోత్కర్షను సమర్థించనందుకా? ఆయన ‘ఇగో’ దెబ్బతిందా? ట్రంప్ మాజీ అంగరక్షకుడు ఒకరిని పాకిస్తాన్ తన లాబీయిస్టులలో ఒకడిగా చేర్చుకుందని చెబుతున్నారు. మనం అలా కాకుండా, లాంఛన పూర్వకంగా, సంయమనంతో దౌత్యం నెరప డమా? కానీ, నాకొకటే సందేహం. అమెరికాలో ఉంటున్న భారత సంతతికి చెందిన గొప్ప వ్యక్తులు ఏమైపోయినట్లు? యాభై లక్షల మంది ఇండియన్–అమెరికన్ సమూహాన్ని ఒక చక్కని వలస వర్గానికి నమూనాగా తరచూ అభినందిస్తూ ఉంటారు. ఆ వర్గం నాయకులు పెద్ద టెక్, ఫినాన్షియల్ సంస్థలను నడుపు తున్నారు. విద్యా, విధాన నిర్ణాయక సంస్థల్లో కీలక పదవుల్లో ఉన్నారు. ఇండియా పట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరు చూసి వారికి ఒళ్ళు మండటం లేదా? స్వీయ నిర్ణయాలు తీసుకోవడం భారతదేశానికున్న సార్వభౌమాధికారమనే సంగతిని ట్రంప్ ప్రభుత్వం అర్థం చేసుకోలేకపోతే, ఆయన శ్వేత సౌధం నుంచి నిష్క్ర మించే నాటికి కాపాడుకోవాల్సినవి పెద్దగా ఏమీ మిగలవు.బర్ఖా దత్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రష్యా అణు ప్లాంట్పై దాడి
మాస్కో: రష్యాలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్లలో ఒకటైన కస్క్ అణు విద్యుత్కేంద్రంపై శనివారం రాత్రి డ్రోన్ దాడి జరిగింది. ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపించింది. దేశవ్యాప్తంగా పలు ఇంధన, విద్యుత్కేంద్రాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి దాడులకు దిగిందని మండిపడింది. ‘‘కస్క్ అణు కేంద్రంపై దాడిలో ఒక ట్రాన్స్ఫార్మర్ దెబ్బతింది. మంటలను వెంటనే ఆర్పేశాం. ఒక రియాక్టర్లో ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. అయితే అణు ధారి్మకత ముప్పేమీ లేదు’’ అని పేర్కొంది. ‘‘ఉస్త్–లుగాలోని ఇంధన ఎగుమతుల టెర్మినల్పై దాడితో మంటలు చెలరేగాయి. అక్కడ 10 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశాం. దేశవ్యాప్తంగా 95 డ్రోన్లు, మిసైళ్లను ధ్వంసం చేశాం. రష్యా ప్రయోగించిన 48 డ్రోన్లను అడ్డుకున్నాం. డొనెట్స్్కలో రెండు గ్రామాలను స్వా«దీనం చేసుకున్నాం. పశ్చిమ ఉక్రెయిన్లో భీకర పోరు కొనసాగుతోంది’’ అని పేర్కొంది. ఓడిపోబోం: జెలెన్స్కీ ‘‘ఉక్రెయిన్ బాధిత దేశం కాదు, పోరాటయోద్ధ. రష్యాతో పోరులో ఇంకా గెలవకున్నా, ఓడిపోయే ప్రసక్తి మాత్రం లేదు’’ అని అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. రాజధాని కీవ్లో ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఉక్రెయిన్ స్వాతంత్య్ర పరిరక్షణకు రాజీలేని పోరు కొనసాగిస్తామన్నారు. కెనడా ప్రధాని కార్నీ ఆదివారం కీవ్లో జెలెన్స్కీతో మంతనాలు జరిపారు.త్వరలో భారత్కు జెలెన్స్కీ!ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ త్వరలో భారత్లో పర్యటించే అవకాశాలున్నాయి. శనివారం ఆయనతో ఫోన్ సంభాషణ సందర్భంగా ప్రధాని మోదీ ఈ మేరకు ఆహ్వానించారు. పర్యటన తేదీ త్వరలోనే ఖరారయ్యే అవకాశముందని ఉక్రెయిన్ పేర్కొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఈ పర్యటన కీలక మైలురాయిగా మారనుందని అభిప్రాయపడింది. -
అమెరికాలో ఇండియా సరుకులు.. చుక్కలు చూపిస్తున్నాయ్..
అమెరికాలో భారతీయ తినుబండారాలు, నిత్యావసర సరుకుల ధరలు అక్కడి కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. భారత్లో తక్కువ ధరకు లభించే అవే వస్తువులు అమెరికాలో పదుల రెట్లు అధికంగా వెచ్చించి కొనాల్సి వస్తోంది. ఓ స్టోర్లో ఏ వస్తువుల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తూ ఓ భారతీయ యువకుడు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.అమెరికాలోని డల్లాస్లో ఉన్న ఓ వాల్మార్ట్ స్టోర్లో అందుబాటులో ఉన్న భారతీయ ఆహార ఉత్పత్తులను, వాటి ధరలను చూపిస్తూ రజత్ అనే ఓ భారతీయుడు వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టాడు. రాయల్ లెంటిల్స్, హల్దీరామ్ స్నాక్స్, పార్లే బిస్కెట్లు, వివిధ మసాలా దినుసులు, సాస్లు వంటి ప్రసిద్ధ వస్తువుల రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో రజత్ వివరించారు.డల్లాస్లో భారతీయులు అధిక సంఖ్యలో నివసిస్తుంటారు. అందుకే ఆ స్టోర్లో భారతీయ ఉత్పత్తులను పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచుతారని రజత్ చెప్పారు. పప్పు, నామ్కీన్, బిస్కెట్ల వంటి వస్తువుల ధరలు 4 డాలర్ల నుండి 4.5 డాలర్ల వరకు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ వీడియో చూసిన యూజర్లు వస్తువుల ధరలు చూసి నోరెళ్లబెట్టారు. ఇండియాలో వాటి ధరలు.. అమెరికాలోని ఆ స్టోర్లో వాటి రేట్లు తెలుసుకుని వామ్మో అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెట్టారు. ఓ యూజరైతే ‘హైడ్ అండ్ సీక్ బిస్కెట్లు 4 డాలర్లా? అంటే రూ.320. అది ఇండియాలో రూ.20 లకే వస్తుంది’ అంటూ కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Rajat and Shilpa (@ouramericandream.vlogs) -
ఫెడ్ చైర్మన్ కీలక ప్రకటన: బంగారం ధరల్లో ఊహించని మార్పు!
బంగారం ధరలు పెరగడానికి లేదా తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇందులో ద్రవ్యోల్బణం, జీడీపీ, అంతర్జాతీయ పరిణామాలు (భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు) ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో జరిగే అనేక అంశాలు గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తాయి. యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, డాలర్ విలువ, డొనాల్డ్ ట్రంప్ సుంకాల కారణంగా పసిడి ధరలు మారుతూ ఉంటాయి. కాగా ఇప్పుడు బంగారం ధరలలో కీలక మార్పుకు కారణమయ్యే ఒక ప్రకటన వచ్చింది.నిజానికి ఫెడ్ వడ్డీ రేట్లను పెంచితే.. యూఎస్ డాలర్ డిమాండ్ పెరుగుతుంది. డాలర్ వాల్యూ పెరిగితే.. బంగారం కొనుగోలు చేసేవారి సంఖ్య కొంత తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గితే.. డాలర్ విలువ తగ్గి, బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.కొంత కాలంగా.. ఫెడ్ వడ్డీ రేట్లను స్థిరంగానే ఉంచుతున్నారు. దీంతో బంగారం ధరల్లో ఊహించని మార్పు కనిపించలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించాలని సూచించారు. కానీ ట్రంప్ విధిస్తున్న సుంకాలు.. భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తాయో తెలియడం లేదు. ఈ కారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. అయితే సెప్టెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని చెబుతున్నారు.వచ్చే నెలలో జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ 'జెరోమ్ పావెల్' వడ్డీ రేటు తగ్గింపుకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. ఇది ఉద్యోగ మార్కెట్కు నష్టాలు తెస్తుందని, ద్రవ్యోల్బణం ముప్పు కూడా ఉండదని పేర్కొన్నారు. అయినప్పటికీ వడ్డీ రేట్లను తగ్గించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. దీంతో డాలర్ విలువ ఒక్కసారిగా పతనమైంది. దీంతో బంగారం ధరలు ఊహించినట్లుగానే పెరిగాయి. ఫెడ్ సమావేశం సెప్టెంబర్ 16, 17న జరగనుంది.ఇదీ చదవండి: పండుగ సీజన్.. అమెజాన్లో 1.5 లక్షల ఉద్యోగాలుఇక భారతదేశంలో కూడా బంగారం ధరలు ఊహకందని రీతిలో శనివారం (ఆగస్టు 23) గరిష్టంగా రూ. 1090 పెరిగింది. దీంతో 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ. 1,01,620 (10 గ్రా)కు చేరింది. 22 క్యారెట్స్ గోల్డ్ రేటు రూ. 1000 పెరిగి రూ. 93150 (10 గ్రా)కు చేరింది. కేజీ వెండి ధర రూ. 1,30,000లకు చేరింది. -
ట్రంప్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోండి.. భారత్కు నిక్కీ హేలీ సూచన
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ప్రస్తుత పరిస్థితులపై అమెరికా రిపబ్లికన్ నిక్కీ హేలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయం, చమురు కొనుగోళ్లపై లేవనెత్తిన అభ్యంతరాన్ని భారత్ సీరియస్గా తీసుకోవాలని సూచనలు చేశారు. ట్రంప్, మోదీ మధ్య ఇలాంటి పోరాటం దురదృష్టకరం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో చైనాపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.భారత్కు నిక్కీ హేలీ మంచి మిత్రురాలిగా పేరున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంక్షలు విధించి భారత్ను అమెరికా దూరం చేసుకోవడంపై నిక్కీ హేలీ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిక్కీ హేలీ తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘దశాబ్దాలుగా రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న స్నేహం, విశ్వాసం ఉంది. రష్యా నుంచి చమురు విషయంలో ట్రంప్ లేవనెత్తిన అభ్యంతరాలను భారత్ సీరియస్గా తీసుకోవాలి. దాని పరిష్కారం కోసం వీలైనంత త్వరగా అమెరికాతో కలిసి పనిచేయాలి. వాణిజ్యంలో, రష్యా చమురుపై అభిప్రాయభేదాలు వంటివి పరిష్కరించుకోవడానికి బలమైన చర్చలు, సంప్రదింపులు అవసరం.India must take Trump's point over Russian oil seriously, and work with the White House to find a solution. The sooner the better. Decades of friendship and good will between the world's two largest democracies provide a solid basis to move past the current turbulence.…— Nikki Haley (@NikkiHaley) August 23, 2025ఇక, చైనాను ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ మిత్రులుగా ఉండాలి అన్న అంశం చాలా ముఖ్యమైంది. దానిని ఏమాత్రం విస్మరించడకూడదు. చైనాను ఎదుర్కోవాలన్న వ్యూహాత్మక లక్ష్యాల సాధనకు ట్రంప్ నిర్ణయాలు విపత్కరంగా మారాయి. ప్రపంచంలో ఆరోవంతు జనాభాకు కేంద్రం భారత్. అత్యంత యువ జనాభాతో చైనాను దాటేసింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ ’ అని స్పష్టం చేశారు.ఇదిలా ఉండగా.. అమెరికా, భారత్ మధ్య ఘర్షణల వాతావరణం నేపథ్యంలో మాజీ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, అమెరికా మధ్య పోరు దురదృష్టకరమని అభివర్ణించారు. భారత్ లాంటి మిత్రదేశాలను ట్రంప్ దూరం చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిజమైన దౌత్య ప్రయత్నాలు జరగకుండా, అల్టిమేటంలు జారీ చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. గొప్ప దేశాలు ఎల్లప్పుడూ ప్రజలకు అల్టిమేటంలు ఇవ్వడం ద్వారా గొప్పతనాన్ని ప్రదర్శించవు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పాలనలో చర్చలు పరస్పర సహకారం, గౌరవం ద్వారా జరిగాయి. కానీ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆదేశాలు, ఒత్తిడితో జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. -
అమెరికాకు తపాలా సర్విసులు తాత్కాలికంగా బంద్
న్యూఢిల్లీ: అమెరికాకు కొన్ని రకాల తపాలా సేవలను ఈ నెల 25వ తేదీ నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. పన్ను నిబంధనల్లో అమెరికా ప్రభుత్వం మార్పులు చేయడమే ఇందుకు కారణమని వెల్లడించింది. ప్రధానంగా పార్సిల్ సేవలను నిలిపివేయనున్నట్లు పేర్కొంది. 800 డాలర్ల వరకు విలువైన వస్తువులపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరిస్తున్నట్లు అమెరికా సర్కార్ జూలై 30న ఉత్తర్వు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29 నుంచి అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో అమెరికాకు పంపించే అన్ని రకాల పోస్టల్ ఐటమ్స్పై వాటి విలువతో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్ యాక్ట్(ఐఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ కింద కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. 100 డాలర్ల దాకా విలువైన బహుమతులపై ఎలాంటి పన్ను ఉండదు. యూఎస్ కస్టమ్స్ విభాగం నుంచి అనుమతి పొందినవారు పోస్టల్ షిప్మెంట్స్పై పన్ను వసూలు చేసి, అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. మరోవైపు ఈ నెల 25 నుంచి అమెరికాకు పోస్టల్ పార్సిళ్లను పంపించడం ఆపేస్తున్నట్లు విమానయాన సంస్థలు ప్రకటించాయి. తపాలా శాఖ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. 100 డాలర్ల దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ మినహా ఇతర పార్సిళ్ల బుకింగ్ను నిలిపివేస్తున్నట్లు స్పష్టంచేసింది. పార్సిళ్లను అమెరికాకు పంపడానికి ఇప్పటికే సొమ్ము చెల్లించినవారు రీఫండ్ పొందవచ్చని సూచించింది. ఆయా పార్సిళ్లను తిరిగి పొందాలని పేర్కొంది. వినియోగదారులకు కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నామని ఒక ప్రకటనలో వివరించింది. అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. అమెరికా పన్ను నిబంధనల్లో మార్పుల కారణంగా భారత్తోపాటు స్కాండినేవియా, ఆస్ట్రియా, ఫ్రాన్స్, బెల్జియం తదితర దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆయా దేశాలు అమెరికాకు పార్సిల్ డెలివరీలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాలపై టారిఫ్ల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఇండియా సహా పలుదేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు. ప్రపంచ దేశాలతో వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. ఇందులో భాగంగానే పోస్టల్ సేవలపై పన్నురహిత మినహాయింపులను ఉపసంహరించారు. -
‘భారత్ అంటే గౌరవం.. మోదీ అంటే అంత కంటే..’
న్యూఢిల్లీ: భారత పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలిసిందే. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ను ఆర్థికంగా దెబ్బతీయానే ఉద్దేశంతో సుంకాల పెంపునకు నాంది పలికారనే వాదన బలంగా వినిపిస్తోంది.. భారత్పై వరుస సుంకాలతో ఇరుకున పెట్టే యత్నం చేస్తున్నారని అంటున్నారు పలువురు ప్రముఖులు. భారత్ను చైనా కంటే దారుణంగా చూడటం తగదని అంటున్నారు. చైనా కంటే అధికంగా భారత్పై సుంకాలు విధించడమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. కొన్ని దశాబ్డాలుగా అమెరికాకు మిత్రదేశంగా ఉన్న భారత్ పట్ల ట్రంప్ ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారో ఆయనకే తెలియాలి. భారత్ను ఆర్థికంగా ఎదుగకుండా చూడాలని ట్రంప్ చేస్తున్నారా? అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదే సమయంలో .భారత్పై ట్రంప్ వైఖరి పట్ల అటు అమెరికాలోనే పలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించగా, ఇప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలనే యత్నం కూడా యూఎస్ నుంచి జరుగుతున్నట్లే కనబడుతోంది. తాజాగా అమెరికా మాజీ దౌత్యవేత్త, రాజకీయ నాయకుడు మిచెల్ బామ్గార్టనర్ అమెరికా-భారత్ల ‘మైత్రి’ తిరిగి గాడిలో పడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ బామ్గార్టనర్ మాట్లాడుతూ.. ట్రంప్కు భారత్ అంటే చాలా గౌరవమని, ప్రధాని మోదీ అంటే అంతకంటే గౌరవమంటూ స్పష్టం చేశారు. ఏ రకంగా భారత్ను డొనాల్డ ట్రంప్ గౌరవిస్తున్నారో చెప్పకపోయినా, త్వరలోనే ఇరుదేశా మధ్య సంబంధాలు తిరిగి యథాస్థితికి వస్తాయని జోస్యం చెప్పారు. ట్రంప్ వైఖరిపై చాలాకాలం ఓపిక పట్టిన భారత్.. ఇప్పుడు మాటల యుద్ధాన్ని ఆరంభించింది. అటు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు.. అవకాశం దొరికినప్పుడల్లా ట్రంప్ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా రష్యాతో బంధాన్ని చెడగొట్టాలని చూసిన ట్రంప్కు.. భారత్ అనూహ్య షాకిచ్చింది. తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని, అందుకు రష్యాతో చమురు కొనుగోలులో ఎటువంటి మార్పు ఉండబోదనే సంకేతాలు పంపింది. దాంతో ట్రంప్కు నోట్లో ఎలక్కాయపడినట్లు అయ్యింది. ప్రస్తుతం నేరుగా మాట్లాడకుండా రాజీ చేసుకునే మంత్రాన్ని అమలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి కనిపిస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహు కూడా అమెరికా-భారత్ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని కూడా చెప్పారు. మరి ఇప్పుడు అమెరికా మాజీ దౌత్యవేత్త మిచెల్ బామ్గార్టనర్ సైతం అదే పల్లవి అందుకున్నారు. ఈ రెండు పెద్ద దేశాల మధ్య పలు ప్రాథమిక అంశాలు చాలా బలంగా ఉన్నాయనేది ఒప్పుకోక తప్పదన్నారు. అందువల్ల ఇరు దేశాలు తిరిగి పూర్వ స్థితిని కొనసాగించే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నారు. -
ఈసారి పాక్ను కలిపి ఇచ్చి పడేశారు..!
ఎన్ జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్లపై సెటైరిక్గా స్పందించారు. ఎకనమిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా పాక్-అమెరికాల వైఖరిపై జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు. #WATCH | Delhi: "They have a history with each other, and they have a history of overlooking their history... It is the same military that went into Abbottabad (in Pakistan) and found who there?..." says EAM Dr S Jaishankar on relations between US and Pakistan, at The Economic… pic.twitter.com/wpYGfdLpbc— ANI (@ANI) August 23, 2025 ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు. అమెరికా-పాకిస్తాన్లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్.ఇదీ చదవండి: భారత్తో సమస్య ఉంటే.. ట్రంప్కు జై శంకర్ స్పష్టీకరణ -
భారత్ కీలక నిర్ణయం.. ఆ దేశానికి పోస్టల్ సేవలు బంద్
భారత్ నుంచి అమెరికాకు పోస్టల్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలాఖరులో అమల్లోకి రానున్న అమెరికా కస్టమ్స్ నిబంధనల్లో మార్పులను ఉటంకిస్తూ ఆగస్టు 25 నుంచి అమెరికాకు అన్ని పోస్టల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ తాజాగా ప్రకటించింది. అనేక వస్తువులపై సుంకం మినహాయింపును అమెరికా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత తపాలా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జూలై 30న జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నం.14324 ద్వారా 800 డాలర్ల వరకు విలువైన వస్తువులకు డ్యూటీ-ఫ్రీ మినహాయింపు తొలగించారు. ట్రంప్ ఇటీవల భారత్పై 25 శాతం సుంకం విధించడంతో పాటు రష్యా చమురు కొనుగోలుకు అదనంగా 25 శాతం జరిమానా విధించడంతో మొత్తం టారిఫ్ భారం 50 శాతానికి పెరిగింది. ఈ పరిణామాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి పోస్టల్ సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.ఆగస్టు 29 నుంచి అమెరికాకు తరలించే అన్ని అంతర్జాతీయ పోస్టల్ వస్తువులు వాటి విలువతో సంబంధం లేకుండా, దేశ-నిర్దిష్ట అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తి చట్టం (ఐఈఈఈపీఏ) టారిఫ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం కస్టమ్స్ సుంకాలకు లోబడి ఉంటాయని తపాలా శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అయితే 100 డాలర్ల వరకు విలువైన గిఫ్ట్ ఐటమ్స్ కు మాత్రం మినహాయింపు కొనసాగుతుందని తెలిపింది.ఎయిర్ క్యారియర్లు తమకు అవసరమైన విధానాలు లేకపోవడంతో ఆగస్టు 25 తర్వాత పార్సిళ్లు తీసుకోలేమని భారత అధికారులకు తెలియజేశారు. దీంతో భారత పోస్టల్ శాఖ ఇప్పుడు లెటర్లు/డాక్యుమెంట్లు, 100 డాలర్ల వరకూ విలువైన గిఫ్ట్ ఐటెమ్స్ మాత్రమే స్వీకరిస్తుంది. ఇప్పటికే బుక్ చేసిన బట్వాడాకు వీలులేని వస్తువులకు రిఫండ్ పొందవచ్చని పోస్టల్ శాఖ తెలియజేసింది. -
‘భారత్తో సమస్య ఉంటే.. ’: ట్రంప్కు జైశంకర్ స్పష్టం
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు జైశంకర్ స్పష్టం చేశారు.‘ఎకనమిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఎన్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు. #WATCH | Delhi: At The Economic Times World Leaders Forum 2025, EAM Dr S Jaishankar says, "It's funny to have people who work for a pro-business American administration accusing other people of doing business. If you have a problem buying oil or refined products from India, don't… pic.twitter.com/rXW9kCcVuv— ANI (@ANI) August 23, 2025ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్తో సమస్య ఉంటే, ఈ దేశపు చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్ అన్నారు. -
అమెరికా వీసా ఇమ్మిగ్రేషన్ విధానాలు మరింత కఠినతరం
-
అమెరికాలోని పెంబ్రోక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
-
5.5 కోట్ల మంది వీసాల పరిశీలన
వాషింగ్టన్: అమెరికాలో ఉంటున్న ఐదున్నర కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను పూర్తి స్థాయిలో పరిశీలించే ప్రక్రియ మొదలైందని ట్రంప్ యంత్రాంగం గురువారం వెల్లడించింది. వీసా దారుల్లో ఎవరైనా వీసా నిబంధనలను ఉల్లంఘించారా అన్నది నిర్థారించడమే దీని ఉద్దేశమని తెలిపింది. నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతు పలికినా వీసా కాలపరిమితికి మించి దేశంలో నివసిస్తున్నా, యూదు వ్యతిరేక చర్యలు సహా ప్రజా భద్రతకు భంగం కలిగించినట్లు భావించిన వారిపై సైతం తగు చర్యలు తీసుకుంటామని పేర్కొంది. వారి వీసాలను రద్దు చేస్తామని, స్వదేశాలకు తిప్పిపంపించి వేస్తామని స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ వీసాదారులపై ఓ కన్నేసి ఉంచుతామని తెలిపింది. అమెరికా పౌరులకు, సంస్కృతి, ప్రభుత్వం, సూత్రాలు, నిబంధనలకు భంగం వాటిల్లేలా వ్యవహరించినట్లు గుర్తించినా చర్యలు తప్పవని పేర్కొంది. అమెరికా వ్యతిరేక భావజాలం కలిగిన వారికి ప్రయోజనాలను అందివ్వబోమని యూఎస్ సిటిజన్íÙప్ అండ్ ఇమిగ్రేషన్ సరీ్వసెస్ ప్రతినిధి మాథ్యూ ట్రగెస్సర్ తెలిపారు. కాగా, అమెరికాలో సుమారు 50 లక్షల మంది భారతీయ వీసాదారులున్నట్లు అంచనా. ట్రంప్ ప్రభుత్వ తాజా ప్రకటనతో వీరందరిలోనూ ఆందోళన మొదలై ంది. ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే 6 వేల మంది విద్యార్థుల వీసాలను రద్దు చేయడం తెల్సిందే. అదేవిధంగా, 12 దేశాల ప్రయాణికులపై పూర్తిస్థాయి నిషేధంతోపాటు మరో ఏడు దేశాలపై పాక్షిక నిషేధం విధించింది. విదేశీ ట్రక్కు డ్రైవర్లకు నో వీసావాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేసే విదేశీయులకు వీసాల మంజూరు నిలిపివేసినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో గురువారం ఎక్స్ వేదికగా ఈ విషయం ప్రకటించారు. తక్షణమే ఇది అమల్లోకి వచ్చిందన్నారు. ‘పెద్ద ట్రాక్టర్–ట్రైలర్ ట్రక్కులపై డ్రైవర్లుగా పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న విదేశీయుల కారణంగా దేశంలో రహదారులపై ప్రయాణించే పౌరుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. అమెరికన్ ట్రక్కు డ్రైవర్లకు జీవనోపాధి సైతం దెబ్బతింటోంది’అని ఆయన వివరించారు. ప్రస్తుతం అమెరికాలో ఎంత మంది విదేశీ ట్రక్కు డ్రైవర్లు పనిచేస్తున్నదీ విదేశాంగ శాఖ వెల్లడించలేదు. ట్రక్కు డ్రైవర్లుగా పనిచేయాలనుకునే విదేశీయులు ఇంగ్లి‹Ùను చక్కగా మాట్లాడటం, రాయడం తెలిసుండాలంటూ ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు చేయడం తెల్సిందే. రహదారి హెచ్చరికలను, సూచనలను చదివి సరిగ్గా అర్థం చేసుకోలేని డ్రైవర్ల కారణంగా రహదారి ప్రమాదాలు పెరుగుతున్నాయని రవాణా శాఖ ఆరోపిస్తోంది. రహదారి భద్రతను పెంచడమే తమ లక్ష్యమని చెబుతోంది. -
టూరిస్ట్ బస్సు ప్రమాదం.. పలువురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. టూరిస్టు బస్సు బోల్తా పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. పలువురు గాయపడినట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఇక, టూరిస్టుల్లో ఎక్కువ మంది భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు.వివరాల ప్రకారం.. అమెరికాలోని పెంబ్రోక్ సమీపంలో టూరిస్ట్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రఖ్యాత నయాగరా జలపాతం అందాలను చూసేందుకు వెళ్లి తిరిగి న్యూయార్క్కు వస్తున్న ఓ టూరిస్టు బస్ బోల్తా పడింది. కాగా, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ఘటన అక్కడి స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.40 గంటలకు జరిగింది.FATAL BUS CRASH: A tour bus returning to New York City from Niagara Falls crashed and rolled, killing and injuring multiple people. https://t.co/gjbBasVrWC#News12NY #NYC pic.twitter.com/uQpfsAkuCe— News 12 New York (@News12) August 22, 2025ఈ క్రమంలో చాలా మంది సీటు బెల్టులను ధరించకపోవడంతో వారిని సులభంగా బస్సు నుంచి బయటికి తీసుకొచ్చినట్లు ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. కాగా, బస్సు ప్రమాదానికి గురైన సమయంలో 54 మంది ప్రయాణిస్తున్నారు. పర్యాటకుల్లో అత్యధికులు భారత్, చైనా, ఫిలిప్పీన్స్కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బస్సు బోల్తా పడిన విషయం తెలియడంతో వెంటనే స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది. నాలుగు హెలికాప్టర్లు, పలు అంబులెన్స్లలో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ఘటనతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదొక విషాద ఘటన అని న్యూయార్క్ గవర్నన్ క్యాథీ హోచుల్ పేర్కొన్నారు. తమ యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. A tour bus carrying passengers from Niagara Falls to New York City overturned on westbound Interstate 90 (I-90) in Pembroke, New York, near mile marker 403.9. The crash resulted in multiple fatalities and dozens of injuries.According to reports, the bus collided with a… pic.twitter.com/ttRKbpSgzs— T_CAS videos (@tecas2000) August 22, 2025 -
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
వాషింగ్టన్: భారత్ టార్గెట్గా అమెరికా మరోసారి సంచలన విమర్శలు చేసింది. సుంకాల్లో భారత్ను ‘మహారాజ్’ అని పేర్కొంటూ వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ ప్రకారమే రష్యా నుంచి చమురు కొనడం ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భారత రిఫైనరీలు యుద్ధానికి ఆజ్యం పోస్తూ డబ్బు సంపాదిస్తున్నాయని అన్నారు.వైట్హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నరావో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పీటర్.. ఆగస్టు 27 నుంచి 50 శాతం సుంకాలు అమల్లోకి రానున్న నేపథ్యంలో.. వీటి గడువును ట్రంప్ పొడిగిస్తారని తాను ఆశించడం లేదన్నారు. గతంలో ట్రంప్ ప్రకటించినట్లుగా వచ్చే వారం కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. సుంకాలు విధించడంలో భారత్.. ‘మహారాజ్’గా ఉంది. భారత్ సుంకాలు ఎక్కువగా ఉంటాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్కు చెందిన రిఫైనరీలు లాభాలు ఆర్జిస్తున్నాయి. రష్యా ద్వారా లాభదాయక కార్యక్రమాన్ని భారత్ కొనసాగిస్తోంది.White House Trade Adviser Peter Navarro on India: "Nonsense that India needs Russian Oil""Profiteering by Indian refiners""India has Maharaja tariffs""Road to peace runs thru New Delhi" pic.twitter.com/w64a9nRg2P— Sidhant Sibal (@sidhant) August 21, 2025భారత్కు రష్యన్ చమురు అవసరం అనేది అర్ధం లేనిది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం విషయంలో భారత్ తన పాత్రను గుర్తించాలని కోరుకోవడం లేదు. భారత్ మనకు వస్తువులను అమ్మి.. వారు రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడానికి మన నుండి వచ్చే డబ్బును ఉపయోగిస్తున్నారు. రష్యన్లు ఆ డబ్బును మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేయడానికి, ఉక్రెయిన్ ప్రజలపై దాడులు చేయడానికి అది వాడుకుంటున్నారు అని ఆరోపించారు. భారత నాయకత్వాన్ని నేను విమర్శించాలని నేను అనుకోవడం లేదు. మోదీ గొప్ప నాయకుడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ పాత్ర ఏంటో చూడండి.. మీరు ప్రస్తుతం చేస్తున్నది శాంతిని పునరుద్ధరించడానికి కాదు.. అది యుద్ధాన్ని కొనసాగిస్తోంది. రష్యా పట్ల భారత్ తన వైఖరి మార్చుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు. -
కాస్త తగ్గిన పుతిన్? ట్రంప్, జెలెన్స్కీ ‘నో’ కామెంట్స్
నాలుగేళ్ల తర్వాత అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు భేటీ అయ్యారు. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగానే ఈ సమావేశం జరిగిందన్నది తెలిసిందే. అయితే ఆ మీటింగ్ సారాంశమేమీ ఇప్పటిదాకా బయటకు రాలేదు.ఆగస్టు 15వ తేదీన మూడు గంటలపాటు రహస్య మంతనాలు చేసిన ఈ ఇరుదేశాల నేతలు.. సంయుక్త మీడియా సమావేశంలో తాము చెప్పాలనున్నది చెప్పి తలోదారి వెళ్లిపోయారు. దీంతో భేటీ సంతృప్తికరంగా జరగలేదనే విశ్లేషణలు నడిచాయి. అయితే తాజాగా ఆ భేటీలో ఉక్రెయిన్కు పుతిన్ చేస్తున్న(అలస్కాలో చేసిన) డిమాండ్లు ఏంటో ప్రస్తావిస్తూ రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. రష్యా అధ్యక్ష కార్యాలయం ‘క్రెమ్లిన్’ వర్గాలు వెల్లడించిన ఆ డిమాండ్లను పరిశీలిస్తే..డోన్బాస్ ప్రాంతాన్ని పూర్తిగా అప్పగించడంనాటోలో చేరాలనే ఆలోచనను పక్కనపెట్టేయడంపశ్చిమ బలగాల మోహరింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదుఉక్రెయిన్పై ఒత్తిడి తగ్గించిన పుతిన్?వాస్తవానికి ఈ మూడు పాత డిమాండ్లే! మరి కొత్తగా పుతిన్ ఏం చెబుతున్నారంటే.. 2024 జూన్లో ఉక్రెయిన్కు పెట్టిన కఠినమైన భూభాగాల డిమాండ్లను కొంత మేర తగ్గించినట్టు రష్యా వర్గాలు అంటున్నాయి. పాత డిమాండ్లను పరిశీలిస్తే.. డోనెత్స్క్(Donetsk), లుహాన్స్క్, ఖెర్సన్, జపోరిజ్జియా ప్రాంతాలను పూర్తిగా రష్యాకు అప్పగించాలి. నాటో సభ్యత్వాన్ని త్యజించాలి. పశ్చిమ దేశాల బలగాలు ఉక్రెయిన్లో మోహరించకూడదు.కొత్త ప్రతిపాదనల్లో.. ఉక్రెయిన్ డోన్బాస్లో తన నియంత్రణలో ఉన్న భాగాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గాలి. రష్యా జపోరిజ్జియా, ఖెర్సన్ ప్రాంతాల్లో ప్రస్తుత యుద్ధ రేఖలను నిలిపివేస్తుంది. ఖార్కివ్, సుమీ, డ్నిప్రోపెట్రోవ్స్క్ ప్రాంతాల్లో రష్యా ఆక్రమించిన చిన్న భాగాలను తిరిగి అప్పగించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం.. డోన్బాస్లో 88%, జపోరిజ్జియా, ఖెర్సన్లో 73% రష్యా నియంత్రణలో ఉంది.అయితే.. నాటో విస్తరణపై నిషేధం, ఉక్రెయిన్ సైన్యంపై పరిమితులు, పశ్చిమ శాంతి బలగాల మోహరింపు నిషేధం వంటి పాత డిమాండ్లు మాత్రం కొనసాగుతున్నాయి. అదే సమయంలో.. 2022 ఇస్తాంబుల్ ఒప్పందాలను పునరుద్ధరించే అవకాశం కూడా పరిశీలనలో ఉంది. ఇందులో ఐరాస భద్రతా మండలి నుంచి ఉక్రెయిన్కు భద్రతా హామీలు పొందే ప్రతిపాదన ఉంది.ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. గతంలో ఈ డిమాండ్లను "సరెండర్" (లొంగిపోవడం)గా అభివర్ణించిన తెలిసిందే. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, రష్యా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో భాగంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉక్రెయిన్ భూభాగాల నుంచి వెనక్కి తగ్గే ఆలోచనను పూర్తిగా తిరస్కరించారు.డోనెత్స్క్, లుహాన్స్క్(Donetsk) కలిపిన డోన్బాస్ ప్రాంతం ఉక్రెయిన్కు రక్షణ కోటగా పనిచేస్తుందని జెలెన్స్కీ మొదటి నుంచి చెబుతున్నారు. ‘‘తూర్పు ప్రాంతాల నుంచి వెనక్కి తగ్గడం అంటే దేశం ఉనికి కోల్పోవడం’’ అని అంటున్నారాయాన. ‘‘ఇది మా శక్తివంతమైన రక్షణ రేఖల అంశం’’ అని కుండబద్దలు కొట్టారు. ఇక.. నాటో సభ్యత్వం.. రాజ్యాంగబద్ధ లక్ష్యమని చెప్పారు. పైగా దీనిని ఉక్రెయిన్కు భద్రతా హామీగా భావిస్తున్నారు. నాటో సభ్యత్వంపై నిర్ణయం తీసుకునే హక్కు రష్యాకు లేదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్, నాటో రష్యా కొత్త ప్రతిపాదనలపై ఇప్పటివరకైతే స్పందించలేదు.అలాస్కాలోని అంకరేజ్ నగరంలో జరిగిన అమెరికా-రష్యా అధ్యక్షులు భేటీ తర్వాత శాంతికి ఉత్తమ అవకాశాలు ఏర్పడినట్టు క్రెమ్లిన్ వర్గాలు అంటున్నాయి. అయితే.. డోన్బాస్ నుంచి ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం రాజకీయంగా, వ్యూహపరంగా అసాధ్యమైన విషయని పరిశీలకులు అంటున్నారు. రెండు పక్షాలకు అంగీకారయోగ్యంగా లేని షరతులతో శాంతి ప్రతిపాదనలు చేయడం.. ట్రంప్కు షో మాత్రమే కావొచ్చని అభిప్రాయపడుతున్నారు.అస్పష్టతలు & అడ్డంకులుఉక్రెయిన్ డోన్బాస్ను అప్పగించేందుకు సిద్ధంగా ఉందా? అనే అంశంపై రష్యాకు స్పష్టత లేదు.అమెరికా రష్యా ఆక్రమించిన భూభాగాలను గుర్తిస్తుందా? అనే ప్రశ్న కూడా ఇంకా పరిష్కారమవ్వలేదు.జెలెన్స్కీ అధికార బాధ్యతపై పుతిన్ సందేహాలు వ్యక్తం చేశారు, కానీ కీవ్ ఆయనను చట్టబద్ధమైన అధ్యక్షుడిగా పేర్కొంటోంది.ట్రంప్ పాత్రఉక్రెయిన్ యుద్ధం ముగించి.. తానొక శాంతి కాముకుడిననే విషయం ప్రపంచానికి చాటి చెప్పాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే పుతిన్, జెలెన్స్కీలతో విడిగా భేటీ అయిన ఆయన.. రష్యా-ఉక్రెయిన్-అమెరికా త్రైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు. -
వీసాలపై ట్రంప్ స్పెషల్ ఫోకస్.. 5.5 కోట్ల మంది టార్గెట్
వాషింగ్టన్: అమెరికాలో వీసాల విషయంలో ట్రంప్ మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా ఉన్న సుమారు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను మరింత క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా యంత్రాంగం ఓ ప్రకటనలో పేర్కొంది. డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయడం లేదని మార్కో రూబియో బాంబు పేల్చారు. దీంతో, మరిన్ని వీసాలపై కోత విధించే అవకాశం ఉంది.అయితే, అమెరికాలో ఎవరైనా వీసా నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారా అన్నది నిర్ధారించడానికి ఈ ప్రక్రియను చేపట్టినట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది. ఈ సందర్బంగా అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చినా, వీసా కాల పరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్నా, ప్రజాభద్రతకు భంగం కలిగించినా అలాంటి వ్యక్తులను స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక, అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.🚨 BREAKING: The Trump admin is reviewing ALL 55 MILLION PEOPLE with visas in the United States for potentially deportable violations, per APA LOT of people who hate us are about to be sent home! 🔥Visa holders have been allowed to get away with violations for FAR too long! pic.twitter.com/S5bNIMSgA2— Nick Sortor (@nicksortor) August 21, 2025డ్రైవర్లకు వర్కర్కు నో వీసా.. మరోవైపు.. వాణిజ్య ట్రక్కులు నడిపే డ్రైవర్లకు వర్కర్ వీసాలు మంజూరు చేయమని అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించారు. విదేశీ డ్రైవర్ల కారణంగా అమెరికన్ల ప్రాణాలు పోతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో, అమెరికన్లకు ఉద్యోగాలు సైతం లేవన్నారు. అయితే, ఆగస్టు 12న ఫ్లోరిడా టర్న్పైక్లో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత రూబియో హెచ్చరించడం గమనార్హం. కాగా, సదరు ట్రక్కు డ్రైవర్.. భారత్ నుంచి వలస వెళ్లడం, అతడు చట్ట విరుద్దంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ నేపథ్యంలో డ్రైవర్ల వీసాలపై కూడా ట్రంప్ యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక, అమెరికాలో 2023 నాటికి 16 శాతం ట్రక్కు డైవర్లు ఇతర దేశస్థులే ఉన్నట్టు తెలుస్తోంది. Effective immediately we are pausing all issuance of worker visas for commercial truck drivers. The increasing number of foreign drivers operating large tractor-trailer trucks on U.S. roads is endangering American lives and undercutting the livelihoods of American truckers.— Secretary Marco Rubio (@SecRubio) August 21, 2025నాలుగు వేల వీసాలు రద్దు.. అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు నాలుగు వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్ యాక్ట్లోని మూడో సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది. ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ను అర్థంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్’ మోడ్లోనే ఉంచాలని సూచనలు చేసింది. మరోవైపు.. అమెరికాలో రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్లో అక్రమంగా నివసిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. వారందరినీ అమెరికా నుంచి స్వదేశాలకు పంపించేశారు. -
మా మంచి జడ్జి కన్నుమూత
ప్రోవిడెన్స్(అమెరికా): కోర్టుహాల్ అనగానే ఎంతటి సీనియర్ న్యాయవాదికి అయినా జడ్జి అంటే ఒకింత భయం, అమిత గౌరవం. ఏ మాట తూలితే ఎక్కడ కోర్టు ధిక్కారం ఉత్తర్వులు, శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందోన్న భయం. ఇక నిందితుల సంగతి చెప్పనక్కర్లేదు. వంగి వంగి దణ్ణాలు పెడుతూ మమ్మల్ని క్షమించండి జడ్జి గారూ అనే సన్నివేశాలూ ఇప్పటికీ కొన్ని జిల్లా కోర్టుల్లో కని్పస్తాయి. ఆ ఘటనలకూ పూర్తి అతీతంగా అమెరికాలో ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో, ఎంతో సరదాగా, మరెంతో హాస్యం జోడించి తీర్పులు చెప్పే న్యాయమూర్తిగా పేరుతెచ్చుకున్న కురువృద్ధుడు, జడ్జి ఫ్రాంక్ కాప్రియో తుదిశ్వాస విడిచారు. తనదైన వాక్చాతుర్యం, అపార న్యాయశాస్త్ర అనుభవంతో న్యాయకోవిదుడిగా, ప్రజారంజక తీర్పులకు చిరునామాగా మారిన జడ్జి ఫ్రాంక్ 88 ఏళ్ల వయసులో బుధవారం పాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారని ఆయన అధికారిక సోషల్మీడియా ఖాతాలో ఒక ప్రకటన ద్వారా స్పష్టమైంది. 100 కోట్ల వీక్షణలు అమెరికాలోని రోడ్ఐలాండ్ రాష్ట్రంలోని ప్రోవిడెన్స్ సిటీలో చీఫ్ మున్సిపల్ జడ్జిగా చాన్నాళ్లు పనిచేసి రిటైర్ అయినఫ్రాంక్ ఆ తర్వాత అచ్చం కోర్టుహాల్ సెటప్లో పలు కేసుల వాదోపవాదనల ఎపిసోడ్లు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈయన చేసిన వీడియోలు యూట్యూబ్లో ఏకంగా 100 కోట్ల వీక్షణలు దాటాయంటే ఆయన ఎంత హృద్యంగా, సుతిమెత్తగా, సూటిగా తీర్పులు చెప్తారో అర్థంచేసుకోవచ్చు. శిక్షను ఎదుర్కొంటున్న నిందితులతోపాటు నిందితుల కుటుంబసభ్యులతోనూ నేరుగా సహానుభూతితో మాట్లాడి కేసుకు సరైన న్యాయం చేస్తూ తీర్పు చెప్పే విధానం కోట్లాది మందిని మెప్పించింది. చిన్నచిన్న తప్పులు చేసి నిందితులుగా ముద్రపడిన వ్యక్తులను సున్నితంగా, నవ్వుతూ మందలిస్తూ కేసులు కొట్టేసిన సందర్భాలు కోకొల్లలు. ఈయన చీఫ్ మున్సిపల్జడ్జిగా 1985 నుంచి రిటైర్ అయ్యేదాకా అంటే 2023ఏడాదిదాకా ఏకంగా 40 ఏళ్లపాట సేవలందించారు. చిన్నపాటి తప్పిదాలు చేసిన మీ తల్లిదండ్రులకు ఎలాంటి శిక్ష విధించాలో నువ్వే చెప్పు అంటూ వాళ్ల చిన్నారులకే ధర్మాసనం వద్దకు పిలిపించి వారితోనే తీర్పులు చదివించిన సందర్భాలూ ఉన్నాయి. ఎంతో దయతో తీర్పులు చెప్పే జడ్జిగా ఆయన పేరు మార్మోగిపోయింది. 2018 నుంచి 2020 ఏడాదిదాకా ‘కాట్ ఇన్ ప్రోవిడెన్స్’ పేరుతో ఆయన కోర్టు సీన్లతో టీవీ సిరీస్ చేశారు. ఆ సిరీస్ల ఆన్లైన్ వీక్షణలు కోట్లు దాటేశాయి. పారదర్శకత, దయతో తీర్పులు ఇవ్వాలని జడ్జి ఎప్పుడూ చెబుతుండేవారు. -
ఆసియాకు డబుల్ ఇంజిన్లు భారత్, చైనా!
న్యూఢిల్లీ: భారత్- చైనా సంబంధాలు మళ్లీ పట్టాలెక్కుతున్న తరుణంలో.. ఆ దేశ రాయబారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. స్వేచ్ఛా వాణిజ్యంతో ఇన్నాళ్లూ లాభపడిన అమెరికా ఇప్పుడు టారిఫ్ల పేరుతో బేరాలాడుతూ భారత్పై వేధింపులకు దిగుతోందని భారత్లో చైనా రాయబారి జు ఫెయింగ్హాంగ్ విమర్శించారు. భారత్పై అమెరికా ప్రభుత్వం 50 శాతం టారిఫ్లు విధించడాన్ని తమ దేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని చెప్పారు. మౌనంగా ఉంటే అమెరికా వేధింపుల్ని మరింతగా పెంచుతుందన్న ఆయన.. ఈ విషయంలో భారత్ పక్షాన చైనా గట్టిగా నిలబడుతుందని వెల్లడించారు. భారత ఉత్పత్తులకు చైనా మార్కెట్లను తెరవడంపై ఫెయింగ్ హాంగ్ స్పందిస్తూ... ఒకరి ఉత్పత్తులకు మరొకరు అవకాశమివ్వడం ద్వారా రెండు దేశాల అభివృద్ధికి ఎంతగానో అవకాశముందని చెప్పారు. ఆసియాకు రెండు దేశాలు డబుల్ ఇంజన్ల వంటివని అభివర్ణించారు. పోటీపరంగా చూస్తే ఐటీ, సాఫ్ట్వేర్, బయోమెడిసిన్ ఉత్పత్తుల్లో భారత్ మెరుగ్గా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నిర్మాణరంగం, నూతన ఇంధన రంగాల్లో చైనాది పైచేయిగా ఉందని వివరించారు. రెండు ప్రధాన మార్కెట్లు అనుసంధానమైతే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వివరించారు. భారత్పై అమెరికా సుంకాల (US Tariffs) విధింపు, వాటిని మరింత పెంచుతామని ఆ దేశం చేస్తున్న ప్రకటనలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వాణిజ్య, సుంకాల యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఫీహాంగ్ వ్యాఖ్యానించారు.ఇటువంటి సందర్భాల్లో మౌనంగా ఉండటం, రాజీ పడటం.. బెదిరింపులకు పాల్పడేవారికి మరింత ధైర్యాన్నిస్తుంది. చైనా (China)లోని తియాంజిన్ వేదికగా ‘షాంఘై సహకార సంస్థ’ (SCO) శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో భారత్ సహా అన్నిపక్షాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ‘‘అంతర్జాతీయ వేదికపై పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా భారత్, చైనాలు ఐక్యంగా ఉంటూ.. పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల స్నేహం.. ఆసియాకు, ప్రపంచానికీ మేలు చేకూరుస్తుంది. భారత్, చైనాలు కలిసి తమ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టగలవు’’ అని ఫీహాంగ్ పేర్కొన్నారు.జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలురష్యా నుంచి చమురు కొనుగోళ్లు చేస్తున్నందుకు భారత్పై అమెరికా విధించిన సుంకాలపై మాస్కో వేదికగా విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్.జైశంకర్ స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు కొనుగోలు చేస్తున్న దేశం భారత్ కాదని.. చైనా అని పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటనకు మాస్కో వెళ్లిన జైశంకర్ గురువారం రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలిశారు. ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్తో భేటీ అయ్యారు. ఆ తర్వాత జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో భారత్పై అమెరికా విధించిన సుంకాలపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జైశంకర్ ఘాటుగా స్పందించారు. అంతేకాదు.. మాస్కో నుంచి అత్యధిక స్థాయిలో ఎల్పీజీ దిగుమతి చేసుకుంటున్న దేశం కూడా భారత్ కాదని, యూరోపియన్ యూనియన్ అని వెల్లడించారు. ప్రపంచ ఇంధన ధరల స్థిరీకరణకు భారత్ సాయాన్ని అమెరికా కోరిందని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని అన్నారు. 2022 తర్వాత రష్యాతో వాణిజ్యం అత్యధికంగా జరిపిన దేశం కూడా భారత్ కాదని అన్నారు. అయినా భారత్పైనే ఎక్కువ సుంకాలు విధించడంలోని తర్కమేంటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. -
డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు అమెరికాలో అరుదైన గౌరవం
డాలస్, టెక్సస్: తెలుగు, హిందీ భాషల్లో పీహెచ్డిలు చేసిన రాజ్యసభ మాజీ సభ్యులు, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, రెండుమార్లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు టెక్సాస్ రాష్ట్రంలో అరుదైన గౌరవం లభించింది.టెక్సస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా, డాలస్ పరిసర ప్రాంతంలో నెలకొనిఉన్న మూడు ముఖ్య నగరాలైన ఫ్రిస్కో, గార్లండ్, లిటిల్ ఎల్మ్ నగరాల మేయర్లనుండి పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అభినందన పూర్వక అధికారిక గుర్తింపు పత్రాలు పొందడం తెలుగువారం దరికి గర్వకారణమని పలువురు ప్రవాస భారతీయులు కొనియాడారు. గార్లాండ్ నగర మేయర్ డిలన్ హెడ్రిక్ తో బుధవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో డా. యార్లగడ్డకు అధికారిక గుర్తింపు పత్రాన్ని మేయర్ స్వయంగా అందచేసి అభినందిం చారు.సాహిత్య రంగంలోనే గాక, సాంస్కృతిక రాయబారిగా, రచయితగా, ఉత్తర, దక్షిణ ప్రాంతాల భారతదేశ వారధిగా తన రచనలతో సౌభ్రాతృత్వం, జాతీయ ఐక్యతను పెంపొందించినదుకుగాను టెక్సాస్ రాష్ట్ర ప్రభుత్వంతో సహా టెక్సాస్ రాష్ట్రంలోని లిటిల్ ఎల్మ్, గార్లాండ్, ఫ్రిస్కో నగరాలు ఆయన్ను అభినందిస్తూ లేఖలు విడుదల చేశాయి. మంగళవారం సాయంత్రం ఫ్రిస్కోలో స్థానిక తెలుగు వారు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో వీటిని ఆయా నగరాల అధికార ప్రతినిధులు ఆచార్య యార్లగడ్డకు అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రవాసాంధ్రులు డా. యార్లగడ్డ ను ఘనంగా సత్కరించారు. టెక్సాస్ రాష్ట్ర గవర్నర్కు, ప్రభుత్వానికి, ప్రజలకు, ఆయా నగరాల మేయర్లకు, ప్రజలకు లక్ష్మీప్రసాద్ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సన్మాన కార్యక్రమంలో వేణు భాగ్యనగర్, ఆత్మచరణ్ రెడ్డి, గోపాల్ పోనంగి, డా. తోటకూర ప్రసాద్, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద సింగిరెడ్డి, అనంత్ మల్లవరపు, సమీర్, చాంద్ పర్వతనేని, సుబ్బారావు పర్వతనేని, లెనిన్ వేముల, ఉదయగిరి రాజేశ్వరి, రమణ్ రెడ్డి క్రిస్టపాటి, మాధవి లోకిరెడ్డి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డా. తుమ్మల చైతన్య, చినసత్యం వీర్నపు, కాకర్ల విజయమోహన్, అత్తలూరి విజయలక్ష్మి, ఎ. ల్ శివకుమారి, జ్యోతి వనం, మడిశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
భార్యభర్తల కేసు..! నవ్వు ఆపుకోవడం జడ్జి తరం కాలేదు..
ప్రపంచంలో అత్యంత దయగల న్యాయమూర్తిగా పేరుగాంచిన అమెరికన్ న్యాయమూర్తి ఫ్రాంక్ కాప్రియో ఇక లేరు. ప్యాంక్రియాటిక్ కేన్సర్తో పోరాడుతూ 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన పలు కేసుల విషయంలో వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఆయన కోర్టు గదిని దయతో న్యాయం అందించే పవిత్ర ప్రదేశంగా మార్చారు. ఆయన పలు తీర్పుల్లో నిందితులను దయతో క్షమించి మార్పు వచ్చేలా చేయడమే గాక బాధితుడికి న్యాయం అందేలా చేసేవారు కూడా. ఆయన తీర్పులందించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒకటి ఈ భార్యభర్తల కేసు. ఇది కోర్టులో అంత్యంత నవ్వులు పూయించిన కేసు. భర్తను డామినేట్ చేస్తూ తానే మాట్లాడుతూ ఉండటం చూసి జడ్డి కాప్రియో సైతం నవ్వు ఆపుకోలేకపోయారు. ఏంటంటే..భార్యభర్తలిద్దరూ ఒక కేసులో ఇరుకుంటారు. దాని విచారణ నిమిత్తం కోర్టుకి హాజరవుతారు. అయితే భార్య లిండా ఫీల్డ్స్ తన భర్తను మాట్లాడనివ్వకుండా జరిమాన విధించిన చలానా తీసుకుని స్పీడ్గా కోర్టులోకి వచ్చి నాన్స్టాప్గా మాట్లాడేస్తూ ఉంటుంది. మధ్యలో భర్త జోక్యం చేసుకోవాలని ప్రయత్నించినా..అవకాశం ఇవ్వకుండా. ఆ కారు తనదేనని, అయితే నడిపింది తన భర్తేనని చెబుతుంది. దోషిని తాను కానంటూ టకటక చెప్పేస్తుంది. ఆమె మాట్లకు ఆ కోర్టు హాలులో ఉన్నవాళ్లంతా పడి పడి నవ్వుతారు. ఆమె తీరు చూసి న్యాయమూర్తి కాప్రియో కూడా నవ్వు ఆపుకోలేకపోతారు. అయితే మీరు భర్తను ఈ కేసులోకి పూర్తిగా ఇరికించేయాలనుకుంటున్నారు కదా అని అడగ్గా..మరి నేనెందుకు బలవ్వాలి అంటూ బదులిస్తుంది. అంతా విన్నాక కాప్రియో అసలు ఎందుకు అంత వేగంగా వాహనాన్ని పోనిచ్చారని ఆమె భర్తను ప్రశ్నించగా దానికి కూడా ఆమెనే బదులిస్తుంది. తమకొడుకు ఘోరమైన ప్రమాదానికి గురై ఆస్పత్రిలో ఉన్నాడని. అతడి పర్యవేక్షణ నిమిత్తం తన భర్త రోజుకు రెండు మూడు సార్లు అక్కడకు వెళ్తున్నారని లిండా ఫీల్డ్స్ వివరిస్తుంది. ఆ హృదయపూర్వకమైన సంభాషణ అనంతరం ఆయన విశాల హృదయంతో ఆ కేసును కొట్టేస్తాడు. ట్విస్ట్ ఏంటంటే.. పసుపు లైట్ వెళ్లినప్పుడూ కారు నడిపినందుకే జరిమానా పడిందని అనుకుంటారు ఆ భార్యభర్తలు, కానీ రెడ్లైట్ పడినప్పుడే కారు నడిపామని సీసీఫుటేజ్ ద్వారా తెలుసుకుని కంగుతింటారు.ఇక్కడ ఈ కేసులో తన భర్తదే తప్పన్నట్లు..భార్య మాట్లాడటం, తన భర్తకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం..వంటి భార్య అమాయత్వం తీరు అందర్నీ ఆకట్టుకుంది. చివర్లో తన భర్త కావాలని వేగంగా వెళ్లలేదంటూ చెప్పి న్యాయమూర్తి మనసుని గెలుచుకుంది. ఇది న్యాయమూర్తి కాప్రియా విచారించిన కేసుల్లో అత్యంత నవ్వు తెప్పించిన హాస్యస్పదమైన భార్యభర్తల కేసుగా నిలిచిపోయింది. న్యాయమూర్తి కాప్రియో నేపథ్యం..కాప్రియో సఫోల్క్ విశ్వవిద్యాలయ లా స్కూల్ నుంచి గ్రాడ్యుయేన్ పూర్తి చేశారు. అతను రోడ్ ఐలాండ్ ఆర్మీ నేషనల్ గార్డ్లో పనిచేశాడు. అతను 1962లో ప్రావిడెన్స్ సిటీ కౌన్సిపట్టల్కు ఎన్నికయ్యాడు. కాప్రియో 1985 నుంచి 2023లో పదవీ విరమణ చేసే వరకు ప్రావిడెన్స్లో మునిసిపల్ జడ్జిగా పనిచేశారు. ఆయన 2018 నుంచి 2020 వరకు టెలివిజన్ సిరీస్ కాట్ ఇన్ ప్రావిడెన్స్లో దయగల న్యాయమూర్తిగా నటించిన తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. అదీగాక ఈ సిరీస్ జాతీయ స్థాయిలో ప్రశారం కావడంతో కాప్రియో మరింత ఫేమస్ అయిపోయారు. న్యాయం ఎల్లప్పుడూ దయను కలిగి ఉండాలనే ఆయన ఆ కాంక్షే ఈ సిరీస్ ప్రధాన ఉద్దేశ్యం కావడం విశేషం. అందువల్లే ఈ షో మరింత హైలెట్గా నిలిచి ఆయన పేరు దశదిశలా మారుమ్రోగిపోయింది. (చదవండి: ఓపెన్గా మాట్లాడేస్తా.. అంటే కుదరదు..! నటి శ్రుతి హాసన్ ఎదుర్కొన్న చేదు అనుభవం..) -
‘భారత్ ప్రత్యర్థేమీ కాదు’.. ట్రంప్కు నిక్కీ హేలీ హెచ్చరిక
వాషింగ్టన్: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిక్షాత్మక సుంకాలు విధించడాన్ని ఐక్యరాజ్యసమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ తప్పుబట్టారు. ట్రంప్ నిర్ణయాల కారణంగా వాషింగ్టన్- న్యూఢిల్లీ మధ్య సంబంధాలు విచ్ఛిన్నమయ్యే దశకు చేరుకున్నాయని ఆమె అన్నారు. వీటిని తిరిగి ట్రాక్లోకి తీసుకురావడం అత్యవసరమని ఆమె పేర్కొన్నారు.బుధవారం ప్రచురితమైన న్యూస్వీక్ ఆప్-ఎడ్లో.. ఆమె భారతదేశాన్ని చైనా మాదిరిగా ప్రత్యర్థిగా పరిగణించరాదని అన్నారు. ట్రంప్ విధించిన అదనపు సుంకాలు, భారత్- పాక్ మథ్య సంధి కుదిర్చానంటూ అమెరికా పేర్కొనడం.. రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య చీలికకు కారణమవుతున్నాయని హేలీ పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా భారత్- అమెరికా సంబంధాలలో విభేదాలు కనిపించాయని, ట్రంప్ యంత్రాంగం భారత్పై 25 శాతం సుంకాలతో దాడి చేసిందని ఆమె అన్నారు. భారత్-పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ చర్చలలో అమెరికా పాత్ర లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసిందన్నారు.2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ను సమర్థించిన నిక్కీ హేలీ ఇప్పుడు ఆయన చర్యలను తప్పుపడుతున్నారు. భారతదేశాన్ని అత్యుత్తమ ప్రజాస్వామ్య భాగస్వామిగా పరిగణించాలని, అది చైనా మాదిరిగా ప్రత్యర్థి కాదన్నారు. ఇప్పటివరకు రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఎటువంటి ఆంక్షలను విధించలేదని ఆమె పేర్కొన్నారు. ఆసియాలో చైనా ఆధిపత్యానికి దీటుటా ఎదుగుతున్న దేశంతో స్నేహ సంబంధాలను దూరం చేసుకోవడం వ్యూహాత్మక విపత్తు అవుతుందని ఆమె అధ్యక్షుడు ట్రంప్ను హెచ్చరించారు.భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, చైనా తర్వాతి స్థానంలో ఉందని హేలీ గుర్తుచేశారు. కమ్యూనిస్ట్ నియంత్రణలో ఉన్న చైనాతో పోలిస్తే, ప్రజాస్వామ్య భారతదేశం స్వేచ్ఛా ప్రపంచాన్ని బెదిరింపులకు గురిచేయదని ఆమె అన్నారు. ట్రంప్ మొదటి పరిపాలనా కాలంలో ఐక్యరాజ్యసమితికి 29వ అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ ఉన్నారు. అమెరికా అధ్యక్ష మంత్రివర్గంలో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్గా ఆమె పేరొందారు. -
రష్యా చమురుతో భారత సంపన్న కుటుంబాలే లాభపడుతున్నాయి
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ల అంశంపై అమెరికా మరోసారి స్పందించింది. ఈ క్రమంలో భారతీయ బిలియనీర్లపై అక్కసు వెల్లగక్కింది. ఈ మేరకు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ తాజాగా ఎన్బీసీ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ఏకంగా ఓ పత్రికలో వ్యాసం రాశారు. యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అంతర్జాతీయ వ్యాపార ఒప్పందాల్లో భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. రష్యాతో కొనసాగుతున్న చమురు వాణిజ్యం.. ఈ కుటుంబాలకే భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో.. ఆంక్షలనూ లాభార్జనగా మార్చుకున్నారు అని ఆరోపించారాయన.2022 కంటే ముందు.. ఉక్రెయిన్ సంక్షోభం కంటే ముందు రష్యా నుంచి భారత్ 1 శాతం కంటే తక్కువ చమురును కొనుగోలు చేసేది. ఇప్పుడది 42 శాతానికి చేరి ఉండొచ్చు. భారత దేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలు రష్యా ఆయిల్ను రీసెల్లింగ్ చేసుకుంటున్నాయి. తద్వారా.. 16 బిలియన్ డాలర్ల అదనపు లాభాలను(ఒక లక్షా ముప్పై వేల కోట్ల రూపాయలు) పొందుతున్నాయి. అందుకే భారత్పై సుంకాలను పెంచే ప్రణాళిక రూపొందించాం. ఇవి సెకండరీ టారిఫ్లుగా ఉండొచ్చు అని బెసెంట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. వైట్ హౌస్ ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో గతవారం ఓ ప్రముఖ పత్రిక కాలమ్లో భారతదేశంలోని చమురు వ్యాపారులపై తీవ్ర విమర్శలు చేశారు. రష్యా నుండి చమురు కొనుగోళ్లు భారతదేశపు ‘‘బిగ్ ఆయిల్’’ లాబీ లాభాపేక్ష వల్ల జరిగాయని.. దేశీయ అవసరాల కోసం కాదని అందులో పేర్కొన్నారు. ఆ కథనంలో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఎగుమతులపై 50% టారిఫ్లు విధించారు. ఇందులో సగం శిక్ష రష్యా చమురు కొనుగోళ్ల కారణంగా విధించబడనుంది. భారత్ మాత్రం తక్కువ ధర ఉన్న చోట నుంచి చమురు కొనుగోలు చేయడం తమ హక్కు అని పేర్కొంటూ, ఈ అదనపు టారిఫ్లను అసమంజసమైనవిగా చెబుతోంది. కానీ.. చరిత్రపరంగా చూస్తే.. భారత్ రష్యా చమురును ఎక్కువగా దిగుమతి చేసుకోలేదు. ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడేది. కానీ 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, G7 దేశాలు రష్యా చమురుపై $60-పెర బ్యారెల్ ధర పరిమితి విధించడంతో.. భారత్ తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసే అవకాశం పొందింది. ఇది అమెరికాకూ తెలుసు. ..ఇక చైనాపై సెకండరీ టారిఫ్లు విధించకపోవడానికి ఓ కారణం ఉంది. అది భారత్ కంటే ఎక్కువగా రష్యా చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే 2022 ముందు 13% ఉండగా, ఇప్పుడు 16%కి పెరిగింది. పైగా చైనా వివిధ దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకోవడమే కాకుండా.. విక్రయిస్తోంది కూడా. అందుకే అమెరికా చైనాపై అదనపు టారిఫ్లు విధించలేదు అని అన్నారాయన. -
విజయ్ దేవరకొండ, రష్మికకు అరుదైన గౌరవం
-
ఆరు వేల విద్యార్థి వీసాలు రద్దు
వాషింగ్టన్: అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దుచేయడం ఖాయమని గతంలోనే స్పష్టంచేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంతపనీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ, పలురకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్రా చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దుచేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.అమెరికా చట్టనిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ ఆరువేల మందిలో దాదాపు 4వేల మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ‘ఇమిగ్రేషన్, నేషనల్ యాక్ట్లోని మూడో సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు ప్చ్ఠ్డలికిన వారి వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల, యూదు వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది.ఉగ్రసంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ను అర్థంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెల్సిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా ‘పబ్లిక్’మోడ్లోనే ఉంచాలని సూచనలు చేయడం తెల్సిందే. -
కొత్తగా పెళ్లైన జంటలా రష్మిక-విజయ్.. ఆ వీడియోపై క్రేజీ కామెంట్స్!
టాలీవుడ్లో లవ్ బర్డ్స్గా పేరున్న జంట రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ. కొన్నేళ్లుగా వీరిద్దరిపై చాలా సార్లు డేటింగ్ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరూ కూడా రియాక్ట్ అవ్వలేదు. అయినప్పటికీ వీరిద్దరు చాలాసార్లు వేకేషన్స్, ఫెస్టివల్స్లో సందడి చేస్తూ కనిపించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు, వీడియోలతో నెటిజన్లకు ఈజీగా దొరికిపోవటం వీరిద్దరి స్పెషాలిటీ.తాజాగా ఈ జంట ఓకే వేదికపై అఫీషియల్గా మెరిశారు. అమెరికాలోని న్యూయార్క్లో నిర్వహించిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్లో సందడి చేశారు. అభిమానులకు అభివాదం చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ వైరలయ్యాయి. ఇది చూసిన నెటిజన్స్ మరోసారి క్రేజీ కామెంట్స్ చేశారు.అయితే ఈ పరేడ్కు సంబంధించిన మరో వీడియో నెట్టంట వైరల్గా మారింది. రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ షేర్ చేసిన ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మరింత సన్నిహితంగా కనిపించారు. పెన్నుతో విజయ్ దేవరకొండను పిలుస్తూ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. ఇది చూసిన ఫ్యాన్స్ వీరిద్దరిని చూస్తుంటే కొత్తగా పెళ్లైన వధూవరుల మాదిరి కనిపిస్తున్నారంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ జంటను కెమిస్ట్రీ న్యూ వెడ్డింగ్ కపుల్ వైబ్ను తలపిస్తోందంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.These two giving off some serious newlywed energy. 😍 The chemistry is unreal ❤️☺️They are giving major newly husband-wife vibes. Just saying.😉❤️#RashmikaMandanna ❤️#VijayDeverakonda ❤️ pic.twitter.com/0WsTeobHDZ— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) August 18, 2025 -
అమెరికా సుంకాలు.. రిస్క్లో 3 లక్షల ఉద్యోగాలు!
భారత ఎగుమతులపై అమెరికా విధించిన సుంకాలు వివిధ రంగాలలో ఆందోళనలను రేకెత్తించాయి. ఆంక్షల కారణంగా సుమారు 3,00,000 ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణుల అంచనా.అమెరికా విధించిన సుంకాల ప్రభావం చాలా వరకు వస్త్ర పరిశ్రమ, రత్నాల పరిశ్రమలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ రంగాల్లో పనిచేస్తున్న లక్షలమంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. అయితే.. ఎగుమతులు తగ్గినప్పటికీ.. దేశంలో డిమాండ్ ఉంటుందని, అమెరికా సుంకాలు భారత ఆర్ధిక వ్యవస్థ మీద పెద్దగా ప్రభావం చూపవని మరికొందరు చెబుతున్నారు.వస్త్ర, రత్నాల రంగాలను పక్కన పెడితే.. ఐటీ సర్వీస్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా అమెరికా సుంకాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఆటో విడిభాల సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని జీనియస్ హెచ్ఆర్టెక్ వ్యవస్థాపకులు & సీఎండీ ఆర్పీ యాదవ్ అన్నారు.భారతదేశం వస్త్రాలను, రత్నాభరణాలను ఎక్కువగా అమెరికాకు ఎగుమతి చేస్తోంది. అయితే టారీఫ్స్ పెరగడం వల్ల ఇప్పుడు ఇది ప్రశ్నార్థకంగా మారింది. సుంకాలు పెరగడం వల్ల.. ధరలు పెరుగుతాయి. దీనివల్ల మార్కెట్లో అమ్మకాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే మన దేశం ప్రత్యామ్నాయంగా వేరే దేశాలకు ఎగుమతి చేసుకోవడం ద్వారా.. నష్టాన్ని ఆపవచ్చు.ఇదీ చదవండి: బంగారం, వెండి & బిట్కాయిన్: ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?అమెరికాకు భారతదేశం ఎగుమతులు 87 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది జీడీపీలో కేవలం 2.2 శాతం మాత్రమే. ఫార్మా, ఎలక్ట్రానిక్స్ వంటి కీలక పరిశ్రమలు ప్రస్తుతానికి ప్రభావితం కాలేదు. భారత్ తన ఎగుమతులను ఇతర దేశాలకు మళ్లించగలదని టీమ్లీజ్ సర్వీసెస్లో ఎస్వీపీ బాలసుబ్రమణియన్ అనంత నారాయణన్ పేర్కొన్నారు. -
ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీతో భేటీ అనంతరం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్, జెలెన్స్కీ ఇరువురు సమావేశమయ్యేందుకు అమెరికా ఏర్పాట్లు చేస్తోందంటూ పేర్కొన్నారు. సుమారు నాలుగేళ్ల యుద్ధాన్ని ముగించేందుకు ఇది కీలక అడుగుగా అభివర్ణించిన ఆయన.. దీర్ఘకాలికశాంతి కోసం ప్రయత్నిస్తామన్నారు.‘‘ వైట్హౌస్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రెడిరిక్ మెర్జ్, యూరోపియన్ కమిషన్ ఉర్సులా వాండెర్లెయన్, నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టెతో జరిగిన చర్చలు అద్భుతంగా ముగిశాయి. వాషింగ్టన్ సమన్వయంతో యూరోపియన్ దేశాలు ఉక్రెయిన్కు భద్రతా హామీలు అందించాలనే దానిపైనే చర్చలు ప్రధానంగా సాగాయి. రష్యా, ఉక్రెయిన్లతో శాంతి నెలకొనబోతుందనే విషయంపై నేతలందరూ సంతోషం వ్యక్తం చేశారు. చర్చల ముగింపులో రష్యా అధ్యక్షుడు పుతిన్తో నేను ఫోన్ కాల్లో మాట్లాడాను. జెలెన్స్కీ, పుతిన్ మధ్య భేటీ నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. వీరి భేటీ ఎక్కడ జరగాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి నేను భేటీ అవుతాను. సుమారు నాలుగేళ్ల యుద్ధం ముగించేందుకు ఇదొక మంచి ముందడుగు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ సమన్వయంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య సమావేశం జరగనుంది’’ అని ట్రంప్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే భేటీ ఎప్పుడు.. ఎక్కడ నిర్వహిస్తారనేదానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. వైట్హౌజ్లో ట్రంప్-జెలెన్స్కీ, ఈయూ నేతల భేటీపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.అంతకు ముందు.. భేటీ ముగిశాక ట్రంప్తో జరిగిన చర్చలపై జెలెన్స్కీ సంతోషం వ్యక్తం చేశారు. చాలా నిర్మాణాత్మకంగా భేటీ జరిగిందని.. భద్రతా హామీలతో సహా పలు సున్నిత విషయాలపై మాట్లాడినట్లు తెలిపారు. త్రైపాక్షిక భేటీకి తాము సిద్ధమేనంటూ పేర్కొన్నారాయన. అదే సమయంలో జెలెన్స్కీతో పాటు వచ్చిన యూరోపియన్ నేతలు ట్రంప్తో చాలా కీలక విషయాలపై చర్చించారు. ఎవరేమన్నారంటే.. రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక సమావేశం, సెక్యూరిటీ గ్యారంటీలు చర్రితలో నిలిచిపోయే కీలక ముందడుగుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అభివర్ణించారు. రష్యాతో సమావేశానికి ముందే కాల్పుల విరమణ జరగాలని జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మెర్జ్ పేర్కొన్నారు. కాల్పుల విరమణ ఒప్పునేందుకు రష్యాపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ మాట్లాడుతూ.. ట్రంప్ త్రైపాక్షిక సమావేశంపై చర్చించారని, అయితే దీన్ని విస్తృతం చేసి యురోపియన్ నేతను ఆ భేటీకి అనుమతించాలని ప్రతిపాదించారు. ఇది యూరప్ మొత్తానికి సంబంధించిన విస్తృత భద్రతా హామీలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మాట్లాడుతూ ఈ వివాదం మళ్లీ తలెత్తకుండా ఎలా నిర్ధారించుకోవాలని ప్రశ్నించారు. శాంతి ఒప్పందానికి ఇది ముందస్తు షరతు అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసే దాడులను అడ్డుకోవాలని అందుకు మిత్రపక్షాలు కలిసిరావాలని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె పేర్కొన్నారు.ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇదివరకే రష్యా అధ్యక్షుడు పుతిన్తో ట్రంప్ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే ఇరు దేశాల నేతల ప్రకటనలతో.. ఆ చర్చల్లో అంతగా పురోగతి కనిపించలేదన్న విమర్శ వినిపించింది. పైగా అలస్కా భేటీలో పుతిన్ పెట్టిన భూభాగాల మార్పిడి షరతును జెలెన్స్కీ వ్యతిరేకించడంతో.. వైట్హౌజ్ చర్చలూ విఫలం కావొచ్చని అంతా భావించారు. అదే సమయంలో.. ఈ ఏడాదిలోనే వైట్హౌజ్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి చేదు అనుభవం ఎదురైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లు జెలెన్స్కీ విరుచుకుపడ్డారు. ఈ తరుణంలో అంచనాలకు భిన్నంగా తాజా భేటీ ప్రశాంత వాతావరణంలో.. అదీ యూరోపియన్ నేతల సమక్షంలో జరగడం గమనార్హం. -
అందుకే భారత్పై సుంకాలు.. చైనా, ఈయూ దేశాలకు మినహాయింపు
రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు జరుపుతుందని.. తద్వారా ఉక్రెయిన్ యుద్ధంలో పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్పై ఏకంగా 50 శాతం సుంకాలు(25 శాతం పెనాల్టీతో కలిపి) విధించింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతూ.. అదే పని చేస్తున్న చైనా, ఈయూల విషయంలో మినహాయింపు దేనికని అమెరికాను నిలదీసింది. దీనికి తోడు చైనా విషయంలో ట్రంప్ ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంపైనా పలు అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే..అమెరికా చైనాను ఎందుకు మినహాయించింది? ఇండియాపై భారీ టారిఫ్లు ఎందుకు? అనే ప్రశ్నలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వివరణ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ఈ ప్రశ్నలు ఎదురు కావడంతో ఆయన వివరణ ఇచ్చారు. ‘‘భారత్, చైనాలు రష్యా నుంచి చమురు కొనుగోలు జరిపే దేశాలే. ఆ రెండు మాస్కోకు ప్రధాన భాగస్వాములే. అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కానీ, భారత్తో పోలిస్తే చైనా పరిస్థితులు అందుకు కాస్త భిన్నంగా ఉన్నాయి.... భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేసి లాభపడుతోంది. అదే రష్యా నుండి చమురు కొనుగొలు చేసి.. దాన్ని శుద్ధి చేసి ప్రపంచ మార్కెట్కు చైనా విక్రయిస్తోంది. ఒకవేళ.. చైనా మీద మీద గనుక అదనపు సుంకాలు విధించాల్సి వస్తే ఆ ప్రభావంతో ప్రపంచ చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది’’ అని రుబియో వ్యాఖ్యానించారు.చైనాలో శుద్ధి అవుతున్న రష్యా చమురు గ్లోబల్ మార్కెట్లోకి వెళ్తోంది. ఒకవేళ చైనాపై అదనపు సుంకాలుగానీ, ఆంక్షలుగానీ విధించాల్సి వస్తే.. శుద్ధి చేసిన ఆ చమురు ప్రపంచ మార్కెట్కు అందదు. చమురు కొనుగోలు చేసే దేశాలు అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. లేదంటే.. ప్రత్యామ్నాయ వనరులు వెతకాల్సి ఉంటుంది. అంతెందుకు.. చైనా నుంచి శుద్ధి చేయబడిన చమురును యూరప్ దేశాలే కొనుగోలు చేస్తున్నాయి. అదే సమయంలో.. యూరప్ దేశాలు స్వయంగానూ చమురు, సహజ వాయువును రష్యా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకు ముందు.. చైనా, అమెరికాపై వంద శాతం సుంకాలు విధించాలనే సెనెట్ బిల్లు ప్రతిపాదనపై యూరోపియన్ దేశాలు పరోక్షంగా ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ ఆందోళన్నింటిని పరిగణనలోకి తీసుకునే ఆ పని చేయడం లేదు అని అన్నారాయన.మరి ఐరోపా దేశాలపై సుంకాలు?మరి రష్యా నుంచి చమురు, సహజ వాయువును కొనుగోలు చేస్తున్న యూరప్ దేశాలపై సుంకాలు విధిస్తారా? అనే ప్రశ్నకు రూబియో బదులిచ్చారు. యూరప్ నేరుగా ఆంక్షలు, సుంకాల విధింపు గురించి నా దగ్గర స్పష్టమైన సమాచారం లేదు. కానీ, పరోక్షంగా విధించే అవకాశాలు మాత్రం లేకపోలేదని అన్నారాయన. ఈ విషయంలో యూరోపియన్ దేశాలతో టిట్ ఫర్ టాట్ తరహా వాదనలు (tit-for-tat) చేయడం నాకు ఇష్టం లేదు. కానీ, ఈ సమస్యను పరిష్కరించడంలో యూరోప్ నిర్మాణాత్మక పాత్ర పోషించగలదని మాత్రం నమ్ముతున్నా అని రుబియో అభిప్రాయపడ్డారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధానికి తెర!
న్యూయార్క్: ఉక్రెయిన్లో శాంతిస్థాపనకు అమెరికా, ఐరోపా సమాఖ్య చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం స్వీయ సామాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘రష్యా విషయంలో భారీ పురోగతి సాధించాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తా’’ అని పేర్కొన్నారు. మరోవైపు, ఉక్రెయిన్ విషయమై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సానుకూల నిర్ణయం తీసుకున్నారని అమెరికా ప్రత్యేక దూత స్టీవ్ విట్కాఫ్ ప్రకటించారు. ‘‘ఉక్రెయిన్కు నాటో కూటమి తరహాలో అమెరికా, ఈయూ ‘రక్షణ హామీ’ ఇచ్చినా అభ్యంతరం లేదని పుతిన్ చెప్పారు. మొత్తం ప్రక్రియలో ఇదొక కీలక మలుపు. ఇకపై ఉక్రెయిన్ భూభాగాలను ఆక్రమించబోమని హామీ ఇచ్చారు. రష్యాతో విజయవంతంగా ఒప్పందం కుదుర్చుకోనున్నాం. నాటో కూటమికి గుండెకాయ అయిన క్లాజ్–5 తరహాలో ఉక్రెయిన్కు రక్షణ ఆఫర్ ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధపడ్డారు. ఈ ప్రయోజనం కోసమే ఉక్రెయిన్ నాటోలో చేరేందుకు ప్రయతి్నస్తోంది. ఇకపై ఆ అవసరం ఉండదు. ఉక్రెయిన్ నాటోలో చేరొద్దనేదే పుతిన్ ప్రధాన అభ్యంతరం. కనుక ట్రంప్ ఆఫర్ సమస్య పరిష్కారం చూపుతుంది. ప్రక్రియ సజావుగా సాగడానికి సమయం పట్టొచ్చేమో గానీ కచి్చతంగా శాంతి నెలకొంటుంది. మూడున్నరేళ్ల యుద్ధానికి తెర పడుతుంది’’ అన్నారు. 5వ క్లాజ్ ప్రకారం 32 నాటో దేశాల్లో దేనిపై శత్రువు దాడి చేసినా అన్ని దేశాలపై ఉమ్మడి దాడిగా పరిగణించి ప్రతి దాడికి దిగుతాయి.నేడు ట్రంప్–జెలెన్స్కీ భేటీ ట్రంప్ సోమవారం జెలెన్స్కీతో వైట్హౌస్లో భేటీ కానున్నారు. పుతిన్తో భేటీ వివరాలు, ప్రతిపాదనలను ఆయన ముందుంచనున్నారు. భేటీ విజయవంతమైతే ఈయూ దేశాల అగ్ర నేతలతోనూ ట్రంప్, జెలెన్స్కీ సమావేశం అవుతారు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ చాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫిన్లండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ తదితరులు పాల్గొంటారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరకున్నా అదే తరహాలో రక్షణ హామీ ఇచ్చేందుకు ట్రంప్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్ లేయిన్ చెప్పారు.డోన్బాస్ ఇచ్చేయండి డోన్బాస్ తూర్పు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్పై పుతిన్ అజమాయిషీ కోరుతున్నట్టు జెలెన్స్కీకి ట్రంప్ చెప్పారని సమాచారం. అవిచ్చేస్తే యుద్ధం ఆపేస్తానని పుతిన్ ప్రతిపాదించినట్టు వివరించారు. అందుకు జెలెన్స్కీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. సోమవారం ముఖాముఖిలో ఇందుకు జెలెన్స్కీని ఒప్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. తూర్పు డోన్బాస్ అంశమే శాంతి ఒప్పందానికి కీలకమని వైట్హౌస్ వర్గాలు వెల్లడించాయి. తూర్పు డోన్బాస్ను ఇచ్చేశాక పుతిన్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపేసినా, తమపై రష్యా భావి దండయాత్రకు అదే కారణంగా మారొచ్చన్నది జెలెన్స్కీ ఆందోళనగా కనిపిస్తోంది. -
అమెరికాలో కాల్పుల మోత.. ఉలిక్కిపడిన న్యూయార్క్
వాషింగ్టన్:అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్ నగరంలో ఆదివారం ఉదయం 3.30గంటల సమయంలో జరిగిన కాల్పుల మోతతో న్యూయార్క్ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్ ప్రాంతంలోని క్రౌన్ హైట్స్లో ఉన్న ‘టేస్ట్ ఆఫ్ ది సిటీ లాంజ్’ అనే రెస్టారెంట్లోకి చొరబడ్డ అగంతకుడు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఎనిమిదిమంది గాయపడ్డారు.కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.కాల్పుల ఘటనపై న్యూయార్క్ సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ కమిషనర్ జెస్సికా టిష్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ నిందితుల్ని అరెస్ట్ చేయలేదని తెలిపారు. ఘటన స్థలంలో కనీసం 36 బుల్లెట్ కేసింగ్స్ను సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా,ఈ కాల్పులు న్యూయార్క్ నగరంలో జరిగిన తీవ్రమైన కాల్పుల ఘటనల్లో ఒకటిగా భావిస్తున్నారు. -
అండర్–19 వరల్డ్కప్నకు అమెరికా
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అండర్–19 పురుషుల ప్రపంచకప్నకు అమెరికా జట్టు అర్హత సాధించింది. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న ఈ టోర్నమెంట్కు అమెరికా... చివరిదైన 16వ జట్టుగా ఎంపికైంది. ఇటీవలి కాలంలో సీనియర్ స్థాయిలో చక్కటి ప్రదర్శన కనబరుస్తూ అందరి ప్రశంసలు దక్కించుకుంటున్న అమెరికా... ఇప్పుడు జూనియర్ స్థాయిలోనూ సంచలనాలు రేపేందుకు సిద్ధమైంది. 2024లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన అండర్–19 ప్రపంచకప్లో పాల్గొన్న టాప్–10 జట్లు నేరుగా ఈ సారి బరిలోకి దిగనుండగా... ఆతిథ్య హోదాలో జింబాబ్వే వరల్డ్కప్ ఆడనుంది. మిగిలిన ఐదు జట్లను వేర్వేరు క్వాలిఫయింగ్ ఈవెంట్ల ద్వారా ఎంపిక చేశారు. తాజాగా అమెరికా అర్హత టోర్నీలో అదరగొట్టింది. బెర్ముడా, అర్జెంటీనా, కెనడాపై విజయాలు సాధించి... మరో మ్యాచ్ మిగిలుండగానే వరల్డ్కప్ బెర్త్ పట్టేసింది. జార్జియా వేదికగా డబుల్ రౌండ్రాబిన్ పద్ధతిలో జరుగుతున్న క్వాలిఫయింగ్ టోర్నీలో అర్జున్ మహేశ్ సారథ్యంలోని అమెరికా జట్టు చివరి మ్యాచ్లో 65 పరుగుల తేడాతో కెనడాపై విజయం సాధించింది. తద్వారా ప్రపంచకప్నకు అర్హత సాధించింది. 2026 అండర్–19 పురుషుల ప్రపంచకప్లో పాల్గొననున్న జట్లు జింబాబ్వే, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, భారత్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, జపాన్, స్కాట్లాండ్, టాంజానియా, అమెరికా. -
ట్రంప్-పుతిన్ల భేటీపై భారత్ స్పందన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య అలస్కాలో జరిగిన సమ్మిట్ను భారత్ స్వాగతించింది. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య సుదీర్ఘంగా సాగిన సమావేశాన్ని భారత్ అభినందించింది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న దీర్ఘ కాలిక యుద్ధానికి ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఎక్కడైనా శాంతికి తొలి అడుగు పడాలంటే అది చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.‘అమెరికా-రష్యా అధ్యక్షుల మధ్య జరిగిన సమావేశం పురోగతిని భారత్ అభినందిస్తుంది. చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే ముందుకు వెళ్లడం మంచి పరిణామం. ఉక్రెయిన్ దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న యుద్ధానికి సాధ్యమైనంత త్వరగా ముగింపు కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా, అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. భారత కాలమాన ప్రకారం శుక్రవారం(ఆగస్టు 15వ తేదీ) అర్థరాత్రి గం. 12.30 ని.లు దాటాకా ఇరువురి అధ్యక్షుల మధ్య దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసిపోయింది వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు.కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.మరొకవైపు ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తానని ట్రంప్ తెలిపారు. కానీ ఏం జరుగుతుందో తెలియదన్నారు. ‘రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు ట్రంప్. -
ట్రంప్కు జాన్ బోల్టన్ హెచ్చరిక.. ‘మాస్కో, బీజింగ్, ఢిల్లీ ఒక్కటైతే..’
వాషింగ్టన్: అమెరికా- భారత్ మధ్య వాణిజ్య సుంకాల యుద్ధం నడుస్తోంది. ఈ నేపధ్యంలో ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ మండిపడ్డారు. ట్రంప్ చర్యతో భారత్.. చైనా-రష్యా కూటమికి దగ్గరవుతుందని, ఇది అమెరికా అధ్యక్షుని వ్యూహాత్మక తప్పిదంగా పరిణమిస్తుందని జాన్ బోల్టన్ పేర్కొన్నారు.రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారతదేశంపై అమెరికా అదనపు సుంకాలు విధించడాన్ని జాన్ బోల్టన్ తప్పుబట్టారు. అలాస్కాలోని యాంకరేజ్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రష్యా కౌంటర్ వ్లాదిమిర్ పుతిన్ల సమావేశ సమయంలో జాన్ బోల్టన్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశంపై సుంకాలు విధించారని అయితే ఇదేవిధంగా రష్యా నుండి అత్యధిక మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అదనపు సుంకాలను విధించలేదన్నారు. ఈ చర్య భారతదేశాన్ని చైనా-రష్యా కూటమి వైపు ఆకర్షితమయ్యేలా చేయవచ్చని బోల్టన్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.‘Unforced error’: John Bolton calls Trump’s anti-India pitch lack of strategic thinking https://t.co/CVDLrD07ll— Financial Express (@FinancialXpress) August 15, 2025సీఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ, రష్యా నుండి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న భారతదేశం లాంటి దేశాలపై వైట్ హౌస్ ద్వితీయ సుంకాలను విధించిందని అన్నారు. భారతదేశంపై 25 శాతం సుంకం విధించిందని. అయితే ఇది ఇంకా అమలు కాలేదన్నారు. దీనిపై భారత్ చాలా ఆగ్రహంతో ఉన్నదని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనాపై అలాంటి సుంకం విధించకుండా భారత్పైననే విధించడమేమిటని బోల్టన్ ప్రశ్నించారు. మాస్కో, బీజింగ్, ఢిల్లీ(మూడు దేశాల రాజధానులు) ఒక్కటైతే అమెరికాపై ప్రతికూల పరిణామాలు తలెత్తవచ్చని హెచ్చరించారు. 2018 తర్వాత పుతిన్ భారత్ పర్యటన, భారత ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనలు అమెరికాపై ప్రతికూల పరిణామాలకు ఉదాహరణలు కావచ్చని బోల్టన్ అన్నారు. ట్రంప్ ఎటువంటి సంప్రదింపులు లేకుండా సుంకాల విషయంలో నిర్ణయం తీసుకున్నారని బోల్టన్ ఆరోపించారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఈ పర్యటన 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా జరుగనుంది. మరోవైపు ఈ నెల చివరిలో ప్రధాని మోదీ చైనాను సందర్శించే అవకాశం ఉంది. ఆగస్టు 31- సెప్టెంబర్ ఒకటి మధ్య టియాంజిన్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. -
ట్రంప్, పుతిన్ మధ్య ముగిసిన భేటీ.. యుద్ధంపై ట్విస్ట్!
అలాస్కా: అమెరికాలోని అలాస్కా వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన కీలక భేటీ ముగిసింది. దాదాపు మూడు గంటల పాటు సాగిన ఈ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే ముగిసింది. వీరి భేటీపై ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూసినప్పటికీ అనుకున్న ఫలితం మాత్రం దక్కలేదు. అయితే, వీరి మధ్య మరో సమావేశం రష్యాలో జరగనుందని పుతిన్ చివరలో ట్విస్ట్ ఇచ్చారు. కీలక సమావేశం అనంతరం ఇద్దరు నేతలు భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. సమావేశంలో అనేక విషయాలు చర్చకు వచ్చాయి. కానీ, యుద్ధానికి సంబంధించిన తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడించారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించాం. అయితే, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్పై సంతకం చేసే వరకు ఒప్పందం కుదరనట్టే అవుతుంది. త్వరలో తాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, యురోపియన్ యూనియన్ నేతలతో మాట్లాడతానని ట్రంప్ తెలిపారు. తాను మళ్లీ పుతిన్ను కలుస్తానని చెప్పుకొచ్చారు.#WATCH | Alaska, USA | US President Donald Trump says, "We had a very productive meeting, there were many points that we agreed on. Couple of big ones that we haven't quite gotten there but we made some headway. There's no deal until there's a deal so I will call up NATO in a… pic.twitter.com/mY5t9zkoCT— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో డీల్ పూర్తికావడంపై నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేతుల్లోనే ఉంది. ఒప్పందం చేసుకోవాలని జెలెన్స్కీకి సూచిస్తా. కానీ, వాళ్లు అందుకు నిరాకరించే అవకాశం ఉంది. రష్యా చాలా శక్తిమంతమైన దేశం. పుతిన్-జెలెన్స్కీల సమావేశం జరుగుతుందని ఆశిస్తున్నా. అందులో నేను కూడా చేరే అవకాశం ఉందన్నారు. పుతిన్తో ఏయే విషయాలు చర్చించారు..? ఇంకా మిగిలి ఉన్న అంశాలు ఏంటనే విషయంపై వివరించేందుకు ట్రంప్ నిరాకరించారు. #WATCH | Alaska, USA | Russian President Vladimir Putin says, "... We see the strive of the administration and President Trump personally to help facilitate the resolution of the Ukrainian conflict and his strive to get to the crux of the matter to understand this history is… pic.twitter.com/kiOKgw2JBf— ANI (@ANI) August 15, 2025అనంతరం, పుతిన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు ట్రంప్తో సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రంప్నకు ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయితీగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్ మరో మారు పేర్కొన్నారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ట్రంప్తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్తో మాస్కో మంత్రి సంబంధాలు ఏర్పరచుకుందని పుతిన్ వెల్లడించారు. కాగా, తదుపరి సమావేశం మాస్కోలో అని పుతిన్ పేర్కొన్నారు.#WATCH | Alaska, USA | "Next time in Moscow," says Russian President Vladimir Putin as US President Trump thanks his counterpart for today's meeting."... I could see it happening," replies President Trump.Source: The White House/ YouTube pic.twitter.com/N3U6Rygllj— ANI (@ANI) August 15, 2025 పుతిన్కు ఘన స్వాగతం..ఇదిలా ఉండగా.. అమెరికాలోని అలస్కా ఈ సమావేశానికి వేదికైంది. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మైక్రో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, రష్యా తరఫున విదేశాంగ శాఖ మంత్రి సర్గెయ్ లావ్రోవ్, విదేశాంగ విధాన సలహాదారు యురి యుషకోవ్ పాల్గొన్నారు. ఇరు దేశాల నుంచి ముగ్గురు చొప్పున పాల్గొన్నారు. తొలుత ట్రంప్, పుతిన్ మధ్యే చర్చలు జరుగుతాయని వార్తలు వచ్చినప్పటికీ ఇరుదేశాల ప్రతినిధుల బృందం ఈ భేటీలో పాల్గొంది. వీరి భేటీ ముగిసినట్లు వైట్హౌస్, క్రెమ్లిన్లు ప్రకటించాయి.#WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin exchange greetings in Anchorage, ahead of their talks.Source: Reuters pic.twitter.com/mdGoQe6qqx— ANI (@ANI) August 15, 2025 అంతకు ముందు తొలుత ఇద్దరు నేతలు అలాస్కాలోని యాంకరేజ్కు చేరుకున్నారు. అక్కడ పుతిన్కు ట్రంప్ స్వాగతం పలికారు. ఇరువురు నేతలు ట్రంప్కు చెందిన వాహనంలో సమావేశాని భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఇరువురు నేతలను మీడియా పలు ప్రశ్నలు అడిగినప్పటికీ సమాధానం చెప్పకుండానే వెళ్లారు. ప్రపంచ దేశాలన్నీ ఈ భేటీని అత్యంత ఆసక్తిగా గమనించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రకటన వెలువడకపోవడంతో కథ మళ్లీ ముందుకే వచ్చింది. #WATCH | Alaska, USA | US President Donald Trump and Russian President Vladimir Putin share the same car to reach the venue for their talks. Source: Reuters pic.twitter.com/X9YkJvqb6g— ANI (@ANI) August 15, 2025 -
ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతేడాది మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఐదు నెలల జైలు శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో అందించారు.తాజాగా, గ్రాడ్యుయేషన్ నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్పోర్టును విడుదల చేసింది. దీంతో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్కు తిరిగి రానున్నారు. ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత..తన తండ్రి కేసీఆర్ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లనున్నారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు. -
అమెరికా ఓవరాక్షన్.. ఎర్రకోటపై ట్రంప్కు మోదీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ: దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికాకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో భారత శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు.దేశంలో 79వ స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించారు. అనంతరం, అమెరికా సుంకాల బెదిరింపుల నేపథ్యంలో పౌరులను ఉద్దేశిస్తూ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్రకోటపై మోదీ మాట్లాడుతూ.. ‘కొందరు భారత్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. చరిత్రను లిఖించాల్సిన సమయం ఆసన్నమైంది. మనం ప్రపంచ మార్కెట్ను పాలించాలి. ఉత్పత్తి ఖర్చులను తగ్గించుకోవాలి. నాణ్యమైన ఉత్పత్తులతో ప్రపంచ మార్కెట్లో మన సామర్థ్యం నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. తక్కువ ధర, అధిక నాణ్యత అని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఆర్థిక స్వార్థం పెరుగుతోంది. మన లక్ష్యాలను చేరుకోవడానికి ముందుకుసాగాల్సిన సమయం ఇది అని పిలుపునిచ్చారు.#WATCH | Delhi: Prime Minister Narendra Modi says, "... Viksit Bharat ka aadhar bhi hai Aatmanirbhar Bharat... If someone becomes too dependent on others, the very question of freedom starts to fade... Aatmanirbhar is not limited merely to imports, exports, rupees, pounds, or… pic.twitter.com/ZmP6uYoezm— ANI (@ANI) August 15, 2025ఇదే సమయంలో మన శక్తిని ఇతరులను తక్కువ చేసి మాట్లాడటంలో వృథా చేయకూడదని సూచించారు. మనల్ని మనం బలోపేతం చేసుకోవడంపై దృష్టిసారించాలన్నారు. దేశంలోని వ్యాపారులు, దుకాణదారులు స్వదేశీ ఉత్పత్తుల అమ్మకాలపై దృష్టిపెట్టాలన్నారు. ప్రపంచం మన పురోగతిని గమనిస్తుందన్నారు. ప్రభుత్వ విధానాలతో మార్పులు అవసరమైతే తెలియజేయాలని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక విధానాలను సహించేది లేదన్నారు. రైతులు మన ఆర్థిక వ్యవస్థకు ఎంతో తోడ్పడతారు. అన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడాలి. డీజిల్, పెట్రోల్ దిగుమతులపై లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. కొత్త ఇంధనాల అభివృద్ధితో పెట్రోలియం దిగుమతులు తగ్గించాలి. నేడు ప్రపంచమంతా కీలక ఖనిజాల చుట్టే తిరుగుతోంది అంటూ కామెంట్స్ చేశారు.A very sharp message from PM Modi: Don’t waste your energy containing the other, focus all your energy on boosting your own. Economic selfishness is on the rise, but we must not sit and cry about it. Focus on building your future. No “selfishness” can trap us. This goes hard. pic.twitter.com/duImGAtzjJ— Shubhangi Sharma (@ItsShubhangi) August 15, 2025 -
భారతీయ గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు స్వల్ప ఊరట
వాషింగ్టన్: ఉపాది ఆధారిత(ఈబీ) కేటగిరీలో తమ కుటుంబసభ్యులకు గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ గ్రీన్కార్డ్దారులకు అమెరికా ప్రభుత్వం స్వల్ప ఊరట అందించింది. తమ జీవితభాగస్వామి, 21 ఏళ్ల వయసులోపు సంతానానికి సైతం గ్రీన్కార్డ్ రావాలని ఆశించే భారతీయ గ్రీన్కార్డుదారులు సమరి్పంచే దరఖాస్తులకు పరిశీలన గడువును పొడిగించారు. సాధారణంగా ఏప్రిల్ ఒకటో తేదీలోపు తేదీని కటాఫ్ తేదీగా పరిగణిస్తారు. కానీ ఈసారి జూన్ ఒకటోతేదీని కటాఫ్ తేదీగా పరిగణనలోకి తీసుకుంటామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. గడువు పొడిగించిన నేపథ్యంలో కాస్త ఆలస్యమైనాసరే అర్హత గల భారతీయ గ్రీన్కార్డ్దారులు తమ కుటుంబసభ్యుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. ఉపాధి ఆధారిత(ఈబీ) కేటగిరీ కింద వచ్చే భారతీయ దరఖాస్తులను ఈబీ–2, ఈబీ–3 దరఖాస్తులుగా వ్యవహరిస్తారు. జీవితభాగస్వామి, 21ఏళ్లలోపు పెళ్లికాని తమ సంతానం కోసం ఎఫ్2ఏ కేటగిరీ కింద భారతీయులు దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు గడువు తేదీ ఏప్రిల్ ఒకటో తేదీనే ముగుస్తున్నప్పటికీ భారతీయ గ్రీన్కార్డ్దారులకు మాత్రం జూన్ ఒకటో తేదీదాకా అనుమతిస్తున్నట్లు ‘యూఎస్ వీసా బులెటిన్, సెప్టెంబర్–2025’పేర్కొంది. 2025 ఏడాదికిగాను కుటుంబ ఆధారిత గ్రీన్కార్డ్లను 2,26,000కు పరిమితం చేశారు. ఉపాధి ఆధారిత(ఈబీ) కేటగిరీలో గ్రీన్కార్డ్లకు సైతం 1,50,037గా పరిమితి విధించారు. ఇక వీసాల విషయానికొస్తే మొత్తం వీసాల్లో ప్రతిదేశం తమ కోటా కింద 7 శాతం వరకు అంటే దాదాపు 26,323 వరకు వీసాలు పొందొచ్చు. డిపెండెంట్ వీసా అనేది ప్రతీదేశానికి గరిష్టంగా 2 శాతమే ఇస్తారు. చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ తరహాలో భారత్కు సైతం దేశాలవారీ కోటా కిందే వీసాలు దక్కుతున్నాయి. మరోవైపు సెపె్టంబర్ 30వ తేదీలోపు డైవర్సిటీ ఇమిగ్రేషన్ వీసా కోసం దరఖాస్తుచేసుకోవాలని వీసా బులెటిన్లో అమెరికా ప్రభుత్వం పేర్కొంది. లాటరీ విధానంలో ప్రతిఏటా 55,000 మందికి ఈ వీసాలను అందజేస్తారు. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా, బ్రెజిల్, నైజీరియాసహా 20 దేశాలకు చెందిన వారికి మాత్రమే ఈ వీసా ఇస్తారు. -
TDF: అమెరికాలో ఘనంగా టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
మిల్పిటాస్ (కాలిఫోర్నియా): తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం 25 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) USA రజతోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్ ఇండియా కమ్యూనిటీ సెంటర్లో ‘ ప్రగతి తెలంగాణం’ పేరిట ఈ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ఇండియా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు పంపగా, ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, విద్యాశాఖ కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, మాజీ ఎంపీ ఆత్మచరణ్ రెడ్డి, సాన్ఫ్రాన్సిస్కో భారత కాన్సుల్ జనరల్ డా. కే. శ్రీకర్ రెడ్డి, ఎంవీ ఫౌండేషన్ నేషనల్ కన్వీనర్ వెంకటరెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ మాజీ డైరెక్టర్ డా. ఎం.వి. రెడ్డి, ‘ఆటా’ అధ్యక్షుడు జయంత్ చల్లా తదితరులు హాజరయ్యారు.కలర్ఫుల్గా మూడు రోజుల వేడుకలుటీడీఎఫ్ అమెరికా చైర్మన్ మురళి చింతలపాణి, అధ్యక్షుడు మణికొండ శ్రీనివాస్, కన్వీనర్ మహేందర్ రెడ్డి గూడూరు, కో-కన్వీనర్ సుజేందర్ ప్రొదుటూరి సమన్వయంతో జరిగిన ఈ వేడుకల్లో తెలంగాణ బిజినెస్ ఫోరం, పొలిటికల్ ఫోరం, స్టార్టప్ ఫోరం, విజన్ తెలంగాణ-2050 వంటి అంశాలపై చర్చలు జరిగాయి. 2050 నాటికి తెలంగాణను ప్రగతిశీల రాష్ట్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై ప్యానెలిస్టులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.పురస్కారాల ప్రదానంఈ సందర్భంగా లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు డా. దివేష్ అనిరెడ్డి, డా. గోపాల్ రెడ్డి గాదేలకు, టీడీఎఫ్ లైఫ్టైమ్ ఫిలాంత్రఫీ అవార్డు టీ. రామచంద్రరెడ్డికి ప్రదానం చేశారు. సోషల్ ఇంపాక్ట్ పార్ట్నర్ అవార్డులు గ్లోబల్ ప్రగతి సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ అలోక్ అగర్వాల్, డాక్టర్ సంగీతకు అందజేశారు. టీడీఎఫ్ పూర్వ అధ్యక్షురాలు చల్లా కవితను ఘనంగా సత్కరించారు. వారి సేవలను ప్రతిబింబించే ప్రత్యేక వీడియోలు ప్రదర్శించారు.సాంస్కృతిక వైభవంతెలంగాణ ఫోక్ నైట్, ఆటా పాటలు, బోనాల వేడుకలు ఆహూతులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబించిన ఈ కార్యక్రమాల్లో యాంకర్ వాణి గడ్డం తెలంగాణ యాసతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రీరామ్ వెదిరె, బిక్ష గుజ్జ నీటి నిర్వహణపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. టీడీఎఫ్ సీనియర్ నాయకులు మధు కె. రెడ్డి, సుధీర్ కోదాటి, ఎలక్ట్ ప్రెసిడెంట్ భరత్ నేరవెట్ల, ఉపాధ్యక్షురాలు ప్రీతి జొన్నలగడ్డ, స్వాతి సుదిని, ఉపాధ్యక్షులు శ్రావణ్ పోరెడ్డి, శ్రీని గెల్లిపెల్లి, సెక్రటరీ రాజ్ గడ్డం, జాయింట్ సెక్రటరీ మనోహర్, ట్రెజరర్ శ్రీకళ, ట్రస్టీలు గోపాల్ రెడ్డి గాదే, ఇందిరా, కళ్యాణ్ రెడ్డి, కాసప్ప, రవిరెడ్డి, సదానంద్, విజేందర్, వినయ తదితరుల సమిష్టి కృషితో ఈ వేడుకలు విజయవంతమయ్యాయి. 70 మంది బేఏరియా TDF వాలంటీర్లు వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు. తెలంగాణ నుంచి, అమెరికా నలుమూలల నుంచి ప్రవాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. -
అదే జరిగితే భారత్కు మరిన్ని సుంకాలు తప్పవు: అమెరికా
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్పై సెకండరీ టారిఫ్లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్పై అగ్రరాజ్యం టారిఫ్లు 50 శాతానికి చేరింది. ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్న్యూస్తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి. -
టారిఫ్లు ఆర్నెల్లు మించి ఉండవు..
ముంబై: అమెరికా టారిఫ్లకు సంబంధించి సవాళ్లు వచ్చే ఒకటి రెండు త్రైమాసికాల్లో సమసిపోతాయని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. దేశం దీర్ఘకాలిక సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ప్రైవేటు రంగం మరింత ప్రముఖ పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. 2023–24లో జీడీపీ వృద్ధి 9.2 శాతం నుంచి 2024–25లో 6.5 శాతానికి తగ్గిపోవడానికి కఠిన రుణ పరిస్థితులు, లిక్విడిటీ అంశాలను కారణాలుగా పేర్కొన్నారు. సరైన వ్యవసాయ విధానాలను అమలు చేస్తే నిజమైన జీడీపీ వృద్ధికి 25 శాతం అదనపు తోడ్పాటునిస్తాయన్నారు. రత్నాభరణాలు, రొయ్యలు, టెక్స్టైల్స్ రంగాలపై అమెరికా టారిఫ్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ, వీటిని ఎదుర్కోవడం కష్టమన్నారు. ప్రభావిత రంగాలతో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రభుత్వం నుంచి చర్యలు ఉంటాయంటూ, కొంత ఓపిక పట్టాలని కోరారు. అమెరికా వాణిజ్య బృందం ఈ నెల చివర్లో భారత్కు చర్చలకు రానున్న నేపథ్యంలో.. అలాస్కాలో యూఎస్ అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశం ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. టారిఫ్ సంబంధిత అంశాలపై దృష్టి పెడుతూ.. అదే సమయంలో ముఖ్యమైన సవాళ్లను విస్మరించరాదన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) కారణంగా పడే ప్రభావం, కీలక ఖనిజాల కోసం ఒకే దేశంపై ఆధారపడడం వంటి సవాళ్లను ప్రస్తావించారు. రానున్న సంవత్సరాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితుల్లో, ప్రైవేటు రంగం సైతం దీర్ఘకాల దృష్టితోనే ఆలోచించాలని సూచించారు. విధానపరమైన మద్దతు పరిశోధనల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించిందని, తమ వంతు పెట్టుబడులు పెంచాల్సిన బాధ్యత ప్రైవేటు రంగంపై ఉన్నట్టు సీఈఏ అనంత నాగేశ్వరన్ చెప్పారు. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. దేశీయంగా వినియోగం బలంగా ఉన్నట్టు చెప్పారు. చైనాతో 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును ప్రస్తావిస్తూ.. దిగుమతులను మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రైవేటు రంగం కీలక పాత్ర పోషించాలని కోరారు. -
అమెరికాలో హిందూ ఆలయం ధ్వంసం
వాషింగ్టన్: అమెరికాలోని ఇండియానా నగరంలో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ వారం ప్రారంభంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 10న గ్రీన్వుడ్ నగరంలోని బీఏపీఎస్ స్వామినారాయణ ఆలయంలో ఈ ద్వేషపూరిత చర్య జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు. షికాగోలోని భారత కాన్సులేట్ ఈ సంఘటనను తీవ్రంగా ఖండించింది. ‘ఇండియానాలోని గ్రీన్వుడ్లోని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయం ప్రధాన సైన్బోర్డును అపవిత్రం చేశారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం’ అని ఎక్స్లో ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ దుశ్చర్యకు వ్యతిరేకంగా ‘ఐక్యత–సంఘీభావం’ కార్యక్రమం నిర్వహించింది. గ్రీన్వుడ్ మేయర్ సహా భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కాన్సులర్ జనరల్ మాట్లాడారు. హిందూ సమాజం మరింత బలోపేతమవ్వాలన్న విషయాన్ని ఈ ఘటన గుర్తు చేసిందన్నారు. దుండగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. -
వచ్చే నెలలో అమెరికాకు మోదీ
ఐక్యరాజ్యసమితి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్లో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 9 నుంచి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ(యూఎన్జీఏ) వార్షిక ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి 29 దాకా జనరల్ డిబేట్ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారని సమాచారం. డిబేట్లో ప్రసంగించేవారి పేర్ల జాబితాను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. ఇందులో మోదీ పేరును సైతం చేర్చారు. సంప్రదాయం ప్రకారం తొలుత బ్రెజిల్, తర్వాత అమెరికా అధినేత ప్రసంగిస్తారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే నెల 23న యూఎన్జీఏ పోడియం నుంచి ప్రసంగించబోతున్నారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో చేయబోతున్న తొలి ప్రసంగం ఇదే కావడం విశేషం. సెప్టెంబర్ 26న మోదీ ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. అదే రోజు ఇజ్రాయెల్, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ నేతలు కూడా మాట్లాడుతారు. మరోవైపు అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు సమాచారం. భారత ఉత్పత్తులపై విధించిన 50 శాతం సుంకాలపై ట్రంప్తో ఆయన చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో పర్యటించారు. వైట్హౌస్లో ట్రంప్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
ఈ బుల్లిరాయి భూమికే పెద్దన్న
ఇంటికి అతిథిగా చిన్ననాటి స్నేహితులు, ఆప్తులు వస్తే ఎంతో ఆత్మీయంగా, సాదరంగా ఆహ్వానిస్తాం. మళ్లీ ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తాం. అలాంటి ఎదురుచూపులకు తావివ్వకుండా ఒక అతిథి ఒక అమెరికన్ ఇంట్లోకి ప్రవేశించింది. తలుపు గడియ కొట్టి సింహద్వారం గుండా రాకుండా నేరుగా ఇంటి పైకప్పుకు కన్నం వేసి ఇంట్లోకి దూరింది. మెరుపువేగంతో దూసుకొచ్చిన ఆ అతిథిని చూసి ఆ ఇంటాయన అవాక్కయ్యారు. ఎందుకంటే అది చిన్న రాయి. అది కూడా నిన్న మొన్న నేల తవ్వి తీసిన రాయి కాదు. గట్టిగా మాట్లాడితే అది అసలు భూమి మీది రాయే కాదు. ఆ రాయి ఉద్భవించినప్పుడు మన పుడమి కూడా పుట్టలేదు. మరి ఆ రాయి ఎక్కడిది? అంటే అంతరిక్షంలో అంగారకుడు, బృహస్పతి గ్రహాల మధ్యలోని గ్రహశకలాల కూటమి నుంచి భూమి వైపు ఇలా దూసుకొచ్చింది. భూమి ఏర్పడకముందు ఆస్ట్రరాయిడ్ బెల్ట్లోనే చక్కర్లు కొట్టిన ఈ రాయి జూన్ 26వ తేదీన భూవాతావరణంలోకి చొరబడి చివరకు అమెరికాలో నేలను తాకింది. ఈ బుల్లి గ్రహశకలానికి ‘ది మెక్డోనా’ అని పేరు పెట్టారు. జార్జియా రాష్ట్రంలోని ఒక ఇంటి పైకప్పుకు రంధ్రం చేసి మరీ లోపల పడిన ఈ రాయిని జార్జియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంతరిక్ష వస్తువుగా గుర్తించారు. అట్లాంటా ఆకాశంలో తోకచుక్కలా..భూమి మీద పడటానికి కొద్దిసేపటి ముందు పట్టపగలే ఇది తోకచుక్కలా అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ దూసుకొచ్చింది. చిన్నపాటి అగ్నిగోళంగా మండుతున్న దీనిని అమెరికాలోని వేర్వేరు రాష్ట్రాల ప్రజలు వీక్షించి తమ కెమెరాల్లో బంధించారు. ఎట్టకేలకు ఇది హెన్రీ కౌంటీనిలోని మెక్డోనా ప్రాంతంలోని ఇంట్లో ఇది పడింది. ఇది పడినప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్తో షూట్చేస్తే ఎలాంటి శబ్దం వస్తుందో అచ్చం అలాంటి శబ్దం వచ్చిందని ఇంటి యజమాని చెప్పారు. విషయం తెల్సుకున్న జార్జియా వర్సిటీలోని భూవిజ్ఞాన శాస్త్రవేత్త స్కాట్ హారిస్ వెంటనే రంగంలోకి దిగి ఆ ఇంట్లోని చెల్లాచెదురుగా పడిన 50 గ్రాముల ఖగోళదూళిని సేకరించారు. అందులో 23 గ్రాముల నాణ్యమైన ధూళిని అత్యంత శక్తివంతమైన ఆప్టికల్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లతో పరిశీలించారు. అది ఏకంగా 456 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన లో మెటల్(ఎల్) ఆర్డినరీ ఖోన్డ్రైట్ మూలకంతో ఏర్పడిందని తేల్చారు. ఈ లెక్కన ఈ రాయి భూమి కంటే ముందే ఏర్పడింది. ఇన్నాళ్లూ ఇది తన భారీ గ్రహశకలాలలో భాగంగా ఉండేది. అయితే దాదాపు 47 కోట్ల సంవత్సరాల క్రితం గ్రహశకలం మరింత చిన్నపాటి ముక్కలుగా ఛిద్రమైంది. అలా ఏర్పడిన చిన్నపాటి రాళ్లలో అమెరికాలో పడిన రాయి కూడా ఒకటి అని జార్జియా వర్సిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. ‘‘ ఈ బుల్లి రాయి 0.50 క్యాలిబర్ బుల్లెట్ కంటే రెట్టింపు పెద్దదిగా ఉంది. కాంతి వేగంతో ఇది భూ వాతావరణంలోకి ప్రవేశించింది. భూ వాతావరణంలోకి వచ్చాక అధిక గాఢత ఉన్న గాలి దీని వేగాన్ని ఒక్కసారిగా తగ్గించింది. దీంతో ఘర్షణ ఏర్పడి మండింది. వేగం సెకన్కు కిలోమీటర్కు తగ్గి చివరకు పైకప్పును చీల్చుకుంటూ నేలపై పడింది. దీనికి అధికారికంగా పేరు పెట్టేందుకు గ్రహశకలాల సంఘం కమిటీకి పంపించారు. పేరు పెట్టాక గ్రహశకలాల సంబంధ బులె టిన్లో ముద్రి స్తారు. పురాతన ఖగోళ ఖజా నాగా దీనిని అభి వర్ణిస్తున్నారు. దీని నిర్మాణం ద్వారా ఆనాటి అంతరిక్ష వాతావరణ పరిస్థితులను అంచనావే సేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్ని స్తున్నారు. విశ్వం ఇప్పటికీ తన రహస్యాలను ఒక్కొక్క టిగా మనకు తెలియ జేప్పేందుకు ఇలా ఖగోళ దూతలను భూమి మీదకు పంపిస్తోందని ఖగోళ శాస్త్రవేత్తలు వ్యాఖ్యానించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
టారిఫ్లు భారత్ వృద్ధిని ఆపలేవు
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్లు భారత వృద్ధిని అడ్డుకోలేవని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ అభిప్రాయపడింది. భారత్ ఎగుమతులపై ఆధారపడిన దేశం కాదని గుర్తు చేసింది. భారత సార్వభౌమ రేటింగ్ అంచనా సానుకూలంగానే కొనసాగుతుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ డైరెక్టర్ యీఫార్న్ ఫువా స్పష్టం చేశారు. భారత సార్వభౌమ రేటింగ్ను బీబీబీ మైనస్ నుంచి సానుకూలానికి అప్గ్రేడ్ చేస్తున్నట్టు ఎస్అండ్పీ గతేడాది మేలో ప్రకటించడం తెలిసిందే. బలమైన వృద్ధి అవకాశాలను ఇందుకు నేపథ్యంగా పేర్కొంది. అంతేకాదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 6.5 శాతం వృద్ధిని సాధిస్తుందని ఎస్అండ్పీ అంచనాగా ఉంది. భారత్పై ఈ నెల 6 నుంచి 25 శాతం టారిఫ్లను యూఎస్ అమలు చేస్తుండడం, ఆగస్ట్ 27 నుంచి మరో 25 శాతం మేర టారిఫ్లు అమలు కానున్న నేపథ్యంలో ఎస్అండ్పీ గ్లోబల్ తన విశ్లేషణను వెల్లడించింది. టారిఫ్ల విధింపు భారత సానుకూల ఔట్లుక్ను తగ్గించొచ్చా? అన్న సందేహంపై యీఫార్న్ స్పందించారు. అమెరికాతో వాణిజ్యం భారత జీడీపీలో 2 శాతంగానే ఉన్నట్టు గుర్తు చేశారు. ప్రధాన రంగాలైన ఫార్మాస్యూటికల్స్, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్స్ ఎగుమతులకు టారిఫ్ల నుంచి మినహాయింపు ఉన్నట్టు చెప్పారు. దీర్ఘకాలంలో అధిక టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై ఏమంత ప్రభావం చూపించబోవంటూ.. సానుకూల దృక్పథాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. పెట్టుబడులపైనా ప్రభావం ఉండదు.. అమెరికా టారిఫ్లు భారత్లో పెట్టుబడులపై ప్రభావం చూపిస్తాయా? అన్న ప్రశ్నకు ఈఫార్న్ స్పందిస్తూ.. గత కొన్నేళ్లలో చైనా ప్లస్ వన్ విధానం ఫలితమిచ్చినట్టు చెప్పారు. భారత్లో వ్యాపారాన్ని ప్రారంభించిన కంపెనీలు దేశీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే ఆ పనిచేస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత్కు వచ్చే చాలా వరకు పెట్టుబడులు యూఎస్కు ఎగుమతుల కోసం ఉద్దేశించినవి కావు. దేశీయంగా భారీ డిమాండ్ ఉండడమే కారణం. మధ్యతరగతి వర్గం పెద్ద ఎత్తున విస్తరిస్తోంది.భారత్లో మరిన్ని పెట్టుబడులు పెట్టే కంపెనీలు, ఎగుమతులు చేయాలనుకునే వాటికి యూఎస్ మార్కెట్ ప్రధానంగా ఉండకపోవచ్చు’’ అని ఈఫార్న్ వివరించారు. 2021–25 మధ్య భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉండడం గమానార్హం. దేశ మొత్తం ఎగుమతుల్లో 18 శాతం అమెరికాకే వెళ్లాయి. భారత్ దిగుమతుల్లో అమెరికా వాటా 6.22 శాతంగా ఉంది. 2024–25లో ద్వైపాక్షిక వాణిజ్యం 186 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రధానంగా భారత్ 35.32 బిలియన్ డాలర్ల వాణిజ్య మిగులు కలిగి ఉంది. -
మునీర్ మంతనం.. పాక్ మద్దతుగా అమెరికా సంచలన నిర్ణయం
వాషింగ్టన్: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), మజీద్ బ్రిగేడ్లను విదేశీ ఉగ్రవాద సంస్థ (ఎఫ్టీఓ)లుగా అమెరికా ప్రకటించింది. బీఎల్ఏని 2019లోనే.. స్పెషల్లీ డెజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్ (ఎస్డీజీటీ) జాబితాలో చేర్చిన అమెరికా.. తాజాగా మజీద్ బ్రిగేడ్ను కూడా బీఎల్ఏలో భాగంగానే భావిస్తున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి ఆ రెండు సంస్థలు చేసిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఎఫ్టీవోలుగా గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు.ఈ సంస్థల హింసాత్మక చర్యలు పౌరుల భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని దెబ్బతీస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో అమెరికా ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. ‘ఉగ్రవాద సంస్థలను ఇలా గుర్తించడం వల్ల వాటికి లభించే సహాయాన్ని, నిధులను నిరోధించవచ్చు. ఈ సంస్థలకు ఆర్థికంగా, భౌతికంగా లభించే మద్దతును చట్టపరంగా నిలిపివేయడం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం’అని ఆయన పేర్కొన్నారు. పాక్పై ఔదార్యం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఉండగానే ఈ ప్రకటన రావడం గమనార్హం. ఆయన చేసిన విజ్ఞప్తితోపాటు బలమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు. జూన్లో అమెరికా అధ్యక్షుడితో ము నీర్ ఒక ప్రైవేట్ విందుకు హాజరైనప్పటి నుంచి పాకిస్తాన్ పట్ల అమెరికా అమితమైన ఔదా ర్యం చూపుతోంది. బీఎల్ఏని విదేశీ ఉగ్రవాద సంస్థగా ముద్ర వేయడం అందులో భాగం. మునీర్ అమెరికా పర్యటన సందర్భంగానే ఈ ప్రకటన రావడం అతనికి దౌత్యపరమైన విజయాన్ని అందించింది. అయితే.. తమ దేశంలో విధ్వంసక కార్యకలాపాలను నిర్వహించడానికి బీఎల్ఏను భారత్ రెచ్చగొడుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అమెరికా ఈ ప్రకటన చేయడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. 1970 నుంచి.. బీఎల్ఏ ఖనిజ సంపన్న ప్రావిన్స్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా తిరుగుబాటు చేస్తోంది. 1970వ దశకంలో బీఎల్ఏ ప్రారంభమైంది. పాక్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో మొదట అధికారంలోకి వచి్చనపుడు బలూచిస్తాన్లో సాయుధ తిరుగుబాటు మొదలైంది. సైనిక నియంత జియావుల్ హక్ అధికారం చేజిక్కించుకోవడంతో చర్చల తరువాత సాయుధ తిరుగుబాటు ముగిసింది. బీఎల్ఏ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మళ్లీ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పాలనలో 2000 సంవత్సరంలో బలూచిస్తాన్లోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ సంస్థలు, భద్రతాదళాలపై వరుస దాడులు చేసింది. 2006లో పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తీవ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. ఈ సంస్థ చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ ట్రాన్సిట్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనా కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రస్తుతం బీఎల్ఏ బషీర్ జేబ్ నాయకత్వంలో కొనసాగుతోంది. మజీద్ బలూచ్ అనే మిలిటెంట్ పేరుతో మజీద్ బ్రిగేడ్ ఏర్పడింది.హింసాత్మక దాడులు.. అమెరికా నిఘా నేత్ర బీఎల్ఏను చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. అయితే బీఎల్ఏ 2019 తర్వాత అనేక హింసాత్మక దాడులకు పాల్పడింది. మజీద్ బ్రిగేడ్ పేరుతో అనేక దాడులను నిర్వహించింది. 2024లో కరాచీ విమానాశ్రయం సమీపంలో, అలాగే గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడులకు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీయే బాధ్యత వహించింది. 2025 మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేసింది. ఈ దాడిలో 31 మంది పౌరులు, భద్రతా సిబ్బంది చనిపోగా>.. 300 మందికి పైగా రైలు ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. -
అధిక బరువని పొరపడి వర్కౌట్లతో కుస్తీ..కానీ చివరకు..
సాధారణంగా ఉండాల్సిన దానికి మించి బరువు పెరిగితే అధిక బరువుతో బాధపడుతున్నాం అనే అనుకుంటాం. ప్రతీ భారీకాయానికి అధిక బరువే సమస్య అని పొరపడొద్దు. ఎందుకంటే ఇక్కడొక మహిళ అలానే తప్పుగా అనుకుని నానాపాట్లు పడింది. చివరికి అది తగ్గే ఛాన్స్ లేని అసాధారణమైన వైద్య పరిస్థితి అని తెలిసి తల్లడిల్లిపోయింది. అయితే ఆమె తన అచంచలమైన స్థైర్యంతో ఎదుర్కొని ఎంతలా బరువు తగ్గిందో తెలిస్తే విస్తుపోతారు. అధిక బరువుతో ఇబ్బందిపడేవాళ్లకు ఆమె కథే ఒక స్ఫూర్తి . అసలేం జరిగిందంటే.. డెట్రాయిట్(Detroit)కు చెందిన 35 ఏళ్ల జమైక మౌల్దిన్(Jameka Mauldin) అనే సింగిల్ మదర్ విపరీతమైన అధిక బరువుతో ఇబ్బంది పడేది. అందుకోసం వర్కౌట్లు, డైటింగ్ వంటివి పాటించేది. అయితే అనుహ్యంగా ఆమె బరువు పెరగడం, శరీరం ఏదో బిగుతుగా మారి ఇబ్బందికరంగా అనిపించేది ఆమెకు. కచ్చితంగా ఇది అధిక బరువు కాదు అంతకు మించింది ఏదో అయి ఉండొచ్చనే అనుమానం కలిగేది జమైకాకు. అదే విషయాన్ని వైద్యులకు తెలిపినా..మరింత కష్టపడాలి అని సూచించేవారే తప్ప ఆమె సమస్య ఏంటో నిర్థారించలేకపోయేవారు. చివరికి 2019లో ఆమె విపరీతమై శరీర బాధకు తాళ్లలేక వైద్యులను సంప్రదించడంతో అసలు విషయం బయటపడింది. జమైక లింఫెడిమా అనే సమస్యతో బాధపడుతున్నట్లు నిర్థారించారు. దీని కారణంగా శరీర కణజాలంలో ద్రవం పేరుకుపోయి, వాపుకు దారితీసే దీర్ఘకాలిక వ్యాధి. అంతేగాదు దీన్ని కొవ్వు సంబంధిత రుగ్మతగా కూడా పేర్కొంటారు. దీని వల్ల బరువు పెరగడమే కానీ తగ్గడం అనేది సాధ్యం కాదు. దాంతో జమైకాకు వైద్యులు సైతం వర్కౌట్లు చేయాలని, కష్టపడమని సూచించలేదు. పైగా ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని తగ్గించే మార్గంపై దృష్టిసారించారు. సంకల్పం బలంతో ఆ వ్యాధిపై పోరాడింది..ఆమె దగ్గర దగ్గర 324 కిలోలు పైనే అధిక బరువుకి చేరుకుంది. దాంతో ఆమెకు రోజువారి పనులతో సహా ప్రతిది కష్టమైపోయేది. ఒకరి సహాయం లేకుండా కనీసం బాత్రూమ్కి కూడా వెళ్లలేని స్థితికి చేరుకుంది. అయితే దీన్ని ఆమె సానుకూల దృక్పథంతో, సంకల్ప బలంతో జయించే ప్రయత్నం చేసింది. ఈ రోజు ఈ ఒక్కపని ఫినిష్ చేయాలి అని కేటాయించుకుంటూ..చిన్న విజయాలను సెలబ్రేట్ చేసుకునేది. దాంతోపాటు ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులు, ప్రత్యేకమైన లిపోసక్షన్ పద్ధతులతో సుమారు 159 కిలోలకు తగ్గింది. ఇక్కడ జమైక ఎలాంటి అధునాతన ఇంజెక్షన్లు, ఖరీదైన జిమ్లు, అద్భుత శస్త్ర చికిత్సలు వంటివి ఏమి లేకుండా కేవలం తన పట్టుదల, సంకల్పంతో ఆ రోగాన్ని జయించి బరువు తగ్గింది. అంతేగాదు సర్టిఫైడ్ నర్సింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యింది కూడా. తన కూతురు 15 ఏళ్ల జామ్యా కారణంగానే ఈ భయానక అధిక బరువుపై విజయం సాధించానని చెప్పుకొచ్చింది. అంతేగాదు ఆమెకు ఇన్స్టాగ్రామ్లో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఒక పట్టాన నయం కాని వ్యాధులను ధైర్యంగా ఎదుర్కొనడంపై అవగాహన కల్పించేలా తన కథనే వివరిస్తూ ఒక పుస్తకం కూడా రాయాలనుకుంటోందామె.(చదవండి: చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!) -
చాట్జీపీటీ ఆధారిత డైట్తో..ఆస్పత్రి పాలైన వ్యక్తి..!
ఏఐ కారణంగా భవిష్యత్తులో చాలా ఉద్యోగాలు ఉండవు అంటూ సర్వత్రా ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ, ఎంతటి ఏఐ సాంకేతికత అయినా..మానవుని శక్తిమంతమైన పని ముందు అల్పమైనవిగానే మిగిలిపోతున్నాయి. ఏ సాంకేతికతైన కొంత వరకు మానవులు అవసరాన్ని తగ్గిస్తుందేమో గానీ పూర్తిస్థాయిలోమాత్రం కానే కాదు అని చెప్పొచ్చు. అందుకు ఉదాహరణే ఈ ఉదంతం. ఇక్కడొక వ్యక్తి చాట్జీపీటీని నమ్మి చేజేతులారా ఆరోగ్యాన్ని పాడుచేసుకుని ఆస్పత్రి పాలయ్యాడు.తన ఆహారాన్ని మరింత మెరుగుపరుచుకోవడం ఎలా అని చాట్జీపీటీ సలహా కోరాడు. అది ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని తూచాతప్పకుండా పాటించి ఆస్పత్రి పాలయ్యాడు. అమెరికాకు చెందిన వ్యక్తి ఎలాంటి మానసిక, అనారోగ్య చరిత్ర లేని వ్యక్తిగా గుర్తించారు వైద్యులు. అతడు కేవలం ఏఐ చాట్బాట్ కారణంగానే ఆరోగ్యాన్ని పాడుచేసుకున్నట్లు నిర్థారించారు. ఆ చాట్జీపీటీలో టేబుల్ సాల్ట్ ప్రతికూలతలను, ఆరోగ్య ప్రభావాల గురించి కూలంకషంగా తెలుసుకుని దాన్ని పూర్తిగా తొలగించాడు. ఆ ఉప్పు స్థానంలో సోడియం బ్రోమైడ్తో భర్తి చేయొచ్చని చాట్జీపీటీ సూచించడంతో దాన్ని గుడ్డిగా ఫాలో అయ్యాడు. నిజానికి ఈ సోడియం బ్రోమైడ్ కూడా టేబుల్ సాల్ట్లాగానే ఉంటుంది. కానీ ఇది చాలా విభిన్నమైన సమ్మేళనం. దీన్ని మందుల్లో ఉపయోగిస్తారు. సాధారణంగా పారిశ్రామిక శుభ్రపరిచే ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. అలాంటి ఈ సమ్మేళనాన్ని అధికంగా తీసుకుంటే దుష్ప్రభావాలు ఎదుర్కొనక తప్పవని వెల్లడించారు వైద్యులు. ఇక ఆ వ్యక్తి ఆ కారణంగానే జస్ట్ 24 గంటల్లోనే ఆస్పత్రి పాలయ్యాడని చెప్పారు వైద్యులు. అంతేగాదు మానసికంగా శారీరకంగా అనారోగ్యం పాలయ్యాడు. ఆ వ్యక్తికి ఎలక్ట్రోలైట్లు, యాంటీసైకోటిక్స్తో చికిత్స అందిచడం, సైక్రియాట్రీక్ పర్యవేక్షణ తదితరాలతో మెరుగయ్యేలా చేశారు. దాదాపు మూడు వారాల పాటు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. అతను కాలేజ్లో న్యూట్రిషన్ ఫుడ్పై అధ్యయనం చేస్తున్నాడని అందులో భాగంగానే తనపై ఇలా ప్రయోగం చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడ చాట్జీపీటీ వంటివి సమాచారం ఎల్లప్పుడూ కచ్చితమైనది కాదని కేవలం అవగాహన కల్పించగలదని చెబుతున్నారు నిపుణులు. అది ఇచ్చే సమాచారం నమ్మి స్వీయ చికిత్సలు తీసుకోరాదని, వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించి కికిత్స తీసుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఇక ఔషధంగా ఉపయోగించే సోడియం బ్రోమైడ్ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటంటే..అధిక మోతాదులో తీసుకుంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపి..తలనొప్పి, మానసిక ఆందోళన, మత్తు వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయిచర్మంపై అలెర్జీ, వాపు వంటి సమస్యలువాంతులు, మలబద్ధకం, ఆకలి లేకపోవడంమూర్ఛ, కోమా, శ్వాస సంబంధిత సమస్యలు, ప్రాణపాయం వంటివి సంభవిస్తాయి. అందువల్ల దీన్ని ఉప్పుగా వాడటం అనేది అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఔషధంగా ఉపయోగించాలని హెచ్చరిస్తున్నారు.(చదవండి: హార్ట్ అటాక్ ముప్పు మహిళల్లోనే ఎక్కువ..! ఎందుకంటే..) -
టార్గెట్ 50
న్యూఢిల్లీ: భారత ఉత్పత్తులపై అమెరికా టారిఫ్లను గణనీయంగా పెంచేయడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్ర సర్కారు దృష్టి పెట్టింది. ఇతర దేశాలకు ఎగుమతులను పెంచుకునే వ్యూహరచనకు తెరతీసింది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలు, ఆఫ్రికా తదితర ప్రాంతంలో 50 దేశాలకు ఎగుమతులను ఇతోధికం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. భారత మొత్తం ఎగుమతుల్లో 90 శాతం ఈ 50 దేశాలకే వెళుతుండడం గమనార్హం. ఎగుమతులను వైవిధ్యం చేసుకోవడం, దిగుమతులకు ప్రత్యామ్నాయాలు, ఎగుమతుల పోటీతత్వం పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. ఈ దిశగా లోతైన విశ్లేషణ కొనసాగుతోందని చెప్పాయి. వాణిజ్య శాఖ ఇప్పటికే 20 దేశాలపై ప్రత్యేక దృష్టి సారించగా, ఇప్పుడు మరో 30 దేశాలు ఈ జాబితాలోకి వచ్చి చేరినట్టు పేర్కొన్నాయి. కొత్త మార్కెట్లను అన్వేషించండి.. అధిక యూఎస్ టారిఫ్లను ధైర్యంగా ఎదుర్కోవాలని.. రొయ్యలు, ఇతర చేపల ఉత్పత్తుల ఎగుమతులకు ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని ఎగుమతిదారులకు కేంద్రం సూచించింది. ఈయూ, జపాన్, దక్షిణ కొరియా, యూకే, రష్యా, ఆ్రస్టేలియా, పశి్చమాసియా, దక్షిణాసియా తదితర ఎన్నో ప్రాంతాలు అందుబాటులో ఉన్నట్టు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. ఇతర దేశాలను ఎగుమతులను పెంచుకునే ముందు విలువను పెంచుకోవడం, ప్యాకేజింగ్పై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఇందుకు ఫిషరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 55 శాతం ఎగుమతులపై ప్రభావం అమెరికాకు ఎగుమతి చేస్తున్న మొత్తం వస్తు ఎగుమతుల్లో 55 శాతం మేర 25 శాతం ప్రతీకార సుంకాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించారు. రైతులు, వ్యాపారవేత్తలు, ఎగుమతిదారులు, ఎంఎస్ఎంఈల ప్రయోజనాల పరిరక్షణకు, ప్రోత్సాహానికి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఉత్పత్తుల వైవిధ్యం, డిమాండ్, నాణ్యత, కాంట్రాక్టు ఒప్పందాలు భారత ఎగుమతులపై పడే ప్రభావాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. -
వైఎస్సార్సీపీ డల్లాస్ మీట్ అండ్ గ్రీట్ విజయవంతం
అమెరికాలోని వైఎస్సార్సీపీ డల్లాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డల్లాస్ లో వైఎస్సార్ అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు.. రాంభూపాల్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగనన్న పరిపాలన గురించి ప్రస్థావించారు. సంక్షేమం, అభివృద్ధి, నిజాయితీ కలసిన ప్రజా పాలనను జగనన్న అందించారని కొనియాడారు. కాని ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనిసాగుతుందని విమర్శించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కూటమి ప్రభు త్వం.. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెడుతూ ప్రజలను దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చంద్రబాబు సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. ఉప ఎన్నికలో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుత్తూ.. అరాచకానికి కూడా తెరలేపిందన్నారు. రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు తీరాలంటే.. జగన్ ముఖ్యమంత్రి కావడంతోనే పరిష్కారం లభిస్తుందన్నారు. మళ్లి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావటానికి ప్రవాసులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. డల్లాస్ వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, సోషల్ మీడియా యాక్టివిస్ట్లకు అన్ని విధాలుగా తాము అండగా ఉంటామన్నారు. చంద్ర శేఖర్ చింతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి వీర శివా రెడ్డి, కృష్ణ కోడూరు, మణి శివ అన్నపు రెడ్డి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
తొలి అంతరిక్ష వివాహం: భూమ్మీద వధువు..అంతరిక్షంలో వరుడు..
22 ఏళ్ల క్రితం ఇంచుమించు ఇదే రోజున అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త సందర్భం ఎదురైంది. ఒక కొత్త పోకడకు నాంది పలికింది. అంతరిక్షంలో వివాహం అన్న ఊహే వింతగా ఉన్నా..దాన్ని నిజం చేసుకుంది ఓ జంట. సరిగ్గా ఆగస్టు 10ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని అసాధారణమైన మైలురాయిని నమోదు చేసుకుంది ఆ జంట. ఆ దంపతులు ఎవరంటే..వారే రష్యన్ వ్యోమగామి యూరి మాలెన్చెంకో(Yuri Malenchenko), ఎకటెరినా డిమిత్రివ్(Ekaterina Dmitriev) దంపతులు. వ్యోమగామి యూరి మాలెన్ చెంకో అమెరికా టెక్సాస్లో ఉండే తన గర్ల్ఫ్రెండ్ని డిమిత్రివ్ని అంతరిక్షంలో పెళ్లి చేసుకుని సరికొత్త మైలురాయిని సృష్టించాడు. డిమిత్రివ్ హుస్టన్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నాసా అంతరిక్ష నియంత్రణ మధ్య ఉపగ్ర హుక్ అప్ ద్వారా తన ప్రియుడు వ్యోమగామి మాలెన్చెంకోని వివాహమాడింది. సరిగ్గా ఆగస్టు 10, 2003న ఈ జంట వివాహం జరిగింది. మాలెన్ చెంకో తన అధికారిక అంతరిక్ష సూట్ బో టైను ధరించగా, హుస్టన్లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్లో డిమిత్రివ్ సంప్రదాయ వివాహ దుస్తుల్లో వేచి చూస్తోంది. యూరి దూరంగా ఉన్నందునా ఆమె అక్కడ అతడి కటౌట్ బోర్డుతో దర్శనమిచ్చింది. వారిద్దరిని దగ్గర చేసేది వీడియో కాల్ కమ్యూనికేషన్. నిజానికి భూమ్మీద 200 మంది అతిధుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటవ్వాలని భావించారు. అయితే మాలెన్చెంకో అంరిక్షకేంద్రంలో గడిపే సమయం పొడిగించడంతో..వారు తమ ప్రేమను పెళ్లిగా మార్చుకోవడానికి మరొక మార్గాన్ని ఎంచుకోక తప్పలేదు. డిమిత్రివ్ మాలెన్చెంకో కార్డ్బోర్డు కటౌట్తో ఫోటోలకు ఫోజులిస్తూ..డేవిడ్ బోవి పాటకు స్టెప్పులేసింది. ఇక మాలెన్ చెంక్తో పాటు ఉన్న మరో వ్యోమగామి కీ బోర్డుపై వివాహ మార్చ్ను ప్లే చేశాడు. అంతేగాదు వీడియో కాల్ సాయంతో తన కాబోయే భర్తకు ముద్దుపెట్టి మరి ప్రపోజ్ చేసింది. ఈ సుదూర వివాహం కంటే ముందు నుంచే ఈ జంట సుదూరంగానే రిలేషన్లో ఉండటానికి అలవాటుపడ్డారు. నిజం చెప్పాలంటే ఇలా అంతరిక్షంలో పెళ్లి చేసుకునే అదృష్టం ఈ జంటకే లభించిందని పేర్కొనవచ్చు. ఎందుకంటే ఈ జంటలా మరేవ్వరూ అంతరిక్షంలో వివాహం చేసుకోకుండా నిషేధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆగస్టులో వివాహం అనంతరం కొన్ని నెలలకు మాలెన్చెంకో భార్యని కలిసేందుకు ఇంటికి తిరిగి వచ్చాడు.(చదవండి: పది కిలోలు బరువు తగ్గిన భారత్పే సహ వ్యవస్థాపకుడు..ఆ రెండు సూత్రాలే కీలకం..!) -
రతన్ టాటా ఏంటో అమెరికాకు తెలుసు! ఇవాళ ఆయన ఉండి ఉంటేనా..
భారత దేశ చరిత్రలో అహ్మదాబాద్ ఎయిరిండియా AI171 విమాన ప్రమాదంపై అత్యంత విషాదకరమైన ఘటనగా నిలిచింది. ఈ ఘటనపై అమెరికా న్యాయవాది ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీ మధ్యాహ్నా సమయంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన విమానం కొద్దిసెకన్లకే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది మరణించారు. అందులో 229 మంది ప్రయాణికులు.. 12 మంది సిబ్బంది.. కింద ఉన్న మరో 19 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో బాధిత కుటుంబాలకు సాయం అందడంలో జాప్యంపై అమెరికాకు చెందిన న్యాయవాది మైక్ ఆండ్రూస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టాటా కంపెనీ మాజీ చైర్మన్, దివంగత రతన్ టాటా బతికి ఉండి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారాయన. రతన్ గనుక ఉండి ఉంటే.. బాధిత కుటుంబాలు ఇప్పుడు ఇంతగా ఇబ్బందులు ఎదుర్కొని ఉండేవి కావని అన్నారాయన. ఏఎన్ఐ ఇంటర్వ్యూలో మైక్ ఆండ్రూస్ మాట్లాడుతూ.. ‘‘అమెరికాకు రతన్ టాటా అంటే ఏంటో తెలుసు. ఆయన నైతిక విలువలు, ఉద్యోగుల పట్ల ఆయన కనబరిచే శ్రద్ధ, వాళ్ల బాగోగుల గురించి ఆయన చేసే ఆలోచనలు.. వీటి గురించి అమెరికా ప్రజలకు కూడా కొంత తెలుసు. ఒకవేళ ఆయన గనుక ఇవాళ ఉండి ఉంటే.. ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు. బాధితుల పట్ల దయగుణం కచ్చితంగా ప్రదర్శించేవారు’’ అని అన్నారాయన. ప్రమాదంలో మరణించిన 65 కుటుంబాల తరఫున పరిహారం కోసం ఆండ్రూస్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఒక బాధిత కుటుంబం దీనావస్థను ప్రస్తావిస్తూ.. వయసుపైబడి మంచాన ఉన్న ఓ తల్లి ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీదే ఆధారపడి బతుకుతోంది. అలాంటి కొడుకు ఎయిరిండియా ప్రమాదంలో మరణించాడు. ఆమెకు ఇప్పటిదాకా ఎలాంటి పరిహారం అందలేదు. మరి ఇప్పుడు ఆమె వైద్య ఖర్చులను ఎవరు చెల్లిస్తారు? ఆమె పరిస్థితి ఏంటి? అని ఆండ్రూస్ అంటున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం ఓ ట్రస్ట్ నెలకొల్పి కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని టాటా గ్రూప్స్ కు చెందిన ఎయిరిండియా ప్రతిజ్ఞ చేసింది. అలాగే ప్రమాదంలో దెబ్బతిన్న బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ను తిరిగి నిర్మిస్తామని పేర్కొంది. జులైలో.. తాత్కాలిక పరిహారం కింద రూ.25 లక్షలను ఎయిరిండియా విడుదల చేసింది. ఆ సొమ్మును 147 విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు, విమానం కూలడంతో నేల మీద మరణించి మరో 19 కుటుంబాలకు పరిహారంగా అందజేశారు. ఈ సొమ్మును తుది పరిహారంలో మినహాయిస్తామని కూడా ప్రకటించారు. అయితే పరిహారం అందడంలో జాప్యంతో.. బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కోర్టు మెట్లు ఎక్కాయి.2025 జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా AI171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదికను కేంద్ర పౌరవిమాన మంత్రిత్వశాఖకు సమర్పించింది. అందులో.. • ఇంధన కంట్రోలర్ స్విచ్లు టేకాఫ్ తర్వాత సెకన్ పాటు ఆగిపోయాయి, ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది.• ఇంజిన్లు గాల్లోనే ఆగిపోవడం వల్ల విమానం కుప్పకూలింది.• 32 సెకన్లలోనే విమానం క్రాష్ల్యాండ్ అయింది.ఆ సమయంలో ఒక పైలట్ ఇంధనం ఎందుకు సిచ్ఛ్ ఆఫ్ చేశావని మరో పైలట్ను ప్రశ్నించాడు. నేను ఆఫ్ చేయలేదు అని సమాధానం ఇచ్చాడతను.మేడే కాల్ ఇచ్చిన తర్వాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినా.. విమానం అప్పటికే కూలిపోయింది.విమాన ప్రమాదానికి FADEC (Full Authority Digital Engine Control) సిస్టమ్లో లోపం కారణమైతే, బోయింగ్ కంపెనీపై అమెరికాలో ఉత్పత్తి బాధ్యత కేసు వేయవచ్చని లాయర్ మైక్ ఆండ్రూస్ తెలిపారు. అలాకాని పక్షంలో ఎయిరిండియాదే గనుక బాధ్యత అయితే.. మాంట్రియాల్ కన్వెన్షన్ ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. రెండూ ఉన్నట్లు గనుక తేలితే.. అప్పుడు పరిస్థితి కొంత సంక్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది అని అభిప్రాయపడ్డారయన. -
నోరు పారేసుకున్న మునీర్
న్యూయార్క్: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ మరోసారి రెచి్చపోయారు. ప్రస్తుతం అమెరికాలో అధికారిక పర్యటనలో ఉన్న ఆయన భారత్పై నోరుపారేసుకున్నారు. భారత సైన్యం గనుక పాకిస్తాన్పై దాడి చేస్తే తాము నష్టపోవడం కాకుండా సగం ప్రపంచాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. శనివారం ఫ్లోరిడాలోని టాంపా పట్టణంలో ప్రవాస పాకిస్తానీల సమావేశంలో మాట్లాడారు. కాశ్మీర్ అంశాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదన్నారు. కాశ్మీర్ అనేది పాకిస్తాన్కు ‘తల నుంచి గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే సిర’ లాంటిదని చెప్పారు. తమ దేశానికి రావాల్సిన నీటిపై హక్కులను వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ జల హక్కులకు కాపాడుకుంటామన్నారు. ఇటీవల భారత్–పాక్ మధ్య ఘర్షణలో తాము పైచేయి సాధించమని వ్యాఖ్యానించారు. భారత్ మరోసారి దాడిచేస్తే తగిన సమాధానం చెప్తామన్న సందేశం ఇచ్చామని పేర్కొన్నారు. కాశ్మీర్ అనేది భారతదేశ అంతర్గత వ్యవహారం కాదని, అది పూర్తిగా అంతర్జాతీయ ఎజెండా అని తేల్చిచెప్పారు. పాకిస్తాన్కు కాశ్మీర్ అత్యంత కీలకమని మహ్మద్ అలీ జిన్నా చెప్పారని గుర్తుచేశారు. Pakistan Army Chief Asim Munir in Florida dinner:“We are a nuclear nation — if we go down, we’ll take half the world down with us.”On India’s Indus dam plan: “We’ll wait for them to build it, then destroy it with 10 missiles.”Loose threats, no shame. Remember Kargil — we…— Praffulgarg (@praffulgarg97) August 10, 2025సింధూ నది ఇండియా జాగీర్ కాదు తమ దేశానికి నీరు రాకుండా ఎగువన భారత్ గనుక డ్యామ్లు నిర్మిస్తే వాటిని కచ్చితంగా పేల్చేస్తామని అసిమ్ మునీర్ హెచ్చరించారు. డ్యామ్లు నిర్మించేదాకా వేచి చూస్తామని, వాటి నిర్మాణం పూర్తయ్యాక ధ్వంసం చేస్తామని అన్నారు. సింధూ నది ఇండియా జాగీర్ కాదని స్పష్టంచేశారు. అది సొంత ఆస్తిలాగా భావించొద్దని ఇండియాకు సూచించారు. నదులకు అడ్డుకట్ట వేయాలని చూస్తే అడ్డుకొని శక్తి తమకు ఉందన్నారు. పాకిస్తాన్–అమెరికా మధ్య సంబంధాలు నానాటికీ బలపడుతున్నాయని మునీర్ హర్షం వ్యక్తంచేశారు. నెలన్నర వ్యవధిలోనే తాను మరోసారి అమెరికాకు రావడమే అందుకు నిదర్శనమని తెలిపారు. భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని అపేసినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మునీర్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ⚡️🤯 Asim Munir Threatens Nuclear Armageddon: "We'll Take Half the World Down with Us" - ReportThe Pakistani military chief was speaking at a black-tie event in the US, saying if his country faces an existential threat in a future war with India, “we are a nuclear nation, if we… pic.twitter.com/P8E3n0yUHJ— Tarique Hussain (@Tarique18386095) August 11, 2025 -
గణాంకాలపై మార్కెట్ల ఫోకస్
ప్రధానంగా ఆర్థిక గణాంకాలు, వాహన విక్రయాలు, యూఎస్ టారిఫ్లు ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లకు దిక్సూచి కానున్నాయి. అంతేకాకుండా ఇటీవల నిరవధికంగా అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్పీఐలు) ధోరణి సైతం సెంటిమెంటుకు కీలకంగా నిలవనుంది. మరోపక్క ముగింపు దశకు చేరుకున్న క్యూ1 ఫలితాల సీజన్కూ ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం(15న) సెలవుకావడంతో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. అయితే ద్రవ్యోల్బణ గణాంకాలు, ఏప్రిల్–జూన్(క్యూ1) ఫలితాలు, యూఎస్తో వాణిజ్య సంబంధాలు, ఎఫ్పీఐల అమ్మకాలు ఈ వారం మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపే వీలున్నట్లు స్టాక్ విశ్లేషకులు చెబుతున్నారు. జూలై నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) విడుదలకానున్నాయి. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా 8వ నెలలోనూ దిగివస్తూ 2.1 శాతానికి పరిమితమైంది. 2019 జనవరి తదుపరి ఇది కనిష్టంకాగా.. 2025 మే నెలలో 2.8 శాతంగా నమోదైంది. ఇక జూలై నెలకు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. జూన్లో డబ్ల్యూపీఐ అనూహ్యంగా 0.13 శాతం క్షీణించింది. దిగివచ్చింది. మే నెలలో 0.39 శాతం పెరుగుదల నమోదుకాగా.. 2023 అక్టోబర్ తర్వాత తొలిసారి వెనకడుగు వేసింది. క్యూ1 జాబితా ఈ వారం మరికొన్ని దిగ్గజాలు ప్రస్తుత ఏడాది(2025– 26) తొలి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో పీఎస్యూ దిగ్గజాలు ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్), ఇండియన్ ఆయిల్(ఐవోసీ)తోపాటు.. ఎస్జేవీఎన్, ఐఆర్సీటీసీ, ఆస్ట్రల్ పాలీ, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్, పీఐ ఇండస్ట్రీస్, సంవర్ధన మదర్సన్, ముత్తూట్ ఫైనాన్స్, జూబిలెంట్ ఫుడ్, అశోక్ లేలాండ్, పతంజలి ఫుడ్స్ తదితరాలు చేరాయి. ఇవికాకుండా జూలైలో ప్రయాణికుల వాహన అమ్మకాల వివరాలను సియామ్ 15న విడుదల చేయనుంది. 2025 జూన్లో మొత్తం ప్రయాణికుల వాహన అమ్మకాలు 6 శాతం క్షీణించి 2,75,766 యూనిట్లకు పరిమితంకావడం గమనార్హం! విదేశీ అంశాలు భారత్ దిగుమతులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించడంతో ఎగుమతి సంబంధ రంగాలపై ప్రతికూల ప్రభావం కనిపించనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫార్మాపైనా వడ్డింపులు తప్పవన్న ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఔషధ రంగంతోపాటు.. లెదర్, కెమికల్స్, ఫుట్వేర్, ఆక్వా, ఐటీ, టెక్స్టైల్స్ ప్రభావితంకానున్నట్లు పేర్కొన్నారు. కాగా.. జూలై నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణం తదితర గణాంకాలు ఈ వారం విడుదలకానున్నాయి. ఈ అంశాలన్నీ మార్కెట్లో సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, స్వస్తికా ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. టారిఫ్లపై స్పష్టత వచ్చేవరకూ మార్కెట్లు కన్సాలిడేట్ కావచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. గత వారమిలా.. గతవారం(4–8) దేశీ స్టాక్ మార్కెట్లు వరుసగా ఆరో వారంలోనూ నష్టాలతోనే ముగిశాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 742 పాయింట్లు(0.9 శాతం) క్షీణించి 79,858 వద్ద నిలిచింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 202 పాయింట్లు(0.8 శాతం) నీరసించి 24,363 వద్ద ముగిసింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ 1.3 శాతం, స్మాల్ క్యాప్ 1.9 శాతం చొప్పున బలహీనపడ్డాయి.ఎఫ్పీఐల భారీ అమ్మకాలుకొద్ది రోజులుగా పెట్టుబడులు వెనక్కి ఇటీవల కొద్ది రోజులుగా దేశీ స్టాక్స్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) నిరవధిక అమ్మకాలు చేపడుతున్నారు. ఈ నెలలో ఇప్పటివరకూ దాదాపు రూ. 18,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇక గత నెల(జూలై)లోనూ నికరంగా అమ్మకాలకే కట్టుబడ్డారు. దీంతో జూలైలో రూ. 17,741 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అంతకుముందు మూడు నెలల్లో(ఏప్రిల్ నుంచి జూన్) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. వెరసి రూ. 38,673 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ నికరంగా చూస్తే ఎఫ్పీఐలు రూ. 1.13 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం గమనార్హం! యూఎస్ టారిఫ్ ప్రకటనలు, క్యూ1 ఫలితాల నిరుత్సాహం తదితర అంశాల కారణంగా ఎఫ్పీఐలు ఇటీవల తిరిగి అమ్మకాల బాటలో సాగుతున్నట్లు ఏంజెల్ వన్ సీనియర్ ఫండమెంటల్ విశ్లేషకులు వకార్జావేద్ ఖాన్, మారి్నంగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా.. ఎఫ్పీఐల అమ్మకాలు, యూఎస్ టారిఫ్ల వడ్డింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు క్షీణపథంలో కదులుతున్నాయి. ఇదే బాటలో ఈవారం సైతం మరింత నీరసించే వీలున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. సాంకేతికంగా చూస్తే ఎన్ఎస్ఈ నిఫ్టీ వెనకడుగు వేస్తే తొలుత 24,200 పాయింట్ల వద్ద, తదుపరి 24,000 వద్ద మద్దతు లభించవచ్చని అంచనా వేశారు. ఒకవేళ బలపడితే 24,500 పాయింట్లవద్ద, 24,600 వద్ద రెసిస్టెన్స్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
‘భారత్ అభివృద్ధిని చూసి ట్రంప్ అసూయతో రగిలిపోతున్నారు’
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సెటైర్లు వేశారు. భారత్ ఎదుగుదలను చూసి ట్రంప్ అసూయతో రగిలిపోతున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. అందుకే టారిఫ్ల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.భారత్ ‘సూపర్ పవర్’కానుంది. అన్ని రంగాల్లో విశ్వవిజేతగా నిలుస్తోంది. అలాంటి భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరు. భారత్ అభివృద్ధిపై జరుగుతున్న చర్చను చూసి కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భారత్ ఎదుగుదల వాళ్లకు ఇష్టం లేదు.అందుకే ప్రపంచ దేశాల్లో మేడిన్ ఇండియా ఉత్పత్తుల కొనుగోళ్లు జరగకుండా కుట్ర చేస్తున్నారు. మేడిన్ ఇండియా ఉత్పత్తులు చాలా ఖరీదైనవనే ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం వల్ల కొనుగోళ్లు ఆపొచ్చని అనుకుంటున్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేను మీకు మాటిస్తున్నా.. ప్రపంచంలోని ఏ శక్తి భారత్ సూపర్ పవర్ అవ్వకుండా ఆపలేదని స్పష్టం చేశారు.ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ వరుస ఆరోపణలు గుప్పిస్తున్నారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ వెనక్కి తగ్గాలని హెచ్చరించారు. కాదంటే సుంకాల పెంపు ఉంటుందన్న ట్రంప్ పనిలోపనిగా.. భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధించారు. అదనంగా పెనాల్టీ విధించారు. అంతేకాదు,రష్యాతో తన ఒప్పందాలను భారత్ నిలిపివేయాలని బెదిరించారు. ఇరు దేశాల మధ్య వ్యాపార,వాణిజ్య ఒప్పందాలు ఇలాగే కొనసాగితే మరింత సుంకాల పెంపు ఉంటుందని అన్నారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని అన్నారు. ఈ క్రమంలో ట్రంప్ చర్యలను ఉద్దేశిస్తూ రాజ్నాథ్ సింగ్ స్పందించారు. ట్రంప్ చర్యలకు ధీటుగా బదులిచ్చారు. -
ఇవోరకం పూతరేకులు..!
వీటిని దూరం నుంచి చూస్తే, బొగ్గుముక్కల్లా కనిపిస్తాయి. దగ్గరగా చూస్తే, మాడిపోయిన పూతరేకుల్లా కనిపిస్తాయి. నిజానికి ఇవి పూతరేకుల్లాంటి వంటకమే! కాకుంటే, మాడిపోలేదు, ఎవరూ కావాలని వీటిని మాడ్చేయలేదు. వీటి తయారీకి వాడే ముడిపదార్థాల కారణంగానే నల్లగా కనిపిస్తాయి. ‘పికి బ్రెడ్’ అని పిలుచుకునే ఈ సంప్రదాయ వంటకం తయారీలో నల్లని మొక్కజొన్న గింజల నూక, నల్లగా నిగనిగలాడే జూనిపర్ బెర్రీలను కాల్చి తయారు చేసిన బూడిదను ప్రధానంగా వాడతారు. తయారీ ప్రక్రియ దాదాపు మన పూతరేకుల మాదిరిగానే ఉంటుంది. పూతరేకుల తయారీలో కుండ అడుగున మంటపెట్టి, పిండిని కుండ మీద ఒక్కోపూతగా పూసి, వాటిని ఒద్దికగా చుడతారు. ‘పికో బ్రెడ్’ తయారీకి రాతిపలక కింద మంట పెడతారు. వేడెక్కిన రాతి పలక మీద ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని అతి సన్నని పొరలుగా కాలుస్తారు. కొన్ని పొరల దొంతరలను ఇలా పూతరేకుల్లా చుడతారు. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివసించే ‘హోపీ’ తెగవారి సంప్రదాయ వంటకం ఇది. ఈ తీపి వంటకాన్ని పండుగలు, పుట్టినరోజులు వంటి ప్రత్యేక సందర్భాలలో తయారు చేసుకుంటారు.(చదవండి: కొరకరాని గింజలే గాని...) -
అమెరికాలో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు
ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం కోసం అమెరికాలో స్థిరపడిన తెలుగువారు తమ సంప్రదాయాలను మరవటం లేదు. ఏదేశ మేగినా ఎందుకాలిడినా మాతృదేశ విశ్వాసాలను పాటిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అన్నాచెల్లెళ్ల అనుబంధాలకు వేదికైన రక్షాబంధన్ ను న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్ హిక్స్ విల్లేలో ఉన్న అసమాయ్ హిందూ టెంపుల్ రాఖీ పండగ సంబరాలకు వేదిక అయింది.నైటా ప్రెసిడెంట్ వాణి ఏనుగు ఆహ్వానం మేరకు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న తెలుగు కుటుంబాలు ఆనందోత్సహాల మధ్య రాఖీ పండగను నిర్వహించారు. తోడబుట్టిన సోదరులకు కొందరు అక్కాచెల్లెళ్లు రాఖీలు కడితే, తాము స్ధిరపడిన అమెరికాలో బాంధవ్యాల రీత్యా సోదరభావం ఏర్పడిన అన్నలు, తమ్ముళ్లకు సోదరీమణులు రాఖీలు కట్టి, వారి నోరు తీపిచేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు.చిన్నపిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారికి నైటా నేతృత్వంలో బహుమతులు అందించారు. అలాగే హాజరైనవారందరికీ నైటా కార్యవర్గం పసందైన విందును కూడా ఏర్పాటుచేసింది. వారాంతం కావటంతో తెలుగు కుటుంబాలన్నీ ఒక్కచోట చేరి రాఖీ వేడుకలకు మరింత శోభను తెచ్చారు.కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, సెక్రటరీ హరిచరణ్ బొబ్బిలి, ట్రెజరర్ నరోత్తమ్ రెడ్డి బీసం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అడ్వయిజరీ కమిటీ, ట్రస్టీలు, ఈవెంట్ స్పాన్సర్లు పాల్గొన్నారు.(చదవండి: ఇండియాకు వెళ్లిపో.. ఐర్లాండ్లో అమానుష ఘటన) -
అపోలో వ్యోమగామి జిమ్ లవెల్ కన్నుమూత
వాషింగ్టన్: అపోలో 13 మిషన్కు నాయకత్వం వహించిన అమెరికా వ్యోమగామి జిమ్ లవెల్ 97 ఏళ్ల వయస్సులో శుక్రవారం కన్నుమూ శారు. ‘జిమ్ వ్యక్తిత్వం, దృఢ సంకల్పం మన దేశం చంద్రుడిని చేరుకోవడానికి, విషాదాన్ని విజయంగా మార్చడానికి సహాయపడ్డాయి, అప్పటి ఘటన నుంచి మేం ఎంతో నేర్చుకు న్నాం. జిమ్ మరణానికి సంతాపం తెలియజే స్తున్నాం’అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. నాసా కార్యకలాపాలు చేపట్టిన మొదటి దశాబ్ద కాలంలో అత్యధికంగా ప్రయాణించిన వ్యోమగాములలో ఒకరు లవెల్. జెమిని 7, జెమిని 12, అపోలో 8, అపోలో 13 మిషన్లలో నాలుగుసార్లు ప్రయాణించారు.1928లో క్లీవ్ల్యాండ్లో జన్మించారు లవెల్. 1952లో అమెరికా నేవల్ అకాడెమీలో డిగ్రీ సాధించారు. 1952లో టెస్ట్ పైలట్, 1962లో నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారు. జెమిని 7, అపొలో 8 వంటి మిషన్లలో ఆయన భాగస్వామిగా ఉన్నప్పటికీ, 1970 నాటి అపొలో 13 మిషన్ మాత్రం లెజెండ్గా ఆయన్ను మార్చివేసింది. మూడో యాత్ర సందర్భంగా చంద్రుడిపైకి దిగాక ఆక్సిజన్ సిలిండర్ పేలిపోయింది. దీంతో, అందులోని సిబ్బంది భూమికి సుమారు 2 లక్షల మైళ్ల దూరంలో చిక్కుబడిపోయారు. అయినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక ప్రత్యామ్నా యాలను అనుసరించి, అపాయం నుంచి బయటపడ్డారు. ‘వాస్తవానికి ఆ మిషన్ విఫల మైంది. దాంతో సాధించింది కూడా ఏమీ లేదు. కానీ, దాని ద్వారా వచ్చిన ఫలితం మాత్రం అద్భుతం. అలాంటి విపత్తును సైతం ధైర్యంగా స్వీకరించి విజయవంతంగా మార్చ గల సత్తా ఉందని నిరూపించడమే మేం సాధించిన విజయం’అని లవెల్ రాయిటర్స్కు 2010లో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తనతోపాటు సహచరులు జాక్ స్విగెర్ట్, ఫ్రెడ్ హయిజ్లు.. గడ్డకట్టించే చలి, ఆకలి, మరో వైపు కేవలం నాలుగు రోజులకు మాత్రమే సరిపడే ఆక్సిజన్ ఉన్నా ఎంతో ధైర్యతో వ్యవ హరించామన్నారు. ఆ సమయంలో స్విగెర్ట్.. ‘హౌస్టన్, మాకో సమస్య వచ్చి పడింది’అంటూ నాసాకు చాలా తేలికైన సందేశమిచ్చారు. దీనినే టామ్ హాంక్స్ 1995 నాటి అపొలో 13 సినిమాలో వాడుకున్నారు. ఆ సినిమాలో లవెల్ పాత్రను టామ్ హాంక్స్ పోషించడం విశేషం. అపొలో 13 మిషన్ పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా ల్యాండైంది. అప్పటికే లవెల్ పేరు ప్రపంచమంతటా మారుమోగిపోయింది. ఎన్నో తీవ్ర ఒత్తిళ్ల మధ్య నిబ్బరంగా పనిచేసిన లవెల్ మారుపేరుగా నిలిచారు. 1973లో నాసా నుంచి రిటైరయ్యారు. -
చిన్న సంస్థలకు.. పెద్ద కష్టం!!
న్యూఢిల్లీ: భారత ఎగుమతులపై 50 శాతం టారిఫ్లు విధించాలన్న అమెరికా నిర్ణయం.. చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) కలవరపరుస్తోంది. దీని ప్రభావం తమపై చాలా తీవ్రంగా ఉంటుందని అవి ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. టారిఫ్ల పెంపు .. వార్షికంగా దాదాపు 30 బిలియన్ డాలర్ల మేర వ్యాపార నష్టానికి దారి తీస్తుందని స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ ఫోరం (ఎస్ఎంఈ ఫోరం) ప్రెసిడెంట్ వినోద్ కుమార్ వెల్లడించారు. దీనివల్ల అత్యధికంగా నష్టపోయేది చిన్న సంస్థలేనని ఆయన చెప్పారు. వాటి ఆర్థిక స్థోమత, సామర్థ్యాలు పరిమిత స్థాయిలోనే ఉండటమే ఇందుకు కారణమని వివరించారు. టారిఫ్ షాక్ అనేది ఎంఎస్ఎంఈ ట్రేడర్లను చాలా కఠినతరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్ చెప్పారు. ‘గతంలో విధించిన 25 శాతానికి మరో 25 శాతం టారిఫ్లు తోడు కావడం వల్ల భారతీయ ఎగుమతిదారులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇతర దేశాల పోటీ సంస్థలతో పోలిస్తే మన ఎగుమతిదారుల వ్యయాలు 30–35 శాతం పెరిగిపోతాయి‘ అని తెలిపారు. దీని వల్ల, ఆగస్టు 27లోగా (అదనపు టారిఫ్లు అమల్లోకి వచ్చే తేదీ) తగిన పరిష్కారం కనుగొనకపోతే, అమెరికాకు ఎగుమతులు 40–50 శాతం పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా దాదాపు 45 శాతంగా ఉంటుంది. పరిశ్రమకు మేల్కొలుపు.. టారిఫ్ల పెంపు అనేది ఇటు విధాన నిర్ణేతలు, అటు ఎగుమతిదారులకు ఓ మేల్కొలుపులాంటిదని కుమార్ చెప్పారు. దీన్ని ఒక అవాంతరంగా చూడకుండా అవకాశంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. అంతగా ఎగుమతులు లేని, అధిక వృద్ధికి అవకాశాలున్న ప్రాంతాలకు కొత్తగా లింకేజీలను ఏర్పర్చుకోవడం, అంతర్జాతీయంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడం ద్వారా భారతీయ ఎంఎస్ఎంఈలు వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ఫోకస్ చేయొచ్చని సూచించారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, సెంట్రల్ ఏషియా, తూర్పు యూరప్, పసిఫిక్ ద్వీప దేశాలు, కరీబియన్ దీవులు మొదలైన మార్కెట్ల వైపు చూడొచ్చని చెప్పారు. ఈ మార్కెట్లకు 60 బిలియన్ డాలర్ల పైగా ఎగుమతులు చేసేందుకు అవకాశాలు ఉంటాయని కుమార్ చెప్పారు. భారతీయ ఎంఎస్ఎంఈలు ఇప్పటికే పటిష్టంగా ఉన్న రంగాల్లో నమ్మకమైన సరఫరాదారుల కోసం ఈ ప్రాంతాల్లోని సంస్థలు అన్వేíÙస్తున్నాయని తెలిపారు. ఫార్మా, వ్యవసాయ–వ్యవసాయేతర మెషినరీ, ప్రాసెస్డ్ ఫుడ్స్, దుస్తులు మొదలైన రంగాలు వీటిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభావిత ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణమే ద్రవ్యపరమైన, ద్రవ్యయేతరమైన చర్యలు ప్రకటించాలని కుమార్ విజ్ఞప్తి చేశారు. అలాగే పరిశ్రమ ఇతరత్రా మార్కెట్ల వైపు కూడా మళ్లేందుకు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని కోరారు. ఈ దిశలో బ్రిటన్, ఆ్రస్టేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్లతో వాణిజ్య ఒప్పందాల పరిధిని మరింతగా విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. మనకు అనువైన మార్కెట్లను గుర్తించి, ఎగుమతి చేసే క్రమంలో కఠినతరమైన నాణ్యత, ప్యాకేజింగ్, నిబంధనల ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో తగు గైడెన్స్ అవసరమవుతుందని కుమార్ పేర్కొన్నారు. ఇన్ని సవాళ్లను ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసేందుకు ఇండియా ఎస్ఎంఈ ఫోరం, ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. డిజిటల్ ట్రేడ్ ప్లాట్ఫాంలను అందుబాటులోకి తేవడం, సకాలంలో..తక్కువ వడ్డీపై ఎగుమతులకు ఫైనాన్సింగ్ అందించడం, రియల్ టైమ్లో మార్కెట్ వివరాలను అందించడం వంటి అంశాలపై కసరత్తు చేస్తోంది. -
ఈయూతో ఒప్పందంపై దూకుడు పెంచాలి
న్యూఢిల్లీ: అమెరికా టారిఫ్ల మోత నేపథ్యంలో యూరోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) కుదుర్చుకోవడంపై భారత్ దూకుడు పెంచాలని 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. అదే సమయంలో అధిక వృద్ధి సాధించే దిశగా భూ, కార్మిక మార్కెట్ సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటు నియంత్రణల భారాన్ని తగ్గించడంపై మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘ఒక మార్కెట్ దాదాపు మూసుకుంటున్నప్పుడు మరో మార్కెట్ వైపు మళ్లాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈయూతో ఒప్పందం కుదుర్చుకోవడం చాలా, చాలా ముఖ్యం. అదే సమయంలో భూ, కారి్మక మార్కెట్కి సంబంధించి సంస్కరణలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది‘ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పనగారియా చెప్పారు. ‘మనపై టారిఫ్లు అమెరికా మార్కెట్లో ఎక్కువగా ఉండి యూరోపియన్ యూనియన్లో తక్కువగా ఉంటే.. మన ఎగుమతులను అమెరికా నుంచి ఈయూకి మళ్లించాలి. మార్కెట్లలో లాభాపేక్ష చాలా బలంగా ఉంటుంది. ఎంట్రప్రెన్యూర్లు చాలా స్మార్ట్గా వ్యవహరిస్తారు. చాలా వేగంగా సరఫరా వ్యవస్థల్లో మార్పులకు అనుగుణంగా సర్దుకుంటారు‘ అని చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితి ఒక రకంగా 1991 నాటి పరిస్థితులను తలపిస్తోంది. అమెరికా భారీ టారిఫ్ల వల్ల సంక్షోభ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అప్పట్లో మనం ఏం చేశామనేది ఒకసారి గుర్తు చేసుకుని, ఏం చేయగలమనేది ఆలోచించాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. సంస్కరణల అజెండాలో చాలా చేశాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి‘ అని సంపన్న దేశంగా ఎదగాలంటే భారత్ తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని, ఎగుమతుల కోసం ఆసియా మార్కెట్లపై ఫోకస్ చేయాలని, అలాగే చైనాపై మన వైఖరిని కూడా పునఃసమీక్షించుకోవాలని పనగారియా సూచించారు.డెడ్ ఎకానమీ .. అత్యధిక వృద్ధి.. భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీ (నిరీ్వర్యంగా) అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై పనగారియా స్పందించారు. ’భారత ఎకానమీ నిజంగా నిరీ్వర్యమైపోతే.. 7 శాతం స్థాయిలో అత్యధిక వృద్ధి సాధించదు. డాలర్ల మారకంలో చూస్తే మన వృద్ధి బహుశా ఇంకా ఎక్కువే ఉంటుంది. డెడ్ ఎకానమీకి ఆయన నిర్వచనం ఏమిటో నాకు తెలియదు. బహుశా (ఆయన ఉద్దేశం ప్రకారం) మృత దేహాల్లోనూ కదలిక ఉంటుందేమో’ అని వ్యాఖ్యానించారు. -
‘మా ట్రంప్ అతి పెద్ద తప్పిదం చేశారు’
వాషింగ్టన్: భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాల నిర్ణయం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదని అంటున్నారు ఆ దేశ జాతీయ సెక్యూరిటీ మాజీ సలహాదారు జాన్ బాటమ్. భారత్ వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాల తీరును తీవ్రంగా తప్పబట్టారాయన. కచ్చితంగా ఇది ట్రంప్ చేసిన అతి పెద్ద తప్పిదంగా అభివర్ణించారు. ఎన్నో దశాబ్దాల నంచి భారత్తో ఉన్న మిత్రత్వం ట్రంప్ సుంకాల దెబ్బతో అది కాస్తా బెడిసి కొట్టే ప్రమాదం అధికంగా ఉందన్నారు. చైనా కంటే అత్యధిక సుంకాలు విధించడం భారత్ పట్ల వివక్ష ధోరణికి నిదర్శమన్నారు. చైనాకు సుంకాలు పెంచి ఉపశమన కల్పించిన ట్రంప్.. భారత్పై 50 శాతం సుంకాలంటూ బెదిరింపు చర్యలకు దిగడం అమెరికా-భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు. చైనాపై ఉదాసీనత కనబరిచిన ట్రంప్.. భారత్ను రష్యా, చైనాలను దూరం చేయడానికి దశాబ్దాలుగా అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ప్రమాదంలో పడేస్తాయన్నారు. భారత్ను రష్యా, చైనాల నుంచి వేరు చేయడానికి చేసిన ట్రంప్ వ్యూహం కచ్చితంగా అతి పెద్ద తప్పిదమేనని నొక్కి మరీ చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడిన ఆయన ట్రంప్ విధించే సుంకాలపై గురించి, ప్రత్యేకంగా భారత్పై విధించిన సుంకాలపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరొకవైపు అమెరికా విదేశాంగ విధాన నిపుణుడు, ఆ దేశ మాజీ వాణిజ్య అధికారి క్రిస్టోఫర్ పాడిల్లా కూడా భారత్పై ట్రంప్ విధించిన సుంకాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సుంకాలు ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలకు దీర్ఖకాలిక నష్టం కల్గించే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. ఇక్కడ అమెరికా నమ్మకమైన భాగస్వామి కాదు అనేది తలెత్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
పరాయి దేశాలపై సైనిక చర్య?.. ట్రంప్ మరో సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం వైపు అడుగులేస్తున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో సైనిక చర్య చేపట్టే యోచనలో ఉన్నారు. డ్రగ్ కార్టెల్స్ను ఇదివరకే ఉగ్రసంస్థలుగా గుర్తించిన ఆయన.. వాటిపై ఉక్కుపాదం మోపే క్రమంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.జనవరిలో అధ్యక్ష హోదాలో వైట్హౌజ్లో అడుగుపెట్టిన వెంటనే.. లాటిన్ దేశాలకు చెందిన పలు కార్టెళ్లను జాతీయ భద్రతా ప్రమాదంగా గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారాయన. ‘‘లాటిన్ అమెరికాలో చాలా కార్టెళ్లు ఉన్నాయి. వాటిల్లో మాదకద్రవ్యాలు ప్రవహిస్తున్నాయి. వాటి నుంచి మన దేశాన్ని ఎలాగైనా రక్షించాలి’’ అని ఆ సందర్భంలో ఆయన వ్యాఖ్యానించారాయన. ఈ క్రమంలోనే అలాంటి కార్టెళ్లను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్య చేపట్టే అవకాశం ఉందని ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి.2025 ఫిబ్రవరిలో మెక్సికో, వెనిజులా దేశాల్లోని ఎనిమిది డ్రగ్ కార్టెళ్లను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా అమెరికా గుర్తించింది. ఇందులో మెక్సికో సినాలోవ్, వెనిజులా ట్రెన్ డె అరగ్వా ప్రధానంగా ఉన్నాయి. తర్వాతి రోజుల్లో వెనిజులాకే చెందిన సన్స్(Suns) అనే మరో కార్టెల్ను చేర్చింది అమెరికా. గత 20 ఏళ్లుగా ఈ కార్టెల్ నుంచే అమెరికాకు టన్నుల కొద్దీ మాదకద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని అమెరికా అంటోంది. అంతేకాదు ఈ కార్టెల్ను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నడిపిస్తున్నారని అమెరికా ఆరోపించగా.. ఆయన ఆ ఆరోపణలను ఖండించారు కూడా. న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ మద్దతుతో సైనిక చర్యకు సిద్ధమవ్వాలని.. అవసరమైతే అంతర్జాతీయ మిత్రదేశాల సహకారంతో ముందుకు వెళ్లాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ను ట్రంప్ ఆదేశించారు. ఇదే విషయాన్ని వాల్ స్ట్రీట్ జనరల్ సైతం ప్రచురించింది. అయితే.. అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్హౌజ్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. కానీ అధ్యక్ష భవన ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ.. అమెరికాను రక్షించడం ట్రంప్ తొలి ప్రాధాన్యం. ఇప్పటికే పలు కార్టెల్స్ను ఉగ్రసంస్థలుగా ఆయన ప్రకటించారు. ఈ క్రమంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా ఆయన వెనకాడరని గుర్తించాలి అని అన్నారు. సైనిక చర్యను అనుమతిస్తాయా?ఒక దేశపు సైన్యాన్ని.. మరొక దేశంలో ప్రయోగిస్తామంటే ఊరుకుంటారా?. తాజా అమెరికా సైనిక చర్య కథనాలపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బౌమ్ స్పందించారు. ‘‘మాదక ద్రవ్యాల కట్టడికి ఇరు దేశాలు(అమెరికా, మెక్సికో) కలిసే పని చేస్తున్నాయి. ఇప్పటికే మేం ఆ దేశానికి సహకరిస్తున్నాం కూడా. అలాంటప్పుడు సైనిక చర్య దేనికి?. ఇది స్వాగతించదగ్గ నిర్ణయం ఏమాత్రం కాదు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సైన్యాన్ని మా దేశంలో అడుగుపెట్టనివ్వం’’ అని పేర్కొన్నారు. మెక్సికో విదేశాంగ శాఖ కూడా అమెరికా సైనిక జోక్యం కథనాలను ఖండిస్తూ.. అలాంటి చర్యలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.సైనిక చర్య.. ట్రంప్ ప్లాన్ ఎలాగంటే.. విదేశీ మిత్ర దేశాలతో సమన్వయంసముద్రంలో, విదేశీ భూభాగాల్లో నేరగాళ్లపై దాడులుఈ దాడుల్లో స్పెషల్ ఫోర్సెస్, గూఢచర్య సంస్థలు పాల్గొనే ఛాన్స్అమెరికా తగ్గేదే లే..అయితే.. అమెరికా మాత్రం ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని చెబుతోంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కార్టెల్స్ అనే వాటిని కేవలం మాదకద్రవ్యాల విక్రయ సంస్థలుగా కాకుండా ఆయుధాలతో కూడిన ఉగ్రవాద సంస్థలుగానే పరిగణించాలి. ఈ గుర్తింపుతోనే ఇకపై ఇది అమెరికాకు జాతీయ భద్రతా సమస్యగా మారింది. తద్వారా వాటి కార్యకలాపాలపై అమెరికా గూఢచర్య సంస్థలు, రక్షణ శాఖలను ప్రయోగించబోతున్నాం అని పేర్కొన్నారాయన.