USA
-
చాగోస్ దీవులపై ట్రంప్ కన్ను.. యూకేకు బిగ్ షాక్?
వాషింగ్టన్: హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన చాగోస్ దీవులను కొనుగోలు చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలంరేపుతున్నాయి. గ్రీన్లాండ్ను కొనుగోలు చేయాలనే ప్రతిపాదన తరహాలోనే, ఇప్పుడు బ్రిటన్ను పూర్తిగా పక్కనపెట్టి, చాగోస్ దీవులపై సార్వభౌమాధికారం ఉన్న మారిషస్తో అమెరికా నేరుగా ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తోంది. ఈ మేరకు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఒక ప్రత్యేక ప్రతిపాదనను ట్రంప్ ముందుకు తెచ్చినట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ ‘టెలిగ్రాఫ్’ వెల్లడించింది.ట్రంప్ వ్యూహం.. బ్రిటన్తో సంబంధంలేకుండా..అమెరికా రూపొందించిన ఈ సరికొత్త ప్రతిపాదన ప్రకారం.. బ్రిటన్తో సంబంధం లేకుండా చాగోస్ దీవులను నేరుగా మారిషస్ నుండి కొనుగోలు చేయాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అయితే దీనికంటే ముందు ఆ దీవులకు పూర్తి సార్వభౌమాధికారం లభించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న పలు ఆప్షన్లలో ఇది ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, అమెరికా అధికారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు మిత్రదేశంగా ఉన్న మారిషస్కు ఈ భూభాగాన్ని పూర్తిగా అప్పగిస్తే, అక్కడ గూఢచర్య ముప్పు పెరిగే అవకాశం ఉందని కొందరు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డియెగో గార్సియా స్థావరం.. ఇరాన్ ముప్పుమధ్య హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ చాగోస్ దీవులలోని ‘డియెగో గార్సియా’ సైనిక స్థావరం అమెరికాకు అత్యంత వ్యూహాత్మకమైనది. ప్రస్తుతం ఇరాన్తో నడుస్తున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, ఇరాన్ నుండి సుమారు 3,800 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బేస్ నుండి అమెరికా లాంగ్-రేంజ్ మిసైళ్లను ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత మార్చిలో ఈ సంయుక్త సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులకు ప్రయత్నించగా, అమెరికా యుద్ధనౌక దాన్ని తిప్పికొట్టింది. ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు యూకే ఆలస్యంగా అనుమతి ఇవ్వడంపై ట్రంప్ గతంలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు.యూకే హ్యాండ్ఓవర్ సస్పెన్స్.. శరణార్థుల ఆవేదనఈ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బదిలీ చేసే ప్రక్రియకు అమెరికా మద్దతు ఉపసంహరించుకోవడంతో, గత ఏప్రిల్లోనే దీనికి సంబంధించిన చట్టం నిలిచిపోయింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ.. డియెగో గార్సియాపై నియంత్రణకు ముప్పు పొంచి ఉన్నందున, జాతీయ ప్రయోజనాల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమెరికా మద్దతు లేకుండా బ్రిటన్ ఎలాంటి సార్వభౌమత్వ ఒప్పందానికి ముందుకు వెళ్లబోదని స్పష్టం చేశారు. మరోవైపు తమ జన్మభూమి భవిష్యత్తును బ్రిటన్ రాజకీయాలు హైజాక్ చేశాయని, స్వదేశానికి తిరిగి వెళ్లే హక్కు తమకు ఉందని చాగోస్ శరణార్థుల బృందం ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
‘నువ్వు నమ్మక ద్రోహివి.. నీకసలు తెలివే లేదు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టీవీ ఇంటర్వ్యూలో సహనం కోల్పోయారు. సదరు టీవీ ఛానెల్ యాంకర్పై నోరు పారేశుకున్నారు. ‘నువ్వు చేసేది మోసమైనా ఉండాలి. లేదంటే తెలివి తక్కువైనా ఉండాలి అంటూ కాలర్ మైక్ను పడేసి బయటకు వెళ్లిపోయారు.ఆదివారం ప్రముఖ అమెరికా మీడియా సంస్థ ఎన్బీసీ తన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ను ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్, యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ల మధ్య చిన్న సైజు మినీ యుద్ధమే జరిగింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కాలిఫోర్నియాలో జోబైడెన్ సుమారు 63శాతం ఓట్లు సాధించారు. డొనాల్డ్ ట్రంప్ 34శాతం ఓట్లు మాత్రమే పొందారు. ఈ ఎన్నికల ఫలితాల సరళిని ఎన్బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ మళ్లీ ప్రస్తావించారు. ఆయన కాలిఫోర్నియాలో రిగ్గింగ్ కారణంగా ఓట్ల లెక్కింపు ఆలసమైందని ఆరోపించారు. దీనికి యాంకర్ క్రిస్టెన్ వెల్కర్ స్పందిస్తూ.. ‘కాలిఫోర్నియాలో ఓట్ల లెక్కింపు ఆలస్యానికి కారణం రిగ్గింగ్ కాదు. పోలైన ఓట్ల శాతం ఎక్కువ. వాటిని లెక్కించడానికి మరింత సమయం పట్టింది’ అని చెప్పారు. ఈ వివరణతో ట్రంప్ చిర్రెత్తుకొచ్చి ‘కౌంటింగ్లో చీటింగ్ జరిగింది’ అని మరోసారి ఆరోపించారు. వెల్కర్ ఆయనను నిలదీస్తూ.. మీ ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. ట్రంప్ ‘నేనే చూశాను.. అదే ఆధారం’ అని సమాధానమిచ్చారు. కానీ ఎన్బీసీ యాంకర్ ఎన్నికల్లో అవకతవకలకు ఎలాంటి ఆధారాలు లేవని మరోసారి స్పష్టం చేశారు.తర్వాత సంభాషణ మీడియాపై విమర్శలకు దారి తీసింది. ట్రంప్ కాలిఫోర్నియా ఎన్నికల అధికారులను, మీడియా ప్రతినిధులను, మీడియా సంస్థలను ‘మోసగాళ్లు’గా అభివర్ణించారు. మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని కూడా ‘మోసపూరితం’ అని అన్నారు. ట్రంప్ అమెరికా ఎన్నికల నిర్వహణను ‘అభివృద్ధి చెందని దేశం’ తరహాలో ఉందని వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా వెల్కర్ ‘నేను మోసపూరితమైనది కాదు’ అని బదులిచ్చారు. దానికి ట్రంప్ ‘నువ్వు మోసపూరితమైనదానివైనా అయి ఉండాలి.. లేదంటే తెలివితక్కువదానివైనా అయి ఉండాలి అని అన్నారు. కాలిఫోర్నియా ఎన్నికలపై జరిగిన చర్చ చివరికి రసాభాసగా ముగింది. JUST NOW: President Trump walked out of the interview with Kristen Welker. President Trump had enough!!Refusing to tolerate the biased framing, President Trump completely turned the tables on the Welker."Your elections are crooked, and you're crooked."pic.twitter.com/cxXTcYM6Fk— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) June 7, 2026 -
అన్నంత పని చేసిన ఇరాన్.. ఇజ్రాయెల్పై క్షిపణుల వర్షం
పశ్చిమాసియాలో కాల్పుల విరమణ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. లెబనాన్ బీరూట్ శివార్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ రంగంలోకి దిగింది. నేరుగా బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార దాడికి దిగింది. ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతాల్లో సైరన్లు మోగగా, క్షిపణి నిరోధక వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. దీంతో ప్రాంతంలో మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర మలుపు తిరిగాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం (IDF) వెల్లడించింది. క్షిపణుల ప్రయోగాన్ని గుర్తించిన వెంటనే దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు మోగించడంతో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలను రంగంలోకి దింపింది. లక్షలాది మంది ప్రజలు అత్యవసర ఆశ్రయ కేంద్రాలు, బంకర్లకు పరుగులు తీశారు. ఉత్తర ఇజ్రాయెల్లో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను వైమానిక దళం విజయవంతంగా అడ్డుకుందని తెలిపింది. ఇప్పటివరకు ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదని పేర్కొంది. అయితే అదనపు క్షిపణుల ప్రయోగాలను కూడా గుర్తించినట్లు వెల్లడించింది.ప్రతీకారమే!ఈ క్షిపణి దాడులు జరగడానికి కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ శివార్లపై వైమానిక దాడులు నిర్వహించాయి. ముఖ్యంగా హిజ్బుల్లా ప్రభావం ఎక్కువగా ఉన్న దహియెహ్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. ఈ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీరూట్పై దాడులు చేస్తే ప్రతీకారం తప్పదని ఇప్పటికే హెచ్చరించిన టెహ్రాన్, తాజాగా రంగంలోకి దిగినట్లే స్పష్టమవుతోంది.10 క్షిపణులు అడ్డుకున్న ఇజ్రాయెల్అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ఇరాన్ ప్రయోగించిన కనీసం 10 బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థ CNN తన నివేదికలో పేర్కొంది.ఇజ్రాయెల్ ప్రతీకార హెచ్చరికఇరాన్ దాడిపై స్పందించిన ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ Effie Defrin, "ఇరాన్ తీవ్రమైన తప్పు చేసింది" అని వ్యాఖ్యానించారు. అలాగే ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయల్ జమీర్ మాట్లాడుతూ.. అవసరమైతే శత్రువుపై గట్టి దెబ్బ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఏప్రిల్ తర్వాత..ఏప్రిల్ 8న అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇరాన్ నేరుగా ఇజ్రాయెల్పై దాడి చేయడం ఇదే మొదటిసారి. దీంతో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సున్నితమైన శాంతి వాతావరణం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. ఇజ్రాయెల్-హెజ్బుల్లా ఘర్షణల నేపథ్యంలో అమెరికాతో జరుగుతున్న పరోక్ష చర్చలను కూడా ఇరాన్ నిలిపివేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యంతో పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ, అదే రోజున రెండు పక్షాలు పరస్పరం దాడులు కొనసాగించడంతో ఆ ఒప్పందం నిలవలేదు.రమత్ డేవిడ్ ఎయిర్బేస్ లక్ష్యంగా..ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, తమ ఏరోస్పేస్ దళాలు ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ ఎయిర్బేస్ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించాయి. ఇరాన్కు చెందిన ఖాతమ్ అల్-అన్బియా కమాండ్ అధికారి మాట్లాడుతూ, బీరూట్ దక్షిణ శివార్లపై దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ అన్ని "రెడ్లైన్లను" దాటిందని ఆరోపించారు.అన్నంత పని చేసిన ఇరాన్"బీరూట్ శివార్లపై దాడులు విస్తరిస్తే ఆక్రమిత భూభాగాల్లోని లక్ష్యాలపై దాడి చేస్తామని ముందే హెచ్చరించాం. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడులు ఆపకపోతే మరింత తీవ్రమైన, విధ్వంసకర దెబ్బలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఇరాన్ సైనికాధికారులు హెచ్చరించారు.గగనతలం మూసివేతఇజ్రాయెల్పై క్షిపణి దాడుల అనంతరం ప్రతీకార చర్యలు ఉండొచ్చన్న అంచనాతో ఇరాన్ తన పశ్చిమ గగనతలాన్ని (Western Airspace) తాత్కాలికంగా మూసివేసింది. అదే సమయంలో ఇరాక్, సిరియా కూడా భద్రతా కారణాల దృష్ట్యా తమ గగనతలాన్ని మూసివేసినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. దీంతో ప్రాంతీయ విమాన రాకపోకలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.అమెరికా లక్ష్యాలకూ హెచ్చరికఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) మరింత ఘాటు హెచ్చరికలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతమైతే కేవలం ఇజ్రాయెల్ మాత్రమే కాకుండా అమెరికా ప్రయోజనాలు, అమెరికా మద్దతు ఉన్న లక్ష్యాలపై కూడా దాడులు విస్తరించే అవకాశం ఉందని ప్రకటించింది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి పరిసరాల్లో జరిగిన ఘటనలను కూడా ప్రస్తావించింది.ట్రంప్ భిన్నాభిప్రాయంఅయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇజ్రాయెల్ మరింత ప్రతీకార చర్యలకు వెళ్లాల్సిన అవసరం లేదని భావిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రసార సంస్థ నివేదించింది. ఇది ఇజ్రాయెల్ సైన్యం వ్యక్తం చేస్తున్న కఠిన వైఖరికి భిన్నంగా కనిపిస్తోంది.మళ్లీ యుద్ధ భయాలుఇరాన్-ఇజ్రాయెల్ తాజా ఘర్షణతో మిడిల్ఈస్ట్ దేశాలు మరోసారి అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే గాజా, లెబనాన్, సిరియా ప్రాంతాల్లో కొనసాగుతున్న అస్థిర పరిస్థితులకు ఈ పరిణామం మరింత మంటలు రాజేసే ప్రమాదం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
భారత్లోకి ఆంథ్రోపిక్ ‘మైథోస్’
న్యూఢిల్లీ: అమెరికా చెందిన కృత్రిమ మేధ(ఏఐ) పరిశోధనా సంస్థ ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘మైథోస్’ ఏఐ మోడల్ను వినియోగించే అవకాశం కొన్ని భారతీయ సంస్థలకు లభించింది. ఆంథ్రోపిక్ చేపట్టిన ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ విస్తరణలో భాగంగా భారత్కు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు ఈ యాక్సెస్ను పొందినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్కు యాక్సెస్ పొందిన దేశీయ సంస్థల సంఖ్య పదిలోపే ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయా సంస్థల పేర్లను వెల్లడించలేదు. ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’ అంటే సైబర్ భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంథ్రోపిక్ చేపట్టిన కార్యక్రమమే ‘ప్రాజెక్ట్ గ్లాస్వింగ్’. ఈ కార్యక్రమం కింద ఎంపిక చేసిన సంస్థలకు ఆంథ్రోపిక్ అభివృద్ధి చేసిన అధునాతన ‘క్లాడ్ మైథోస్ ప్రివ్యూ’ ఏఐ మోడల్కు యాక్సెస్ కలి్పస్తోంది. సాఫ్ట్వేర్లలోని క్లిష్టమైన భద్రతా లోపాలు, జరగబోయే సైబర్ ముప్పులను గుర్తించడంలో ఈ మోడల్ కీలక పాత్ర పోషిస్తుంది. ఏప్రిల్లో కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు సుమారు 50 భాగస్వామ్య సంస్థలకు మాత్రమే యాక్సెస్ ఇచ్చారు. ఈ మోడల్ సాయంతో ఆయా సంస్థలు వివిధ కోడ్బేస్లలో 10 వేలకుపైగా అధిక లేదా అత్యంత తీవ్ర స్థాయి భద్రతా లోపాలను గుర్తించినట్లు ఆంథ్రోపిక్ వెల్లడించింది. సైబర్ భద్రత కోసం అంతర్జాతీయ విస్తరణ తాజాగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తూ భారత్తో పాటు 15కుపైగా దేశాల్లోని 150 సంస్థలను భాగస్వాములుగా చేర్చింది. వీటిలో విద్యుత్, నీటి సరఫరా, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, హార్డ్వేర్ రంగాలకు చెందిన కీలక మౌలిక వసతుల నిర్వాహక సంస్థలు ఉన్నాయి. సైబర్ దాడి జరిగితే కొన్ని సందర్భాల్లో 10 కోట్ల మందికిపైగా ప్రభావితమయ్యే అవకాశం ఉన్న సంస్థలను ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేసినట్లు ఆంథ్రోపిక్ తెలిపింది. ఈ యాక్సెస్ ద్వారా భాగస్వామ్య సంస్థలు తమ డిజిటల్ మౌలిక వసతుల్లోని భద్రతా లోపాలను ముందే గుర్తించడం, రక్షణ వ్యవస్థలను పరీక్షించడం, సాఫ్ట్వేర్ ప్యాచ్ల అమలును వేగవంతం చేయడం వంటి చర్యలు చేపట్టగలవు. -
ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తులపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధంలో తాము విధించిన షరతులకు ఇరాన్ తలొగ్గాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అప్పటి వరకు ఫ్రీజ్ చేసిన ఆస్తులను విడుదల చేయబోమని, ఇరాన్పై విధించిన ఆర్థిక ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. అలాగే, లెబనాన్ను ఈ తాత్కాలిక ఒప్పందంలో భాగం చేయాలనే ఆలోచన లేదన్నారు.ఎన్బీసీ న్యూస్ నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందంలో ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అన్నారు. ఒప్పందంపై మాకు నమ్మకం కలగాలి. అప్పుడే ఆంక్షలపై చర్చలు ప్రారంభమవుతాయి. ఒప్పందం కుదిరే వరకు ఆస్తులను నిలిపివేస్తామని స్పష్టం చేస్తూ.. ఇరాన్పై మరింత ఒత్తిడి పెంచారు. ఈ సందర్భంగా అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రస్తుతం లెబనాన్ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాయి.ఇరాన్తో అమెరికా చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తతలు ఇంకా తగ్గలేదు. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలు, దాడులు, రాజకీయ అస్థిరతలు ఈ చర్చలకు మరింత క్లిష్టతరం చేశాయి.ట్రంప్ వ్యాఖ్యలు ఒప్పందం విషయంలో అమెరికా తన వైఖరిని స్పష్టం చేసింది. -
అమెరికా - ఇజ్రాయెల్ మధ్య యుద్ధం..? రంగంలోకి దిగిన నెతన్యాహు
-
ఇరాన్ ఆస్తులపై అమెరికా షాకింగ్ నిర్ణయం..?
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఇరాన్ ను రెచ్చగొడుతున్నారు. విదేశాల్లో ఫ్రీజైన ఇరాన్ ఆస్తులను గల్ఫ్ దేశాల పునర్నిర్మాణానికి సాయంగా అందించే యోచన చేస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే అసలే అమెరికా ఆంక్షలతో మండిపడుతున్న ఇరాన్ ఈ వ్యవహారంతో చర్చలకు పూర్తిగా ఫులిస్టాప్ పెట్టే అవకాశం ఉంది.పశ్చిమాసియా యుద్ధం తాలూకా విధ్వంసం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యుద్ధం ప్రారంభంలోనే ఇరాన్ ప్రతీకారంతో హర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీంతో చమురు సంక్షోభం తలెత్తి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కారణంతో ప్రపంచ దేశాలు ట్రంప్పై మండిపడ్డాయి. పరిస్థితి తీవ్ర స్థాయికి చేరడంతో అమెరికా కొంత తగ్గి ఇరాన్తో చర్చల ఒప్పందం కోసం యత్నించింది. అయితే అమెరికా షరతులకు ఇరాన్ ససేమిరా అనడంతో రాజీ కుదరలేదు. అయితే ప్రస్తుతం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం పాటించడంతో పరిస్థితులు కొంతమేర ప్రశాంతంగా ఉన్నాయి. ఇదంతా తెలిసిన కథేఅయితే మరోసారి అమెరికా ఇరాన్ను రెచ్చగొట్టే యత్నం చేస్తుంది. ఇరాన్ డిమాండ్లలో ప్రధానమైనవి ఫ్రీజ్ చేసిన తమ దేశ ఆస్తులను వెంటనే విడుదల చేసి యుద్ధ నష్టానికి తగిన పరిహారం అందించడం. అయితే అమెరికా మాత్రం ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల్లో జరిగిన నష్టానికి పరిహారంగా అందించే యత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడి చేయడంతో అక్కడి మౌళిక స్థావరాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. దీంతో ఆదేశాలు ట్రంప్పై గుర్రుగా ఉన్నాయి. దీంతో వాటిని శాంతపరిచేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇరాన్ ఆస్తులు విదేశాల్లో ఎందుకు ?ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు,సహజ వాయువు ఉత్పత్ చేసే దేశాలలో ఒకటి. అది ఇతర దేశాలకు చమురును విక్రయించినప్పుడు, ఆయా దేశాలు ఇరాన్కు చెల్లించాల్సిన కోట్లాది డాలర్ల డబ్బు అంతర్జాతీయ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. దీంతో అంతర్జాతీయ బ్యాంకుల్లో ఉన్న ఇరాన్ సొమ్మును అమెరికా లీగల్గా బ్లాక్ చేసింది. ఇవే కాకుండా ఆంక్షలు రాకముందు విదేశాలలో ఇరాన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన భవనాలు, భూములు లేదా ఇతర కంపెనీలలో పెట్టిన పెట్టుబడులు.బంగారు నిల్వలను సైతం అమెరికా బ్లాక్ చేసింది.ఎంత డబ్బు ఫ్రీజ్ అయ్యింది.?ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 బిలియన్ డాలర్ల నుండి 123 బిలియన్ డాలర్లు సుమారుగా రూ. 8.3 లక్షల కోట్ల నుండి రూ. 10.2 లక్షల కోట్ల డబ్బు ఫ్రీజైనట్లు విశ్లేషకుల అంచనా అయితే, ఇందులో నేరుగా అమెరికా నియంత్రణలో నేరుగా అమెరికా నియంత్రణలో దాదాపు 24 బిలియన్ డాలర్లు ఉంది. ఆడబ్బుని వెంటనే చెల్చించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.మిగతా కరెన్సీ దక్షిణ కొరియా, జపాన్, యూరప్, మరియు కొన్ని గల్ఫ్ దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ఇరాన్ ఆయా దేశాలకు చమురు అమ్మగా వచ్చిన డబ్బు అది. కానీ అమెరికా విధించిన బ్యాంకింగ్ ఆంక్షల భయం వల్ల ఆ దేశాలు ఇరాన్కు ఆ డబ్బు ఇవ్వకుండా తమ వద్దే నిలిపివేశాయి. అయితే ప్రస్తుతం ఆ డబ్బులను గల్ఫ్ దేశాల పునర్నర్మాణం కోసం వాడాలని అమెరికా భావిస్తోంది. ఇదే జరిగితే ఇక యుద్ధం తీవ్రస్థాయికి చేరే అవకాశం ఉంది. -
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
-
అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ.. మిగిలేదెంత?
న్యూయార్క్: అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. కోట్లలో జీతం అనగానే భారతదేశంలోని చాలామంది ఎంతో సంబరపడిపోతుంటాయి. అయితే ఆ సంపాదన వెనుక ఉన్న అసలు నిజాలు, ఖర్చుల గురించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న యశ్ శర్మ అనే భారతీయుడు ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఒక వీడియో ప్రవాస భారతీయుల వాస్తవ ఆర్థిక పరిస్థితులను కళ్లకు కట్టింది. అమెరికాలో రూ. 1 కోటి ప్యాకేజీ వచ్చినా, అక్కడ ఉండే పన్నులు, అద్దెల భారంతో పోలిస్తే భారతదేశంలో తక్కువ జీతంతోనే ఎక్కువ సంతోషంగా ఉండవచ్చని అతను చేసిన విశ్లేషణ నెటిజన్లలో చర్చకు దారితీసింది.పన్నుల రూపంలో భారీ కోతయశ్ శర్మ తన వీడియోలో న్యూయార్క్లో లభించే రూ. కోటి ప్యాకేజీపై పడే పన్నుల భారాన్ని వివరంగా లెక్కగట్టారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నివసించే వారికి ఫెడరల్ టాక్స్, స్టేట్ టాక్స్, న్యూయార్క్ సిటీ టాక్స్లతో పాటు సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి రకరకాల పన్నులు వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల సంపాదనలో ఏకంగా 35 శాతం నుండి 40 శాతం వరకు కేవలం పన్నుల రూపంలోనే ప్రభుత్వం ఖాతాలోకి వెళ్లిపోతుందని, దీంతో చేతికి వచ్చే మొత్తం ఊహించిన దానికంటే చాలా తక్కువగా ఉంటుందని తెలిపారుఆకాశాన్నంటుతున్న ఇళ్ల అద్దెలుపన్నుల కోత తర్వాత మిగిలిన మొత్తంలో అధికభాగం ఇళ్ల అద్దెలకే సరిపోతుందని యశ్ వివరించారు. న్యూయార్క్ లాంటి నగరంలో ఒక మోస్తరు లేదా మంచి ప్రాంతంలో నివసించాలన్నా నెలకు సుమారు రూ. రెండు లక్షల నుండి రూ. మూడు లక్షల వరకు అద్దె చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ భారీ వ్యయాలను పరిగణనలోకి తీసుకుంటే, అమెరికాలో రూ. కోటి ప్యాకేజీ సంపాదించే వ్యక్తి కంటే, భారతదేశంలో రూ. 25 లక్షల నుండి రూ. 30 లక్షల వార్షిక ఆదాయం పొందే వ్యక్తి ఎంతో ప్రశాంతంగా, విలాసవంతంగా, సంతోషంగా జీవించగలడని ఆయన అభిప్రాయపడ్డారు.నెటిజన్ల భిన్న స్పందనలు‘ది డార్క్ సైడ్ ఆఫ్ ఎ ₹1 క్రోర్ ప్యాకేజీ ఇన్ న్యూయార్క్’ అనే క్యాప్షన్తో షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ, కేవలం డాలర్లను రూపాయిల్లోకి మార్చి చూసే వారికి అక్కడి ఖర్చులు అర్థం కావని కామెంట్లు పెడుతున్నారు. సంపాదన కంటే జీవన వ్యయం చాలా ముఖ్యమని కొందరు అంటుండగా, న్యూయార్క్ అమెరికాలోనే అత్యంత ఖరీదైన నగరం కాబట్టి అమెరికా అంతటా ఇలాగే ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. అయినప్పటికీ, విదేశాలకు వెళ్లే వారికి అక్కడి పన్నులు, అద్దెలు నిజంగానే పెద్ద షాక్ ఇస్తాయనేది వాస్తవమని మెజారిటీ నెటిజన్లు చెబుతున్నారు. -
అమెరికాలో కాల్పుల కలకలం: వేడుకల్లో బుల్లెట్ల వర్షం!
ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో కలకలం చెలరేగింది. టోలెడో నగరంలోని ఒక ప్రాంతంలో వేడుకలు జరుగుతుండగా, గుర్తుతెలియని ఆగంతకుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా వినిపించిన తుపాకీ శబ్దాలు..అక్కడి వాతావరణాన్ని ఆందోళనకరంగా మార్చివేశాయి. జనం ప్రాణభయంతో అటూఇటూ పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పండుగ వేళ బుల్లెట్ల వర్షంఓహియోలో ‘ఓల్డ్ వెస్ట్ ఎండ్ ఫెస్టివల్’ జరుగుతుండగా కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రక్తపు మడుగులో పలువురు క్షతగాత్రులు కనిపించారు. ఈ ఘటనపై నగర కౌన్సిల్ సభ్యురాలు థెరిసా మోరిస్ స్పందిస్తూ.. ఈ కాల్పుల్లో కనీసం ఎనిమిది మంది గాయపడ్డారని, రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో ఇలాంటి దారుణం జరగడం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా నౌకాదళంలో పనిచేసిన కెవిన్ బెర్రీ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం, కాల్పుల అనంతరం ఎవరో గన్ను కింద పడేసి వెళ్లడం తాను చూశానని, అర్బోరేటమ్ ప్రాంతంలో ఐదుగురు గాయపడి పడి ఉండటాన్ని గమనించానని పేర్కొన్నారు.నిందితుడి కోసం ముమ్మర గాలింపుఈ హింసాత్మక ఘటనకు పాల్పడిన నిందితుని కోసం టోలెడో పోలీస్ డిపార్ట్మెంట్ ముమ్మరంగా గాలిస్తోంది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోలీసులు స్పందిస్తూ.. డెలావేర్ అవెన్యూ, రాబిన్వుడ్ అవెన్యూ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్లు, దర్యాప్తుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు స్థానికులు, సందర్శకులు ఎవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరించారు. కాల్పులకు దారితీసిన పరిస్థితులపై ఆధారాలు సేకరిస్తున్నారు.‘బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ఈ ఉదంతంపై ఓహియో గవర్నర్ మైక్ డివైన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేసవి ఉత్సవాలు అనేవి సంతోషంగా గడపడానికి ఉద్దేశించినవని, ఇలాంటి చోట్ల హింస చోటుచేసుకోవడం ఆందోళనకరమని ఆయన అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో కాల్పుల శబ్దాలు వినగానే జనం ప్రాణాలు కాపాడుకోవడానికి చెల్లాచెదురుగా పరుగులు తీయడం కనిపిస్తోంది.ఇది కూడా చదవండి: ‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్! -
‘వాస్తవంలో బతకండి మిస్టర్ ట్రంప్’.. నీళ్లు చల్లిన టెహ్రాన్!
టెహ్రాన్: వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భవిష్యత్తులో సమావేశం కావచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను ఇరాన్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువంటి భేటీ ఆశించడం ముమ్మాటికీ అవాస్తవికమని, అమెరికా అధ్యక్షుడు ఇకనైనా ‘వాస్తవంలో బతకడం’ అలవాటు చేసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ట్రంప్ ఆశావాదం - ఇరాన్ తిరుగుబాటుఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు ముందుకు సాగితే, ఇరాన్ అగ్ర నాయకత్వంతో నేరుగా చర్చలు జరపవచ్చని డోనాల్డ్ ట్రంప్ ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ భద్రత, ఇరాన్ అణు కార్యక్రమంపై విస్తృత ఒప్పందాన్ని కుదుర్చుకునే వ్యూహంలో భాగంగా, మొజ్తబా ఖమేనీతో చారిత్రాత్మక భేటీకి తాను సిద్ధమంటూ సంకేతాలు ఇచ్చారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ట్రంప్ వ్యాఖ్యలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని లెబనాన్ ఛానల్ ‘అల్ మయాదీన్’ ఇంటర్వ్యూలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కొట్టిపారేశారు.అసలు ఎవరీ మొజ్తబా ఖమేనీ?2026 మార్చిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మొజ్తబా ఖమేనీ ఇరాన్ అత్యున్నత రాజకీయ, మతపరమైన పదవిని చేపట్టారు. బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆయన ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ, ఇరాన్ అంతర్గత, విదేశాంగ విధానాలను శాసించడంలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం నాల్గవ నెలలోకి ప్రవేశించిన ఈ తరుణంలో ఆయనతో భేటీ కావడం ట్రంప్కు ప్రతిష్టాత్మకంగా మారింది.కొనసాగుతున్న తీవ్ర విభేదాలుఅమెరికా ఎంతగా చర్చల ప్రతిపాదనలు ముందుకు తెస్తున్నా, ఇరు దేశాల మధ్య నమ్మకరాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు దౌత్యపరమైన పురోగతికి ప్రధాన అడ్డంకులుగా ఉన్నాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం బహిరంగ ప్రకటనల ద్వారా కాకుండా, ఆచరణాత్మక రాజకీయ పరిణామాల ఆధారంగానే భవిష్యత్తు చర్చలు ఉంటాయని ఇరాన్ గట్టిగా చెప్తోంది. నానాటికీ క్షీణిస్తున్న ఈ సంబంధాల నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సయోధ్య కుదరడం ఇప్పట్లో సాధ్యం కాదని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.ఇది కూడా చదవండి: కరోనా నాటి ఘోర తప్పిదం.. నేడు వేలాది ప్రాణాలకు ముప్పు! -
పిజ్జా డెలివరీ కోసం వెళ్తే కాల్చిచంపారు
మేడ్చల్ రూరల్: అమెరికాలోని ఫిలడెల్ఫియాలో శుక్రవారం రాత్రి దుండగులు జరిపిన కాల్పుల్లో మేడ్చల్ జిల్లాకు చెందిన అన్షుల్ (28) మృతిచెందారు. ఆయన కుటుంబం గుండ్లపోచంపల్లి డివిజన్లో ఎప్సిలాన్లో ఉంటోంది. శనివారం ఉదయం కుమారుడి మరణవార్త తెలియగానే అన్షుల్ తల్లిదండ్రులు శ్రీనివాస్ గౌడ్, నీలిమ దంపతులు కుప్పకూలిపోయారు. హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేసిన అన్షుల్ ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేశాక కేడబ్ల్యూసీ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తూనే అదనపు సంపాదన కోసం ఖాళీ సమయాల్లో పిజ్జా డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆ విధుల్లో భాగంగా భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఓ అపార్ట్మెంట్లో పిజ్జా డెలివరీ చేసి తిరిగి వెళ్తుండగా మాస్క్ వేసుకున్న ఇద్దరు దుండగులు వెనుక నుంచి అన్షుల్ను కాల్చి చంపారు. అతని తలతోపాటు మరో రెండు చోట్ల తూటా గాయాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన స్థలంలో ఎలాంటి దొంగతనం జరగలేదని.. అన్షుల్ మృతిపై తమకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. ఎవరో కావాలని పిజ్జా డెలివరీ పేరుతో ఇంటి వద్దకు రప్పించి కాల్చి చంపి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. -
ఇరాన్ రాడార్లను ధ్వంసం చేసిన అమెరికా
బ్రిడ్జివాటర్: అమెరికా, ఇరాన్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. తమ రాడార్ స్టేషన్లను అమెరికా ధ్వంసం చేసినందుకు ప్రతీకారంగా కువాయిట్, బహ్రెయిన్లలోని అమెరికా స్థావరాలపైకి క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. అయితే, తమ గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన పలు క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసినట్లు అమెరికా మిలటరీ తెలిపింది. శుక్రవారం రాత్రి కువైట్, బహ్రెయిన్ భూభాగాల్లోకి ప్రవేశించిన ఏడింటికిగాను ఆరు బాలిస్టిక్ మిస్సైళ్లను మధ్యలోనే కూల్చినట్లు తెలిపింది. మరో క్షిపణి దారి తప్పి, లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైందని పేర్కొంది. వీటి కారణంగా అమెరికా బలగాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని తెలిపింది. హార్మూజ్ జలసంధిపైకి ఇరాన్ ప్రయోగించిన నాలుగు డ్రోన్లను అంతకుముందు అమెరికా ఆర్మీ కూల్చివేసింది. ఆ ప్రాంతంలో నౌకల సంచారానికి ముప్పుగా పరిణమించినందునే ధ్వంసం చేసినట్లు అమెరికా తెలిపింది. అదేవిధంగా, మరిన్ని దాడులకు పాల్పడకుండా ఇరాన్ రాడార్ కేంద్రాలను నిరీ్వర్యం చేసినట్లు పేర్కొంది. అదేవిధంగా, తమ గగనతల రక్షణ వ్యవస్థలు ఇరాన్ క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నాయని కువైట్ తెలిపింది. క్షిపణుల దాడిని ముందుగానే పసిగట్టి సైరన్ల ద్వారా తమ పౌరులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించినట్లు బహ్రెయిన్ వివరించింది. కాగా, ఖెష్మ్ దీవి, ఆ సమీపంలోని సిరిక్లో ఏర్పాటు చేసుకున్న నిఘా వ్యవస్థల్ని అమెరికా ధ్వంసం చేసినందుకే తాము కువైట్లోని అమెరికా బలగాలున్న అలీ అల్ సలేమ్ ఎయిర్ బేస్ను, బహ్రెయిన్లోని అమెరికా నేవీ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని, మిస్సైళ్లు ప్రయోగించినట్లు అనంతరం ఇరాన్ ఆర్మీ తెలిపింది. ఇరాన్ హార్మూజ్ను మూసివేయడంతో, బదులుగా ఇరాన్ నౌకాశ్రయాల్లో అమెరికా ఆర్మీ దిగ్బంధనం అమలు చేస్తుండటం తెల్సిందే. ఇలా ఉండగా, అమెరికాలోని విస్కాన్సిన్లో శుక్రవారం అధ్యక్షుడు ట్రంప్ కొందరు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇరాన్తో యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరలో ముగించబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఎరువుల ధరలు నాలుగు నెలల క్రితం స్థాయికి దిగి వస్తాయని వారికి చెప్పారు. అమెరికా వైమానిక దాడుల్లో ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులు చాలామటుకు ధ్వంసం అయినప్పటికీ ఇంకా 22 శాతం వరకు భద్రంగానే ఉన్నట్లు సమాచారముందన్నారు. -
అమెరికాలో తెలుగు యువకుడి హత్య
హైదరాబాద్: అమెరికాలో మరో దారుణం చోటు చేసుకుంది. న్యూయార్క్లో తెలుగు యువకుడ్ని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మేడ్చల్ జిల్లా, గుండ్లపోచంపల్లి నివాసి అయిన అన్షుల్ కుంచ.. జీవనోపాధి వేటలో భాగంగా పిజ్జా డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లి, జీవనోపాధి కోసం పిజ్జా డెలివరీ ఉద్యోగం చేస్తున్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పిజ్జా డెలివరీ చేసే క్రమంలోనే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల బారిన పడ్డ అన్షుల్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రస్తుతం న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, ఇంకా ఈ ఘటనలో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
అమెరికాకు ఆ భయం పట్టుకుందా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మధ్య విభేదాలను తీవ్రస్థాయికి చేరుకున్నాయా? అమెరికా- ఇజ్రాయెల్ మధ్య అసలేం జరుగుతోంది?. ఇరాన్ యుద్ధం.. వాషింగ్టన్- టెల్ అవీవ్ మధ్య చిచ్చురాజేసిందా?.. అంతర్జాతీయ మీడియా కథనాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లిన అమెరికా ప్రతినిధుల బృందం.. అక్కడ గూఢచర్యం భయాలతో బర్నర్ ఫోన్లను ఉపయోగించినట్లు కథనాలు వెలువడ్డాయి.ఇజ్రాయెల్ కౌంటర్ ఇంటెలిజెన్స్ నుంచి ముప్పు నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటగాన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఎన్బీసీ న్యూస్ కథనం ప్రకారం.. మధ్యప్రాచ్యంపై ట్రంప్ యంత్రాంగం తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలు, ఉన్నతాధికారుల కదలికలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయెల్ తన ప్రయత్నాలను ముమ్మరం చేసిందనే ఆందోళనలతో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఓ అంతర్గత నివేదికను విడుదల చేసింది. డీఐఏ విడుదల చేసిన డాక్యుమెంట్లో ఏడు పేజీల నివేదికతో పాటు ఇజ్రాయెల్ గూఢచర్య కార్యకలాపాలను వివరించే ఒక చార్ట్ కూడా ఉంది.ఇజ్రాయెల్కు ఉన్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ , టెక్నికల్ సర్వైలెన్స్(సాంకేతిక నిఘా) సామర్థ్యాలు క్రిటికల్ స్థాయికి చేరుకున్నాయని ఈ నివేదిక తేల్చింది. అమెరికా రక్షణ శాఖలో ఆందోళనలు పెరగడానికి కారణమైన కొన్ని నిర్దిష్ట సంఘటనలను కూడా ఇందులో పేర్కొన్నారు. ఇరాన్, ప్రాంతీయ భద్రతాంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు పెరుగుతున్న సమయంలో.. అమెరికా నిర్ణయాలను ముందే తెలుసుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోందనే అనుమానాలు వాషింగ్టన్లో బలపడుతున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తీవ్రంగా ఖండించింది. అమెరికా అధికారులపై తాము నిఘా పెడుతున్నామనే వార్తలను తోసిపుచ్చింది.ఇజ్రాయెల్ అమెరికా ప్రభుత్వ అధికారులపై గానీ.. అక్కడి సంస్థలపై గానీ ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. మా నిఘా వ్యవస్థలు కేవలం శత్రువులను లక్ష్యంగా చేసుకుంటాయి. మిత్రదేశాలను కాదు. దీనికి విరుద్ధంగా వచ్చే వార్తలన్నీ అవాస్తవాలు, రాజకీయ ప్రేరేపితమైనవిగా ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ప్రతినిధి కొట్టిపారేశారు.మరోవైపు, పెంటగాన్ దీనిపై స్పందించడానికి నిరాకరించగా.. వైట్ హౌస్ అధికారి ఒకరు ఈ ఆరోపణలను ఖండిస్తూ.. ఈ కథనం పూర్తిగా అవాస్తవం, సరైన అవగాహన లేని వ్యక్తుల సమాచారం ఆధారంగా ఈ కథనాలు సృష్టించారన్నారు. గత ఏప్రిల్లో కుదిరిన కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ విషయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మధ్య విభేదాలు వచ్చిన తరుణంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం గమనార్హం.ట్రంప్ టెహ్రాన్తో దౌత్యపరమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మొగ్గు చూపుతుండగా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ ఏ ఒప్పందాన్ని గౌరవించదని.. మరింత కఠినమైన సైనిక చర్యలే సరైనవని వాదిస్తోంది. ఈ విషయమై ఇటీవల ఇద్దరు నేతల మధ్య ఫోన్ సంభాషణలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని.. ఆ తర్వాత ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.అమెరికా అధికారులు అధికారిక పర్యటనల నిమిత్తం ఇజ్రాయెల్ వెళ్లినప్పుడు అదనపు భద్రతా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రస్తుత, మాజీ అధికారులు గుర్తుచేశారు. ఇందులో భాగంగా బర్నర్ ఫోన్లు (తాత్కాలిక ఫోన్లు), తాత్కాలిక కంప్యూటర్లు, కఠినమైన కమ్యూనికేషన్ నిబంధనలను పాటిస్తారు. ఇజ్రాయెల్ పర్యటనల్లో అమెరికా ఇప్పటికే అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది. సమాచారాన్ని దూకుడుగా సేకరించడంలో ఇజ్రాయెల్ దిట్ట అని అందరికీ తెలిసిందేనంటూ ఓ అధికారి వ్యాఖ్యానించారు.అమెరికా, ఇజ్రాయెల్లు దశాబ్దాలుగా ఇంటెలిజెన్స్ రంగంలో సహకరించుకుంటూ అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నప్పటికీ, ఇరాన్ విషయంలో తలెత్తిన విభేదాల సమయంలో ఇజ్రాయెల్ నిఘా పెడుతోందనే అనుమానాలు మిత్ర దేశాల మధ్య నమ్మకాన్ని మరింత దెబ్బతీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
హార్ముజ్ జలసంధిలో యుద్ధం.. పెట్రోల్, డీజిల్ దొరకటం కష్టమేనా?
-
పశ్చిమాసియా ఉద్రిక్తతలు.. ప్రధాని మోదీ కీలక భేటీ
ఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం నిర్వహించారు. భారత్పై యుద్ధ ప్రభావం తగ్గించే చర్యలపై కసరత్తు, ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత పెంపొందించడానికి వివిధ ఆలోచనలు, చర్యలపై చర్చలు జరిపారు.ఆర్థికవృద్ధిని బలోపేతం చేయడంతో పాటు అంతర్జాతీయంగా వచ్చే ఒడుదొడుకులను తట్టుకునే సామర్థం పెంపుదల, వాణిజ్యానికి మరింత అనుకూల వాతావరణాన్ని కల్పించేలా సంస్కరణలను వేగవంతం చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రపంచ ఆర్థిక ఒడిదుడుకుల సమయంలో భారత్ ఆర్థిక వృద్ధిని మరింతగా ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై వివిధ వ్యూహాలను, చర్యలను చర్చించారని వారు పేర్కొన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది.ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. -
అమెరికాలో అక్రమ వలసదారులు.. భారత్ కీలక ప్రకటన
ఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. ఎట్టి పరిస్థితుల్లో వారు దేశంలోకి ఉండనిచ్చేది లేదంటూ ఎన్నో కఠిన నిబంధనలు తీసుకవచ్చి వారిని దేశం నుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలోనేఅమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు భారత్ ప్రకటించింది. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అమెరికా నుంచి దేశ బహిష్కరణకు గురైన వారి వివరాలు ప్రకటించారు. "2026లో ఇప్పటివరకూ 1,076 మంది బహిష్కరణకు గురయ్యారు. అదే గతేడాది మెుత్తంగా 3,567 మంది బహిష్కరణకు గురయ్యారు. గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువగా ఉంది. అయినప్పటికీ ఇది అధికమే" అని జైశ్వాల్ అన్నారు. దేశ బహిష్కరణకు గురైన వారిలో సరైన పత్రాలు లేకపోవడంతో పాటు వీసా ఉల్లంఘనలకు పాల్పడిన వారు ఉన్నారని పేర్కొన్నారు.అక్రమ వలసల విషయమై భారత్, అమెరికా దేశాలు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని అక్రమ వలసలను ఎలా అరికట్టాలి, అదే సమయంలో ఇది చట్టబద్ధమైన వలసలపై ప్రతికూల ప్రభావం చూపకుండా ఎలా చూసుకోవాలి అనే దానిపై ఇరుదేశాలు దృష్టి సారించాయనిపేర్కొన్నారు. కాగా ఈ వారంలోనే భారత్కు చెందిన సుమారు 30 మంది వ్యక్తులు వాణిజ్య ట్రక్కు డ్రైవర్లుగా పనిచేస్తూ అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు గుర్తించారు . వీరిని త్వరలోనే దేశ బహిష్కరణకు గురిచేసే అవకాశం ఉంది. -
గ్రీన్కార్డ్ దరఖాస్తుదారులకు గుడ్న్యూస్
అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు భారీ ఊరట లభించింది. గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలకు అమెరికా ఫెడరల్ కోర్టు చెక్ పెట్టింది. ఆ ఆదేశాలు చెల్లుబాటు కావని తీర్పు ఇచ్చింది. దీంతో స్వదేశంలోనే అమెరికా అధ్యక్షుడికి మరో పరాభవం ఎదురైనట్లయ్యింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది అమల్లోకి తీసుకొచ్చిన పలు వలస విధానాలపై రోడ్ ఐలాండ్లోని ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ట్రంప్ ప్రభుత్వం "జాతీయ భద్రత" పేరుతో 39 దేశాలకు చెందిన విదేశీయుల గ్రీన్కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తుల పరిశీలనను నిలిపివేసింది. అంతేకాకుండా ఆశ్రయం (అసైలమ్) కోసం దరఖాస్తు చేసిన వారి కేసులను కూడా నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయాలను పరిశీలించిన న్యాయమూర్తి జాన్ మెక్కానెల్.. ప్రభుత్వం తనకు లేని అధికారాలను వినియోగించేందుకు ప్రయత్నించిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ ప్రక్రియలు పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు హాజరైన దరఖాస్తుదారులపై ఇలాంటి ఆంక్షలు విధించడం సరికాదని స్పష్టం చేశారు."అమెరికాకు రావాలంటే చట్టాన్ని అనుసరించాలి అని తరచూ చెబుతుంటారు. ఈ కేసులో దరఖాస్తుదారులు అదే చేశారు. అయినప్పటికీ వారికి అన్యాయం జరిగింది. చట్టాన్ని పాటించి అన్ని ప్రక్రియలు పూర్తి చేసిన దరఖాస్తుదారులను ఇలా నిరవధికంగా వేచి ఉండమని చెప్పలేరు" అంటూ కీలక తీర్పు ఇచ్చింది.ఈ వివాదానికి మూలం 2025లో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పులు. ఈ ఘటనలో అరెస్టైన వ్యక్తి అఫ్గానిస్థాన్కు చెందినవాడు కావడంతో ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను కారణంగా చూపుతూ పలు దేశాల పౌరులపై కఠిన ఆంక్షలు అమలు చేసింది. అనంతరం "ట్రావెల్ బ్యాన్" జాబితాను విస్తరించి మొత్తం 39 దేశాలను చేర్చింది. ఈ జాబితాలోని దేశాల పౌరుల గ్రీన్కార్డులు, ఉద్యోగ అనుమతులు, పౌరసత్వ దరఖాస్తులను నిరవధికంగా నిలిపివేయడంతో పాటు ఇప్పటికే ఆమోదించిన కొన్ని కేసులను కూడా మళ్లీ పరిశీలించాలని ఆదేశించింది. ఆశ్రయం కోరిన వారి దరఖాస్తులను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.అయితే కోర్టు తాజాగా ఈ నాలుగు ప్రధాన విధానాలను చట్టవిరుద్ధమని తేల్చింది. వలస ప్రయోజనాలపై నిలిపివేత, ఆశ్రయ దరఖాస్తుల నిలిపివేత, ఇప్పటికే ఆమోదించిన కేసుల పునఃసమీక్ష, ట్రావెల్ బ్యాన్ దేశాలకు చెందిన వారిపై ప్రత్యేక ప్రతికూల దృష్టితో వ్యవహరించే విధానాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు చెందిన వేలాది మంది వలసదారులు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా గ్రీన్కార్డుల కోసం, ఉద్యోగ అనుమతుల కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న వారికి ఇది శుభవార్తగా మారింది.అయితే ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రస్తుతానికి ఈ తీర్పు ట్రంప్ వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా, చట్టబద్ధ వలస మార్గాలను పరిరక్షించే కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. అమెరికాలో వలసలపై జరుగుతున్న రాజకీయ పోరులో ఈ తీర్పు మరో కీలక మలుపుగా మారింది. "జాతీయ భద్రత" పేరుతో విధించిన ఆంక్షలకు కోర్టు అడ్డుకట్ట వేయడంతో.. చట్టబద్ధంగా అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. -
ప్రాణాలతో పోరాడుతుంటే.. సంకెళ్లు వేశారు!
కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న ఓ యువకుడికి సాయం చేయాల్సిన పోలీసులు.. అతడికే సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్లో వైరల్గా మారిన ఈ ఘటన.. ఇప్పుడు అట్లాంటిక్కు ఇరువైపులా రాజకీయ దుమారం రేపుతోంది. బాధితుడిని నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదని, పాశ్చాత్య సమాజాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది డిసెంబర్లో బ్రిటన్లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థిపై సిక్కు కమ్యూనిటీకి చెందిన విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నేలపై కుప్పకూలిన హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతుండగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు తర్వాత తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.దాడి చేసిన విక్రమ్ దిగ్వా తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు తొలి దశలో హెన్రీనే అనుమానితుడిగా భావించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి బేడీలు వేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు, నివేదికలు బ్రిటన్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనంతరం హెన్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. "హెన్రీ నోవాక్ మరణం విషాదకరమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఘటన" అని పేర్కొన్నారు. అతడు చేయని నేరానికి ద్వేష నేరస్థుడిగా ముద్రవేశారని, అధికార యంత్రాంగం అతడిని విఫలమైందని విమర్శించారు. హెన్రీ మరణం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదని, సమాజం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంగా యూరప్లో వలస విధానాలపై కూడా వాన్స్ విమర్శలు గుప్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ విలువలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలకు ముందు అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ కేసుపై స్పందించింది. సిద్ధాంతపరమైన పక్షపాతం, రెండు రకాల పోలీసింగ్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.అయితే అమెరికా వ్యాఖ్యలను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం స్పష్టం చేసింది. విద్వేషాన్ని, విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవి కావని పేర్కొంది. మరోవైపు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు. ఈ విషాదం మరింత ద్వేషానికి, సామాజిక విభజనకు కారణం కాకూడదని విజ్ఞప్తి చేశారు.అయితే ఈ ఘటనపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించగా.. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడి హత్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్రిటన్ పోలీసుల పనితీరు, వలస విధానాలు, సామాజిక ఉద్రిక్తతలపై పెద్ద చర్చకు దారితీసింది. -
పశ్చిమాసియాలో మళ్లీ అలజడి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. హర్ముజ్ జలసంధిలో అమెరికా దళాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ల దాడికి దిగింది. అయితే వాటిని తిప్పి కొట్టడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. అంతటితో ఆగకుండా ఇరాన్కు చెందిన తీర ప్రాంత రాడార్ కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించింది. ఇప్పటికే సున్నితంగా మారిన గల్ఫ్ ప్రాంతంలో తాజా పరిణామాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధి వైపు ఇరాన్ నాలుగు వన్వే అటాక్ డ్రోన్లు ప్రయోగించబడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్కామ్) ప్రకటించింది. తక్షణ ముప్పుగా ప్రకటించుకుని తమ దళాలు వాటిని గగనతలంలోనే కూల్చివేశాయని తెలిపింది. అనంతరం మరిన్ని దాడులను అడ్డుకునేందుకు ఇరాన్లోని గోరుక్ ప్రాంతం, ఖేశ్మ్ ద్వీపంలోని తీర నిఘా రాడార్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు వెల్లడించింది.ఈ ఘటనలతో హర్ముజ్ జలసంధి మళ్లీ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గంలో జరిగే చమురు, సహజ వాయువు ఎగుమతుల్లో గణనీయమైన భాగం ఈ జలసంధి గుండా సాగుతుంది. ఇక్కడ ఎలాంటి సైనిక ఘర్షణ జరిగినా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా పలు చర్యలు చేపడుతోంది. ఇరాన్కు అనుబంధంగా ఉన్న ఓ చమురు ట్యాంకర్ను హిందూ మహాసముద్రంలో అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇరాన్ ఇంధన రంగంపై కొత్త ఆంక్షలను కూడా ప్రకటించింది.మరోవైపు ఇరాన్ మీడియా మాత్రం హర్ముజ్ సమీప జలాల్లో తమ బలగాలు హెచ్చరిక కాల్పులు జరిపినట్లు వెల్లడించింది. అమెరికా నౌకాదళ కదలికలకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని చెబుతున్నప్పటికీ.. తాజా పరిణామాలు మాత్రం భిన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇటీవలే కాల్పుల విరమణ పొడిగింపుపై చర్చలు జరిగినప్పటికీ, తాజా దాడులు ఆ ప్రయత్నాలకు ఎదురుదెబ్బగా మారాయి. ఇదే సమయంలో లెబనాన్లో ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య ఘర్షణలు కూడా మళ్లీ ఉద్ధృతమవుతుండటంతో మొత్తం పశ్చిమాసియా ప్రాంతం అస్థిరత వైపు అడుగులు వేస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.హర్ముజ్ జలసంధి వద్ద ప్రారంభమైన ఈ తాజా ప్రతిష్ఠంభన ఎటు దారి తీస్తుందనేది ఇప్పుడు ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడి పరిస్థితులు కేవలం అమెరికా-ఇరాన్ సంబంధాలకే పరిమితం కావు. ప్రపంచ చమురు ధరలు, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా భద్రతా పరిస్థితులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు ఇరు వర్గాలు చెబుతున్నప్పటికీ, ఒక్క చిన్న పొరపాటు కూడా పెద్ద ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. -
భారత్పై మరోసారి ట్రంప్ అక్కసు...
వాషింగ్టన్, డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కారు. చాలా కాలంగా భారత్, అమెరికాపై అధిక సుంకాలు విధించి భారీగా లాభాలు పొందిందందన్నారు. ఇప్పుడు ఆ పని అమెరికా చేస్తుందన్నారు. ఇటీవల ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.దీర్ఘకాలంగా ఉన్న వాణిజ్య సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా, 2026 ఫిబ్రవరిలో భారత్, అమెరికా దేశాల మధ్య ఒక మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరింది. అనంతరం ఇటీవలే న్యూఢిల్లీలో అమెరికా బృందం పర్యటించింది. భారత ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపింది. రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు దాదాపు ఫైనల్ అయ్యాయని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులు నడుమ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.ట్రంప్ మాట్లాడుతూ" ఇంతకాలం భారత్, అమెరికాపై అధిక పన్నులు విధించి లాభపడింది. ఇప్పుడు అది మావంతు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే ఒక పెద్ద వాణిజ్య ఒప్పందం కుదరవచ్చు. ఎందుకంటే "నాకు మోదీ అంటే చాలా ఇష్టం. మోదీ నాకు చాలా మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది, మేము ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటాము."అని అన్నారు.కాగా బలవంతపు కార్మిక వ్యవస్థను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్న కొన్ని దేశాలపై అదనపు దిగుమతి సుంకాలను (టారిఫ్లను) విధించాలని అమెరికా ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత జాబితాలో భారతదేశం కూడా ఉంది. దీనిని అమలు చేస్తే, అమెరికాలోకి ప్రవేశించే భారతీయ వస్తువులపై అదనంగా 12.5% సుంకం విధించబడవచ్చు. దీనివల్ల అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులు మరింత ఖరీదైనవిగా మారవచ్చు. దీంతో ఎగుమతులు ఎగుమతులు తగ్గే అవకాశం ఉంది. -
సంచలన ప్రకటన! అడవుల్లో, సరస్సుల్లో ఏలియన్స్?
-
సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం
వాషింగ్టన్: ఇమ్మిగ్రేషన్, సరిహద్దు నియంత్రణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రతా బిల్లుకు అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. దాదాపు 70 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్తో బిల్లు రూపకల్పన చేశారు. అయితే, బిల్లుపై డెమొక్రాట్లు,రిపబ్లికన్ల మధ్య తీవ్ర స్థాయిలో పొలిటికల్ డ్రామా నడిచింది. ట్రంప్ వివాదాస్పద నిధులపై ప్రతిపక్షాలు వేసిన సవరణలను వీటో చేస్తూ అధికార రిపబ్లికన్ పార్టీ బిల్లును నెగ్గించుకుంది. సరిహద్దుల్లో నిఘూ పటిష్టం, అక్రమ వలససలను అడ్డుకోవడమే బిల్లు ముఖ్యఉద్దేశమని ట్రంప్ తెలిపారు. -
ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్
ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ హ్యాండీ (81) దారుణ హత్య కలకలం రేపింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్లోని టార్జానాలో ఆయన ప్రేయసి కుమారుడు కత్తితో పొడిచి హత్య చేసినట్లు (జూన్ 4)పోలీసులు ప్రాథమికంగానిర్ధారించారు. టాప్ గన్: మావెరిక్', జుమాంజి వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన హ్యాండీహత్యపై హాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. 911 కాల్ రావడంతో అధికారులు అతని ఇంటికి చేరుకున్నారు. ఛాతీపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న జేమ్స్ హ్యాండీని వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ కేసులో హ్యాండీ ప్రియురాలి కుమారుడు మైఖేల్ గ్లెడ్హిల్ (44) ను అరెస్టు చేశారు. జేమ్స్ హ్యాండీ ప్రేమికురాలిగా భావిస్తున్న మహిళ గురించి ఎటువంటి వివరాలు తెలియవు. ఆయన వృత్తి జీవితం అందరికీ తెలిసినప్పటికీ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఎవరికీ తెలియవు.జేమ్స్ హ్యాండీ కరియర్, నెట్వర్త్ దశాబ్దాల నటనాజీవితంలో 1977 నుండి అనేక సినిమాల్లో నటించారు. అలాగే పలే టెలివిజన్ షోలలో నటించారు. ముఖ్యంగా టాప్ గన్: మావెరిక్ చిత్రంలో 'జిమ్మీ' పాత్ర ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. 2017లో, హ్యూ జాక్మన్ ప్రధాన పాత్రలో నటించిన అమెరికన్ సూపర్ హీరో చిత్రం లోగాన్లో ఆయన నటించారు. జేమ్స్ హ్యాండీ ఆకస్మిక మరణం నేపథ్యంలో ఆయన నెటవర్త్ ఎంత అనేది చర్చనీయాంశంగా మారింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ఉండేది. దాదాపు 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో భారీ ఆస్తులనే కూటబెట్టారు. అప్ టర్న్ బిజినెస్ వారి ఒక నివేదిక ప్రకారం, 2026 నాటికి జేమ్స్ హ్యాండీ నికర ఆస్తి సుమారు 2-3 మిలియన్ డాలర్లు(సుమారు రూ.19-28.8 కోట్లు)గా అంచనా.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్తో రోజుకు రూ. 1500 -
తలొగ్గేదే లేదు.. ట్రంప్ కు హెజ్బొల్లా హెచ్చరిక
-
పాకిస్తాన్కు కొత్త టెన్షన్.. బాంబు పేల్చిన ఇజ్రాయెల్
ఇరాన్–అమెరికా మధ్య కొనసాగుతున్న శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశం పాత్రను ఇజ్రాయెల్ బహిరంగంగా ప్రశ్నిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి."ఇజ్రాయెల్ దృష్టిలో పాకిస్థాన్ విశ్వసనీయ మధ్యవర్తి కాదు. మధ్యవర్తిత్వం చేసే దేశం అన్ని పక్షాల విశ్వాసాన్ని పొందాలి. పాకిస్థాన్ విషయంలో అలాంటి పరిస్థితి లేదు" అంటూ రూవెన్ అజర్ స్పష్టం చేశారు. ఇరాన్కు సంబంధించిన సున్నితమైన అంశాల్లో పాకిస్థాన్ పాత్రపై తమకు సందేహాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.అమెరికా లేదా ఇతర దేశాలు తమ వ్యూహాత్మక అవసరాల కోసం పాకిస్థాన్ను సంప్రదించవచ్చని, అయితే అది ఇజ్రాయెల్ అభిప్రాయాన్ని మార్చదని అజర్ వ్యాఖ్యానించారు. తమకు ప్రధానంగా ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద నిరోధం, అలాగే ఇరాన్ ప్రభావాన్ని నియంత్రించడమే ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.పాకిస్థాన్పై ఎందుకు అనుమానాలు?ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం మధ్యవర్తిగా వ్యవహరించే దేశం తటస్థ వైఖరిని కలిగి ఉండాలి. అయితే పాకిస్థాన్కు ఇప్పటికీ ఇజ్రాయెల్తో అధికారిక దౌత్య సంబంధాలు లేవు. అంతేకాకుండా, గతంలో ఇజ్రాయెల్ విధానాలపై ఇస్లామాబాద్ చేసిన విమర్శలు కూడా ఆ దేశ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని అజర్ సూచించారు. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష చర్చల్లో పాకిస్థాన్ పాత్ర పెరిగిందనే వార్తల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఇస్లామాబాద్ దౌత్య సామర్థ్యంపై మరోసారి చర్చ మొదలైంది.మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ..ఇరాన్ అణు కార్యక్రమం, పశ్చిమాసియాలో పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ప్రాంతీయ మిలిటెంట్ సంస్థల కార్యకలాపాలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశాలుగా మారాయి. ఈ పరిస్థితుల్లో అమెరికా, యూరోపియన్ దేశాలు, గల్ఫ్ దేశాలు ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో పాకిస్థాన్ను మధ్యవర్తిగా అంగీకరించలేమన్న ఇజ్రాయెల్ వ్యాఖ్యలు కొత్త దౌత్య చర్చలకు తెరతీశాయి.భారత్పై ప్రశంసలుఇదే సందర్భంగా భారత్ పాత్రను కూడా రూవెన్ అజర్ ప్రశంసించారు. పశ్చిమాసియాలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్కు కీలక పాత్ర ఉందని, ప్రాంతీయ శాంతి ప్రయత్నాల్లో న్యూఢిల్లీ ప్రభావం గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. భారత్తో ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు.78 ఏళ్లుగా దూరంగానే పాక్–ఇజ్రాయెల్పాకిస్థాన్, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఎప్పటినుంచో సంక్లిష్టంగానే ఉన్నాయి. 1947లో పాకిస్థాన్, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇస్లామాబాద్ ఆ దేశాన్ని అధికారికంగా గుర్తించలేదు. పాలస్తీనా ప్రజల హక్కులకు మద్దతుగా నిలుస్తూ, స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పడే వరకు ఇజ్రాయెల్ను గుర్తించబోమనే వైఖరిని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు జిన్నా కూడా పాలస్తీనా అంశంలో అరబ్ దేశాలకు మద్దతు ప్రకటించారు. అప్పటి నుంచి ఆ విధానం పాకిస్థాన్ విదేశాంగ విధానంలో కీలక భాగంగా కొనసాగుతోంది. అధికారిక సంబంధాలు లేకపోయినా, గతంలో రెండు దేశాల మధ్య పరోక్ష స్థాయిలో సంప్రదింపులు జరిగినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయినప్పటికీ, ఇప్పటికీ రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాలు లేవు. దౌత్య సంబంధాలు కూడా నెలకొనలేదు.ఇక రూవెన్ అజర్ తాజా వ్యాఖ్యలతో పాకిస్థాన్ మధ్యవర్తిత్వ సామర్థ్యం, ఇరాన్ అంశంలో దాని పాత్ర, అలాగే మధ్యప్రాచ్య దౌత్య సమీకరణాలపై కొత్త చర్చ ప్రారంభమైంది. పాకిస్థాన్ నుంచి అధికారిక స్పందన కోసం అంతర్జాతీయ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. -
టేకాఫ్ సమయంలో కుప్పకూలిన విమానం
-
టారిఫ్ల టెన్షన్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-అమెరికా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించారు. ఈ క్రమంలో గతంలో భారత్పై విధించిన సుంకాలను సమర్థించుకున్న ఆయన.. ప్రధాని మోదీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఒకవైపు భారత్పై అదనపు సుంకాల (టారిఫ్లు) కత్తి వేలాడదీస్తూ.. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీని తన "మంచి స్నేహితుడు"గా అభివర్ణిస్తున్నారు ట్రంప్. భారత్–అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన.. గతంలో భారత్ అమెరికాపై భారీ సుంకాలు విధించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు.వైట్హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. భారత్తో వాణిజ్య చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీతో తనకు మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, ఇద్దరి మధ్య సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. "మోదీ నాకు మంచి స్నేహితుడు. ఆయనంటే నాకు చాలా ఇష్టం. మేమిద్దరం బాగా కలిసిపోతాం. అందుకే భారత్తో వాణిజ్య ఒప్పందం కచ్చితంగా కుదురుతుంది" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.అయితే అదే సమయంలో భారత్పై విమర్శలు కూడా గుప్పించారు. చాలా ఏళ్ల పాటు భారత్ అమెరికాను ఉపయోగించుకుందని, అమెరికా ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించిందని ఆరోపించారు. ప్రస్తుతం తన విధానాల వల్ల పరిస్థితి తారుమారైందని, ఇప్పుడు అమెరికానే భారత్తో వాణిజ్యం ద్వారా లాభపడుతోందని చెప్పారు.ఇదిలా ఉండగా, భారత్–అమెరికా మధ్య తాత్కాలిక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై (BTA) చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల అమెరికా ప్రతినిధి బృందం భారత్లో పర్యటించి కేంద్ర వాణిజ్య శాఖ అధికారులతో చర్చలు జరిపింది. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించాయి.అయితే చర్చలు జరుగుతున్న వేళే అమెరికా మరోసారి టారిఫ్ల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బలవంతపు శ్రమ (Forced Labour) ద్వారా తయారైన వస్తువులు దిగుమతి అవుతున్నాయనే ఆరోపణలతో భారత్తో పాటు మరో 53 దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకాలు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాలో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్, ఖతార్, రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.ట్రంప్ మరోసారి హార్లే-డేవిడ్సన్ మోటార్సైకిళ్ల అంశాన్ని ప్రస్తావించారు. గతంలో భారత్ హార్లే-డేవిడ్సన్పై 200 శాతం వరకు సుంకం విధించిందని, అందువల్ల ఆ సంస్థ భారత్లోనే తయారీ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. మరోవైపు భారత ద్విచక్ర వాహనాలకు అమెరికాలో అలాంటి అడ్డంకులు లేవని పేర్కొన్నారు.గతంలో మోదీ-ట్రంప్ మధ్య జరిగిన చర్చల అనంతరం ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తొలి దశకు రూపురేఖలు సిద్ధమయ్యాయి. ఆ ఒప్పందం ప్రకారం భారత్పై విధించిన కొన్ని సుంకాలను తగ్గించేందుకు అమెరికా అంగీకరించింది. అయితే అనంతరం అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై కీలక తీర్పు ఇవ్వడంతో చర్చల దిశలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రస్తుతం ఇరు దేశాలు కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఒప్పందాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల్లో ఉన్నాయి.అదనపు టారిఫ్ల హెచ్చరికల మధ్య కూడా మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం, త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ధీమా వ్యక్తం చేయడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. భారత్–అమెరికా సంబంధాల్లో స్నేహపూర్వక సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ.. టారిఫ్ల వివాదం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.కీలకాంశాలుభారత్తో డీల్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలుభారత్తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదురుతుందని ట్రంప్ ధీమా.మోదీ తనకు మంచి స్నేహితుడని వ్యాఖ్య.గతంలో భారత్ భారీ సుంకాలు విధించిందని విమర్శ.భారత్తో పాటు 53 దేశాలపై 12.5% అదనపు టారిఫ్ల ప్రతిపాదన.టారిఫ్ల వివాదం మధ్యే కొనసాగుతున్న వాణిజ్య చర్చలుత్వరలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం -
జిరాక్స్ మెషిన్
చిన్నారులూ.. జిరాక్స్ మెషిన్ మనందరికీ తెలుసు కదా! స్కూల్ ప్రాజెక్ట్ కోసమో, నోట్స్ కోసమో మనం తరచూ జిరాక్స్ తీయిస్తుంటాం. మరి మీరెపుడైనా ఆలోచించారా? ఈ జిరాక్స్ మెషిన్ ను ఎవరు కనిపెట్టారు? దాని వెనుక ఉన్న కథ ఏమిటి అని? 1930లలో చెస్టర్ కార్ల్సన్ అనే అమెరికాకు చెందిన ఒక లాయర్ ఉండేవాడు. ఆయనకు ఆఫీసులో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే... ఏదైనా పేపర్ కావాలంటే దాన్ని చూసి మళ్లీ చేత్తో రాయడం లేదంటే టైప్ చేయడం. దీనికి చాలా సమయం పట్టేది. ఈ సమస్య పరిష్కారం కోసం ఆయన చాలా ఆలోచించాడు. ఒక పేపర్ను ఉన్నది ఉన్నట్లుగా క్షణాల్లో కాపీ చేసే మెషిన్ ఉంటే ఎంత బాగుంటుంది అని ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు. కార్ల్సన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కావడంతో రకరకాలుగా ప్రయోగాలు చేసి, 1938 అక్టోబర్ 22న ఆయన ప్రపంచంలోనే మొదటి ఫోటోకాపీని విజయవంతంగా తీశాడు. ఈ టెక్నాలజీకి గ్రీకు పదాల ఆధారంగా జిరోగ్రఫీ అని పేరు పెట్టారు. గ్రీకు భాషలో జిరోస్ అంటే ‘పొడి’, గ్రాఫియా అంటే ‘రాత’ అని అర్థం. అంటే సిరా లేకుండా రాసే పద్ధతి అన్నమాట. ఆ తర్వాత కాలక్రమంలో ‘జిరాక్స్’గా మారిపోయింది. మరో విశేçషం ఏమిటంటే మొదట్లో వచ్చిన జిరాక్స్ మిషన్ దాదాపు ఒక పెద్ద ఫ్రిజ్ అంత పరిమాణంలో ఉండేది! -
ఇరాన్ భారీ షాక్.. కువైట్లో హైఅలర్ట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పీక్ స్టేజ్ చేరుకున్నాయి. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ క్రమంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ దాడులు చేసింది. కాగా, ఇరాన్ దాడితో కువైట్లో హైఅలర్ట్ ప్రకటించారు. దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. కాగా, అమెరికా-ఇరాన్ సీజ్ఫైర్ తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. ఇక, ఇరాన్ దాడుల కారణంగా కొన్ని గంటల పాటు విమానాశ్రయాన్ని మూసివేశారు. అనంతరం 4వ టెర్మినల్లో కార్యకలాపాలు ప్రారంభించినట్టు అధికారులు చెప్పారు. అయితే, బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశామని పేర్కొన్నారు. ఇక, ఈ దాడులతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడులు నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి తరలివెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.కువైట్ తీసుకున్న చర్యలుదాడుల నేపథ్యంలో వైమానిక రక్షణ వ్యవస్థలను కువైట్ ప్రభుత్వం పూర్తిగా యాక్టివేట్ చేసింది. ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది. అనుమానాస్పద వస్తువులకు దగ్గరగా వెళ్లవద్దని హెచ్చరించింది. కీలక ప్రాంతాల్లో భద్రతను పెంచింది. ప్రస్తుతం కువైట్ అంతటా హైఅలర్ట్ కొనసాగుతోంది. మరిన్ని దాడులు జరిగే అవకాశంపై భద్రతా సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయి. వైమానిక రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నాయి.اللحظات الأولى للاعتداء الإيراني الغاشم من قبل المسيرات الذي تعرض له مبنى الركاب T1 في مطار الكويت الدولي بتاريخ 3 يونيو 2026 وتسبب بخسائر بالأرواح وإصابات بشرية بليغة وأضرار مادية جسيمةThe first moments following the brutal Iranian drone attack on Terminal 1 (T1) at Kuwait… pic.twitter.com/eTzQoVXB4K— الطيران المدني (@Kuwait_DGCA) June 3, 2026భారతీయులకు ప్రమాదమా?ప్రస్తుతం కువైట్లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. సాధారణ ప్రజలపై ప్రత్యేక దాడులు జరిగినట్లు సమాచారం లేదు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నందున అధికారిక సూచనలను పాటించడం అవసరం. కొన్ని విమాన సర్వీసులు తాత్కాలికంగా ప్రభావితమయ్యాయి. మరోవైపు.. ఇరాన్ జరిపిన దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం బుధవారం ధ్రువీకరించింది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. అలాగే, మృతుని కుటుంబంతో రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. బాధిత కుటుంబానికి, అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాధ్యమైనంత మేరకు అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు కువైట్ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటున్నట్లు పేర్కొంది.ఇదిలా ఉండగా.. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇరాన్ ప్రయోగించిన రెండు క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. కాగా, ఈ ఘటనపై కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇరాన్ డ్రోన్, క్షిపణి దాడిలో విమానాశ్రయ కార్మికులు, ప్రయాణికులతో సహా కనీసం 63 మంది గాయపడ్డారని తెలిపింది.NEW: Video shows full extent of the damage to Terminal 1 at Kuwait International Airport caused by the brutal Iranian drone and missile attacks that struck the facility earlier today.One person was killed and more than 60 injured in Iranian drone strikes on the airport, local… pic.twitter.com/S8UjuZLRis— Breaking Aviation News & Videos (@aviationbrk) June 3, 2026 -
ఇరాన్ ప్రతీకారం
దుబాయ్: పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే, మరోవైపు ఇరాన్ సైన్యం అమెరికాపై ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా మిలటరీ స్థావరాలే లక్ష్యంగా బుధవారం తెల్లవారుజామున పెద్ద ఎత్తున క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. పలు ప్రాంతాల్లో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మృతిచెందాడు. మరికొందరు గాయపడ్డారు. మృతుడు ఏ రాష్ట్రానికి చెందినవాడనే విషయం తెలియరాలేదు. బాధితుడి కుటుంబాన్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని, అవసరమైన సాయం అందిస్తామని కువైట్లోని భారత ఎంబసీ ప్రకటించింది. ఇరాన్ దాడిలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతిన్నట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. కువైట్ ఎయిర్పోర్టుపై దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారతీయుడి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు 10 మంది భారతీయులు మరణించారు. కువైట్కు విమాన సేవలను గురువారం వరకు నిలిపివేస్తునట్లు భారత్లో ఇండిగో విమానయాన సంస్థ ప్రకటించింది. మాటకు కట్టుబడి దాడులు చేశాం.. బహ్రెయిన్లోని పలు ప్రాంతాలు పేలుళ్లతో దద్దరిల్లాయి. ప్రజలను అప్రమత్తం చేయడానికి హెచ్చరిక సైరన్ను మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సమీపంలోని సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని జనానికి సూచించింది. బహ్రెయిన్ గగనతలం గుండా క్షిపణులు దూసుకెళ్తున్నాయని పేర్కొంటూ ఇరాన్కు చెందిన వార్తా సంస్థ ‘ఎక్స్’లో ఒక వీడియోను పోస్టు చేసింది. ఇరాన్కు చెందిన ఖేష్మ్ ఐలాండ్పై ఈ నెల 2న అమెరికా సైన్యం దాడులకు పాల్పడింది. డ్రోన్ కార్యకలాపాలను నిర్దేశించడానికి ఉపయోగించే ఇరాన్ మిలటరీ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో ఇరాన్ టెలికమ్యూనికేషన్ యాంటెన్నా, ఆయిల్ ట్యాంకర్ ధ్వంసమైనట్లు సమాచారం. ఇందుకు ప్రతీకారంగానే ఇరాన్ తాజాగా పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలపై దాడులకు పాల్పడింది. ఏ విధమైన దురాక్రమణకైనా భిన్నమైన, మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని తాము ఇంతకుముందే హెచ్చరించినట్లు ఇరాన్ గుర్తుచేసింది. ఆ మాటకు కట్టుబడి నేడు దాడులు చేశామని తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రాంతీయంగా ఉద్రిక్తతలు మరింత పెచ్చరిల్లే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గల్ఫ్ ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలున్నాయి. కువైట్, బహ్రెయిన్పై దాడుల్లో అమెరికాకు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు. అమెరికా సైన్యం స్పందించలేదు. -
ఆటా సభలకు వైఎస్ జగన్కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్కు వివరించారు. -
‘నేను ఖమేనీని కలవాలనుకుంటున్నా..’
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీని కలవాలని ఉందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న ట్రంప్.. ఇందుకు ఇరాన్ కూడా అంగీకరించిందంటూ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తాను ఇరాన్ సుప్రీం లీడర్ను నేరుగా కలవాలనుకుంటున్నానంటూ ఆయన పేర్కొన్నారు. ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి సంబంధించిన చర్చల్లో ఖమేనీ భాగస్వామి అయ్యారని.. ఇరువురి మధ్య సంబంధాలు చాలా బాగున్నట్లు కనిపిస్తోందంటూ ట్రంప్ తెలిపారు. ఇరాన్ ప్రజలు, నాయకులకు ఆయనపై చాలా గౌరవం ఉందని నేను భావిస్తున్నాను.. అలాగే ఏదో ఒక సమయంలో తాను ఆయనను కలవాలనుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.'పాడ్ ఫోర్స్ వన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పరిణామాలు ఎలా సాగుతాయనే దాన్ని బట్టి.. మేము ఏదో ఒక సమయంలో సమావేశమవుతామని చెప్పారు. ఇరాన్ ఇప్పటికే అణు ఆయుధాన్ని కలిగి ఉండకూడదనే విషయానికి అంగీకరించిందని.. అది చాలా పెద్ద విషయం అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు."మేము వారిని అణు ఆయుధాన్ని కలిగి ఉండనివ్వలేము. వారు అణు ఆయుధాన్ని కలిగి ఉండబోమని ఇప్పటికే అంగీకరించారు. వారు తమ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చల్లో జాప్యం ఉన్నప్పటికీ ఇరాన్తో తమ మంచి సంబంధాల దిశగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు.ఇదిలా ఉండగా.. ట్రంప్ గతంలో మొజ్తబా ఖమేనీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా మాత్రం ఆయనతో నేరుగా చర్చలకు సిద్ధమంటూ సానుకూల ధోరణితో మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. -
కువైట్ ఎయిర్పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దాడులు చేసింది. -
ట్రంప్ కి అమెరికా కోర్ట్ బిగ్ షాక్.. 180 కోట్ల డాలర్ల ఫండ్స్ రద్దు.!
-
భారత్కు మరోసారి అమెరికా సుంకాల షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్మరోసారి భారత్కు షాకిచ్చారు. బలవంతపు కార్మిక విధానానికి (forced labour) నిరోధానికి సరైన చర్యలు తీసుకోలేదనే కారణంతో కనీసం 60 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై కొత్త పన్నులు (tariffs) విధించాలని అమెరికా సిద్దమవుతున్నారు. భారతదేశం, చైనా, యూరోపియన్ యూనియన్, జపాన్లతో సహా 60 దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై 12.5 శాతం వరకు అదనపు టారిఫ్లు (పన్నులు) విధించాలని ప్రతిపాదించింది. ఈ దేశాలు బలవంతపు శ్రమతో (వెట్టిచాకిరీ/forced labour) తయారైన వస్తువులపై నిషేధాన్నివిధించడంలో లేదా వాటిని కఠినంగా అమలు చేయడంలో విఫల మయ్యాయని USTR నిర్ధారించింది. ఫిబ్రవరిలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అనేక సుంకాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన తర్వాత, మరింత శాశ్వతమైన సుంకాలను విధించే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. భారత్, అమెరికాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీలో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న తరుణంలో ఈ చర్య తీసుకోవడం గమనార్హం. ఈ జాబితాలో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే, చైనా, జపాన్, ఇండియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ మరియు స్విట్జర్లాండ్ తదితర దేశాలున్నాయి. ఇందులో కెనడా, మెక్సికో, తైవాన్ , యూకే లపై 10 శాతం సుంకాలు, ఇతర దేశాలపై అదనంగా 12.5 శాతం సుంకం విధించనుంది. దీని ప్రకారం భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional Tariffs) విధించాలని యూఎస్టిఆర్ ప్రతిపాదించింది. ఈ కొత్త సుంకాలు తక్షణమే అమల్లోకి రావు. అవి ప్రజాభిప్రాయ సేకరణ ఉంటనుంది. అలాగే ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకునే ముందు మరిన్ని సంప్రదింపులు, సమీక్షలు జరగనున్నాయి. కానీ, ఒకవేళ ఇవి అమలులోకి వస్తే, సుప్రీంకోర్టు విధించిన సుంకాల పరిమితులను తప్పించుకోవడానికి యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ చర్య వీలు కల్పిస్తుంది.ఇదీ చదవండి: కజిన్ భార్యపై కన్ను : బాలుడ్ని నేలకేసి బాది.. బాబోయ్.. చూడలేం!బలవంతపు కార్మికులతో తయారు చేసిన వస్తువుల దిగుమతిని పరిష్కరించడంలో ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు విఫలమవడం ఆమోదయోగ్యం కాదని USTR జామీసన్ గ్రీర్ ఒక ప్రకటనలో తెలిపారు. దీనివల్ల అమెరికన్ కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమాన పోటీ క్షేత్రంలో పోటీ పడవలసి వస్తుందని ఆయన అన్నారు. ఇలాంటి విఫల విధానాల వల్ల కంపెనీలు తక్కువ ఖర్చుతో వస్తువులను తయారు చేస్తూ, మార్కెట్ పరిస్థితులను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. (అమెరికా చట్టాల తరహాలో భారతదేశంలో ప్రస్తుతం బలవంతపు శ్రమ వస్తువుల దిగుమతిపై ప్రత్యేక నిషేధ చట్టమేదీ లేదు.)అయితే, ప్రతిపాదిత సుంకాలతో పాటు గొడ్డు మాంసం, కాఫీ, కొన్ని రకాల పండ్లు మరియు గింజల వంటి వాటికి వివిధ మినహాయింపులు ఉన్నాయి. ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి లోబడి ఉండే కెనడా మరియు మెక్సికో వస్తువులకు కూడా మినహాయింపు ఉంటుంది. అలాగే కొన్ని వస్త్రాలు, దుస్తులకు కూడా. జూలై 6 లోగా తమ లిఖితపూర్వక అభిప్రాయాలను తెలియజేయాలని ప్రజలను కోరింది. ఇదీ చదవండి: కాళ్లు, చేతులు తీసేస్తే తప్ప : కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యల దుమారం -
భూమిని ఢీకొట్టబోయిన ఉల్క! 300 టన్నుల TNT పేలుడు!
-
ఇరాన్ అమెరికా మధ్య మళ్లీ భీకర యుద్ధం..
-
అమెరికాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. నైటా (న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో బేత్ పేజ్ కమ్యూనిటీ సెంటర్లో ఈ ఉత్సవాలు జరిగాయి.ప్రవాస తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్ఆర్ఐ ప్రముఖులు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, సింగర్ అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. అశోక్ చింతకుంట కొమరం భీమ్ ఏకపాత్రాభినయం అలరించింది. చిన్నారులు అదిరిపోయే ఫ్యాషన్ షోను ప్రదర్శించారు.ప్రజల ఆంకాక్షలకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ మరింత అభివృద్ది జరగాలని, అందుకోసం తమవంతు పాత్రపోషిస్తామని నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల తెలిపారు. నైటా కార్యవర్గం, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహాసంఘం సభ్యులు కుటంబాలతో సహా హాజరై వేడుకలను విజయవంతం చేశారు.(చదవండి: ఐరోపాలో ఘనంగా శ్రీ అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు) -
ఇరాన్–అమెరికా దాడుల తీవ్రత.. ‘గల్ఫ్ విమానాల’కు అంతరాయం
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. యుద్ధ స్థావరాలపై ఇరాన్-అమెరికాలు పరస్పరం దాడులు కొనసాగిస్తున్నాయి. క్షిపణులు, డ్రోన్ దాడులు, ప్రతిదాడుల మధ్య గల్ప్ దేశాల విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.ఇరాన్ కువైట్, బహ్రెయిన్ లక్ష్యంగా క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు వచ్చిన వార్తలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అయితే ఈ దాడులను సమర్థంగా అడ్డుకున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రకటించింది. ప్రయోగించిన అనేక క్షిపణులు లక్ష్యాలను చేరలేక మార్గమధ్యంలో కూలిపోయాయని వివరించింది.ఇదే సమయంలో ప్రతిస్పందన చర్యల్లో భాగంగా అమెరికా ఇరాన్లోని క్వెష్మ్ ద్వీపంలోని ఒక సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఈ చర్యల్లో తమ సిబ్బందికి ఎలాంటి నష్టం జరగలేదని అమెరికా స్పష్టం చేసింది. అయితే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ అమెరికా స్థావరాలపై ప్రతిదాడులు చేసినట్లు ప్రకటించగా, ఆ వాదనలను అమెరికా “పూర్తిగా అసత్యం”గా ఖండించింది.ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో భద్రతా ఆంక్షలు మరింత కఠినమయ్యాయి. బహ్రెయిన్ తన ఆకాశ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేయగా, కువైట్, యూఏఈలలో విమాన రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో విమానాలు ఆలస్యమవడం, మార్గమధ్యంలో నిలిపివేయడం, మార్గాలు మార్చుకోవడం వంటి పరిస్థితులు కనిపించాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అనేక అంతర్జాతీయ విమాన సంస్థలు గల్ఫ్ మార్గాల్లో సర్వీసులను రద్దు చేశాయి. మరికొన్నింటిని వాయిదా వేశాయి. ఏజియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ బాల్టిక్, ఎయిర్ కెనడా, ఎయిర్ ఫ్రాన్స్-KLM, లుఫ్తాన్సా, స్విస్ , ITA ఎయిర్వేస్ వంటి సంస్థలు దుబాయ్, టెల్ అవీవ్, బీరూట్, రియాద్ మార్గాల్లో తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయి.పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉండటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసుల్లో మరిన్ని మార్పులు తప్పవని అధికారులు అంటున్నారు.పర్షియన్ గల్ఫ్లో కీలకమైన హర్ముజ్ జలసంధి పరిసరాల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడంతో చమురు, గ్యాస్ రవాణాపై కూడా ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ శాంతి ప్రయత్నాలు ఈ తాజా ఘటనలతో మరింత సంక్షోభంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. -
రష్యాకు అమెరికా బంపరాఫర్.. భారత్ ఆందోళన?
వాషింగ్టన్: అంతర్జాతీయంగా చమురు సరఫరా వ్యవస్థ మెరుగు కోసం తాత్కాలికంగా రష్యా చమురుపై ఆంక్షలను ఎత్తేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ఈ మేరకు సెనేట్ విదేశీ విధానాల కమిటీ ఎదుట అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం హాజరై ఈ విషయం వెల్లడించారు. అయితే, అమెరికా ప్రకటన భారత్కు ఆందోళన కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. ‘‘రష్యా నుంచి చమురును కొంటే ఆంక్షలు తప్పవంటూ గతంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోతున్నాం. ఇది తాత్కాలికం మాత్రమే. దీనిపై తుది నిర్ణయం అమెరికా ఆర్థికశాఖ తీసుకుంటుంది. రష్యా చమురు ప్రపంచదేశాలు అందుబాటులోకి వస్తే పశ్చిమాసియా చమురు సంక్షోభానికి కొంతైనా పరిష్కారం చూపినవారం అవుతాం’’ అని రూబియో తెలిపారు.అయితే, 2022లో ఉక్రెయిన్, రష్యా యుద్ధం తర్వాత అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాపై భారీ ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా తన చమురును తగ్గింపు ధరలకు అమ్మడం ప్రారంభించింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భారత్ భారీ స్థాయిలో రష్యా చమురును దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టింది. యుద్ధానికి ముందు భారత చమురు దిగుమతుల్లో రష్యా వాటా చాలా తక్కువగా ఉండేది. కానీ గత నాలుగేళ్లలో రష్యా భారతదేశానికి అతిపెద్ద చమురు సరఫరాదారులలో ఒకటిగా మారింది. భారత రిఫైనరీలు తక్కువ ధరకు చమురు కొనుగోలు చేసి, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి.అమెరికా ఆందోళన?అమెరికా అభిప్రాయం ప్రకారం, రష్యా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం రష్యా ప్రభుత్వానికి మరియు యుద్ధ ఖర్చులకు ఉపయోగపడుతోంది. అందువల్ల రష్యా ఆదాయాన్ని తగ్గించేందుకు ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేయాలని అమెరికా కోరుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి రుబియో చేసిన వ్యాఖ్యల ప్రకారం, ప్రస్తుతం అమలులో ఉన్న కొన్ని తాత్కాలిక మినహాయింపులు శాశ్వతం కావు. వీటిని త్వరలో ముగించాలని అమెరికా యోచిస్తోంది.ఈ మినహాయింపులు ఎందుకు?2026లో ఇరాన్ యుద్ధం మరియు హోర్ముజ్ జలసంధి సమస్యల కారణంగా ప్రపంచ చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. చమురు ధరలు మరింత పెరగకుండా ఉండేందుకు అమెరికా తాత్కాలికంగా కొన్ని దేశాలకు రష్యా చమురు కొనుగోలు చేసే అవకాశం ఇచ్చింది. ఈ మినహాయింపులను ఇప్పటికే రెండు సార్లు పొడిగించారు. ప్రస్తుత పొడిగింపు జూన్ 17 వరకు అమల్లో ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.భారత్పై ప్రభావం ఏమిటి?రష్యా చమురు దిగుమతులపై ఒత్తిడి పెరగవచ్చు.రవాణా, బీమా, చెల్లింపుల వ్యవస్థలు క్లిష్టం కావచ్చు.భారత్ ఇతర దేశాల నుంచి ఎక్కువ చమురు కొనాల్సి రావచ్చు.దేశీయ ఇంధన ధరలపై పరోక్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది.భారత్ వైఖరిభారత్ పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారులు ఇటీవల స్పష్టం చేసిన విషయం ఏమిటంటే, అమెరికా మినహాయింపులు ఉన్నా లేకపోయినా భారత్ రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉందని, భవిష్యత్తులో కూడా నిర్ణయం వాణిజ్య ప్రయోజనాలు మరియు ఇంధన భద్రత ఆధారంగానే ఉంటుందని చెప్పారు.మొత్తం మీద ఈ పరిణామం భారత్కు ముఖ్యమైనది. ఎందుకంటే రష్యా చమురు ప్రస్తుతం భారత ఇంధన వ్యూహంలో కీలక భాగంగా ఉంది. అయితే అమెరికా మినహాయింపులు ముగిసినా, భారత్ వెంటనే రష్యా చమురు కొనుగోళ్లను ఆపేస్తుందని చెప్పలేం. తుది ప్రభావం అమెరికా అమలు చేసే ఆంక్షల తీవ్రతపై భారత్ ప్రత్యామ్నాయ సరఫరాలను ఎంత వేగంగా సమకూర్చుకోగలదనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. -
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనుకున్న సమయంలో పరిస్థితి మళ్లీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సాగుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. తాజాగా ఆయన ఈ చర్చలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. మరోవైపు.. కువైట్, బహ్రెయిన్లపై క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు గల్ఫ్ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామాలు మిడిల్ఈస్ట్లో శాంతి ప్రయత్నాల భవిష్యత్తుపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న చర్చలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయా? ముగిశాయా? అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్.. "అవి ముగిసినా నాకు పెద్దగా పట్టదు. ముగిస్తే ముగిశాయి. లేకపోతే లేదు. కానీ అవి చాలా సమయం తీసుకున్నాయి. నిజం చెప్పాలంటే అవి బోరింగ్గా మారాయి" అని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు ట్రంప్ దౌత్యపరమైన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి. యుద్ధాలను ముగించడం, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేవి ఓర్పు, సహనం, నిరంతర చర్చలు కోరే ప్రక్రియలు. కానీ ట్రంప్ స్వభావం మాత్రం తక్షణ ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్తో అణు కార్యక్రమం, భద్రతా అంశాలపై చర్చలు నెలల తరబడి కొనసాగాల్సి ఉండగా, ట్రంప్ ఇప్పటికే విసుగు వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో 2015లో కుదిరిన ఇరాన్ అణు ఒప్పందానికి దాదాపు 20 నెలల చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ట్రంప్ ప్రారంభించిన చర్చలు రెండు నెలలు కూడా పూర్తి కాకముందే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.మళ్లీ పరస్పర దాడులుఇదిలా ఉండగా గల్ఫ్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కువైట్ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేలుళ్ల శబ్దాలకు భయపడవద్దని సూచించింది. అదే సమయంలో బహ్రెయిన్ కూడా సైరన్లు మోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.ఇరాన్కు చెందిన క్వేష్మ్ ద్వీప ప్రాంతంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ కీలక ప్రకటన చేస్తూ, ఇరాన్ నుంచి ప్రాంతీయ దేశాలపై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. అంతేకాకుండా క్వేష్మ్ ద్వీపంలో "స్వీయ రక్షణ చర్యల" కింద దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.అమెరికా ప్రకారం, ఇరాన్ కువైట్పై ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విఫలమయ్యాయి. బహ్రెయిన్పై ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ సంయుక్త వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇరాన్తో చర్చలు మందగించడం, మరోవైపు గల్ఫ్ దేశాలపై దాడుల ముప్పు పెరగడం నేపథ్యంలో ప్రాంతీయ శాంతి ప్రక్రియ మరోసారి అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్ వ్యాఖ్యలు, అమెరికా తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: మోజ్తాబా బతికే ఉన్నారా? అమెరికా ఏమంటోంది..?? -
రూపాయి మరో 17 పైసలు డౌన్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం 17 పైసలు బలహీ నపడి 95.36 వద్ద ముగిసింది. క్రూడాయిల్ ధరలు ఎగసిపడటం, పెద్ద ఎత్తున పెట్టుబడులు సురక్షిత పెట్టుబడి సాధనాల వైపు మళ్లడంతో అమెరికా డాలర్ బలంగా కొనసాగింది.మరోవైపు దేశీయ మా ర్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగింది. ఈ పరిణామాలు భారత కరెన్సీ కోతకు కారణమయ్యాయి. రూపాయి బలహీనపడటం వరుసగా రెండో రోజు ఇది. మరోవైపు మార్కెట్ వర్గాల దృష్టి జూన్ 3–5 తేదీల్లో జరగనున్న ఆర్బీఐ ఎంపీసీ సమావేశంపై కేంద్రీకృతమైంది. -
ఖమేనీ విషయంలో కీలక ప్రకటన
టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశాధినేత ఖమేనీ ప్రాణాలతోనే ఉన్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దేశ వ్యవహారాల్లో మళ్లీ చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు.ఇరాన్ సుప్రీం లీడర్ విషయంలో ఆరోగ్యం విషయంలో తీవ్ర సందిగ్ధత నడుస్తోంది. ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని కోమాలో ఉన్నారని ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కీలక వాఖ్యలు చేశారు. ప్రస్తుతం యూఎస్ సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ముందు మాట్లాడుతూ మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం దేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ వ్యవహారాల్లో మరింత చురుగ్గా నిమగ్నమవుతున్నారని తెలిపారు. ఆ మేరకై ఆయనకు కొన్ని సంకేతాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారు. అదే దాడిలో ఆయన తండ్రి, ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణం, కొడుకు గాయపడటంతో ఇరాన్ నాయకత్వంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవగా, వాటన్నింటికీ తెరదించుతూ మొజ్తాబా ఖమేనీ క్షేమంగా ఉన్నారని అమెరికా ఇప్పుడు స్పష్టం చేసింది. -
అమెరికాలో కాల్పులు.. ఏడుగురి మృతి
అయోవా: అమెరికాలో కాల్పుల కలకలం రేగింది. కుటుంబంలోని వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి కాల్పులు జరపడంతో నిందితుడుతో సహా ఏడుగురు మృతి చెందారు. అయోవాలోని మస్కటీన్ ప్రాంతంలో ఘటన జరిగింది. మస్కటీన్ నగరంలోని రెండు నివాస గృహాలు, ఒక వ్యాపార సముదాయంలో ఈ వరుస హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 12:12 గంట సమయంలో పార్క్ ఎవెన్యూలోని ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకునేసరికి.. ఆ ఇంటో నలుగురు వ్యక్తులు బుల్లెట్ గాయాలతో పడి ఉన్నారు. వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.ఈ కాల్పులకు పాల్పడిన నిందితుడిని మస్కటీన్కు చెందిన 52 ఏళ్ల రయాన్ విల్లిస్ మెక్ఫార్లాండ్గా గుర్తించారు. అయితే పోలీసులు వచ్చేసరికే అతడు అక్కడ నుంచి పరారయ్యాడు. కొద్దిసేపటికే నిందితుడిని బ్రిడ్జి సమీపంలో గుర్తించారు. అప్పటికే అతడు తుపాకీతో తనను తాను కాల్చుకుని తీవ్ర గాయాలతో ఉన్నాడు. పోలీసులు, పారామెడికల్ సిబ్బంది అతడికి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతడు అక్కడికక్కడే మరణించాడు.ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు నిర్థారించారు. మరణించిన వారంతా నిందితుడి కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. అయితే, మృతుల పేర్లను అధికారులు ఇంకా వెల్లడించలేదు. మీడియా నివేదికల ప్రకారం.. నిందితుడికి గతంలో క్రిమినల్ రికార్డు ఉన్నట్లు తెలుస్తోంది. -
నువ్వో పిచ్చోడివి! నేనే గనుక లేకుంటే..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకుంటున్న వేళ.. ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయని.. యుద్ధం ఆగిపోతోందని ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ విషయం బయటకు వచ్చింది. లెబనాన్లో ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లా గ్రూపులపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. నెతన్యాహుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా వార్తా సంస్థ ఆక్సియోస్ కథనం ప్రకారం.. బీరూట్పై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న సమయంలో ట్రంప్, నెతన్యాహుతో అత్యంత ఉద్రిక్తంగా మాట్లాడారు. “నువ్వు పిచ్చివాడివి.. నేను లేకపోతే జైలులో ఉండేవాడివి. ఇప్పుడు అందరూ నిన్ను, ఇజ్రాయెల్ను ద్వేషిస్తున్నారు” అంటూ ట్రంప్ మండిపడ్డారని అమెరికా అధికారులు వెల్లడించినట్లు కథనం పేర్కొంది. ఇజ్రాయెల్ చర్యలు కేవలం లెబనాన్కే పరిమితం కాకుండా.. అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.బీరూట్పై దాడి నిలిపివేయించానన్న ట్రంప్ఫోన్ కాల్ అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో స్పందించారు. నెతన్యాహుతో “అత్యంత ఫలప్రదమైన” చర్చ జరిగిందని పేర్కొంటూ.. బీరూట్ వైపు వెళ్తున్న ఇజ్రాయెల్ దళాలను వెనక్కి తిప్పినట్లు చెప్పారు. అంతేకాదు.. హెజ్బొల్లా ప్రతినిధులతో కూడా చర్చలు జరిపినట్లు వెల్లడించారు. ఇజ్రాయెల్ దాడులు చేయకపోతే తాము కూడా కాల్పులు ఆపేందుకు హెజ్బొల్లా అంగీకరించిందని ట్రంప్ పేర్కొన్నారు. “ఇరు పక్షాలు కాల్పులు నిలిపేస్తాయి. ఇది శాశ్వతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను” అంటూ “ETERNITY” అనే పదాన్ని పెద్ద అక్షరాలతో పోస్ట్ చేశారు.నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గలేదుఅయితే ట్రంప్ ప్రకటనల తర్వాత నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు మరోసారి సందేహాలకు తావిచ్చాయి. హెజ్బొల్లా తమ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగిస్తే బీరూట్లోని లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు తప్పవని ఆయన స్పష్టం చేశారు. “హెజ్బొల్లా ఆగకపోతే మేము కూడా ఆగం” అని నెతన్యాహు ప్రకటించారు. దీంతో ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణపై ప్రశ్నలు తలెత్తాయి.యుద్ధం తాజా పరిస్థితిఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త చర్యలతో ఇరాన్పై సైనిక ఒత్తిడి ప్రారంభమైన తర్వాత ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్కు మద్దతుగా ఉన్న హెజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో దాడులు చేస్తుండగా.. ప్రతిగా ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్లో వైమానిక, భూదళాల ఆపరేషన్లు కొనసాగిస్తోంది. ఇటీవల బీరూట్ శివార్లలోని హెజ్బొల్లా స్థావరాలు కూడా ఇజ్రాయెల్ లక్ష్యాలుగా మారాయి. ఈ పరిణామాలు పూర్తి స్థాయి ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తాయన్న ఆందోళన పెరుగుతోంది.ఇరాన్ చర్చలకు బ్రేక్?లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు విస్తరించడంతో అమెరికాతో జరుగుతున్న చర్చలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. తమ మిత్రదేశమైన హెజ్బొల్లాపై దాడులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సాధ్యం కాదని టెహ్రాన్ అభిప్రాయపడుతోంది. అయితే ట్రంప్ మాత్రం మరోవైపు భిన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇరాన్తో చర్చలు వేగంగా కొనసాగుతున్నాయని ఒక ప్రకటనలో చెబుతూనే.. మరో ఇంటర్వ్యూలో “ఆ చర్చలు బోరింగ్గా మారాయి. అవి విఫలమైనా నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు” అని వ్యాఖ్యానించారు. ఇంకా “కొంతకాలం మౌనం పాటిస్తే మంచిది” అని కూడా అన్నారు.వాషింగ్టన్-టెల్అవీవ్ మధ్య విభేదాలా?ఇప్పటివరకు ఇరాన్ విషయంలో ఒకే వేదికపై కనిపించిన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు వ్యూహాత్మకంగా భిన్న దిశల్లో కదులుతున్నాయా అనే చర్చ మొదలైంది. ట్రంప్ యుద్ధాన్ని పరిమితం చేసి చర్చల ద్వారా పరిష్కారం కోరుతుండగా.. నెతన్యాహు మాత్రం హెజ్బొల్లాపై సైనిక ఒత్తిడి కొనసాగించాలనే వైఖరితో కనిపిస్తున్నారు.మిడిల్ఈస్ట్ సంక్షోభం ఎటు?ఒకవైపు కాల్పుల విరమణ ప్రకటనలు.. మరోవైపు బీరూట్పై దాడుల హెచ్చరికలు.. ట్రంప్-నెతన్యాహు మధ్య బహిర్గతమైన విభేదాలు.. ఇరాన్ చర్చల అనిశ్చితి.. ఈ పరిణామాలన్నీ మధ్యప్రాచ్యాన్ని మరో కీలక మలుపు వద్ద నిలబెట్టాయి. ట్రంప్ ఆశిస్తున్నట్లుగా ఈ శాంతి “శాశ్వతం” అవుతుందా? లేక మరో భారీ ఘర్షణకు నాంది పలుకుతుందా? అనేది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. -
మళ్లీ బాంబుల వాన
దుబాయ్/వాషింగ్టన్: ఓవైపు పశ్చిమాసియాలో శాశ్వత శాంతిస్థాపనకు దౌత్యమార్గంలో చర్చలు జరుగుతుంటే మరోవైపు ఇరాన్, అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియాలో బాంబులమోత మోగించాయి. గత వారం తమ అత్యాధునిక ఎంక్యూ–1 డ్రోన్ను ఇరాన్ క్షిపణులు కూల్చేసినందుకు ప్రతీకారంగా సోమవారం ఇరాన్కు చెందిన రాడార్ వ్యవస్థలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. డ్రోన్లను ప్రయోగించే ప్రయోగకేంద్రాలనూ అమెరికా లక్ష్యంగా చేసుకుంది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిదాడులతో ప్రతీకారంతీర్చుకుంది. అమెరికా వైమానిక స్థావరాలకు నిలయమైన కువైట్పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. డ్రోన్లతో తెగబడింది. వీటిలో దాదాపు అన్నింటినీ కూల్చేశామని కువైట్ పేర్కొంది. ‘‘అంతర్జాతీయ జలాలపై నిఘా, పర్యవేక్షణ విధుల్లో ఉన్న తమ యూఎస్ ఎంక్యూ–1 డ్రోన్ను ఇరాన్ జలసమాధి చేసింది. అందుకే వాళ్ల రాడార్లను మేం నాశనంచేశాం. డ్రోన్ లాంఛింగ్ సైట్లను బూడిదచేశాం. గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, హార్మూజ్ జలసంధి గుండా మా రక్షణలో వెళ్తున్న వాణిజ్య నౌకలపై దాడికి బయల్దేరినా డ్రోన్లనూ నేలకూల్చాం. ప్రతిగా ఇరాన్ మొదలెట్టిన దాడుల్లో మా బలగాలకు, మా సైనిక సంపత్తికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు’’అని అమెరికా సైనిక సెంట్రల్ కమాండ్ సోమవారం ప్రకటించింది. ఆదివారం గెరూక్, ఖేష్మ్ ద్వీపం మీదా దాడులు చేశామని అమెరికా మిలటరీ పేర్కొంది. అయితే టెలికమ్యూనికేషన్ టవర్ మీద సైతం అమెరికా దాడిచేసిందని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) వెల్లడించింది. దౌత్యం జరుపుతూ దాడులు చేయడంపై ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేల్ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘‘మొదట్నుంచీ అమెరికా మమ్మల్ని నమ్మట్లేదు. చర్చలు సైతం అపనమ్మకంతో కొనసాగుతున్నాయి. అవిశ్వాస వాతావరణంలో దౌత్యం ఏనాటికీ కొలిక్కిరాదు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఇరాన్ చక్క టి ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా మాటిమాటికి బాంబులేయడం మానేసి ఓపికపడితే కుదురుకుంటుంది’’అని ఆయన అన్నారు. భద్రంగా హార్మూజ్ను దాటిన 70 నౌకలు అమెరికా బలగాల రక్షణంలో గత వారం రోజుల వ్యవధిలో ఏకంగా 70 వాణిజ్య నౌకలు హార్మూజ్ జలసంధి గుండా పయనించాయని అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం వెల్లడించింది. పర్షియన్ గల్ఫ్ జలాలకు అటువైపు, ఇటువైపు ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించగలిగాయని అమెరికా అధికారులు వెల్లడించారని సోమవారం న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ముందుజాగ్రత్తగా నౌకలన్నీ తమ లొకేషన్ను చూపించే ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేశాయని వెల్లడించింది.అమెరికాతో చర్చలనునిలిపేసిన ఇరాన్! లెబనాన్పై ఇజ్రాయెల్ ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తుండటంపై నిరసనగా అమెరికాతో దౌత్యచర్చలను నిలిపేస్తున్నట్లు ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. గతంలో నిర్ణయించుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులుచేస్తోందని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘దాడులకు నిరసనగా ఇకపై మధ్యవర్తులతో తమ దౌత్య ప్రతినిధులు చర్చలు జరపబోరు. తక్షణం లెబనాన్పై కాల్పులు, దురాక్రమణను ఇజ్రాయెల్ నిలిపేయాలి. బీరుట్ ఆక్రమణ ప్రయత్నాలను ఇజ్రాయెల్ విరమించుకోవాలి. ఇప్పటికే ఆక్రమించుకున్న సరిహద్దు ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్)బలగాలు వెనుతిరగాలి. ఈ దిశగా ఇజ్రాయెల్ తీసుకునే చర్చలతో మేం సంతృప్తి చెందేదాకా మధ్యవర్తులతో చర్చలపై ప్రతిష్టంభన ఇలాగే కొనసాగుతుంది. అప్పటిదాకా చర్చలకు వెళ్లే ప్రసక్తేలేదు’’అని ఇరాన్ ఒక ప్రకటనలో పేర్కొందని ఇరాన్లోని మీడియాలో కథనాలొచ్చాయి. బీరుట్ సమీప దహియే జిల్లాపై దాడులను ముమ్మరంచేయాలని సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
ట్రంప్ పన్నుల ఎఫెక్ట్.. అమెరికాతో కీలక ఒప్పందం
ఢిల్లీ: భారత్, అమెరికా దేశాలు తమ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం మొదటి విడతకు సంబంధించిన అంశాలు దాదాపు ఖరారయ్యాయన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం చర్చలు కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులు, కామాలు, ఫుల్స్టాప్ల పైనే జరుగుతున్నాయని పేర్కొన్నారు.అమెరికా విధించే కొత్త సుంకాల విషయంలో భారతదేశం తన ప్రత్యర్థి దేశాల కంటే ఎక్కువ ప్రయోజనం పొందేలా చూసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో పాటు, ప్రస్తుతం భారత్ ఎదుర్కొంటున్న రెండు దర్యాప్తులకు (సెక్షన్ 301 కింద) సంబంధించిన సవాళ్ల అంశం సైతం చర్చించనున్నారు. ఈ కొత్త ఒప్పందం ద్వారా 140 బిలియన్ డాలర్ల విలువైన భారత్-అమెరికా వాణిజ్య బంధం ఒక కొత్త ముసాయిదా వైపు అడుగులు వేయనుంది.ఈ అంశంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. "దాదాపు ప్రతిదీ ఖరారైంది. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ చెప్పినట్లుగా 99శాతం అంశాలు ఖరారయ్యాయి. ఇప్పుడు చిన్నచిన్న విషయాలు, కామాలు, ఫుల్స్టాప్లపైనే చర్చలు జరుగుతున్నాయి. తుది ఒప్పందాన్ని ఖరారు చేసేటప్పుడు, అమెరికాలో జరిగిన చట్టపరమైన మార్పులను ఇందులో ఎలా ప్రతిబింబించాలి దానికి అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది." అని అన్నారు.ట్రంప్ ప్రభుత్వం అత్యవసర నిబంధనలను ఉపయోగించి గతంలో విధించిన "పరస్పర సుంకాల" ను అమెరికా సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని కొట్టివేసింది. ఈ నేపథ్యంలో, కొత్త సుంకాల యంత్రాంగంపై స్పష్టత వచ్చిన తర్వాత అమెరికా వాణిజ్య ప్రతినిధి జామీసన్ గ్రీర్ భారత్లో పర్యటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఒప్పంద పత్రాన్ని సిద్ధంగా ఉంచి, కొత్త సుంకాలు ఖరారైన వెంటనే రేట్లను ఖరారు చేయాలనేది ఇరుదేశాల వ్యూహంగా కనిపిస్తోంది. అమెరికా వాణిజ్య చర్చల బృందం ఈ రోజు మంగళవారం నుండి ఢిల్లీలో ప్రారంభం కానున్న మూడు రోజుల చర్చల కోసం ఇదివరకే రాజధానికి చేరుకుంది. -
ఇరాన్ కీలక నిర్ణయం.. కథ మళ్లీ మెుదటికే?
టెహ్రాన్: ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో శాంతి చర్చలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని వాటిని ఆపే వరకూ ఎట్టి పరిస్థితుల్లో చర్చలు లేవని తేల్చి చెప్పింది. ఇరాన్ వార్తా సంస్థ తస్నిమ్ ఈ కథనాలను ప్రచురితం చేసింది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న నానుడి ఇప్పుడు ఇరాన్- అమెరికా యుద్దంలో సరిగ్గా సరిపోతుంది. శాంతి చర్చలు ప్రారంభమై దాదాపుగా రెండు నెలలు గడుస్తోన్నా చర్చలలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. ఓసారేమో అమెరికా మెుండి చేయడం.. మరోసారేమో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం ఇదే పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా మరోసారి శాంతి చర్చలను వాయిదా వేస్తోన్నట్లు ఇరాన్ ప్రకటించింది.గాజా,లెబనాన్లలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని, అలాగే లెబనీస్ భూభాగం నుండి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. ఈ అంశాలపై తమ డిమాండ్లు, తమ మిత్రదేశాల డిమాండ్లు నెరవేరే వరకు చర్చలు పునఃప్రారంభం కావని తెలిపింది. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు ఆగిపోయే వరకు మధ్యవర్తుల ద్వారా అమెరికాతో చర్చలు జరగవని టెహ్రాన్ స్పష్టం చేసింది.కాగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ లెబనాన్లోని 900 ఏళ్ల పురాతన బ్యూఫోర్ట్ కోటను, దాని చుట్టుపక్కల కొండలను ఇజ్రాయెల్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత 26 ఏళ్లలో లెబనాన్లోకి ఇజ్రాయెల్ చొరబడటం ఇదే అతిపెద్దది. కాగా లెబనాన్పై ఇప్పటివరకూ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 3,433 మంది ప్రాణాలు కోల్పోయారు. -
అమెరికాలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
వాషింగ్టన్, డీసీ: అమెరికా కాలిఫోర్నియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో వనభోజనాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.జూన్ 2 రేపు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను క్యూపర్టినో నగరంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) ఆధ్వర్యంలో వార్షిక వనభోజనాలు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు, సేవా భావం ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రవాస కుటుంబాలు, కమ్యూనిటీ నాయకులు, స్వచ్ఛంద సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ వేడుకలో తెలంగాణ వంటాకాలైన సకినాలు సర్వపిండి , ఇరానీ చాయ్ వేడివేడి సమోసాలు ఇతర హైదరాబాదీ వంటకాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించిన టీసీఏ సౌత్ బే లీడర్షిప్ బృందం అంజనేయులు, గోపికృష్ణ, శ్రీధర్ వాలంటీర్లకు మేనేజ్మెంట్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ఇతర దేశంలోనూ ఘనంగా నిర్వహిస్తున్న.. 22 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలంగాణ సాంస్కృతిక సంఘం (TCA) చేస్తున్న కృషిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. -
ఆమె తిరిగి వచ్చేస్తోంది.. జాగ్రత్త!
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ టెన్నిస్ కోర్టులోకి రీఎంట్రీ ఇవ్వనుంది. 23 గ్రాండ్స్లామ్ టోర్నీలతో మహిళల సింగిల్స్లో మకుటం లేని మహారాణిగా వెలుగొందిన సెరెనా విలియమ్స్ టెన్నిస్కు దూరమై నాలుగేళ్లు కావొస్తోంది. ఈ నేపథ్యంలో 44 ఏళ్ల వయసులో సెరెనా ఈ నెలలో జరగనున్న క్వీన్స్ క్లబ్ టోర్నీ ద్వారా టెన్నిస్ రాకెట్ పట్టనుంది. అయితే సెరెనా ఈ టోర్నీలో సింగిల్స్లో కాకుండా డబుల్స్లో బరిలోకి దిగుతోంది. 2022 యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో మూడో రౌండ్లో ఓటమి తర్వాత సెరెనా మళ్లీ టెన్నిస్ ఆడలేదు. తాను టెన్నిస్లోకి రీఎంట్రీ ఇస్తున్న విషయాన్ని అమెరికా నల్లకలువ స్వయంగా పంచుకుంది. ‘ట్రావెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అని క్యాప్షన్ జత చేసింది. దీనితో పాటు సెరెనా తెలుపు రంగు నైక్ టెన్నిస్ డ్రెస్తో పాటు మొబైల్ ఫోన్ను ఫొటోలో పంచుకుంది. అయితే ఫ్రొఫెషనల్ టెన్నిస్లోకి మాత్రం రావడం లేదని, కేవలం వైల్డ్కార్డ్గా క్వీన్స్క్లబ్ టోర్నీలో కెనడాకు చెందిన విక్టోరియా బోకోతో కలిసి డబుల్స్ మ్యాచ్ ఆడబోతున్నా అంటూ అసలు విషయాన్ని మెళ్లిగా చెప్పింది. దీంతో ప్రొఫెషనల్ టెన్నిస్లోకి సెరెనా రీఎంట్రీ ఇస్తుందంటూ తెగ సంబరపడిపోయిన అభిమానుల ఆశలు ఆవిరైపోయాయి. 2022లో యూఎస్ ఓపెన్ లో ఓటమి అనంతరం ఆటకు దూరంగా ఉన్న సెరెనా విలియమ్స్ ‘రిటైర్మెంట్’ అనే పదం వాడలేనని, దానికి బదులుగా టెన్నిస్ నుంచి ‘అదృశ్యం’ అవుతున్నానంటూ పరోక్షంగా వీడ్కోలు పలికింది. ఓపెన్ శకంలో మహిళల సింగిల్స్లో అత్యధిక గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో క్రీడాకారిణిగా సెరెనా విలియమ్స్ (23 టైటిల్స్) నిలిచింది. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్ట్ (24 గ్రాండ్స్లామ్) టైటిల్స్తో కొనసాగుతుంది. సెరెనా సాధించిన 23 గ్రాండ్స్లామ్ టైటిల్స్లో ఏడు ఆస్ట్రేలియన్ ఓపెన్, మూడు ఫ్రెంచ్ ఓపెన్, ఏడు వింబుల్డన్, ఆరు యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి. View this post on Instagram A post shared by ESPN (@espn)చదవండి: కోహ్లీకి ఏడుపొక్కటే తక్కువ.. ఆ కవర్లో ఏముంది? -
చైనాకు నిద్రపట్టనివ్వని తైవాన్.. అందుకే అమెరికాతో ఇలా..
సుంకాలు కాదు, పశ్చిమాసియా యుద్ధం కాదు.. అమెరికాతో సంబంధాల్లో తైవాన్ ‘అత్యంత ముఖ్యమైన అంశం’ అని చైనా ఎందుకు చెబుతోంది? ప్రత్యేకించి అమెరికాతో సంబంధాల్లో తైవాన్కు చైనా ఇంత ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమేంటి? తైవాన్పై సైనిక చర్యకు అవకాశం ఉందని సూచించేలా చేస్తున్న ఇలాంటి ప్రకటనలు ఏమి చెబుతున్నాయి?తైవాన్ ప్రాదేశిక జలాల చుట్టూ చాలా కాలంగా చైనా యుద్ధ విమానాలు, నౌకలు సంచరిస్తూ కలకలం రేపుతున్నాయి. అవి తమ ఉత్తర, మధ్య, నైరుతి, తూర్పు భాగాల ఏడీఐజెడ్ (ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్)లోకి ప్రవేశించాయని రెండు రోజుల క్రితం కూడా తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. బీజింగ్లో ఇటీవలే ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సమావేశమయ్యారు. ఇందులో వాణిజ్యం, పశ్చిమాసియా యుద్ధం కంటే.. తైవాన్ అంశానికే చైనా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ప్రకటనలో.. “అమెరికా-చైనా సంబంధాల్లో తైవాన్ అత్యంత ముఖ్యమైన అంశమని షీ జిన్పింగ్ చెప్పారు. దీనిని సరిగ్గా నిర్వహిస్తే ద్వైపాక్షిక సంబంధాలు స్థిరంగా ఉంటాయి. లేకపోతే ఇరు దేశాల మధ్య ఘర్షణలు, చివరకు సంఘర్షణలు కూడా తలెత్తవచ్చు. తైవాన్ స్వాతంత్ర్యం, జలసంధి, ఇరుప్రాంతాల శాంతి అనేవి అగ్ని, నీటిలా కలిసిరాని అంశాలు. తైవాన్ జలసంధిలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటం అమెరికా, చైనా మధ్య ఉన్న అతిపెద్ద ఉమ్మడి అంశం. తైవాన్ విషయంలో అమెరికా అత్యంత జాగ్రత్త వహించాలి” అని తెలిపింది.తైవాన్పై చైనా హక్కుల వాదనతైవాన్ అనేది ఆగ్నేయ చైనా తీరానికి సుమారు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపం. ఇది తైవాన్ జలసంధి ద్వారా చైనా నుంచి వేరుపడింది. ఇది చైనా చివరి సామ్రాజ్య వంశం క్వింగ్ పాలనలో ఉండేది. అయితే, 1895లో జపాన్ అధీనంలోకి వెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధంలో (1939-45) జపాన్ ఓటమి తర్వాత రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్వోసీ) తైవాన్పై నియంత్రణ సాధించింది.ఆ సమయంలో జాతీయవాద పార్టీ నాయకుడు చియాంగ్ కై-షెక్ దేశానికి నాయకత్వం వహించారు. అయితే మావో జెడాంగ్ నేతృత్వంలోని కమ్యూనిస్టులు ఆయన పాలనను సవాలు చేశారు.రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రారంభమైన అంతర్యుద్ధం, జపాన్పై పోరాటం కారణంగా తాత్కాలికంగా ఆగింది. అనంతరం కమ్యూనిస్టులు విజయం సాధించి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్సీ)ను స్థాపించారు.చియాంగ్, ఆయన మద్దతుదారులు తైవాన్కు వెళ్లి ఆర్వోసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. పీఆర్సీ, ఆర్వోసీ రెండూ భూభాగం, ద్వీపం కలిసిన ఏకైక చైనా తమదేనని ప్రకటించాయి. అయితే దానిపై తమ నియంత్రణ ఉండాలని కోరుకున్నాయి.సోవియట్ యూనియన్ పీఆర్సీకి మద్దతు సోవియట్ యూనియన్ పీఆర్సీకి మద్దతు ఇచ్చింది. అమెరికా ఆర్వోసీకి మద్దతు ఇచ్చింది. ముఖ్యంగా ఆసియాలో కమ్యూనిజం వ్యాప్తిపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కాలక్రమేణా పరిస్థితి పూర్తిగా మారింది. 1960 దశకం ప్రారంభంలో సోవియట్ యూనియన్, చైనా మధ్య విభేదాలు వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా చైనా మిత్రదేశంగా ఉపయోగపడుతుందని అమెరికా భావించింది.మరోవైపు, 1969లో అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి రెండు రోజుల్లోనే అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఒక నోట్లో ఇలా రాశారు. “800 మిలియన్ల మంది చైనా కమ్యూనిస్టులు ఒంటరిగా జీవించాలని మేము కోరుకోవడం లేదు. మాకు వారితో సత్సంబంధాలు కావాలి. అంతర్జాతీయ సమాజంలో భాగస్వామిగా, పసిఫిక్ సమాజంలో సభ్యదేశంగా చైనా ఉండాలని కోరుకుంటున్నాం” అన్నారు.మాజీ విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసింజర్ రహస్య సమావేశాలు నిర్వహించడం, పాకిస్థాన్, రొమేనియా ప్రభుత్వాల సహకారం లభించడం వల్ల 1979లో అమెరికా, చైనా దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాయి. చైనాకు కొత్త నాయకుడు డెంగ్ షియావోపింగ్ ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించడం, స్వేచ్ఛాయుత విధానాలు అమలు చేయాలని నిర్ణయించుకుంది. అందులో అమెరికా సహకారం కీలకమైంది.అతిపెద్ద సవాలు తైవానే.. అయితే తైవాన్ మొదటి నుంచే ప్రధాన వివాదాస్పద అంశంగా నిలిచింది. అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఓ సారి స్పందిస్తూ.. “మొత్తం చర్చల కాలంలో మాకు ఎదురైన అతిపెద్ద సవాలు తైవానే. చైనాకు తైవాన్ అంశం అంతర్గత వ్యవహారమని మేము గుర్తించాము. అయినప్పటికీ అమెరికా ప్రజలకు తైవాన్ ప్రజలతో సుదీర్ఘ, సన్నిహిత, స్నేహపూర్వక అనుబంధం ఉంది. అది ప్రభుత్వేతర మార్గాల ద్వారా కొనసాగడం ముఖ్యం” అన్నారు. 1979లో ప్రచురితమైన ది వైట్ హౌస్ ఇయర్స్ గ్రంథంలో కిసింజర్ ఇలా రాశారు. “మేము ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. తైవాన్లోని 17 మిలియన్ల మంది ముఖ్యమా, లేక భూభాగంలోని 800 మిలియన్ల మంది ముఖ్యమా అన్నది నిర్ణయించాల్సి వచ్చింది” అని పేర్కొన్నారు. అప్పటి నుంచి అమెరికా “వన్ చైనా” విధానాన్ని కొనసాగిస్తోంది.వన్ చైనా విధానంచైనా ఒక్కటే దేశమని, తైవాన్ దానిలో భాగమని గుర్తించే అమెరికా విధానం ఇది. అదే సమయంలో తైవాన్తో అనధికారిక సంబంధాలు కొనసాగిస్తోంది. దీనిని వ్యూహాత్మక అస్పష్టతగా పిలుస్తారు. ప్రత్యేకించి అమెరికా నుంచి తైవాన్కు ఆయుధాల విక్రయం చైనాకు అభ్యంతరకర అంశంగా మారింది.బీజింగ్ ఎప్పుడూ తైవాన్ను స్వతంత్ర రాజకీయ వ్యవస్థగా గుర్తించలేదు. మరోవైపు, తైవాన్ తాము కమ్యూనిస్టు చైనాలో ఎప్పుడూ భాగం కాలేదని చెబుతోంది. చైనా చారిత్రక హక్కుల వాదనను సవాలు చేస్తోంది. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, చైనా-తైవాన్ మధ్య ఆర్థిక సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. తైవాన్కు చెందిన అనేక మంది చైనాలో పని చేస్తున్నారు. చైనా పెట్టుబడులు కూడా తైవాన్లో ఉన్నాయి. 2012 నుంచి అధికారంలో ఉన్న షీ జిన్పింగ్.. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హాంకాంగ్, షింజియాంగ్, టిబెట్ వంటి ప్రాంతాలపై నియంత్రణ సాధించడాన్ని “జాతీయ పునరుజ్జీవనం” లక్ష్యంలో భాగంగా చిత్రీకరించారు. జాతీయ పునరుజ్జీవనం అంటే చైనా గత వైభవాన్ని తిరిగి సాధించాలనే రాజకీయ లక్ష్యం. ఇందులో తైవాన్ను స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యం వల్ల చైనాకు నిద్రపట్టట్లేదు. ఎందుకంటే యుద్ధం మొదలైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. యుద్ధం చేయకుండా తైవాన్ను చైనా స్వాధీనం చేసుకోలేదు.ఆధునిక చరిత్రలో పాశ్చాత్య శక్తులు, జపాన్ చేతిలో చైనా ఎదుర్కొన్న అవమానాలను బీజింగ్ తరచుగా ప్రస్తావిస్తోంది. సైన్యాన్ని బలోపేతం చేయడం, జాతీయ ఐక్యతను పెంపొందించడం, కమ్యూనిస్టు పార్టీ పట్ల విధేయత పెంచడం అవసరమని చెబుతోంది. మరోవైపు, 2016 నుంచి తైవాన్లో డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ ఎన్నికల్లో విజయాలు సాధిస్తోంది.ప్రస్తుత అధ్యక్షుడు లై చింగ్-టే సహా ఆ పార్టీ నాయకులు, తైవాన్ ఇప్పటికే స్వతంత్రంగా పనిచేస్తోందని, ప్రజలు తమను చైనీయులుగా కాకుండా తైవానీయులుగా గుర్తించుకుంటున్నారని చెబుతున్నారు. సర్వేలు కూడా చైనాతో ఏకీకరణకు ప్రజా మద్దతు తక్కువగా ఉందని చూపించాయి. చాలా మంది ప్రస్తుత పరిస్థితి కొనసాగాలని కోరుకుంటున్నారు. 2022లో రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన తర్వాత, దూర ప్రాంతాల్లో జరిగే యుద్ధాల్లో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోకపోవచ్చనే అభిప్రాయం బలపడింది. 2027 సంవత్సరం కీలక మైలురాయిగా ప్రస్తావనకు వచ్చింది. ఎందుకంటే అది చైనా ప్రజా విమోచన సైన్యం స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తయ్యే సంవత్సరం. 2021లో అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ మాజీ అధిపతి ఫిల్ డేవిడ్సన్, ఈ దశాబ్దం ముగిసేలోపు దాడి జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే ఇప్పటికీ స్పష్టత లేదు.చైనా, తైవాన్ యుద్ధం జరిగితే?విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. తైవాన్పై దాడి జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పశ్చిమాసియా యుద్ధం కంటే తీవ్రంగా ఉండొచ్చు. మొదటిగా, ఆగ్నేయ ఆసియాలోని మలక్కా జలసంధి చైనా, వియత్నాం వంటి ప్రధాన ఎగుమతి దేశాలను ప్రపంచంతో కలుపుతోంది. యుద్ధం విస్తరితే నౌకల రాకపోకలు ప్రభావితమవుతాయి. రెండో అంశం సెమీకండక్టర్ల ఉత్పత్తిలో తైవాన్ ఆధిపత్యం ఉంది. “సిలికాన్ షీల్డ్” సిద్ధాంతం ప్రకారం, ఈ విలువైన పరిశ్రమ కారణంగా పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అదే సమయంలో తైవాన్ను రక్షించడానికి అమెరికాకు ఇదే బలమైన కారణంగా నిలుస్తుంది. సిలికాన్ షీల్డ్ సిద్ధాంతం అంటే చిప్ల తయారీలో తైవాన్ ప్రాధాన్యం కారణంగా దానిపై దాడి చేయడానికి దేశాలు వెనుకాడతాయనే భావన. -
ఐఆర్జీసీ రగడ.. ఇరాన్లో కీలక పరిణామం?
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ ఐఆర్జీసీ దళాల తీరుపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజష్కియన్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మసూద్.. అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కాగా, ఇప్పటికే ఆయన తన రాజీనామా లేఖను సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి పంపినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్ పత్రిక పలు కథనాలను వెల్లడించింది.ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఇరాన్లో పాలనపై పలు ఊహాగానాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇరాన్ను ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తున్నట్టు తెలిసింది. దానికి బలం చేకూరుస్తూ తాజాగా మసూద్ ఇవే విషయాలను వెల్లడించినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే, ఇరాన్ పాలన ఐఆర్జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో హెచ్చరించినట్లు సదరు కథనం వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి కీలక నిర్ణయాల విషయంలో ఇరాన్ ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నట్లు ఆరోపించారు.Iran’s president has reportedly asked to resign, citing a loss of authority inside the country’s ruling system.According to reports, Masoud Pezeshkian told the Supreme Leader’s office that he and his government have been excluded from major decision-making, leaving him unable… pic.twitter.com/ronp6oNvrI— Fox News (@FoxNews) May 31, 2026కాగా, అధ్యక్షుడు పెజష్కియాన్ రాజీనామా లేఖపై సుప్రీం లీడర్ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టినట్లు వెల్లడించింది. పాలన, చట్టపరంగా తనకు ఉన్న బాధ్యతలను కూడా పూర్తి చేయనీయకుండా చేస్తున్నారని పెజష్కియాన్ ఆరోపించినట్లు వెల్లడించింది. మరోవైపు, ఈ కథనంపై ఇరాన్ అధ్యక్ష కార్యాలయంలోని కమ్యూనికేషన్స్ విభాగం డిప్యూటీ హెడ్ మెహదీ తబాతబాయి స్పందించారు. ప్రస్తుతం అమెరికాతో చర్చల వేళ తప్పుడు రిపోర్టులతో మీడియా గేమ్స్ ఆడుతోందని ఆరోపించారు. తుర్కియే ప్రభుత్వ పత్రిక కూడా ఈ ఖండనను సమర్థించింది. ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘేర్ ఒప్పంద ప్రతిపాదనలపై స్పందిస్తూ.. ఇరాన్ హక్కులను కాపాడని ఏ డీల్కు తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. -
వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదం.. పెళ్లికొడుకు దుర్మరణం
-
గూగుల్ కంపెనీ భారీ ప్రయోగం
సాధారణంగా గూగుల్ అంటే సెర్చ్ ఇంజిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక టెక్నాలజీ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు అదే గూగుల్ ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న ఓ ప్రమాదకరమైన ప్రజారోగ్య సమస్యపై దృష్టి సారించింది. ‘ముల్లును ముల్లుతోనే’ దెబ్బ తీసేలా కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. ఈ వినూత్న ప్రయోగం.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా దాని వెనుక ఉన్న శాస్త్రం, దాని లక్ష్యం, గతంలో నమోదైన ఫలితాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.గూగుల్ మాతృసంస్థకు చెందిన పరిశోధనా విభాగం డీబగ్ ప్రాజెక్ట్(Debug Project) అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. రెండు సంవత్సరాల వ్యవధిలో ఇక్కడ 3.2 కోట్ల మగ దోమలను విడుదల చేయడానికి అనుమతి కోరింది. అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తోంది.అయితే ఇవి సాధారణ దోమలు కావు. ప్రత్యేకంగా ల్యాబ్ల్లో పెంచినవి!. పైగా వోల్బాషియా పైపెంటిస్( Wolbachia pipientis) అనే బ్యాక్టీరియాతో సంక్రమింపజేసిన మగ దోమలు. ఈ మగ దోమలు అడవిలో ఉన్న ఆడ దోమలతో జతకట్టినప్పుడు గుడ్లు ఏర్పడతాయి. కానీ ఆ గుడ్లు పొదగవు. ఫలితంగా కొత్త దోమలు పుట్టవు. అలా.. కొంతకాలానికి మొత్తం దోమల జనాభా క్రమంగా తగ్గిపోతుంది.ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. కుట్టేది ఆడ దోమలే. మగ దోమలు మనుషుల జోలికి పోవు . కాబట్టి లక్షలాది దోమలను విడుదల చేసినా ప్రజలకు అదనపు ఇబ్బంది ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగని.. ఈ ప్రాజెక్ట్ కొత్తది కాదు. గూగుల్ 2014లోనే డీబగ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మలేరియా, డెంగీ, జికా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయడమే దీని లక్ష్యం. గత పదేళ్లుగా ప్రయోగశాలలు, పరిమిత ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించిన తర్వాత ఇప్పుడు పెద్ద స్థాయిలో అమలు చేయాలని యోచిస్తోంది.నిజానికి దోమలపై ఇలా "వంధ్యీకరణ యుద్ధం" చేయడం ఇదే తొలిసారి కాదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇలాంటి పద్ధతులను ఇప్పటికే ప్రయోగించారు. అమెరికాలో ఆక్సిటెక్ (Oxitec) అనే బయోటెక్ సంస్థ జన్యుమార్పిడి చేసిన దోమలను విడుదల చేసి మంచి ఫలితాలు సాధించింది. బ్రెజిల్, పనామా, కేమన్ దీవుల్లో నిర్వహించిన ప్రయోగాల్లో లక్ష్య దోమల జనాభా 80-90 శాతం వరకు తగ్గినట్లు నివేదికలు వెల్లడించాయి.అంతేకాదు, దశాబ్దాల క్రితమే ఇదే సూత్రాన్ని ఉపయోగించి మెడిటేరియన్ ఫ్రూట్ ఫ్లై(Mediterranean Fruit Fly) అనే పంటల శత్రువైన ఈగలను, అలాగే పశువులకు ప్రమాదకరమైన న్యూవరల్డ్ స్క్రూవార్మ్(New World Screwworm) పురుగులను కూడా అనేక దేశాలు విజయవంతంగా నియంత్రించాయి. అంటే ఈ పద్ధతి పూర్తిగా కొత్తది కాకపోయినా, దోమల నియంత్రణలో ఇంత భారీ స్థాయిలో వినియోగించేందుకు ప్రయత్నించడం మాత్రం విశేషం.ఖర్చు విషయానికొస్తే.. గూగుల్ ఖచ్చితమైన సంఖ్యలను వెల్లడించలేదు. అయితే గతంలో డీబగ్ ప్రాజెక్ట్, సంబంధిత పరిశోధనల కోసం ఇప్పటికే వందల మిలియన్ డాలర్ల స్థాయిలో పెట్టుబడులు పెట్టినట్లు టెక్, బయోటెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రయోగశాలల్లో కోట్లాది దోమలను పెంచడం, వాటిని వేరు చేయడం, బ్యాక్టీరియాతో సంక్రమింపజేయడం, అనంతరం విడుదల చేయడం వంటి ప్రక్రియలు భారీ వ్యయంతో కూడుకున్నవే.అయితే గూగుల్కు కొన్ని రిస్క్లు కూడా ఉన్నాయి. ఈ భారీ ప్రయోగంపై విమర్శలు వినిపిస్తున్నాయి . ప్రకృతిలో ఇంత భారీ స్థాయిలో జోక్యం చేసుకోవడం వల్ల పర్యావరణ సమతుల్యతపై ఎలాంటి ప్రభావం ఉంటుందన్న ప్రశ్నలు పర్యావరణవేత్తలు లేవనెత్తుతున్నారు. దోమల జనాభా తగ్గితే వాటిపై ఆధారపడే ఇతర జీవులపై ప్రభావం పడే అవకాశముందనే వాదన వినిపిస్తోంది. అయినప్పటికీ ప్రజారోగ్య నిపుణులు మాత్రం దీనిని ఆశాజనక ప్రయోగంగా చూస్తున్నారు. ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడుతున్నారు. ఆ సమస్యను రసాయనాలపై ఆధారపడకుండా, ప్రకృతి సూత్రాలనే ఉపయోగించి నియంత్రించగలిగితే అది ప్రజారోగ్య రంగంలో పెద్ద ముందడుగుగా నిలుస్తుందని చెబుతున్నారు. ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న దోమలపై "మగ దోమల సైన్యం" నిజంగా విజయం సాధిస్తే.. భవిష్యత్తులో డెంగీ, మలేరియా నియంత్రణకు కొత్త దారి చూపే అవకాశముంది. -
ఇరాన్ బి..గ్ ప్లాన్, ప్రపంచానికి కొత్త టెన్షన్!
శాంతి చర్చలు, కాల్పుల విరమణ ఒప్పందాలు, దౌత్యపరమైన కసరత్తులతో పశ్చిమాసియా యుద్ధం అనే అధ్యాయం ముగింపునకు చేరిందని ప్రపంచం భావించింది. కానీ తాజా శాటిలైట్ చిత్రాలు మరో కథను బయటపెడుతున్నాయి. కొన్ని వారాల క్రితం ధ్వంసమైపోయినట్లు కనిపించిన ఇరాన్ స్థావరాల్లో వద్ద మళ్లీ కదలికలు మొదలయ్యాయి. పర్వతాల కింద దాగిన ఆ రహస్య టన్నెల్ నెట్వర్క్లో అసలేం జరుగుతోంది?.. ఇరాన్ కేవలం పునరుద్ధరణ పనులే చేస్తోందా.. లేదంటే పశ్చిమాసియా యుద్ధంలో సీక్వెల్కు సిద్ధపడుతోందా?.. ఇప్పుడు ప్రపంచ భద్రతా వర్గాలను ఈ ప్రశ్న కలవరపెడుతోంది.అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నట్లు భావించిన ఇరాన్ భూగర్భ క్షిపణి టన్నెల్లను మళ్లీ తెరిచే పనులు జోరుగా సాగుతున్నట్లు తాజా శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. దాడులకు గురైన 18 ప్రధాన భూగర్భ క్షిపణి కేంద్రాలకు చెందిన 69 టన్నెల్ ప్రవేశ మార్గాల్లో ఇప్పటికే 50 మార్గాలను ఇరాన్ తిరిగి వినియోగించగల స్థితికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఇరాన్ క్షిపణి సామర్థ్యం నిజంగా ఎంత మేర దెబ్బతిందనే ప్రశ్న మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.గత కొంతకాలంగా ఇరాన్ క్షిపణి మౌలిక వసతులపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భూగర్భంలో నిర్మించిన క్షిపణి నిల్వ కేంద్రాలు, ప్రయోగ స్థావరాలు, టన్నెల్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్నాయని చెప్పుకున్నాయి. ఈ దాడుల ప్రధాన ఉద్దేశం ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ఉపయోగించకుండా అడ్డుకోవడమే. టన్నెల్ ప్రవేశ మార్గాలను ధ్వంసం చేసి, లోపల నిల్వ ఉంచిన ఆయుధాలను బయటకు తీసుకురాలేని పరిస్థితి సృష్టించాలని ప్రయత్నించారు. యుద్ధ సమయంలో ఇరాన్కు చెందిన 450కు పైగా క్షిపణి సంబంధిత లక్ష్యాలు, నిల్వ కేంద్రాలు, ప్రయోగ సదుపాయాలు దాడులకు గురైనట్లు పాశ్చాత్య అంచనాలు చెబుతున్నాయి.అయితే తాజా శాటిలైట్ చిత్రాలు పూర్తిగా భిన్నమైన దృశ్యాన్ని చూపిస్తున్నాయి. సీఎన్ఎన్ విశ్లేషించిన ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ చిత్రాల ప్రకారం.. కాల్పుల విరమణ తర్వాత ఇరాన్ భారీ స్థాయిలో పునరుద్ధరణ చర్యలు ప్రారంభించింది. బుల్డోజర్లు, డంప్ ట్రక్కులు, భారీ యంత్రాలతో ధ్వంసమైన ప్రవేశ మార్గాల వద్ద మట్టిని తొలగిస్తూ మళ్లీ టన్నెల్లను తెరుస్తోంది. కొన్ని స్థావరాల వద్ద భారీ బాంబుల కారణంగా ఏర్పడిన గుంతలను పూడ్చివేస్తూ, లోపలికి వెళ్లే రహదారులను తిరిగి అందుబాటులోకి తెస్తున్నట్లు చిత్రాలు సూచిస్తున్నాయి.ఈ పరిణామం అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహాత్మక అంచనాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎందుకంటే దాడుల అనంతరం ఇరాన్ క్షిపణి ప్రయోగ సామర్థ్యం దాదాపు 90 శాతం వరకు దెబ్బతిందని పాశ్చాత్య విశ్లేషకులు పేర్కొన్నారు. కనీసం 29 క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నాలుగు ప్రధాన క్షిపణి తయారీ సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అప్పట్లో నివేదికలు వచ్చాయి. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న ఆధారాలు చూస్తే.. క్షిపణి నిల్వలు పూర్తిగా నాశనం కాలేదని, కేవలం భూగర్భంలో చిక్కుకుపోయాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. టన్నెల్లను మళ్లీ తెరవగలిగితే ఆ క్షిపణులను తిరిగి వినియోగించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.ఇరాన్కు భూగర్భ క్షిపణి కేంద్రాలు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ఆస్తులు. పర్వతాల లోపల, వందల మీటర్ల లోతులో నిర్మించిన ఈ కేంద్రాలు వైమానిక దాడులను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రధాన లక్ష్యంగా ఇవే మారాయి. అయినప్పటికీ, ఇరాన్ గతంలో కూడా దెబ్బతిన్న సైనిక మౌలిక వసతులను వేగంగా పునర్నిర్మించిన చరిత్ర కలిగి ఉంది. తాజా పరిణామాలు అదే సామర్థ్యాన్ని మరోసారి సూచిస్తున్నాయని భద్రతా నిపుణులు పేర్కొంటున్నారు.ఇక హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉన్న కొన్ని క్షిపణి స్థావరాల్లో కూడా కార్యకలాపాలు పునరుద్ధరించబడుతున్నట్లు పాశ్చాత్య గూఢచార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్ముజ్ ప్రాంతంలో ఇరాన్ మళ్లీ క్షిపణి సామర్థ్యాన్ని పెంచుకుంటే మధ్యప్రాచ్య భద్రతా సమీకరణాలపై దాని ప్రభావం గణనీయంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ధ్వంసమైన టన్నెల్లను తిరిగి తెరవడం, భూగర్భ స్థావరాల్లో కార్యకలాపాలను పునరుద్ధరించడం ద్వారా ఇరాన్ తన వ్యూహాత్మక సామర్థ్యాన్ని మళ్లీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని టెన్నెల్స్ తిరిగి అందుబాటులోకి రావడం, భూగర్భ నిల్వల్లో ఇంకా గణనీయమైన క్షిపణి సామర్థ్యం మిగిలి ఉండొచ్చన్న అంచనాలు పశ్చిమాసియా భద్రతా సమీకరణాలను మరోసారి సంక్లిష్టంగా మారుస్తున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం ముగిసిపోయిందని భావించడానికి ప్రపంచం ఇంకా సిద్ధంగా ఉండలేకపోతోంది. -
హనీమూన్ ట్రిప్.. కుప్పకూలిన హెలికాప్టర్
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివాహమయి ఒకరోజైనా గడవకముందే హెలికాప్టర్ ప్రమాదంలో పెళ్లికొడుకు దుర్మరణం చెందాడు. పెళ్లికూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. దంపతులిద్దరూ భారత సంతతికి చెందిన వ్యక్తులుగా తెలుస్తోంది. కేరళకు చెందిన డేవ్ ఫిజీ, జెస్నీలు అట్లాంటాలో స్థిరపడ్డారు. జార్జియాలోని డాసన్ కౌంటీలో వీరి వివాహం వివాహం ఎంతో వైభవంగా జరిగింది. ఆ వేడుక అనంతరం ఈ కొత్త జంట 'రాబిన్సన్ R66' రకం హెలికాప్టర్లో సరదాగా బయలుదేరారు. అయితే, డాసన్విల్లేలోని 24 మౌంట్ వెర్నాన్ డ్రైవ్ సమీపంలోకి రాగానే ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా ప్రమాదానికి గురై కుప్పకూలిపోయింది.ఈ ప్రమాదంలో పెళ్లికొడుకుతో పాటు ఫైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, పెళ్లికూతురుకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రమాద వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని ఆసుపత్రికి తరలించారు. వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాల్సిన సమయంలో ఈ ప్రమాదం జరగడంతో దంపతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.అయితే ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. సంఘటన జరిగిన ప్రాంతంలో వాతావరణం అనుకూలించకపోవడమే దీనికి ప్రధాన కారణం కావచ్చని స్థానిక అధికారులు భావిస్తున్నారు. -
జీడీపీ, ఆర్బీఐ పాలసీపై ఫోకస్
దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ఓవైపు యూఎస్, ఇరాన్ మధ్య చర్చలు ప్రభావం చూపనుండగా.. మరోపక్క ఆర్బీఐ పరపతి సమీక్ష, క్యూ4 జీడీపీ గణాంకాలూ కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. పశ్చిమాసియా సంక్షోభంపై రోజుకో రకంగా వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో యూఎస్, ఇరాన్ మధ్య చర్చలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో కొద్ది రోజులుగా ముడిచమురు ధరలకు రెక్కలురావడంతో పలు రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రధానంగా భారత్ చమురు వినియోగంలో 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడటంతో రూపాయి బలహీనపడుతోంది. దిగుమతుల బిల్లులో పసిడి, చమురు ప్రధా న పాత్ర పోషిస్తుండటం దీనికి కారణంకాగా.. వాణిజ్య లోటు పెరుగుతోంది. వెరసి పశ్చిమాసియాలో శాంతి నెలకొనడం భారత్కు సానుకూల అంశమని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. దీంతో యూఎస్, ఇరాన్ చర్చలు, ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, ఎన్రిచ్ మనీ సీఈవో పొన్మూడి ఆర్. పేర్కొన్నారు. గణాంకాల విడుదల నేడు(సోమవారం) ఏప్రిల్ నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు విడుదలకానున్నాయి. 2026 మార్చిలో ఐఐపీ 4.1 శాతం ఎగసింది. ఫిబ్రవరిలో సవరించిన 5.1 శాతం గణాంకాలతో పోలిస్తే కొంతమేర వెనకడుగు వేసింది. అంతేకాకుండా మే నెలకు హెచ్ఎస్బీసీ తయారీ, సరీ్వసెస్, కాంపోజిట్ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్లో దాదాపు నాలుగేళ్లలోనే తక్కువస్థాయి తయారీ పీఎంఐ 54.3కు మందగించింది. వీటితోపాటు మే నెలకు ఆటో రంగ(వాహన విక్రయ) గణాంకాలు సైతం వెలువడనున్నాయి. 2025–26 క్యూ4, పూర్తి ఏడాది జీడీపీ గణాంకాలు జూన్ 5న విడుదల కానున్నాయి.వడ్డీ రేట్లు యథాతథం! వారాంతాన(జూన్ 5న) ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్ణయం వెలువడుతుంది. క్రూడ్ సెగతో ధరలకు రెక్కలొస్తున్న విషయం విదితమే. దీంతో టోకుతోపాటు, రిటైల్ ద్రవ్యోల్బణం సైతం పెరుగుతోంది. దీంతో కఠిన విధానాలవైపు ఆర్బీఐ మొగ్గు చూపే అవకాశమున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే ద్రవ్యోల్బణం రిసు్కలున్నప్పటికీ ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే వ్యూహంతో ఆర్బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును మరోసారి 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించే వీలున్నట్లు పేర్కొంటున్నారు. గత రెండు పాలసీ సమీక్షలలో ఆర్బీఐ రెపో రేటులో స్టేటస్ కో అమలు చేసిన సంగతి తెలిసిందే. లిక్విడిటీ, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆర్బీఐ స్పందన సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలియజేశారు. ఆర్బీఐ పాలసీ, జీడీపీ, ఐఐపీ, ఆటో రంగ గణాంకాలు సమీప భవిష్యత్లో మార్కెట్ల నడకను ప్రభావితం చేయన్నుట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ వివరించారు, ఎఫ్పీఐల షాక్ కొద్ది నెలలుగా దేశీ స్టాక్స్లో భారీ అమ్మకాలకు పాల్పడుతున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) మే నెలలోనూ రూ. 33,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఎన్ఎస్డీఎల్ గణాంకాల ప్రకారం 2026 జనవరి నుంచి ఇప్పటివరకూ రూ. 2.25 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. తద్వారా మొత్తం 2025 ఏడాదిలో చేపట్టిన రూ. 1.66 లక్షల కోట్ల విలువైన అమ్మకాలను మించిపోవడం గమనార్హం!! ఇతర దేశ మార్కెట్లు ఆకర్షణీయంగా ఉండటం, రూపాయి బలహీనత తదితర అంశాలు దీనికి కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మినహా ఈ ఏడాది మిగిలిన నాలుగు నెలల్లోనూ ఎఫ్పీఐలు విక్రయాలకే ప్రాధాన్యమిస్తూ వచ్చారు. ఫిబ్రవరిలో రూ. 22,615 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.సాంకేతికంగా చూస్తే.. గత వారం ప్రధాన ఇండెక్సులు తొలుత బలపడినప్పటికీ ఎగువ స్థాయిలవద్ద నిలదొక్కుకోలేకపోయాయి. వారాంతాన ఉన్నట్టుండి పెరిగిన భారీ అమ్మకాలతో బలహీనపడ్డాయి. సాంకేతికంగా చూస్తే నిఫ్టీ 23,000 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. ఆపై అమ్మకాలు కొనసాగితే సమీప భవిష్యత్లో 22,400 వరకూ పతనమయ్యే చాన్సుంది. ఈస్థాయిల వద్ద బలమైన సపోర్ట్కు వీలుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఇరాన్పై మళ్లీ భీకర దాడులు? ప్రపంచాన్ని వణికిస్తున్న అంచనా!
టెహ్రాన్: ఇరాన్ పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని చూస్తుంటే యుద్ధం మరింత తీవ్రతరం అవుతుందని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా-ఇరాన్ చర్చల్లో ప్రతికూలత కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్పై సైనిక దాడులు మళ్లీ ప్రారంభించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని చెబుతున్నారు. అదే సమయంలో, ట్రంప్ ఇరాన్పై మరింత కఠిన వైఖరి అవలంబిస్తూ కొత్త షరతులు పెడుతున్నట్టు పలు అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. చర్చలు విఫలమైతే మరింత తీవ్రమైన దాడులు జరిగే అవకాశం ఉంటుందని కూడా ట్రంప్ హెచ్చరించారు.ఈ నేపథ్యంలో ఇరాన్-అమెరికా యుద్ధం మళ్లీ పూర్తి స్థాయిలో, మరింత భీకరంగా ప్రారంభమయ్యే ప్రమాదం ఉందని యూఎస్ సైన్యానికి చెందిన కల్నల్ (రిటైర్డ్), రచయిత, రక్షణ వ్యవహారాల విశ్లేషకుడు డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మాక్గ్రెగర్ మాట్లాడుతూ.. ‘‘అమెరికన్లలో ట్రంప్కి మద్దతు ఇచ్చే వాళ్లు తగ్గిపోతున్నారు. ఒకప్పుడు ప్రజాదరణ ఓట్లలో మూడో వంతు ఉన్నా, ఇప్పుడు అంతకంటే చాలా తక్కువగా ఉంది. అది సుమారు 20 శాతం స్థాయికి పడిపోయి ఉండొచ్చు.ప్రస్తుతం చాలా మంది అమెరికన్లు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో (ఇరాన్, గల్ఫ్ దేశాలు, చమురు రవాణా మార్గాలు) జరుగుతున్న ఘర్షణలు, సైనిక చర్యలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎందుకంటే వాటి ప్రభావం ఇంకా వారి రోజువారీ జీవితంలో నేరుగా కనిపించడం లేదు. కానీ, అమెరికా చర్యల వల్ల చమురు సరఫరా దెబ్బతింటే, పెట్రోలు ధరలు పెరిగితే, ఇంధన కొరత వస్తే, ఆర్థిక సమస్యలు తలెత్తితే వాటి ప్రభావం అమెరికా ప్రజల జీవితాలపై నేరుగా పడుతుంది. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఇప్పటివరకు ఆసక్తి చూపని అమెరికన్లు కూడా "పర్షియన్ గల్ఫ్లో ఏమి జరుగుతోంది?" అని గమనించడం ప్రారంభిస్తారు.చమురు, సహజ వాయు రంగాలకు చెందిన ప్రముఖులు స్పష్టంగా చెప్పారు.. ఎక్సాన్ సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అయినా, ఇతర చమురు, ఆర్థిక విశ్లేషకులు అయినా ఒకే విషయం చెబుతున్నారు. మరో 3 నుంచి 8 వారాల్లో వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు పూర్తిగా ఖాళీ అవుతాయని, అమెరికా తీవ్రమైన ఇబ్బందుల్లో పడుతుందని హెచ్చరిస్తున్నారు.ఉదాహరణకు, కాలిఫోర్నియా పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు దిగుమతులపై చాలా ఆధారపడుతుందనే విషయాన్ని ఎవరూ అధ్యక్షుడు ట్రంప్కు చెప్పలేదు. ఇప్పుడు ఆ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ అకస్మాత్తుగా యుద్ధం లేదా సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినా, సాధారణ అమెరికన్లలో ఎక్కువ మంది దానిని వ్యతిరేకించరు. అధిక శాతం మంది అమెరికన్లు దానిని బలహీనతగా చూడరు. యుద్ధం ముగిస్తే స్వాగతిస్తారు’’ అని తెలిపారు.ఇజ్రాయెల్ ఊరుకోదు ఒకవేళ యుద్ధం ఆగితే అమెరికా స్వాగతించినా, ఇజ్రాయెల్ అలా చేయదని డగ్లస్ అబోట్ మాక్గ్రెగర్ తెలిపారు. ‘‘అమెరికాలోని ఇజ్రాయెల్ అనుకూల వర్గాలు, భారీ సంపద కలిగిన వ్యక్తులు అధ్యక్షుడికి, ‘మీరు ఇలా చేస్తే మేము ఇక మీకు మద్దతు ఇవ్వము. మాకు రక్షణ లేకపోతే, మీపై రాజకీయ దాడులు మొదలవుతాయి. కాపిటల్ హిల్లో మీ ప్రత్యర్థులు మీపై విరుచుకుపడతారు. ప్రస్తుతం వారికి, మీకు మధ్య నిలబడి ఉన్నది మేమే. మేము మీకు మద్దతు ఇస్తున్నాం. మాధ్యమాలపై మా ప్రభావం ఉంది. ఆర్థిక వ్యవస్థపై మా ప్రభావం ఉంది. రాజకీయ శక్తి కావాలనుకునేవారికి ఇవి అత్యంత ప్రభావవంతమైన అంశాలు. కాబట్టి మీరు ఏమి చేస్తారు?’ అని వారు అడుగుతారు.ప్రస్తుతం నెతన్యాహూతో అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడి, మనం చేయగలిగేది ఇదేననిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నెతన్యాహూను ఒప్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. కానీ నెతన్యాహూ లెక్కలు ట్రంప్ లెక్కలకు పూర్తిగా భిన్నం. ట్రంప్నకు యుద్ధ తీవ్రతను తగ్గించడం లేదా ముగించడం రాజకీయంగా ప్రయోజనకరంగా అనిపించవచ్చు. కానీ, నెతన్యాహూ మాత్రం ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం, విదేశాంగ విధానం, మధ్యప్రాచ్య వ్యవహారాలపై ఇజ్రాయెల్కు గణనీయమైన ప్రభావం ఉందని భావిస్తున్నారు. అందువల్ల, యుద్ధం ఆగిపోతే లేదా ఉద్రిక్తతలు తగ్గిపోతే ఆ ప్రభావం తగ్గే అవకాశం ఉంది. అందుకే ఇంత ప్రభావం ఉన్న సమయంలో నెతన్యాహూ ఎందుకు వెనక్కి తగ్గుతారు? నెతన్యాహూ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ లేదా పరిమిత సైనిక చర్యతో సంతృప్తి చెందరు. ఇరాన్ సైనిక, రాజకీయ శక్తిని తీవ్రంగా బలహీనపరచే వరకు ఒత్తిడి కొనసాగించాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు. అంతేకాక, ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు లేదా సంస్థలకు కూడా ఒక బలమైన హెచ్చరిక పంపాలనుకుంటున్నారు.ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నిలబడితే లేదా దాని భద్రతకు ముప్పుగా మారితే, తీవ్రమైన సైనిక పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే హెచ్చరికను అందరికీ ఇవ్వాలని నెతన్యాహూ కోరుకుంటున్నారు’’ అని తెలిపారు. -
ఆగని యుద్ధం.. ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం?!
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో శాంతి ఒప్పందాల ప్రయత్నాలు విఫలమవడంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు మరింత కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కఠిన షరతుల నేపథ్యంలో ఈ సంక్షోభం మరింత సుదీర్ఘంగా సాగేలా కనిపిస్తోంది. కీలకమైన హర్మూజ్ జలసంధి మూసివేత భయాలు, ఇంధన ధరల పెరుగుదల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి ఒప్పందం దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాము ఎలాంటి అణు ఆయుధాలను తయారు చేయబోమని ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి తన కోడలు లారా ట్రంప్ నిర్వహించిన ‘ఫాక్స్ న్యూస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నాకు కావలసిన ఒకే ఒక్క గ్యారెంటీ, ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేయకూడదు. అందుకు వారు అంగీకరించారు, ఇది చాలా ఆసక్తికరమైన విషయం’ అని పేర్కొన్నారు.మరోవైపు, న్యూయార్క్ టైమ్స్, యాక్సియోస్ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. శాంతి ఒప్పందం పేరిట ట్రంప్ ఇరాన్కు అత్యంత కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త ప్రతిపాదనలను పంపారు. అయితే ఈ కొత్త షరతుల కారణంగా పశ్చిమాసియాలో అధికారికంగా యుద్ధం ముగింపు, హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి పట్టే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.పశ్చిమాసియాలో యుద్ధ ముగింపు ఒప్పందంలో భాగంగా ‘లేబనాన్’ను కూడా చేర్చాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లేబనాన్లోకి 30 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులను తీవ్రం చేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ డిమాండ్ తెరపైకి తెచ్చింది. దీంతో పాటు వ్యాపార పరంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే ఓడలపై ఇరాన్ ఎలాంటి పన్నులు వసూలు చేయకూడదని ట్రంప్ ప్రతిపాదించగా, అలాంటి నిబంధన ఏదీ ఒప్పందంలో లేదని ఇరాన్ మీడియా సంస్థ ‘ఫార్స్’ కొట్టిపారేసింది. అంతేకాకుండా, సదరు జలసంధిపై తమ పూర్తి సార్వభౌమాధికారాన్ని చాటే బిల్లును ఇరాన్ పార్లమెంట్ త్వరలోనే ఆమోదించబోతోందని స్పష్టం చేసింది.తమ అణు కార్యక్రమంపై అమెరికాతో కీలక చర్చలు ప్రారంభించడానికి ముందే, గతంలో అమెరికా స్తంభింపజేసిన తమ 12 బిలియన్ డాలర్ల ఆస్తులను తక్షణమే విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అదే సమయంలో, ఇరాన్ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను నాశనం చేస్తామంటూ ట్రంప్ మునుపు చేసిన వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక వర్గాలు తోసిపుచ్చాయి. ట్రంప్ వాదనలపై టెహ్రాన్ (ఇరాన్) మొదటి నుంచి సందేహాలు వ్యక్తంచేస్తుండటంతో, కీలక ప్రాధాన్యతల విషయంలో ఇరు పక్షాల మధ్య ఇంకా చాలా వ్యత్యాసాలు కొనసాగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. -
అమెరికా పని ఖతం? అణు బాంబు తయారీలో కీలక ఘట్టం చేరుకున్న ఇరాన్
-
చైనాకు చెక్.. AUKUS కూటమి భారీ వ్యూహం!
ప్రపంచ భద్రతా సమీకరణాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా సవాళ్లకు ఎదుర్కొనేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు కలిసి అత్యాధునిక అండర్వాటర్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. AUKUS రక్షణ కూటమి కింద చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా సముద్ర గర్భంలో పనిచేసే మానవరహిత అత్యాధునిక అండర్వాటర్ డ్రోన్లను రూపొందించనున్నారు. ఇందులో భాగంగా తొలి దశ సామర్థ్యాలను 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రకటించారు.సింగపూర్లో జరిగిన ప్రతిష్ఠాత్మక షాంగ్రి-లా డైలాగ్ సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హీలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించారు. AUKUS “పిల్లర్-2” కింద ప్రకటించిన తొలి ప్రధాన ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. కాగా, ఈ అండర్వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా.. శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. అవసరమైతే లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యాన్ని కూడా వీటికి కల్పించనున్నారు.2021లో ఏర్పడిన AUKUS కూటమి రెండు ప్రధాన భాగాలుగా పనిచేస్తోంది. “పిల్లర్-1” కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, “పిల్లర్-2” కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు.⚡️ US, UK and Australia ANNOUNCE UNDERWATER DRONES projectDeveloped under their military alliance known as AUKUS, technology is expected to be ready by next year pic.twitter.com/yW4pmf3RKc— RT (@RT_com) May 30, 2026ప్రస్తుతం ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 95 శాతం సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే జరుగుతోంది. అలాగే అనేక దేశాల గ్యాస్, ఇంధన సరఫరా వ్యవస్థలు కూడా సముద్ర అడుగునే ఉన్నాయి. ఇటీవల బాల్టిక్ సముద్రం, తైవాన్ సముద్ర జలసంధి ప్రాంతాల్లో అండర్సీ కేబుళ్లు దెబ్బతిన్న ఘటనలు ప్రపంచ దేశాలను అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో కీలక మౌలిక వసతుల రక్షణ కోసం అండర్వాటర్ డ్రోన్లను ఉపయోగించాలని AUKUS దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సముద్ర గర్భం ఇప్పుడు కొత్త యుద్ధ రంగంగా మారుతోందని, అక్కడి ముప్పులను ఎదుర్కొనేందుకు ఈ టెక్నాలజీ కీలకమని వారు పేర్కొన్నారు.అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ ద్వారా డ్రోన్లలో ఉపయోగించే సెన్సర్లు, నావిగేషన్ వ్యవస్థలు, AI ఆధారిత నిర్ణయ సామర్థ్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లు వంటి కీలక టెక్నాలజీలను కూడా మూడు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేయనున్నాయి. జీపీఎస్ అందుబాటులో లేని సముద్ర గర్భంలో కూడా స్వతంత్రంగా ప్రయాణించే సామర్థ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం వ్యూహం వెనుక ప్రధాన కారణం ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న నౌకాదళ శక్తి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని మిత్రదేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు ఈ ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, ఇది ప్రాంతీయ ఆయుధ పోటీని మరింత పెంచే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. -
డీల్పై సంతకానికి ట్రంప్ నో
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ యుద్ధ జ్వాలలు మొదలవుతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణను మరో 60 రోజులపాటు పొడిగించేందుకు, హార్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఉద్దేశించిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిణామం పట్ల ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపి తాత్కాలిక ఒప్పందాన్ని సిద్ధం చేశారు. దీన్ని పరిశీలించిన ట్రంప్ సంతకం చేసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఒప్పందంలో కొన్ని అంశాల పట్ల ఆయన సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. సిచ్యుయేషన్ రూమ్లో తన సలహాదారులతో చర్చించానని, ఇరాన్తో ఒప్పందంపై అతిత్వరలో తుది నిర్ణయం తీసుకుంటానని ట్రంప్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, డీల్పై సంతకం చేయకుండానే సిచ్యుయేషన్ రూమ్ నుంచి బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ఇరాన్తో చేసుకొనే ఏ ఒప్పందమైనా అమెరికాకు లబ్ధి చేకూర్చేదిగా ఉండాలని ట్రంప్ భావిస్తున్నారని అమెరికా అధికార వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం డీల్ విషయంలో అమెరికాతో చర్చలు ఇంకా కొనసాగుతూనే ఉన్నారని ఇరాన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇరాన్తో మళ్లీ యుద్ధానికి సిద్ధమేనని అమెరికా రక్షణ శాఖమంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
స్వదేశానికి వెళ్లక్కర్లేదు
వాషింగ్టన్: గ్రీన్కార్డు దరఖాస్తుల విషయంలో కొత్త నిబంధనల పట్ల తీవ్ర విమర్శలు రావడం డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకుంది. శాశ్వత నివాసిత హోదా(గ్రీన్కార్డు) కోసం చేసుకున్న దరఖాస్తు సమీక్ష దశలో ఉన్నప్పుడు.. దరఖాస్తుదారులు అమెరికాను విడిచిపెట్టి వెళ్లాల్సిన అవసరం లేదని యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) విభాగం వెల్లడించింది. గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేయాలంటే తప్పనిసరిగా స్వదేశానికి తిరిగివెళ్లాలని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అసాధారణ పరిస్థితుల్లో మినహా.. అమెరికాలో శాశ్వత నివాసిత హోదా కోరుకునే విదేశీయులు దరఖాస్తు, ప్రాసెసింగ్ సమయంలో స్వదేశాల్లోనే ఉండాలని ఆదేశిస్తూ మే 21వ తేదీన ప్రకటన జారీ చేసింది. దీనిపై వలసదార్లు, అమెరికా కంపెనీల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తంచేశాయి. గ్రీన్కార్డు జారీ విధానంలో ఎలాంటి సమూల మార్పు జరగలేదని డీహెచ్ఎస్ ప్రకటించింది. ఒక దరఖాస్తుదారుడు అమెరికా వెలుపల నుండి గ్రీన్కార్డు ప్రక్రియను పూర్తి చేయాలా? లేక అమెరికాలోనే ఉండాలా? అనే విషయాన్ని కేసుల వారీగా పరిశీలించి నిర్ణయించే విచక్షణాధికారం ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఎప్పటినుంచో ఉందని గుర్తుచేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న వ్యవస్థ ప్రకారం.. అర్హులైన వలసదారులు ‘అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్’అనే ప్రక్రియ ద్వారా శాశ్వత నివాసిత హోదా కోసం అమెరికాలో ఉంటూనే దరఖాస్తు చేసుకోవచ్చు. వారి దరఖాస్తులు పరిశీలనలో ఉన్నప్పుడు అమెరికాలోనే నివసించవచ్చు. స్వదేశానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వలసలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా, గ్రీన్కార్డు కోరుకునే వ్యక్తులు దరఖాస్తు, ఆమోద ప్రక్రియ సమయంలో స్వదేశాలకు తిరిగి వెళ్లవలసి ఉంటుందని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ చెప్పడంతో ఈ వివాదం మొదలైంది ‘‘తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్కార్డు కోరుకునే విదేశీయులు దరఖాస్తు చేసుకోవడానికి ఇకపై స్వదేశానికి తిరిగి వెళ్లాలి’’అని ఆయన స్పష్టంచేశారు. వలసదార్లు వారి స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకున్నప్పుడు, అది తిరస్కరణకు గురైతే వారికి ఇబ్బందులు తప్పుతాయని అన్నారు. ఒకవేళ అమెరికాలో ఉండి దరఖాస్తు చేసినప్పుడు అది తిరస్కరణకు గురైతే వారు చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లుగా గుర్తించాల్సి వస్తుందని తెలిపారు. వారిని వెతికిపట్టుకొని బయటకు పంపించే ప్రయాస కూడా తమకు తప్పుతుందని స్పష్టంచేశారు. ఈ ప్రకటనను వలసదార్లు తప్పుపట్టారు. విదేశీ కారి్మకులపై ఆధారపడిన అమెరికా కంపెనీలు కూడా మండిపడ్డాయి. దీంతో ట్రంప్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
చైనా ఆధిపత్యాన్ని అడ్డుకుంటాం
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడం ఇప్పటికీ తమ లక్ష్యంగానే ఉందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. అదేవిధంగా, పసిఫిక్ సముద్ర ప్రాంత దేశాల భద్రతకు అమెరికా కట్టుబడి ఉంటామన్నారు. అమెరికా భద్రతకు వికాసానికి ఈ ప్రాంతం చాలా కీలకమైందని చెప్పారు. పసిఫిక్ రీజియన్లో సుస్థిరమైన, సానుకూల అధికార సమతుల్యతను సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. సింగపూర్లో జరుగుతున్న షాంగ్రి–లా రక్షణ సదస్సులో శనివారం హెగ్సెత్ మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా చైనా సైనిక పాటవాన్ని పెంచుకుంటుండటంపై ఈ ప్రాంతంలోనే కాదు మిగతా దేశాల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోందన్నారను. ఇక్కడి భద్రతా వాతావరణంపై తమకు స్పష్టమైన అంచనా ఉందన్నారు. పసిఫిక్ ప్రాంతం ఏదో ఒక దేశం ఆధిపత్యంలోకి వెళ్తే అది ప్రాంతీయ శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుందని, మనం పరరిక్షించుకోవాలని ప్రయత్నిస్తున్న సమతుల్యత ప్రమాదంలో పడుతుందన్న విషయం తమకు తెలుసునని హెగ్సెత్ పేర్కొన్నారు. అందుకే, చైనాయే కాదు, మరే దేశమూ ఈ ప్రాంతంపై ఆధిపత్యం నెలకొల్పుకునే అవకాశం తాము ఇవ్వబోమని స్పష్టం చేశారు. అదే సమయంలో చైనాతో తాము ఘర్షణాత్మక వైఖరిని ఆవలంభించబోమని చెప్పారు. ఇటీవల ట్రంప్, జిన్ పింగ్ మధ్య జరిగిన భేటీని ప్రస్తావిస్తూ హెగ్సెత్..అమెరికా, చైనాలు తమ ప్రయోజనాలను కాపాడుకుంటూనే పరస్పర ప్రయోజనాల విషయంలో ఆచరణాత్మకమైన ఒప్పందాలను కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. న్యాయబద్ధమైన, పరస్పర సహకారంతో కూడిన వ్యూహాత్మక, నిర్మాణాత్మక సంబంధాలను నెలకొల్పుకునేందుకు అంగీకరించారని చెప్పారు. మిత్ర దేశాలు రక్షణ వ్యయాన్ని పెంచుకోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందంటూ ఆయన..ఈ విషయంలో పలు ఆసియా దేశాలు చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు. కేవలం ఆదర్శప్రాయమైన సిద్ధాంతాలను కాకుండా దేశ ప్రయోజనాల పరిరక్షణకే ప్రాధాన్యం ఇస్తున్నాయని చెప్పారు. అదే సమయంలో యూరప్ దేశాల వైఖరిని హెగ్సెత్ తప్పుబట్టారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్(ఐఐఎస్ఎస్) ఆధ్వర్యంలోని సింగపూర్లోని షాంగ్రి–లా హోటల్లో 2002 నుంచి జరుగుతున్న ఈ సదస్సుకు భారత్ సహా 30కిపైగా దేశాల నుంచి అగ్ర నేతలు, దౌత్యవేత్తలు, రక్షణ శాఖల అధికారులు హాజరవుతారు.భారత్–పాక్ ఘర్షణను ట్రంప్ ఆపారుగతేడాది భారత్, పాకిస్తాన్ల మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతోనే సమసిపోయాయని హెగ్సెత్ పేర్కొన్నారు. అణు సామర్థ్యం ఉన్న ఈ రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ చేసిన కృషి అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు. భారత్, పాక్ల నాలుగు రోజుల సంక్షోభాన్ని తానే నివారించానంటూ ట్రంప్ గతంలో పలుమార్లు ప్రకటించుకోగా, భారత్ ఖండించడం తెల్సిందే. -
30 రోజులు, 13 నగరాలు: రూ.10 లక్షల ఖర్చు
ఒక అమెరికన్ జంట భారతదేశంలో 30 రోజుల పాటు 13 నగరాలను సందర్శించా మంటూ ఇన్స్టాలో చేసిన పోస్ట్ చేసి వైరల్గా మారారు. ఈ టూర్ కోసం ఈ జంట ఏకంగా 10,605 డాలర్లు (దాదాపు రూ. 10 లక్షలు) ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఈ విషయం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.ట్రావెలర్స్ అలెక్స్, అమేలియా తమ ఇన్స్టాగ్రామ్లో ఈ ఖర్చుల వివరాలను పంచు కున్నారు. అయితే ఖర్చు తాము అనుకున్నదానికంటే ఎక్కువే అయిందని అంగీకరించారు. తాము లగ్జరీ హోటళ్లు, ప్రీమియం అనుభూతులకు ప్రాధాన్యత ఇవ్వడమే ఈ భారీ ఖర్చుకు కారణమని వారు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Alex & Amelia | Full-Time World Travel (@checkedouttocheckin)మొత్తంగా ఇండియాలో నెల రోజుల కోసం రూ. 10 లక్షలు అంటే, రోజు రూ. 33,627 అన్నమాట అని ఆ జంట రాసుకొచ్చింది. 30 రోజుల్లోనే 13 నగరాలను సందర్శించడం వల్ల తమ ట్రిప్లోట్రాన్స్పోర్ట్ కోసమే అత్యధికంగా ఖర్చయిందని వారు తెలిపారు. తమ భారత పర్యటనలో భాగంగా ఆరు విమానాలు, ఆరు ప్రైవేట్ కార్ ప్రయాణాలు, రెండు రైలు ప్రయాణాలు చేసినట్లు వారు తెలిపారు. ప్రీమియం హోటళ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఖర్చు పెరిగిందని, రోజుకు సగటున హోటల్ రూమ్ కోసం రూ. 12,064 ఖర్చు చేసినట్లు చెప్పారు.మొత్తం లెక్కలు వేసి, ఒక నెలలో ఇంత ఖర్చు చేశామా అనే తామే ఆశ్చర్యపోయామని వెల్లడించారు. కేవలం బడ్జెట్ ఎంపికల కోసం మాత్రమే చూడకపోతే, ఇతర ప్రయాణికులు చెప్పినంత చౌకగా వసతి లేదన్నారు. అల్పాహారం, మధ్యాహ్నభోజనం, రాత్రి భోజనం బయట తినడంతో జేబులు ఖాళీ అయ్యాయని చెప్పుకొచ్చారు. వామ్మో..ఇది నిజంగానే ఎక్కువ : సోషల్ మీడియా స్పందనఈ పోస్ట్ వైరల్ కావడంతో, కొందరు నెటిజన్లు ఆ ఖర్చు చూసి ఆశ్చర్యపోగా.. మరికొందరు మాత్రం ఆ జంట మహారాజుల్లా బతికారు కాబట్టి అంత ఖర్చవ్వడంలో వింతేమీ లేదన్నారు. ఖచ్చితంగా మహారాజుల్లా రాజభోగాలు అనుభవించి ఉంటారని ఒకరు కామెంట్ చేశారు. వామ్మో..ఇది నిజంగానే చాలా ఎక్కువ అని కొందరన్నారు. ప్రత్యేక అనుభూతులు మిగుల్చుకోవాలంటే.. తప్పదు మరి. అయితే కరోనా తరువాత ఖర్చులు బాగా పెరిగాయన్నారు మరొకరు. -
అమెరికా యూ టర్న్ : వారికి భారీ ఊరట
అమెరికాలోని భారతీయుల డాలర్ డ్రీమ్స్ కరిగిపోతున్న వేళ గ్రీన్ కార్డ్ (శాశ్వత నివాసం) కోసం దరఖాస్తు చేసుకునే హెచ్-1బి (H-1B) వీసాదారులకు హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డిహెచ్ఎస్) భారీ ఊరట నిచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన (ప్రాసెసింగ్) జరిగే సమయంలో అత్యధిక శాతం మంది వలసదారులు అమెరికాలోనే కొనసాగవచ్చని, వారు దేశాన్ని విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని DHS స్పష్టం చేసింది.గ్రీన్కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు, వారి దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నప్పుడు అమెరికా విడిచి వెళ్లాల్సిన అవసరం లేద నిడీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఇటీవలి ప్రకటనపై నెలకొన్న గందరగోళం నేపథ్యంలో విధానంలో ఎలాంటి పెద్ద మార్పు జరగలేదని స్పష్టత వచ్చింది. దీని ప్రకారం గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది వలసదారులు తమ దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యే వరకు అమెరికాలోనే సురక్షితంగా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఒక్కసారి సీఎం కాదు, డీకేకు తిరుగే లేదు : గురూజీ జోస్యందరఖాస్తుదారుడు అమెరికా వెలుపల ఉండి ప్రక్రియను పూర్తి చేయాలా లేదా అనే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారులు తమ విచక్షణాధికారాల (case-by-case basis) ప్రకారం చాలా కాలంగా నిర్ణయిస్తున్నారు. తాజా మార్గదర్శకాలు కేవలం ఆ పాత అధికారాలను గుర్తుచేసేవే తప్ప కొత్త నిబంధనలు కావనిడీహెచ్ఎస్ ప్రతినిధి తెలిపారు.కాగా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) చేసిన ఒక ప్రకటన వల్ల దరఖాస్తు దారులలో తీవ్ర గందరగోళం నెలకొంది. అసాధారణ మినహాయింపులంటే తప్ప, వారు తమ సొంత దేశాలకు తిరిగి వెళ్లి అక్కడి నుంచే గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉండాలంటూ వెలువడిన వార్త తీవ్ర ఆందోళన రేపింది. -
‘టిప్’ ఇవ్వకపోతే తప్పా?.. ఎక్కడికి దారి తీస్తోంది?
‘టిప్’ అంటే మంచి సేవ చేసిన వ్యక్తికి కృతజ్ఞతగా ఇచ్చే చిన్న బహుమతి. ఇప్పుడు మాత్రం చాలా దేశాల్లో అది ఒక సామాజిక చర్చగా మారింది. రెస్టారెంట్లో భోజనం చేసినా, కాఫీ తాగినా, ఆన్లైన్లో ఆహారం ఆర్డర్ చేసినా, బైక్, క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా.. "టిప్ ఇవ్వాలా?" అనే ప్రశ్న వినియోగదారుల ముందుకు వస్తోంది. డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత ఈ సంస్కృతి మరింత విస్తరించింది. ముఖ్యంగా అమెరికాలో టిప్పింగ్ సంస్కృతి విపరీతంగా పెరగడంతో, అదే ధోరణి ఇతర దేశాలకు కూడా వ్యాపిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.అమెరికాలో పరిస్థితి?అమెరికాలో టిప్ అనేది కేవలం మర్యాద కాదు. అక్కడి సేవారంగ ఉద్యోగుల ఆదాయంలో కీలక భాగం. రెస్టారెంట్లలో 15% నుంచి 20%, కొన్నిసార్లు 25% వరకు కూడా టిప్ ఇవ్వడం సాధారణంగా మారింది. టిప్ ఇవ్వకపోతే అసంతృప్తిగా చూసే పరిస్థితి కూడా కొన్ని చోట్ల కనిపిస్తుంది. బిల్లు చెల్లించేందుకు కార్డు స్వైప్ చేయగానే స్క్రీన్పై మూడు ఎంపికలు కనిపిస్తాయి. 10%, 15%, 20% టిప్.. సేవ ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా, టిప్ ఇవ్వాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోతారు. చుట్టూ కస్టమర్లు చూస్తున్నారు. వెనుక లైన్ పెరుగుతోంది. అతను ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. చివరికి “20%” నొక్కాడు. కాఫీ తీసుకుని బయటకు వచ్చాడు… కానీ మనసులో చిన్న అసంతృప్తి మిగిలింది — “ఇది నిజంగా నా ఇష్టమా? లేక ఒత్తిడా?”. ఈ పరిస్థితి అమెరికాలో సాధారణమైపోయింది. దీనికి ప్రధాన కారణం డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. రెస్టారెంట్లు, కేఫేలు, ఫుడ్ డెలివరీ యాప్లు చెల్లింపు సమయంలో టిప్ ఎంపికను ముందుగానే చూపిస్తున్నాయి. ఫలితంగా, టిప్ ఇవ్వడం ఒక స్వచ్ఛంద చర్య నుంచి సామాజిక ఒత్తిడిగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.అయితే ఇప్పుడు ఈ సంస్కృతి అమెరికా సరిహద్దులు దాటి ఇతర దేశాలకు చేరుకుంటోందని పరిశీలకులు చెబుతున్నారు. పర్యాటక రంగం కూడా ఈ మార్పునకు ఊతమిస్తోంది. అమెరికా నుంచి వచ్చే పర్యాటకులు టిప్పింగ్కు అలవాటు పడినవారే. వారు ఇతర దేశాల్లో కూడా అదే విధానాన్ని అనుసరించడం వల్ల స్థానిక వ్యాపారాలు కూడా టిప్పింగ్ను ప్రోత్సహిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఐస్లాండ్, మెక్సికో వంటి ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. అయితే, ఈ మార్పును అందరూ స్వాగతించడం లేదు. చాలా మంది వినియోగదారులు దీనిని ‘టిప్ఫ్లేషన్’గా అభివర్ణిస్తున్నారు. అంటే, గతంలో అవసరం లేని చోట్ల కూడా ఇప్పుడు టిప్ అడగడం. కాఫీ కొనుగోలు చేసినా, టేక్అవే తీసుకున్నా, కొన్ని చోట్ల స్వయంగా సేవ పొందినా టిప్ కోరడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది.కాగా, భారత్ పరిస్థితి ఇంకా భిన్నంగానే ఉంది. ఇక్కడ టిప్ ఇవ్వడం ప్రధానంగా వ్యక్తిగత నిర్ణయం. మంచి సేవ అందితే కొంత అదనంగా ఇవ్వడం సాధారణం. కానీ అమెరికా తరహాలో టిప్ తప్పనిసరి అన్న భావన ఇంకా విస్తృతంగా లేదు. అయినప్పటికీ, ఫుడ్ డెలివరీ యాప్లు, ఆధునిక రెస్టారెంట్లు, క్యాబ్ బుకింగ్ యాప్స్, డిజిటల్ చెల్లింపు వేదికల ద్వారా టిప్పింగ్ ప్రోత్సాహం పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో టిప్పింగ్ పూర్తిగా అమెరికా మాదిరిగా మారకపోయినా, డిజిటల్ చెల్లింపుల ప్రభావంతో మరింత సాధారణం కావచ్చు. కాగా, ఉద్యోగుల వేతన వ్యవస్థ, స్థానిక సంస్కృతి, వినియోగదారుల అభిరుచులు ప్రతి దేశంలో భిన్నంగా ఉండటంతో అమెరికా మోడల్ను పూర్తిగా అనుసరించే అవకాశం మాత్రం తక్కువగానే కనిపిస్తోంది.యూరప్లో ప్రాధాన్యం లేదుఅమెరికాతో పోలిస్తే యూరప్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ చాలా దేశాల్లో ఉద్యోగులకు స్థిరమైన వేతనాలు లభిస్తాయి. అందువల్ల టిప్ను ఆదాయ వనరుగా కాకుండా, మంచి సేవకు గుర్తింపుగా మాత్రమే చూస్తారు.ఫ్రాన్స్.. ఫ్రాన్స్లో రెస్టారెంట్ బిల్లులోనే సేవా చార్జీ చేర్చడం సాధారణం. అదనంగా టిప్ ఇవ్వడం పూర్తిగా ఐచ్ఛికం.జర్మనీ.. జర్మనీలో బిల్లును సమీప మొత్తానికి రౌండ్ చేసి కొంత అదనంగా ఇవ్వడం మర్యాదగా భావిస్తారు. కానీ అమెరికా తరహా శాతం ఆధారిత టిప్పింగ్ లేదు.ఇటలీ.. చాలా రెస్టారెంట్లలో "కోపెర్టో" లేదా సర్వీస్ ఛార్జీ ముందే ఉంటుంది. కాబట్టి అదనపు టిప్ అవసరం అనేది పెద్దగా ఉండదు.జపాన్.. జపాన్లో టిప్ ఇవ్వడం అవమానంగా భావించే సందర్భాలూ ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన ఉదాహరణ జపాన్. అక్కడ మంచి సేవ అందించడం ఉద్యోగ బాధ్యతగా భావిస్తారు. అందుకే టిప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే కొందరు తిరస్కరించే అవకాశమూ ఉంటుంది. సేవకు అదనపు డబ్బు ఎందుకు? అనే భావన అక్కడ బలంగా ఉంటుంది.దక్షిణ కొరియా, చైనా.. దక్షిణ కొరియా, చైనాలో కూడా సంప్రదాయంగా టిప్పింగ్ సంస్కృతి బలంగా లేదు. అయితే అంతర్జాతీయ హోటళ్లు, పర్యాటక ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి కొంత మారుతోంది.మధ్యప్రాచ్యంలో.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల్లో రెస్టారెంట్ బిల్లులో సేవా రుసుము ఉండొచ్చు. అయినప్పటికీ మంచి సేవకు చిన్న మొత్తంలో టిప్ ఇవ్వడం కనిపిస్తుంది.టిప్పింగ్పై వ్యతిరేకత ఎందుకు?దీనిపై విమర్శకులు మూడు ప్రధాన కారణాలు చెబుతున్నారు.. అవి ఏమిటంటే..ఉద్యోగులకు సరైన జీతాలు చెల్లించే బాధ్యత యజమానులదే కాని వినియోగదారులది కాదని వాదిస్తున్నారు.ప్రతి సేవకు టిప్ అడగడం వినియోగదారులపై అనవసర ఒత్తిడిని పెంచుతోందని అంటున్నారు.టిప్పింగ్ వల్ల ఉద్యోగుల ఆదాయం స్థిరంగా ఉండదని, ఇది అసమానతలను పెంచవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తు ఎలా ఉండొచ్చు?డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న కొద్దీ టిప్ అడిగే అవకాశాలు మరింత పెరగొచ్చు. అయితే అమెరికా మాదిరిగా టిప్పింగ్ను ఆదాయానికి ప్రధాన ఆధారంగా మార్చే దిశగా ప్రపంచం వెళ్తుందా అంటే స్పష్టమైన సమాధానం లేదు. ఎందుకంటే చాలా దేశాలు ఉద్యోగులకు మెరుగైన వేతన వ్యవస్థలను కొనసాగిస్తున్నాయి. అందువల్ల టిప్ అక్కడ ఇంకా కృతజ్ఞతగానే ఉంది. అమెరికాలో మాత్రం అది చాలా సందర్భాల్లో అంచనా వేసే చెల్లింపుగా మారిపోయింది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ ఇదే. టిప్ అనేది అభినందనా? లేక ఉద్యోగుల జీతానికి ప్రత్యామ్నాయమా? ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి దేశం తన సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా వెతుకుతోంది. -
షాకింగ్: అమెరికాను ముందే దెబ్బ కొట్టే వ్యూహమా?
శాటిలైట్కు చిక్కిన ఆ నిర్మాణం.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుతోంది. ఎడారి మధ్యలో కనిపిస్తున్న ఆ నిర్మాణాలు సాధారణ సైనిక బేస్లు కావు… ఉపగ్రహ కళ్లలో అవి ఇప్పుడు ఒక భారీ “అణు కోట వ్యవస్థ”గా మారాయి. అమెరికా మొదట దాడి చేసినా తమ అణు శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేయలేని విధంగా చైనా రూపొందిస్తున్న రహస్య “డిఫెన్స్ వెబ్” అంతర్జాతీయ భద్రతా వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.రాయిటర్స్ పరిశీలించిన తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం, చైనా జిన్జియాంగ్ ఎడారి ప్రాంతంలో తన దీర్ఘశ్రేణి అణు క్షిపణుల (ICBM) చుట్టూ విస్తారమైన మిలిటరీ మౌలిక వసతులను వేగంగా నిర్మిస్తోంది. ఈ నిర్మాణాలు కేవలం రక్షణ కోసం మాత్రమే కాకుండా, ప్రతిదాడి సామర్థ్యాన్ని పెంపొందించేలా రూపొందించినట్లు భద్రతా నిపుణులు భావిస్తున్నారు.జిన్జియాంగ్ ఎడారిలో బయటపడిన ఈ వ్యవస్థలో 80కి పైగా కొత్త లాంచ్ ప్యాడ్లు, భూగర్భ బంకర్లు, కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. ఇవి చైనా అణు వ్యూహంలో కీలక మార్పును సూచిస్తున్నాయి. ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ సైలో ఆధారిత వ్యవస్థను మరింత విస్తరించి, మొబైల్ లాంచ్ సామర్థ్యంతో కలిపిన సమగ్ర రక్షణ–దాడి నెట్వర్క్గా అభివృద్ధి చేస్తున్నారు.అందుకోసమేనా?ఈ పరిణామం అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న అణు పోటీలో కొత్త దశను సూచిస్తోంది. తైవాన్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, చైనా తన “సెకండ్ స్ట్రైక్ కెపబిలిటీ”ను మరింత బలపరచుకుంటోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే, తొలి దాడి జరిగినా తిరిగి ప్రతిదాడి చేయగల సామర్థ్యాన్ని నిలుపుకోవడం.ఇక శాటిలైట్ చిత్రాల్లో వెలుగులోకి వచ్చిన మరో కీలక అంశం జిన్జియాంగ్ ప్రాంతంలోని రెండు భారీ ఆక్టాగాన్ ఆకార సైనిక సముదాయాలు. ఇవి కేవలం బేస్లు మాత్రమే కాకుండా, విస్తృత మిలిటరీ నెట్వర్క్కు కేంద్రాలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీటి చుట్టూ సైనిక వాహనాల శిబిరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఎయిర్బేస్లు, రైల్వే కనెక్టివిటీతో పాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసినట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ మొత్తం నిర్మాణం ఒక క్లిష్టమైన రోడ్డు వ్యవస్థ, భూగర్భ మార్గాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్లతో అనుసంధానమై ఉండటం. ఇది కేవలం ఒక బేస్ కాకుండా, పూర్తి స్థాయి వ్యూహాత్మక యుద్ధ యంత్రాంగంగా రూపుదిద్దుకుంటోందని నిపుణులు చెబుతున్నారు. ఎడారి అంతటా విస్తరించిన ఈ నెట్వర్క్, అవసరమైనప్పుడు వేగంగా కదిలే అణు దళాలకు సహకరించేలా రూపొందించినట్లు భావిస్తున్నారు.అమెరికా డిఫెన్స్ అంచనాల ప్రకారం, చైనా 2030 నాటికి తన అణు సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి సుమారు 1,000 వార్హెడ్లను సిద్ధం చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే వందకు పైగా ఇంటర్కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు (ICBMలు) వివిధ సైలోల్లో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అణు వ్యూహ నిపుణులు ఈ విస్తరణను “అసాధారణం”గా అభివర్ణిస్తున్నారు. ఇంత వేగంగా, ఇంత భారీ స్థాయిలో ఎడారి ప్రాంతంలో మిలిటరీ మౌలిక వసతులు అభివృద్ధి చేయడం ఇదే మొదటిసారి అని వారు చెబుతున్నారు. ఇది చైనా వ్యూహాత్మక అణు సామర్థ్యాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లే పరిణామమని అంచనా వేస్తున్నారు.ప్రపంచ భద్రతా దృష్టిలో చూస్తే, ఈ పరిణామం కొత్త ఒత్తిడిని తీసుకువస్తోంది. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలతో పోలిస్తే చైనా ఇప్పుడు తన అణు వ్యూహాన్ని మరింత విస్తృతంగా, రహస్యంగా, బలంగా రూపుదిద్దుకుంటోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది భవిష్యత్లో ప్రపంచ అణు సమతుల్యతను మార్చే కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. -
అమెరికాకు ఎదురుదెబ్బ..? మరోసారి డ్రోన్లు కూల్చిన ఇరాన్
-
ట్రంప్వి బిల్డప్ బాబాయ్ మాటలే..!
‘అన్నీ సెట్ అయిపోయాయి.. నౌకలు ఇంటికి వెళ్లొచ్చు’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇరాన్తో ఒప్పందం దాదాపు ఖరారైందన్న సంకేతాలతో అంతర్జాతీయ వర్గాలు ఊరట చెందాయి. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ వెంటనే కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన కీలక అంశాల్లో చాలా వరకు ముసాయిదా ఒప్పందంలోనే లేవని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచాన్ని ఊరించిన ట్రంప్ ప్రకటన అంతా బిల్డప్పేనా? అనే చర్చ జోరుందుకుంది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేసిన ఆయన, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవాలని పేర్కొన్నారు. జలసంధిలో ఏర్పాటు చేసిన సముద్ర మైన్లను వెంటనే నిర్వీర్యం చేయాలని, అక్కడ నిలిచిపోయిన నౌకలు మళ్లీ ప్రయాణాలు ప్రారంభించవచ్చని తెలిపారు."హర్ముజ్లో చిక్కుకుపోయిన నౌకలు ఇప్పుడు ఇంటివైపు ప్రయాణం ప్రారంభించవచ్చు. మీ భార్యలకు, భర్తలకు, కుటుంబ సభ్యులకు నా తరఫున హలో చెప్పండి" అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అలాగే అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తున్నామని కూడా ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్న యురేనియం నిల్వలను అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి పర్యవేక్షణ సంస్థ సమన్వయంతో వెలికితీసి పూర్తిగా ధ్వంసం చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. యుద్ధ పరిహారం, పెట్టుబడులు లేదంటే ఇతర రూపాల్లో ఇప్పట్లో ఎలాంటి నిధుల మార్పిడి ఉండదని, తదుపరి ప్రకటన వచ్చే వరకు డబ్బు చెల్లింపులు నిలిపివేస్తామని స్పష్టం చేశారు. అయితే తక్కువ ప్రాముఖ్యత కలిగిన కొన్ని అంశాలపై మాత్రమే ఇప్పటివరకు అంగీకారం కుదిరిందని కూడా వెల్లడించారు.అయితే ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్కు చెందిన ఫార్స్ వార్తా సంస్థ కథనం ప్రకారం, ట్రంప్ చెప్పిన అంశాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించడం లేదని పేర్కొంది. హర్ముజ్ జలసంధిని తెరవడం జరిగితే అది పూర్తిగా ఇరాన్ నిబంధనల ప్రకారమే ఉంటుందని స్పష్టం చేసింది. నౌకల తనిఖీలు, భద్రతా చర్యలు, సముద్ర సేవలు కొనసాగుతాయని, ఎలాంటి షరతులు లేకుండా జలసంధిని తెరవడానికి తాము అంగీకరించలేదని వెల్లడించింది.అలాగే ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేయడం, అణు కార్యక్రమాన్ని పూర్తిగా విరమించుకోవడం వంటి నిబంధనలు చర్చల్లో ఉన్న ముసాయిదా ఒప్పందంలో అసలు లేవని పేర్కొంది. ట్రంప్ చేసిన ఆ ప్రకటనలకు ఎలాంటి ఆధారమూ లేదని స్పష్టం చేసింది.ఇరాన్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రస్తుతం చర్చల్లో అత్యంత కీలక అంశం విదేశాల్లో స్తంభింపజేసిన 12 బిలియన్ డాలర్ల ఇరానీ నిధుల విడుదల. ఆ నిధులు విడుదలైన తర్వాతే తదుపరి దశ చర్చలకు వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే లెబనాన్లో పూర్తి కాల్పుల విరమణ కూడా చర్చల్లో ప్రధాన అంశంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో అమెరికా–ఇరాన్ మధ్య ఒప్పందం నిజంగా ఎంత దూరం వెళ్లిందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒకవైపు ఒప్పందం దాదాపు పూర్తైందని ట్రంప్ చెబుతుండగా, మరోవైపు అలాంటి అంగీకారాలు ఏవీ జరగలేదని ఇరాన్ వాదిస్తోంది. ఈ పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య అసలు నిజం ఏమిటన్నది తేలాలంటే తుది ఒప్పందం వెలుగులోకి రావాల్సిందే. ప్రస్తుతం మాత్రం ప్రపంచ దృష్టి మొత్తం వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య జరుగుతున్న ఈ దౌత్య పోరుపైనే కేంద్రీకృతమైంది. -
రికార్డు సృష్టించనున్న ట్రంప్.. నోట్లపై
వాషింగ్టన్ డీసీ: డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత పలు వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి నిర్ణయమే తీసుకోనున్నారు. అమెరికా $250 నోటుపై ట్రంప్ చిత్రం ముద్రించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాలో కరెన్సీ నోట్లపై జీవించి ఉన్న వ్యక్తి చిత్రాన్ని ముద్రించడాన్ని నిషేధించే నిబంధన ఉంది. అయితే ట్రంప్ ప్రభుత్వం ఆ నిబంధనను మార్చే యత్నం చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని కలిగిన 250 డాలర్ల నోటును జారీ చేయడానికి అక్కడి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభం చేసింది. ఒకవేళ ఈ చట్టం ఆమోదం పొందితే కొత్త నోటును ముద్రించడం ప్రారంభం అవుతుంది. ఒకవేళ ఇదే ఆమోదం పొందితే 50 ఏళ్లకు పైగా కాలంలో అమెరికా నోటుపై కనిపించిన తొలి సజీవ వ్యక్తి ట్రంప్ అవుతారు.2026లో యునైటెడ్ స్టేట్స్ తన 250వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుందని ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ సాధించిన విజయాలను సూచిస్తూ ఈ నోటును జారీ చేస్తామని తెలిపారు. కాగా ఈ నోటు ప్రాథమిక డిజైన్ను చూసిన డొనాల్డ్ ట్రంప్ స్వయంగా చూసి, దానికి కొన్ని మార్పులు సూచించారని అక్కడి అధికారులు పేర్కొన్నారు.160 ఏళ్ల చట్టం మార్చాలి 1866లో కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం, కేవలం మరణించిన ప్రముఖుల ఫోటోలను మాత్రమే డాలర్లపై ముద్రిస్తారు. జీవించి ఉన్న ఏ వ్యక్తి ఫోటోను కూడా కరెన్సీ నోట్లపై ముద్రించకూడదు. ఒకవేళ అలా చేయాలంటే ఈ నిబంధనను ఖచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. దీంతో ట్రంప్ ఫోటో వేయడానికి వీలుగా చట్టాన్ని సవరించాలంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులు ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే, ప్రతిపక్ష డెమొక్రాట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.కాగా అమెరికా కరెన్సీ చరిత్రలో మొదటిసారిగా ఒక అధ్యక్షుడి పదవికాలంలోనే తన సంతకం నోట్లపై రాబోతోంది. $100 నోట్లతో పాటు ఇతర డాలర్ నోట్లపై డోనాల్డ్ ట్రంప్ సంతకాన్ని ముద్రించడానికి ట్రెజరీ శాఖ అనుమతించింది. ఈ నోట్ల ముద్రణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. -
అమెరికా ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత
టెహ్రాన్/దుబాయ్: ఇరాన్పై యుద్ధంలో అమెరికా భారీగా నష్టపోతోంది. ఇరాన్ సైన్యం దాడుల్లో అత్యంత విలువైన యుద్ధ విమానాలు, డ్రోన్లు నేలమట్టమవుతున్నాయి. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ను ధ్వంసం చేశామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవలే హార్మూజ్ జలసంధి సమీపంలో ఖేష్మ్ దీవి వద్ద ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఇందుకోసం కొత్తగా అభివృద్ధి చేసిన గగనతల రక్షణ వ్యవస్థ ‘అరాశ్–ఇ–కమాంగీర్’ను ఉపయోగించినట్లు పేర్కొంది. ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ విలువ 30 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇరాన్ సైనిక సామర్థ్యం ఇంకా తగ్గిపోలేదని చెప్పడానికి ఎంక్యూ–9 రీపర్ డ్రోన్ కూల్చివేత ఒక ఉదాహరణ అని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను ఇకపైనా సవాలు చేసే స్థితిలో ఇరాన్ ఉందని అంటున్నారు. ఇరాన్ సైన్యం స్థానికంగానే నూతన గగనతల రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. ఆత్మరక్షణ కోసమే దాడులు చేయాల్సి వస్తోందని అమెరికా చెబుతోంది. ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా డ్రోన్ను హార్మూజ్ జలసంధి సమీపంలో కూల్చివేయడం చూస్తే పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారుతుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అరాశ్ ద ఆర్చర్ అరాశ్–ఇ–కమాంగీర్ అనేది ఇరాన్ గగనతలం, సముద్ర సరిహద్దుల సమీపంలో ఉన్న శత్రు గూఢచార డ్రోన్లను అడ్డగించగల, కూల్చివేయగల ఒక స్టెల్త్–డిటెక్షన్ వ్యవస్థ. అరాశ్–ఇ–కమాంగిర్ అనే పేరుకు ఒక ప్రత్యేకత ఉంది. పర్షియన్ పురాణాల్లోని ‘అరాశ్ ద ఆర్చర్’ ఒక మహాయోధుడు. విదేశీ దండయాత్రల నుంచి ఇరాన్ను రక్షించినందుకు చాలా ప్రసిద్ధి చెందాడు. ఇరాన్ జానపద కథల ప్రకారం చూస్తే.. అరాశ్ తన ప్రాణాలను పణంగా పెట్టి విసిరిన బాణం ద్వారా ఇరాన్, మధ్య ఆసియా మధ్య సరిహద్దు ఏర్పడింది. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ తన సైనిక సామర్థ్యం పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్థిర రాడార్ వ్యవస్థలపై ఆధారపడకుండా.. శత్రుదేశాల డ్రోన్లు, విమానాలను లక్ష్యంగా చేసుకునేలా తక్కువ ఖర్చుతో కూడిన గగనతల రక్షణ వ్యవస్థల తయారీలో పెట్టుబడులను క్రమంగా పెంచుతోంది. వివిధ రకాల క్షిపణుల రూపకల్పనలో ఇరాన్ చాలావరకు స్వయం సమృద్ధి సాధించింది. చౌకైన, సరళమైన ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేస్తోంది. ఇవి ఖరీదైన అమెరికా యుద్ధవిమానాలను, డ్రోన్లను సులువుగా దెబ్బతీస్తున్నాయి. ఫైటర్ జెట్నూ కూల్చేశాంఅమెరికాకు చెందిన ఒక యుద్ధ విమానాన్ని ఇరాన్ సైన్యం కూల్చివేసినట్లు ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. శుక్రవారం ఉదయం బషెహర్ ప్రావిన్స్లోని జామ్ గవర్నరేట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అమెరికా ఫైటర్ జెట్ను ఇరాన్ సేనలు నేలమట్టం చేసినట్లు స్థానిక గవర్నర్ మసూద్ టాంగెస్తానీ చెప్పారని వెల్లడించింది. ఈ దాడిలో ప్రాణనష్టం జరిగిందా? అనేది ఇంకా తెలియరాలేదు. యుద్ధ విమానం మంటల్లో చిక్కుకొని కూలిపోతున్న ఓ ఫొటోను ఇరాన్ సైన్యం ‘ఎక్స్’లో షేర్ చేసింది. అయితే, అమెరికా ఫైటర్ జెట్ను కూల్చేశామంటూ ఇరాన్ చేసి ప్రకటనను అమెరికా సైన్యం ఖండించింది. అలాంటి దాడి ఏదీ జరగలేదని తేల్చిచెప్పింది. ‘మేము ఒక్క యుద్ధ విమానం కూడా నష్టపోలేదు’ అని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. -
అక్కడ తిప్పలు ఇక్కడ అప్పులు!
డబ్బులన్నీ ఫీజులకే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి సుమిత్ వేల్పుల ‘సాక్షి’తో మాట్లాడుతూ ఎంఎస్ కోసం అమెరికా వచ్చిన తనకు రూపాయి పతనంతో ఏటా రూ.5 లక్షల అదనపు భారం పడుతోందని చెప్పాడు. డబ్బులన్నీ ట్యూషన్ ఫీజుకే పోతున్నాయని తెలిపాడు. అమ్మ గొలుసు అమ్మి యూఎస్ వచ్చానని, కూలీ పనికి వెళ్లే అమ్మ, చిరుద్యోగి నాన్నను డబ్బులు అడగలేక కొన్నిసార్లు పస్తులు ఉంటున్నట్టు చెప్పాడు. పార్ట్టైమ్ ఉద్యోగం దొంగచాటుగా చేస్తూ బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నానని కన్నీరు మున్నీరయ్యాడు. .ఒక్క పూటే తింటూ.. ఖమ్మంకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నవనీత్ వర్మ తన కొడుకును అమెరికా పంపారు. ఇందుకోసం రూ.35 లక్షల అప్పు చేశారు. జీతంలో 80% ఈ అప్పు కింద వడ్డీకే కడుతున్నారు. ఈ క్రమంలో భార్యకు గుండెపోటు వస్తే ఇల్లు తాకట్టు పెట్టి మళ్లీ అప్పు చేశారు. అమెరికాలో చదువుతున్న కొడుకు ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఒక్క పూటే తింటున్నాడని తెలిసి నవనీత్ తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. కొడుకు డబ్బులు పంపమని అడగలేక అడిగిన తీరు గుర్తు చేసుకుంటూ బావురుమన్నారు.సాక్షి, హైదరాబాద్: అమెరికా విద్య విద్యార్థులను హడలెత్తిస్తోంది. భవిష్యత్తుపై ఎన్నో కలలతో ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాలనుకునే వారిని, ఇప్పటికే అక్కడ ఉండి చదువును కొనసాగిస్తున్న వారిని ప్రస్తుత పరిస్థితులు బెంబేలెత్తిస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతలు..డాలర్ దూకుడు.. రూపాయి పతనం.. తల్లిదండ్రులు, విద్యార్థులకు శాపంగా మారాయి. పెరిగిన ఖర్చులు గుండె దడ పుట్టిస్తున్నాయి. అమెరికా వెళ్లాలంటే వీసా నిబంధనలు చుక్కలు చూపిస్తున్నాయి. స్లాట్ దొరకడమే కష్టంగా ఉంటే, వీసా రావడం దైవాధీనంగా మారింది.మరోవైపు యూఎస్లో విద్యార్థులు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ట్రంప్ ప్రభుత్వ నిబంధనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు పరిస్థితి ఎలా మారుతుందోననే ఆందోళన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే అవకాశం లేక, యూఎస్ విద్య కోసం చేసిన అప్పులు గుదిబండగా మారడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల తిప్పలు వర్ణనాతీతం. పిల్లలు తినీ తినకా..ఫీజులు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు కావాలని అడుగుతుంటే వారి గుండె తరుక్కుపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికా వెళ్లిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొందరితో ‘సాక్షి’ మాట్లాడింది. ఎవర్ని కదిలించినా.. కన్నీటి కథలు.. గుండెల్ని పిండే వ్యథలే.. డాలర్ కరాళ నృత్యం అమెరికా చదువు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి అప్పులు చేసిన విద్యార్థుల ఆర్థిక ప్రణాళిక పూర్తిగా మారిపోయింది. ఏడాది క్రితం వరకూ రూపాయి తో పోలిస్తే డాలర్ విలువ రూ.83. ప్రస్తుతం ఇది రూ. 96కు చేరింది. పశ్చిమాసియా ఉద్రిక్తతలు దీనికి కారణం కాగా.. ఇది విద్యార్థులపై భారాన్ని పెంచింది. యూనివర్సిటీని బట్టి ఫీజులుంటాయి. వర్సిటీల ట్యూషన్ ఫీజు 30 వేల నుంచి 32 వేల డాలర్ల వరకూ ఉంటుంది. ఒక్కో విద్యార్థికి రూ.35 లక్షల నుంచి 50 లక్షల వరకూ ఖర్చవుతుంది.రూపాయి పతనంతో ఫీజు 35 వేల నుంచి 40 వేల డాలర్లకు చేరింది. హాస్టల్, ఇన్సూరెన్స్, ప్రయాణ ఖర్చులు అదనం. ఫీజుతో పాటు ఇప్పుడీ ఖర్చులన్నీ పెరిగాయి. భారతీయ విద్యార్థులపై ఈ ఏడాది రూ.5 లక్షల నుంచి 8 లక్షల అదనపు భారం పడిందని, బ్యాంకు రుణం కాకుండా మరో రూ.20 లక్షలు అప్పు చేయాల్సి వచ్చిందని ఇటీవల యూఎస్ వెళ్ళిన ఖమ్మం విద్యార్థిని మాధవి తండ్రి ప్రణబ్ తెలిపారు. ప్రతి నెలా అప్పుపై వడ్డీకే రూ.30 వేలు కడుతున్నట్టు వాపోయారు. టెన్షన్ పుట్టిస్తున్న వీసాలు వీసా ఫీజు గతంలో 160 డాలర్లు ఉండేది. ఇప్పుడది 180 డాలర్లు అయ్యింది. బయోమెట్రిక్, డాక్యుమెంటేషన్ ధ్రువీకరణ.. ఇలా వీసా ఖర్చు అమాంతం పెరిగింది. మన దేశం నుంచి ఏటా సగటున 7 లక్షల మంది విదేశీ విద్య కోసం వెళ్తారు. ఇందులో 3 లక్షల మంది అమెరికాకే వెళ్తున్నారు. అమెరికా వర్సిటీల్లో రెండు దశల్లో ప్రవేశాలు చేపడతారు. ఫాల్ సెమిస్టర్గా భావించే మే, జూన్ నెలలు కీలకం. ఆరు నెలల ముందు నుంచే విద్యార్థులు దీనికోసం ప్రణాళిక రూపొందించుకుంటారు. ప్రవేశాలను ఖరారు చేసుకుని వీసాలకు దరఖాస్తు చేసుకుంటారు. అయితే యూఎస్ ఈ ఏడాది 38 శాతం వీసాలకు కోత పెట్టింది. కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.విద్యార్థి ఆర్థిక పరమైన లావాదేవీలను నిశితంగా పరిశీలించాలని యూఎస్ కాన్సులేట్ను ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో విద్యార్థి చేసిన పోస్టులనూ వెతకాలని, ఎవరెవరితో లింక్లున్నాయి? యూఎస్లో ఉండే వారితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు? ఇలాంటివన్నీ శోధించాలని పేర్కొంది. దీంతో వీసాలకు అలస్యమవుతోంది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై ఎక్కడ స్టాట్ వస్తుందో తెలియని పరిస్థితి. స్లాట్ వచ్చినా వీసా గ్యారంటీ ఉండటం లేదు. గడచిన 3 నెలలుగా 120 మంది తెలుగు విద్యార్థుల వీసాలను చిన్న కారణాలతో నిలిపివేశారు.‘యూఎస్లో ఓ స్నేహితుడితో చాట్ చేశాను. అతని బ్యాక్ గ్రౌండ్ సరిగా లేదని వీసా ఆపేశారు..’ అని నెల్లూరుకు చెందిన ప్రభాకర్ మిన్నకంటి వాపోయాడు. బ్యాంకు స్టేట్మెంట్లో లావాదేవీలపై బ్యాంకు నుంచి వివరణ రాలేదని వీసా ఇవ్వలేదని వరంగల్కు చెందిన శ్రీకాంత్ మండేపూడి చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాల్లో ఎంఎస్ చేయడంపై విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. కెనడా, ఆ్రస్టేలియా, జర్మనీ, ఐర్లాండ్ వంటి దేశాలపై దృష్టి పెడుతున్నారు. -
స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ విజేత శ్రేయ్ పారిఖ్
వాషింగ్టన్: అమెరికాలో ప్రతిష్టాత్మక స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీలో 14 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్థి శ్రేయ్ పారిఖ్ విజేతగా నిలిచాడు. 35 పదాలకు గాను 32 పదాల అక్షరక్రమాన్ని కేవలం 90 సెకెండ్లలో సరిగ్గా చెప్పి ఆశ్చర్యపర్చాడు. శుక్రవారం వాషింగ్టన్లో ఈ పోటీ జరిగింది. శ్రేయ్ కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తోంది. డే క్రీక్ ఇంటరీ్మడియెట్ స్కూల్లో ఎనిమిదో గ్రేడ్ చదువుతున్నాడు. బ్రోమోక్రిప్టైన్ అనే పదానికి సరైన స్పెల్లింగ్ చెప్పడం ద్వారా 12 ఏళ్ల ఇషాన్ గుప్తాను ఓడించి, విజయం సొంతం చేసుకున్నాడు. న్యూజెర్సీలోని జెర్సీ సిటీలో ఏడో గ్రేడ్ చదువుతున్న ఇషాన్ గుప్తా రెండో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 12 ఏళ్ల సర్వ్ ధరవణే మూడో స్థానంలో నిలిచాడు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులు భారత సంతతికి చెందినవారే. అగ్రస్థానంలో నిలిచిన శ్రేయ్ పారిఖ్కు 50,000 డాలర్ల నగదు బహుమతి, స్మారక్ పతకం, స్క్రిప్స్ కప్, మెరియం–వెబ్స్టర్ డిక్షనరీ నుంచి 2,500 డాలర్లు, డెల్టా సంస్థ నుంచి 1,000 డాలర్ల ఫ్లైట్ క్రెడిట్స్, ఎన్సైక్లోపిడియా బ్రిటానికా నుంచి 400 డాలర్లు బహుమతిగా లభించాయి. ఇషాన్ గుప్తాకు 25,000 నగదు, సర్వ్ ధరవణేకు 15,000 డాలర్ల నగదు బహుమతిగా దక్కింది. 90 సెకండ్లలో వీలైనన్ని ఎక్కువ ఆంగ్ల పదాలకు అక్షరక్రమం సరిగ్గా చెప్పినవారే విజేతగా నిలుస్తారు. 2024లో బృహత్ సోమ అనే విద్యార్థి సృష్టించిన రికార్డును శ్రేయ్ పారిఖ్ అధిగమించాడు. బృహత్ సోమ 90 సెకండ్లలో 30 పదాలకు గాను 29 పదాలకు సరైన స్పెల్లింగ్ చెప్పాడు. ప్రతిరోజూ వేగంగా స్పెల్లింగ్ సాధన చేస్తుంటానని శ్రేయ్ పారిఖ్ తెలియజేశాడు. భారతదేశం అంటే చాలా ఇష్టం స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ మూడు రోజులపాటు జరిగింది. అమెరికాలోని 50 రాష్ట్రాలకు చెందిన విద్యార్థులతోపాటు బహమాస్, కెనడా, ఘన, నైజీరియా, యూఏఈ తదితర దేశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు. మొత్తం 247 మంద పోటీపడ్డారు. 9 మంది ఫైనల్కు చేరుకున్నారు. శ్రేయ్ పారిఖ్ 2022లో స్క్రిప్స్ స్పెల్లింగ్ బీలో 89వ స్థానం, 2024లో మూడోస్థానంలో నిలిచాడు. అతడు బహుముఖ ప్రజ్ఞాశాలి. టెన్నిస్, చెస్తోపాటు సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. గణిత శాస్త్రంలో ప్రతిభ చూపుతున్నాడు. గణిత పోటీల్లో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. తన అమ్మమ్మ తాతయ్య, బంధువులు ఉన్న భారత్ అంటే చాలా ఇష్టం. సెలవుల్లో భారత్కు వెళ్తుంటాడు. ఎప్పుడైన ఖాళీ టైమ్ దొరికితే కొత్తకొత్త లెక్కలు సాధన చేస్తుంటాడు. పుస్తకాలు బాగా చదువుతాడు. సమయం వృథా చేయడం ఇష్టం ఉండదని చెబుతున్నాడు.భారత మూలాలున్న విద్యార్థుల హవా ఇక స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ పోటీకి పెద్ద చరిత్రే ఉంది. 1925లో మొదటి కాంపిటీషన్ జరిగింది. ఇందులో పాల్గొనాలంటే 15 ఏళ్ల వయసు మించకూడదు. ఎనిమిదో గ్రేడ్ లోపే చదువుతూ ఉండాలి. స్క్రిప్స్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లో నెగ్గిన తొలి భారతీయ అమెరికన్ విద్యార్థిగా బాలు నటరాజన్ రికార్డు సృష్టించాడు. 1985లో ఈ ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ పోటీలో ముఖ్యంగా భారతీయ అమెరికన్ విద్యార్థులే పైచేయి సాధిస్తుండడం విశేషం. ఈ ఏడాది ఫైనల్కు చేరిన తొమ్మిది మందిలో ఐదుగురు భారత సంతతి విద్యార్థులే కావడం గమనార్హం. -
ఇరాన్ రహస్య అస్త్రం.. అసలేంటి ఆరాష్-ఎ-కమాంగిర్?
టెహ్రాన్: హార్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన 'MQ-9 రీపర్' డ్రోన్ను కూల్చివేయడానికి తాము సరికొత్త వైమానిక రక్షణ వ్యవస్థను (air defence system) ఉపయోగించినట్లు ఇరాన్ పేర్కొంది. ఒక్కో యూనిట్కు 16 మిలియన్ డాలర్ల నుండి 30 మిలియన్ డాలర్ల వరకు ఖర్చయ్యే అమెరికా డ్రోన్ను, హార్ముజ్ జలసంధిలోని 'ఖేష్మ్' (Qeshm) ద్వీపం సమీపంలో.. స్థానికంగా అభివృద్ధి చేసిన 'ఆరాష్-ఎ-కమాంగిర్' (Arash-e-Kamangir) అనే వ్యవస్థను ఉపయోగించి కూల్చివేసినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా తెలిపింది.ఒకవేళ ఇదే నిజమైతే, ఇరాన్ పురాణాలలోని వీరుడు ఆరాష్-ది-ఆర్చర్ (విలుకాడు) పేరు మీదుగా నామకరణం చేసిన ఈ అరాష్ గగనతల రక్షణ వ్యవస్థను యుద్ధంలో ఉపయోగించడం ఇదే మొదటిసారి అవుతుంది. ఈ సాంకేతికపై ఇరాన్ ప్రభుత్వం, ఐఆర్జీసీ నుంచి అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. మధ్యప్రాచ్యంలో నెలల తరబడి యుద్ధం జరుగుతున్నప్పటికీ, అమెరికా-ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టడానికి అవసరమైన సైనిక సామర్థ్యాన్ని టెహ్రాన్ ఇంకా నిలుపుకుందనే విషయం స్పష్టమవుతోంది.ఇరాన్ చేస్తున్న ఈ ప్రకటనను జాగ్రత్తగా పరిశీలించాలని నిపుణులు భావిస్తున్నారు. స్వతంత్రంగా ధృవీకరించడానికి వీలుపడని సైనిక పురోగతిని ప్రచారం చేసుకోవడం ఇరాన్ అధికారులకు అలవాటే అయినప్పటికీ.. ఈ క్లెయిమ్ వెనుక ఉన్న విస్తృత ఆలోచన మాత్రం నమ్మదగినదిగానే ఉందని వారు పేర్కొన్నారు. ఎందుకంటే, సులభంగా గుర్తింపునకు గురయ్యే పెద్ద పెద్ద స్థిర రేడార్ సైట్లపై ఆధారపడకుండా.. డ్రోన్లు, విమానాలను ముప్పునకు గురిచేసే చౌకైన, మొబైల్, స్వదేశీ రక్షణ వ్యవస్థలపై టెహ్రాన్ భారీగా పెట్టుబడి పెడుతోంది.కింగ్స్ కాలేజ్ లండన్లోని స్కూల్ ఆఫ్ సెక్యూరిటీ స్టడీస్ సీనియర్ లెక్చరర్ మార్క్ హిల్బోర్న్ అల్ జజీరాతో మాట్లాడుతూ.. వివిధ రకాల క్షిపణి రూపకల్పనలో ఇరాన్ స్వయం సమృద్ధి సాధించిందని, ఉక్రెయిన్ మాదిరిగానే యుద్ధ ఆర్థిక శాస్త్రాన్ని మార్చడంలో ఇరాన్ చాలా తెలివిగా వ్యవహరించిందని చెప్పారు. తక్కువ బడ్జెట్లో ఇరాన్ అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తి శక్తి సామర్థ్యాలు పూర్తిగా వెలుగులోకి రాలేదు.ఆరాష్-ఎ-కమాంగిర్ అనేది ఒక విప్లవాత్మకమైన కొత్త ఆయుధమేమీ కాకపోవచ్చని.. కానీ మొబైల్ మరియు తక్కువ ఖర్చుతో కూడిన వైమానిక రక్షణను విస్తృతం చేయడంలో ఇరాన్ సాధించిన మరో అడుగు మాత్రమేనని విశ్లేషకులు చెబుతున్నారు. సాంప్రదాయ వైమానిక రక్షణ నెట్వర్క్లు రేడార్లు, లాంచ్ బ్యాటరీలపై ఆధారపడతాయి. వాటిని గుర్తించడం చాలా సులువు. కానీ వీటికి భిన్నంగా. ఈ చిన్న, చౌకైన ప్రత్యామ్నాయాలను సులభంగా తరలించవచ్చు.. దాచవచ్చు.. వేగంగా ప్రయోగించవచ్చు. సులభంగా భర్తీ చేయవచ్చని పేర్కొన్నారు.ఈ కొత్త ఇంటర్సెప్టర్ వ్యవస్థకు పర్షియన్ పురాణాల వీరుడి పేరు పెట్టారు. జానపద కథల ప్రకారం.. ఆరాష్-ఎ-కమాంగిర్ అనే ఓ యోధుడు పశ్చిమ దేశాల ప్రభావం ఇరాన్పై పడకుండా ఆయన పోరాడినట్లు చెబుతారు. ఈ క్రమంలోనే ఆయన ఇరాన్-మధ్య ఆసియా మధ్య సరిహద్దును గీయడానికి ఒక బాణాన్ని సంధించాడు. ఆ వీరుడు పేరు మీదుగానే ఇరాన్ తమ సరికొత్త గగనతల రక్షణ వ్యవస్థకు ఆరాష్-ఎ-కమాంగిర్ అని పేరు పెట్టింది. -
ప్రమాదంలో ఇండియా రూపాయి పతనంపై మోడీ కంటే ముందే ఊహించిన భారతీయ రైతు..
-
అమెరికా 'స్పెల్లింగ్ బీ' విజేతగా భారత సంతతి విద్యార్థి
అమెరికాలో నిర్వహించిన స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో భారత సంతతి విద్యార్థి శ్రేయో పారిఖ్ విజేతగా నిలిచాడు. కాలిఫోర్నియాలోని రాంచో కుకామోంగాకు చెందిన ఈ 14 ఏళ్ల బాలుడు, గురువారం రాత్రి జరిగిన ఫైనల్లో తన అపార ప్రతిభ ప్రదర్శనతో టైటిల్ను కైవసం చేసుకున్నాడు. శ్రేయ్ మొత్తం 90-సెకన్ల స్పెల్-ఆఫ్ రౌండ్లో అంచనాలకు తగ్గట్టుగా మొత్తం 32 పదాలను సరిగ్గా పలికి విజయం దక్కించుకున్నాడు. ఈ గెలుపుతో సుమారు రూ. 48 లక్షల నగదు, పతకం, స్క్రిప్స్ కప్, మెరియం వెబ్స్టర్ నుంచి రూ. 24 లక్షల నగదుర, డెల్టా నుంచి రూ. 96 వేలు విలువ చేసే ఫ్లైట్ క్రెడిట్లు, ఎన్సైక్లోపిడియా బ్రిటానికా నుంచి రూ. 38 వేలు విలువ చేసే వర్క్స్ శ్రేయ్కు లభించనున్నాయి. గతంలో 2024 పోటీల్లో మూడోస్థానంలో నిలవడగా..తాజా పోటీల్లో విజేతగా నిలిచి ట్రోపీ దక్కించుకున్నాడు. ఇక శ్రేయ్కు టెన్నిస్, రీడింగ్, గణితం, చెస్ వంటివి అతడి అభిరుచులు. చివరగా తనకు ఎక్కువగా భారత్లోని తాతయ్య నానమ్మల వద్ద గడపడం అంటే మహా ఇష్టం అని చెబుతున్నాడు. (చదవండి: నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!) -
మెగా డీల్: ఇరాన్కు అమెరికా బంపరాఫర్!
మిడిల్ఈస్ట్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరదించుతూ అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. హర్ముజ్ జలసంధి, ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అణు ఒప్పందం వంటి సున్నిత అంశాలపై చర్చలు ఓ కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అయితే “మెగా డీల్”లో భాగంగా ఇరాన్కు అమెరికా భారీ ఆర్థిక, వ్యూహాత్మక ఆఫర్లు ఇచ్చినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య గత కొన్ని వారాలుగా సాగుతున్న చర్చలు ఇప్పుడు ఒక తాత్కాలిక అంగీకారం (MoU) దశకు చేరుకున్నట్లు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. ఈ అంగీకారం అమలైతే రెండు దేశాల మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ కొనసాగుతూ, ప్రధాన అంశాలపై విస్తృత చర్చలు జరగనున్నాయి. ఇక చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం కీలక అంశంగా ఉంది. ఇరాన్ వద్ద ఉన్న అధికంగా శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై నియంత్రణలు విధించడం, భవిష్యత్తులో అణ్వాయుధాల అభివృద్ధి చేయబోమని హామీ ఇవ్వడం వంటి అంశాలు ఈ ఒప్పందంలో ఉన్నాయి.ఇక మరో కీలక అంశం హర్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన ఈ మార్గాన్ని పూర్తిగా తెరవడం, మైన్స్ తొలగించడం, నౌకా రవాణాపై ఆంక్షలు తగ్గించడం వంటి ప్రతిపాదనలు చర్చలో ఉన్నాయి. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన నావికా ఆంక్షలను దశలవారీగా తగ్గించే అవకాశం ఉందని సమాచారం. అదే సమయంలో.. ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశాల్లో నిలిచిపోయిన బిలియన్ల డాలర్ల ఆస్తుల విడుదలపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్కు మానవతా సహాయం అందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా ముందుకు వచ్చింది. ఈ డీల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది 300 బిలియన్ డాలర్ల విలువైన “పునర్నిర్మాణ పెట్టుబడి నిధి”. ఒప్పందం తుది దశకు చేరుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగపడతాయని చెబుతున్నారు. అంతేకాదు, అమెరికా కంపెనీలు కూడా ఇరాన్లో పెట్టుబడులు పెట్టే అవకాశం కల్పించాలన్న ఆలోచన కూడా ఉంది.అయితే ఈ ఫైల్ ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ మీదే ఉందని.. ఆ ప్రతిపాదనకు ఇంకా ఆయన ఓకే చెప్పలేదని సమాచారం. అలాగే ఇరు దేశాల నుంచి సానుకూలత ఉందా? అనేదానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే ఒప్పందంలో కొన్ని అంశాలపై అమెరికా, ఇరాన్ మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఒప్పందం ఎప్పుడు తుది రూపం దాల్చుతుందో స్పష్టత లేకపోయినా.. రెండు దేశాల మధ్య చర్చలు మాత్రం వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తంగా చూస్తే, శత్రుత్వం నుంచి శాంతి దిశగా ఒక పెద్ద మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తున్న ఈ డీల్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. -
ట్రంప్ ఏం చెబుతాడో?.. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ
మూడు నెలలుగా పశ్చిమాసియాను అగ్నికుండంలా మార్చిన అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలకు ముగింపు దగ్గరపడిందా? ప్రపంచాన్ని వణికించిన యుద్ధ మేఘాల మధ్య ఇప్పుడో ఆశాకిరణం కనిపిస్తోంది. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన కుదిరిందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అయితే ఈ ఒప్పందానికి అసలైన గ్రీన్సిగ్నల్ ఇంకా రావాల్సి ఉండటంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు వైట్హౌస్పైనే నిలిచింది.అమెరికా, ఇరాన్ ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం (MoU)పై ప్రధాన అంశాల్లో ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే కాల్పుల విరమణ కొనసాగడమే కాకుండా ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాల దిశగా వెళ్లబోదని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఈ చర్చల్లో అత్యంత కీలక అంశంగా హర్ముజ్ జలసంధి మారింది. ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతించాలనే ప్రతిపాదనపై చర్చలు జరిగినట్లు సమాచారం. ఇందుకోసం ఇరాన్ సీమైన్లను (సముద్రంలో అమర్చిన బాంబులను) తొలగించడం, వాణిజ్య నౌకలపై జోక్యం చేసుకోకపోవడం వంటి షరతులు ఉండొచ్చని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దానికి ప్రతిగా అమెరికా తన నౌకాదళ నిర్బంధాన్ని దశలవారీగా సడలించే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందానికి తుది ఆమోదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచే రావాల్సి ఉండటంతో, ఆయన వైఖరి ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠ ప్రపంచవ్యాప్తంగా నెలకొంది.మరోవైపు.. పశ్చిమాసియాలో పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లబడలేదు. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ దాడి చేయగా.. బందర్ అబ్బాస్ సమీపంలో ఇరాన్ డ్రోన్ కేంద్రాలపై అమెరికా ప్రతిదాడులు జరిపింది. అమెరికా దళాలు ఐదు డ్రోన్లను కూల్చివేశామని ప్రకటించగా.. ఇరాన్ మాత్రం తమపై దాడులు పునరావృతమైతే మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించింది.ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి నిర్వహణలో ఒమన్, ఇరాన్ కలిసి పనిచేస్తున్నాయన్న వార్తలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. “అది అంతర్జాతీయ జలమార్గం.. ఎవరూ దానిపై ఆధిపత్యం చెలాయించలేరు” అంటూ ఘాటుగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇటు టెహ్రాన్లో ఆగ్రహానికి దారితీశాయి.మరోవైపు ఇజ్రాయెల్–హెజ్బొల్లా ఘర్షణలు కూడా ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. లెబనాన్, బీరూట్లో హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా.. ఉత్తర ఇజ్రాయెల్లో సైరన్లు మోగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య అమెరికా–ఇరాన్ ఒప్పందం ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తుది నిర్ణయం మాత్రం ఇప్పుడు ఒక్క ట్రంప్ చేతుల్లోనే ఉండటం గమనార్హం. -
పశ్చిమాసియాలో మళ్లీ సెగలు
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చలు కొనసాగుతుండగానే.. మరోవైపు ఇరుదేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటుచేసుకుంటున్నాయి. ఇరాన్ సైనిక స్థావరంపై బుధవారం రక్షణాత్మక దాడికి దిగినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతకుముందు ఇరాన్ అటాక్ డ్రోన్లను కూల్చివేశామని పేర్కొంది. హార్మూజ్ జలసంధి పరిసరాల్లో ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరాన్ వన్–వే దాడి డ్రోన్లను అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు కూల్చివేసినట్లు వెల్లడించింది. బందర్ అబ్బాస్లోని ఇరాన్ గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్పై అమెరికా దళాలు క్షిపణులు వర్షం కురిపించాయి. ఐదో డ్రోన్ను ప్రయోగించడానికి ఇరాన్ జవాన్లు సిద్ధమవుతున్న సమయంలోనే ఈ దాడి జరిగింది. ఒప్పందం దగ్గర్లోనే ఉంది ఇరాన్ సైనిక శక్తి చాలావరకు క్షీణించిందని, అందుకే తమతో చర్చలకు ముందుకొచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. బుధవారం కేబినెట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్తో శాంతి ఒప్పందానికి తొందరేమీ లేదని చెప్పారు. ఈ ఏడాది నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ఉన్నప్పటికీ ఇరాన్తో ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదన్నారు. అయితే, అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. అలాగైతే ఒమన్ను పేల్చేస్తాం: ట్రంప్ హార్మూజ్ జలసంధిని నియంత్రించడానికి ఒమన్ సహా ఏ ఒక్క దేశాన్ని కూడా అనుమతించబోమని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే కొత్త ఒప్పందంలో భాగంగా.. ఇరాన్, ఒమన్ కలిసి హార్మూజ్ గుండా జరిగే రవాణాను నియంత్రిస్తాయంటూ వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆ జలసంధిని ఎవరూ కంట్రోల్ చేయలేరని అన్నారు. అవి అంతర్జాతీయ జలాలు అని గుర్తుచేశారు.ఒమన్ కూడా అందరిలాగే ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. లేకపోతే మనం ఒమన్ను కూడా పేల్చివేయాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. కువైట్లో అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి అమెరికాపై ఇరాన్ సైన్యం ప్రతీకార దాడులకు దిగింది. కువైట్లోని అమెరికా సైనిక స్థావరంపై బుధవారం రాత్రి క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. అయితే, వీటిని కువైట్ గగనతల రక్షణ వ్యవస్థలు మధ్యలోనే కూల్చివేసినట్లు అమెరికా సైనిక వర్గాలు గురువారం స్పష్టంచేశాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించాయి. తమ భూభాగంపై దాడి జరిగిందని కువైట్ ప్రకటించింది. అయితే, తమపై తొలుత దాడిచేసినందుకు ప్రతీకారంపై ఓ గల్ఫ్ దేశంలో అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తేల్చిచెప్పింది. ఒమన్కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒమన్, అమెరికా మిత్రదేశాలు. అమెరికా సైనిక కార్యక్రమాలకు ఒమన్ సహకరిస్తోంది. అమెరికా, ఇరాన్ల మధ్య నిశ్శబ్ద మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వచ్చింది. ప్రాథమిక ఒప్పందం సిద్ధం డొనాల్డ్ ట్రంప్ ఆమోదమే తరువాయి వాషింగ్టన్: కాల్పుల విరమణను పొడిగించడం, ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలను తిరిగి ప్రారంభించడమే లక్ష్యంగా అమెరికా, ఇరాన్లు ఒక ప్రాథమిక ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే, ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుది ఆమోదం కోసం పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన అంగీకరిస్తే ప్రాథమిక ఒప్పందం అమల్లోకి వస్తుందని చెబుతున్నారు. ఇరుపక్షాల ప్రతినిధులు ఇటీవలే 60 రోజుల అవగాహన ఒప్పందం ముసాయిదాపై అంగీకారానికి వచ్చారు. ఇది నిజంగా అమల్లోకి వస్తే పశ్చిమాసియాలో అతిపెద్ద దౌత్యపరమైన పురోగతిగా నిలిచే అవకాశం ఉంది. అమెరికా, ఇరాన్ల మధ్య మళ్లీ దాడులు జరుగుతున్న తరుణంలో కాల్పుల విరమణ ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చనే భయాందోళనలు పెరిగాయి. అయినప్పటికీ ఇరుపక్షాలు ప్రాథమిక ఒప్పందానికి రావడం విశేషం. ఇందులో చాలా అంశాలు మంగళవారం నాటికే ఖరారయ్యాయని అమెరికా అధికారులు తెలిపారు. తమ ఉన్నతస్థాయి నాయకుల నుంచి ఆమోదం పొందామని ఇరాన్ ప్రతినిధులు సైతం పేర్కొన్నారు. దీనిపై తన నిర్ణయం ఏమిటన్నది ఇంకా డొనాల్డ్ ట్రంప్ బయటపెట్టలేదు. ఒప్పదం ముసాయిదాలోని వివరాలను వైట్ హౌస్ ధ్రువీకరించలేదు. -
చర్చలకు రాకపోతే.. ఇరాన్ అంతమే!
-
డెల్కు ట్రంప్ భారీ డీల్.. బిలియన్ డాలర్ల కాంట్రాక్ట్
డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి భారీ కాంట్రాక్ట్ దక్కింది. డొనాల్డ్ ట్రంప్కు అనుబంధంగా ఉన్న ఖాతాలకు భారీ విరాళం ప్రకటించిన కొన్ని నెలలకే, అమెరికా రక్షణ శాఖ నుంచి డెల్ టెక్నాలజీస్కు బహుళ బిలియన్ డాలర్ల ఒప్పందం రావడం అమెరికా వ్యాపార, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డెల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, సీఈఓ మైఖేల్ డెల్, ఆయన భార్య సుసాన్ డెల్ గతేడాది పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన “ట్రంప్ అకౌంట్స్” కార్యక్రమానికి 6.5 బిలియన్ డాలర్ల నిధిని ప్రకటించారు. ఇప్పుడు అదే డెల్ సంస్థకు పెంటగాన్ నుంచి 9.7 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్ట్ దక్కడం గమనార్హం.అమెరికా మీడియా సంస్థ సీఎన్బీసీ కథనం ప్రకారం, “డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అగ్రిమెంట్-II” కింద ఐదేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డెల్ ఫెడరల్ సిస్టమ్స్ అమెరికా రక్షణ శాఖకు మైక్రోసాఫ్ట్ 365 సేవలు, క్లౌడ్ సబ్స్క్రిప్షన్లు, ఆన్-ప్రెమైజ్ లైసెన్సింగ్ సొల్యూషన్లు అందించనుంది.ఈ ఒప్పందం పూర్తిగా పోటీ ప్రక్రియ ద్వారానే కుదిరిందని అమెరికా రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రక్షణ శాఖ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కిర్స్టన్ డేవిస్, యాక్టింగ్ నేవీ సీఐఓ బారీ టానర్ మాట్లాడుతూ, ధరలు, సేవల సామర్థ్యం, మొత్తం వ్యాల్యూ చెయిన్ వంటి అంశాలపై సమగ్రంగా పరిశీలించిన తర్వాతే డెల్ను ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ ఒప్పందం ద్వారా పెంటగాన్, ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ, అమెరికా కోస్ట్ గార్డ్ వంటి విభాగాల్లో సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ను ఏకీకృతం చేయనున్నట్లు సమాచారం. దీని వల్ల అమెరికా ప్రభుత్వానికి ప్రతి ఏడాది సుమారు 422 మిలియన్ డాలర్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న సమయంలో ఐటీ ఖర్చులను క్రమబద్ధీకరించడంలో ఈ ఒప్పందం కీలకమని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో మైఖేల్ డెల్ దంపతుల విరాళం కూడా మరోసారి వార్తల్లోకి వచ్చింది. “ఒక చిన్న ఆర్థిక ప్రోత్సాహం పిల్లల జీవితాన్ని ఎంతగా మార్చగలదో మేము చూశాం. వారి అవకాశాల ప్రపంచం విస్తరిస్తుంది” అని విరాళం ప్రకటించినప్పుడు మైఖేల్ డెల్ వ్యాఖ్యానించారు. ఇదే తమ జీవితంలో అతిపెద్ద దాతృత్వ కార్యక్రమమని కూడా ఆయన పేర్కొన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ కార్యక్రమంలో మైఖేల్ డెల్ను ప్రశంసిస్తూ డెల్ ఉత్పత్తులు కొనాలంటూ ప్రజలకు పిలుపునివ్వడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఆయనకు అభినందనలు తెలిపిన మైఖేల్ డెల్.. సైన్స్ అండ్ టెక్నాలజీ సలహా మండలిలో చేరినట్లు సమాచారం.దాతృత్వ కార్యక్రమాల్లో కూడా డెల్ కుటుంబం చురుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవలే టెక్సాస్ విశ్వవిద్యాలయం, ఆస్టిన్కు మైఖేల్ డెల్ 750 మిలియన్ డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య పరిశోధన కేంద్రం, ఆధునిక వైద్య ప్రాంగణం నిర్మించనున్నారు. -
ట్రంప్ షో.. అమెరికాలో కొత్త రాజకీయ తుపాను
అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా ప్రతిపాదన మరోసారి తీవ్ర చర్చకు దారి తీసింది. వైట్హౌస్లో UFC (మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైట్ నిర్వహించాలన్న నిర్ణయం రాజకీయ వివాదంగా మారింది. అధ్యక్ష భవనం ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఏంటని? ఆశ్చర్యాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా అసలది అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల కోసమా? లేక ట్రంప్ పుట్టినరోజు నేపథ్యంలోనా? అన్న గందరగోళం రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ పెంచుతోంది. యూఎఫ్సీ విడుదల చేసిన ప్రారంభ ప్రణాళికల్లో వైట్హౌస్ ప్రాంగణంలో ప్రత్యేక “లెగసీ ఫైట్ నైట్” నిర్వహించాలన్న సూచన ఉంది. అయితే కొన్ని నివేదికలు ఈ ఈవెంట్ను ట్రంప్ పుట్టినరోజు(జూన్ 14) చుట్టూ ప్లాన్ చేస్తున్నారన్న సంకేతాలు ఇవ్వడంతో, దీనిపై డెమొక్రటిక్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ 250 ఏళ్ల వేడుకల్లో భాగంగా.. “అమెరికన్ స్పోర్ట్స్ షోకేస్”గా దీన్ని ప్రదర్శించాలన్న వాదన కూడా వినిపిస్తోంది. దీంతో అసలు ఉద్దేశ్యం ఏంటన్నది ఇంకా స్పష్టత లేకుండా మారింది. వైట్హౌస్ దక్షిణ లాన్ ప్రాంతంలో తాత్కాలిక భారీ ఆక్టగాన్ రింగ్, వీఐపీ గ్యాలరీలు, మీడియా బాక్స్లు ఏర్పాటు ప్రయత్నాలు నడుస్తున్నాయి. వేలాది మంది ప్రేక్షకులను అనుమతించే స్థాయి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రసారాల కోసం భారీ సెట్ అప్ అవసరమని అంచనా. భద్రతా కారణాల దృష్ట్యా సీక్రెట్ సర్వీస్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ ఆపరేషన్గా ఇది మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన ఖర్చుపై ఇప్పుడు తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రారంభ అంచనాల ప్రకారం.. ఈ ఈవెంట్ కోసం దాదాపు 60 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.500 కోట్లకు పైగా) వరకు ఖర్చవొచ్చని అమెరికన్ మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే వైట్హౌస్ లాన్ దెబ్బతినడంతో దాన్ని మళ్లీ పునరుద్ధరించడానికి మాత్రమే దాదాపు 7 లక్షల డాలర్లు ఖర్చవుతుందని స్వయంగా యూఎఫ్సీ అధ్యక్షుడు డానా వైట్ వెల్లడించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయిఅమెరికాలో పెరుగుతున్న ద్రవ్య లోటు, ప్రజా వ్యయాలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇలాంటి “ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్” అవసరమా? అనే ప్రశ్న డెమొక్రాట్లు గట్టిగా లేవనెత్తుతున్నారు. “ట్రంప్ దుబారా ప్రాజెక్ట్”గా విమర్శిస్తున్నారు. వైట్హౌస్ అనేది పరిపాలనా కేంద్రం తప్ప వినోద వేదిక కాదని, అక్కడ పోరాట క్రీడల కోసం భారీ ఈవెంట్లు నిర్వహించడం అధ్యక్ష పదవికి తగదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. “ఇది పాలన కాదు.. పబ్లిసిటీ షో” అని కొందరు నేతలు ఘాటుగా విమర్శించారు. ఇక రిపబ్లికన్ వర్గాల్లో మాత్రం ఈ ప్రతిపాదనపై మిశ్రమ స్పందన ఉంది. కొందరు దీనిని అమెరికా 250 ఏళ్ల వేడుకలను ప్రపంచానికి చూపించే అవకాశంగా చూస్తుండగా.. మరికొందరు ఇది అనవసర రాజకీయ వివాదాలకు దారి తీస్తుందని అభిప్రాయపడుతున్నారు. చరిత్రలో చూస్తే వైట్హౌస్ ప్రాంగణంలో ఇలాంటి పెద్ద స్థాయి క్రీడా పోటీలు జరగలేదు. సాధారణంగా అధికారిక వేడుకలు, చిన్న స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే అక్కడ నిర్వహించబడతాయి. అంతర్జాతీయ స్థాయి ఫైట్ ఈవెంట్ మాత్రం వైట్హౌస్ చరిత్రలో ఇదే మొదటిసారి కానుంది. ఇదే సమయంలో..ట్రంప్ ఆధ్వర్యంలో వైట్హౌజ్లో కొన్ని నిర్మాణ మార్పులు కూడా జరుగుతున్నాయన్న వార్తలు రాజకీయ వేడి పెంచుతున్నాయి. సమావేశ హాళ్ల ఆధునీకరణ, ఈవెంట్ స్పేస్ల విస్తరణ, భద్రతా మౌలిక సదుపాయాల మార్పులతో పాటు భారీ “బాల్రూమ్” నిర్మాణ ఆలోచన కూడా ఇందులో భాగంగా ఉండడం తెలిసిందే. అయితే.. అంతర్జాతీయ స్థాయి విందులు, భారీ రాజకీయ–సామాజిక ఈవెంట్లు నిర్వహించేందుకు అనువుగా ఈ మార్పులు చేపడుతున్నారన్న చర్చ సాగుతోంది. డెమొక్రాట్లు మాత్రం “వైట్హౌస్ను పరిపాలనా కేంద్రం నుంచి ఎంటర్టైన్మెంట్ వేదికగా మార్చేస్తున్నారు” అంటూ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తున్నారు.ఏది ఏమైనా ట్రంప్ మాత్రం తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నారు. యూఎఫ్సీ ఈవెంట్ను “గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్”గా అభివర్ణిస్తూ భారీ ప్రమోషన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనకు యూఎఫ్సీ అధ్యక్షుడు డానా వైట్తో సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. అందుకే వైట్హౌస్లో యూఎఫ్సీ ఫైట్ ప్లాన్ను చాలామంది “రాజకీయ బ్రాండింగ్ ఈవెంట్”గా చూస్తున్నారు.ఏంటీ ఫైట్?యూఎఫ్సీ.. “అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్”. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) పోటీ సంస్థ. బాక్సింగ్, రెజ్లింగ్, జూడో, కరాటే, జియూ-జిట్సు వంటి పలు యుద్ధ కళలను కలిపి జరిగే పోరాటాలను ఇందులో నిర్వహిస్తారు. అమెరికాలో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్గా ఎదిగింది. ఆక్టగాన్ అనే ఎనిమిది కోణాల రింగ్లో ఫైటర్లు తలపడటం యూఎఫ్సీ ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ పోటీలను వీక్షిస్తుంటారు. ప్రస్తుతం ఇది కేవలం క్రీడ మాత్రమే కాకుండా భారీ ఎంటర్టైన్మెంట్, బిజినెస్ ఇండస్ట్రీగా కూడా మారింది. -
అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. మూడు నెలలుగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ ఘర్షణల్లో తాజాగా మరో కీలక మలుపు చోటుచేసుకుంది. గురువారం హర్ముజ్ జలసంధి పరిసరాల్లో అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతిదాడులు జరిపినట్లు సమాచారం. బందర్ అబ్బాస్ సమీపంలో అమెరికా నిర్వహించిన తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు టెహ్రాన్ ప్రకటించింది.ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్కు అనుబంధ వర్గాలు విడుదల చేసిన ప్రకటనల్లో.. “ప్రాంతీయ భద్రతను ఉల్లంఘించే ప్రతి చర్యకు సమాధానం ఉంటుంది” అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో దాడులు కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు. హర్ముజ్ సమీపంలోని అమెరికా బలగాలు, సముద్ర మార్గాల్లో కదులుతున్న మిలిటరీ కార్యకలాపాలపై తమ నిఘా కొనసాగుతోందని ఇరాన్ పేర్కొంది.మరోవైపు అమెరికా కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. యూఎస్ సెంట్రల్ కమాండ్ అధికారులు ఇరాన్లోని కొన్ని సైనిక కేంద్రాలపై రాత్రికి రాత్రే కొత్త వైమానిక దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, అమెరికా బలగాలకు ముప్పుగా మారే డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. పలు ఇరానియన్ డ్రోన్లను గాల్లోనే కూల్చివేసినట్లు కూడా అమెరికా వర్గాలు ప్రకటించాయి. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న వేళ.. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నాయన్న వార్తలు రావడం పరిస్థితిని మరింత గందరగోళంగా మారుస్తోంది. ఇటీవల ఇరాన్ ప్రభుత్వ మీడియా “హర్ముజ్లో సంయుక్త నిర్వహణ, ఆంక్షల సడలింపు” వంటి అంశాలతో ఒప్పందం కుదిరిందని ప్రచారం చేయగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ఆ వార్తలను ఖండించారు. “హర్ముజ్ తెరిచే ఉంటుంది.. నియంత్రణ అమెరికా మిత్రదేశాల భద్రతకే ప్రాధాన్యం” అని ట్రంప్ స్పష్టం చేశారు.ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గమైన హర్ముజ్ జలసంధి చుట్టూ యుద్ధ వాతావరణం మరింత తీవ్రమవుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కలవరపడుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో గణనీయమైన శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. దీంతో అక్కడ చిన్న ఉద్రిక్తత జరిగినా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు భారీ హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.రష్యా, చైనా వంటి దేశాలు ఇరు పక్షాలు అదుపు పాటించాలని పిలుపునిస్తుండగా.. ఐక్యరాజ్యసమితి కూడా పరిస్థితిని అత్యంత ఆందోళనకరంగా చూస్తోంది. ఒకవైపు చర్చలు.. మరోవైపు క్షిపణులు, డ్రోన్ దాడులు కొనసాగుతుండటంతో “ఇది నిజంగా శాంతి ప్రయత్నమా? లేక యుద్ధానికి ముందు వ్యూహాత్మక ఒత్తిడా?” అన్న చర్చ అంతర్జాతీయ వేదికలపై మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ప్రపంచ దృష్టంతా హర్ముజ్పైనే నిలిచింది. ఎందుకంటే అక్కడి ప్రతి కదలిక ఇప్పుడు కేవలం రెండు దేశాల మధ్య యుద్ధమే కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును కూడా ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. -
ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతూ.. హర్ముజ్ హైడ్రామా
ఒక రోజు యుద్ధ హెచ్చరికలు.. మరుసటి రోజు శాంతి చర్చలు..! ఉదయం ఒప్పందం కుదిరిందంటూ ప్రకటనలు.. సాయంత్రానికి “అది ఫేక్” అంటూ ఖండనలు..! ప్రస్తుతం హర్ముజ్ జలసంధి చుట్టూ అమెరికా-ఇరాన్ వ్యవహారం అంతర్జాతీయ రాజకీయాల కంటే ఎక్కువగా ఒక హైటెన్షన్ డ్రామాను తలపిస్తోంది.ఒకవైపు ప్రపంచ చమురు మార్కెట్లు వణికిపోతుంటే.. మరోవైపు రెండు దేశాలు మాత్రం మాటల యుద్ధంతో ప్రపంచాన్ని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇరాన్ ప్రభుత్వ మీడియా ఒక్కసారిగా “అమెరికాతో ఒప్పందం కుదిరింది.. హర్ముజ్ను మళ్లీ తెరుస్తాం” అంటూ ప్రకటించడంతో ప్రపంచ మార్కెట్లు ఊపిరిపీల్చుకున్నాయి. అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తుందని, సైన్యాన్ని వెనక్కి తీసుకుంటుందని కూడా ఇరాన్ ప్రచారం చేసింది.అంతేకాదు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా గత కొన్ని రోజులుగా “ఇరాన్ చర్చలకు సిద్ధమైంది.. అణు ఒప్పందం దిశగా పురోగతి ఉంది.. హర్ముజ్లో మళ్లీ స్వేచ్ఛా వాణిజ్యం జరుగుతుంది” అంటూ వరుస ప్రకటనలు చేస్తూ వచ్చారు. దీంతో నిజంగానే రెండు దేశాలు రాజీ దిశగా వెళ్తున్నాయనే అభిప్రాయం ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది.కానీ అప్పుడే కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన వైట్హౌస్.. ఇరాన్ మీడియా విడుదల చేసిన ఒప్పంద ముసాయిదా “పూర్తిగా కల్పితం” అంటూ తేల్చేసింది. దీంతో అసలు నిజం ఏంటన్నది ప్రపంచ దేశాలకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ట్రంప్ శాంతి సంకేతాలు ఇస్తుంటే.. మరోవైపు వైట్హౌస్ మాత్రం ఒప్పందాన్నే ఖండించడం ఇప్పుడు మరింత గందరగోళానికి దారి తీసింది.ఇదే సమయంలో అమెరికా మరోవైపు ఇరాన్పై వైమానిక దాడులు కొనసాగిస్తుండటం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఒకచేత్తో చర్చలు.. మరోచేత్తో దాడులు అనే విధంగా అమెరికా వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా “యుద్ధం ఉండదు” అంటూనే, హర్ముజ్పై నియంత్రణ మాత్రం తమదేనని స్పష్టం చేస్తోంది.ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి చుట్టూ ఇలాంటి ప్రకటనలు రావడం వల్ల మార్కెట్లు ఒక్కసారిగా కుదేలవుతున్నాయి. చమురు ధరలు భారీగా మారిపోతుండగా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో అమెరికా-ఇరాన్ దేశాలు నిజంగా శాంతి కోరుకుంటున్నాయా..? లేక ప్రపంచంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయా..? అనే చర్చ అంతర్జాతీయ వేదికలపై జోరుగా సాగుతోంది. -
పేల్చి పడేస్తాం.. మిత్ర దేశానికి ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ మిత్రదేశమైన ఒమన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ హర్ముజ్ విషయంలో ఒమన్ గనుక ఇరాన్కు మద్దతుగా నిలిస్తే ఆ దేశాన్ని పేల్చి పడేస్తాం అని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎప్పుడు ఎవరికి వార్నింగ్ ఇస్తారో.. ఎప్పుడు ఎవరితో కయ్యం పెట్టుకుంటారో చెప్పడం చాలా కష్టం. ఈ సారి ఆయన అమెరికా మిత్ర దేశమైన ఒమన్పై విరుచుకపడ్డారుఅమెరికాలో జరిగిన ఓసమావేశంలో అక్కడి జర్నలిస్టులు ఇరాన్, ఒమన్ కలిసి హర్ముజ్ నియంత్రించేలా తాత్కాలిక ఒప్పందాన్ని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు. దానికి ఆగ్రహం చెందిన ట్రంప్ "లేదు, ఆ జలసంధి అందరి కోసం తెరిచే ఉంటుంది. అది అంతర్జాతీయ జలభాగం. మిగతా అందరిలాగే ఒమన్ కూడా పద్ధతిగా ప్రవర్తించాలి, లేదంటే మేము వారిని పేల్చి పడేయాల్సి వస్తుంది. వారికి ఆ విషయం బాగా తెలుసు, అంతా సర్దుకుంటుంది," అని అన్నారు.అయితే ఈ వ్యాఖ్యలపై తదుపరి చిన్న వివాదం చెలరేగింది. ట్రంప్ నిజంగానే ఒమన్ని అన్నారా? లేక ఇరాన్కి బదులుగా పొరబాటున ఒమన్ పేరు వాడారా అన్నారా అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అనే విషయమై వివరణ ఇవ్వాల్సిందిగా అక్కడి మీడియా ప్రతినిధులు వైట్హౌస్నను కోరినటప్పటికీ వారు స్పందించనట్లు తెలుస్తోంది. -
క్వాడ్లో మళ్లీ చలనం
ఉందో, ముగిసిపోయిందో తెలియని స్థితిలో ఏడాదిగా దారీతెన్నూ లేకుండా ఉండిపోయిన చతుర్భుజ కూటమి(క్వాడ్)లో ఎందుకనో కొంత చలనం వచ్చింది. మంగళవారం సభ్య దేశాలైన భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రుల సమావేశం జరగటం, చివరిలో ఒక ఉమ్మడి ప్రకటన వెలువడటం ఆర్నెల్ల ముందు కూడా ఊహకందనిది. ఎందుకంటే నిరుడు జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మిత్రులు, శత్రువులన్న విచక్షణ మరిచి అందరితో గిల్లికజ్జాలకు దిగడం మొదలెట్టారు. నిర్విచక్షణగా సుంకాలు విధిస్తూ అందరినీ సమానంగా ఇబ్బందిపెట్టారు. ఇలాంటి స్థితిలో అమెరికా చొరవతో ఏర్పడ్డ క్వాడ్ ఇక ముగిసిన అధ్యాయమని అందరూ అనుకున్నారు. నిజానికి ఆరంభంనుంచి క్వాడ్ ఏదో కారణంతో అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటూనేవుంది. చైనాకు వ్యతిరేకంగా 2007లో తొలి సమావేశం జరుపుకోగా ఆ మరుసటి ఏడాదికే జపాన్, ఆస్ట్రేలియాలు వైదొలగాయి. ఆ రెండుచోట్లా పాలకులు మారటం ఇందుకొక కారణం. 2008లో అప్పటి మన ప్రధాని మన్మోహన్ సింగ్ ‘చైనాను కట్టడిచేసే ఎలాంటి కూటమిలోనూ భాగస్వాములం కాదల్చుకోలేదు’ అని కుండబద్దలుకొట్టారు. దాంతో దాదాపు పదేళ్లపాటు అది అచేతనావస్థలో పడింది. 2017 నాటికి దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం ప్రాంతాల్లో చైనా పెత్తనం పెరగటంతో ట్రంప్ చొరవ తీసుకుని దానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. అయినా కోవిడ్ కారణంగా తొలి శిఖరాగ్ర సమావేశం జరగటానికి నాలుగేళ్లు పట్టింది. కీలక ఖనిజాలు, ఇంధన భద్రత, సముద్రజలాల్లో ఇంటర్నెట్ కేబుల్స్ ఏర్పాటు, టెలికాం సాంకేతికత తదితర అంశాల్లో పరస్పరం సహకరించుకోవాలని విదేశాంగ మంత్రుల సదస్సు నిర్ణయించటం తాజా ప్రపంచ పరిణామాల పర్యవసానమే. హార్మూజ్ జలసంధి ప్రతిష్ఠంభన... ఇంధన సరఫరా నిలిచిపోవటం, ఆ ప్రాంతంవైపు నుంచి వచ్చే అండర్ సీ కేబుల్స్ సైతం ప్రమాదంలో పడటం వగైరా అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో నౌకలను అడ్డగిస్తున్న ఇరాన్ వైఖరిని, వచ్చే పోయే నౌకలవద్ద సుంకాలు వసూలు చేసే ఆలోచనను క్వాడ్ సమావేశం తప్పుబట్టింది. అనవసర యుద్ధంతో ఇంత వివాదానికి కారణమై, తాను సైతం హార్మూజ్ను దిగ్బంధించిన అమెరికాకు జనాంతికంగానైనా మిగిలిన దేశాలు హితవు పలికాయా అన్నది తెలియదు.చైనాను నిరోధించి, ఇండో–పసిఫిక్ దేశాల భద్రతకు కృషిచేయాలని గతంలో చెప్పుకున్న సంకల్పం ఇప్పుడు తాత్కాలికంగా వెనక్కిపోయింది. ఈ ప్రాంతంలో నిఘా వ్యవస్థను పటిష్టం చేసి, ఎప్పటికప్పుడు క్వాడ్ దేశాలమధ్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చు కోవాలని నిర్ణయించినా దీనర్థం క్వాడ్ను సైనికీకరణ చేయటం కాదని మన విదేశాంగ శాఖ వివరణనిచ్చింది. క్వాడ్ ఇంధన వేదికను ఈ ఏడాది ఆఖరులోగా నిర్వహించ బోతున్నామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో ప్రకటించారు. కానీ ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఎప్పుడో చెప్పకపోవటం సందేహాలకు తావిచ్చింది. విదే శాంగ మంత్రుల సమావేశంలోనే శిఖరాగ్ర తేదీలు ప్రకటించటం ఆనవాయితీ. వాస్తవా నికి అది 2024లోనే భారత్లో నిర్వహించాలి. కానీ వాయిదా పడింది. ఈలోగా సుంకాల వివాదం నేపథ్యంలో ట్రంప్ మన దేశం రావటానికి చొరవ చూపటం లేదు. క్వాడ్ మొదలయ్యే నాటికి చైనా దూకుడు మీదుంది. ముఖ్యంగా హిందూ సముద్ర ప్రాంత దేశాలమీదుగా అది ప్రారంభించదల్చుకున్న బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్ (బీఆర్ఐ) ప్రాజెక్టు భారత్ భద్రతకు ముప్పు తెస్తుందన్న సందేహం ఉంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల్లో ఆ దేశం తరచు సృష్టించే వివాదాలు సరేసరి. ఇలాంటి నేపథ్యంలో క్వాడ్లో భాగస్వామ్యం కావటానికి మన దేశం ముందుకొచ్చింది. ఆనాటి పరిస్థితుల మాటెలావున్నా ఎవరికీ అంతుచిక్కని ట్రంప్ వంటి అధినేతను నమ్మి ముందుకెళ్లటం ఇప్పుడు సాధ్యమేనా? ఆయన చైనాతో సాన్నిహిత్యం కోసం తహతహలాడుతున్నారు. అది ఒక రూపం తీసుకుంటే క్వాడ్ కాడిపడేయరన్న గ్యారెంటీ ఏం లేదు. అందుకే రక్షణేతర రంగాల్లో భాగస్వామ్యం వరకూ ఫర్వాలేకున్నా, ఇతర విషయాల్లో మన దేశం ఆచితూచి అడుగేయక తప్పదు. -
మార్కో రూబియో పర్యటన.. కీలక ఒప్పందాలు
ఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఇటీవలే భారత పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా వ్యూహాత్మక రంగాలు, ఇంధనం, సాంకేతికత, ఖనిజాల సరఫరాకు సంబంధించి ఇరుదేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక మైలురాయిగా నిలుస్తుందని యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ పేర్కొంది.కీలక ఒప్పందాలుప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ (అరుదైన ఖనిజాల) సరఫరాపై చైనా తన పట్టును బిగిస్తున్న వేళ, భారత్-అమెరికాలు "యుఎస్-ఇండియా ఫ్రేమ్వర్క్ ఆన్ క్రిటికల్ మినరల్స్ అండ్ రేర్ ఎర్త్స్" ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ద్వారా మైనింగ్, ప్రాసెసింగ్, రేర్ ఎర్త్ అయస్కాంతాల తయారీ, ఉమ్మడి పెట్టుబడులు మరియు రీసైక్లింగ్ వంటి రంగాల్లో ఇరుదేశాలు కలిసి పనిచేయనున్నాయి. సింగిల్-సోర్స్ మోనోపోలీల (ఏకఛత్రాధిపత్యం) నుంచి సరఫరా వ్యవస్థను కాపాడుకోవడమే దీని ప్రధాన లక్ష్యం.అరుదైన ఖనిజాల సరఫరాఈ పర్యటనలో అన్నింటి కంటే ముఖ్యమైనది 'క్లిష్టమైన ఖనిజాలు, అరుదైన భూ ఖనిజాల పై యూఎస్-ఇండియా ఫ్రేమ్వర్క్' ఒప్పందం. మైనింగ్, ప్రాసెసింగ్ నుండి అరుదైన అయస్కాంతాల తయారీ వరకు పూర్తి సరఫరా వ్యవస్థలో ఉమ్మడి పెట్టుబడులు, భాగస్వామ్యాలను పెంపొందించేలా దీనిని రూపొందించారు. గ్లోబల్ రేర్ ఎర్త్ మార్కెట్పై చైనా తన పట్టును బిగిస్తున్న తరుణంలో, దానికి ప్రత్యామ్నాయంగా ప్రజాస్వామ్య భాగస్వామ్యంతో కూడిన నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా వాషింగ్టన్, న్యూఢిల్లీలు ఈ అడుగు వేశాయి.ప్రస్తుతం హార్ముజ్ జలసంధి వంటి కీలక సముద్ర మార్గాల్లో నెలకొన్న అ స్థిరత కారణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇంధనం, ఎరువుల ధరలు తీవ్రంగా మారుతున్నాయి. దీనిని అధిగమించడానికి ఈ పర్యటనలో రెండు ప్రధాన ఇంధన కార్యక్రమాలను ప్రకటించారు. క్వాడ్ ఫ్యూయల్ సెక్యూరిటీ ఫోరమ్ ఇండో-పసిఫిక్ ఎనర్జీ సెక్యూరిటీపై క్వాడ్ ఇనిషియేటివ్ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న క్లీన్ ఎనర్జీ మార్కెట్గా ఉన్న భారతదేశం... ఈ ఫ్రేమ్వర్క్ ద్వారా ప్రాంతీయ ఇంధన భద్రతకు ఒక ప్రధాన స్తంభంగా మారడమే కాకుండా, అమెరికన్ ఇంధన పెట్టుబడులకు సరైన గమ్యస్థానంగా నిలవనుంది. యుఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రశంసలుఈ పర్యటన ఫలితాలపై యూఎస్ఐబీసీ ప్రశంసలు కురిపించింది. ఆ సంస్థ ప్రెసిడెంట్ అంబాసిడర్ (రిటైర్డ్) అతుల్ కేశప్ మాట్లాడుతూ, "ఈ వారం ఇంధన భద్రత, క్లిష్టమైన ఖనిజాలు, సముద్ర ఓడరేవులపై వచ్చిన ప్రకటనలు క్వాడ్ కూటమి యొక్క ప్రాధాన్యతను నిరూపిస్తున్నాయి. న్యూఢిల్లీలో క్వాడ్ సమావేశాన్ని నిర్వహించడం అంతర్జాతీయ భాగస్వామిగా భారతదేశం యొక్క కీలక పాత్రను మరింత బలపరుస్తుంది" అని పేర్కొన్నారు.భౌగోళిక రాజకీయ పోటీ తీవ్రమవుతున్న తరుణంలో, ప్రత్యర్థి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ, దౌత్యపరమైన సత్సంబంధాలను వాణిజ్య పరమైన ఒప్పందాలుగా మార్చడంలో రూబియో దిల్లీ పర్యటన విజయవంతమైందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
బెదిరింపులకు విరుగుడు వ్యూహం
యూఎస్ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్లకు గవర్నర్గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.పరస్పర గమ్యంయూఎస్ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది. యూఎస్లోని డెయిరీఫామ్లు పాల ప్రాసెసింగ్కు కెనడాలోని క్యుబెక్పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.తమ్ముడు తమ్ముడే...కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్లోని మిచిగన్కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.దిక్కుతోచని ట్రంప్ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
హర్ముజ్ ఒప్పందం ఖరారు..? కొట్టిపడేసిన వైట్హౌస్
టెహ్రాన్: ప్రస్తుతం అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం అంశంలో చర్చలు జరుగుతున్నాయి. అణు ఒప్పందంపై ఇరాన్ వెనక్కి తగ్గిందని దాదాపు చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్ముజ్ జలసంధి పునఃప్రారంభంపై జరిగిన జరిగిన ఒప్పందంలోని అంశాలను ఇరాన్ మీడియా కథనాలు బహిర్గతం చేశాయి.ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సమాచారం ప్రకారం... నెలరోజుల్లో హర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాను యుద్ధానికి ముందున్న సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇరాన్ అంగీకరించిందని తెలిపింది. అయితే దానికి ఇరాన్పై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి, ఆ ప్రాంతం నుండి తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడానికి అమెరికా అంగీకరించిందని పేర్కొంది.అయితే ఈ జలసంధిని గుండా వెళ్లే ఓడలను తనిఖీ చేసే హక్కు, షిప్పింగ్ లేన్లను నిర్వహించే హక్కు, సర్వీస్ ఫీజులను వసూలు చేసే హక్కు ఇరాన్ దగ్గరే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా ఏ దేశానికి చెందిన సైనిక నౌకలకు ఈ ప్రత్యేక నిబంధనలు వర్తించవని పేర్కొంది. ఈ ప్రాథమిక ఒప్పందం కుదిరిన అనంతరం ఇరు దేశాలు 60 రోజుల పాటు తదుపరి చర్చలు జరుపుతాయని ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తుది తీర్మాణాన్ని ఆమెదింప జేస్తారని పేర్కొంది.అయితే ఇరాన్ మీడియా చేసిన ఈ ప్రకటనలను అమెరికా పూర్తిగా కొట్టిపారేసింది. ఈ మేరకు వైట్హౌస్ తన అధికారిక వైట్హౌస్ ఎక్స్ ఖాతాలో "ఇరాన్ నియంత్రణలోని మీడియా విడుదల చేసిన ఈ నివేదికలో ఎలాంటి నిజం లేదు. ఆ అవగాహనా ఒప్పందం పూర్తిగా కల్పితం. ఇరాన్ ప్రభుత్వ మీడియా చెప్తున్న విషయాలను ఎవరూ నమ్మకండి. వాస్తవాలు ముఖ్యం అని పేర్కొందిదిగొచ్చిన ధరలుహర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకునే అవకాశం ఉందనే వార్తలు రాగానే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 90 డాలర్ల కంటే కిందకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో హర్ముజ్ పునఃప్రారంభంపై ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఏం జరుగుతుందో వేచిచూడాలి. -
భారత్, అమెరికా ‘ఖనిజ’ బంధం
న్యూఢిల్లీ: అరుదైన, కీలకమైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారమే లక్ష్యంగా భారత్, అమెరికాలు చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అరుదైన భూ ఖనిజాలు, వ్యూహాత్మక లోహాల సరఫరా, ఎగుమతులపై చైనా విధిస్తున్న నియంత్రణల పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఇకపై పరస్పరం సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికి వచ్చాయి. ఈ మేరకు ఒప్పందంపై మంగళవారం సంతకాలు చేశాయి. 🇮🇳🇺🇸 India & the U.S. just signed a landmark deal to secure supply chains for critical minerals & rare earths- cutting dependence on China & boosting strategic self-reliance. pic.twitter.com/bl3NJeLY4x— The Alternate Media (@AlternateMediaX) May 26, 2026 కీలక ఖనిజాల తవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో స్థిరత్వం సాధించాలని, ఇరుదేశాలు లాభపడేలా కలసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. ఢిల్లీలో ‘క్వాడ్’ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది చాలా సమయోచితమైన, కీలకమైన నిర్ణయమని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టంచేశారు. మైనింగ్, ప్రాసెసింగ్, రీసైక్లింగ్, సంబంధిత పెట్టుబడులతో సహా అరుదైన ఖనిజాలు, లోహాల సరఫరాలో సహకారాన్ని మరింతగా పెంపొందించడమే ఈ ఫ్రేమ్వర్క్ లక్ష్యమని ఉద్ఘాటించారు. ఇదీ చదవండి: బైజూస్ ఫౌండర్కి ఆర్నెల్ల జైలు, రవీంద్రన్ స్పందన ఇదీ!పటిష్టమైన, వైవిధ్యభరితమైన సప్లైచైన్లను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు. మైనింగ్, ప్రాసెసింగ్ ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం లభిస్తుందని, ఖనిజాలు, లోహాల సమర్థవంతమైన నిర్వహణను దోహద పడుతుందని వివరించారు. ఎన్నో సవాళ్లు, అదే సమయంలో ఎన్నో అవకాశాలు ఉన్న ఈ ప్రపంచంలో భారత్, అమెరికాల మధ్య సహకారం ఎంత సన్నిహితంగా ఉందో చెప్పడానికి ఈ ఒప్పందం ఒక ప్రతీక అని వ్యాఖ్యానించారు. భారత్, అమెరికాల మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో గుర్తుచేశారు. రెండు దేశాల జాతీయ ప్రయోజనాల దృష్ట్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలకు తాజా ఒప్పందమే ఒక ఉదాహరణ అని వెల్లడించారు. మన ఆవిష్కరణల ఆర్థిక వ్యవస్థకు(ఇన్నోవేషన్ ఎకానమీ) ఖనిజాలు, సప్లై చైన్లు చాలా ముఖ్యమని తెలిపారు. ఇదీ చదవండి: 11 రోజుల్లోనే ... హమాస్ కీలక నేత హతం -
గల్ఫ్ దేశాలకు ఇరాన్ హెచ్చరిక
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ మెజ్తబా ఖమేనీ.. ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఇకపై సురక్షితంగా ఉండవు. ఇజ్రాయెల్ను ఖచ్చితంగా కూకటివేళ్లతో పెకిలించాలి.. అది జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, వాషింగ్టన్ రోజురోజుకూ తన పూర్వ వైభవానికి దూరమవుతోంది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తాజాగా తన టెలిగ్రామ్ ఛానెల్లో సందేశం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఖమేనీ..‘పశ్చిమాసియా ప్రాంతంలో తన దుశ్చర్యలకు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఇకపై అమెరికాకు సురక్షితమైన ఆశ్రయం ఉండదు. కాలం వెనక్కి తిరగదు. ఈ ప్రాంతంలోని దేశాలు, భూములు ఇకపై అమెరికా స్థావరాలకు రక్షణ కవచాలుగా పనిచేయవు. అమెరికా తన పూర్వ వైభవానికి దూరమవుతోంది.ఇదే సమయంలో అమెరికా దళాలు దక్షిణ ఇరాన్లో దాడులు జరిపాయి. దక్షిణ ఇరాన్లో అమెరికా తాజాగా జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలేనని టెహ్రాన్ పేర్కొంది. అమెరికా ఈ ప్రాంతంలో అల్లర్లు సృష్టిస్తోందని ఇరాన్ ఆరోపించింది. సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఖతర్ వంటి దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇవి ఇరాన్ ప్రతీకారానికి గురయ్యే అవకాశం ఉందని ఇరాన్ సంకేతం ఇచ్చింది. కాగా, బహ్రెయిన్, కువైట్, ఇరాక్, యూఏఈ, ఖతార్ లాంటి దేశాలతో కలిపి ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన చిన్న, పెద్ద మిలటరీ క్యాంపులు 19 వరకు ఉన్నాయి.మరోవైపు, ఖమేనీ.. హజ్ యాత్రకు వచ్చిన వారంతా కలిసికట్టుగా ఉండాలని కోరారు. పాలస్తీనా, అల్-అక్సా మసీదుకు విముక్తి కలగాలని, ముస్లింల కష్టాలు తీరాలని, ప్రపంచాన్ని శాసిస్తున్న శక్తులపై విజయం సాధించాలని అందరూ ప్రార్థన చేయండి అని వ్యాఖ్యానించారు. ఈ పశ్చిమాసియా, గల్ఫ్ ప్రాంతంలోని ముస్లిం దేశాలన్నింటికీ ఒకే రకమైన బలం, ప్రయోజనాలు ఉన్నాయని, అవే భవిష్యత్తులో ప్రపంచంలో ఒక కొత్త మార్పును తెస్తాయని తెలిపారు.ఇరాన్ సైనిక సామర్థ్యాలుబాలిస్టిక్ క్షిపణులు: ఇరాన్ వద్ద 2,000 కి.మీ. వరకు దాడి చేయగల క్షిపణులు ఉన్నాయి. ఇవి గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను చేరగలవు.డ్రోన్లు: ఇరాన్ డ్రోన్ టెక్నాలజీని విస్తృతంగా అభివృద్ధి చేసింది. ఇవి గల్ఫ్లోని ఆయిల్ ఫీల్డ్స్, నౌకలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవచ్చు.నౌకాదళం: స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్లో ఇరాన్ చిన్న నౌకలు, మైన్స్, టార్పెడోలు ఉపయోగించి అమెరికా నౌకాదళాన్ని ఇబ్బంది పెట్టగలదు.ప్రాక్సీ గ్రూపులు: హిజ్బుల్లా, హౌతీలు వంటి మిత్ర గ్రూపుల ద్వారా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో పరోక్ష దాడులు చేయగలదు.గల్ఫ్లో అమెరికా స్థావరాలుఖతార్: అల్ ఉడెయిడ్ ఎయిర్ బేస్ – అమెరికా యొక్క అతిపెద్ద ఎయిర్ బేస్, 10,000 పైగా సైనికులు.బహ్రెయిన్: నేవల్ సపోర్ట్ యాక్టివిటీ – అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్ ప్రధాన కేంద్రం.సౌదీ అరేబియా: ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ – మధ్యప్రాచ్యంలో కీలకమైన ఎయిర్ ఆపరేషన్ల కేంద్రం.యుఏఈ: అల్ ధాఫ్రా ఎయిర్ బేస్ – అమెరికా F-35, డ్రోన్ ఆపరేషన్లకు ప్రధాన కేంద్రం.ఇరాన్ హెచ్చరికల ప్రభావం..ప్రాంతీయ స్థిరత్వం: గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగితే స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా జరిగే చమురు రవాణా తీవ్రంగా దెబ్బతింటుంది.అమెరికా వ్యూహం: అమెరికా తన స్థావరాల భద్రతను పునఃపరిశీలించాల్సి వస్తుంది.గల్ఫ్ దేశాలు: అమెరికా రక్షణపై ఆధారపడుతున్న ఈ దేశాలు, ఇరాన్ దాడుల భయంతో కొత్త దౌత్యపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.ప్రపంచ మార్కెట్లు: భారత్, యూరప్, ఆసియా దేశాలు గల్ఫ్ చమురుపై ఆధారపడుతున్నందున, ఏవైనా అంతరాయాలు గ్లోబల్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. -
నాటోకు అమెరికా భారీ ఝలక్..
ఇరాన్, అమెరికా మధ్య మళ్లీ భయానక యుద్ధ పరిస్థితులు.. -
యుద్ధం: విషాదంతో పాటు విషం..
యుద్ధం విషాదాన్నే కాదు.. విషాన్ని మిగులుస్తుంది. ప్రాణనష్టంతో మొదలై ప్రజలను నిరాశ్రయులను చేయడంతోపాటు మొత్తంగా పరిసరాల విధ్వంసానికి దారి తీస్తుంది. కానీ ఈ క్రమంలో తరచూ విస్మరించే మరో పరిణామం యుద్ధం మిగిల్చే కాలుష్యం. పై నష్టాలన్నీ యుద్ధం జరుగుతుండగా, జరిగిన వెంటనే తెలిస్తే.. కాలుష్యం ప్రభావం మాత్రం సంఘర్షణ ముగిసిన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు పట్టొచ్చు. యుద్ధంలో తీవ్ర ప్రమాదాకానికి గురయ్యేవి మండే ఇంధనాలు, ప్రమాదకరమైన రసాయనాలుండే ఇంధన వ్యవస్థలు. దాడులు చమురు డిపోలు, రిఫైనరీలు, పైప్లైన్లలో మంటలను రాజేస్తాయి. ఈ మంటల వల్ల విష వాయువులు, క్యాన్సర్ కారక కణాలు, అవశేషాలు విడుదలై, చుట్టుపక్కల భూమి, నీరు సంవత్సరాల తరబడి కలుషితమవుతుంది. ఇరాన్ యుద్ధం విషయంలో ఇదే జరిగింది. ఇరాన్, గల్ఫ్లో ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన బాంబు దాడులు ఇప్పటికే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. మండుతున్న ఇంధన ట్యాంకులు విషపూరిత కణాలను గాలిలోకి పంపుతుండగా, వాటి శిథిలాలు, ప్రవాహాలు, చమురు అవశేషాలు గల్ఫ్ అంతటా తీరప్రాంత జలాలను, సముద్ర జీవావరణ వ్యవస్థలను భయపెడుతున్నాయి. ఈ కాలుష్య దాడి ప్రస్తుతం ఇక్కడికే పరిమితమైనా, తర్వాతి కాలంలో వ్యాప్తి విస్తృతంగా ఉంటుంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందనే విషయాన్ని కూడా అంచనా వేయలేం. పారిశ్రామిక అగ్నిప్రమాదాలు..టెహ్రాన్ సమీపంలోని పలు చమురు డిపోలపై జరిగిన దాడులు, దాదాపు కోటి జనాభా ఉన్న పట్టణ ప్రాంతంపై దట్టమైన నల్లటి పొగను వ్యాపింపజేశాయి. చమురు మండటం వల్ల వెలువడే దట్టమైన పొగను ఇప్పుడు ఇరాన్లో చిన్నపిల్లలతో సహా ప్రజలు నేరుగా పీలుస్తున్నారు. ఈ పొగలో బెంజీన్, ఫార్మాల్డిహైడ్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు, ఇతర సూక్ష్మ కణ పదార్థాలు ఉంటాయి. ఇవి శ్వాసకోశంలోకి లోతుగా చొచ్చుకుపోయి, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులను తీవ్రతరం చేస్తాయి. ఇది ఎక్కువకాలంపాటు కొనసాగితే ఈ ప్రభావాలు దీర్ఘకాలం ఉంటాయి. క్యాన్సర్ల ప్రమాదం పెరగడంతో పాటు, కొన్ని నాడీ సంబంధిత రుగ్మతలు వస్తాయి. ఇరాన్లో వాయు నాణ్యత ఇప్పటికే ప్రధాన పర్యావరణ సమస్యల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ పారిశ్రామిక మంటలు లక్షలాది మంది ప్రజలు వాయు కాలుష్యం బారిన పడటానికి కారణమవుతాయి. నేల కాలుష్యం, విషపూరిత శిధిలాలు మందుగుండు సామగ్రి, సైనిక శిధిలాల పేలుడు దీర్ఘకాలిక నేల కాలుష్యానికి దారితీస్తుంది. బాంబు దాడికి గురైన ప్రాంతాల్లో సీసం, కాడ్మియం, నికెల్ లేదా క్రోమియం వంటి భారీ లోహాలు పేరుకుపోతున్నాయి. ఈ కాలుష్య కారకాలు నేలల్లో నిలిచిపోయి క్రమంగా ఆహార గొలుసులలోకి ప్రవేశిస్తాయి. కాలుష్యానికి మరో ప్రధాన కారణం ఆస్బెస్టాస్, పారిశ్రామిక రసాయనాలు, పేలని ఆయుధాల అవశేషాల శిథిలాలు, పట్టణ విధ్వంసం. సంఘర్షణానంతర కాలంలో ఈ పదార్థాల నిర్వహణ ప్రధాన పర్యావరణ సవాళ్లలో ఒకటిగా ఉంటుంది. ఉక్రెయిన్లో, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతాలపై జరిగిన బాంబు దాడుల వల్ల అనేక కాలుష్య కారకాలు పర్యావరణంలోకి వ్యాపించాయి. గాజా స్ట్రిప్లో, భవనాలు, మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం వల్ల లక్షలాది టన్నుల శిథిలాలు పేరుకుపోయాయి. ఇవి కాలుష్య నిర్మూలన, పునరి్నర్మాణ కార్యకలాపాలను క్లిష్టతరం చేస్తాయి. ధ్వంసమైన నగరాలను పునర్నిర్మించడం వాతావరణంపై అదనపు భారం పడుతుంది.మరింత నీటి సంక్షోభంయుద్ధం నీటి భద్రతను తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఆనకట్టలు, కీలకమైన మౌలిక నీటి సదుపాయాలను ధ్వంసం చేసి జనాభాను నియంత్రించడానికి ప్రత్యర్థి దేశాలు చేస్తున్న ప్రయత్నాలు సంక్షోభాలకు దారితీస్తున్నాయి. కరువులు, వ్యవసాయంలో అధిక వినియోగం, వివాదాస్పద నీటి నిర్వహణ విధానాలతో ఇప్పటికే ఇరాన్ నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. యుద్ధం వల్ల ఏర్పడే కాలుష్యం నీటి నాణ్యతను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయనుంది. పేలుళ్లు, అగి్నప్రమాదాల కారణంగా హైడ్రోకార్బన్లు పట్టణ మురుగునీటి వ్యవస్థలలోకి, కొన్ని జలమార్గాల్లోకి ప్రవహించి, నేలలను, భూగర్భ జలాలను కలుíÙతం చేశాయి. ఇక విద్యుత్ గ్రిడ్లు, శుద్ధి కర్మాగారాలపై బాంబు దాడులు చేయడం వల్ల కీలకమైన నీటి శుద్ధి ప్రక్రియ నిలిచిపోతుంది. శుద్ధి చేయని నీటిని తాగడం వల్ల ప్రజలు తక్షణమే వ్యాధుల బారిన పడుతున్నారు. 1980లలో జరిగిన ఇరాన్–ఇరాక్ యుద్ధ సమయంలో గల్ఫ్లో సముద్రం పాలైన చమురు, ఆ ప్రాంతంలోని హాక్స్బిల్ సముద్ర తాబేళ్లు అంతరించడానికి, అక్కడి గ్రీన్ తాబేళ్ల వినాశనానికి కారణమైంది.అంతరించనున్న అడవులుసంఘర్షణ అటవీ నిర్మూలనకు దారి తీస్తుంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి, ఇంధన కొరత ఏర్పడినప్పుడు, బొగ్గు, వంటచెరుకు వైపు మొగ్గు చూపాల్సి వస్తుంది. ఫలితంగా అడవులు అంతరించపోతాయి. ప్రత్యామ్నాయ ఇంధనాలు కనుమరుగైన చోట అడవుల నరికివేత పెరుగుతుంది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సూడాన్. 2023లో ఇక్కడ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖార్టూమ్, ఇతర పట్టణ ప్రాంతాల్లో చెట్ల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు2022లో ప్రపంచవ్యాప్త గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల్లో సుమారు 5.5 శాతానికి సైనిక దళాలదే. ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం పెరిగేకొద్దీ, దాని వల్ల ఏర్పడే కర్బన్ ఉద్గారాలు కూడా పెరుగుతున్నాయి. 26 దేశాలు ఏడాది పొడవునా విడుదల చేసే ఉద్గారాల కంటే గాజా సంఘర్షణలో మొదటి 120 రోజుల్లోనే ఎక్కువ ఉద్గారాలు వెలువడ్డాయని ఒక పరిశోధనలో తేలింది. ఇరాన్ యుద్ధంలో జలాంతర్గామి కార్యకలాపాలు, సుదూర బాంబర్ దాడులు, క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటివల్ల వెలువడే ఉద్గారాల భారం చాలా ఎక్కువ. గల్ఫ్ యుద్ధంలోనూఈ ప్రాంతం గతంలోనూ యుద్ధ కాలుష్యాన్ని చూసింది. 1991 గల్ఫ్ యుద్ధ సమయంలో, ఇరాకీ దళాలు 600 కంటే ఎక్కువ కువైట్ చమురు బావులకు నిప్పంటించాయి. నెలల తరబడి, దట్టమైన పొగ ఆకాశాన్ని కమ్మేసింది. దీంతో గల్ఫ్ అంతటా వాయు కాలుష్యం, నేల, భూగర్భ జలాల కాలుష్యం విస్తృతమైంది. అది అనేక అనారోగ్య సమస్యలకూ కారణమైంది. ఇందుకుగాను ఐక్యరాజ్యసమితి పరిహార కమిషన్కు నష్టపరిహారంగా ఇరాక్ 50 బిలియన్ డాలర్లకు పైగా చెల్లించింది.ఉక్రెయిన్లోనూమరో భయంకరమైన తాజా ఉదాహరణ ఉక్రెయిన్. యుద్ధం ఒక విషపూరిత వాతావరణాన్ని సృష్టించింది. ఇక్కడ ఇంధన డిపోలు, పారిశ్రామిక ప్రాంతాలు, రసాయన గిడ్డంగులు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు దేశంలోని చాలా ప్రాంతాల్లో గాలి, నదులు, వ్యవసాయ భూములను కలుషితం చేశాయి. చమురు కేంద్రాల్లో మంటలు, అటవీ నిర్మూలన, దెబ్బతిన్న పారిశ్రామిక ప్రాంతాల నుంచి వెలువడిన కాలుష్యం నీటి వ్యవస్థల పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించింది. -
ట్రంప్ హెల్త్ చెకప్ .. అధ్యక్షుడు సేఫేనా?
వాషింగ్టన్, డీసీ: డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. తాను ఆరోగ్యంగా ఫర్ఫెక్ట్ ఉన్నానని ప్రకటించారు. తనకు వైద్య పరీక్షలు అద్భుతంగా జరిగాయని అందులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవన్నారు. త్వరలో డొనాల్డ్ ట్రంప్ తన 80వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అప్డేట్ ఇచ్చారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై చాలానే పుకార్లు వచ్చాయి. ట్రంప్ ఆరోగ్యంగా లేరని వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయని కథనాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన చేతులపై కమిలిన గుర్తులు ఉండటం, సమావేశాలలో నిద్రపోతున్నట్లు కనిపించడం ఈ వాదనలకు మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితులపై ట్రంప్ కీలక ప్రకటన చేశారుతన ట్రూత్ సోషల్ పోస్ట్లో " అంతా ఖచ్చితంగా ఉంది నేను 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నానో, ఇప్పుడూ అలాగే ఉన్నాను జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిదేమో" అని సరదాగా అన్నారు. జూన్ 14 నాటికి ట్రంప్ 80వ సంవత్సరంలోకి అడుగుపెడతారు. ట్రంప్ ఆరోగ్య పరీక్షలను వైట్ హౌస్ 'వార్షిక పరీక్ష' అని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం దీనిని 6 నెలల ఫిజికల్ టెస్ట్' అని పేర్కొనడం కొంత గందరగోళానికి దారితీసింది. ట్రంప్ ఆరోగ్య సమస్యలుట్రంప్ 0 గతేడాది ట్రంప్ కాళ్ల వాపు సమస్యతో బాధపడుతున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. సిరల్లోని కవాటాల లోపం వల్ల రక్తం చేరి ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. చేతులపై గుర్తులు: ఆయన చేతులపై కనిపించే మచ్చలకు, గుండె ఆరోగ్య నియమాలలో భాగంగా ఆయన తీసుకునే 'ఆస్పిరిన్'టాబ్లెట్లే కారణమని వైట్ హౌస్ స్పష్టం చేసింది.రాజకీయ ప్రాధాన్యతఅమెరికా రాజకీయాల్లో అధ్యక్షుల వయస్సు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల సమయంలో 81 ఏళ్ల జో బైడెన్ వైదొలిగిన తర్వాత, ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధుడైన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ప్రత్యర్థుల కంటే తాను శారీరకంగా, మానసికంగా చాలా దృఢంగా ఉన్నానని ట్రంప్ తరచుగా అంటుంటారు. -
ఇరాన్పై అమెరికా నిప్పుల వర్షం
వాషింగ్టన్/దుబాయ్: అమెరికా, ఇరాన్ల మధ్య కాల్పుల విరమణతో కొన్నాళ్లుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ ఒక్కసారిగా అలజడి చెలరేగింది. ఇరాన్తో శాంతి ఒప్పందం విషయంలో ముందడుగు వేశామని ఒకవైపు అమెరికా అధ్యక్షుడు చెబుతుండగా, మరోవైపు అమెరికా సైన్యం సోమవారం దక్షిణ ఇరాన్పై భీకర దాడులకు పాల్పడింది. బందర్ అబ్బాస్ సహా పలు ప్రాంతాల్లో ఇరాన్ సైనిక స్థావరాలపై నిప్పులు వర్షం కురిపించింది. ఇరాన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మందుపాతరలు అమర్చే పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా మిలటరీ సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టేన్ టిమ్ హాకిన్స్ సోమవారం ప్రకటించారు.ఇవి కేవలం తమ ఆత్మరక్షణ కోసం జరిగిన దాడులేనని వివరణ ఇచ్చారు. ఇరాన్ దళాల ముప్పు నుంచి తమ సైనికులను కాపాడుకోవడానికి దాడులకు చేయక తప్పలేదన్నారు. అయితే, ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతోంది కాబట్టి తాము చాలా సంయమనం పాటిస్తున్నామని చెప్పారు. అమెరికా దాడుల్లో ఇరాన్కు ఏ మేరకు నష్టం వాటిల్లిందన్నది ఇంకా తెలియరాలేదు.పడవలపై అమెరికా దాడులు చేయడంతో నలుగురు ఇరాన్ జవాన్లు మరణించినట్లు ‘తబ్నాక్’అనే వార్తా సంస్థ వెల్లడించింది. హార్మూజ్ జలసంధిపై ఉన్న, సైనిక ఓడరేవుతోపాటు విమానాశ్రయం కలిగిన బందర్ అబ్బాస్ నగర పరిసరాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ తెలిపింది. తాజా దాడులు కాల్పుల విరమణ ప్రక్రియపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి కాల్పుల విరమణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. శాంతి యత్నాలకు భంగం కలిగించొద్దు: ఇరాన్ అమెరికా దాడులను ఇరాన్ మంగళవారం తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాన్ని దురుద్దేశం, విశ్వసనీయత లేమికి సంకేతంగా అభివర్ణించింది. శాంతి యత్నాలకు భంగం కలిగించే చర్యలకు పూనుకోవద్దని సూచించింది. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘినట్లు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విమర్శించింది. తదుపరి అన్ని పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.ఏ దురాక్రమణ చర్యకైనా జవాబు ఇవ్వకుండా ఇరాన్ వదిలిపెట్టదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం ఖతార్లో చర్చల కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ ఈ చర్చల్లో పాల్గొంటున్నారు. చర్చలు సజావుగా సాగుతున్నాయని, ఒప్పందం విషయంలో తాము తొందరపడడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోమవారం స్పష్టంచేశారు. అమెరికా డ్రోన్లు, ఫైటర్ జెట్ను కూల్చాం: ఐఆర్జీసీ అమెరికాకు బుద్ధి చెప్పామని ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్(ఐఆర్జీసీ) ప్రకటించింది. తమ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్లను, ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు తెలిపింది. అయితే, ఈ ఘటన ఎప్పుడు జరిగిందన్నది బయటపెట్టలేదు. ఆ యురేనియంను నాశనం చేయాల్సిందే: ట్రంప్ ఇరాన్ వద్దనున్న శుద్ధిచేసిన యురేనియం(అణు ధూళి)ను నాశనం చేయాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాకు తరలించి, నాశనం చేయవచ్చని చెప్పారు. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) ఆధ్వర్యంలో మరొక ఆమోదయోగ్యమైన ప్రదేశంలో నాశనం చేయడానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ఆ యురేనియంను అక్కడికక్కడే నామరూపాల్లేకుండా చేసినా అభ్యంతరం లేదన్నారు. ఇరాన్ వద్దనున్న యురేనియంను తమకు అప్పగించాలని, అలాగైతేనే ఇరాన్తో శాంతి ఒప్పందానికి అంగీకరిస్తామని ట్రంప్ ఇప్పటిదాకా షరతు విధించిన విషయం విదితమే. కానీ, తాజాగా ఆయన తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో పోస్టుచేశారు. -
తైవాన్పై ఉభయుల చదరంగం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల రెండవ వారంలో చైనాను సందర్శించిన సందర్భంగా తైవాన్ విషయమై అన్న మాటలు కొన్ని అపోహలను కలిగించాయి. తన వ్యాఖ్యలను కొందరు స్థూల దృష్టితో చూసి నిజమని నమ్ముతున్నారు కూడా. తైవాన్కు సంబంధించి ఆయన ఇక చేతులు ఎత్తివేసినట్లేననే వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్త వమో జాగ్రత్తగా పరిశీలించటం అవసరం.మార్పున్నట్టా? లేనట్టా?రెండు దేశాల అధ్యక్షుల మధ్య తొలి సమావేశం మే 14న జరిగినపుడు షీ జిన్పింగ్ తైవాన్ ప్రస్తావన చేస్తూ, తమ ప్రయోజ నాలకు ముఖ్యమైన అంశాలలోకెల్లా అతిముఖ్యమైనది తైవాన్ అనీ, అందుకోసం తాము అమెరికాతో ఘర్షణకైనా సిద్ధమనీ చెప్పారు. ఈ ప్రస్తావన సాగినంత కాలం ట్రంప్ ముఖకవళికలు బరువుగా కనిపించాయి. స్పందనలేవీ లేవు. మరునాడు స్వదేశానికి తిరిగి వెళుతుండగా విమానంలో విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన నుంచి మూడు మాటలు వినిపించాయి. అమెరికా నుంచి 9,500 మైళ్ల (15 వేల కిలోమీటర్ల) దూరంగల తైవాన్ కోసం తాము శక్తిమంతమైన చైనాతో యుద్ధం చేయలే మన్నది ఒకటి. స్వతంత్రాన్ని ప్రకటించ వద్దంటూ తాను తైవాన్ నాయకత్వానికి చెప్పానన్నది రెండు. తైవాన్కు విక్రయించదలచిన ఆయుధాల విషయమై తుది నిర్ణయ మేదీ తీసుకోలేదన్నది మూడు. పోతే, చైనాకు బయలుదేరే ముందు రోజున అమెరికా విదేశాంగ మంత్రి రూబియో, తైవాన్ విధానంలో మార్పేమీ ‘ప్రస్తుతానికి’ లేదన్నారు. చైనా అధ్యక్షుడు గతంలో ఎన్నడూ లేనంత తీవ్రమైన హెచ్చరికలు ముఖాముఖిన చేయటం, అందుకు అమెరికా వైపు నుంచి ఎన్నడూ లేనంత జాగ్రత్తతో కూడిన స్పందనలు రావటంపై సహజంగానే విస్తృతమైన చర్చలు, ఊహాగానాలు మొదలయ్యాయి. తైవాన్, జపాన్ కలవరపడగా, అమెరికాలోని మితవాద లాబీలు విమర్శించాయి. ఇంతకూ అమెరికా తన చిరకాలపు విధానాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్లా? చేతులు ఎత్తివేస్తున్నట్లా?యుద్ధానికి దూరంతో ఏం పని?అందుకోసం మొదట అమెరికా అధ్యక్షుని మూడు మాటలను, ఆయన విదేశాంగ మంత్రి మాటను తిరిగి చూడాలి. చైనాతో యుద్ధం చేయదలిస్తే అమెరికన్లు 15,000 కి.మీ.లు ప్రయాణించ వలసిన అవసరమే లేదు. వారికి చైనాకు పొరుగున గల జపాన్లో 4, దక్షిణ కొరియాలో 2, గువామ్లో 2 బలమైన సైనిక స్థావరాలున్నాయి. ఫిలిప్ఫైన్స్లో సైనిక వెసులుబాట్లున్నాయి. స్థావరాలతో సరిపోల్చగల అత్యాధునిక విమాన వాహక నౌకాదళాలను, అణ్వాయుధాలనైనా ప్రయోగించగల జలాంతర్గములను చైనా సమీపాన మోహరించగలరు. దీర్ఘశ్రేణి క్షిపణులూ ఉండనే ఉన్నాయి. అందువల్ల వేల కిలోమీటర్ల దూరమన్నది అర్థం లేని మాట. ఏమి చేస్తారన్నది రాజకీయ నిర్ణయం మాత్రమే. పైన పేర్కొన్న స్థావరాలు, నౌకా బలంతో, తైవాన్కు ఇప్పటికే సమకూర్చిన ఆయుధ సంపత్తితో, చైనీయులు తైవాన్పై దాడి చేసినట్లయితే తాము కూడా సైనిక జోక్యం చేసు కోగలమంటున్న జపాన్, ఫిలిప్ఫైన్స్ల ప్రకటనలతో, చైనాను ఓడించగలరా లేదా అన్నది వేరే ప్రశ్న. కానీ, తమకు తైవాన్ అత్యంత ముఖ్యమంటున్న చైనాతో యుద్ధానికి సిద్ధపడటమన్నది రాజకీయ నిర్ణయం. ఆ నిర్ణయం మునుముందు అనేక పరిస్థితులపై ఆధార పడి ఉంటుంది. కనుక ప్రస్తుతం ట్రంప్ అన్నది తుది వాక్యం కాదు. రెండవ మాటకు వస్తే, ‘స్వాతంత్య్రం ప్రకటించవద్దని’ తైవాన్కు సూచించటం ఇది కొత్త కాదు. తమది ‘వ్యూహాత్మక అస్పష్టత’ అన్న మాట అమెరికా ఉపయోగిస్తున్నదే. స్వాతంత్య్రం ప్రకటించు కొండి అనరు, అసలు ప్రకటించకుండా ఒకే చైనా విధానం ప్రకారం చైనాలో విలీనమైపొండి అని కూడా అనరు. సూత్ర రీత్యా తైవాన్ చైనాలో భాగమే అయినా ఆ పని బలవంతంగా జరిగితే ఒప్పుకో బోమంటారు. తైవాన్ సంరక్షణ చట్టమంటూ చేసి వారికి ఆయు ధాలు అమ్మే విచిత్రమైన విధానాన్ని అనుసరిస్తుంటారు. అందువల్ల, తాను తైవాన్కు స్వాతంత్య్రం ప్రకటించవద్దంటూ చెప్పానన్న ట్రంప్ మాట కూడా అర్థం లేనిదే.మూడవది పెండింగ్లో ఉన్న ఆయుధాల విక్రయం. వాటి విలువ 14 బిలియన్ల డాలర్లు. అమెరికా అధ్యక్షుడు అన్నది ఆ విష యమై ‘ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తైవాన్ నాయకత్వంతో మాట్లాడుతాను’ అని. అంతే తప్ప అమ్మబోము అనలేదు. ట్రంప్ ఆ మాత్రపు మాట అన్న వెంటనే ఒకవైపు తైవాన్ నుంచి, మరొకవైపు రిపబ్లికన్లతో పాటు డెమోక్రటిక్ సెనేటర్ల నుంచి ఒత్తిడులు మొద లయ్యాయి. చైనా వ్యతిరేకించినా ఆయుధాల విక్రయం జరుగు తూనే వస్తున్నది గనుక, ఈసారి కూడా కొంత వ్యవధి తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపడనక్కర లేదు. ఎందుకంటే, చైనా విషయంలో, మొత్తం పసిఫిక్ విషయంలో అమెరికా దీర్ఘకాలిక ప్రయోజనాలలో, వ్యూహాలలో మార్పు లేదు గనుక. కాకపోతే, ప్రస్తుత పరిస్థితులలో చైనాతో కొంత మెత్తగా వ్యవహరించాలన్నది ఒక ఎత్తుగడ అయినందున ఈ విధంగా మాట్లాడతారు.వ్యూహం ఉండనే ఉంది!ఆ ప్రయోజనాలు, వ్యూహాలు ఏమిటో, అందులో భాగంగా చైనాను నియంత్రించటం ఎట్లానో, అందుకు తైవాన్ అవసరం ఏమిటో 2022లో బైడెన్, తర్వాత 2025, 2026లో ట్రంప్ స్వయంగా తమ వ్యూహపత్రాలలో వివరించి చెప్పారు. వారిద్దరి కన్నా ముందే ఒబామా– ఇరాక్, అఫ్గాన్ పరాభవాల దరిమిలా ఇక తమ దృష్టి పసిఫిక్ వైపు, చైనా వైపు మళ్లటం అవసరమని ప్రతిపా దించి పోయారు. ఇదంతా లాటిన్ అమెరికా నుంచి పశ్చిమాసియా మీదుగా తూర్పు ఆసియా వరకు అమెరికా ప్రయోజనాలను, ఆధిప త్యాన్ని సుస్థిరపరచుకునే విస్తృతమైన, దీర్ఘకాలికమైన ప్రణాళికలో భాగం. అందుకోసం తైవాన్ను తమ ప్రభావం కింద ఉంచుకోవ టమే కాదు, ఇంకా అనేకం చేయవలసి ఉంటుంది. ఆ వివరాలు కూడా కొన్ని పైన పేర్కొన్న వ్యూహ పత్రాలలో పేర్కొన్నారు.అందువల్ల, తైవాన్ గురించి ఇపుడు ట్రంప్ ఏమన్నారో చూసి ఆయన చేతులు ఎత్తేశారంటూ అపోహ పడటం పొరపాటు అవు తుంది. చారిత్రకంగా తమ దేశంలో భాగమైన తైవాన్ను ఎప్పటికైనా నయానో భయానో విలీనం చేసుకోవటం చైనా లక్ష్యం. హాంకాంగ్, మకావూ వలెనే తైవాన్లోనూ ఒక దేశం రెండు వ్యవస్థల పద్ధతిని అనుసరించేందుకు సిద్ధమని చైనా గతంలోనే ప్రకటించింది. ఆ విధంగా ‘శాంతియుత విలీనానికి’ అడ్డంకులు కల్పించరాదని అమె రికాను కోరుతున్నది. అందుకు తైవాన్ ప్రతిపక్షం సుముఖత చూపు తుండగా, అధికారపక్షం నిరాకరిస్తున్నది. ఆ పార్టీకి అమెరికా ప్రోత్సాహం ఉంది. ఈ మొత్తం పరిస్థితులు ఎట్లా పరిణమించేదీ భవిష్యత్తులో చైనా, అమెరికాల ఆర్థిక, సైనిక, రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతూ పోగలవన్న దానిపైనే ఆధారపడి ఉండవచ్చు.టంకశాల అశోక్వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
మీ దేశం వెళ్లిపొండి.. భారతీయ జంటపై జాత్యాహంకారం
అమెరికాలో భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విషయమై ఆ దేశ మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చినప్పటికీ పరిస్థితులు ఏ మాత్రం మారడం లేదు. తాజాగా అటువంటి ఘటన మరోకటి జరిగింది. భారతీయ సంతతికి చెందిన ఓ జంటను మీరు తిరిగి భారత్కు వెళ్లాలంటూ అమెరికాలో ఉండకూడదంటూ ఓ అపరిచితుడు హెచ్చరించాడు. తాజాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన మార్కోరూబియోను అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనలపై ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలో ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఒక ప్రాంతంలో ఒక భారతీయ జంట నిల్చొని ఉంది. అక్కడే ఉన్న ఓ అమెరికా దేశస్థుడు.. ఆ జంటను.. మీరు భారతీయులా . అమెరికా కంటే భారతదేశం మంచిదా అని ప్రశ్నించారు. ఆ దంపతులు సంయమనంతో సంభాషణను కొనసాగించారు. వారి కుటుంబం భారతదేశంలో ఉందని భర్త వివరిస్తుండగా, భారతదేశం అంత బాగుంటే మీరు అమెరికాలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించాడు.దానికి అక్కడే ఉన్న వ్యక్తి ప్రపంచాన్ని అన్వేషించడానికి అని బదులిచ్చాడు. కాదు నువ్వు ఇక్కడ మాకు వద్దు. నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, నా దేశం నుండి వెళ్లిపొండి అని వారిని తిట్టాడు. కానీ ఆ భారతీయ వ్యక్తి పెద్దగా స్పందించలేదు. అయితే ఈ ఘటనను చాలా కలవరపరిచేదిగా అక్కడి ఎన్నారై ఛానల్ ఆ వీడియోను పంచుకుంటూ కథనం రాసింది. **IMPORTANT**Dear Indian Diaspora,These kind of incidents are up in real world in North Texas. If it happens to you or anyone you know or in your vicinity - DO REPORT it to authorities. Have hate incident recorded on your side & give it to cops.Inaction emboldens bullies!! pic.twitter.com/pp2wjHUnJ3— Sravy G (@sravytweets) May 26, 2026 -
ఒకవైపు చర్చలు మరో వైపు దాడులు
-
అమెరికాలో భారతీయ మహిళ హత్య
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్లో గుజరాత్కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బాంబుల మోత మధ్య ట్రంప్ బిగ్ డిమాండ్
పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరోసారి తీవ్రంగా మారాయి. ఇరాన్ దక్షిణ ప్రాంతంలోని బందర్ అబ్బాస్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం తాజా దాడులు చేసినట్లు ప్రకటించింది. మిసైల్ స్థావరాలు, మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్న పడవలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది. ఇవి తమ దళాల రక్షణ కోసం “స్వీయరక్షణ చర్యలు”గా చేపట్టినట్లు అమెరికా పేర్కొంది.ఇరాన్ దళాల నుంచి ఉన్న ప్రమాదాలను అడ్డుకునేందుకే ఈ దాడులు జరిగాయని అమెరికా ప్రకటించుకుంది. అయితే ఇదే సమయంలో దోహాలో అమెరికా–ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతుండటం పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఖతార్ ప్రధానితో చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం.. బందర్ అబ్బాస్ ప్రాంతంలో పలు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనంతరం అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయని, శత్రు లక్ష్యాలను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకున్నాయని సమాచారం. పర్షియన్ గల్ఫ్ సమీపంలోని సిరిక్, జాస్క్ ప్రాంతాల్లో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది.ఈ ఘటనలపై ఇరాన్ ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి ప్రతిస్పందన ఇవ్వలేదు. అయితే దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ నూతన నేత కఠిన వ్యాఖ్యలు చేస్తూ “మేము వెనక్కి తగ్గేది లేదు” అని హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్పై పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.ట్రంప్ బిగ్ డిమాండ్ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారి తీశాయి. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం (enriched uranium) ను పూర్తిగా నియంత్రించాల్సిందేనని.. అది రెండు మార్గాల్లో జరగొచ్చని ఆయన సూచించారు. ఒకటి.. ఇరాన్ తమ దగ్గర ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు అప్పగించాలి. రెండోది.. అంతర్జాతీయ పర్యవేక్షణలోనైనా ధ్వంసం చేయాలి. ఈ మేరకు ట్రంప్ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై కఠిన నియంత్రణ అవసరమని ఆయన ఉధాట్టించారు.ఇరాన్–అమెరికా మధ్య శాంతి చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. ఈ తాజా దాడులు మరియు హెచ్చరికలు ఆ చర్చలకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే ఈ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు జరుపుతోంది. ఇక్కడ కూడా కాల్పుల విరమణ అమల్లోకి ఉన్నప్పటికీ.. హెజ్బొల్లా గ్రూపుపై దాడులు కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతోంది. సుమారు 70 స్థావరాలను లక్ష్యంగా చేసుకోగా.. 10 కమాండ్ సెంటర్లు సహా ఆయుధ డిపోలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. లెబనాన్ వర్గాలు ఈ దాడుల్ని ఖండిస్తున్నట్లు ప్రకటించాయి. -
సీజ్ఫైర్ ఉన్నా ఆత్మరక్షణ కోసం తప్పట్లేదు
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తాయి. యుద్ధ విరమణ, శాంతి చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలోనే అమెరికా దళాలు ఇరాన్పై దాడులకు దిగాయి. ఈ దాడులు “ఆత్మరక్షణ చర్యలు”గా ప్రకటించినప్పటికీ.. ఘర్షణలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ Reuters నివేదిక ప్రకారం.. సోమవారం అమెరికా సైన్యం దక్షిణ ఇరాన్ ప్రాంతంలో బందర్ అబ్బాస్ వద్ద పలు లక్ష్యాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో.. హర్ముజ్లో సీమైన్స్ అమర్చేందుకు ప్రయత్నిస్తున్న బోట్స్తో పాటు మిస్సైల్ లాంచ్ సైట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించుకుంది.అయితే ఈ చర్యలు తమ సైనిక బలగాలను రక్షించుకోవడానికే అని యూఎస్సీసీ స్పష్టం చేసింది. “ప్రస్తుతం కొనసాగుతున్న సీజ్ఫైర్ పరిస్థితుల్లో కూడా మా బలగాల రక్షణ కోసం జాగ్రత్తగా, పరిమితంగా చర్యలు తీసుకుంటున్నాం” అని నేవీ కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు.అమెరికా వర్గాల ప్రకారం.. ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు తమ దళాలపై ముప్పు కలిగించే ప్రయత్నాల్లో ఉన్నాయని, అందుకే ఈ “ప్రివెంటివ్ స్ట్రైక్స్” తప్పనిసరి అయ్యాయని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ దాడుల్ని ధృవీకరించాల్సి ఉంది. ఈ దాడులపై ఇరాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఇటు లెబనాన్లోనూ కాల్పుల విరమణకు తూట్లు పడింది. హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. ఈ దాడులపై ఇజ్రాయెల్ వర్గాలు “సరిహద్దు భద్రత కోసం అవసరమైన చర్యలు”గా వివరణ ఇస్తుండగా.. లెబనాన్ వర్గాలు మాత్రం దీనిని కాల్పుల విరమణ ఉల్లంఘనగా ఖండిస్తున్నాయి.ఇరాన్–అమెరికా మధ్య ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ తాజా దాడులు చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయా? అనే ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఇరాన్ పూర్తి స్థాయి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. అలాగే అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాన్ని ఎలా చూడబోతుందన్నది కూడా కీలకంగా మారింది. -
చమురు ధర దిగొచ్చేదెలా?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఏం చెప్పినా హార్మూజ్ జలసంధి ఇప్పట్లో తెరుచుకో బోదని అందరికీ అర్థమైంది. అమెరికాకూ, ఇరాన్కూ మధ్య సాగుతున్న ఎడతెగని లడాయి పర్యవసానంగా ముడిచమురు, సహజవాయు దిగుమతులు అస్తవ్యస్తమై ఇంధన ధరలు తారస్థాయిలో పెరిగిపోతున్నాయి. మన దేశంలో కేవలం 11 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థ(ఓఎంసీ)లు నాలుగోసారి సోమ వారం ఉదయం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి. ఇంతవరకూ ఈ పెరుగుదల లీటర్కు సగటున రూ. 8 ఉంది. నిజానికి రూ.28 నుంచి రూ. 33 వరకూ పెంచితే తప్ప నష్టాల భర్తీ సాధ్యపడదని నిపుణులు సెలవిస్తున్నారు. అందులో సగమో, అంతకన్నా కాస్త తక్కువో పెంచకతప్పదనేది కూడా వారి మాటే. యుద్ధం మొదలైనాక వాటి ధరలు 30 శాతం పెరిగినా మన దేశంలో దాదాపు 74 రోజులపాటు ఓఎంసీలు ‘పెద్ద మనసు’తో రూ. లక్షా 20 వేలకోట్లకుపైగా నష్టాన్ని భరించాయి. ‘ఒక దేశం–పలు ఎన్నికలు’ జనానికి చేసే మేలుగా దీన్ని చూడాలి! అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే చమురు ధరలు కళ్లెం తెంచుకున్న గుర్రం మాదిరి పరుగులంకించుకున్నాయి. అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్ 250’ పేరిట శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఢిల్లీలో అమెరికా రాయబారిగా ఉంటున్న సెర్జియో గోర్ నేరుగా తమ అధ్యక్షుడు ట్రంప్కు ఫోన్ చేసి ఆ సంభాషణలు అందరికీ వినిపించారు. ‘భారత్ నాపై వంద శాతం భరోసా పెట్టుకోవచ్చు. ఏ సాయం కావాల్సివచ్చినా ఎక్కడికి ఫోన్ చేయాలో వారికి తెలుసు’ అంటూ ట్రంప్ చెప్పుకుపోయారు. ‘నేను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ను’ అని కూడా అన్నారు. కానీ దురదృష్టమేమంటే మన చమురు కష్టాలకు ట్రంపే కారకుడు. తన నిర్వాకం ఫలితంగా ముడి చమురు, సహజవాయు ధరలు పెరిగి అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటుతుంటే, ఆర్థిక వ్యవస్థలు పతనమవుతుంటే... చవగ్గా రష్యా అమ్మజూపే చమురు కొనడానికి వీల్లేదంటూ మూర్ఖపు ఆంక్షలు విధిస్తున్నది ఆయనగారే. మధ్యమధ్యన ‘ఈ నెల్లాళ్లూ కొనుక్కోండి... ఈ రెండు వారాలూ ఓకే’ అంటూ బిచ్చంవేస్తున్నట్టు సడలిస్తున్నదీ ఆయనే. ఇప్పుడైతే పూర్తి స్థాయి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ముడి చమురు అవసరాల్లో 90 శాతం దిగుమతులపైనే ఆధారపడే దేశంగా మనం చమురు దిగుమతి దేశాల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాం. హార్మూజ్ను కాదని, ఎర్ర సముద్రంవైపునుంచి దిగుమతి చేసుకుందామనుకున్నా యుద్ధ భీతితో ఇన్సూరెన్సు సంస్థలు నౌకల బీమా ప్రీమియంను భారీగా పెంచేశాయి. రవాణా చార్జీలూ అంతే. ఇదంతా ఓఎంసీలకు తడిసిమోపెడవుతున్న మాట వాస్తవమే.ఎవరి మస్తిష్కం ఎలా ప్రకోపిస్తుందో, దాని పర్యవసానాలేమిటో తెలియని వర్తమానంలో మనం దీర్ఘకాలిక వ్యూహాన్ని రూపొందించుకోక తప్పదు. ముడి చమురు, సహజవాయు నిల్వలను పెంచుకోవటం, దిగుమతులకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ, చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీతను పెంచుకునే అవకా శాలు చూడటం ప్రధానం. వీటితోపాటు అర్థరహితమైన ఆంక్షలతో ఇబ్బంది పెడుతున్న అమెరికాను ప్రశ్నించటం కూడా తక్షణావసరం. శరవేగంగా విస్తరిస్తున్న మన ఆర్థిక వ్యవస్థకు చేటుతెచ్చేలావుంటున్న మతిమాలిన హుకుంలు కట్టిపెట్టమని చెప్పటం ముఖ్యం. ‘మేం సన్నిహిత మిత్రులం...’ అని చెప్పే అమెరికా కబుర్లు ఆచరణలో నిగ్గుతేలేది ఇలాంటపుడే.ఇంధన ధరల పెరుగుదల పాపంలో రాష్ట్రాల వాటా కూడా ఉంది. పెట్రో ధరలవల్ల నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్యులు విలవిల్లాడుతున్నా విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పేరుతో దోపిడీ చేయటం కొన్ని రాష్ట్రాలు ఆపటంలేదు. పర్యవసానంగా చమురు ధర మరింత మండిపోతోంది. ఢిల్లీలో రూ. 99. 51 ఉన్న పెట్రోల్ ఆంధ్ర ప్రదేశ్లో రూ.118వరకూ ఉండటంపై బాబు సర్కారు ఏం చెబుతుంది? బీజేపీ సర్కార్లున్నచోట రూ. 114 వరకూ ఉంటే, పొరుగునున్న తమిళనాట రూ. 107.80 ఉంది. మరి ఏపీ ప్రజలు చేసుకున్న పాపం ఏమిటి? ఈ కష్టకాలంలో జనానికి చేతనైతే సాయపడాలి. పనిలో పనిగా దోచుకునే అతి తెలివి కట్టిపెట్టాలి. -
ప్రపంచానికి శుభవార్త.. త్వరలో హర్ముజ్ పునఃప్రారంభం..?
ప్రస్తుతం దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ ప్రపంచానికి ఒక శుభవార్త అందింది. ఒకవేళ చర్చలు సఫలమైతే వచ్చే 30 రోజుల్లో హర్ముజ్ జలసంధి పునఃప్రారంభం అయ్యే అవకాశమున్నట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురించాయి. ఇదే జరిగితే హర్ముజ్లో ప్రపంచ దేశాల నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణం కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం జరుగుతున్నట్లు సమచారం.అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రపంచం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లడానికి ప్రధాన కారణం హర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్భందించడం. దీంతో చమురు సరఫరాకు ఆటంకం తలెత్తి సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ప్రస్తుతం దోహలో జరుగుతున్న చర్చలు సఫలమైతే 30 రోజుల్లో హర్ముజ్ తెరిచేలా అమెరికా ప్రణాళికలు రచిస్తోన్నట్లు తెలుస్తోంది.హర్ముజ్లో ఇరాన్ సముద్రపు మైన్లను అమర్చిన నేపథ్యంలో వాటిని ఒప్పందం కుదిరిన వెంటనే తక్షణమే అమెరికా వాటిని తొలిగించే ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్ని దేశాలకు చెందిన నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, సురక్షితంగా ఇక్కడ ప్రయణించడానికి మార్గం సుగమం అవుతుంది. అదే విధంగా జలసంధి గుండా వెళ్లే నౌకల నుండి ఇరాన్ వసూలు చేస్తున్న రవాణా రుసుములను పూర్తిగా రద్దు చేస్తుందని పత్రికా కథనాలు పేర్కొన్నాయి.అయితే ఇటీవల ఇరాన్ సైతం కొంతమేర తగ్గింది. అంతర్జాతీయ అణు నిబంధనలకు తాము కట్టుబడి ఉంటామని ఆ దేశ అధ్యక్షుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.కాగా ప్రస్తుత చర్చల్లో పాల్గొనడానికి ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఇంతకాలం ప్రపంచం ఎదుర్కొన్న చమురు సంక్షోభానికి ముగింపు లభించినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. -
అమెరికా-ఇరాన్ చర్చల వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: దోహాలో అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.‘యుద్ధం ఎవరూ కోరుకోవడం లేదు..కానీ ఈ ఒప్పందం కుదరకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది’అని ఆయన హెచ్చరించారు.2026 మే 22న దోహాలో అమెరికా-ఇరాన్ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చలు మరింత ముందుకు సాగేందుకు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అరాగ్చీ ఖతార్ చేరుకున్నారు. ఈ పరిణామాలతో ఇరుదేశాల మధ్య త్వరలో ఒప్పందం కుదురుతుందనే అంచనాలు నెలకొన్నాయి.ట్రంప్ గత శనివారం సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్, ఖతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సయ్యద్ ఆసిమ్ మునీర్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా II, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.ఈ చర్చల్లో ట్రంప్, అబ్రహాం ఒప్పందాలపై అన్ని దేశాలు ఒకేసారి సంతకం చేయాలని సూచించారు. ఇప్పటికే యూఏఈ, బహ్రెయిన్ సభ్యులుగా ఉన్నాయని, మిగతా దేశాలు కూడా సిద్ధంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకటి లేదా రెండు దేశాలు సంతకం చేయకపోయినా అది అంగీకారయోగ్యమే కానీ ఎక్కువ దేశాలు ఈ ఒప్పందంలో భాగం కావాలని ఆయన స్పష్టం చేశారు. President Donald Trump posts on Truth Social- "Negotiations with the Islamic Republic of Iran are proceeding nicely! It will only be a Great Deal for all or, no Deal at all to the Battlefront and shooting, but bigger and stronger than ever before, and nobody wants that! During my… pic.twitter.com/D1IhQaGjim— ANI (@ANI) May 25, 2026 -
ప్రపంచ ఐస్క్రీమ్కే రాజధాని
ఎండాకాలం అంటే మన మైండ్లో ముందుగా ఫ్లాష్ అయ్యే ఇమేజ్ ఏంటి? వేడెక్కిన రోడ్లు, వడగాలుల మధ్య చేతిలో చల్లని ఐస్క్రీమ్. అయితే ప్రపంచంలో ఐస్క్రీమ్కు కూడా ఒక రాజధాని ఉంది అని దానిని ఐస్ క్రీమ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని పిలుస్తారని తెలుసా?అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ‘లే మార్స్’ అనే స్మాల్ టౌన్ ఈ స్పెషల్ టైటిల్తో వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది. ఈ పట్టణం చిన్నది అయినా అక్కడి ఐస్క్రీమ్ క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. అక్కడ వీధుల్లో నడుస్తుంటే కూడా స్వీట్ వెనీల్లా సువాసన వస్తుంది అని టూరిస్టులు చెబుతారు.బ్లూ బన్నీ స్టోరీతో ఫేమస్ అయిన స్టోర్లే మార్స్ ΄పాపులారిటీ వెనక అతిపెద్ద కారణం వచ్చేసి వెల్స్ ఎంటర్ప్రైసెస్ అనే కంపెనీ. ఈ సంస్థ నడిపించే బ్లూ బన్నీ అనే ఐస్క్రీమ్ బ్రాండ్ చాలా పాపులర్ అయింది. కొన్ని దశాబ్దాల నుంచి ఐస్క్రీమ్ ప్రొడ్యూస్ చేస్తూ ఈ చిన్న పట్టణాన్ని అంతర్జాతీయ డెసెర్ట్ మ్యాపులో పెట్టింది ఈ సంస్థే.ప్రతీ రోజు ఇక్కడ భారీ పరిమాణంలో ఐస్క్రీమ్ ప్రిపేర్ చేస్తారు. వెనీల్లా, స్ట్రాబెర్రీ, చాకొలేట్, కేరామెల్ం సింపుల్ ఫ్లేవర్స్ నుంచి కలర్ఫుల్ క్రేజీ కాంబినేషన్స్ వరకు ఇక్కడ ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అక్కడ ఐస్క్రీమ్ అనేది జస్ట్ ఫుడ్ మాత్రమే కాదుం లోకల్ కల్చర్లో ఒక పార్ట్లా ఫీల్ అవుతుంది.ఫ్రోజెన్ కార్నివాల్ వైబ్లే మార్స్ వీధుల్లో ఐస్క్రీమ్ థీమ్ అనేది ప్రతీ చోట కనిపిస్తుంది. క్యూట్ ΄ార్లర్స్, డెజర్ట్ కేఫ్స్, జయంట్ స్కూప్ స్టాట్యూలు, కలర్ఫుల్ బోర్డులుం సిటీ మొత్తం ఒక ఫ్రోజెన్ కార్నివాల్లా ఉంటుంది. విజిటర్స్ కోసం స్పెషల్గా ఐస్ క్రీమ్ మ్యూజియం, ఫ్యాక్టరీ టూర్స్, టేస్టింగ్ ఎక్స్పీరియెన్స్ కూడా అరేంజ్ చేస్తారు. ట్రావెల్ లవర్స్కి లే మార్స్ అనేది నార్మల్ ఫుడ్ డెస్టినేషన్ కాదు. చైల్డ్హుడ్ సమ్మర్ మెమోరీస్ని ఫ్రీజర్లో ప్రిజర్వ్ చేసినట్టు అనిపించే స్వీట్ ఎక్స్పీరియెన్స్. మన దగ్గర మ్యాంగో సీజన్ కోసం వెయిట్ చేస్తాము. కానీ అక్కడ ప్రతీ రోజు ఒక ఐస్క్రీమ్ సీజన్లాగే ఉంటుంది. -
అమెరికాతో డీల్ ఓకే ఇరాన్ పై గెలిచిన ట్రంప్
-
అమెరికా: కెథడ్రల్ రాక్పై దాడి.. దుండగుల కోసం గాలింపు
సెడోనా: అమెరికాలోని సెడోనాలో గల పవిత్రమైన ‘కెథడ్రల్ రాక్’పై దుండగులు దాడిచేశారు. స్థానిక అమెరికన్ల నమ్మకాలకు ప్రతీకగా నిలిచే ఈ చారిత్రక కట్టడంపై జరిగిన దాడిని అమెరికా ఫారెస్ట్ సర్వీస్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. నిందితులను పట్టుకునేందుకు అధికారుల బృందం ప్రజల సహకారాన్ని కోరింది.కెథడ్రల్ రాక్ కేవలం ఒక పర్యాటక ప్రాంతం మాత్రమే కాదు. స్థానిక అమెరికన్ల సంస్కృతి, ఆధ్యాత్మికతకు చిహ్నం. అలాంటి పవిత్రమైన ప్రదేశాన్ని కొందరు వ్యక్తులు తమ వికృత చేష్టలతో అపవిత్రం చేయడంపై స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్కృతిని, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వీడియో ఆధారంగా, నిందితులను గుర్తించేందుకు అధునాతన ఏఐ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ ఏఐ విశ్లేషణ ద్వారా ఇద్దరు వ్యక్తుల ముఖచిత్రాలను అధికారులు స్పష్టంగా గుర్తించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. U.S. Forest Service seeks public help identifying individuals who defaced Cathedral RockThe U.S. Forest Service is asking the public for help identifying a group of individuals caught on video defacing Cathedral Rock in Sedona, Arizona — a sacred Native American site.The AI… pic.twitter.com/TYwmCIColM— Paul A. Szypula 🇺🇸 (@Bubblebathgirl) May 24, 2026అధికారుల విజ్ఞప్తినిందితులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు అమెరికా ఫారెస్ట్ సర్వీస్ తెలిపింది. అలాగే ఈ ఘటనకు బాధ్యులైన వారి వివరాలు తెలిస్తే, వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. బహిరంగ ప్రదేశాలను, చారిత్రక కట్టడాలను కాపాడటంలో ప్రజల పాత్ర కీలమని అధికారులు గుర్తు చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారు త్వరలోనే చట్టం ముందు నిలబడతామని అమెరికా ఫారెస్ట్ సర్వీస్ ఆశాభావం వ్యక్తం చేసింది.ఇది కూడా చదవండి: భారత్ తొలి ‘కే- పాప్’ స్టార్.. మన ఒడిశా అమ్మాయే.. -
నాడు నీట్ ఫెయిల్యూర్..ఇవాళ బయోటెక్నాలజీ నిపుణురాలు!
ఇవాళ భారతదేశంలో కాంపీటీటివ్ ఎగ్జామ్స్ సంస్కృతి ఏవిధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులు, యువతకు అదే జీవిత పరమావధి అన్నంతగా మారిపోయాయి పరిస్థితులు. ఒకవేళ అది ఫెయిలైతే జీవితం అయిపోయినట్లుగా లేదా ముగిసిపోయినట్లుగా భావిస్తారు. మరికొందరు ఎన్నటికీ విజయాన్ని అందుకోలేని పరాజితులుగా ముద్ర వేసుకుంటారు. ఇంకో రంగంలో లేదా మరేదైన అభిరుచినో ఎంచుకుని గమ్యం చేరుకునే యత్నం చేయరు. కానీ ఈ కంటెంట్ క్రియేటర్ తన సక్సెస్ స్టోరీతో ఆ ఆలోచన విధానమే తప్పు అని నొక్కి చెప్పింది. ఆ ఒక్క కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మన జీవితాన్ని, సక్సెస్ని నిర్ణయించదని తన గెలుపుతో నిరూపించింది ఈ భారత సంతతి మహిళ. ఎవరంటే ఆమె..? అమెరికాలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ ప్రజ్ఞాగుప్తా. దాదాపు దశాబ్దం క్రితం నీట్ పరీక్షల్లో విఫలమవ్వడం ఆమెను ఊహించని విధంగా ఐవీ లీగ్ విద్యవైపు అడుగులు వేసి ఎలా బయోటెక్నాలజీ పరిశ్రమలో కెరీర్ నిర్మించుకునేలా చేసిందో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆమె కథ నెట్టింట వైరల్గా మారింది. ముఖ్యంగా భారతదేశంలో పోటీ ప్రవేశ పరీక్షల చుట్టూ ఉన్న తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఆమె కథ ఆలోచింపచేసేలా ఆకర్షించింది. నిజానికి ప్రజ్ఞ 2016లో 17 ఏళ్ల వయసులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) రాసింది, కానీ మెడికల్ లేదా డెంటల్ కళాశాలలో ప్రవేశం పొందడంలో విఫలమైంది. భారతదేశంలోని అత్యంత పోటీతత్వ విద్యా వాతావరణంలో పెరిగిన ప్రజ్ఞ కూడా చాలా మంది విద్యార్థుల మాదిరిగానే, ఈ ఎదురుదెబ్బ బయాలజీ, హెల్త్కేర్ రంగాలలో తన కెరీర్ ఆశయాలను ముగించిందని చాలా బాధపడింది. ఆమె ఓటమి తన కుటుంబాన్ని సైతం తీవ్రగా ప్రభావితం చేసింది. సైన్స్ చదివే విద్యార్థులు నీట్ పరీక్షని అత్యంత కీలకమైన వైద్య ప్రవేశ పరీక్షగా భావిస్తారు. అయితే ప్రజ్ఞ ఆ పరీక్షను మరోసారి ప్రయత్నించి చూడటం వంటి వాటికి బదులుగా జీవశాస్త్రంపై ఉన్న ఆసక్తికి సంబంధించిన ప్రత్యామ్నాయాలను అన్వేషించింది. ఆ క్రమంలోనే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఉద్దేశ్యంతో అమెరికాకు పయనమైంది. అక్కడ ప్రముఖ ఐవీ లీగ్ సంస్థలలో ఒకటైన కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రురాలైంది.ప్రస్తుతం ఆమె అమెరికాలోని కార్పొరేట్ బయోటెక్నాలజీ పరిశ్రమలో నిపుణురాలిగా పనిచేస్తోంది. అందరిలానే పాఠశాల విద్య తర్వాత డాక్టర్ అయ్యే సంప్రదాయ నీట్ ప్రవేశపరీక్ష వైపుకు వెళ్లింది..కానీ అనుకోని ఓటమి ఆ దారిని క్లోజ్ చేసింది. ఆ ఎదురుదెబ్బ తన జీవితాన్ని గొప్ప యూటర్న్ తిప్పే ప్రత్యామ్నాయం వైపు ఫోకస్ పెట్టింది. అలాగే తాను కోరుకున్నట్లుగానే ఆరోగ్య సంరక్షణ రంగంలోనే కెరీర్ని నిర్మించుకుంది. ఒక విద్యా పరీక్షలో వైఫల్యం ఒక వ్యక్తి భవిష్యత్తు విజయాన్ని లేదా ఆనందాన్ని నిర్ణయించదనే వాస్తవాన్ని తన గెలుపుతో చాటిచెప్పిందామె. కాగా, అత్యంత పోటీతత్వ, ప్రతిష్టాత్మకమైన ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం వల్ల కలిగిన మానసిక వేదన..దాన్నుంచి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి డ్రీమ్ కెరీర్ని చేరుకోవడం వరకు సాగిన ఆమె కెరీర్ జర్నీ విద్యార్థులకు భరోసా ఇచ్చేలా ఉందంటూ నెటిజన్లు ప్రజ్ఞను ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. అంతేగాదు సైన్స్, హెల్త్కేర్, బయోటెక్నాలజీ రంగాలలో కెరీర్లు కేవలం నీట్ ద్వారా డాక్టర్ అవ్వడం వరకే పరిమితం కావు అనే విషయాన్ని అందరూ గ్రహించాలి. View this post on Instagram A post shared by Pragya Gupta (@pragya.gupta) (చదవండి: చెట్లు నాటడానికి రూ. 4.8 లక్షల విరాళం..! హృదయాన్ని కదిలించే స్టోరీ) -
ఒప్పందానికి చేరువలో..
వాషింగ్టన్/కైరో/న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో కల్లోలానికి తెరదించి.. శాంతి, స్థిరత్వం నెలకొల్పడానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. యుద్ధాన్ని ముగించి, హార్మూజ్ జలసంధిని తిరిగి తెరిచి, శుద్ధిచేసిన యురేనియం నిల్వలను ఇరాన్ వదులుకునేలా చేసే ఒప్పందానికి అమెరికా చాలా చేరువలోకి వచ్చేసిందని అధికార వర్గాలు స్పష్టంచేశాయి. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం దాదాపు ఖరారైనట్లేనని పేర్కొన్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని వెల్లడించాయి. అణ్వాయుధ పరీక్షలకు దూరంగా ఉండాలని, శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, దీనికి ఇరాన్ ఇప్పటిదాకా బహిరంగంగా అంగీకరించలేదు. ఆ నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలిఇరాన్తో ఇప్పందం చాలావరకు కుదిరిందని ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ విషయంలో భాగస్వా మిగా ఉన్న మిత్రదేశాలతో మాట్లాడానని చెప్పారు. ‘‘ఇరాన్తో చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయి. సమయం మనకు అనుకూలంగా ఉన్నందున, ఒప్పందానికి తొందరపడవద్దని నా ప్రతినిధులకు తెలియజేశా. ఇరు పక్షాలు కొంత సమయం తీసుకుని సరైన నిర్ణయానికి రావాలి. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూడాలి’’అంటూ ఆదివారం సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్తో అమెరికా సంబంధాలు మరింత ఫలవంతంగా మారుతున్నాయని ఉద్ఘాటించారు. ఒప్పందం కుదిరి, ధ్రువీకరించబడి, సంతకం చేసే వరకూ ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య దౌత్య, ఆర్థిక, భద్రతా సంబంధాలను నెలకొల్పే అబ్రహం ఒప్పందంలో చేరాలని ఇరాన్ను ట్రంప్ ఆహ్వానించారు. అయితే, అణ్వాయుధాన్ని లేదా బాంబును అభివృద్ధి చేయలేమని లేదా సమకూర్చుకోలేమన్న నిజాన్ని ఇరాన్ అర్థం చేసుకోవాలన్నారు. మరికొన్నిగంటల్లో శుభవార్త: రూబియో ఇరాన్తో చర్చల్లో గణనీయమైన పురోగతి సాధించినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. రాబోయే కొన్ని గంటల్లోనే శుభవార్త వినే అవకాశం ఉందని చెప్పారు. ఇరాన్తో ఒప్పందంపై అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటన చేస్తారని సంకేతాలిచ్చారు. రూబియో ఆదివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివాదాన్ని పరిష్కరించేందుకు సంబంధిత ముసాయిదాపై గత 48 గంటల్లో జరిగిన చర్చల్లో పురోగతి సాధించామని పేర్కొన్నారు. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఇరాన్ వద్ద ఎప్పటికీ అణ్వాయుధాలు ఉండకూడదనేదే అంతిమ లక్ష్యమని స్పష్టంచేశారు. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండడానికి వీల్లేదన్నారు.ఒప్పందంలో ఏముంది? → ఇరాన్ వద్ద ప్రస్తుతం 440.9 కిలోల(972 పౌండ్లు) యురేనియం ఉంది. ఇది 60 శాతం వరకు శుద్ధత కలిగినది. అణ్వాయుధ తయారీకి 90% శుద్ధి చేసిన యురేనియం అవసరం. → అమెరికాతో ఒప్పందంలో భాగంగా ఈ యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. → ఇరాన్ యురేనియంను ఎలా వదులుకుంటుందనే విషయం 60 రోజుల వ్యవధిలో జరిగే తదుపరి చర్చలకు లోబడి ఉంటుందని చెబుతున్నారు. → యురేనియంలో కొంత భాగాన్ని నిర్వీర్యం చేస్తారు. మిగిలినదాన్ని మూడో దేశానికి బదిలీ చేస్తారు. ఈ యురేనియంను స్వీకరించడానికి రష్యా ముందుకొచ్చింది. → హార్మూజ్ జలసంధిని పూర్తిస్థాయిలో తెరవడానికి, సుంకాలు లేకుండా నౌకాయానికి వీలు కల్పించడానికి ఇరాన్ అంగీకరించింది. → ఒప్పందం కుదిరినట్లేనని అమెరికా వర్గాల సమాచారం. దానిపై ఇంకా సంతకాలు జరగలేదు. ట్రంప్ ఆమోదం లభించాల్సి ఉందని, కొన్ని రోజులు పట్టవచ్చని అంటున్నారు. -
భారతీయులపై జాత్యాహంకార వ్యాఖ్యలు
ఢిల్లీ: భారతీయులపై అమెరికా జాత్యాహంకార వ్యాఖ్యల పట్ల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో స్పందించారు. ప్రతి దేశంలోనూ కొంతమంది మూర్ఖులు ఉంటారని వారిని పరిగణలోకి తీసుకోకూడదన్నారు. వారు అమెరికాకు ప్రతినిధులు కాదని స్పష్టం చేశారు.ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న మార్కో రూబియో న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఒక జర్నలిస్టు అమెరికాలో భారతీయులపై జరుగుతున్న జాత్యహంకార ఘటనల గురించి రూబియోను ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ .. "ప్రతి దేశంలోనూ ఆన్లైన్లో లేదా బహిరంగంగా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కానీ అది ఒక దేశం యొక్క నిజమైన గుర్తింపును నిర్వచించదు. అమెరికా ప్రపంచంలోనే అత్యంత ఆతిథ్యమిచ్చే దేశాలలో ఒకటిప్రపంచ నలుమూలల నుండి అమెరికాకు వచ్చి, అమెరికన్ సమాజంలో కలిసిపోయి, దేశ ప్రగతికి దోహదపడిన ప్రజల వల్లే దేశం బలోపేతమైంది" అని రూబియో అన్నారు.అమెరికాలో భారతీయులపై కొంతమంది చూపే జాత్యహంకారాన్ని మొత్తం అమెరికన్ సమాజపు గుర్తింపుగా అభివర్ణించడం తప్పు అవుతుందని రూబియో స్పష్టం చేశారు. అదేవిధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి భారతీయ సంతతి ప్రజలు గణనీయమైన తోడ్పాటు అందించారని కొనియాడారు. ప్రత్యేకంగా భారతీయ సమాజాన్ని ప్రశంసించారు. వ్యాపారం, సాంకేతికత, వైద్యం, ప్రజా సేవలతో సహా అనేక కీలక రంగాలలో భారతీయ-అమెరికన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. భారతీయులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు 20 బిలియన్ డాలర్లకు పైగా సహకారం అందిస్తున్నారని ఈ సంఖ్య మరింత పెరగాలని తాము కోరుకుంటున్నామన్నారు.భారత్, అమెరికా మధ్య సంబంధం కేవలం సహకారానికే పరిమితం కాదని, అది ఒక వ్యూహాత్మక భాగస్వామ్యమని రూబియో స్పష్టం చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఇరు దేశాలు కలిసి పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. భారత్, అమెరికా ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు అని మార్కోరూబియో ప్రశంసించారు. -
ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్ : ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ‘మాకు అణ్వాయుధాలు అవసరం లేదు. అణ్వాయుధాల విషయంలో ప్రపంచానికి భరోసా ఇస్తున్నాం. ప్రపంచ అణు నిబంధనలకు కట్టుబడి ఉంటాం’అని తెలిపింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అధికారిక ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం..నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఇరాన్ తన యురేనియం నిల్వలను ఒప్పందం ప్రకారం అమెరికాకు ఇవ్వడానికి సిద్ధమైంది.భారత్లోని వారణాసిలో ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ మాట్లాడుతూ.. ‘అణ్వాయుధాలు ఇస్లాంలో హరామ్ (నిషిద్ధం). ముప్పై ఏళ్ల క్రితమే ఇరాన్ వాటిని వద్దని ప్రకటించింది. సుప్రీం లీడర్ ఇచ్చిన ఫత్వా ప్రకారం అవి మతపరంగా నిషిద్ధం’ అని స్పష్టం చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను ‘న్యూక్లియర్ డస్ట్’ అని పేర్కొంటూ, ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించడం తమ ప్రధాన లక్ష్యం అని పునరుద్ఘాటించారు. ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ కూడా ఇరాన్ నాయకులతో సమావేశమై, పశ్చిమ ఆసియాలో శాంతి ప్రయత్నాలపై చర్చించారు. అమెరికా,ఇరాన్ మధ్య 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, హర్మూజ్ జలసంధి పునఃప్రారంభంపై చర్చలు కొనసాగుతున్నాయి. -
బిగ్ రిలీఫ్.. ముగిసిన ఇరాన్ - అమెరికా యుద్ధం?
-
ఇకపై అమెరికా వీసా ఈజీ.. భారతీయులకు శుభవార్త
న్యూఢిల్లీ: భారతీయులకు అమెరికా శుభవార్త చెప్పింది. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనుకునే భారతీయులకు త్వరితగతిన వీసా అందించే విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ను ప్రకటించారు. ఈ కొత్త విధానం వ్యాపార సంబంధాలను బలోపేతం చేసే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తూ.. భారత్-అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక బంధాలను మరింతగా పెంచే ప్రయత్నంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.మార్కో రూబియో నాలుగు రోజుల భారత్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని అమెరికా ఎంబసీ సపోర్ట్ యానెక్స్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత్-అమెరికా సంబంధాలు కేవలం మీడియాకే పరిమితం కాదని..అంతకు మించిన బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం భారత్ కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ‘అమెరికా ఫస్ట్’ వీసా షెడ్యూల్ఈ కొత్త వీసా షెడ్యూల్ వ్యాపార నిపుణులు, పెట్టుబడిదారులు, అమెరికా ఆర్థిక ప్రయోజనాలను బలోపేతం చేసే వ్యక్తులకు ముందస్తు ప్రాధాన్యత ఇస్తుంది. అంటే, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపార విస్తరణ కోసం అమెరికాకు వెళ్లే భారతీయులకు వీసా అపాయింట్మెంట్ త్వరగా లభిస్తుంది. వీసా ప్రక్రియలో ఆలస్యం కారణంగా వ్యాపార ప్రయాణాలు, పెట్టుబడి సమావేశాలు,భాగస్వామ్య చర్చలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ కొత్త విధానం అవసరమని ఆయన వివరించారు.ఈ పర్యటనలో రూబియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున వైట్ హౌస్ ఆహ్వానం అందించారు. ఇరువురు నేతలు ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, ఇంధన సరఫరాలు, అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం వంటి అంశాలపై చర్చించారు.ఈ పర్యటనలో రూబియో చేసిన ప్రకటనలు భారత్-అమెరికా సంబంధాలను కొత్త దశలోకి తీసుకెళ్తున్నాయి. వీసా ప్రక్రియలో మార్పులు కేవలం సాంకేతిక సౌలభ్యం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య వ్యాపార, వ్యూహాత్మక బంధాలను మరింతగా బలపరచే ప్రయత్నం. అమెరికా ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నప్పటికీ, భారత్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈ పర్యటన స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Delhi: At the US Embassy Support Annex Building dedication ceremony, US Secretary of State Marco Rubio says, "We're introducing a new America First visa schedule that prioritises business professionals that strengthen these ties. But the facility, as I said, is not just… pic.twitter.com/pkY5nlb6r5— ANI (@ANI) May 23, 2026 -
ఇరాన్ సరెండర్.. యురేనియంపై ట్రంప్ విజయం!
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు, శాంతి చర్చలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాతో చర్చలు జరుపుతున్న విస్తృత శాంతి ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న శుద్ది చేసిన యురేనియం నిల్వలను వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించినట్టు సమాచారం. ఈ మేరకు ఇద్దరు అమెరికా అధికారులు 'ది న్యూయార్క్ టైమ్స్'కు తెలిపారు.ఈ నేపథ్యంలో ఇరాన్ యురేనియం నిల్వల నిర్మూలన పద్దతిపై త్వరలో చర్చలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ లభించకపోతే చర్చలు విఫలమయ్యే అవకాశం కూడా ఉంది. కాగా, ఇరాన్ వద్ద 60 శాతం శుద్ది చేసిన దాదాపు 400 కిలోల యురేనియం ఉంటుందని అమెరికా అంచనా వేస్తోంది. అయితే, ప్రతిపాదిత ఒప్పందం వివరాలను ట్రంప్ వెల్లడించనప్పటికీ, దాదాపు ఆయుధ స్థాయి యురేనియం నిల్వలను వదులుకోవడానికి టెహ్రాన్ సూత్రప్రాయంగా అంగీకరించిందని అమెరికా అధికారులు చెబుతున్నారు.🇺🇸🇮🇷 NYT: U.S. officials said Iran has reportedly agreed to give up its stockpile of highly enriched uranium as part of the proposed agreement announced by U.S. President Donald Trump. Officials said details on how the uranium would be removed or downgraded would be discussed… pic.twitter.com/BoNOksRsG4— Global Surveillance (@Globalsurv) May 24, 2026అయితే, ఈ దశలో ఈ అవగాహన ఇంకా విస్తృతంగానే ఉందని, యురేనియంను ఇవ్వడంపై కచ్చితమైన విధానంపై ఇంకా చర్చలు జరగాల్సి ఉందని ఆ అధికారులు తెలిపారు. విస్తృత ఒప్పందం అధికారికంగా కుదిరిన తర్వాత, తదుపరి అణు చర్చల దశలో ఇరాన్ ఈ పదార్థాన్ని ఎలా బదిలీ చేస్తుంది, పలుచన చేస్తుంది లేదా ఇతరత్రా తటస్థీకరిస్తుంది అనే దానిపై వివరణాత్మక చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ యురేనియం నిల్వలను దేశం నుండి బయటకు పంపవద్దని ఆదేశించారని ఇరాన్ వర్గాలు ఇటీవల పేర్కొన్న తర్వాత ఈ పరిణామం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఇక, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) ప్రకారం.. ఇరాన్ ప్రస్తుతం 60 శాతం శుద్ధి చేయబడిన దాదాపు 400 కిలోగ్రాముల యురేనియంను కలిగి ఉంది, ఇది ఆయుధ-స్థాయికి దగ్గరగా ఉంది. ఈ నిల్వలను మరింత శుద్ధి చేసి బహుళ అణు బాంబులకు కావలసిన పదార్థాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అధికారులు పదేపదే వాదిస్తున్నారు. కాగా, ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. అలాగే, మధ్యప్రాచ్యంలో చమురు మార్కెట్లు, వాణిజ్య మార్గాలు స్థిరపడే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యుద్దం కారణంగా ఇరాన్పై అమెరికా మరియు పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షల కారణంగా, బిలియన్ల డాలర్ల విలువైన ఆస్తులు విదేశీ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయ్యాయి. యురేనియం ఒప్పందం కుదిరితే ఆంక్షలు తొలగిపోయే అవకాశం ఉంది.ఆస్తుల విడుదల: యురేనియం నిల్వను వదులుకోవడానికి అంగీకరించిన ప్రతిఫలంగా, అమెరికా ఈ ఆస్తులను విడదీయడానికి సిద్ధమవుతోంది.ప్రభావం: ఆర్థికంగా ఇరాన్కు ఊపిరి పీల్చే అవకాశం లభిస్తుంది.ప్రాంతీయ స్థిరత్వం: ఆర్థిక ఒత్తిడి తగ్గడం వల్ల ఇరాన్ చర్చల్లో మరింత సహకరించే అవకాశం ఉంది.JUST IN: 🇵🇰🇮🇷 Pakistan official says Iran has agreed to hand over enriched uranium under the Trump-announced deal. pic.twitter.com/OK78Aus5qj— Whale Insider (@WhaleInsider) May 24, 2026ఇదిలా ఉండగా.. ఇరాన్ మాత్రం ఇంకా జాగ్రత్తగానే వ్యవహరిస్తోంది. అమెరికా మరోసారి సైనిక దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబఫ్ మాట్లాడుతూ.. కాల్పుల విరమణ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని తెలిపారు. మళ్లీ దాడులు జరిగితే ప్రారంభ దశ కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. -
అమెరికా వైట్ హౌస్ దగ్గర కాల్పులు.. ట్రంప్ కి తప్పిన ప్రమాదం..!
-
ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఈసారి ఏకంగా ఇరాన్ను అమెరికా జెండా రంగులతో కప్పేశారు ట్రంప్. ఇరాన్ దేశ చిత్ర పటాన్ని అమెరికా జెండా రంగులతో ఎడిట్ చేసిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతటితో ఆగకుండా దానికి "మధ్యప్రాచ్యపు యునైటెడ్ స్టేట్స్?" అనే క్యాప్షన్ జతచేశారు. దీంతో, ట్రంప్ చర్య.. పెను దుమారానికి దారి తీసింది.అయితే.. వాషింగ్టన్, టెహ్రాన్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్పై సాధ్యమయ్యే సైనిక చర్యపై అమెరికా ప్రభుత్వంలో చర్చలు మళ్లీ మొదలైన తరుణంలో ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఇక, కొన్ని రోజుల క్రితం ఇరాన్ పడవలపై క్షిపణి దాడులు, అంతరిక్ష యుద్ధం, ఇరాన్పై ఎగురుతున్న అమెరికా జెండాను చిత్రీకరిస్తూ ఏఐ (AI) రూపొందించిన చిత్రాలను కూడా ట్రంప్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, యాక్సియోస్ నివేదికలో ఉటంకించిన అమెరికా అధికారుల ప్రకారం.. చివరి నిమిషంలో చేసే దౌత్య ప్రయత్నాలు పురోగతిని సాధించడంలో విఫలమైతే, ఇరాన్పై కొత్తగా సైనిక దాడులు ప్రారంభించడాన్ని ట్రంప్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు.While Rubio speaks of progress in negotiations with Iran and promises to reveal more details in the near future, Trump, meanwhile, continues his media game on social networks. He posts a map of Iran colored in the hues of the American flag, captioning it: “The United States of… pic.twitter.com/sM7GxiqXgv— Military Summary (@MilitarySummary) May 23, 2026ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా యుద్ధం విషయంలో ఇరాన్తో ఒప్పందం కుదిరేందుకు 50-50 అవకాశాలున్నాయని ట్రంప్ ప్రకటించారు. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలా లేదా అనేదానిపై ఆదివారం ఆయనొక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇరాన్ వ్యవహారంలో రెండు అంశాల్లో ఏదో ఒకటి జరుగుతుందని అనుకుంటున్నానని వెల్లడించారు. ఒకటి.. వారు(ఇరాన్) ఇంతకు ముందెన్నడూ ఎదుర్కోనంత గట్టిగా తాను దెబ్బకొడతానని వ్యాఖ్యానించారు. రెండోది.. ఒక మంచి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు చేస్తాయని పేర్కొన్నారు. యుద్ధం కావాలో లేక ఒప్పందం కావాలో ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని సూచించారు. కాగా, ఇరాన్లో కొత్తగా దాడులకు ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతోందని కొన్ని వార్తాసంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ నేతలతో మునీర్ భేటీ పశ్చిమాసియాలో ఘర్షణను తెరదించాలని పాకిస్తాన్ తన వంతు ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఇరాన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితోపాటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘలిబాఫ్ను కలుసుకున్నారు. తాజా పరిణామాలపై వారితో చర్చించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను నివారించడం.. శాంతి, స్థిరత్వం, భద్రతను ప్రోత్సహించడంపై సంప్రదింపులు జరిపారు. ఇరాన్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ పరిణామాలు, వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనే మార్గాలపై పెజెష్కియాన్, అసిమ్ మునిర్ చర్చించుకున్నట్లు ఇరాన్ అధికారిక తస్నిమ్ వార్తా సంస్థ తెలియజేసింది. -
వైట్హౌస్: అటు కాల్పులు.. ఇటు లైవ్ రిపోర్టింగ్
అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌస్ సెక్యూరిటీ చెక్పాయింట్ వద్ద ఒక్కసారిగా కాల్పుల కలకలం రేగిన సంగతి తెలిసిందే. వైట్హౌస్ వెలుపల లైవ్ కెమెరాల ముందే తీవ్ర భయాందోళనలు, గందరగోళం నెలకొంది. వైట్హౌస్ ఉత్తర మైదానం నుంచి లైవ్ రిపోర్టింగ్ ఇస్తున్న జర్నలిస్టులు.. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినబడటంతో ప్రాణాలు రక్షించుకునేందుకు కిందకు వంగి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.ఈ ఘటనకు సంబంధించిన పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వైట్హౌస్ ప్రాంగణం వెలుపల వరుసగా తుపాకీ కాల్పులు జరిగిన ఆ క్షణంలో రిపోర్టర్లు ఎలా స్పందించారో ఈ వీడియోలలో స్పష్టంగా రికార్డైంది. ఓ మీడియా సంస్థకు చెందిన సెలినా వాంగ్ మాట్లాడుతూ.. కొద్ది సెకన్ల పాటు ఆమె ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇది పటాకుల శబ్దంలా అనిపించింది.. కానీ నిజానికి తుపాకీ కాల్పులు" అని తెలిపింది. ఈ ఘటన సమయంలో ఆమె ఆ ప్రాంగణంలో వీడియో షూట్ మధ్యలో ఉన్నారు.'FaytuksNetwork' అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వైరల్ వీడియోలో.. ఓ టెలివిజన్ రిపోర్టర్ డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ల మద్దతు గురించి చాలా ప్రశాంతంగా లైవ్ రిపోర్ట్ ఇస్తుండటం కనిపిస్తుంది. అయితే సరిగ్గా అదే సమయంలో పక్కనే తుపాకీ శబ్దాలు వినిపించాయి. ఆ జర్నలిస్ట్ తాను చెబుతున్న వాక్యాన్ని పూర్తి చేసి.. చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంతో చూస్తూ.. తన టై మరియు ఇయర్పీస్ను సర్దుకుంటూ పరిస్థితి తీవ్రతను గమనించడం ఆ వీడియోలో కనిపించింది.🇺🇸 Reporters duck live on air as shots ring out near White House; gunman killedpic.twitter.com/58MmW6BOAX— U.S.A.I. 🇺🇸 (@researchUSAI) May 24, 2026కాగా, వైట్హౌస్ సమీపంలో సీక్రెట్ సర్వీస్ చెక్పాయింట్ వద్దకు దూసుకొచ్చిన ఓ దుండగుడు బలగాలపై కాల్పులకు దిగాడు. దీంతో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వైట్హౌస్ సమీపంలో వరుస కాల్పుల శబ్దాలు విన్నట్లు జర్నలిస్టులు తెలిపారు.దీంతో జర్నలిస్టులను వైట్హౌస్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్లోకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. కాల్పుల ఘటన నేపథ్యంలో పోలీసులు, భద్రతా బలగాలు వైట్హౌస్ వద్ద భారీగా మోహరించారు. కాల్పుల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్హౌస్లోనే ఉన్నట్లు సమాచారం. కాల్పుల శబ్దాలు వినిపించడంతో భవనం మొత్తం కొద్దిసేపు లాక్డౌన్లోకి వెళ్లింది. -
యుద్ధమా? ఒప్పందమా?... ఇరాన్ త్వరగా తేల్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక
-
మోదీజీ అమెరికా రండి.. మార్కో రూబియో ఆహ్వానం
ఢిల్లీ: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు గంటకుపైగా చర్చలు సాగాయి. ఈ సందర్భంగా మార్కో రూబియో మోదీని అమెరికా ప్రర్యటనకు రావాలని ఆహ్వానించారు. యుఎస్ఏ అధ్యక్షుడు ట్రంప్ విజ్ఞప్తి మేరకే ఈ ఆహ్వానం అందించినట్లు రూబియో పేర్కొన్నారు.మోదీతో ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులపై ఇరు నేతలు చర్చలు జరిపారు. సంక్షోభ పరిష్కారానికి దౌత్య చర్చలే ప్రధానమార్గామని మోదీ సూచించారు. అనంతరం ప్రధాని మోదీ, రూబియోతో తన సమావేశానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను పోస్ట్ చేశారు. కాగా మార్కో రూబియో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చారు. ఆయన విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన భారత్కు రావడం ఇదే మొదటిసారి. భారత్–పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడం, భారీ టారిఫ్లు, హెచ్1బీ వీసాల కట్టడి చర్యలు తదితరాల కారణంగా దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి గాడిన పెట్టడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన చేపట్టారు.విదేశాంగ మంత్రి జై శంకర్తో ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై అనేక అంశాలపై చర్చలు జరుపుతారు. మంగళవారం ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో పాల్గొంటారు. రూబియో పర్యటన సందర్భంగా కోల్కతా, జైపూర్, ఆగ్రాలను కూడా సందర్శించే అవకాశముందని సమాచారం. ‘భారత్తో మాకు చాలా పనుంది. భారత్ మాకు మంచి మిత్ర దేశం, భాగస్వామి కూడా. నాది చాలా ముఖ్యమైన ట్రిప్’అంటూ భారత్ పర్యటనపై శుక్రవారం రూబియో వ్యాఖ్యానించడం గమనార్హం. -
కుక్కను చూసుకుంటే.. వారానికి రూ.2.4 లక్షలు!
పెంపుడు జంతుల మీద ప్రేమ చూపించేవాళ్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. తమకు ఇష్టమైన కుక్కలు, పిల్లులు మొదలైనవాటి కోసం ఎంతైనా ఖర్చుపెట్టే రోజులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు అమెరికాలో 'డాగ్ నానీ'లకు డిమాండ్ ఎక్కువైంది. ధనిక కుటుంబాలు తమ పెంపుడు కుక్కలను కుటుంబ సభ్యుల్లాగే చూసుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని చూసుకునే ప్రొఫెషనల్ కేర్టేకర్లను నియమించుకుంటున్నారు. అధికమొత్తంలో జీతాలు కూడా ఇస్తున్నారు.అమెరికాలో ఫుల్టైమ్ డాగ్ నానీలు వారానికి 2,500 డాలర్లకుపైగా, అంటే.. భారత కరెన్సీలో దాదాపు రూ.2.4 లక్షలు వరకు సంపాదిస్తున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.కరోనా లాక్డౌన్ సమయంలో చాలా మంది ఇంటి నుంచే పని చేయడం వల్ల.. తమ పెంపుడు జంతువులతో ఎక్కువ సమయం గడిపారు. దీంతో వాటిపై అనుబంధం పెరిగింది. ఫలితంగా పెంపుడు జంతువుల సంరక్షణను కూడా చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో ధనిక కుటుంబాలు తమ కుక్కల కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించుకోవడం సాధారణమవుతోంది.డాగ్ నానీల పని కేవలం కుక్కను బయటకు తీసుకెళ్లడం మాత్రమే కాదు. వాటికి సమయానికి ఆహారం పెట్టడం, వాకింగ్ చేయించడం, గ్రూమింగ్ అపాయింట్మెంట్లు బుక్ చేయడం, మందులు ఇవ్వడం, యజమానులు విదేశీ ప్రయాణాలకు వెళ్లినప్పుడు వెంట తీసుకెళ్లడం వంటి బాధ్యతలూ ఉంటాయి. కొందరు నానీలు యజమానులు ఇళ్లలోనే ఉంటారు. వారికి వసతి, భోజనం, ఆరోగ్య బీమా, ప్రయాణ ఖర్చులు కూడా యజమానులే భరిస్తున్నారు.కుక్కలను సంరక్షించడంలో అనుభవం ఉన్నవారు గంటకు 40 నుంచి 50 డాలర్లు సంపాదిస్తున్నారు. మరికొందరు రోజుకు 500 నుంచి 800 డాలర్ల వరకు సంపాదించుకుంటున్నట్లు సమాచారం. గతంలో బ్రిటన్లో ఒక కుటుంబం తమ పెంపుడు కుక్క కోసం సంవత్సరానికి లక్ష పౌండ్ల (రూ. కోటి కంటే ఏక్కువ) జీతంతో డాగ్ నానీ ఉద్యోగ ప్రకటన ఇచ్చి వార్తల్లో నిలిచింది.పెట్ కేర్ రంగం ఉత్తర అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం అక్కడ పెట్ సిట్టింగ్, జంతు సంరక్షణ సేవలకు సంబంధించిన లక్షలాది ఉద్యోగాలు ఉన్నాయని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రత్యేక శిక్షణ పొందిన లేదా సర్టిఫికేషన్ ఉన్న కేర్టేకర్లు మరింత ఎక్కువ సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల్లో పెంపుడు జంతువుల పెంపకం పెరుగుతున్న కొద్దీ ఈ ఉద్యోగాలకు డిమాండ్ కూడా పెరుగుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం! -
"మీరు నిజాయితీగా.. ట్రంప్కు వ్యతిరేకంగా"
టెహ్రాన్: ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చంతా.. అమెరికా DNI డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేయడంపైనే నడుస్తోంది. ఆమెను ఉద్దేశపూర్వకంగా తొలగించారా..? లేక తనంత తానే తప్పుకుందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్.... తులసీ గబ్బార్డ్ రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇజ్రాయెల్కు తొత్తుగా పనిచేస్తున్న అమెరికా ప్రభుత్వంలో మీలాంటి నిజాయితీ గల వ్యక్తులు పనిచేయడం విచారకరం అని ఎక్స్లో పోస్ట్ చేసింది.అమెరికాకు అత్యత కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. అయితే తలసీ గబ్బార్డ్ రాజీనామా ఇప్పుడు అంతర్జాతీయంగా పలు చర్చలకు దారితీసింది. దీనిపై తాజాగా అర్మేనియాలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది.ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో " అబ్రహాం త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మేము ఆకాంక్షిస్తున్నాము. మీరు గతంలో కొన్ని సందర్భాల్లో ఇజ్రాయెల్ కోసం కాకుండా అమెరికా కోసం పనిచేస్తారని నిరూపించుకున్నారు, అదే విధంగా పలుమార్లు అధ్యక్షుడు ట్రంప్ ద్వేషించే ఇరాన్ గురించిన నిజాలను కూడా నిష్పక్షపాతంగా మాట్లాడారు. అమెరికాను పక్కనపెట్టి, ఇజ్రాయెల్కు తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంతో మీలాంటి వ్యక్తి పనిచేయడం విచారకరం. మీకు శుభాకాంక్షలు" అని ఎక్స్ఖాతాలో రాసుకొచ్చింది.అయితే ప్రస్తుతం అమెరికా ప్రభుత్వంలోని వ్యక్తులు ఆ దేశం కోసం కాకుండా పరోక్షంగా ఇజ్రాయెల్ కోసం పనిచేస్తున్నారని ఎంబసీ ఆరోపించింది. అంతే కాకుండా ఆ దేశ ప్రయోజనాల కోసం తులసి గబ్బార్డ్ ట్రంప్కు సైతం కోపం తెప్పించేలా పలుసార్లు మాట్లాడిందని పేర్కొంది.అమెరికా మీడియా కథనాలు అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్సైతం ఆమెకు మద్ధతుగా ఎక్స్లో పోస్ట్ చేసింది. -
తులసి గబ్బార్డ్ ఎగ్జిట్.. వైట్హౌస్లో ఏం జరిగింది?
అమెరికా రాజకీయాల్లో మరోసారి సంచలన చర్చ మొదలైంది. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అత్యంత నమ్మకస్తురాలిగా పేరున్న తులసి గబ్బార్డ్.. ఆయన శిబిరానికి దూరం కావడంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరైతే “ఆమెను పూర్తిగా పక్కన పెట్టేశారు”.. “వైట్హౌస్ నుంచి తరిమేశారు” అనే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. వాస్తవానికి ఏం జరిగింది? నిజంగానే ట్రంప్తో విభేదాలే కారణమా? లేక ఆమె చెప్పిన వ్యక్తిగత కారణమే అసలు కారణమా?.. అమెరికాకు కీలకమైన జాతీయ గూఢచారి విభాగం డైరెక్టర్ (DNI) పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా చేశారు. తన భర్త అబ్రహాం విలియమ్స్కు అరుదైన ఎముక క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబానికి సమయం కేటాయించాల్సి వస్తోందని ఆమె అధికారికంగా ప్రకటించారు. “ఈ సమయంలో ఆయనతో ఉండటం నా బాధ్యత” అంటూ ట్రంప్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ రాజీనామాతో జూన్ 30 నుంచి ఆమె తన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు. భారతీయ మూలాలు లేకున్నా.. తులసి గబ్బార్డ్(45) పేరు చూసి అంతా భారతీయ నేపథ్యం ఉందని అనుకుంటారు. ఆమె తల్లిదండ్రులు భారతీయులు కాదు. వంశపారంపర్యంగానూ భారతీయ మూలాలు లేవు. తండ్రి మైక్ గబ్బర్డ్ సమోవన్-యూరోపియన్ నేపథ్యానికి చెందినవారు. తల్లి క్యారెల్ గబ్బార్డ్ అమెరికన్. కానీ ఆమె తల్లి క్యారెల్ గబ్బార్డ్కు హిందూ ధర్మం, వేద సంస్కృతిపై ఆసక్తి ఉండేది. అదే ప్రభావంతో కుటుంబమంతా హిందూ ఆధ్యాత్మిక జీవనశైలిని అనుసరించింది. అంతేకాదు పిల్లలందరికీ తులసి(తుల్సీ), భక్తి, జై, వృందావన్ వంటి భారతీయ/హిందూ పేర్లు పెట్టారామె. అలా.. చిన్నప్పటి నుంచే భగవద్గీత, యోగా, వేద సంప్రదాయాల మధ్య తులసి పెరిగారు. సాధారణంగా.. అమెరికాలో ఎక్కువ మంది బైబిల్పై ప్రమాణం చేస్తారు. కానీ, 2013లో అమెరికా ప్రతినిధుల సభ సభ్యురాలిగా ఆమె ప్రమాణం చేసేటప్పుడు భగవద్గీత మీద ప్రమాణం చేసి చర్చనీయాంశంగా మారారు. గతంలో భారత్ పర్యటించిన ఆమె సంప్రదాయ దుస్తుల్లో ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేశారు. అలా హిందూ విశ్వాసాలు పాటించే అమెరికన్ రాజకీయ నాయకురాలిగా ఆమెకంటూ ఓ గుర్తింపు ఏర్పడింది. ఏం జరిగి ఉండొచ్చు?అయితే ఆమె రాజీనామా వెనుక కేవలం వ్యక్తిగత కారణాలే లేవన్న చర్చ అమెరికా మీడియా వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్, వెనిజులా వంటి అంతర్జాతీయ అంశాలపై ట్రంప్ టీమ్లో జరిగిన కీలక చర్చల నుంచి గబ్బార్డ్ను దూరంగా ఉంచినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. గత కొన్ని నెలలుగా ఆమెకు వైట్హౌస్లో ప్రాధాన్యం తగ్గిందని, కీలక భద్రతా సమావేశాలకు కూడా పిలవలేదని అమెరికా మీడియా ఇప్పుడు కథనాలు ఇస్తోంది.ప్రత్యేకించి.. ఇరాన్ విషయంలో తులసి గబ్బార్డ్ వైఖరి మొదటి నుంచి ట్రంప్ లైన్కు భిన్నంగా కనిపించింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందన్న వాదనపై ఆమె కొంత మితవాద ధోరణి ప్రదర్శించగా.. ట్రంప్ మాత్రం దూకుడైన వైఖరిని కొనసాగించారు. ఈ అంశంపైనే ఇద్దరి మధ్య దూరం పెరిగిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.ట్రంప్.. పొగిడారు కదా!ఇదే సమయంలో.. రాజీనామాకు “ఆమెను బలవంతంగా తప్పించారు” అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. కొన్ని మీడియా కథనాలు వైట్హౌస్ వర్గాలను ఉటంకిస్తూ ఆమెను రాజీనామా చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నాయి. కానీ అధికారికంగా మాత్రం ట్రంప్ అలాంటి సంకేతాలు ఇవ్వలేదు. పైగా ఆయన సోషల్మీడియాలో తుల్సీ గబ్బార్డ్ పనితీరును ప్రశంసిస్తూ.. “ఆమె అద్భుతంగా పనిచేశారు. మేం ఆమెను మిస్ అవుతాం” అని వ్యాఖ్యానించారు. అలా.. ఇప్పుడు అమెరికా రాజకీయ వర్గాల్లో రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం “వ్యక్తిగత కారణంతోనే ఆమె తప్పుకున్నారు” అంటుండగా.. మరోవైపు “ప్రాధాన్యం తగ్గించడం, కీలక నిర్ణయాల నుంచి దూరం పెట్టడమే అసలు కారణం” అని చెబుతోంది. అయితే.. ఒకప్పుడు ట్రంప్ శిబిరంలో కీలక స్వరంగా ఎదిగిన తులసి గబ్బార్డ్.. గత కొంతకాలంగా ఆ వర్గంలో పూర్తిగా కేంద్రస్థానంలో లేరనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.తులసి గబ్బార్డ్ వ్యక్తిగత జీవితం కూడా అమెరికా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకే దారి తీసింది. 2015లో ఆమె సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. తులసి చిన్నప్పటి నుంచే యోగా, ధ్యానం, భగవద్గీత వంటి హిందూ ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రభావంలో పెరిగారు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ సాధారణ జీవనశైలిని ఇష్టపడే నాయకురాలిగా ఆమెకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం భర్త ఆరోగ్య సమస్యల కారణంగా కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు లేరు. తమ వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా ప్రైవేట్గా ఉంచే ఈ జంట.. కుటుంబం, ఆధ్యాత్మిక జీవనం, ట్రావెలింగ్పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. -
అమెరికా ఇంటిలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ రాజీనామా
ఇరాన్పై యుధ్దం, మిడిల్ ఈస్ట్ సంక్షోభం మధ్య అమెరికాలోమరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గం నుంచి కీలక వ్యక్తి తప్పుకున్నారు.అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ (డీఎన్ఐ) పదవికి తులసి గబ్బార్డ్ (45)రాజీనామా చేశారు. ఇది జూన్ 30, 2026 నుండి అమలులోకి వస్తుంది. తన రాజీనామా విషయాన్ని ఆన్లైన్ పంచుకున్నారు.తన భర్త అబ్రహాంకు అరుదైన రకమైన ఎముక క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఆయన్ను దగ్గరుండి తీసుకోవాలనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే వారాలు, నెలల్లో ఆయన చికిత్స మరింత క్లిష్టంగా ఉండబోతోంది. కొన్ని చాలెంజెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ పోరాటంలో ఆయన పక్కన ఉండి, పూర్తి మద్దతు ఇవ్వడానికే తాను ప్రజా సేవ నుంచి తప్పుకోవాల్సి వస్తోందని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా గత ఏడాదిన్నరగా తనపై ఉంచిన నమ్మకానికి విశ్వాసానికి అధ్యక్షుడు ట్రంప్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఇదీ చదవండి: 1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!ఆమె ప్రకటన ''మా పదకొండు సంవత్సరాల వివాహ జీవితంలో అబ్రహాం నాకు ఒక ఆసరాగా నిలిచాడు .తూర్పు ఆఫ్రికాలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ మిషన్లో నేను పాల్గొన్నప్పుడు, అనేక రాజకీయ ప్రచారాలలో, మరియు ఇప్పుడు ఈ పదవిలో నా సేవలో కూడా స్థిరంగా నిలబడ్డాడు. అతని బలం, ప్రేమే ప్రతి సవాలులో నన్ను స్థిరంగా నిలబెట్టాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో తన బాధ్యతలను నిర్వర్తించలేను..అలాగే ఈ పోరాటాన్ని ఒంటరిగా ఎదుర్కోనేలా చేయడం భావ్యం కాదు’’ అని ఆమె వెల్లడించారు.ఇదీ చదవండి: BP టెన్షన్ పెడుతోన్న కంటికి కనిపించని శత్రువుకాగా భారత సంతతికి చెందిన తులసి గబ్బార్డ్, 2012లోనే హవాయి నుంచి హౌస్ ఆఫ్ రిప్రసెంటేటివ్స్ కు ఎంపిక అయ్యారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ట్రంప్ సర్కార్లో తులసి గబ్బార్డ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (DNI)గా, క్యాబినెట్ స్థాయి ఇంటెలిజెన్స్ పదవిని చేపట్టిన మొదటి పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ , హిందూ అమెరికన్ అయ్యారు. ఆమె మాజీ యూఎస్ కాంగ్రెస్ సభ్యురాలు, ఆర్మీ వెటరన్ కూడా.I am deeply grateful for the trust President Trump placed in me and for the opportunity to lead @ODNIgov for the last year and a half. Unfortunately, I must submit my resignation, effective June 30, 2026. My husband, Abraham, has recently been diagnosed with an extremely rare… pic.twitter.com/PS0Dxp5zpd— Tulsi Gabbard 🌺 (@TulsiGabbard) May 22, 2026 -
గ్రీన్ కార్డు ఇప్పుడు అంత ఈజీ కాదు
-
పుతిన్తో ట్రంప్ గేమ్.. ఎక్కడికి దారి తీస్తుందో..
డొనాల్డ్ ట్రంప్.. ఈ పేరు ఎప్పుడూ సంచలనమే. ఆయన తీసుకునే నిర్ణయాలు, చర్యలు.. ఎప్పుడు ఏం చేస్తారో.. ఏం చెబుతారో అనేది ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. తీసుకున్న నిర్ణయాలు అనేక దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. యూరోప్లో తమ బలగాలను తగ్గిస్తామని ఇన్నాళ్లూ చెప్పిన ట్రంప్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. పోలాండ్కు అదనంగా 5000 మంది బలగాలను పంపనున్నట్లు వెల్లడించారు. దీంతో ఆయన చేస్తున్న ప్రకటన నాటో దేశాలను షాక్కు గురిచేసింది.అంతకుముందు ట్రంప్.. జర్మనీ నుంచి తమ సైనికుల సంఖ్యను తగ్గించనున్నట్లు చెప్పారు. జర్మనీ నుంచి సుమారు 5 వేల మందిని ఉపసంహరించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే, ఇరాన్ యుద్ధంలో అమెరికా పరాజయాన్ని చవిచూసినట్లు జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ ఆరోపించారు. యుద్ధ వ్యూహాంలో అమెరికా విఫలమైనట్లు ఆయన విమర్శించారు. ఈ క్రమంలో జర్మనీ నుంచి తమ బలగాలను ట్రంప్ ఉపసంహరించుకున్నట్టు సమాచారం.కానీ, పోలాండ్కు మాత్రం అదనంగా బలగాలను పంపనున్నట్లు ట్రంప్ చెప్పడం నాటో దేశాల్లో గందరగోళం నెలకొన్నది. పోలాండ్ అధ్యక్షుడిగా కరోల్ నవరోకీ విజయవంతంగా ఎన్నికయ్యారని, ఆయనకు తన మద్దతు ఉంటుందని, అమెరికా ఆయనకు మద్దతుగా 5 వేల మంది బలగాలను పోలాండ్కు పంపుతోందని ట్రంప్ తన ట్రుత్ సోషల్లో తెలిపారు. అయితే, జర్మనీ నుంచి ఉపసంహరించుకునే సైనికులను పోలాండ్కు బదిలీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కాగా, ఇది యూరప్లో అమెరికా సైనిక వ్యూహంలో మార్పులకు సంకేతంగా భావించబడుతోంది. మరోవైపు.. పోలాండ్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని స్వాగతించింది. ఎందుకంటే ఇది రష్యా ముప్పు నుంచి రక్షణను బలోపేతం చేస్తుందని భావిస్తోంది. ఈ నిర్ణయం సైనిక వ్యూహం కంటే రాజకీయ సంబంధాలపై ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.పోలాండ్-రష్యా ఘర్షణ.. ప్రస్తుతం పోలాండ్-రష్యా సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతలో ఉన్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పోలాండ్ తన భద్రతను నాటో మరియు అమెరికా సైనిక ఉనికిపై ఆధారపడి బలోపేతం చేస్తోంది. అలాగే రష్యా చర్యలను ప్రత్యక్ష ముప్పుగా చూస్తోంది. ప్రస్తుతం పోలాండ్-రష్యా మధ్య ఘర్షణలు ప్రత్యక్ష యుద్ధం రూపంలో కాకుండా “హైబ్రిడ్ వార్” రూపంలో జరుగుతున్నాయి. రష్యా పోలాండ్పై సైబర్ దాడులు, గూఢచారి చర్యలు, సమాచార యుద్ధం, మరియు సరిహద్దు అస్థిరతను ఆయుధంగా ఉపయోగిస్తోంది. పోలాండ్ మాత్రం NATO తూర్పు రక్షణలో ముందు వరుసలో నిలిచి రష్యా ముప్పును ఎదుర్కొంటోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగియకపోతే పోలాండ్-రష్యా సంబంధాలు మరింత కఠినమవుతాయి. మరోవైపు.. ఇటీవల పోలాండ్ విదేశాంగ మంత్రి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో.. రష్యా నుంచి వచ్చే ముప్పు నిజమైన ప్రమాదమని పేర్కొన్నారు. 2025 నవంబరులో రష్యా క్షిపణి దాడిలో పోలాండ్ పౌరులు మరణించడం ఈ ఉద్రిక్తతను మరింత పెంచింది.పోలాండ్.. నాటో తూర్పు రక్షణలో కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పోలాండ్ తన సైనిక శక్తిని విస్తరించి, NATO తూర్పు ఫ్లాంక్లో ప్రధాన స్థావరంగా మారింది. అమెరికా బలగాల ఉనికి, పోలాండ్ సైనిక విస్తరణ, మరియు NATO Forward Land Forces బెటాలియన్ పోలాండ్ను తూర్పు యూరప్ రక్షణలో కేంద్రంగా నిలబెట్టాయి.ప్రధాన ఘర్షణ రూపాలు1. హైబ్రిడ్ దాడులు సైబర్ దాడులు: పోలాండ్ ప్రభుత్వ, మౌలిక వసతులపై రష్యా తరచుగా సైబర్ దాడులు చేస్తోంది. గూఢచారి చర్యలు: రష్యా గూఢచారులు పోలాండ్లోని కీలక సైనిక, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సమాచార యుద్ధం: సోషల్ మీడియా, మీడియా ప్రచారాల ద్వారా పోలాండ్ సమాజాన్ని విభజించే ప్రయత్నం.2. సరిహద్దు సమస్యలు బెలారస్ ద్వారా వలసదారుల ప్రవేశం: రష్యా-బెలారస్ కలిసి అక్రమ వలసదారులను పోలాండ్ సరిహద్దులోకి పంపి అస్థిరత సృష్టిస్తున్నారు. సైనిక ఒత్తిడి: పోలాండ్ NATOతో కలిసి తూర్పు సరిహద్దులో బలగాలను పెంచుతోంది.3. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం పోలాండ్ ఉక్రెయిన్కు ప్రధాన లాజిస్టికల్ హబ్గా మారింది. రష్యా దీన్ని ప్రత్యక్ష ముప్పుగా భావించి పోలాండ్పై దాడులను పెంచింది.పోలాండ్ పాత్రలో ప్రధాన అంశాలు1. Forward Land Forces (FLF) NATO తూర్పు ఫ్లాంక్లోని ఎనిమిది మల్టీనేషనల్ బెటాలియన్లలో ఒకటి పోలాండ్లో ఉంది. ఈ బెటాలియన్ రష్యా దాడులను అడ్డుకోవడానికి మరియు తక్షణ ప్రతిస్పందన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది.2. Mass-Army Strategy పోలాండ్ 2039 నాటికి 500,000 సైనికులు (300,000 యాక్టివ్, 200,000 రిజర్వ్) కలిగిన భారీ సైన్యాన్ని నిర్మిస్తోంది. ఇది దీర్ఘకాలిక, అధిక తీవ్రత గల యుద్ధంను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది. AI, డ్రోన్లు, లాంగ్-రేంజ్ స్ట్రైక్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలను సమీకరిస్తోంది.3. Air & Missile Defence పోలాండ్ NATO Integrated Air and Missile Defence (IAMD)లో కీలక భాగస్వామి. పర్మనెంట్ NATO Air Policing ద్వారా పోలాండ్ ఆకాశాన్ని 24/7 పర్యవేక్షిస్తున్నారు.4. సైబర్ మరియు స్పేస్ రక్షణ పోలాండ్ NATO Eastern Sentry ప్రోగ్రామ్లో భాగమై, సైబర్ దాడులు, ఉపగ్రహ ముప్పులు.రష్యా ప్లాన్..నాటోలో విభేదాలు: రష్యా హైబ్రిడ్ దాడులు NATO ఏకత్వాన్ని బలహీనపరుస్తున్నాయి.యూరప్లో అస్థిరత: సైబర్ దాడులు, ఇంధన సమస్యలు, వలసదారుల ఒత్తిడి యూరప్ భద్రతను దెబ్బతీస్తున్నాయి.ఉక్రెయిన్ మద్దతు తగ్గించడం: రష్యా లక్ష్యం యూరప్ దేశాలు ఉక్రెయిన్కు మద్దతు తగ్గించేలా ఒత్తిడి చేయడం.నాటో ప్రస్తుతం రష్యా, చైనా వంటి దేశాల హైబ్రిడ్ వార్ వ్యూహాలకు ప్రతిస్పందించడానికి ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. 2026లో NATO “Counter-Hybrid Support Teams”, Article 5 invocation readiness, మరియు EUతో సమన్వయం వంటి చర్యల ద్వారా సభ్యదేశాలను రక్షిస్తోంది. ఇలాంటి తరుణంలో ట్రంప్ పోలాండ్కు అదనపు బలగాలను పంపుతానని ప్రకటించడం నాటోకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తోంది. మొత్తం మీద రష్యా హైబ్రిడ్ వార్లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.1. సమన్వయం లోపం ట్రంప్ నిర్ణయం NATO మిత్రదేశాలతో ముందుగా చర్చించకుండా తీసుకున్నారు. NATOలో ఏకత్వం, నమ్మకం దెబ్బతింటుంది.2. జర్మనీ నుండి బలగాల తగ్గింపు పోలాండ్కు బలగాలను పంపడం కోసం అమెరికా జర్మనీలోని సైనికులను తగ్గిస్తోంది. జర్మనీ, ఫ్రాన్స్ వంటి పశ్చిమ యూరప్ దేశాలు దీన్ని తమ భద్రతా ప్రాధాన్యత తగ్గింపుగా భావిస్తున్నాయి. నాటోలోని ఇతర దేశాలు దీన్ని సంయుక్త వ్యూహం కాకుండా వ్యక్తిగత రాజకీయ నిర్ణయంగా చూస్తున్నాయి.4. తూర్పు-పశ్చిమ విభేదాలు తూర్పు యూరప్ దేశాలు (పోలాండ్, బాల్టిక్ దేశాలు) అమెరికా బలగాలను స్వాగతిస్తున్నాయి. పశ్చిమ యూరప్ దేశాలు (జర్మనీ, ఫ్రాన్స్) దీన్ని NATOలో విభేదాలు పెంచే చర్యగా భావిస్తున్నాయి. -
ఇరాన్ గగనతలం మూసివేత.. ఏం జరగనుంది?
టెహ్రాన్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర దశకు చేరుకున్నాయి. ఇరాన్తో శాంతి చర్చలు కొనసాగుతూనే మరోసారి సైనిక దాడులకు అమెరికా రెడీ అవుతున్నట్టు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్పై తాజా దాడుల అవకాశాలను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, ఏ క్షణంలోనైనా మెరుపు దాడులు జరిగే అవకాశముంది.ఈ నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. టెహ్రాన్పై అమెరికా మరోసారి దాడులకు సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. భద్రతా కారణాలతో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.JUST IN: IRAN AIRSPACE COMPLETELY EMPTY!!As per CBS, the US is prepping for possible strikes on Iran.📹FlightRadar24 pic.twitter.com/pDZ6AObtRL— Donald J Trump Posts TruthSocial (@TruthTrumpPost) May 23, 2026సీబీఎస్ న్యూస్ కథనం ప్రకారం, ఇరాన్పై సంభావ్య దాడుల నేపథ్యంలో అమెరికా సైన్యం, ఇంటెలిజెన్స్ విభాగాలకు చెందిన పలువురు అధికారులు తమ మెమోరియల్ డే వీకెండ్ సెలవులను రద్దు చేసుకున్నారు. మొదట న్యూజెర్సీలోని తన గోల్ఫ్ క్లబ్లో వీకెండ్ గడపాలని భావించిన ట్రంప్ కూడా తన ప్రణాళిక మార్చుకుని వైట్ హౌస్కు తిరిగి వెళ్లినట్లు సమాచారం. చర్చలు చివరి నిమిషంలో ఫలించకపోతే ఇరాన్పై కొత్త దాడులకు ట్రంప్ సీరియస్గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల మధ్య ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మరింత ఉద్రిక్తతకు దారితీశాయి. "ఇరాన్ ఒప్పందం చేసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉంది. కానీ వాళ్లు అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని మేము ఎప్పటికీ అనుమతించం. అందుకే మేము కఠిన చర్యలు తీసుకున్నాం" అని ట్రంప్ అన్నారు.ఇదే సమయంలో చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన ప్రస్తుతం టెహ్రాన్లో ఉన్నారు. శనివారం ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ జనరల్ అహ్మద్ వాహిదీతో సమావేశం కానున్నట్లు సమాచారం. ఖతార్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో భాగస్వామ్యమవుతున్నారు. అయితే చర్చలు చాలా క్లిష్టంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజూ డ్రాఫ్ట్లు మారుతున్నా పెద్దగా పురోగతి కనిపించడం లేదని పేర్కొంటున్నారు. -
టెన్షన్ పడుతున్న ట్రంప్.. ఇవాంక హత్యకు మాస్టర్ ప్లాన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరిగినట్టు అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో, ఈ వ్యవహారం సంచలనంగా మారింది. ఇరాన్ ఐఆర్జీసీతో సంబంధాలున్న ఓ ఉగ్రవాది ఈ కుట్ర పన్నినట్లు సదరు మీడియా కథనం పేర్కొంది. అయితే, అతడు తన ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయినట్టు తెలిసింది. దీంతో, ఇవాంక ట్రంప్నకు పెను ప్రమాదం తప్పందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు ప్లాన్ జరిగినట్టు అమెరికాకు చెందిన దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అయితే, ఐఆర్జీసీతో సంబంధాలున్న మహమ్మద్ బాఖర్ సాద్ దావూద్ అల్ సాదీ(32) కొంతకాలం క్రితం తుర్కియేలో అరెస్టు అయ్యాడు. అరెస్టు అనంతరం, అతడిని అమెరికాకు తరలించారు. ఈ క్రమంలో అతడిని విచారించిన దర్యాప్తు అధికారులు కీలక విషయాలను గుర్తించారు. మహమ్మద్ వద్ద ఇవాంక కుటుంబం నివసిస్తోన్న ఇంటి బ్లూప్రింట్ ఉందని వెల్లడించారు. ఫ్లోరిడాలోని ఆమె నివాసం ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసినట్లు తెలుస్తోంది.అయితే, 2020లో ఇరాన్ అగ్రశ్రేణి కమాండర్ ఖాసీం సులేమాని హత్యకు ప్రతీకారంగా ఆమెను హతమార్చేందుకు ఈ ప్లాన్ చేసినట్టు సదరు కథనంలో పేర్కొన్నారు. కానీ, అతడు ప్లాన్ అమలు చేసే లోపే అరెస్టు అయ్యాడని తెలియజేసింది. అతడు అరెస్ట్ కాకపోయి ఉంటే ప్రమాదం జరిగేదనే విషయాన్ని అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఖాసీం సులేమానీ ఇరాన్ మిలిటరీలో అగ్రశ్రేణి కమాండర్. ఇస్లామిక్ రివెల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్జీసీ) విభాగం ఖుద్ ఫోర్స్కు కమాండర్గా ఉన్న సమయంలో అమెరికా అతడిని హత్య చేసింది. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటానని మహమ్మద్ బహిరంగంగానే ప్రకటించాడు. ఇరాన్-ఇరాక్ ఉగ్రనెట్వర్క్లో అతడిది కీలకపాత్ర అని అమెరికా అధికారులు వెల్లడించారు.#BREAKING: An IRGC-linked suspect accused of plotting to assassinate Ivanka Trump has been captured.Reports claim the suspect possessed a blueprint of her Florida home and had allegedly vowed to target the former First Daughter. pic.twitter.com/ONINXJwDVL— upuknews (@upuknews1) May 23, 2026 -
ట్రంప్ కీలక నిర్ణయం.. పోలాండ్కు అదనపు బలగాలు
వాషింగ్టన్: పోలాండ్కు అదనంగా 5 వేల బలగాలను పంపించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యూరప్లో తమ బలగాలను తగ్గిస్తామంటూ ట్రంప్, ఆయన యంత్రాంగం ఇటీవల తరచూ ప్రకటనలు చేస్తుండటం తెల్సిందే. ఇందుకు విరుద్ధంగా పోలాండ్కు అదనంగా బలగాలను తరలిస్తామంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు.ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో తాను మద్దతు ప్రకటించిన కరోల్ నవ్రోకీ విజయం సాధించడంతో, ఆయనతో తనకున్న సత్సంబంధాల నేపథ్యంలో అదనంగా 5 వేల సైనికులను అక్కడికి తరలించాలని నిర్ణయించుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో యుద్ధంలో నాటో దేశాలు తనతో సహకరించకపోగా, జర్మనీ చాన్సలర్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న ట్రంప్ జర్మనీ నుంచి 5 వేల మంది సైనికులను ఉపసంహరించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించడం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ చేసిన ప్రకటనతో నాటో దేశాల నేతలు అయోమయానికి గురవుతున్నారు. -
స్వదేశం నుంచే గ్రీన్కార్డు దరఖాస్తులు
వాషింగ్టన్: విదేశీ పౌరులు అమెరికాలో నివసిస్తూ అమెరికాలో శాశ్వత నివాసిత హోదా లేదా గ్రీన్కార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలంటే స్వదేశానికి తిరిగి వెళ్లక తప్పదు. అమెరికా నుంచే దరఖాస్తు చేసుకోవడం కుదరదు. సొంత దేశం నుంచి చేసుకోవాల్సిందే. ఈ విషయాన్ని యూఎస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసు(యూఎస్సీఐఎస్) తాజాగా వెల్లడించింది. తాత్కాలికంగా అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డ్ కోరుకునే విదేశీయులు అసాధారణ పరిస్థితులు మినహా, దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా తమ స్వదేశానికి తిరిగి వెళ్లాలని యూఎస్సీఐఎస్ ప్రతినిధి జాక్ కాహ్లర్ ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విదేశీయులు అమెరికా వలస విధానాన్ని సరిగ్గా పాటించాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. అమెరికా చట్టాల అసలు లక్ష్యం ఇదేనని ఇన్నారు. విదేశీయులు తమ స్వదేశం నుంచే దరఖాస్తు చేసుకుంటే వారికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. ఒకవేళ దరఖాస్తు తిరస్కరణకు గురైతే అజ్ఞాతంలోకి జారుకొని అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉండిపోవాలనే అవసరం ఉండదన్నారు. వారిని వెతికి పట్టుకొని, బయటకు పంపే అగత్యం కూడా తొలగిపోతుందని వివరించారు. విద్యార్థులు, తాత్కాలిక కార్మికులు లేదా పర్యాటక వీసాలపై వచ్చిన వారు కాకుండా ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం కొద్దికాలం పాటు అమెరికాకు వచ్చినవారు పని పూర్తయ్యాక కచ్చితంగా తిరిగి వెళ్లిపోయేలా తమ వ్యవస్థను రూపొందించినట్లు యూఎస్సీఐఎస్ తెలియజేసింది. వారి ఆగమనం గ్రీన్ కార్డ్ ప్రక్రియలో మొదటి అడుగుగా ఉండకూడదని అభిప్రాయపడింది. -
ఇరాన్ను ఒప్పించడానికి పాక్ యత్నాలు ముమ్మరం
ఇస్లామాబాద్: పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ యుద్ధాన్ని త్వరగా ముగించడమే లక్ష్యంగా పాకిస్తాన్ తన ప్రయత్నాలు వేగవంతం చేసింది. పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునిర్ శుక్రవారం ఇరాన్ రాజధాని టెహ్రాన్కు చేరుకున్నారు. అమెరికాతో శాంతి ఒప్పందం దిశగా ఇరాన్ను ఒప్పించడానికి ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు పాక్ సైనిక వర్గాలు వెల్లడించాయి. మధ్యవర్తిత్వ ప్రయత్నాలను ఆయన కొనగిస్తున్నారని తెలిపాయి. టెహ్రాన్ ఎయిర్పోర్టులో అసిమ్ మునిర్కు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి ఎస్కందర్ మొమెనీ స్వాగతం పలికారు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ బుధవారమే ఇరాన్కు చేరుకున్నారు. అసిమ్ మునిర్ ఇరాన్ ముఖ్య నాయకులతో భేటీ కాబోతున్నారు. అబ్బాస్ అరాగ్చీతో నఖ్వీ భేటీ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ శుక్రవారం సమావేశమయ్యారు. వారిద్దరూ భేటీ కావడం గత 24 గంటల వ్యవధిలో ఇది రెండోసారి. అమెరికా, ఇరాన్ల మధ్య యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో చేసిన ప్రతిపాదనలను వారు సమీక్షించారు. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య విభేదాలను తొలగిండమే ధ్యేయంగా నఖ్వీ ఇరాన్లో పర్యటిస్తున్నారు. ఆయన ఇప్పటికే ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సహా కీలక నేతలతో సమావేశమయ్యారు. -
ట్రంప్ ప్రభుత్వానికి బిగ్ షాక్!
యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న తన భర్తకు మద్దతుగా నిలిచేందుకు తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పంపిన రాజీనామా లేఖను తులసి గబ్బార్డ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తులసి భర్త అబ్రహం ఇటీవల ఒక అరుదైన బోన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జూన్ 30 నుం,ఇ తన రాజీనామా అమలులోకి వస్తుందని ఆమె స్పష్టం చేశారు. "నా భర్త అబ్రహంకు ఇటీవల అత్యంత అరుదైన బోన్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. బోయే రోజుల్లో ఆయన ఎన్నో సవాళ్లను, కఠినమైన చికిత్సలను ఎదుర్కోవాల్సి ఉంది. అందుకే ఆయనకు సపోర్ట్గా ఉండేందుకు నా పదవికి రాజీనామా చేయాల్సి వస్తోంది.ఈ క్లిష్ట సమయంలో నేను ప్రజా సేవకు దూరంగా జరిగి, ఆయన వెన్నంటే ఉంటూ పూర్తి మద్దతు అందించడం నా బాధ్యత. నాపై నమ్మకం ఉంచి 'ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు ప్రెసిడెంట్ ట్రంప్కు ధన్యవాదాలు" అని తన రాజీనామా లేఖలో గబ్బార్డ్ పేర్కొన్నారు.కాగా గబ్బార్డ్ గైర్హాజరీలో జాతీయ నిఘా సంస్థ తాత్కాలిక సంచాలకుడిగా ఆరోన్ లూకాస్ వ్యవహరిస్తారని ట్రంప్ ప్రకటించారు. కాగా ఆరోన్ లూకాస్ ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ నేషనల్ ఇంటెలిజెన్స్ డిప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు. -
ఇరాన్ దాడులకు చెక్.. యూఏఈ సరికొత్త వ్యూహాం
ఇరాన్ వరుస డ్రోన్ దాడుల నేపథ్యంలో తమ చమురు నిల్వ కేంద్రాలను రక్షించుకునేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త రక్షణ వ్యూహాన్ని అమలు చేస్తోంది. యూఈఏ ప్రభుత్వం చమురు నిల్వ కేంద్రాల చుట్టూ డ్రోన్ నిరోధక రక్షణ వ్యవస్థను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరలవుతున్నాయి. భారీ డ్రోన్లు దాడి చేసినా, అవి నేరుగా చమురు ట్యాంకులను తాకకుండా అడ్డుకోవడమే ఈ 'యాంటీ-డ్రోన్' వ్యవస్థ ముఖ్య ఉద్దేశం. మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్తో నడుస్తున్న యుద్దం వాతావారణంలో ఇరాన్.. వ్యూహాత్మకంగా యూఏఈను టార్గెట్ చేస్తూ తమ హెచ్చరికల తీవ్రతను పెంచింది. చమురు కేంద్రాలు, పర్యాటక కేంద్రాలు, చివరికి ఒక అణు రియాక్టర్తో సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రదేశాలలో మరోసారి దాడి చేస్తామని టెహ్రాన్ హెచ్చరిస్తోంది. ఈ క్రమంలోనే తమ చమురు నిల్వ కేంద్రాలను కాపాడుకునేందుకు యూఏఈ పటిష్ట చర్యలను మొదలు పెట్టింది.మరోవైపు తమపై నిఘా పెట్టేందుకు, ఉమ్మడి వ్యూహాలు రచించేందుకు యూఏఈ తన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అమెరికా, ఇశ్రాయేల్ రక్షణ సంస్థలతో పంచుకుంటోందని ఇరాన్ ఆరోపిస్తోంది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇజ్రాయెల్తో కలిసి ఒక భారీ నిధిని ఏర్పాటు చేస్తున్నాయి.ఈ రెండు దేశాలు కలిసి అత్యాధునిక యాంటీ-డ్రోన్ ఆయుధాలను తయారు చేయనున్నట్లు సమాచారం. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు యూఏఈని సందర్శించినప్పుడు ఈ ఒప్పందం జరిగినట్లు తెస్తోంది.చదవండి: స్టార్ ప్లేయర్ దూరం.. కేకేఆర్కు ఎదురుదెబ్బ! -
అమెరికాకు కొత్త టెన్షన్.. ఇరాన్పై కీలక ఇంటెలిజెన్స్ నివేదిక
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడితో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. యుద్ధం కోసం అధునాతన టెక్నాలజీ ఉన్న బాంబు, క్షిపణులు, డ్రోన్లను ఉపయోగించారు. దీంతో, ఇరువైపులా భారీ నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ క్షీణించిన తన సైనిక సామర్థ్యాలను అంచనా వేసిన దాని కంటే చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. దీనికి సంబంధించిన ఓ నివేదిక ఇప్పుడు అమెరికాను టెన్షన్ పెడుతోంది.అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని అంచనా వేసిన దాని కంటే వేగంగా నిర్మించుకుంటోంది. ప్రస్తుతం ఇరాన్ డ్రోన్ సామర్థ్యాలలో 50 శాతం ఇంకా మిగిలి ఉన్నాయి. యుద్ధ సమయంలో కోల్పోయిన ఆయుధాలను ఇరాన్ చాలా వేగంగా పునర్నిర్మించుకుంటోంది. నెల రోజుల క్రితం పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఏప్రిల్ 8న ఇరాన్ తన డ్రోన్ల ఉత్పత్తిని కూడా పునఃప్రారంభించింది. అయితే, అమెరికాతో కొనసాగుతున్న ఈ సంఘర్షణలో డ్రోన్లే ఇరాన్ యొక్క ప్రధాన ఆయుధం.యుద్ధం సంఘర్షణలో దెబ్బతిన్న క్షిపణి స్థానాలు, ప్రయోగ పరికరాలు, మరియు కీలక ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి శ్రేణులను మరమ్మత్తు చేయడం, వాటి స్థానంలో కొత్త వాటిని ఇరాన్ ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్ కోల్పోయిన సైనిక బలాన్ని పునరుద్ధరించుకుంటోందని నివేదిక పేర్కొంది. దీని అర్థం, ఒకవేళ యుద్ధం తిరిగి ప్రారంభమైతే ఇరాన్ ప్రాంతీయ మిత్రదేశాలకు మరోసారి ముప్పుగా మారగలదు. ఇరాన్ క్షిపణులు మరియు డ్రోన్ల దాడి పరిధిలోనే ఇజ్రాయెల్ మరియు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క క్షిపణి ఉత్పత్తి సామర్థ్యం తీవ్రంగా క్షీణించడంతో, టెహ్రాన్ ప్రత్యామ్నాయంగా డ్రోన్ యుద్ధం వైపు ఎక్కువగా మొగ్గు చూపవచ్చు. ఈ ముప్పును ప్రాంతీయ మిత్రదేశాలు ప్రత్యేక ఆందోళనతో చూస్తున్నాయి.గతేడాది ఇజ్రాయెల్తో చేసిన 12 రోజుల యుద్ధం కంటే ప్రస్తుతం జరుగుతోన్న యుద్ధంలోనే గల్ఫ్ ప్రాంతంపై ఇరాన్ ఎక్కువగా క్షిపణులను ప్రయోగించింది. సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ విడుదల చేసిన గణాంకాల్లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 మధ్య గల్ఫ్ దేశాలపైకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య 550 దాటినట్లు తెలిసింది. తమపై జరిగిన క్షిపణి దాడులను, డ్రోన్ దాడులను ఒమన్ వెల్లడించలేదు. ఇదే సమయంలో వాషింగ్టన్, ఇజ్రాయెల్లు ఇరాన్పై వేలాది బాంబులను వేశాయి.ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత కీలకమైన ఆయుధాలు బాలిస్టిక్ క్షిపణులు. ఇవి ఎక్కువ ఎత్తుకు చేరుకుని, అక్కడ నుంచి లక్ష్యాలను వెంబడించగలవు. శత్రువుకు తీవ్ర నష్టాన్ని కలిగించడానికి అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా ఈ బాలిస్టిక్ క్షిపణులను తెహ్రాన్ పరిగణిస్తోంది. తమ వైమానిక దళానికి ప్రత్యామ్నాయంగా దీన్ని చూస్తోంది. క్రూయిజ్, హైపర్సోనిక్ క్షిపణులు తక్కువ ఎత్తులో వెళ్తాయి. తమ లక్ష్యాలను చేరుకునేందుకు వీటికి ఎయిర్ పవర్ ఇంజిన్లు (జెట్ లేదా ప్రొపెల్లర్) సాయం అవసరం.ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ ప్రకారం..ఇరాన్ వద్దనున్న స్వల్ప శ్రేణి క్షిపణుల రేంజ్ 300 కిలోమీటర్ల నుంచి వెయ్యి కిలోమీటర్లు.ఈ క్షిపణులు గల్ఫ్ దేశాలు సహా పలు ఇతర సరిహద్దు దేశాలపై ప్రయోగించగలిగే సామర్థ్యంతో ఉన్నాయి.మధ్యస్థ శ్రేణి క్షిపణులు వెయ్యి కిలోమీటర్ల నుంచి రెండు వేల కిలోమీటర్ల వరకు ప్రయోగించదగినవి. ఇవి ఇజ్రాయెల్ వరకు చేరుకోగలవు.డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం ఇరాన్ వద్దనున్న 8 బాలిస్టిక్ క్షిపణుల రేంజ్..షహాబ్ 1... 300 కిలోమీటర్లుఫతే 110... 300 నుంచి 500 కిలోమీటర్లుషహాబ్ 2... 500 కిలోమీటర్లుజుల్ఫిఖార్... 700 కిలోమీటర్లుఖియామ్ 1... 750 కిలోమీటర్లుషహాబ్ 3... 2000 కిలోమీటర్లుమరోవైపు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడులు దీర్ఘకాలంలో ఇరాన్ సైన్యాన్ని ఎంతగా దెబ్బతీశాయనే విషయాన్ని కూడా అమెరికా నిఘా వర్గాల అంచనాలు వేస్తున్నాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. క్షిపణుల తయారీకి ఉపయోగించే విడిభాగాలను చైనా ఇరాన్కు సహాయం చేస్తోంది. అయితే అమెరికా దిగ్బంధనం కారణంగా ఆ సహాయం పరిమితం చేయబడింది. అలాగే, రష్యా నుంచి కూడా ఇరాన్ సాయం అందుతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.ఇదిలా ఉండగా.. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచే క్రమంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దాని అమ్ములపొదిలోని సగం ఎయిర్డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. యుద్ధ సమయంలో ఇరాన్పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధనౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్-3, స్టాండర్డ్ మిసైల్-6లను వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి.అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీస్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది అమెరికా- ఇజ్రాయెల్ సైనిక సమన్వయలోపాన్ని ఎత్తిచూపుతోందన్నారు. ఇక, యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్లింగ్లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. మొత్తం మీద ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడం అమెరికాకు కొత్త టెన్షన్ను తెచ్చిపెట్టింది. -
అమెరికా దెబ్బలన్నీ చూసేశాం.. ఇక ఆట మాదే!
ఒకప్పుడు ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైపు చూసేవి.. ఇప్పుడు మాత్రం మెల్లగా తమవైపు తిరుగుతున్నాయని చైనా నమ్ముతోంది. అమెరికా వేసిన ఆర్థిక దెబ్బలు, సాంకేతిక ఆంక్షలు, ఒత్తిడులన్నింటినీ తట్టుకుని మరింత బలపడిపోయామని బీజింగ్ భావిస్తోంది. అంతేకాదు.. “ఇప్పటి నుంచి ఆటను నడిపేది మేమే” అనే సంకేతాలు కూడా పంపిస్తోంది. ట్రంప్ పర్యటన తర్వాత మారిన చైనా వైఖరి ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది.రాజకీయ విశ్లేషకుడు ఆర్నాడ్ బెర్ట్రాండ్ వెల్లడించిన వివరాలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. చైనా ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేసే ఒక పరిశోధనా సంస్థ తయారుచేసిన నివేదిక ఆధారంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “అమెరికా-చైనా సహజీవనం దిశగా ప్రపంచంలో జరుగుతున్న మహా మార్పు” అనే అంశంపై రూపొందిన ఈ నివేదికలో.. ప్రపంచ రాజకీయాల్లో జరుగుతున్న భారీ మార్పులను చైనా ఎలా చూస్తోందో వివరించారు.ఈ నివేదిక ప్రకారం.. చైనా ఇప్పుడు అమెరికాను “అడ్డుకోలేని మహాశక్తి”గా చూడటం లేదట. గత కొన్నేళ్లుగా అమెరికా చేసిన ఆర్థిక ఒత్తిడులు, దిగుమతి సుంకాలు, సాంకేతిక ఆంక్షలు, ప్రపంచ దేశాలను చైనా నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు.. ఇవన్నీ జరిగినా కూడా చైనా ఎదుగుదలేం ఆగలేదని బీజింగ్ బలంగా భావిస్తోంది. అందుకే “అమెరికా తన బలమైన దెబ్బ ఇప్పటికే కొట్టేసింది.. ఇక చైనాను పూర్తిగా ఆపడం సాధ్యం కాదు” అనే నమ్మకం అక్కడ బలపడిందని చెబుతున్నారు.ఈ ఆలోచనకు చైనా మాజీ కమ్యూనిస్టు నాయకుడు మావో జెడాంగ్ చెప్పిన “దీర్ఘకాల పోరాట సిద్ధాంతం”ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సిద్ధాంతం ప్రకారం.. మొదట బలహీనంగా ఉన్న దేశం శక్తివంతమైన దేశం ఒత్తిడిని తట్టుకుంటుంది. తర్వాత మెల్లగా ఆర్థికంగా, సాంకేతికంగా, వ్యూహాత్మకంగా బలపడుతూ చివరకు ప్రత్యర్థిని మించిపోతుంది. ప్రస్తుతం చైనా అదే దశలో ఉందని ఆ నివేదిక చెబుతోంది.బలప్రయోగం కాదు, కానీ..ప్రపంచ తయారీ రంగం, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధస్సు, పర్యావరణ హిత ఇంధన సాంకేతికత, బ్యాటరీ తయారీ వంటి రంగాల్లో చైనా వేగంగా ఆధిపత్యం పెంచుకుంటోందని నివేదిక పేర్కొంది. అంటే కేవలం డబ్బు పరంగా మాత్రమే కాదు.. భవిష్యత్తు ప్రపంచాన్ని నడిపించే రంగాల్లో కూడా చైనా ముందుకు దూసుకెళ్తోందన్న మాట. ఇంకో కీలక అంశం ఏమిటంటే.. ప్రపంచ క్రమం కూడా మారుతోందని చైనా భావిస్తోంది. ఒకప్పుడు అమెరికా చుట్టూ తిరిగిన ప్రపంచం.. ఇప్పుడు అనేక శక్తి కేంద్రాలుగా విడిపోతుందని, అందులో తామే ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నామని బీజింగ్ అంచనా వేస్తోంది. అయితే ఈ మార్పు యుద్ధాల ద్వారా కాదని.. ఆర్థిక బలం, పరిశ్రమల శక్తి, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ వాణిజ్య సంబంధాల ద్వారా వస్తోందని నివేదిక చెబుతోంది. అంటే చైనా ప్రపంచాన్ని బలవంతంగా జయించాలని కాదు.. ప్రపంచ దేశాలు స్వయంగా చైనాపై ఆధారపడే పరిస్థితి వస్తోందని భావిస్తోందన్నమాట.ఇప్పటివరకు చైనా వ్యూహాత్మక పత్రాల్లో కనిపించిన “అమెరికా భయం” ఈసారి కనిపించలేదని బెర్ట్రాండ్ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికాను పెద్ద ముప్పుగా చిత్రీకరించిన చైనా.. ఇప్పుడు మాత్రం దాన్ని మేనేజ్ చేయగలిగే అంశంగా మాత్రమే చూస్తోందట. అంటే అమెరికా ఇబ్బందులు కలిగించగలదు కానీ.. చైనా ఎదుగుదలను పూర్తిగా అడ్డుకోలేదనే నమ్మకం అక్కడ పెరిగిపోయిందన్నమాట.తగ్గేదే లే!అయితే చైనా నేరుగా యుద్ధ దారిలో వెళ్లాలని అనుకోవడం లేదని కూడా ఈ నివేదిక చెబుతోంది. అమెరికాతో పరస్పర గౌరవం, సహజీవనం అవసరమని సూచించింది. రెండు దేశాల మధ్య నేరుగా ఘర్షణలు జరగకుండా సంభాషణలు కొనసాగించాలని, కృత్రిమ మేధస్సు నియంత్రణ, వాతావరణ మార్పులు, మాదక ద్రవ్యాల నియంత్రణ వంటి అంశాల్లో కలిసి పనిచేయాలని సూచించింది. అదేసమయంలో తైవాన్ విషయంలో మాత్రం చైనా తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. తైవాన్ చివరకు చైనాతో కలవాల్సిందేనని, అమెరికా అక్కడ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తే ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయని హెచ్చరించింది. ఈ క్రమంలోనే ట్రంప్ ‘తైవాన్ సుదూర’ వ్యాఖ్య చేసి ఉంటాడనే విశ్లేషణ నడుస్తోంది. మొత్తంగా ఈ నివేదిక ద్వారా.. ప్రపంచ భవిష్యత్తు నాయకత్వం తమదేనని చైనా ఇప్పుడు గట్టిగా నమ్ముతోందని విశ్లేషకులు అంటున్నారు. అమెరికా ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని.. తమ ప్రభావం పెరుగుతుందని బీజింగ్ భావిస్తోంది. అయితే అది యుద్ధాలతో కాదు.. ఆర్థిక బలం, సాంకేతిక ఆధిపత్యం, ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడడం పెరుగుతున్న నేపథ్యాలతో సాధ్యమవుతుందని చైనా అంచనా వేస్తోంది. -
నా కుమారుడి పెళ్లికి వెళితే చంపేస్తారు?.. ట్రంప్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చమత్కారం చేశారు. ఇరాన్తో తనకు ప్రాణహాని ఉందని తను బయిటకే వెళితే చంపేసే అవకాశం ఉందన్నారు. అందువలనే తన కుమారుడి వివాహానికి హాజరుకానని తెలిపారు. అయితే ఒకవేళ తను హాజరైనా కాకపోయిన తప్పుడు వార్తలతో తనకు మరణ తథ్యమని మీడియాకు చురకలంటించారు. ట్రంప్ వ్యవహారశైలి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఆయనకే తెలియదు. అందుకే ట్రంప్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇరాన్తో యుద్ధం నేపథ్యంలో తాను ఏ వేడుకలకు వెళ్లలేనని ఒకవేళ వెళితే తనను చంపేస్తారన్నారు.ఓవల్లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. "నేను వెళ్లాలని అనుకుంటున్నాను. అయితే నేను వెళ్లడానికి ఇది సరైన సమయం కాదు. ప్రస్తుతం నాకు ఇరాన్ అనే ఒక వ్యవహారం ఉంది. ఒక వేళ నేను వెళ్లినా చంపుతారు. వెళ్లకపోయినా చంపుతారు. అయితే అది తప్పుడు వార్తల వల్ల" అని చమత్కరిస్తూ మాట్లాడారు. తాను పెళ్లికి హాజరైనా, కాకపోయినా మీడియా నుంచి ఎదురయ్యే విమర్శల గురించి ప్రస్తావిస్తూ ఆ విషయంలో నేను గెలవలేను అని ఆయన అన్నారు.అయితే ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ వివాహం ఈ వారాంతంలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ప్రైవేట్ వేడుకలో పామ్ బీచ్ సోషలైట్ మోడల్.. బెట్టినా అండర్సన్ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ వేడుకకు అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వనించారని తెలుస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, అధ్యక్షుడి పర్యటనకు సంబంధించిన భద్రతాపరమైన ఆందోళనల కారణంగా తన హాజరు అనిశ్చితంగా ఉందని ట్రంప్ సూచించారు. -
ఇరాన్ విషయంలో ఏం చేద్దాం?
వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధం విషయంలో ఏం చేయాలో తెలియక అమెరికా, ఇజ్రాయెల్ తలపట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని ముగించాలా? లేక కొనసాగించాలా? అనేది ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. ఇరాన్ లొంగిపోయే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు మంగళవారం ఫోన్లో చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలిసింది. ఇరాన్ విషయంలో భవిష్యత్తు కార్యాచరణపై వారు విస్తృతంగా చర్చించుకున్నట్లు సమాచారం. మరోవైపు అమెరికా మాత్రం ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది. దాడులు పునఃప్రారంభించే ఆలోచన లేదని సంకేతాలిస్తోంది. కానీ, మళ్లీ దాడులు చేయాల్సిందేనని నెతన్యాహు పట్టుబడుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను మరింతగా దెబ్బతీయడానికి, కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ద్వారా ఆ దేశ పాలనా వ్యవస్థను దెబ్బకొట్టడానికి దాడులు పునఃప్రారంభించాలని అంటున్నారు. ఇరాన్పై తలపెట్టిన దాడులను ఖతార్, యూఏఈ సహా అరబ్ దేశాల అభ్యర్థన మేరకు వాయిదా చేసినట్లు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు పశ్చిమాసియాలో శాంతి సాధన కోసం పాకిస్తాన్, ఖతార్లు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య అంతరాలను పూడ్చే ప్రయత్నంలో భాగంగా సవరించిన శాంతి ఒప్పంద పత్రాన్ని రూపొందించాయి. ఇరాన్తో ఒప్పందం కుదరవచ్చని భావిస్తున్నాననిజ.. కానీ, అలా జరగకపోతే యుద్ధాన్ని పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ పేర్కొంటున్నారు. అబ్బాస్ అరాగ్చితో పాకిస్తాన్ మంత్రి భేటీ టెహ్రాన్: పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మొహిసిన్ నఖ్వీ గురువారం టెహ్రాన్లో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో సమావేశమయ్యారు. అమెరికా–ఇరాన్ శాంతి చర్చలపై వారిద్దరూ చర్చించుకున్నారు. తాజా పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. -
అగ్రజుల గుసగుసలు
రెండు సాధారణ దేశాల అధినేతలు కలిశారంటే వాణిజ్యం, వ్యాపారం, పరస్పర సహకారం, ఇచ్చిపుచ్చుకోవడాలు చర్చకొస్తాయి. ఒప్పందాలు కుదురుతాయి. కానీ రెండు అగ్రదేశాలు కలిశాయంటే పైకి కనబడే వాణిజ్య, వ్యాపారాదులతోపాటు గుట్టుచప్పుడు కాకుండా కుదిరే లాలూచీలుంటాయి. వారం రోజుల వ్యవధిలో మూడు అగ్ర రాజ్యాల మధ్య మంతనాలు సాగాయి. గతవారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకొస్తే, ఈ బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంతు. స్వల్ప వ్యవధిలో ఇలా ఇద్దరు అగ్రరాజ్యాధినేతలు రావటంవల్ల సహజంగానే చైనా స్థాయి అమాంతం పెరిగిపోయింది. పుతిన్ వచ్చిన సందర్భం సాధారణమైనది కాదు. ఆయనే చెప్పినట్టు 54 సంవత్సరాల క్రితం ఇదేరోజున అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ ‘ప్రపంచ దేశాలన్నీ ఏకమై అమెరికా సామ్రాజ్యవాదంపై పోరాడాల’ని పిలుపునిచ్చారు. అప్పటికీ ఇప్పటికీ ప్రపంచం మారింది. పెట్టుబడి ఎగుమతిలో, దేశాలపై ఆర్థికంగా పట్టుబిగించటంలో, ఇరుగుపొరుగును చీకాకుపెట్టడంలో, కనిపించేదంతా తనదేనని ప్రకటించుకోవటంలో చైనా సైతం సామ్రాజ్యవాద పోకడలకు పోతోంది. మధ్యన ‘సోషల్ సామ్రాజ్యవాదం’ ముద్ర వేయించుకున్న సోవియెట్ యూనియన్ చీలికలూ, పేలికలై కుప్పకూలింది. అందులోని ప్రధాన భాగం రష్యా కూడదీసుకునే ప్రయత్నం చేస్తూ, గత వారసత్వాన్ని కొనసాగించటానికి ఆపసోపాలు పడుతోంది. ఇక అమెరికా పోకడలు దశాబ్దాలుగా అదే బాణీలో కొనసాగుతున్నాయి.గతవారం ట్రంప్కు లభించిన స్వాగత సత్కారాలన్నీ పుతిన్కు కూడా దక్కాయి. రెడ్కార్పెట్ పరచడం, సైనిక వందనం, కేరింతలతో పిల్లలు అభివాదం చేయడం వంటివన్నీ కనబడ్డాయి. అయితే స్వీయ ప్రయోజనాల రక్షణలో తమకెవరూ సాటిరారని అధ్యక్షుడు షీ జిన్పింగ్ నిరూపించారు. ఏవేవో ఒప్పందాలు కుదిరాయని ట్రంప్ చెప్పటమే తప్ప చైనా వైపునుంచి గతవారం ఎలాంటి ప్రకటనలూ రాలేదు. ఇప్పుడు పుతిన్కు కూడా దాదాపు అదే అనుభవం ఎదురైంది. ఇంధన సర ఫరా కోసం ‘పవర్ ఆఫ్ సైబీరియా 2’ పేరిట రెండో పైప్లైన్ నిర్మాణానికి రష్యా సిద్ధపడినా, చైనా అందుకు సంబంధించి మరింత లోతుగా చర్చించాల్సి ఉందంటూ వాయిదా వేసింది. కాకపోతే తైవాన్ విషయంలో ట్రంప్కు ‘రెడ్లైన్’ హెచ్చరిక జారీ అయిన పద్ధతిలో పుతిన్కుఎలాంటి భంగపాటు కలగలేదు. ఎవరికి వారు అవతలివారిని వేలెత్తి చూపడమే తప్ప, తమ తప్పులెరగరని ట్రంప్, పుతిన్ల పర్యటనలు నిరూపించాయి. హార్మూజ్ జలసంధి ప్రతిష్టంభన, ఇరాన్ యుద్ధం విషయంలో గతవారం అమెరికా, చైనాలు ‘ఏకాభిప్రాయం’ ప్రకటిస్తే... ఇప్పుడు చైనా, రష్యాలు సైతం అలాంటి స్వరమే వినిపిస్తున్నాయి. ‘ఏకపక్ష వ్యవహారశైలి, ఆధిపత్యవాద ధోరణులు’ ఉండరాదని కోరాయి. ప్రపంచం ఆటవిక న్యాయంలోకి దిగజారే ప్రమాదం కనబడుతోందని ఆందోళన వ్యక్తంచేశాయి. తరచిచూస్తే ఈ మూడు దేశాలూ జంకూ గొంకూ లేకుండా ఆధిపత్య ధోరణులు ప్రదర్శిస్తున్నాయి. అయినా గంభీరస్వరాలతో హితవు పలికే సాహసం చేస్తున్నాయి. అమెరికా సైన్యం వెనెజులా అధ్యక్షుణ్ణి భార్యా సమేతంగా చీకటిచాటున అపహరించుకు పోయింది. ఇరాన్ అగ్రనేతను ఇజ్రాయెల్తో కలిసి హత్య చేసింది. క్యూబాను కబళించటానికి కత్తులు నూరుతోంది. రష్యా నాలు గేళ్లుగా ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. దురాక్రమణకు దిగకపోయినా ఆసియా ఖండ దేశాల్లో చైనా కండబల ప్రదర్శన తక్కువేం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పుతిన్కు చైనా అవసరమే ఎక్కువుంది. ఉక్రెయిన్ను తక్కువ అంచనా వేసి యుద్ధంలోకి దిగి, అది తీవ్రంగా దెబ్బతింది. పుతిన్ స్వీయభద్రతే ప్రమాదంలో పడింది. రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించిన ఉక్రెయిన్... ‘రష్యా తలపెట్టిన మే 9 విక్టరీ పెరేడ్ సజావుగా సాగటానికే’ దీనికి అంగీకరించామంటూ ఎద్దేవా చేసింది. దానికితోడు 2008 తర్వాత తొలిసారి ట్యాంకులు, క్షిపణులు లేకుండా ఆ పెరేడ్ హడావుడిగా ముగిసింది. మొత్తానికి ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆ రెండు దేశాల మాదిరిగా తనపై ఇంకా దురాక్రమణదారు ముద్రపడనందువల్లే ఈమాత్రం ప్రతిష్ఠయినా దక్కుతున్నదని చైనా గ్రహించి సవ్యంగా వ్యవహరిస్తే అదే పదివేలు! -
ట్రంప్ షేర్ లావాదేవీల కలకలం.. వైట్హౌస్ను కుదిపేస్తున్న వివాదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారీ వివాదంలో చిక్కుకున్నారు. రోజుకు రెండు, మూడు సార్లు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే సాధారణ ఇన్వెస్టర్లకంటే భిన్నంగా, ట్రంప్ వైట్హౌస్లో కూర్చొని రోజుకు సగటున 40 సార్లు ట్రేడింగ్ చేశారన్న ఆరోపణలు ఇప్పుడు అమెరికా రాజకీయ, ఆర్థిక వర్గాలను కుదిపేస్తున్నాయి. కేవలం 90 రోజుల్లోనే 3,700కు పైగా షేర్ లావాదేవీలు జరగడం తీవ్ర చర్చనీయాంశమైంది.Bloomberg నివేదికల ప్రకారం, 2026 జనవరి నుంచి మార్చి మధ్య ట్రంప్ లేదా ఆయన సలహాదారులు భారీ స్థాయిలో షేర్ల కొనుగోలు, అమ్మకాల లావాదేవీలు నిర్వహించారు. ముఖ్యంగా Microsoft, NVIDIA, Oracle, Boeing, Amazon, Meta వంటి దిగ్గజ కంపెనీల్లో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్క ఫిబ్రవరి 10న మాత్రమే మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ షేర్లను 5 మిలియన్ నుంచి 25 మిలియన్ డాలర్ల వరకు అమ్మినట్లు సమాచారం.అధ్యక్షుడా? హెడ్జ్ ఫండ్ బాసా? ఈ స్థాయి ట్రేడింగ్ చూసి వాల్ స్ట్రీట్ నిపుణులే ఆశ్చర్యానికి గురయ్యారు. అమెరికా ప్రభుత్వ నైతిక ప్రమాణాల కార్యాలయానికి సమర్పించిన వందల పేజీల ఆర్థిక వివరాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టాయి. పలువురు మార్కెట్ నిపుణులు ఇది సాధారణ వ్యక్తిగత పెట్టుబడి ఖాతా లాగా కనిపించడం లేదని, భారీ అల్గోరిథమిక్ ట్రేడింగ్ నిర్వహించే హెడ్జ్ ఫండ్ తరహాలో ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.అయితే అసలు వివాదం ఇక్కడి నుంచే మొదలైంది. ఒక దేశాధ్యక్షుడు ప్రభుత్వ విధానాలతో నేరుగా ప్రభావితమయ్యే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న ఇప్పుడు అమెరికాలో హాట్ టాపిక్గా మారింది. ఉదాహరణకు NVIDIA సంస్థ చైనాకు ఏఐ చిప్లు ఎగుమతి చేయాలంటే అమెరికా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అలాగే బోయింగ్ కంపెనీ ప్రభుత్వ రక్షణ ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలపై ప్రభుత్వం యాంటీ ట్రస్ట్ విచారణలు, ఏఐ నియంత్రణలపై నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో ఒకవైపు ప్రభుత్వ విధానాలు రూపొందిస్తూ, మరోవైపు అదే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం “కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్” కిందికి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.గత అమెరికా అధ్యక్షులు George H. W. Bush, Bill Clinton తమ ఆస్తులను “బ్లైండ్ ట్రస్ట్”లలో ఉంచి ఇలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జాగ్రత్త పడ్డారు. కానీ ట్రంప్ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ సంస్థల నిర్వహణలో ఆయన కుటుంబ సభ్యుల పాత్ర కొనసాగుతోందని, కొన్ని ఆర్థిక దాఖలాల్లో ఆలస్యానికి జరిమానాలు కూడా చెల్లించారని సమాచారం.ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? ఇంత భారీ స్థాయిలో ట్రేడింగ్ సాధ్యమా? లేదంటే ఆటోమేటెడ్ అల్గోరిథమ్స్ ద్వారా జరిగిందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది పూర్తిగా అల్గోరిథమిక్ ట్రేడింగ్ అని నిరూపించే ఆధారాలు లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, కేవలం మూడు నెలల్లో వేల లావాదేవీలు జరగడం అమెరికా మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.ఈ వివాదానికి మరింత ఊపిరి పోసింది ఇరాన్ అంశం. ఇరాన్తో చర్చలు పురోగమిస్తున్నాయని ట్రంప్ ప్రకటించే ముందు కొందరు ఇన్వెస్టర్లు భారీ స్థాయిలో ఫ్యూచర్స్ మార్కెట్లో బెట్టింగ్ పెట్టారని సమాచారం. ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు పడిపోగా, అమెరికా మార్కెట్లు భారీగా ఎగిశాయి. ఈ టైమింగ్ అనుమానాలకు తావిచ్చినా, ట్రంప్కు నేరుగా సంబంధం ఉందని నిరూపించే ఆధారాలు లేవు.ఇదిలా ఉండగా ట్రంప్ అల్లుడు Jared Kushner పేరు కూడా ఈ చర్చల్లో వినిపిస్తోంది. మధ్యప్రాచ్య దేశాలతో దౌత్య చర్చలు జరుపుతూనే, గల్ఫ్ పెట్టుబడిదారులతో ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఆయన సంస్థ Affinity Partners సౌదీ అరేబియా సహా గల్ఫ్ సంపద నిధులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే వైట్ హౌస్ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. ట్రంప్ పెట్టుబడులను స్వతంత్ర ఆర్థిక సంస్థలే నిర్వహిస్తున్నాయని, ఆయన గానీ, కుటుంబ సభ్యులు గానీ నేరుగా ట్రేడింగ్లో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. అయినప్పటికీ, ఒక అమెరికా అధ్యక్షుడు ప్రభుత్వ నిర్ణయాలతో ప్రభావితమయ్యే కంపెనీల్లో ఈ స్థాయిలో దూకుడుగా ట్రేడింగ్ చేయడం నైతికంగా సరైనదేనా? అన్న ప్రశ్న మాత్రం అమెరికాలో పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తోంది. - వెబ్ డెస్క్ -
అది దేశం దాటివెళ్తే మన సంగతి అంతే: ఇరాన్
టెహ్రాన్: ఇరాన్, అమెరికా మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న వేళ.. ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదని ఆదేశించినట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. శుద్ధి చేసిన యురేనియాన్ని ఇరాన్ వదులుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కీలక డిమాండ్ను ఇరాన్ మొదటి నుంచి నిరాకరిస్తోంది.అణ్వాయుధ తయారీలో కీలక భాగమైన శుద్ధి చేసిన యురేనియం నిల్వలను పూర్తిగా ఇస్లామిక్ రిపబ్లిక్ నుంచి బయటకు తరలిస్తామని ట్రంప్ గతంలో ఇజ్రాయెల్కు హామీ ఇచ్చారని ఇజ్రాయెల్ అధికారులు రాయిటర్స్కు తెలిపారు.ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కఠిన వైఖరిని కొనసాగిస్తున్నారు. శుద్ధి చేసిన యురేనియాన్ని పూర్తిగా ఇరాన్ అధీనంలో లేకుండా చేసేవరకు, ప్రాంతీయ ప్రాక్సీ మిలీషియాలకు టెహ్రాన్ ఆర్థిక, సామగ్రి సహాయం పూర్తిగా ఆపే వరకు వెనక్కి తగ్గబోమన్నారు. అలాగే, ఆ దేశ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసే వరకు యుద్ధ విరమణపై ఆలోచించబోమని ఆయన స్పష్టం చేశారు.అయితే ఈ వైఖరికి టెహ్రాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అత్యంత సున్నితమైన భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా పేరు వెల్లడించకుండా మీడియాతో మాట్లాడారు ఇరాన్ వర్గాలకు చెందిన ఓ ప్రతినిధి. “సుప్రీం లీడర్ ఆదేశం స్పష్టంగా ఉంది. శుద్ధిచేసిన యురేనియం నిల్వలు దేశం బయటకు వెళ్లకూడదన్నారు” అని తెలిపారు.అదే వర్గాలు మరో విషయం వెల్లడించాయి. ఈ పదార్థాన్ని విదేశాలకు పంపితే తమ దేశ భద్రత తీవ్రంగా బలహీనపడుతుందని, భవిష్యత్తులో వాషింగ్టన్, టెల్ అవీవ్ నుంచి సైనిక దాడులను ఎదుర్కోలేదని చెప్పాయి. ఇరాన్ అగ్ర పరిపాలనా, సైనిక వర్గాలు ఈ విధంగానే భావిస్తున్నాయి. ఇరాన్ రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం కీలక ప్రభుత్వ విధానాలపై తుది అధికారం సుప్రీం లీడర్ చేతుల్లోనే ఉంటుందని రాయిటర్స్ తెలిపింది.అమెరికా దాడులు చేయనుందా? ఇరాన్ సీనియర్ వర్గాల సమాచారం ప్రకారం.. టెహ్రాన్ రాజకీయ వ్యవస్థలో తీవ్ర అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం యుద్ధ తీవ్రత పూర్తిగా తగ్గినట్టుగా చూపడం అమెరికా వ్యూహాత్మక మోసమని, తప్పుడు రీతిలో భద్రతాభావం కలిగించి మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించాలన్న యత్నమని చాలామంది భావిస్తున్నారు.ఈ భయాలకు బలం చేకూర్చుతూ ఇరాన్ ప్రధాన శాంతి చర్చల ప్రతినిధి బాక్వెర్ తాజాగా మాట్లాడుతూ.. “శత్రువు బహిరంగ, రహస్య కదలికలు చూస్తే అమెరికా సైన్యం కొత్త దాడుల సన్నాహాల్లో ఉందని స్పష్టమవుతోంది” అన్నారు.ఇదిలా ఉండగా, సమగ్ర శాంతి ఒప్పందంపై ఇరాన్ సంతకం చేయకపోతే ఆ దేశంపై మరోసారి సైనిక దాడులు ప్రారంభించేందుకు అమెరికా పూర్తిగా సిద్ధంగా ఉందని ట్రంప్ బుధవారం ప్రకటించారు. అయితే సరైన సమాధానాలు రావడానికి కొన్ని రోజుల గడువు ఇస్తామన్న సంకేతం ఇచ్చారు. -
తెలంగాణ వాదులను గుండెల్లో పెట్టుకుంటా
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పట్టుబట్టి పనిచేసిన తెలంగాణవాదులను గుర్తించి గుండెల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ నాయకుడు, ఎల్పీ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. వ్యక్తిగత పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్న ఆయన న్యూయార్క్ లో తెలంగాణవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. లాంగ్ ఐలాండ్ లో ప్రముఖ ఎన్ఆర్ఐ లక్ష్మణ్ ఏనుగు నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ ఎన్నారై వ్యాపారవేత్త డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డిని హరీష్ రావు ప్రత్యేకంగా ప్రశంసించారు. అమెరికాలో స్థిరపడి తెలుగు వారికి ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఆయన అందిస్తున్న సహకారం గొప్పగా ఉందని అన్నారు.ఉద్యమకాలం నుంచి, ఆ తర్వాత కూడా తెలంగాణే లక్ష్యంగా చాలా మంది ఎన్ఆర్ఐలు పనిచేశారని హరీష్ రావు గుర్తుచేసుకున్నారు. తమకు అనేక పరిమితులు ఉన్నా లక్మణ్ ఏనుగు లాంటి సోదరులు అనేకమంది తెలంగాణ ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారని, తమ సమయంతో పాటు ఆర్థిక వనరులను కూడా వెచ్చించారని అన్నారు.పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ ముందు నుంచీ తాము పార్టీకి అండగా ఉన్నామని, తెలంగాణ భావజాలవ్యాప్తికి అన్నిరకాలుగా కృషి చేశామని తెలిపారు. ఉద్యమవాదుల్లో కొందరికి అన్యాయం జరిగిందని, మరికొందరిలో అసంతృప్తి గూడు కట్టుకొన్న విషయాన్ని హరీష్ రావుకు దృష్టికి తీసుకువచ్చారు. మరోసారి తెలంగాణవాదుల పునరేకీకరణ జరగాల్సిన అవసరం ఉందని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ కు అండగా నిలవాలని అమెరికా ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు.తెలంగాణ సాధనలో భూమి పుత్రుడైన లక్ష్మణ్ ఏనుగు రాజీలేని పోరాటం చేశారని, పదహారు ఏళ్ల కిందటే ధూమ్ ధామ్ లు నిర్వహించటంతో పాటు, అనేక మంది ప్రముఖ నాయకులు, తెలంగాణ కవులు కళాకారులను అమెరికాకు పరిచయం చేసిన ఘనత లక్ష్మణ్ కు దక్కిందని హరీష్ రావు ప్రశంసించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ఆర్ఐలు డాక్టర్ రాజేందర్ రెడ్డి జిన్నా, శ్రీనివాస్ గూడూరు, సతీష్ కల్వ, సహోధర్ రెడ్డి, రవీందర్ కోడెల, హరిచరణ్ బొబ్బిలి, మల్లిక్ రెడ్డి, రమా వనమా, వాణి ఏనుగు, ఉషా మన్నెం, రంజీత్ క్యాతం, అమర్ లింగాల, సునీల్ మన్నెం, తన్నీరు మహేష్, నరసింహారావు, చందు తళ్ల, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ జక్కిడి, తదితరులు పాల్గొన్నారు.(చదవండి: ఘనంగా TAL ప్రీమియర్ లీగ్ ఆరంభం) -
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్డౌన్ స్టార్ట్
అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు టెక్ నిపుణులు గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఉద్యోగం కోల్పోతే, దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు , సాఫ్ట్వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన కోడింగ్ రాశారు, ఎన్నో టీమ్స్ను నడిపించారు. ఫలితంగా విదేశాల్లో జీవితం ఎంతో సురక్షితమైనదని నమ్మారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఇళ్లు కొనుక్కున్నారు. కుటుంబాలను పెంచుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు, వేలాది మందికి వచ్చిన ఒకే ఒక్క ఈమెయిల్ అంతటినీ మార్చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం పోవడం అనేది ఒక కౌంట్డౌన్ షురూ అయినట్టే.సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు తన వనరులను మళ్లిస్తూ దాదాపు 8వేల ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా పలు విడతల కోతల తర్వాత మరికొన్ని టీమ్స్ సైజ్ తగ్గిస్తోంది. టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో లింక్డ్ఇన్ సైతం ఇటీవలి ఉద్యోగులపై వేటు వేసింది అమెరికాలోని మెజారిటీ భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఇవి నేరుగా వారి యజమానులతో (Employers) ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరోయజమానిని వెతుక్కోవడానికి,సాధారణంగా 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం వృత్తి పరమైన నష్టం మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, ఇంటి లోన్ల చెల్లింపులు, పిల్లల పాఠశాలల అడ్మిషన్లు, ఆరోగ్య రక్షణ, కుటుంబ నిర్ణయాలతో కూడిన రేస్లా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కొందరికి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నారు. మరికొందరు తాము దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో ఇళ్లు కొనుగోలు చేశారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి.ఇక ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ కార్మికులు అమెరికాలో మరికొంత కాలం కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది.60 రోజుల H-1B నిబంధన అంటే ఏమిటి?యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు తమ తదుపరి నిర్ణయాన్ని చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ (లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది) లభిస్తుంది. ఈ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఈ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి పని దినం (Last working day) నుండి ప్రారంభమవుతుంది, అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి.సడన్గా ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి, టెక్ పరిశ్రమలోనే నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయం చాలా వేగంగా గడచిపోతుంది. కొత్త స్పాన్సర్ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్ఫర్ అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు.కెనడా, యూరప్ వైపు మొగ్గుదశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ వృద్ధి, అధిక జీతాలు మరియు ప్రపంచ స్థాయి గుర్తింపునకు చిహ్నంగా ఉండేది. కానీ వరుస లేఆఫ్స్, వీసాపై ఆధారపడటం, ఇమ్మిగ్రేషన్పై వస్తున్న రాజకీయ విమర్శలు , AI ఆధారిత మార్పులు చాలా మంది నిపుణులను తమ భవిష్యత్తు గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఆమోదించిన H-1B పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే ఉన్నాయి. కానీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి. ఇటీవలి ఒక 'బ్లైండ్' (Blind) పోల్ ప్రకారం, అమెరికాలోని భారతీయ నిపుణులలో దాదాపు సగం మంది తాము ఉద్యోగం కోల్పోతే భారతదేశానికి తిరిగి రావడానికి మొగ్గు చూపుతామని తెలిపారు. మరికొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నారు... -
సరైనా సమాధానం కోసం ఎదురుచూస్తున్న: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ పరిస్థితులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని, ఇరాన్ నుంచి తమకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలన్నారు. ఇరాన్తో యుద్ధమా? లేక శాంతి ఒప్పందమా? అనే విషయం తేలడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉందని బాంబు పేల్చారు. ఇరాన్ సరిగా స్పందించని పక్షంలో తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ నుండి దిగిన తర్వాత విలేకరులతో మాట్లాడుతూ..‘ఇరాన్, అమెరికా మధ్య చర్చలు చివరి దశకు చేరుకున్నాయి. మాకు సరైన సమాధానాలు రాకపోతే, పరిస్థితి చాలా వేగంగా చేయిదాటిపోతుంది. ఒకవేళ ఇరాన్ నుంచి సరైన సమాధానం రాకపోతే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇరాన్ నుంచి మాకు 100 శాతం సానుకూల సమాధానాలు కావాలి. ఒకవేళ ఈ చర్చలు సఫలమైతే ఎంతో సమయం, శక్తి, మరికొందరి ప్రాణాలు కాపాడినట్లు అవుతుంది. ప్రస్తుతం చర్చల్లో పాల్గొంటున్న ఇరాన్ ప్రతినిధులు, గతంలో ఉన్నవారి కంటే చాలా వివేకవంతంగా కనిపిస్తున్నారు. ఇరుపక్షాలకు మేలు జరిగేలా వారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. అయితే, దౌత్యపరమైన ఈ చర్చల సమయం చాలా తక్కువగా ఉంది. ఏదైనా కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది’ అని అన్నారు.ఇదే సమయంలో ఇరాన్కు మాత్రం అణ్వాయుధాన్ని సాధించే అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ చర్చల తర్వాత ఒక ఒప్పందమైనా జరుగుతుందా? లేదా తాము కొన్ని కఠినమైన చర్యలైనా తీసుకోవాల్సి ఉంటుందా? అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది చనిపోవడం కంటే, తక్కువ నష్టంతో ఈ సమస్య ముగిసిపోవాలన్నదే తన కోరికని, అయితే తాము ఏ దారిలో వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరికలు జారీ చేశారు.ఒప్పందం కుదరకపోతే భారీ దాడి..అంతకుముందు.. ఇరాన్పై అమెరికా ప్రణాళికాబద్ధ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ట్రంప్ ఇటీవల వెల్లడించారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తితోనే దాడిని వాయిదా వేసినట్లు తెలిపారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో ఇరాన్తో ప్రస్తుతం కీలక చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని గల్ఫ్ దేశాల నాయకులు సూచించారని తెలిపారు. అందుకే ప్రణాళికాబద్ధ దాడిని నిలిపివేశామని పేర్కొన్నారు. అయితే ఒప్పందం కుదరకపోతే ఎప్పుడైనా పూర్తి స్థాయి భారీ దాడికి అమెరికా సైన్యం సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. అలాగే ఇరాన్కు అణ్వాయుధాలు ఉండకూడదు అన్నది అమెరికా ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. -
H1B వీసా దారులకు గట్టి ఎదురుదెబ్బ..
-
42 యుద్ధవిమానాలను కోల్పోయిన అమెరికా
వాషింగ్టన్: యుద్ధంలో ఇరాన్ వాయుసేన ను చావుదెబ్బ తీశామని గొప్పలు చెప్పకునే అమెరికా సైతం రణరంగంలో భారీస్థాయిలో ఆయుధాలు, యుద్దవిమా నాలను కోల్పోయిందని అమెరికా చట్టసభలు వెలువర్చిన ఒక నివేదిక ద్వారా వెల్లడైంది. అమెరికా చట్టసభల లైబ్రెరీలో భాగమైన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్(సీఆర్స్)లోని విదేశాంగ, యుద్ధ, వాణిజ్యవిభాగంలోని విషయనిపుణులు, పరిశోధకులు, న్యాయవాదులు సంయుక్తంగా పారదర్శకంగా ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ప్రకారంఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరిట ఫిబ్రవరి 28న అమెరికా మొదలెట్టిన ఇరాన్ యుద్ధంలో మొత్తంగా 42 యుద్ధవిమా నాలను ట్రంప్ బలగాలు కోల్పోయాయి. ఇందులో ఎఫ్–15ఈ స్ట్రైక్ ఈగల్ యుద్ధవిమానాలు, ఎఫ్–35ఏ లైట్నింగ్–2 యుద్ధవిమానం, ఏ–10 థండర్బోల్ట్–2 భూతలదాడుల యుద్ధ విమానం, కేసీ–135 స్ట్రాటోట్యాంకర్ ఇంధన విమానం, ఈ–3 సెంట్రీ అవాక్స్ నిఘా, పర్యవేక్షణ కమాండ్ విమానం, ఎంసీ–130జే కమాండో–2 ప్రత్యేక ఆపరేషన్ల విమానం, హెచ్హెచ్–60 డబ్ల్యూ జోలీ గ్రీన్2 హెలికాప్టర్, 24 ఎంక్యూ–9 రీపర్ డ్రోన్లు, ఎంక్యూ–4సీ ట్రైటన్ డ్రోన్లు ఉన్నాయి. యుద్ధవిమా నాలు, వాహనాలు, మందుగుండు, సాయుధ ఉపకరణాలు మొత్తంగా కలిపి ఇప్పటిదాకా రూ.2.81 లక్షల కోట్ల విలువైన రక్షణరంగ ఆస్తులను కోల్పోయినట్లు నివేదిక వెల్లడించింది. -
ఇజ్రాయెల్ ప్రధాని పదవికి పోటీ చేస్తా: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్లో తనకు తనకు విశేష ప్రజాదరణ ఉందని, తన అధ్యక్ష పదవీకాలం తర్వాత అక్కడ ప్రధానమంత్రి పదవికి పోటీ చేసే అవకాశముందని వెల్లడించారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై కూడా ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. నెతన్యాహు నేను చెప్పిందే చేస్తారు అంటూ ఆయన వ్యాఖ్యానించారునెతన్యాహు చాలా మంచి వ్యక్తి. నేను ఏం చెబితే ఆయన అది చేస్తారు. ఆయన ఒక యుద్ధ కాలపు ప్రధానమంత్రి. కానీ ఇజ్రాయెల్లో నెతన్యాహుకు సరైన గౌరవం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం ఇజ్రాయెల్లో నాకు మాత్రం 99 శాతం ప్రజాదరణ ఉంది. నేను అక్కడ ప్రధానమంత్రిగా పోటీ చేసినా గెలవగలను" అని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. కాగా ఇరాన్తో ఒప్పందం గురించి విలేకరులు ప్రశ్నించగా.. తనకు ఎలాంటి తొందర లేదని ట్రంప్ స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిపించడమే తమ లక్ష్యమని, ఇరాన్కు మరో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. -
అహ్మదినెజాద్ను అధికారపీఠంపై కూర్చోబెట్టాలని చూశారు
వాషింగ్టన్: వెనుజువెలాలో మదురో దంపతుల అధికారభవనంపైకి మెరుపుదాడిచేసి వాళ్లను బంధించి అధికారపీఠం నుంచికూల దోసిన అమెరికా ప్రభుత్వం అదే తరహాలో ఇరాన్లోనూ అధికార మార్పిడికి యత్నించి విఫలమైందని న్యూయార్క్ టైమ్స్ తాజాగా తన కథనంలో పేర్కొంది. ఈ మేరకు ఒక నివేదికను వెలువర్చింది. 2005 నుంచి2013 ఏడాదిదాకా ఇరాన్కు అధ్యక్షునిగా బాధ్యతలు నెరవేర్చిన మొహ్మూద్ అహ్మదినెజాద్కు తిరిగి అధికారాన్ని అప్పగించాలని అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నించాయని నివేదిక పేర్కొంది. ఫిబ్రవరి 28వ తేదీన యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే ఇరాన్ సుప్రీంనేత అయతొల్లా అలీ ఖమేనీసహా పలువురు కీలక నేతలను వైమానిక దాడులతో అంతమొందించడం తెల్సిందే. వెనువెంటనే అహ్మదినెజాద్ ను గద్దెనెక్కించాలని అమెరికా ప్రయత్నించి నా అందుకు సానుకూలవాతావరణంలేక మిన్నకుండిపోయిందిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అహ్మదినెజాద్ పరిపాలనాధోర ణిని ఏమాత్రం మెచ్చని నాటి ఖమేనీ ఆ తర్వాత ఆయనను గృహనిర్బంధంచేశారు. దీంతో శత్రువుకు శత్రువు మిత్రువు అనే చందంలో ఖమేనీ అంటే మెచ్చని అహ్మది నెజాద్ను అమెరికా, ఇజ్రాయెల్ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ మేరకు ఆయనతో రహస్యంగా సంప్రతింపులు జరిపినట్లు తెలుస్తోంది. గృహనిర్బంధంలో ఉన్న అహ్మదినెజాద్ను విడిపించేందుకే ఫిబ్రవరి 28న ఆయనను బంధించి ఇంటి మీదా అమెరికా దాడులుచేసి ఇంటిని ధ్వంసంచేసింది. అయితే ఈ దాడిలో అహ్మదినెజాద్ గాయపడ్డారని, తర్వాత ఆయన ఎవరికీ కన్పించకుండాపోయారని వార్తలొచ్చాయి. -
ఇరాన్తో యుద్దం.. అమెరికాకు భారీ షాక్!?
ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరి 28న ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ సైనిక చర్యలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఫైటర్ జెట్లు, నిఘా డ్రోన్లతో సహా కనీసం 42 విమానాలు పూర్తిగా ధ్వంసమవ్వడమో లేదా దెబ్బతినడమో జరిగిందని 'కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్' తన తాజా నివేదికలో వెల్లడించింది.అయితే ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇతర భద్రతా కారణాల వల్ల ఈ నష్టం తీవత్ర ఇంకా పెరిగే అవకాశముందని సదరు నివేదిక పేర్కొంది. యూఎస్ సెంట్రల్ కమాండ్, డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలు, అంతర్జాతీయ వార్త కథనాల ఆధారంగా ఈ దెబ్బతిన్న విమానాల జాబితాను సీఆర్ఎస్ సిద్దం చేసింది.ఇరాన్తో యుద్దంగా కారణంగా ద్వంసమైన వాటిలో 4 ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు, అత్యాధునిక ఎఫ్-35ఏ లైట్నింగ్ II యుద్ధ విమానం, ఏ-10 థండర్బోల్ట్ గ్రౌండ్-అటాక్ విమానం ఉంది. వీటితోపాటు ఆకాశంలోనే ఇంధనాన్ని నింపే ఏడు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్విమానాలు, ఒక ఈ-3 సెంటినరీ అవాక్స్ నిఘా విమానం, రెండు ఎమ్సి-130జే కమాండో II, ప్రత్యేక కార్యాచరణ విమానాలు, ఒక హెచ్హెచ్-60డబ్ల్యూ జాలీ గ్రీన్ II హెలికాప్టర్ ఉన్నాయి.అదేవిధంగా శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎమ్క్యూ-9 రీపర్ డ్రోన్లు మొత్తం 24 దెబ్బతిన్నాయి. వీటితో పాటు ఒక ఎమ్క్యూ-4సీ ట్రైటాన్ నిఘా డ్రోన్ కూడా ద్వంసమైంది.ఈ నివేదికపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. అత్యంత అధునాతనమైన ఎఫ్-35 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన ఘనత తమ సైన్యానిదేనని సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. కాగా ఇరాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల అంచనా వ్యయం ప్రస్తుతం 29 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 2,42,000 కోట్లు) పెరిగినట్లు పెంటగాన్ కంప్ట్రోలర్ జూల్స్ డబ్ల్యూ హర్స్ట్ III ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


