ఎస్టీపీపీలో కార్మికుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఎస్టీపీపీలో కార్మికుల ఆందోళన

Published Sun, Sep 22 2024 1:54 AM | Last Updated on Sun, Sep 22 2024 1:54 AM

ఎస్టీపీపీలో కార్మికుల ఆందోళన

జైపూర్‌: జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంటు(ఎస్టీపీపీ) క్యాంటీన్‌లో నాణ్యతలేని, పురుగులు, కుళ్లిపోయిన ఆహారాన్ని అందిస్తూ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, క్యాంటీన్‌ను తొలగించాలని శనివారం కార్మికులు ఆందోళన చేపట్టారు. ఉద యం ఇడ్లిలో పురుగులు, కుళ్లిపోయిన ఆలుగడ్డలు నిల్వ చేయడంతో ఐఎన్టీయూసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి నిర్వహణ బాధ్యత చేపడుతున్న పవర్‌మేక్‌ కంపెనీ ఉద్యోగికి క్యాంటీన్‌ అప్పగించడంతో నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులను తొలగించి సబ్సిడీతో కార్మికులకు నా ణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. పవర్‌మేక్‌, సింగరేణి అధికారులు మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు గడ్డం రాకేశ్‌గౌడ్‌, పేరం రాకేశ్‌, నారాయణ, తిరుపతిరెడ్డి, రమేశ్‌, కృష్ణ, లింగయ్య, లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌, శ్రావణ్‌, రాజిరెడ్డి, శివ, తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement