-
'అత్తమ్మాస్ కిచెన్'పై విమర్శలు.. వివరణ ఇచ్చిన టీమ్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇటీవల వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 'అత్తమ్మాస్ కిచెన్' పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా 'అత్తమ్మాస్ కిచెన్'తో నిర్వచించారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్ను ప్రారంభించారు ఉపాసన. అప్పటికప్పుడు తయారుచేసుకునేలా నాణ్యమైన డ్రై హోమ్ ఫుడ్స్ని అందించే లక్ష్యంతో దీనిని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా 'అత్తమ్మాస్ కిచెన్' కోసం సురేఖ తాజాగా మామిడికాయ పచ్చళ్లు పెట్టారు. అవి ఆన్లైన్లో భారీగా విక్రయాలు కొనసాగుతున్నాయి.తాజాగా 'అత్తమ్మాస్ కిచెన్' పేజీ నుంచి ఒక ఫోటోను విడుదల చేశారు. అందులో తన అత్తగారు అయిన పద్మతో కలిసి లావణ్య త్రిపాఠి కనిపించారు. కొత్త ఆవకాయ్ పచ్చడిని తయారు చేస్తూ ఫోటోలు దిగారు. అయితే, ఆ ఫోటోలపై కొందరు కామెంట్లు చేశారు. 'అత్తమ్మాస్ కిచెన్' ప్రొడక్ట్ విషయంలో సరైన నాణ్యత విలువలు పాటించడం లేదంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తెలిపారు. ఆవకాయ్ కలిపే సమయంలో చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు.. ఆపై వారి జుట్టుని కూడా అలా వదిలేశారు. అందులో హెయిర్ పడితే పరిస్థితి ఏంటి..? ఏ మాత్రం హైజీన్ పాటించడం లేదంటూ విమర్శలు చేశారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ పేజీ నుంచి నెటిజన్లకు తిరిగి సమాధానం వచ్చింది. వాస్తవంగా కస్టమర్స్ కోసం చేసేటప్పుడు చాలా హైజీన్ పాటిస్తామని తెలిపారు. లావణ్య, పద్మ గారు తమ ఇంటి కోసం చేస్తున్న ఆవకాయ్ కాబట్టి అలా కనిపించారని తెలిపారు. అత్తమ్మాస్ కిచెన్ నుంచి వచ్చే ప్రొడక్ట్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటామని, అవి చాలా హైజిన్గా మెయింటైన్ చేస్తామని ఆ విషయంలో ఎలాంటి సందేహాలు వద్దని వారు చెప్పారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) -
డిప్రెషన్లో ఉపాసన, అత్తారింటికి వెళ్లిన రామ్చరణ్ (ఫోటోలు)
-
Ram Charan Photos: గౌరవ డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్ (ఫొటోలు)
-
గుండుతో క్లీంకార.. ఏనుగుతో చిల్ అవుతోన్న గ్లోబల్ స్టార్!
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రంలో కియారా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవల వైజాగ్లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా విరామం దొరకడంతో ఫుల్గా చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్కు వెళ్లారు. ఈ సమ్మర్ వేకేషన్లో తన ముద్దుల కూతురు క్లీంకారతో ఎంజాయ్ చేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన కలిసి గున్న ఏనుగుకు స్నానం చేయిస్తూ కనిపించారు. అంతే కాకుండా వారితో క్లీంకార కూడా ఫోటోలో కనిపించింది. అయితే ఇందులో క్లీంకార గుండు చేయించుకుని కనిపించింది. 'థ్యాంక్యూ నాన్న.. ఇది ఒక అద్భుతమైన అనుభవం.. ఏనుగుల సంరక్షణ క్యాంప్లో చాలా నేర్చుకున్నా' అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్గా మారింది. Thank you, Mr. C/Naana, for an incredible experience. Learned so much at the elephant rescue camp. ❤️🐘#bestdad @AlwaysRamCharan pic.twitter.com/eBt6JpdCX7 — Upasana Konidela (@upasanakonidela) April 7, 2024 -
రామ్చరణ్ బర్త్డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
తిరుమలలో రామ్ చరణ్ కూతురు 'క్లీంకార' ఫేస్ రివీల్
తిరుమల శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్ , ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా తన కుటుంబంతో పాటు తిరుమల చేరుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ క్రమంలో వారు ముద్దల కూతురు ఫోటో రివీల్ అయింది. శ్రీనివాసుని సన్నిధి నుంచి వారు వస్తుండగా అక్కడ ఉన్న కొందరు మీడియా వారు క్లీంకార ఫోటోను తీయడం జరిగింది. అది కాస్త అభిమానులకు చేరువ కావడంతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. గతేడాది జూన్ 20న జన్మించిన క్లీంకార ఫేస్ను ఇప్పటి వరకు ఎక్కడా కూడా రివీల్ కాకుండా వారు జాగ్రత్తపడ్డారు. కానీ నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో కొందరు ఫోటోలు తీశారు. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by TIRUMALA DEVASTANAM OFFICIAL (@anandanilayam_) -
ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా రామ్ చరణ్.. అవమానం పడ్డ చోటే జెండా పాతాడు
మెగాస్టార్ వారసుడు నేడు గ్లోబల్ స్టార్ అయ్యాడు. సుమారు 17 ఏళ్ల క్రితం 'చిరుత'గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'గా మారాడు. తన నటనతో 'రంగస్థలం'పై 'రచ్చ' చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 'తుఫాన్' క్రియేట్ చేశాడు. అభిమానుల గుండెల్లో 'గోవిందుడు అందరివాడు' అయ్యాడు. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ 'వినయ విధేయ రాముడు' అని అందరితో పిలిపించుకున్నాడు. 'ఎవడు' అయినా సరే తన దారికి అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానంటూ 'ఆర్ఆర్ఆర్'తో గాండ్రించాడు. అలాంటి వాడు ఎవడో తెలుసా..? పాన్ ఇండియా 'మగధీరుడు' రామ్ చరణ్. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. 1985 మార్చి 27న జన్మించిన చరణ్ నేడు గ్లోబల్ స్టార్గా ఎదిగారు. మెగా కుటుంబం నుంచి ఎందరో హీరోలుగా వచ్చారు. కానీ చరణ్ చాలా ప్రత్యేకం. ఎక్కడ నెగ్గాలో.. ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వ్యక్తిత్వం కలిగిన హీరో. ఉపాసనతో పెళ్లికి ముందు రామ్ చరణ్ వేరు. పెళ్లి తరువాత రామ్ చరణ్ వేరు. టాలీవుడ్లో వేలు ఎత్తి చూపించుకోని విధమైన ప్రవర్తనను రోజు రోజుకు పెంచుకుంటూ వెళ్తున్న హీరో ఎవరైనా వున్నారా అంటే అది రామ్ చరణ్ నే. మెగాస్టార్ తర్వాత చరణ్ పేరు తప్పక ఉంటుంది మెగాస్టార్ చిరు తర్వాత డ్యాన్స్ బాగా చేసే టాలీవుడ్ హీరోలు ఎవరు..? అని ఎవరినైనా అడిగితే వారు చెప్పే జాబితాలో చరణ్ గ్యారెంటీగా ఉంటుంది. చిన్నప్పుడు డ్యాన్స్కు దూరంగా ఉండే చరణ్ ఇప్పుడు తన టాలెంట్తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. చెర్రీ నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నాడు. అయితే, తన తండ్రి చిరంజీవి మంచి డ్యాన్సర్ కాబట్టి కుమారుడు 'అదుర్స్ అనిపించేలా చేస్తే బాగుణ్ను' అని అనుకునేవారు. చరణ్ డ్యాన్స్ చేస్తాడా, లేదా? అని అభిమానులు కూడా టెన్షన్ పడేవారు. తండ్రి తన నుంచి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన చెర్రీ ఎవరి ట్రైనింగ్ అవసరంలేకుండా తనంతట తానే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన డ్యాన్స్కు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. 'చిరుత' అలా సెట్ అయింది కానీ.. చరణ్ను తన వారసుడిగా దింపే సమయం చిరంజీవికి వచ్చింది. అందుకోసం అల్లుఅరవింద్తో చర్చలు జరిపారు. ఒక స్టార్ డైరెక్టర్ ద్వారా చరణ్ను ఇండిస్ట్రీకి పరిచయం చేయాలని ఆలోచించారు. దాంతో అప్పటికే స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న రాజమౌళిని సంప్రదిస్తే.. చరణ్ నటనపై నాకు అవగాహన లేదని, మొదటి సినిమాను ఒక మంచి దర్శకుడితో తెరకెక్కించమని ఆయన సలహా ఇచ్చాడు. కానీ రెండవ సినిమా ఖచ్చితంగా నేనే చేస్తాను అని రాజమౌళి చెప్పారట. దాంతో చిరంజీవి దర్శకుడు పూరీ జగన్నాథ్ని పిలిపించి అసలు విషయం చెప్పడం. ఆపై వెంటనే పూరీ రెండు మూడు కథలను వినిపించగా చివరికి చిరుత స్టోరి ఓకే అయ్యింది. భారీ అంచనాల మధ్య 'చిరుత' 2007 సెప్టెంబర్ 28న విడుదలైంది. మొదటి రోజే దాదాపు ఈ సినిమా రూ.5 కోట్ల షేర్ను సాధించి ఇండస్ట్రీలో రికార్డు క్రియేట్ చేసింది. సౌత్లో ఒక డెబ్యూ హీరోకు ఆ రేంజ్ కలెక్షన్లు రావడం టాలీవుడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సినిమాతో తన నటనకుగాను చెర్రీ 'స్పెషల్ జ్యూరీ' విభాగంలో 'నంది' అందుకున్నాడు. కానీ కొందరు కావాలనే ఈ సినిమాలో చరణ్ లుక్స్పై విమర్శలు భారీగానే చేశారు. చరణ్కు నటన రాదని, హీరో ఫేస్ కాదని పలువురు క్రిటిక్స్ విమర్శించారు. కేవలం ఈ సినిమా పూరీ టేకింగ్, చిరంజీవి మేనియాతోనే హిట్టయిందని పలువురు అభిప్రాయపడ్డారు. అప్పుడు ఏమాత్రం చరణ్ కుంగిపోలేదు.. విమర్ళలను తీసుకున్నాడు. తనను తాను మార్చుకున్నాడు. 'మగధీర'తో సమాధానం ఇచ్చాడు ఫస్ట్ మూవీ ఓకే.. మరి నెక్ట్స్ ఏంటి? అంటూ చెర్రీ భవిష్యత్తుపై ఇంకొందరు లెక్కలు వేస్తుంటే.. 'మగధీర'తో సమాధామిచ్చాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆ సినిమా సుమారు రూ.150 కోట్లు వసూళ్లు (గ్రాస్) చేసి, టాలీవుడ్లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. రెండో చిత్రంతోనే అగ్ర కథానాయకుల జాబితాలో చేరిన చరణ్ మూడో ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. అదే ‘ఆరెంజ్’. 'ధృవ'తో రూట్ మార్చుకున్నాడు రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడేలే, బ్రూస్లీ.. ఇలా మళ్లీ కమర్షియల్ ధోరణిలో సాగుతున్న అతను ‘ధృవ’తో రూటు మార్చాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధృవ’ చరణ్ మార్కెట్ను అమాంతం పెంచింది. ఆ తర్వాత వచ్చిన ‘రంగస్థలం’ ఆయన ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది. 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీలో చరణ్ నటనకు విమర్శకుల సైతం ఫిదా అయ్యారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 130కోట్ల షేర్ కలెక్షన్లను సాధించి నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. చరణ్ తన నటన, అభినయంతో ప్రేక్షకులను థియేటర్లకు మళ్ళీ మళ్ళీ రప్పించాడు. దాని తర్వాత వినయ విధేయ రామ, ఆచార్యతో ఫెయిల్యూర్ ఎదుర్కొన్నాడు చరణ్. అవమానం జరిగిన చోటే జండా పాతాడు బాలీవుడ్లో చరణ్ డెబ్యూగా ‘జాంజీర్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. తెలుగులో తుఫాన్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘొర పరాజయాన్ని చవిచూసింది. అంతే కాకుండా బాలీవుడ్ క్రిటిక్స్ చరణ్ను తీవ్రంగా విమర్శించారు. బిగ్ బీ అమితాబ్ నటించిన జాంజీర్ పేరును చెడగొట్టాడని, చరణ్ది వుడెన్ ఫేస్ అని విమర్శించారు. అలా ఎన్నో విమర్శలు ఎదర్కొని నిలబడ్డాడు. ఎళ్లు గడిచాయి.. సరైన సమయం కోసం ఎదురు చూశాడు. పక్కా ప్లాన్తో బాలీవుడ్కు తన రేంజ్ ఎంటో ఆర్ఆర్ఆర్తో చూపించాడు. బాలీవుడ్ ఏంటీ..? ఏకంగా గ్లోబల్ స్టార్గా ఎదిగాడు.. టాలీవుడ్ కీర్తిని ప్రపంచానికి చాటేలా చేశాడు. చెర్రీ.. ఎన్టీఆర్తో కలిసి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ బాక్సాఫీసు వద్ద రూ. 1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, పలు అంతర్జాతీయ అవార్డులు దక్కించుకుని టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాల ఫలితం ఎలా ఉన్నా నటన, డ్యాన్స్ విషయంలో చరణ్ అభిమానుల్ని ఎక్కడా నిరుత్సాహపరచలేదని చెప్పొచ్చు. ఇలాంటి స్పీడ్ డ్యాన్సర్కు మరో స్పీడ్ డ్యాన్సర్ (ఎన్టీఆర్) తోడైతే ఎలా ఉంటుందో ‘నాటు నాటు’తో ప్రపంచానికి చూపించారు. వారిద్దరి స్టెప్పులకు ‘ఆస్కార్’ అవార్డు వరించింది. ఇందులో రామ్ చరణ్ ఎంట్రీ సీన్కు బాలీవుడ్ ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ వచ్చాయి. ఎన్టీఆర్ను చరణ్ కొరడా దెబ్బలు కొట్టే సన్నివేశంలో ఆయన పలికించిన భావాలకు అక్కడి క్రిటిక్స్ కూడా ఫిదా అయ్యారు. అలా అవమానం జరిగిన చోటే తన సత్తా ఎంటో రుచి చూపించాడు. -
శ్రీవారి సేవలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు..
-
పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకున్న రామ్ చరణ్ దంపతులు (ఫొటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్ చరణ్ దంపతులు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నేడు (మార్చి 27) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల వెళ్లారు. పుట్టినరోజు నాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఉపాసనతో పాటుగా చరణ్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో వెంకన్న సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. వారితోపాటు తన కూతురు క్లిన్ కారను కూడా శ్రీనివాసుడి సన్నిధికి తీసుకుకొచ్చారు. దీంతో ఆలయం వద్ద రామ్చరణ్ను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ క్రమంలో ఆయనకు అభిమానులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
తిరుమల చేరుకున్న రామ్ చరణ్ దంపతులు.. పోటోలు వైరల్!
-
Klin Kaara Beach Photos: క్లీంకారకు బీచ్ని పరిచయం చేసిన రామ్చరణ్.. ఫొటోలు వైరల్
-
'అమ్మా, నాన్నతో తొలిసారి అలా'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రస్తుతం వైజాగ్లో జరుగుతోంది. ఈ చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ భామ కియారా అద్వానీ చెర్రీ సరసన కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన రామ్ చరణ్ లుక్ నెట్టింట తెగ వైరలైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. చెర్రీ డిఫరెంట్ చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అయితే షూటింగ్కు కాస్తా విరామం లభించండంతో గ్లోబల్ స్టార్ ఫ్యామిలీతో కలిసి చిల్ అయ్యారు. వైజాగ్ సముద్ర తీరాన తన ముద్దుల కూతురు, భార్య ఉపాసనతో కలిసి ఎంజాయ్ చేశారు. క్లీంకారతో ఎత్తుకుని బీచ్లో ఆడుకుంటున్న దృశ్యాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. ఈ వీడియోను ఉపాసన తన ఇన్స్టాలో షేర్ చేసింది. వైజాగ్ మా హృదయాలను దోచేసింది.. క్లీంకారతో ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇదే వీడియోలో మెగా అభిమానులు రామ్ చరణ్ను గజమాలతో సత్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
ఆమెను కలవడం ఆనందంగా ఉంది: ఉపాసన పోస్ట్ వైరల్
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లోనే ఉంటోంది. ఇటీవలే అయోధ్యకు వెళ్లిన ఉపాసన కుటుంబం సభ్యులతో కలిసి బాలరామున్ని దర్శించుకున్నారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఓ ఈవెంట్కు ఉపాసన హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆమె కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన ఇన్స్టాలో రాస్తూ.. ' ఈరోజు అంతర్గత ప్రపంచశాంతి కోసం హార్ట్పుల్నెస్ గ్లోబల్ మహోత్సవ్ పాల్గొనడం గౌరవంగా ఉంది. ముఖ్యంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లీంకారతో సహా కలవడం ఆనందంగా ఉంది. ముఖ్యంగా కమలేశ్ దాజీ నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. నేను నా బిడ్డను అన్ని సానుకూలతలను స్వీకరించడానికి ఇక్కడికి తీసుకొచ్చాను.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. హార్ట్పుల్నెస్ గ్లోబల్ మహోత్సవ్ కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలోని నందిగామలో జరిగింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
'ఒక కల నెరవేరిన వేళ'.. ఉపాసన పోస్ట్ వైరల్!
మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇటీవలే అయోధ్య బలరామున్ని దర్శించుకున్నారు. తన తాతయ్య, నానమ్మతో పాటు ఆమె కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఆలయం ప్రారంభించాక ఉపాసన తొలిసారి అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!) తాజాగా తన అయోధ్య పర్యటనకు సంబంధించిన వీడియోను ఇన్స్టాలో పంచుకుంది. తన కోరిక తీరిందని.. ఒక కల నెరవేరిందని.. ఇదొక అద్భుతమైన.. దివ్యమైన అనుభూతి అని తెలిపింది. నా జీవితంలో మరిచిపోలేని ప్రయాణంలో ఇది ఒకటిగా నిలిచిపోతుందని రాసుకొచ్చింది. తెల్లవారుజూమున 4 గంటలకు స్వామివారిని దర్శించుకున్నామని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
-
యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ!
మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
అయోధ్యలో మెగా కోడలు.. బాలరామునికి ప్రత్యేక పూజలు!
మెగా కోడలు, రామ్చరణ్ సతీమణి ఉపాసన అయోధ్య బలరాముడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఉపాసన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య రామునికి పూజలు చేశారు. ఆలయంలో దాదాపు 48 రోజుల పాటు నిర్వహించిన రామరాగ్ సేవ ముగింపు వేడుకలకు హాజరయ్యారు. ఈ వేడుకలకు తన తాతయ్య, నానమ్మతో సహా కలిసి పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
మెగా డాటర్కు స్పెషల్ విషెస్.. లావణ్య త్రిపాఠి, ఉపాసన పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్లో కాస్ట్యూమ్స్ డిజైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్గా పేరు గడించింది. తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్స్టా స్టోరీస్లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. -
'రామ్ చరణ్ గారు.. ఈ రోజు ఏం చేస్తున్నారు'.. ఉపాసన వీడియో వైరల్!
మెగాస్టార్ తనయుడు, మెగా హీరో రామ్ చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు చేస్తున్న వీడియోను ఉపాసన పోస్ట్ చేసింది. ఉమెన్స్ డే స్పెషల్ అంటూ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఇది చూసిన అభిమానులు ఏంటి? మన చరణ్ అన్నయ్య ఇలా మారిపోయాడంటూ కామెంట్స్ పెడుతున్నారు. వీడియోలో ఉపాసన మాట్లాడుతూ..' అత్తమ్మగారు.. ఈ రోజు మీ కిచెన్లో ఏం చేస్తున్నారు? రామ్ చరణ్ గారు మీరు ఏం వంటలు చేస్తున్నారు' అంటూ ఫన్నీగా ప్రశ్నలు అడిగింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్ప్రెన్యూరర్గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్ప్రెన్యూరర్గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్ప్రెన్యూర్గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్రెడ్డి -
కెరీరే కావాలి.. ప్రెగ్నెన్సీ వద్దనుకుంటే ఈ పని చేయండి: ఉపాసన
రామ్చరణ్ నీడలో ఉండటం సంతోషంగా ఉందంటోంది ఉపాసన. తన భార్య మంచి ఇల్లాలని, తను చేసే గొప్ప పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయంటున్నాడు రామ్చరణ్. మార్చి 8న ఉమెన్స్ డే. ఈ సందర్భంగా చరణ్ దంపతులు ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ముందుగా ఉపాసన మాట్లాడుతూ.. 'మా ఇద్దరివీ వేర్వేరు నేపథ్యాలు కావడంతో పెళ్లవగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లనిపించింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. తనకు నీడగా ఉండటాన్ని గర్వంగా భావిస్తున్నాను. పరస్పరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఆత్మవిశ్వాసంతో పెంచారు మా తాతయ్య స్త్రీ మూర్తులను ఎక్కువగా పూజించేవారు. మా అమ్మవాళ్లను ఎంతో ఆత్మవిశ్వాసంతో పెంచారు. మా కుటుంబంలోని మహిళలు నా జీవితంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఇది స్త్రీ లోకం అని భావించే ఇంట్లో నేను పుట్టిపెరిగాను అని చెప్పుకొచ్చింది. రామ్చరణ్ మాట్లాడుతూ.. ఉపాసన కేవలం నా భార్య కావడం వల్లే గుర్తింపు రాలేదు. తను చేసే మంచి పనులే తనను ఈ స్థానంలో నిలబెట్టాయి. పలు రంగాల్లో తనకు ప్రావీణ్యం ఉంది. ఇంట్లో కుటుంబంతో ఉన్నా లేదా ఏదైనా ప్రాజెక్టుల ద్వారా పలువురికి సేవ చేయాలన్నా ఎంతో నిబద్ధతగా వ్యవహరిస్తుంది. వారసత్వాన్ని ఎంతో అందంగా ముందుకు తీసుకెళ్తుంది అని పేర్కొన్నాడు. ఆలోచనల్లో మార్పు రావాలి పిల్లలు పుట్టగానే చాలామంది ఉద్యోగాలు మానేస్తుంటారు? ఎందుకిలా అన్న ప్రశ్నకు ఉపాసన మాట్లాడుతూ.. ఒకసారి తల్లయ్యాక మునుపటిలా పని చేయడం కత్తిమీద సాములాగే ఉంది. ఎంత ప్రయత్నించినా పని చేయడం కష్టమవుతోంది.. చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ముందు ఈ ఆలోచనా ధోరణి మారాలి. అలాగే కంపెనీల్లో కూడా మహిళలకు అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పుచేర్పులు చేయాలి. మెటర్నటీ లీవ్స్.. మహిళలు వారి అవసరాలకు తగ్గట్లు తీసుకునేలా అవకాశం కల్పించాలి. దీని గురించి ఇప్పటికే నేను కొన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాను. పిల్లలు తర్వాత అనుకునేవారు.. ముఖ్యమైన విషయం ఏంటంటే? ఆడవాళ్లు వారి ఎగ్స్ను కాపాడుకోవాలి. వాటిని ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. జీవితంలో సెటిలవ్వాలి, తర్వాతే పిల్లల కోసం ప్రయత్నిద్దాం అనుకునేవారు వారి ఎగ్స్(అండాలు) దాచుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇప్పుడు పిల్లల్ని కనొచ్చు అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ మీకు ఉపయోగపడతాయి. ఈ విధానం మహిళలకే కాదు దేశ పురోగతికి సైతం సాయపడుతుంది. నేను కూడా నా ఎగ్స్ దాచుకున్నాను. కరెక్ట్ సమయమిదే అనిపించినప్పుడే క్లీంకారను కన్నాం' అని తెలిపింది. చదవండి: ప్రీవెడ్డింగ్.. ఖాన్స్ త్రయంతో పాటు రామ్చరణ్కు భారీగానే ముట్టిందా? -
మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్ సతీమణి ఉపాసన
రాయదుర్గం(హైదరాబాద్): మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర కీలకమని హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. నాలెడ్జి సిటీలోని టి–హబ్లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి..ఆమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. ప్రధానంగా నేడు ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఎలికో లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ వనితా దాట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో టి–హబ్ సీఈఓ ఎంశ్రీనివాసరావు, హెచ్ఎస్బీసీ ఎండీ మమతా మాదిరెడ్డి, పూర్వవిద్యార్థుల సంఘం కో¸ûండర్ ఆదితి ఆర్య కోటక్, శిల్పారెడ్డి ప్రసంగించారు. -
ఉపాసన కాళ్లు నొక్కిన రామ్చరణ్.. వీడియో వైరల్
ప్రముఖ బిజినెస్మెన్ ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి ఇంకా నాలుగు నెలల సమయముంది. కానీ అప్పుడే పెళ్లి వేడుకలు మొదలుపెట్టేశారు. ఏదో ఆషామాషీగా కాకుండా దేశవిదేశాల నుంచి ప్రముఖులకు ఆహ్వానం పంపించారు. ఆల్రెడీ మొదలైన ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాలకు మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్, పాప్ సింగర్ రిహాన్నా సహా అనేకమంది అంతర్జాతీయ సెలబ్రిటీలు హాజరయ్యారు. కునుకు తీసిన భార్య.. బాలీవుడ్ తారలు సైతం గుజరాత్లోని జామ్నగర్లోనే తిష్ట వేశారు. ఈ ప్రీవెడ్డింగ్ కార్యక్రమాల కోసం టాలీవుడ్ నుంచి రామ్చరణ్ దంపతులకు ఆహ్వానం అందింది. దీంతో శుక్రవారం ప్రత్యేక విమానంలో వీరు జామ్నగర్కు వెళ్లారు. విమానంలో ఉపాసన కునుకు తీస్తుండగా చరణ్ ఆమె కాళ్లు నొక్కుతూ కనిపించాడు. అక్కడే ఉన్నవాళ్లు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా క్షణాల్లో అది వైరల్గా మారింది. అవార్డు ఇచ్చేయాల్సిందే! ఇది చూసిన జనాలు ఇంక ఆలస్యం చేయొద్దు, చరణ్కు బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయండి అని కామెంట్లు చేస్తున్నారు. భార్యకు సేవ చేయడం చరణ్కు కొత్తేమీ కాదు. ఇంటి పనుల్లో సాయం చేయడం దగ్గరి నుంచి షాపింగ్కు వెళ్తే బ్యాగులు మోయడం వరకు అన్నీ చేస్తుంటాడు. ఇద్దరూ సమానమే అన్న విషయాన్ని తు.చ తప్పకుండా పాటిస్తాడు. ఎంత పెద్ద హీరో అయినా కించిత్తు గర్వం లేకుండా భార్యకు సేవ చేస్తున్న చరణ్ను పురుషులంతా ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు మహిళామణులు. 🥹❤️@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/dmGBnk7V5Q — Raees (@RaeesHere_) March 1, 2024 చదవండి: ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement