-
జాన్వీ కపూర్ వీడియోపై కామెంట్.. ఇచ్చిపడేసిన హీరోయిన్!
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో రాజ్కుమార్ రావుకు జంటగా నటించింది. ఈ సినిమాలో మహిమ పాత్రలో మెరిసింది. అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్కు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసిన సంగతి తెలిసిందే. అందులో తన భూజానికి గాయమైనట్లు కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ నటనపై తన అంకితభావాన్ని కొనియాడారు.అయితే ఈ వీడియో చూసిన ఓ నెటిజన్ జాన్వీ కపూర్ను ట్రోల్ చేశాడు. టెన్నిస్బాల్తో ఆడిన క్రికెట్లో కూడా మీకు గాయమైందా? అంటూ నవ్వుతున్న ఎమోజీలను పెట్టారు. అయితే ఇది చూసిన జాన్వీ కపూర్ సైతం అతనికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. తనకు సీజన్ బాల్తో ఆడుతుండగానే గాయమైందని.. అందుకే టెన్నిస్ బాల్తో ఆడాల్సి వచ్చింది. నా భుజాలకు ఉన్న బ్యాండేజ్లను చూస్తే ఆ విషయం మీకు అర్థమవుతుందంటూ రాసుకొచ్చింది. ఇలాంటి వాటిపై కామెంట్ చేసే ముందు ఒకసారి వీడియో మొత్తం చూడండి.. అప్పుడు మీ జోక్స్కు నేను కూడా నవ్వుతా అంటూ కౌంటర్ ఇచ్చిపడేసింది. దీంతో దెబ్బకు సారీ జాన్వీ మేడమ్.. అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా.. 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' చిత్రాన్ని కరణ్ శర్మ డైరెక్షన్లో తెరకెక్కించారు. అభిమానుల అంచనాల మధ్య మే 31 థియేటర్లలో విడుదలైంది. కాగా.. జాన్వీ కపూర్ టాలీవుడ్లో దేవర చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
భువనేశ్వర్: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం, బీజేపీ ఫైర్ బ్రాండ్ హిమంత బిశ్వశర్మ ఎక్స్(ట్విటర్)లో సంచలన పోస్టు పెట్టారు. సీఎం నవీన్ చేతుల కదలికలను కూడా ఆయన అనుయాయుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పాండియన్ నియంత్రిస్తున్నారని హిమంత ఆరోపించారు. దీన్ని బట్టి పాండియన్ చేతిలో నవీన్ ఎంతగా బంధీగా మారారో తెలుస్తోందన్నారు. ప్రజలతో నవీన్ స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్నారు. కాగా, తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా నవీన్ పట్నాయక్ ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతుండగా ఆయన చేతులు వణికాయి. ఇంతలో నవీన్కు మైక్ పట్టుకున్న పాండియన్ వెంటనే నవీన్ పట్నాయక్ వణుకుతున్న చేయి కనిపించకుండా పక్కకు పెట్టిన వీడియోను హిమంత తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒడిషాలో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. This is a deeply distressing video. Shri VK Pandian ji is even controlling the hand movements of Shri Naveen Babu. I shudder to imagine the level of control a retired ex bureaucrat from Tamil Nadu is currently exercising over the future of Odisha! BJP is determined is give back… pic.twitter.com/6PEAt7F9iM— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 28, 2024 -
ఆప్ మంత్రి డర్టీ పిక్చర్
చంఢీగడ్: పంజాబ్ ఆప్ మంత్రి బాల్కర్ సింగ్కు సంబంధించిన ఓ అభ్యంతర వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆయనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిస్తానని చెప్పి ఓ మహిళతో మంత్రి బాల్కర్ సింగ్ అసభ్యంగా ప్రవర్తించారని బీజేపీ ఆరోపణలు చేసింది. అయితే దీనిపై మంత్రి స్పందించారు. ఆ వీడియో గురించి తనుకు తెలియదని, అది తనది కాదని స్పష్టం చేశారు. బాల్కర్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కేబినెట్లో స్థానిక ప్రభుత్వం, అసెంబ్లీ వ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్నారు.ఉదోగ్యం కోసం తన వద్దకు వచ్చిన ఓ మహిళ పట్ల మంత్రి అసభ్యంగా ప్రవర్తించిన వీడియోను సోమవారం బీజేపీ నేతలు సోషల్మీడియాలో షేర్ చేయటంతో వైరల్గా మారింది. వీడియో కాల్లో సదరు మహిళను దుస్తులు తొలగించాలని మంత్రి బలవంతం చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.బీజేపీ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ వ్యవహారంపై పూర్తి దర్యాప్తు చేపట్టి.. మూడు రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఓ నివేదిక ఇవ్వాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా రాజకీయంగా దుమారం రేపటంతో మంత్రి బాల్కర్ సింగ్ స్పందించారు. ‘‘ఆ వీడియో ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. నాకు ఆ వీడియో గురించి తెలియదు. నేను ఏం వ్యాఖ్యలు చేయలేను’’ అని తెలిపారు.21 ఏళ్ల మహిళకు వీడియో కాల్ చేసి.. అభ్యంరంగా ప్రవర్తించిన మంత్రి బాల్కర్ సింగ్ వెంటనే పదవి నుంచి తొలగించాలని బీజేపీ నేత తాజిందర్ బగ్గా సీఎం అరవింద్ కేజ్రీవాల్ను డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఎంపీ స్వాతి మలివాల్పై దాడిని ఉదహరిస్తూ ఆప్ (AAP)అంటే ఒక స్త్రీ ద్వేషి పార్టీ అని మండిపడ్డారు. -
హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో.. వీడియో వైరల్
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో బోస్టన్ డైనమిక్స్ తన నెక్స్ట్ జనరేషన్ 'హ్యూమనాయిడ్ అట్లాస్ రోబో'ను ఆవిష్కరించింది. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్.. అంతే కాకుండా ఇది మునుపటి మోడల్స్ కంటే కూడా ఎన్నో అప్డేట్స్ పొందింది. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.వీడియోలో గమనించినట్లయితే.. అట్లాస్ రోబోట్ పైకి లేయడం, ముందుకు వెనుకకు కదలటం కూడా చూడవచ్చు. ఇది ఇప్పటికి తయారైన దాదాపు అన్ని రోబోట్స్ కంటే భిన్నంగా ఉంది. మొండెం మీద ఒక ప్లేట్ ఉంది. సన్నగా ఉండే మొండెం భాగం.. తలపై రింగ్ లైట్ వంటివి ఉన్నాయి.ఈ అట్లాస్ రోబోట్ తన శరీరాన్ని సైన్స్ ఫిక్షన్ హారర్ మూవీలోని ఓ జీవి మాదిరిగా నడుమును 180 డిగ్రీలు మెలితిప్పి పైకి లేస్తుంది. తలను కూడా పూర్తిగా తిప్పుతుంది. చురుగ్గా ముందుకు వెళ్లడం, వెనక్కు రావడం కూడా వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ రోబోట్ టెస్టింగ్ దశలోనే ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా సిద్దమవుతుంది.ఈ హ్యుమానాయిడ్ అట్లాస్ రోబోట్ పూర్తిగా తయారైన తరువాత వివిధ పనుల్లో ఉపయోగించనున్నట్లు సమాచారం. అయితే ఇలాంటి రోబోట్స్ కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కాబట్టి కొంతమంది కస్టమర్లకు మాత్రమే దీనిని అందించే అవకాశం ఉంది. ఈ వరుసలో హ్యుందాయ్ మొదటి స్థానంలో ఉంది. -
ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
ఇంతవరకు అవయవ మార్పిడులకు సంబంధించి..గుండె, కళ్లు, చేతులు, కిడ్నీ వంటి ట్రాన్స్ప్లాంటేషన్లు గురించి విన్నాం. ఇటీవల జంతువుల అయవాలను మనుషులకు మార్పిడి చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా చూశాం. అవి విజయవంతం కాకపోయినా..అవయవాల కొరతను నివారించే దృష్ట్యా వైద్యులు సాగిస్తున్న ప్రయాత్నాలే అవి. ఐతే తాజాగా ఓ మెడికల్ స్టార్టప్ కంపెనీ తొలిసారిగా తల మార్పిడి శస్త్ర చికిత్సను అభివృద్ధిపరిచే లక్ష్యాన్ని చేపట్టింది. ఇది సఫలం అయితే చికిత్సే లేని వ్యాధులతో పోరాడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించగలుగుతాం. ఇంతకీ ఏంటా వైద్య విధానం అంటే..యూఎస్లోని బ్రెయిన్బ్రిడ్జ్, న్యూరోసైన్స్, బయో మెడికల్ ఇంజనీరింగ్ స్టార్టప్ ప్రపంచంలోనే తొలిసారిగా తల మార్పిడి వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యాన్ని చేపడుతున్నట్లు ప్రకటించింది. ఐతే ఈ కంపెనీ ఇంతవరకు రహస్యంగా ఈ ప్రయోగాలు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడూ ప్రపంచం తాము చేస్తున్న ఈ సరికొత్త వైద్య గురించి మరింతగా తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బహిర్గతం చేసింది. ముఖ్యంగా చికిత్స చేయలేని స్థితిలో.. స్టేజ్ 4లో ఉన్న కేన్సర్, పక్షవాతం, అల్జీమర్స్ , పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులతో బాధపడుతున్న రోగుల్లో కొత్త ఆశను అందించడమే లక్ష్యంగా ఈ ప్రయోగానికి నాంది పలికినట్లు బ్రెయిన్ బ్రిడ్జ్ స్టార్టప్ పేర్కొంది. చిత్త వైకల్యంతో బాధపడుతున్న రోగి తలను ఆరోగ్యకరమైన బ్రెయిన్డెడ్ డోనర్ బాడీతో మార్పిడి చేయడం వంటివి ఈ సరికొత్త వైద్య విధాన ప్రక్రియలో ఉంటుంది. అందుకు సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేకెత్తించింది.ఈ వీడియోలో రెండు రోబోటిక్ బాడీలపై ఏకకాలంలో శస్త్ర చికిత్స చేస్తున్న రెండు స్వయం ప్రతిపత్త రోబోలు కనిపిస్తాయి. ఇక్కడ ఒకరి నుంచి తలను తీసి మరో రోబోటిక్ శరీరంలోకి మార్పిడి చేస్తారు. ఇది చూడటానికి హాలీవుడ్ రేంజ్ సన్నివేశంలా అనిపిస్తుంది. ఇలాంటి అత్యధునిక శస్త్రచికిత్సపైనే న్యూరబుల్, ఎమోటివ్, కెర్నల్ అండ్ నెక్ట్స్ మైండ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేస్ వంటి కంపెనీలు కూడా వర్క్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రెయిన్బ్రిడ్జ్లోని ప్రాజెక్ట్ లీడ్ హషేమ్ అల్-ఘైలీ మాట్లాడుతూ..తాము మెదడు కణాల క్షీణతను నివారించేలా అతుకులు లేకుండా తల మార్పిడి చేసేందుకు హైస్పీడ్ రోబోటిక్ సిస్టమ్ను వినియోగించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఉన్న అధునాతన ఏఐ అల్గారిథమ్లు శస్త్ర చికిత్సలో నరాలు, రక్తనాళాల తోపాటు వెన్నుపాముని కచ్చితంగా తిరిగి కనెక్ట్ చేయడంలో రోబోలకు మార్గనిర్దేశం చేస్తాయని అల్ ఘైలీ చెప్పారు. తాము ఈ కాన్సెప్ట్ని విస్తృతమైన శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా రూపొందించమని తెలిపారు.ఇది వైద్య సరిహద్దులను చెరిపేసేలా.. ప్రాణాంతక పరిస్థితులతో పోరాడుతున్న వారికి ప్రాణాలను రక్షించేలా వినూత్న పరిష్కారాలను అందిచగలదని చెప్పారు. 🤖 BrainBridge, the first head transplant system, uses robotics and AI for head and face transplants, offering hope to those with severe conditions like stage-4 cancer and neurodegenerative diseases… pic.twitter.com/7qBYtdlVOo— Tansu Yegen (@TansuYegen) May 21, 2024 (చదవండి: వడదెబ్బకు గురైన నటుడు షారూఖ్! దీని బారిన పడకూడదంటే..!) -
అసలు వీడియో ఈసీ ఎందుకు దాస్తుంది?
-
32 వీడియో లింకులను బ్లాక్ చేసిన యూట్యూబ్!
ప్రముఖ ఆన్లైన్ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ నిషేధిత కంటెంట్గా భావించే 32 వీడియో లింకులను బ్లాక్ చేస్తున్నట్లు ప్రకటించింది. హాంకాంగ్ కోర్టు నిర్ణయానికి లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పింది.చైనా-హాంకాంగ్ మధ్య కొన్నేళ్లుగా రాజకీయ, బౌగోళిక సమస్య కొనసాగుతోంది. హాంకాంగ్లో ప్రత్యేకపాలన ఉంటుంది. అక్కడి ప్రభుత్వాన్ని చైనాకు అనుకూలంగా ఉండే వారికి కట్టబెడుతారు. దాంతో స్థానిక ప్రజలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. అందులో భాగంగా 2019లో ‘గ్లోరీ టు హాంకాంగ్’ అనే నిరసన గీతం ప్రాచుర్యంలోకి వచ్చంది. దీన్ని నిషేధించాలని కోరుతూ హాంకాంగ్ అప్పీల్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఆ గీతం యూట్యూబ్లో వైరల్గా మారడంతో దాన్ని తొలగించాలని తాజాగా కోర్టు ఆదేశించింది. ఫలితంగా పాటకు సంబంధించిన 32 వీడియో లింకులను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. చైనా నుంచి హాంకాంగ్ విభజనను కోరుకుంటున్న అసమ్మతివాదులు ఆ పాటను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు హెచ్చరించారు.ఇదీ చదవండి: టీవీ రిమోట్ పనిచేయడం లేదా..? చిట్కా మీ కోసమే..కోర్టు నిర్ణయంతో నిరాశ చెందినట్లు యూట్యూబ్ చెప్పింది. అయినప్పటికీ ఆ తీర్పును పాటిస్తామని స్పష్టం చేసింది. బుధవారం నుంచి ఇకపై యూట్యూబ్లో ఆ గీతం కోసం సెర్చ్చేస్తే ‘కోర్టు ఆర్డర్ వల్ల ఇందుకు సంబంధించిన కంటెంట్ దేశీయ డొమైన్లో నిషేధించడమైంది’ అనే పాప్అప్ మెసేజ్ వస్తుందని చెప్పింది. ఆన్లైన్లో స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తీకరించానుకునేవారిని కట్టడి చేయడం సరికాదని, ఈ వ్యవహారానికి సంబంధించి ఇతర వర్గాలకు అప్పీల్ చేస్తామని తెలిపింది. ఇప్పటికే మానవ హక్కుల సంస్థలతో తమ భావాలను పంచుకున్నట్లు కంపెనీ పేర్కొంది. -
రోటీ చేసి, భోజనం వడ్డించిన ప్రధాని మోదీ - వీడియో
పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలోని ప్రసిద్ధ సిక్కు మందిరం గురుద్వార్ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా లంగర్లో భక్తులకు భోజనం వడ్డించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మోదీ పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సిక్కుల ప్రార్థనా స్థలంలో మోదీ ఒక స్టీల్ బకెట్ తీసుకుని, అందులోని ఆహారాన్ని అక్కడి ప్రజలకు వడ్డించడం చూడవచ్చు. అంతే కాకుండా మోదీ స్వయంగా రోటీ తయారు చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.इतनी सुंदर और गोल रोटी तो महिलाये भी नहीं बनाती होगी.... मान गये मोदी जी आपको pic.twitter.com/0VZuMxMsi4— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024ఆదివారం బీహార్లో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్షో నిర్వహించారు. బీహార్లో రోడ్షో నిర్వహించిన తొలి ప్రధాని మోదీ. సోమవారం ప్రధానమంత్రి రాష్ట్రంలోని హాజీపూర్, ముజఫర్పూర్, సరన్ నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.ऐसा सनातन का पुरोधा ढूंढने पर भी न मिलेगा Proud of you My PM 🔥 pic.twitter.com/nDAZWQKGqo— Hardik Bhavsar (Modi Ka Parivar) (@Bitt2DA) May 13, 2024ఇదిలా ఉండగా లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం దేశ ప్రజలను అధిక సంఖ్యలో ఓటు వేయాలని కోరారు. ''నాలుగో దశ లోక్ సభ ఎన్నికలలో పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 96 స్థానాలలో పోలింగ్ జరుగుతుంది.ఈ నియోజక వర్గాలలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారనీ ఓటింగ్ పెరుగుదలకు.. యువ ఓటర్లు మహిళలు దోహదం చేస్తారనీ నమ్ముతున్నాను.రండి ,మనందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం'' అని మోదీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.Sikhism is rooted in the principles of equality, justice and compassion. Central to Sikhism is Seva. This morning in Patna, I also had the honour of taking part in Seva as well. It was a very humbling and special experience. pic.twitter.com/0H8LufyzJ6— Narendra Modi (@narendramodi) May 13, 2024 -
Buddhadeb Bhattacharya: నేను బుద్ధదేవ్ మాట్లాడుతున్నా...!
లోక్సభ ఎన్నికల్లో గెలవడానికి పారీ్టలు ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రచారం పర్వంలో కృత్రిమ మేధ (ఏఐ)తో ఇప్పటికే జోరుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా పశి్చబెంగాల్లో సీపీఎం కూడా ఇదే దారి పట్టింది. కొద్ది రోజుల క్రితం ఏఐ యాంకర్ ‘సమత’ను ప్రచారంలోకి దింపిన ఆ పార్టీ, తాజాగా బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, కమ్యూనిస్టు దిగ్గజం బుద్ధదేవ్ భట్టాచార్య వీడియోను కూడా అలాగే తయారు చేసింది! ఏఐ సహాయంతో సరిగ్గా మాజీ బుద్ధదేవ్ ప్రతిరూపాన్ని, వాయిస్ను రూపొందించింది. 2 నిమిషాల 6 సెకన్ల నిడివితో కూడిన వీడియో సందేశం సాయంతో అటు బీజేపీ, ఇటు తృణమూల్పై ఏకకాలంలో దాడి చేసింది. ‘‘బెంగాల్లో ఉపాధి లేదు, మహిళలకు గౌరవం లేదు. రాష్ట్రం అవినీతికి అడ్డాగా మారుతోంది. రాష్ట్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పరిశ్రమలొస్తాయని, వ్యవసాయం మెరుగుపడుతుందని, పిల్లలకు ఉద్యోగాలొస్తాయని తృణమూల్ చెప్పిన మాటలన్నీ నీటిమూటలే అయ్యాయి. అంతా అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. కేంద్రంలో బీజేపీ కూడా జనాల జీవితాలతో ఆడుకుంటోంది. నోట్ల రద్దు నుంచి మొదలుకుని కార్పొరేట్ లూటీ దాకా సర్వం కొద్ది మంది కుబేరులకు మేలు చేసే నిర్ణయాలే. తాజాగా మోదీ సర్కారు ఎన్నికల బాండ్ల అవినీతికి పాల్పడింది. దేశ ఆర్థిక వ్యవస్థ చితికిపోయింది. దేశాన్ని, రాజ్యాంగాన్ని నాశనం చేసే పనిలో పడింది. ఈ ఆటలను సాగనీయొద్దు. అందుకు మన ముందున్న మార్గం పోరాటం ఒక్కటే. ఈ పోరాటంలో గెలవాలంటే ఈ ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ సెక్యులర్ అభ్యర్థులనే గెలిపించండి’’ అంటూ వీడియోలో బుద్ధదేవ్ విజ్ఞప్తి చేశారు! ఇంటికే పరిమితం... తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బుద్ధదేవ్ కొంతకాలం కిందట ఆస్పత్రిలో చేరారు. కోలుకుని ఇంటికి తిరిగొచి్చన తర్వాత బయటికి కనిపించడమే లేదు. పూర్తి విశ్రాంతిలో ఉన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వామపక్ష కార్యకర్తలు, మద్దతుదారుల్లో ఉత్సాహాన్ని నింపడానికి సీపీఎం ఇలా బుద్ధదేవ్తో కూడిన ఏఐ వీడియోను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వీడియోను రూపొందించిన తరువాత బుద్ధదేవ్ కుటుంబానికి వినిపించి, వారి అనుమతితోనే సామాజిక వేదికల్లో పోస్ట్ చేసింది పార్టీ. బుద్ధదేవ్ సందేశం వామపక్ష కార్యకర్తలకు ఎంతో ఉత్తేజాన్నిస్తుందని సీపీఎం నమ్ముతోంది. అంతేకాకుండా రాష్ట్ర ఓటర్లను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుందని భావిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
యూట్యూబర్ ఓవర్ యాక్షన్.. దిమ్మతిరిగే షాక్!
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. ఓవర్ యాక్షన్ చేస్తే అది మన మెడకే చుట్టుకుంటుంది. ఛానల్ ఉంది కదా అనో, చేతిలో కెమెరా ఉంది కదా అనో విచక్షణ మరిచి ప్రవర్తించకూడదు. ఇది తెలియక చాలామంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ప్లూయెన్సర్లు ఫేక్వార్తలు, సమాచారంతో గప్పాలు కొడుతుంటారు. తాజాగా పబ్లిసిటీ కోసం నిషిద్ధ ప్రాంతంలోకి ఉద్దేశపూర్వకంగా ఎంటరైన ఒక యూట్యూబర్కి దిమ్మతిరిగే షాక్ తగిలింది. విషయం ఏమిటంటే.. బెంగళూరులోని యలహంకకు చెందిన వికాస్ గౌడ (23) అడ్డంగా బుక్కయ్యాడు. ఏప్రిల్ 7వ తేదీన మధ్యాహ్నం 12 గంటల సమయంలో చెన్నైకి వెళ్లే ఎయిరిండియా విమానం టిక్కెట్ బుక్ చేసుకున్నాడు. భద్రతా తనిఖీల అనంతరం విమానాశ్రయంలోకి ప్రవేశించాడు. ఇక్కడి దాకా బాగానే వుంది. విమానం ఎక్కకుండా, విమానాశ్రయ ఆవరణలోనే తిరుగుతూ వీడియో కంటెంట్ను రికార్డ్ చేశాడు. ఇక్కడితో సరిపెట్టినా బావుండేది. ఎయిర్పోర్ట్లో రోజంతా బస చేసా.. అయినా తనని ఎవరూ పట్టించుకోలేదంటూ ప్రగల్భాలు పలుకుతూ ఏప్రిల్ 12న ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు. విమానాశ్రయంలో మొత్తం తిరిగినా తనను ఎవరూ పట్టుకోలేదంటూ, ఎయిర్పోర్ట్ భద్రత గురించి నెగెటివ్ కామెంట్ చేశాడు. అంతా అయ్యాక డ్యామేజ్ కంట్రోల్లో పడ్డాడు. ఆ ఎయిర్పోర్ట్ వీడియోను తన ఛానెల్ నుండి తీసివేశాడు. కానీ అది కాస్తా చేరాల్సిన వారి దృష్టికి అప్పటికే చేరిపోయింది. కట్ చేస్తే.. విషయం తెలుసుకున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వింగ్ సీఐఎస్ఎఫ్ వికాస్పై ఫిర్యాదు చేసింది. దీంతో అతణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్లు 505, 448 కింద కేసు కూడా నమోదు చేశారు. తన ఫ్లైట్ మిస్సయ్యానని పేర్కొంటూ, సుమారు ఆరు గంటలపాటు విమానాశ్రయంలో తిరిగాడని, కానీ అతను చెప్పినట్టుగా 24 గంటలు కాదని తన విచారణలో తేలిందని భద్రతా అధికారులు వెల్లడించారు. అతని మొబైల్ ఫోన్నుస్వాధీనం చేసుకున్నారు. ఎట్టకేలకు తను చేసింది తప్పేనని అంగీకరించాడు. ప్రచారంకోసం అలా చేశానంటూ లెంపలేసుకున్నాడు. మొత్తం మీద గౌడకు బెయిల్ మంజూరు కావడంతో బతుకు జీవుడా అంటూ బయటపడ్డాడు. -
హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి.. వీడియో విడుదల
సిరియాలో ఉన్న హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్కు సంబంధించిన స్థావరాలపై దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. దాడికి సంబంధించి ఓ వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ విడుదల చేసింది. అక్టోబర్ 7 నుంచి హమాస్ మిలిటెంట్ గ్రూప్కు అనుకూలంగా లెబనాన్ దేశానికి చెందిన హెజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులకు తెగపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిరియాలో విస్తరించిన హెజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్పై కూడా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ఆర్మీ ఇప్పటికే పదేపదే హెచ్చరించింది. ‘సిరియాలోని హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ సైనిక స్థావరాలపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా దాడి చేశాము’ అని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. సిరియాలోని ఓ భవనంపైబుధవారం తెల్లవారుజామున దాడి చేసినట్లు తెలిపే ఓ విడియోను ఇజ్రాయెల్ ఆర్మీ విడుదల చేసింది. צה"ל תקף לפני זמן קצר תשתית צבאית שהוצבה בחזית שטח סוריה, אשר ממידע מודיעיני עולה כי שימשה את ארגון הטרור חיזבאללה. צה"ל רואה במשטר הסורי אחראי לכל אשר קורה בשטחו ולא יאפשר ניסיונות אשר יובילו להתבססות ארגון הטרור חיזבאללה בחזיתו>> pic.twitter.com/Eh2W5LRyYH — צבא ההגנה לישראל (@idfonline) April 9, 2024 హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ కార్యకలాపాలకు సంబంధించి సిరియా తన భూభాగంలో జవాబుదారిగా ఉంటుంది. కానీ సిరియా దేశం అవతల హిజ్బుల్లా దాడులు చేసే ప్రయత్నాలను అనుమంతిచబోమని ఇజ్రాయెల్ ఆర్మీ హెచ్చరించింది. అదే విధంగా దక్షిణ లెబనాన్లోని పలు హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై దాడి చేసినట్లు ప్రకటించటం గమనార్హం. దక్షిణ లెబనాన్లోని ధైరా, తైర్ హర్ఫా ప్రాంతాల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్లు లక్ష్యంగా మిసైల్ దాడి చేసినట్ల ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. -
కేజ్రీవాల్ మరో జైలు సందేశం.. ఈసారి ‘ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్’
ఢిల్లీ, సాక్షి: జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈ సారి ఓ ఆసక్తికర అంశం ఉంది. అదేంటంటే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేడ్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక సీఎం ఉన్నట్లు ఆ ఫొటోను ఏర్పాటు చేశారు. "నేను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజు వారి ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించాలి" అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్ వీడియోలో చదివి వినిపించారు. "ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జై హింద్" అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు. -
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్ఫోన్స్తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
హాయి హాయిగా... కూల్ కూల్గా!
ఎలాంటి క్యాప్షన్ లేకుండా రమీజ్ అనే యూజర్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన చెన్నై ఆటోడ్రైవర్ వీడియో 3 కోట్ల ఎనభై ఎనిమిది లక్షలకు పైగా వ్యూస్తో దూసుకుపోతోంది. ‘ఏమిటీ ఆటోడ్రైవర్ స్పెషాలిటీ?’ అనే విషయానికి వస్తే... ఎండా కాలంలో చెన్నైలో వేడి అంతా ఇంతా కాదు. ఈ వేడిని తట్టుకోవడానికి సదరు ఆటోడ్రైవర్ ఎకో ఫ్రెండ్లీ ఏసీ ఫ్యాన్ను తయారుచేసి తన ఆటోలో బిగించాడు. ఆటోడ్రైవరే కాదు ప్రయాణికులు కూడా హాయి హాయిగా కూల్ కూల్గా ప్రయాణిస్తున్నారు. -
సెల్ఫ్–లవ్
వెనకటికి ఒక ఈగ ఇల్లలుకుతూ ఇంటి పనుల్లో పడి పేరు మరచిపోయిందట. చాలామంది మహిళలు ఇంటిపనుల్లో తలమునకలైపోయి తమ ఇష్టాలను మరచిపోతుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రొఫెసర్ ఫల్గుణి గృహిణుల కోసం ఒక వీడియో చేసింది. ‘మహిళలు తమ భర్త, పిల్లల కోసం ఇష్టమైన వంటకాలను తయారుచేసే వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాను. మరి మీ కోసం ఎప్పుడు తయారు చేస్తారు? మీ కుటుంబ సభ్యులకు నచ్చిన వంటకాల గురించి మాత్రమే కాదు మీకు నచ్చిన వాటి గురించి కూడా దృష్టి పెట్టండి’ అంటూ తనకు బాగా నచ్చిన వంటకాన్ని తయారుచేస్తున్న వీడియోను ఫల్గుణి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ క్లిప్ 1.4 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఈ వీడియో క్లిప్ చూసి ఒక మహిళ ఇలా స్పందించింది... ‘నీకు ఇష్టమైనది చేసి పెడతాను. ఏంచేయమంటావు అని అడిగింది అమ్మ. వెంటనే సమాధానం చెప్పలేకపోయాను. పెళ్లయిన తరువాత ఇంటిపనుల్లో పడి నాకు ఇష్టమైన వంటకం ఏమిటో కూడా మరిచిపోయాను. ఈ వీడియో చూసిన తరువాత సెల్ఫ్–లవ్ ్ర΄ాముఖ్యత గురించి రియలైజ్ అయ్యాను’ -
అవిభక్త కవలలకు వివాహం.. వరుడెవరంటే..
అమెరికాకు చెందిన అవిభక్త కవలలు (కంజోయిన్డ్ ట్విన్స్)అబ్బి, బ్రిట్నీ హెన్సెల్లు రిటైర్డ్ ఆర్మీ అధికారిని పెళ్లి చేసుకుని ముఖ్యాంశాలలో నిలిచారు. 1996లో ‘ది ఓప్రా విన్ఫ్రే షో’లో కనిపించి, ఇద్దరూ తొలిసారి వెలుగులోకి వచ్చారు. తాజాగా ఈ అవిభక్త కవలలు అమెరికా ఆర్మీ రిటైర్డ్ అధికారి జోష్ బౌలింగ్ను వివాహం చేసుకున్నారు. బ్రిట్నీ హాన్సెల్ ఫేస్బుక్ ప్రొఫైల్లో వారి పెళ్లి ఫొటో ప్రత్యక్షమయ్యింది. దానిలో పెళ్లి దుస్తుల్లో ఈ అవిభక్త కవలలు జోష్ బౌలింగ్ ముందు నిలబడి అతని చేతిని పట్టుకోవడాన్ని చూడవచ్చు. ఈ కవల సోదరీమణులు ప్రస్తుతం ఐదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వీరు వీరి స్వస్థలమైన మిన్నెసోటాలో నివసిస్తున్నారు. మరోవైపు జోష్ బౌలింగ్ ఫేస్బుక్ పేజీలో అతను ఆ అవిభక్త కవలలకు ఐస్ క్రీం అందిస్తున్న ఫొటోలు, వెకేషన్ ఫోటోలు ఉన్నాయి. వీరి వివాహానికి సంబంధించిన వీడియో క్లిప్ కూడా బయటకు వచ్చింది. దానిలో వారు డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అబ్బి, బ్రిట్నీ హెన్సెల్ల శరీరం కలసిపోయివుంటుంది. అబ్బి కుడి చేయి , కుడి కాలును నియంత్రిస్తుండగా, బ్రిట్నీ ఎడమ వైపు అవయవాలను నియంత్రిస్తుంది. -
వన్యప్రాణులపై రీల్స్ చేయండి.. రూ. 5,000 గెలుచుకోండి!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ మహానగరం పేరు వినగానే అక్కడి జూలాజికల్ పార్క్ గుర్తుకు వస్తుంది. ఇది దేశంలోని పురాతన జూలాజికల్ పార్కులలో ఒకటి. ఈ పార్కులో పలు రకాల జంతువులు, పక్షులు కనిపిస్తాయి. ఈ పార్కుకు వచ్చే పర్యాటకుల సంఖ్యను మరింతగా పెంచేందుకు అక్కడి అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. కాన్పూర్ జూ పార్కు అధికారులు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యర్థులకు ఉచితంగా పార్కును సందర్శించే అవకాశాన్ని కల్పించారు. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పలువురిని కాన్పూర్ జూకి ఆహ్వానించారు. వారిని జంతువులపై ప్రత్యేకంగా రీల్స్ చేయాలని కోరారు. వీటిలో అత్యధిక వ్యూస్ వచ్చిన వాటికి వేర్వేరు విభాగాలలో బహుమతులను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ‘కాన్పూర్ దర్శన్’ అనే పేరు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్ షెఫాలీ రాజ్ మాట్లాడుతూ జూలో నిర్వహిస్తున్న ఈ పోటీ ఉద్దేశ్యం దేశం నలుమూలలలోని ప్రజలకు కాన్పూర్ జూ పార్కు గురించి తెలియజేసి, వారు ఇక్కడికి వచ్చేలా ప్రేరేపించడమేనని అన్నారు. పర్యాటకులు రూపొందించే రీల్స్లో అత్యధికులు లైక్ చేసిన రీల్కు రూ. 5000, తరువాత ఉన్న రీల్కు రూ. 3000 నగదు బహుమతి అందించనున్నామని తెలిపారు. -
మాల్లో విషాదం: తండ్రి చేతుల్లోంచి జారిపడి..
కుటుంబంతో సరదాగా గడుపుదామని షాపింగ్మాల్కు వెళ్లిన ఆ కుటుంబానికి శోకం మిగిలింది. తండ్రి చేతుల్లోంచి జారిపడి ఏడాదిన్నర బిడ్డ కన్నుమూసింది. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లోని ఓ షాపింగ్మాల్లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎస్కులేటర్ మీద వెళ్లేందుకు ఓ వ్యక్తి చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు. ఆ టైంలో ఆ వ్యక్తి ఐదేళ్ల కొడుకు ముందుకు వెళ్తుండడంతో.. నిలువరించేందుకు ఆ తండ్రి యత్నించాడు. ఈ లోపు చేతిలో ఉన్న బిడ్డ జారి కింద పడిపోయాడు. మూడో అంతస్థు నుంచి పడిపోవడంతో ఆ బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ చిన్నారి కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు. మాల్ సీసీటీవీ కెమెరాల్లో ఘటన తాలుకా దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలోని దృశ్యాలు మిమ్మల్ని కలవరపర్చొచ్చు.. సున్నిత మనస్కులు ఈ వీడియో చూడకండి Toddler at Raipur mall dies after falling from the third floor after he accidentally slips from the lap of the guardian, while he looked after another child.#Raipur pic.twitter.com/aGlW7oZUAk — Anurag Tyagi (@TheAnuragTyagi) March 20, 2024 -
‘బొద్దింకల దోసె’?! షాక్ అయిన అమ్మడు
సామాన్యంగా బొద్దింకలను చూస్తేనే శరీరం ఝల్లుమంటుంది...అలాంటి బొద్దింక ఆహారంలో కనిపిస్తే..? ఆ భోజనం తినగలమా? ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా వినిపిస్తున వార్త "ఆహారంలో బొద్దింక". ట్రైన్, రెస్టారెంట్, విమానాల్లో ఇలా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. తాజాగా ఢిల్లీలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని కనౌట్ ప్లేస్లోని ఓ రెస్టారెంట్లో మధ్యాహ్న భోజనం కోసం ఓక మహిళ, ఆమె స్నేహితురాలు దోసను ఆర్డర్ చేసారు. సరిగ్గా అలా తినడం మొదలు పెట్టిందో లేదో.. అక్కడ అనుమానాస్పదంగా ఏదో కనిపించింది. ఏంటా అని పరిశీలనగా చూసింది. అంతే.. ఒకటి కాదు రెండు కాదు ఎకంగా ఎనిమిది బొద్దింల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయింది. ఇవి చదవండి: నిత్యం వీటిని తినడంతో.. కలిగే మార్పులు తెలుసా! దీంతో ఈ సంఘటనను రికార్డుచేయాలని నిర్ణయించుకుంది. స్నేహితురాలి సాయంతో వీడియో రికార్డ్ చేస్తోంది. ఇంతలోనే హోటల్ సిబ్బందిలో ఒకరు ఎంట్రీ ఇచ్చాడు. అకస్మాత్తుగా ప్లేట్ను లాగేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇషాని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ‘బొద్దింకల’పై ఆరా తీస్తున్నారు. తనకెదురైన భయంకరమైన అనుభవాన్ని ఇషాని ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ కేఫ్ లైసెన్స్, శుభ్రతపై అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. రెస్టారెంట్ల పరిశుభ్రత స్థాయి, లైసెన్స్లను తనిఖీ చేయడానికి అధికారులు క్రమం తప్పకుండా రెస్టారెంట్లను సందర్శించి తగిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు నమోదు కావంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ది క్వింట్’ షేర్ చేసిన ఈ వీడియో ఇపుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
ఇదేందిది.. ప్రజర్ కుక్కర్ను ఇలానూ వాడొచ్చా?
కొంతమంది తమ అవసరాలకు అనుగుణంగా ఇంటిలోని వస్తువులతో వినూత్న ఆవిష్కరణలు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇటువంటివాటిని చూసినప్పుడు మన కళ్లను మనమే నమ్మలేం. ఇన్నాళ్లూ ఈ సంగతి మనకు తెలియలేదే.. అని ఆశ్యర్యపోతుంటాం. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్గా మారింది. ఈ వీడియోలో ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఓ యువతి చేసిన పని చూస్తే ఎవరైనా ఆశ్యర్యపోవాల్సిందే. హాట్ ప్రజర్ కుక్కర్ను ఉపయోగించి ఆ యువతి దుస్తులు ఇస్త్రీ చేయడాన్ని వీడియోలో చూడవచ్చు. ప్రజర్ కుక్కర్ నుంచి విజిల్ రాగానే ఆ యువతి ఇండక్షన్ స్టవ్ నుంచి దించి, దానిని తీసుకుని గదిలోకి పరిగెడుతుంది. తరువాత ఆ కుక్కర్ సాయంతో ఒక షర్ట్ ఇస్త్రీ చేస్తుంది. ఈ వీడియోను చూసిన యూజర్స్ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ 17 సెకన్ల వీడియో @Babymishra_ అనే ఖాతాతో ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు ఒక లక్షా 40 వేల మందికి పైగా వీక్షించగా, ఆరు వందల మందికి పైగా యూజర్లు ఈ వీడియోను లైక్ చేశారు. ఒక యూజర్ ‘ఆమె సృజనాత్మకతకు వందనం’ అని రాయగా, మరొక యూజర్ ‘ఇస్త్రీ పెట్టె నూతన ఆవిష్కరణ. వెంటనే పేటెంట్ తీసుకోవాలి’ అని రాశారు. प्रिय दीदी जी को दंडवत प्रणाम 🙏 pic.twitter.com/ux2XkGpMSX — Shubhangi Pandit (@Babymishra_) March 12, 2024 -
Google software engineer : ఏ డే ఇన్ మై లైఫ్...
గూగుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సలోని రక్హోలియా ‘ఏ డే ఇన్ మై లైఫ్ ఎట్ గూగుల్’ కాప్షన్తో పోస్ట్ చేసిన వీడియో 2.4 మిలియన్ల వ్యూస్ను దక్కించుకుంది. ఉదయం ఇంటి నుంచి బయలుదేరడం నుంచి గూగుల్ ఆఫీసులోకి అడుగు పెట్టడం, చెక్ అప్డేట్స్, బ్రేక్ ఫాస్ట్, ప్లాన్ ఫర్ ది డే అండ్ వర్క్, గెట్ సమ్ వాటర్ అండ్ స్నాక్స్, కోడ్ అండ్ అటెండింగ్ మీటింగ్స్, కొద్ది సమయం పుస్తకం చదవడం, టేబుల్ టెన్నిస్ ఆడడం, వర్క్ చేస్తూ స్నాక్స్, కాఫీ ఆస్వాదించడం. వర్క్కోడ్, డిజైన్, డిస్కస్, మ్యూజిక్ రూమ్లో కొద్దిసేపు గడపడం, జిమ్లో కొద్దిసేపు ఎక్సర్సైజ్, కోడింగ్ సెషన్లు, సాయంత్రం ఆఫీసు నుంచి తిరిగి ఇంటికి వెళ్లడం...ఇలాంటి దృశ్యాలెన్నో ఈ వీడియోలో కనిపిస్తాయి. ఆఫీస్ జిమ్లో క్విక్ వర్కవుట్ సెషన్లాంటి వెల్–టైమ్డ్ బ్రేక్స్ను ఈ వీడియో హైలెట్ చేస్తుంది. -
ఖలిస్తానీ నేత హత్య వీడియో.. తొలిసారి టీవీలో ప్రసారం
ఒట్టావా: ఖలిస్తానీ అనుకూల నేత హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వీడియో తొలిసారి కెనడాలోని ఓ టీవీ చానల్లో ప్రసారమైంది. గత ఏడాది జూన్ 18న కెనడా బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సులోని సర్రే పట్టణంలో ఉన్న గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్ ఆవరణలో నిజ్జర్పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ హత్యకు సంబంధించిన సీసీటీవీ వీడియోను కెనడాలో తొలిసారిగా అధికారిక సీబీసీ న్యూస్ చానల్ ప్రసారం చేసింది. గురుద్వారా పార్కింగ్ ప్లేస్లో నిజ్జర్ ప్రయాణిస్తున్న వైట్ సెడాన్కారును ఒక పిక్అప్ ట్రక్కు తొలుత అడ్డగిస్తుంది. అనంతరం ట్రక్కులో నుంచి నిజ్జర్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చిన మాస్కులు ధరించిన వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి అక్కడే వేచి ఉన్న టయోటా క్యామ్రీ కారులో ఎక్కి పారిపోయిన దృశ్యాలు ప్రసారమయ్యాయి. ఈ కేసులో ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క నిందితుడిని కూడా అరెస్టు చేయలేకపోయింది. నిజ్జర్ హత్య కేసును ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్(ఐహెచ్ఐటీ)దర్యాప్తు చేస్తోంది. నిజ్జర్ హత్యతో భారత వేగులకు సంబంధముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో గత ఏడాది సెప్టెంబర్ 18న ఆ దేశ పార్లమెంటులో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఈ వ్యాఖ్యల తర్వాత భారత్, కెనడా మధ్య సంబంధాలు బలహీనమయ్యాయి. ఇదీ చదవండి.. కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు -
ఛీఛీ.. మూమూస్ ఇలా చేస్తారా?
ఇటీవలి కాలంలో మూమూస్ చాలామందికి ఇష్టమైన చిరుతిండిగా మారిపోయింది. అయితే ఛత్తీస్గఢ్లోని ధామ్తరిలో మూమూస్ తయారీకి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన వారికి ఇకపై మూమూస్ జోలికి వెళ్లకూడదని అనిపించడం ఖాయం. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తం అయ్యారు. ధామ్తరిలో మూమూస్ విక్రయించే అన్ని దుకాణాలపై దాడులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే మూమూస్ తినేవారంతా చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన మురికి పాదాలతో మూమూస్ కోసం పిండిని కలపడం చూడవచ్చు. ఈ వీడియోను చూసిన పలువురు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తున్నారు. मोमोज़ का आटा, क्या आप भी मोमोज़ खाते है..?? pic.twitter.com/hmA0QxbFRd — Abhishek Pandey (@Abhishe76395130) March 5, 2024 -
రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. లోపలే 9 నిమిషాలున్న అనుమానితుడు
గతవారం బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన ఘటన అందరిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. దీనికి కారణమైన నిందితుడు ఎవరనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అయితే పేలుడు సంభవించడానికి కారణమైన ఓ వ్యక్తి సుమారు 9 నిమిషాల పాటు కేఫ్లో ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు దాడికి పాల్పడిన అనుమానితుడు సన్ గ్లాసెస్, మాస్క్, బేస్ బాల్ టోపీతో బస్టాండ్ నుంచి రామేశ్వరం కేఫ్ వైపు నడుస్తున్నట్లు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. శుక్రవారం ఉదయం 11.34 గంటలకు బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లోని కేఫ్లోకి ప్రవేశించిన అతను మొబైల్ ఫోన్లో మాట్లాడుతున్నట్లు కనిపించాడు. మరో ఫుటేజిలో అతడు ఉదయం 11.43 గంటలకు కేఫ్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అనుమానితుడు వచ్చినంత హడావుడిగానే వెళ్లిపోయినట్లు ఫుటేజిలో కనిపిస్తోంది. రామేశ్వరం కేఫ్లో అనుమానితుడు తొమ్మిది నిమిషాలు మాత్రమే గడిపినట్లు సీసీటీవీ ఆధారాలు సూచిస్తున్నాయి. పేలుడుకు కారణమైనట్లు అనుమానిస్తున్న వ్యక్తి కేఫ్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (IED) ఉన్న బ్యాగ్ని వదిలిపెట్టాడు. ఈ పేలుడులో కొంతమంది కేఫ్ సిబ్బంది సహా 10 మంది గాయపడ్డారు. ఈ కేసును ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) టేకోవర్ చేసింది. VIDEO | Another CCTV visual of Bengaluru cafe blast suspect emerged showing him entering and leaving the cafe At least 10 people were injured in the low intensity blast at the popular Rameshwaram Cafe in Bengaluru's Whitefield locality on Friday. (Source: Third Party) pic.twitter.com/9jpUfxcJt1 — Press Trust of India (@PTI_News) March 4, 2024 -
ఎయిరిండియా ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియో : విభిన్న నృత్య రీతులతో
టాటా గ్రూపు యాజమాన్యంలో ఎయిరిండియా ఇటీవల సరికొత్తగా ముస్తాబైంది. విమానాల్ని కలర్ఫుల్గా, ముఖ్యంగా ఎయర్హెస్టెస్ తదితర సిబ్బంది డ్రెస్ కోడ్ను అందంగా తీర్చిదిద్దింది. తాజాగా మరో కొత్త అప్డేట్ను కూడా ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో నెటిజనులను బాగా ఆకట్టుకుంది. దేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను తీసుకొచ్చింది. ఎయిరిండియా విమానం బయలు దేరడానికి ముందు వినిపించే ప్రయాణీకుల కోసం 'సేఫ్టీ ముద్ర' అనే కొత్త ఇన్ఫ్లైట్ సేఫ్టీ వీడియోను పరిచయం చేసింది. వివిధ కళారూపాల నుండి ప్రేరణ పొందినట్టు తెలిపింది. "శతాబ్దాలుగా, భారతీయ శాస్త్రీయ నృత్యం , జానపద-కళా రూపాలు కథలు, సూచిక మాధ్యమంగా పనిచేశాయి. నేడు, అవి విమాన భద్రత గురించి మరొక కథను చెబుతున్నాయి." అని ట్వీట్ చేసింది. సుసంపన్నమైన, విభిన్నమైన నృత్య రీతుల ప్రేరణతో కొత్త సేఫ్టీ ఫిల్మ్అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. మెకాన్ వరల్డ్గ్రూప్కు చెందిన ప్రసూన్ జోషి, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ , డైరెక్టర్ భరతబాల సంయుక్తగా 'సేఫ్టీ ముద్రాస్'ను దీన్ని తీసుకొచ్చారు. భరతనాట్యం, బిహు, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, ఘూమర్ .గిద్దా, ఎనిమిది విభిన్న నృత్య రూపాల్లో ముద్రలు లేదా నృత్యవ్యక్తీకరణలు ఇందులో చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణీకులకు భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ, అవసరమైన భద్రతా సూచనలను అందించేలా దీన్ని తీర్చిదిద్దడం సంతోషదాయమన్నారు ఎయిరిండియా సీఎండీ కాంప్బెల్ విల్సన్ For centuries, Indian classical dance and folk-art forms have served as medium of storytelling and instruction. Today, they tell another story, that of inflight safety. Presenting Air India’s new Safety Film, inspired by the rich and diverse dance traditions of India.#FlyAI… pic.twitter.com/b7ULTRuX1Z — Air India (@airindia) February 23, 2024
Pagination
ఎంతో మంచి చేశాం.. ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు: వైఎస్ జగన్
కూటమి హవాను తట్టుకుని...
ఏపీలో ఎన్నికలు ఏం చెబుతున్నాయి?
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
అమేథీలో కిశోరీ లాల్ సంచలనం
నన్ను ఓడించాలని కుట్ర చేస్తే.. కేసీఆర్ అడ్రస్ గల్లంతైంది!
సీఎం పదవికి వైఎస్ జగన్ రాజీనామా
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
T20 WC 2024: అమెరికాతో పాకిస్తాన్ పోరు.. తుది జట్లు ఇవే
టాలీవుడ్ హారర్ కామెడీ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఏపీలో టీడీపీ తాలిబన్లు
అతి పెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ వెనుక మోదీ, షా : రాహుల్ గాంధీ
ఐర్లాండ్పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్పై గవాస్కర్ ప్రశంసలు
వీకెండ్లో సినిమాల జాతర.. ఒక్క రోజే ఏకంగా పది చిత్రాలు!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండదు: ఆప్
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్ రెడ్డికి అరుదైన గౌరవం
అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ఐటీ మంత్రి నివాళులు
Advertisement