-
వైన్ షాప్లో దొంగతనం.. రూ.4లక్షలకు పైగా నగదు ఇంకా మద్యం బాటిళ్లు!
రాజాపేట: గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చొరబడి నగదు, మద్యం ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రాజాపేట మండలంలోని పొట్టిమర్రి గ్రామ పరిధిలో జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొట్టిమర్రి గ్రామ పరిధిలో మాధవరెడ్డి అనే వ్యక్తి అరుణాచల వైన్ షాపును నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటలకు రోజుమాదిరిగానే వైన్ షాపునకు తాళాలు వేసి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న గ్రామస్తులు వైన్ షాపులో దొంగలు పడినట్లు గుర్తించి మాధవరెడ్డికి సమాచారం ఇచ్చారు. వెంటనే షాపు వద్దకు చేరుకున్న మాధవరెడ్డి చోరీ జరిగిన విషయాన్ని పోలీసులకు తెలియజేశాడు. దీంతో ఏసీపీ శివరాంరెడ్డి, సీఐ సురేందర్రెడ్డి, ఎస్ఐ సుధాకర్రెడ్డి క్లూస్ టీంను రప్పించి పరిసరాలను పరిశీలించారు. రూ.4,21,000 నగదుతో పాటు సుమారు మద్యం బాటిళ్లు చోరీకి గురైనట్లు వైన్ షాపు నిర్వాహకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుధాకర్రెడ్డి తెలిపారు. -
వైన్ షాప్ తొలగించాలని మహిళల ఆందోళన
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు...‘మందు’ షాపులు బంద్ (ఫొటోలు)
-
వైన్ షాప్నకు నిప్పు.. మద్యం ఇవ్వలేదని తగలబెట్టేశాడు!
విశాఖపట్నం: మద్యం ఇవ్వలేదని వైన్ షాప్ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పోతినమల్లయ్య పాలెం పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను వైన్షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
అధిక మాసంలోనూ ‘అదరగొట్టారు’
సాక్షి, హైదరాబాద్: అధిక మాసంలోనూ వైన్షాపు టెండర్ల ప్రక్రియ అదిరిపోయింది. ఈసారి ఎలాగైనా మద్యం షాపులు దక్కించుకోవాలన్న వ్యాపారుల ఆశతో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తున్నాయి. ఈనెల 14న ఒక్కరోజే రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి 14 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక, 15వ తేదీన సెలవుదినం కావడంతో 16వ తేదీ బుధవారం 8,500 పైగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద 14, 16 తేదీల్లో కలిపి.. 23 వేల వరకు దరఖాస్తులు రాగా, ఈనెల 4 నుంచి 16 వరకు మొత్తం కలిపి 43,500 పైగా దరఖాస్తులు వచి్చనట్టు సమాచారం. కాగా, గత రెండేళ్ల కాలానికి గాను మొత్తం 10 రోజుల్లో 69 వేలకు పైగా దరఖాస్తులు రాగా, ఈసారి తొలి పది రోజుల్లో 43,500 మాత్రమే రావడం గమనార్హం. అయితే, ఈసారి గడువు రెండు రోజులు ఎక్కువగా ఇవ్వడం, అధిక శ్రావణం ముగిసి శ్రావణ మాసం రావడంతో చివరి రెండు రోజుల్లోనూ భారీగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే వేలాది మంది డీడీలు తీసి, శ్రావణ మాసం కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చివరి రెండురోజులైన గురు, శుక్రవారాల్లో భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని, గతం కంటే ఇప్పుడు ఎక్కువే దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నామని ఎక్సైజ్ అధికారులు చెపుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు మద్యం షాపుల దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.870 కోట్ల ఆదాయం సమకూరింది. చివరి రెండు రోజుల్లో కలిపి మరో రూ.500 కోట్ల వరకు వస్తుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. -
మేడ్చల్ జిల్లాలో అర్థరాత్రి కాల్పుల కలకలం.. తుపాకీతో బెదిరించి..
సాక్షి, మేడ్చల్: సినీ ఫక్కీలో మద్యం దుకాణం వద్ద రూ.2.8 లక్షల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. సోమవారం రాత్రి 10.30 గంటలకు నగర శివారులోని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో గుర్తు తెలియని ఆగంతుకులు రెండు రౌండ్ల కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడిన ఈ ఘటన కలకలం సృష్టించింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్దమర్రిలోని వినాయక వైన్స్లో బాలకృష్ణ అనే వ్యక్తి క్యాషియర్గా, హెల్పర్గా జైపాల్రెడ్డి పని చేస్తున్నారు. ప్రతిరోజు మాదిరిగానే సోమవారం సైతం మద్యం అమ్మగా వచ్చిన నగదు రూ.2.8 లక్షలు తీసుకుని రాత్రి 10.30 గంటలకు వైన్స్ షాపును మూసివేసి బయటకు వచ్చారు. అదే సమయంలో ముగ్గురు దుండగులు (25 నుంచి 30 ఏళ్ల వయసు) మంకీ క్యాపులు, కర్చీష్లు ధరించి బైక్పై వచ్చారు. పైసా దేవో అంటూ తుపాకితో బెదిరించారు. దీంతో వైన్స్ సిబ్బంది పక్కనే ఉన్న కర్రలతో వారిపై దాడి చేస్తుండగా.. దుండగులు తుపాకీతో బాలకృష్ణపై కాల్పులు జరపడంతో అతను తప్పించుకున్నాడు. తూటా వైన్స్ షెటర్కు తగిలి లోపల ఉన్న 5 మద్యం సీసాలు ధ్వంసమయ్యాయి. దుండగులు మరో రౌండ్ కాల్పులతో వైన్స్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి రూ.2.8 లక్షల నగదుతో పరారయ్యారు. దుండగులు పక్కా ప్రణాళికతోనే దోపిడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. గ్రామానికి చివర మద్యం దుకాణం ఉండటంతో పాటు మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉండటంతో పారిపోయేందుకు సులువుగా ఉంటుందని ఈ దుకాణాన్ని దుండగులు ఎంచుకొని ఉండవచ్చని స్థానికులు చెబుతున్నారు.దుండగులను పట్టుకునేందుకు 5 బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పేట్బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు తెలిపారు. చదవండి: Smita Sabharwal: నెల క్రితమే నిందితుడి రెక్కీ.. ప్లజెంట్ వ్యాలీలో కరువైన నిఘా -
బ్యాగులో లక్ష్మీ కటాక్షం: అమ్మ తోడు సార్.. ఆ పదిలక్షల బ్యాగ్ నాదే!
యశవంతపుర: వైన్షాపులో మద్యం తాగి బయటకు వచ్చిన శివరాజ్ అనే వ్యక్తికి రోడ్డుపై రూ. 10 లక్షల డబ్బు దొరికింది. తన జతలో ఉన్న కూలీకి కొంత డబ్బు ఇచ్చి మిగతాది తీసుకెళ్లాడు. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ ఘటన మంగళూరు నగరంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాగులో లక్ష్మీ కటాక్షం నవంబర్ 27న మంగళూరులో పంప్వెల్ వద్ద కూలీలు శివరాజ్, తుకారామ్లు కలిసి ఓ బ్రాందీషాపులో మద్యం తాగి రోడ్డు పక్కలో నిలబడి ఉండగా ఓ బ్యాగ్ రోడ్డు పైన పడి ఉంది. శివరాజ్ దానిని తీసుకుని ఉత్కంఠగా తెరిచి చూడగా అందులో ఐదువందలు, రెండు వేల నోట్లు ఉన్న బండిళ్లు కనిపించాయి. అమ్మో ఎంత డబ్బో అని ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయారు. నాకెంత అని తుకారామ్ అడగడంతో రెండు వేల రూపాయల నోట్ల కట్టను ఇచ్చాడు. అందులో రెండు నోట్లు తీసి ఇద్దరు కలిసి మళ్లీ మద్యం తాగి ఎవరి దారిలో వారు వెళ్లిపోయ్యారు. ఆనందం పట్టలేని శివరాజ్ ఒక్కడే మళ్లీ వైన్షాపుకు వెళ్లి తాగాడు. కంకనాడి పోలీసులు అతని ప్రవర్తన చూసి బ్యాగ్లో ఏముందో చూపాలని అడిగారు. డబ్బులు కనిపించటంతో వెంటనే జీపులో ఎక్కించుకొని స్టేషన్కు తీసుకెళ్లారు. తుకారామ్కు ఇచ్చిన డబ్బులను తీసుకురావాలని చెప్పి మూడు రోజుల పాటు స్టేషన్లోనే పెట్టుకున్నారు. తుకారామ్ జాడ తెలియని కారణంగా శివరాజ్ను వదిలిపెట్టలేదు. రూ. 3.50 లక్షలు ఉన్నాయి: కమిషనర్ ఈ విషయం అనోటా ఈ నోటా మంగళూరు నగరమంతా పాకింది. ఈ డబ్బులు వక్క వ్యాపారులదిగా తెలిసింది. ఓ వ్యాపారి వెళ్లి డబ్బులు తనవేనని పోలీసులను కలిశాడు. కానీ ఇది నీ డబ్బులు కాదంటూ వ్యాపారిని మందలించి పంపారు. చివరకు తమకు దొరికిన బ్యాగులో 10 లక్షలు లేవు. రూ.49 వేలు ఉన్నట్లు పోలీసులు వాదించారు. ఇంతవరకూ తమ డబ్బులు పోయినట్లు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. తాగుబోతు వద్ద రూ. మూడున్నర లక్షలు మాత్రమే లభించిన్నట్లు మంగళూరు నగర పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు. సీసీ కెమెరాలను పరిశీలించి ఎవరు పోగొట్టుకున్నారో గుర్తిస్తామని చెప్పారు. -
మద్యం మత్తుకు.. ‘మామూళ్ల’ కిక్కు!
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఆరు వైన్షాప్లు ఉన్నాయి. అవన్నీ సిండికేట్గా దందా చేస్తున్నాయని.. మండలంలోని ఓ గోదాంలో సరుకు నిల్వచేసి మరీ సిండికేట్ నిర్వాహకులు బెల్ట్షాపులకు మందు పంపిస్తుంటారని ఎక్సైజ్ వర్గాలకూ తెలుసు. ఎమ్మార్పీ కన్నా ఎక్కువ ధరకు అమ్మడం ద్వారా బెల్టుషాపులతో నెలకు లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. అయితే సిండికేట్ నుంచి కొందరు ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.1.20 లక్షలు, సివిల్ పోలీసు అధికారులు, సిబ్బందికి మరో రూ.1.20 లక్షలు ముడుపులు అందుతుండటంతో ఈ వ్యవహారమంతా చూసీచూడనట్టు వదిలేస్తున్నట్టు ప్రచారముంది. .. ఇది కేవలం పర్వతగిరి మండలానికి చెందిన విషయం కాదు. దాదాపు రాష్ట్రమంతటా ఇదే తరహాలో దందా కొనసాగుతోందని.. అటు ఎక్సైజ్ పోలీసులు, ఇటు సివిల్ పోలీసులు వైన్షాపులు, బార్ల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లను ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతున్నా ఈ మధ్య ‘వసూళ్ల’ డిమాండ్ పెరిగిందని.. లేకుంటే ఏదో ఒక పేరిట ఇబ్బందిపెడుతున్నారని అంటున్నారు. ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఇలాంటి అంశాలు మరిన్ని వెలుగుచూశాయి. అమ్మకాలను బట్టి మామూళ్ల లెక్క.. రాష్ట్రంలోని వైన్షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నుంచి వసూళ్లు గత రెండేళ్ల కాలంలో రెండింతల వరకు పెరిగినట్టు అంచనా. ముఖ్యంగా సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్షాప్ల నిర్వాహకులు అంటున్నారు. దీనికితోడు అప్పుడప్పుడూ మద్యం బాటిళ్లు కూడా ఫ్రీగా తీసుకెళ్తుంటారని చెప్తున్నారు. ఇక ఎక్సైజ్ సిబ్బందికి అయితే లైసెన్సు తీసుకున్నప్పుడు, రెన్యువల్ సమయంలో, ఫైనల్ క్లియరెన్స్ సందర్భంగా వారికి లక్షల్లోనే ముట్టజెప్పాల్సి వస్తుందని అంటున్నారు. ఈ మామూళ్లలో స్టేషన్ నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు, నగరాల్లో అయితే ఏసీపీ స్థాయి అధికారుల వరకు వాటాలు చేరుతుంటాయనే ఆరోపణలు ఉన్నాయి. మొత్తంగా వైన్స్, బార్ల నిర్వాహకుల అక్రమ దందాలు ఓవైపు.. ఎక్సైజ్, సివిల్ పోలీసుల మామూళ్లు మరోవైపు కలిసి మందుబాబుల జేబుకు మాత్రం చిల్లు పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఊరి నుంచి రాజధాని దాకా ఇంతే.. హైదరాబాద్ నగర శివార్లలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 44 వైన్షాపులు, 38 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వాటినుంచి ఎక్సైజ్ సిబ్బందికి నెలకు రూ.10.40 లక్షలు, సివిల్ పోలీసులకు రూ.5.20 లక్షలు మామూళ్ల రూపంలో వెళుతున్నట్టు ప్రచారముంది. కొన్ని నెలల కింద మామూళ్లను 50శాతం పెంచారని అంటున్నారు. మామూళ్లు ముట్టకపోతే వైన్షాపుల ముందు కానిస్టేబుల్ ప్రత్యక్షమవుతారని.. పార్కింగ్ నుంచి జనాలు గుమికూడే వరకు అన్ని విషయాల్లో ఇబ్బంది పెడుతుంటారని వైన్షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. జనగామ జిల్లాలో వైన్షాపుల నిర్వాహకులు ఎక్సైజ్ పోలీసులకు నెలకు రూ.15వేల–30 వేలవరకు, సివిల్ పోలీసులకు రూ.20–35వేల వరకు ఇస్తున్నట్టు సమాచారం. గ్రేటర్ వరంగల్లో గతంలో ఎక్సైజ్ సిబ్బంది నెలకు రూ.15వేలు వసూలు చేసేవారని, ఇప్పుడు రూ.20వేలు తీసుకుంటున్నారని.. సివిల్ పోలీసులు కూడా రూ.10 వేల నుంచి రూ.15వేలకు పెంచారని వైన్స్షాపుల నిర్వాహకులు అంటున్నారు. పోలీసులకు మామూలు ముట్టకపోతే.. వైన్షాపు ఎదురుగా ట్రాఫిక్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, న్యూసెన్స్ జరుగుతోందని కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. కొన్నిచోట్ల సివిల్ పోలీసులే తనిఖీలు కూడా చేస్తున్నారని పేర్కొంటున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పోలీసులకు గతంలో నెలకు రూ.25 వేలు ఇచ్చేవారమని, ఇప్పుడు రూ.50 వేలు వసూలు చేస్తున్నారని వైన్స్షాపుల వర్గాలు చెప్తున్నాయి. లేకుంటే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, బెల్ట్షాపులపై దాడులు చేస్తుంటారని అంటున్నాయి. తమ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రతినెలా ఠంచన్గా ముట్టజెప్పాల్సి వస్తోందని చెప్తున్నాయి. హైదరాబాద్ నడిరోడ్డు హిమాయత్నగర్, నారాయణగూడ ప్రాంతాల్లో సివిల్ పోలీసుల దందా ఎక్కువైందని వైన్షాపుల యజమానులు చెప్తున్నారు. కేవలం ఎక్సైజ్ వాళ్లకు మాత్రమే ఇస్తే సరిపోదని, తమకూ ఇవ్వకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అంటున్నారు. నారాయణగూడలో వైన్షాపుల నుంచి పోలీసులకు నెలకు రూ.25 వేల చొప్పున అందుతుంటాయని.. అందుకే సిబ్బంది ఆ షాపులు సమయం దాటి తెరిచి ఉన్నా, రోడ్డుపై ఇబ్బంది అవుతున్నా పట్టించుకోరని స్థానికులు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో సివిల్ పోలీసులు తరచూ దావత్ల పేరుతో పెద్ద సంఖ్యలో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడి బార్ల నుంచి నెలకు రూ.15 వేల దాకా వసూలు చేస్తున్నారని వైన్స్ నిర్వాహకులు చెప్తున్నారు. రాత్రి సమయం ముగిశాక మద్యం అమ్మితే.. అందినంత దోచుకుని ఏమీ జరగనట్టు వెళ్లిపోతుంటారని స్థానికులు అంటున్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి జిల్లాలకు ఆనుకుని ఉండే ప్రాంతాల్లోని వైన్స్ నుంచి పోలీసులకు నెలకు రూ.50వేల చొప్పున అందుతాయని.. పైగా అడిగినన్ని మద్యం బాటిళ్లూ ఇవ్వాల్సిందేనని నిర్వాహకులు చెప్తున్నారు. అలా ఇవ్వకుంటే వైన్షాపుల్లో మద్యం అన్లోడ్ కూడా కానివ్వరని అంటున్నారు. ఇక ఎక్సైజ్ మామూళ్లు సాధారణమేనని.. లేకుంటే పర్మిట్ రూం, ఇతర అంశాల్లో తీవ్రంగా ఇబ్బందిపెడతారని ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రాంతంలో కొందరు పోలీసుల మామూళ్ల దందా మరీ ఎక్కువన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సమయానికి డబ్బులు అందకుంటే అలుగుతారని.. కొన్నిరోజులు ఇబ్బందిపెడతారని వైన్ షాపుల నిర్వాహకులు చెప్తున్నారు. స్టేషన్కు తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు నెలవారీగా సివిల్ పోలీసులకు మామూళ్లు ఇవ్వకపోతే షాప్ వద్దకు వచ్చి ఇబ్బందిపెడతారు. షాప్లో పనిచేసే వారిని స్టేషన్కు తీసుకెళుతుంటారు. లేదంటే షాప్ దగ్గర డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని ఓ వైన్షాప్ నిర్వాహకుడు మద్యం కూడా ఫ్రీగా తీసుకెళ్తారు ప్రభుత్వ జీతాలైనా ఆలస్యంగా అందుతాయేమోగానీ పోలీసులకు ఇచ్చే మామూళ్లకు మాత్రం ఆలస్యం జరగకూడదు. డబ్బులేకాదు వారు అడిగినప్పుడల్లా మద్యం బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి. లేదంటే వేధింపులు మొదలవుతాయి. మాకు మిగిలే దాంట్లో ఎంతోకొంత ఇచ్చి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నాం. డబ్బులిస్తే మా జోలికి వచ్చే వారే ఉండరు. – వైన్షాప్ యజమాని, నారాయణగూడ, హైదరాబాద్ -
క్వార్టర్ సీసా తెస్తాడని నమ్మితే నట్టేట ముంచాడు.. ఎంతసేపైనా రాకపాయె!
నాగిరెడ్డిపేట (నిజామాబాద్): ఓ గుర్తు తెలియని వ్యక్తి మద్యం తాగుదామని పరిచయం పెంచుకొని బైక్ ఎత్తుకెళ్లిన ఘటన నాగిరెడ్డిపేట మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఎర్రగుట్ట తండాకు చెందిన మాలవత్ లింగ్య ఈ నెల 24న మద్యం తాగేందుకు తన ద్విచక్ర వాహనంపై గోపాల్పేట మద్యం దుకాణం వద్దకు వెళ్లాడు. అదే సమయంలో వైన్షాపు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి లింగ్యతో పరిచయం చేసుకుని మాటలు కలిపాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి మద్యం తాగుదామని నిర్ణయించుకున్నారు. సదరు వ్యక్తి మద్యం షాప్నకు వెళ్లి క్వార్టర్ బాటిల్ను తీసుకున్నాడు. ఇద్దరు కలిసి బైక్పై మండలంలోని తాండూరు శివారులో పౌల్ట్రీఫామ్ వెనుకకు వెళ్లి మద్యం తాగారు. మరికొంత మద్యం తాగుదామని చెప్పడంతో లింగ్య అంగీకరించాడు. దీంతో గుర్తుతెలియని వ్యక్తి లింగ్య బైక్ను తీసుకుని మద్యం తెస్తానని చెప్పి వెళ్లి.. తిరిగి రాలేదు. దీంతో తన బైక్ పోయిందని గుర్తించి, ఇట్టి విషయమై బాధితుడు లింగ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. (చదవండి: వలపు వల విసిరి బ్లాక్మెయిల్.. రూ.80 లక్షలు వసూలు చేసిన జంట) -
బెడిసికొట్టిన ‘మద్యం చోరీ’ స్కెచ్.. పోలీసులకు చిక్కిన మందుబాబులు
చెన్నై: తమిళనాడులోని తిరువల్లూర్ జిల్లాలో ఇద్దరు మందుబాబుల ‘మద్యం చోరీ’ స్కెచ్ బెడిసికొట్టింది. మద్యాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనుకొని ఓ వైన్ షాప్ గోడకు కన్నం వేసిన దొంగలు.. తీరా లోపలున్న మందు సీసాలను చూశాక కాస్త ప్లాన్ మార్చుకున్నారు. ముందుగా ఓ రెండు పెగ్గులేసి గొంతు తడుపుకొని ఆ తర్వాత ‘పని’కానిద్దామనుకున్నారు. అయితే అదే సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గోడకున్న రంధ్రాన్ని చూసి షాపు వద్దకు వచ్చి చూడగా లోపలి తతంగం వారి కంటపడింది. అయితే దుకాణానికి తాళం వేసి ఉండటంతో వెళ్లిన ‘దారి’లోనే బయటకు రావాలని దొంగలను పోలీసులు ఆదేశించారు. దీంతో తిరిగి వారు రంధ్రంలోంచి బయటకు వచ్చాక అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX — Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022 చదవండి: గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే మృతి -
మందుబాబులకు షాక్.. తాగేదంతా మద్యం కాదు
సాక్షి, వికారాబాద్: వికారబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లోని మద్యం దుకాణాల యజమానులు ధనార్జనే ధ్యేయంగా మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం ప్రియులకు ఏది అసలో ఏది కల్తీనో తెలియని పరిస్థితి. టెండర్లలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారస్తులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సంపాదించాలనే ఆలోచనతో మద్యాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో మద్యం కల్తీ చేసే వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి గుట్టుగా దంగా చేస్తున్నారనే ఆరోపణలు ఊపందుకున్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి అందులో చీప్ లిక్కర్, నీటిని కలిపి మల్లీ యథావిధిగా సీల్ చేస్తున్నారు. ఈ వ్యవహారం చాలా రోజులుగా జరుగుతున్నా అధికారులు తమకేమీ తెలియనట్లు గా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. బ్రాండ్లన్నీ కల్తీమయం జిల్లా ఎక్సైజ్ పరిధిలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో మొత్తం 59 వైన్ షాపులు, ఐదు బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి తోడు గ్రామాలు, తండాల పరిధిలోని ఐదు నుంచి పది వరకు బెల్టు షాపులు ఉన్నాయి. తక్కువ ధరకు లభించే మద్యాన్ని ఎక్కవ ధర ఉన్న బాటిళ్లలో స్టిక్కర్లు, లేబుళ్లను మార్చుతూ విక్రయిస్తున్నారు. ప్రధానంగా పరిగి నియోజకవర్గంలోని పలు దుకాణాల్లో ఈ దందా కొనసాగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరో వైపు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన తాండూరు, కొడంగల్ లోనూ కొనసాగుతోందని పలువురు చర్చించుకుంటున్నారు. పెరిగిన మద్యం ధరలతో ఈ కల్తీ ప్రక్రియ మరింత ఎక్కువగా సాగుతోంది. చదవండి: హైదరాబాద్లో ఫింగర్ ప్రింట్ సర్జరీ ముఠా గుట్టురట్టు వేసిన సీల్ వేసినట్లే.. అధిక ధరలున్న మద్యం సీసాల లేబుళ్లను, స్టిక్కర్లను ఏమాత్రం తేడా లేకుండా ఓపేన్ చేసి మళ్లీ సీల్ వేసేందుకు కొన్ని వైన్షాపుల యజమానులు స్థానికేతరులను, కల్తీ చేయడంతో అనుభవం ఉన్నవారిని తీసుకువస్తున్నట్లు సమాచారం. వారికి ఎక్కువ మొత్తంలో జీతాలు ఇచ్చి మద్యాన్ని ఇష్టానుసారంగా కల్తీ చేయిస్తున్నట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ప్రముఖ బ్రాండ్లలో 25శాతం మద్యాన్ని బయటకు తీస్తూ బదులుగా నీటిని కలుపుతున్నారు. లేదంటే తక్కువ ధరకే లభ్యమయ్యే చీప్ లిక్కర్ ఇతర మందులను కలుపుతూ కల్తీ చేస్తున్నారు. దీంతో వైన్స్ యజమానులు మూడు పువ్వులు, ఆరుకాయలుగా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. బెల్టు షాపుల్లోనూ ఈ తరహా వ్యాపారమే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. నామమాత్రపు తనిఖీలు జిల్లాలో ఇంత భారీగా మద్యం కల్తీ చేస్తున్న వ్యాపారస్తులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మామూళ్ల మత్తుల్లో జోగుతూ కల్తీ మద్యం తయారీకి వత్తాసు పలుకుతున్నారని చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మద్యం షాపుల్లో కల్తీ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది. కల్తీకి కాదేదీ అనర్హం అన్నట్లుగా కేటుగాళ్లు తయారయ్యారు. ప్రమాదకర, విషపూరిత రసాయనాలు కలిసి అసలు ఏదో.. నకిలీ ఏదో తెలియకుండా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. -
అర్ధరాత్రి వైన్స్ వద్ద ఉద్రిక్తత.. మహిళలపై దాడి
అర్ధరాత్రి నడిరోడ్డుమీద మహిళలు హల్చల్ చేశారు. వైన్ షాప్ వద్ద బీభత్సం సృష్టించారు. దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ నిలిచింది. వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఓ వైన్ షాప్ వద్దకు గురువారం అర్ధరాత్రి కొందరు మహిళలు చేరుకున్నారు. అనంతరం వైన్ షాపు మూసివేయాలని వారు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మహిళలు, వైన్ షాపు సిబ్బంది మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో, వైన్ షాపులో ఉన్న మహిళా బౌన్సర్లు.. నిరసనకు దిగిన మహిళలపై దాడులకు దిగడంతో వారు కూడా ఎదురు దాడికి పాల్పడ్డారు. బౌన్సర్లు.. మహిళలను చితకబాదడంతో వారు గట్టిగా కేకలు వేశారు.కాగా, ఆ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న దక్షిణ ఢిల్లీలోని తిగ్డి పోలీస్ స్టేషన్కు చెందిన హెడ్ కానిస్టేబుల్ రంజిత్ జోక్యం వారికి నప్పజెప్పే ప్రయత్నం చేశాడు. ఫుల్ ఫైర్లో ఉన్న మహిళలు.. పోలీసులపై దాడి చేయడంతో అతడి డ్రెస్ చిరిగిపోయింది. దీంతో, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకుని 10 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. देवली रेजिडेंशियल ऐरिया में अवैध शराब के ठेके का विरोध कर रही महिलाओं को शराब माफिया ने बाहर के गुंडों को बुलाकर उनको बुरी तरह से पिटवाया। दिल्ली सरकार की नई लीकर पॉलिसी के करण जगह-जगह यही मौहोल बनता जा रहा है केजरीवाल जी आप से निवेदन इस तरह दिल्ली को बर्बाद न करें। pic.twitter.com/7I7lSkWAnO — Siddharthan (@siddharthanbjp) June 24, 2022 ఇది కూడా చదవండి: ఫన్నీ వీడియో: తప్పతాగి పెళ్లి కూతురి బదులు.. చెంప పగలకొట్టి రచ్చ చేసిన మరదలు -
బెల్టు షాపులు లేకుండా చేస్తాం: ప్రవీణ్కుమార్
కనగల్: బీఎస్పీ అధికారంలోకి వస్తే బెల్టుషాపులు లేకుండా చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ కో–ఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. 24వ రోజుకు చేరిన బహుజన రాజ్యాధికార యాత్ర మంగళవారం కనగల్లో కొనసాగింది. కనగల్ నుంచి క్రాస్రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించిన ప్రవీణ్కుమార్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బెల్టుషాపుల వల్ల గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. మద్యానికి బానిసలై చాలా మంది చిన్నవయస్సులోనే అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో ఏమోగానీ రాష్ట్రం మద్యం విక్రయించడంలో మాత్రం నంబర్వన్ స్థానంలో నిలిచిందని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని తెలిపారు. కూలీలుగా ఉన్న బడుగుబలహీన వర్గాలను ఓనర్లను చేయడమే తమ లక్ష్యమన్నారు. ఏనుగు గర్తుకు ఓటేసి, ప్రగతి భవన్పై నీలిజెండా ఎగురవేసేందుకు బడుగు బలహీనవర్గాలు పాటుపడాలని పిలుపునిచ్చారు. -
‘వైన్షాప్ ఉండాలా.. వద్దా’ అంటూ ఓటింగ్.. ఫలితం ఏంటంటే!
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఓటింగ్ను నాయకులను ఎన్నుకునేందుకు చేపడతారు. అయితే బేగంపేట గురుమూర్తిలేన్ ప్రాంతంలో మాత్రం వైన్ షాప్ ఉండాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించారు. గుర్తిమూర్తిలేన్లో వైన్షాపు ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తోంది. ప్రభుత్వ నిబంధనల మేరకు షాపును ఏర్పాటుచేశామని నిర్వాహకులు చెప్పారు. అయితే దీనిపై ఓటింగ్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. గతంలో ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్న సందర్భంలో ఓటింగ్ ప్రక్రియను నిర్వహించిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ పర్సెప్షన్ స్టడీస్కు అనుబంధంగా ఉన్న ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థను పలువురు స్థానికులు ఆశ్రయించారు. సదరు సంస్థ ప్రతినిధులు శనివారం సిటిజన్ రెఫరెండమ్ పేరుతో గుర్తిమూర్తి లేన్ నివాస, వాణిజ్య కేంద్రాలకు 500 మీటర్ల పరిధిలో ఓటింగ్ నిర్వహించారు. ‘మీకు మీ ఏరియాలో వైన్ షాపులు ఉండడం ఇష్టమేనా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందిగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొత్తం 1479 మంది ఓటు వేయగా ఆదివారం కౌంటింగ్ ప్రక్రియ జరిపారు. 1415 మంది (95.67 శాతం) ‘నో’ (వద్దు) అని ఓట్ చేయగా, 53 మంది (3.58 శాతం) మంది ‘ఎస్’ (కావాలి) అని ఓట్ చేశారు. 11 ఓట్లు చెల్లలేదు. ఓట్లు వేసిన వారిలో 737 మంది (49.8 శాతం) మహిళలు, 742 మంది (50.16) పురుషులు ఉన్నారు. కోర్టులో పిటిషన్.. ‘హక్కు ఇన్షియేటివ్ అండ్ ఛానల్’ సంస్థ నిర్వహించిన ఈ ఓటింగ్ ఫలితాల ఆధారంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. అయితే కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. గతంలో ఇదే సంస్థ సికింద్రాబాద్ ఒకసారి, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వైన్షాపుల ఏర్పాటుపై పలు సర్వేలు జరిపినట్లు సమాచారం. నగరంలో ఇది రెండో ఓటింగ్ ప్రక్రియ. -
930 మద్యం సీసాలు స్వాధీనం
హనుమాన్ జంక్షన్ రూరల్: ప్రభుత్వ వైన్ షాపు ఉద్యోగి అక్రమార్కులతో చేతులు కలిపి భారీ మొత్తంలో మద్యం సీసాలు తరలిస్తుండగా హనుమాన్ జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలు నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు మంగళవారం మీడియాకు చెప్పారు. స్థానిక గుడివాడ రోడ్డులోని వేగిరెడ్డి థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ వైన్షాపు నుంచి భారీ మొత్తంలో మద్యం సీసాలను కారులో తరలిస్తున్నట్లుగా సోమవారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. హనుమాన్జంక్షన్ ప్రధాన కూడలిలో సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్కుమార్, కార్తిక ఉషారాణి వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో గుడివాడ నుంచి నూజివీడు వైపు వెళ్తున్న మారుతీ కారులో రూ.1,39,500 విలువ చేసే 930 మద్యం బాటిళ్లు గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించటంతో సరైన సమాచారం చెప్పకుండా వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ వైన్షాపులో సూపర్వైజర్గా పనిచేస్తోన్న పశ్చిమగోదావరి జిల్లా అప్పనవీడు గ్రామానికి చెందిన మద్దాల రమేష్ కొంతకాలంగా హనుమాన్జంక్షన్కు చెందిన మొవ్వ ప్రసాద్తో చేతులు కలిపి అడ్డదారిలో మద్యం సీసాలు తరలిస్తున్నట్లు నిర్థారించారు. వీరి నుంచి 930 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవటంతో పాటుగా నిందితులను అరెస్ట్ చేసి మంగళవారం నూజివీడు కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. సీఐ కె.సతీష్, ఎస్ఐలు పామర్తి గౌతమ్కుమార్, కార్తిక ఉషారాణి, సహకరించిన కానిస్టేబుళ్లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వీరికి రివార్డులు అందించేందుకు సిఫార్సు చేస్తున్నట్లు ప్రకటించారు. -
చోరీ మామూలే..కానీ ఈ దొంగకు ఓ ప్రత్యేకత ఉంది
సాక్షి, అశ్వారావుపేట(ఖమ్మం) : అశ్వారావుపేటలోని ఓ వైన్స్లో బుధవారం తెల్లవారుజామున చోరీ జరిగింది. కేవలం చోరీ అయితే మామూలు విషయమే కావొచ్చు కానీ ఈ చోరీకి ఓ ప్రత్యేకత ఉంది. చోరీకి పాల్పడింది ఒకరో, ఇద్దరో తెలియదు కానీ దాదాపు రూ.2 లక్షల విలువైన మద్యం బాటిళ్లను అపహరించుకుపోయారు. రానున్న దసరాకు అమ్మకాలు జోరుగానే సాగుతాయనే భావనతో భారీగా స్టాక్ తెప్పించినట్లు సమాచారం. చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: సమరభేరిలో సకుటుంబం.. అయితే, వైన్స్షాపులో సీసీ కెమెరాలు ఉండగా.. వైర్లను కత్తిరించిన నిందితులు లోపలికి ప్రవేశించారు. షాపులో వివిధ రకాల ఖరీదైన బ్రాండ్ల మద్యం ఉన్నా... కేవలం మాన్షన్ హౌస్ బ్రాందీ సీసాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. ఇక వెళ్లిపోయే క్రమంలో వైన్స్లోని సీసీ కెమెరాల పుటేజీ హార్డ్ డిస్క్ కూడా ఎత్తుకెళ్లడం విశేషం. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐ ఉపేంద్రరావు, ఎస్సై చల్లా అరుణ సంఘటనా స్థలానికి చేరుకుని కొత్తగూడెం నుంచి క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలు సేకరించారు. చదవండి: Stegosaurus: గుడ్డు నుంచి ఆకాశానికి.. నెల రోజుల క్రితం ఊట్లపల్లిలో.. నెల రోజుల క్రితం మండలంలోని ఊట్లపల్లి గ్రామం వద్దగల మద్యం దుకాణంలో కూడా గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. సుమారు రూ. లక్ష విలువైన మద్యం అపహరించారు. కాగా ఈ రెండు చోరీ ఘటనపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేయలేదు. నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు మద్యం చోరీ జరగడం గమనార్హం. చోరీ ఘటనలపై స్థానిక ఎస్సై చల్లా అరుణను ‘సాక్షి’ వివరణ కోరగా..చోరీ జరిగినట్లు సమాచారం ఉందని, కానీ వాటిపై బాధితుల నుంచి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు రాకపోవడంతో కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు. -
వైరల్: నో బీర్, ఓన్లీ విస్కీ.. వైన్ షాప్లో మందేసిన కోతి
Monkey Alcohol Drinking Video: కోతులు చేసే చేష్టలు మామూలుగా ఉండవు. ఒక్కసారి గుంపులుగా జనావాసంలోకి చొరబడ్డాయంటే అవి చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక ఇంట్లోకి వచ్చాయంటే వస్తువులన్నీ చిందరవందర అవ్వాల్సిందే. ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్లు ఓ కోతి ఏకంగా ఓ వైన్ షాప్లోకే దూరింది. అక్కడున్న బీర్, వైన్ బాటిళ్లను పక్కకు పెట్టి విస్కీ బాటిల్ను టార్గెట్ చేసింది. ఇంకేముంది హీరోలా విస్కీ బాటిల్ను చేతులోకి తీసుకొని దర్జాగా తాగేసింది. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ మాండ్లా జిల్లాలో చోటుచేసుకుంది. బహమని బంజార్ గ్రామంలో ఓ మద్యం దుకాణం ఉంది. అక్కడికి కొన్ని రోజుల నుంచి ఓ కోతి తరుచుగా వస్తోంది. ఖాళీగా పడి ఉన్న మద్యం సీసాల్లో మిగిలిపోయిన మద్యం చుక్కలను తాగేది.అయితే, ఓ రోజు ఆ కోతి ఏకంగా వైన్ షాపులోకే ఎంటర్ అయ్యింది. మద్యం దుకాణంలోకి ప్రవేశించిన కోతి కాటన్ తెరిచి అందులోంచి వైన్ బాటిల్ను లాక్కుంది. తరువాత ఓ టెబుల్పై దర్జాగా కూర్చొని విస్కీ బాటిల్ మూతను నెమ్మదిగా తీసేందుకు ప్రయత్నిస్తుంది. చివరికి మూత ఒపెన్ అవ్వడంతో ప్రొఫెషనల్ మందుబాబులా గటాగటా తాగేసింది. అయితే కోతి షాప్లోకి చొరబడినప్పటికీ యాజమాని ఎలాంటి కంగారు పడలేదు. అతని పని తను చేసుకుంటూ ఉన్నాడు. మధ్యలో షాప్ యాజమాని కోతికి బిస్కెట్ కూడా ఇచ్చేందుకు ప్రయత్నించగా వద్దని తిరస్కరించి బాటిల్ మొత్తం ఖాళీ చేసి కూర్చుంది. కాగా, కోతి మద్యం సేవించడాన్ని వైన్ షాప్కు వచ్చిన పలువురు వీడియో తీశారు. ఆ వీడియోనుఓ వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అదికాస్తా వైరల్గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. కోతి విస్కీ తాగడంపై ఆశ్యర్యానికి గురవుతున్నారు. pic.twitter.com/RCUGLzzkcO — sudhanshu maheshwari (@smaheshwari523) July 14, 2021 -
మద్యం దుకాణంలో ఎలుకల రచ్చ.. 12 వైన్ బాటిళ్లు తాగేశాయ్!
ఇంట్లో ఎలుకలు ప్రవేశించాయంటే అవి చేసే గోల అంతా ఇంతా కాదు.. వంటలు, బియ్యం.. ఇలా అన్నిట్లో నేనున్నానంటూ చేయి పెట్టి చిందర వందర చేస్తాయి. అంతేగాక ఎంతో ఇష్టంగా కొనుకున్న కొనుకున్న దుస్తులను సైతం దేనికి పనికిరాకుండా చింపి నాశనం చేస్తాయి. ఏ ఇంట్లోనైనా ఎలుకలు ఒంటరిగా ఉండవు. తమతోపాటూ...పెద్ద ఫ్యామిలీని వెంట తెస్తాయి. వాటిని ఇంట్లో నుంచి తరిమేయడం ఓ సవాలు లాంటిది. అప్పటి వరకు ప్రశాంతత ఉండదు. అయితే ఇటీవల ఎలుకల నోటికి కొత్త రుచి కావాల్సి వచ్చిందేమో. వైన్ షాప్లోకి దూరి ఏకంగా 12 వైన్ బాటిళ్లను ఎలుకలు ఖాళీ చేశాయి. ఈ విచిత్ర ఘటన తమిళనాడులో నీలగిరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. గుడలూర్ సమీపంలోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న టాస్మాక్ మద్యం దుకాణాన్ని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. తాజాగా కోవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో మద్యం షాపులను ఓపెన్ చేశారు. ఈ క్రమంలో సోమవారం వైన్ షాప్ తెరిచి చూసేసరికి 12 ఖాళీ వైన్ బాటిళ్లు ఒపెన్ చేసి ఉండటంతో తమిళనాడు ఎక్సైజ్ సిబ్బంది షాక్ తిన్నారు. బాటిళ్ల మూతలపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండంటంతోపాటు.. అందులోని వైన్ ఖాళీ అయ్యింది. ఈ 12 మద్యం సీసాల మూతలను ఎలుకలే కొరికినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు గుర్తించారు. సిబ్బంది సమాచారం మేరకు టాస్మాక్ సీనియర్ అధికారులు దర్యాప్తు చేసి.. ఎలుకలే ఈ పని చేశాయని నిర్దారించారు. లాక్డౌన్ వల్ల చాలాకాలం ఈ మద్యం దుకాణం మూసివేయడంతో షాపులో ఎలుకలు తిరగడం ప్రారంభించాయని, బాటిళ్ల మూతలను కొరికి ఎలుకలు మద్యం తాగేశాయని తమిళనాడు ఎక్సైజ్ శాఖ సీనియర్ అధికారి అన్నారు. ఎలుకలు ఖాళీ చేసినవైన్ విలువ 1500 ఉంటుందని తెలిపారు. కేవలం వైన్ బాటిల్స్నే టార్గెట్ చేశాయని, బీర్ లేదా మిగతా మద్యం సీసాలను అసలు ముట్టుకోలేదన్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు.. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నారని, ఏమాత్రం కిక్కుఏక్కిందో అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు. -
వైన్ షాపుల్లో నిధుల గోల్ మాల్ పై విచారణకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
-
వామ్మో.. తాగుబోతు ఎంత పనిచేశాడు!
సాక్షి, బంజారాహిల్స్: బోరబండ ఎస్పీఆర్హిల్స్ సమీపంలోని కాకతీయ వైన్స్లో మద్యం తీసుకునేందుకు గోపి అనే డ్రైవర్ శుక్రవారం సాయంత్రం వెళ్లాడు. మద్యం ధరకు అనుగుణంగా క్యూఆర్ కోడ్తో డబ్బులు చెల్లించేందుకు యత్నిస్తుండగా ఆ మిషన్ రెండు నిమిషాలు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. ఇంత ఆలస్యమా అంటూ గోపి మద్యం సీసా ఇచ్చిన సేల్స్మెన్ రంజిత్పై అదే సీసాతో తలపై దాడి చేశాడు. దీంతో రంజిత్ తల పగలడంతో ఆగ్రహానికి లోనైన వైన్షాప్ ఇతర సిబ్బంది మూకూమ్మడిగా గోపిని కొట్టారు. రంజిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే తనపై కూడా దాడి చేశారంటూ గోపి కూడా శనివారం ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా పరిశీలిస్తున్నారు. -
అప్పులు తీర్చేందుకు దొంగయ్యాడు!
సాక్షి, మదనపల్లె టౌన్: మద్యం షాపులో చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆ షాపులో పనిచేసే సేల్స్మెన్ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మదనపల్లె–పుంగనూరు రోడ్డులోని ప్రభుత్వ మద్యం దుకాణం (దినేష్ వైన్స్)లో ఈ నెల 28న అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడటం విదితమే. కేసు నమోదు అనంతరం సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్కుమార్, క్లూస్ టీం బృందం సేకరించిన ఆధారాలతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు బుధవారం డీఎస్పీ రవిమనోహరాచారి స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వెల్లడించిన వివరాలు..మద్యం షాపు చోరీ కేసులో ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన పి.సుజిత్(23) ప్రధాన నిందితుడు అని తేలింది. ఇతడు మద్యం షాపులో సేల్స్మెన్గా పనిచేస్తూ చోరీకి స్కెచ్ వేశాడు. నాలుగు రోజులుగా బ్యాంకులో మద్యం షాపు సొమ్మును జమ చేయకపోవడంతో దీనిని చోరీ చేసి అప్పులు తీర్చాలని తలపోశాడు. అదే ఊరులో ఉంటున్న తన స్నేహితుడు ఎస్. అబ్దుల్ కలాం అలియాస్ రంజాని(20) సహకారం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి 28న రాత్రి మద్యం షాపు తాళాలు చాకచక్యంగా తెరచి క్యాష్ చెస్ట్లాకర్తో పాటు రూ.8,99,720 లక్షల నగదును చోరీ చేశారు. ఆ తర్వాత లాకర్ను మాత్రం తురకపల్లె సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో పడేశారు. చోరీ సొమ్ముతో అప్పులు తీర్చడానికి రుణదాతల వద్దకు వెళ్తుండగా స్థానిక సీటీఎం రోడ్డులోని తట్టివారిపల్లె జంక్షన్లో వారిని సీఐ, ఎస్ఐల బృందం మంగళవారం ఉదయం అరెస్ట్ చేసింది. కేసును ఛేదించిన సిబ్బందికి డీఎస్పీ రివార్డులు ప్రకటించారు. నాన్న కోసం..! ఆరోగ్యవరం తురకపల్లెకు చెందిన ప్రశాంత్ బాబుకు ఏకైక కుమారుడు పి.సుజిత్. డిగ్రీ వరకు చదివాడు. ప్రశాంత్బాబు అనారోగ్యం బారిన పడడంతో చేసిన వైద్యపరీక్షల్లో గుండె వాల్వులు చెడిపోయాయని తేలింది. దీంతో డాక్టర్లు గుండెకు స్టంట్ ఏర్పాటు చేశారు. సుజిత్ చేసిన అప్పులకు తోడు తన తండ్రి గుండె ఆపరేషన్కు చేసిన అప్పులు తీర్చడం భారమయ్యాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్మెన్ ఉద్యోగం పొందాడు. వచ్చే జీతంతో అప్పులు తీర్చలే క, మద్యం దుకాణం సొమ్ముపై కన్నేశాడు. చోరీకి స్కెచ్ వేసి, చివరకు అరెస్టయి, తన స్నేహితుడిని కూడా కటకటాల పాల్జేశాడు. -
హైదరాబాద్లో వైన్ షాపుల ఇష్టారాజ్యం
-
చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?: భట్టి
సాక్షి, హైదరాబాద్: ‘పోలీస్ కాపలా ఉంచినంత మాత్రాన వైన్షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని, తాగుబోతులకు కరోనా వచ్చి చచ్చినా పర్వాలేదనుకుంటున్నారా?’అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో మద్యం దుకాణాలకు అనుమతిస్తే తాగుబోతులు భౌతికదూరం పాటిస్తారా? అని నిలదీశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్బాబుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వైన్స్ ఓపెన్ చేయడంతో ఇన్ని రోజుల శ్రమ, వైద్యులు, పోలీసులు పడ్డ కష్టం వృథా అయిందని ఆయన మండిపడ్డారు. మాజీ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ.. ఇసుక సరఫరా వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందనే ఆందోళన ఉందని, ఇసుక సరఫరా చేసే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాబోయే రెండు వారాలు కేసుల సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
కేసీఆర్ చిత్రపటానికి మందుబాబుల పాలాభిషేకం
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో దాదాపు 45 రోజులు తర్వాత, బుధవారం దుకాణాలు తెరుచుకోవటంతో మద్యం ప్రియుల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. చాలా రోజుల తర్వాత ‘చుక్క’ దొరకబోతుందన్న సంతోషంతో మందుబాబులు ఉదయం నుంచే వైన్స్ ముందు క్యూ కట్టారు. ఎండను కూడా లెక్కచేయలేదు. మద్యం దొరికే వరకు ఇంటికి వెళ్లేది లేదని తేల్చి చెబుతూ క్యూ లైన్లో నిల్చున్నారు. ఒక్కో వైన్ షాపు వద్ద రెండు, మూడు క్యూలైన్లు దర్శమించాయి. (చదవండి : హైదరాబాద్లో వైన్స్ ముందు మహిళల క్యూ..) ఇక చాలా రోజుల తర్వాత చుక్క దొరకడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పలు చోట్లు మద్యం బాటిళ్లు పట్టుకొని ఆనందంతో చిందులేశారు. పలు వైన్స్ షాపులకు పూల మాల వేసి కొబ్బరి కాయలు కొట్టారు. ఇక ఒక చోట అయితే ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో ప్రకారం.. కనకదుర్గ వైన్స్ దగ్గర సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూల మాలవేసి పాలాభిషేకం చేశారు. అనంతరం జై కేసీఆర్ అంటూ మందుబాబు నినాదాలు చేశారు. అయితే ఇది తెలంగాణలోని ఏ ప్రాంతంలో జరిగిందో వివరాలు తెలియరాలేదు. కాగా, తెలంగాణ వ్యాప్తంగా బుధవారం ఉదయం 10 గంటలకు మద్యం షాపులు తెరుచుకున్న విషయం తెలిసిందే. వినియోగదారులు భౌతికదూరం పాటిస్తూ.. క్యూ లైన్లలో ఉన్నారు. ధరలు పెంచినా అమ్మకాల్లో మాత్రం తేడా కనిపించలేదు. పైగా మళ్లీ వైన్ షాపులు మూసివేస్తారోనని ఎక్కువగానే మద్యం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. పలు చోట్ల మహిళలు కూడా మద్యం కోసం లైన్లలో వేచి ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని కొండాపూర్, పంజాగుట్ట, మాదాపూర్, ఫిలింనగర్, రాయదుర్గం, హైటెక్సిటీలో మద్యం కోసం మహిళలు, సాఫ్ట్వేర్ యువతులు క్యూ కట్టి మద్యం కొనుగోలు చేశారు. -
కూచిపూడి పోలీస్స్టేషన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా : జిల్లాలోని కూచిపూడి పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు.. కూచిపూడిలో ఉన్న వైన్షాప్ వద్ద మద్దాల కోటేశ్వరరావుపై సోమవారం రాత్రి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడడంతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడి ఉన్నాడు. కాగా దాడిలో మృతి చెందిన కోటేశ్వరరావు మొవ్వ మండలం అయ్యంకి గ్రామానికి చెందినవాడు. కోటేశ్వరరావుపై దాడి చేసిన వ్యక్తులే ఆయన మృతికి కారణమంటూ అతని బంధువులు ఆరోపించారు. వీరికి మద్దతుగా అయ్యంకి గ్రామస్తులు మంగళవారం పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తుకు చేరుకొని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలంటూ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఓటు హక్కు వినియోగించుకున్నతర్వాత సీఎం జగన్ రియాక్షన్
అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
ఓటు హక్కు వినియోగించుకున్న అల్లు అర్జున్, ఎన్టీఆర్
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
ఓటేసిన సీఎం జగన్
'ఆమె ధర్మపత్ని'! గృహస్థాశ్రమ వైశిష్ట్యం!!
పోలింగ్ ప్రారంభం.. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..
నాలుగో దశ ఎలక్షన్స్.. ఆసక్తికర విషయాలు
మన లక్ష్యం ఏమిటి? అందుకు చేయవలసిన పనేమిటి?
అందరూ తప్పకుండా ఓటు వేయండి..సీఎం జగన్ ట్వీట్
తప్పక చదవండి
- గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
- నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
- నయవంచనకు చెక్ పెడదాం
- ఈసీ ద్వంద్వ వైఖరి
- జనస్వామ్యమా! జయీభవ!!
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement