-
39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిస్క్వాలిఫై.?
-
యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఏడో గ్యారంటీ
-
బీజేపీకి మాజీ ఎమ్మెల్యే యెన్నం రాజీనామా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్ మాజీ శాసనసభ్యుడు, బీజేపీ నేత యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత సాధారణ ఎన్నికల తర్వాత పార్టీకి అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న యెన్నం తన రాజీనామాను సోమవారమిక్కడ ప్రకటించారు. పార్టీ ద్వారా వచ్చిన అన్ని స్థాయిల్లోని బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డికి ఫ్యాక్సు ద్వారా రాజీనామా లేఖ పంపానని విలేకరులతో చెప్పారు. ఏ లక్ష్యాల కోసం తెలంగాణ సాధించామో వాటిని ఎవరూ పట్టించుకోవడంలేదని విమర్శించారు. అస్తవ్యస్త పాలన, లక్ష్యంలేని విధానాలను ఓ తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారునిగా చూస్తూ కూర్చోలేక ప్రజాక్షేత్రంలో పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ‘ఒక కుటుంబపాలన బంగారు సంకెళ్ల నుంచి తెలంగాణ విముక్తి కోసం మరో పోరాటం అవసరం. 2001 నాటి పరిస్థితులే మరోసారి కొత్తరూపంలో తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి. ఇప్పటిదాకా ప్రాంతేతరులపై ఎక్కుపెట్టిన ఉద్యమాస్త్రాన్ని ప్రాంతీయులపై సంధించాల్సిన సమయం ఇదే. విలువలతో కూడిన రాజకీయం కోసం, పేదల అవసరాలు తీర్చే పరిపాలనకోసం, స్థూలంగా మెజారిటీ ప్రజలకు అధికారం కోసం ఉద్యమిస్తా. దీనికోసం ప్రజావ్యతిరేక ప్రభుత్వపాలనపై వ్యక్తులుగా, సంఘాలు, సంస్థలుగా, పార్టీలుగా ఉన్న అందరినీ సమాయత్తపరిచే బాధ్యత తీసుకుంటున్నా’ అని యెన్నం వెల్లడించారు. ఉద్యమ ఫలాలను అనుభవిస్తున్న ఉద్యోగసంఘాల నేతలు, పార్టీలన్నీ పోరాటయోధులను విస్మరిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ అమరులను బంగారు తెలంగాణ సాధన కార్యానికి విఘ్నేశ్వరుల్లాగా స్మరించుకోవాలన్నారు. తెలంగాణ రక్షణకోసం ప్రారంభిస్తున్న ఉద్యమంలో మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డితో పాటు చాలామంది నాయకులు ఉంటారని పేర్కొన్నారు. -
బీజేపీకి యెన్నం రాజీనామా
హైదరాబాద్ : మహబూబ్నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి సోమవారం బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీతో పాటు సభ్యత్వానికి రాజీనామా చేసిన యెన్నం తన లేఖను తెలంగాణ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ప్రత్యామ్నాయాలు కాలేవన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారు కేసుల్లో ఇరుక్కుని కోర్టులు చుట్టు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని యెన్నం తెలిపారు. కాగా 2014 ఎన్నికల్లో కొద్ది ఓట్ల తేడాతో ఆయన ఓటమి పాలయిన విషయం తెలిసిందే. -
'వెంకయ్యపై వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా'
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. బుధవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటే తనకు ముఖ్యమని, ఆ తర్వాతే ఏదైనా అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే తాను తెలంగాణలో చేరిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడుపై మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. ఆ యువ ఎమ్మెల్యే వ్యాఖ్యల పట్ల బీజేపీ అగ్రనాయకత్వం వెంటనే స్పందించింది. అందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులోభాగంగా రాజనాథ్ సింగ్ ఇప్పటికే యెన్నం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వెంకయ్యనాయుడికి వెంటనే శ్రీనివాస రెడ్డి క్షమాపణలు చెప్పించాలని కిషన్ రెడ్డిని రాజనాథ్ సింగ్ ఆదేశించారు. అయితే ఆ విషయంలో వెంకయ్య వెంటనే జోక్యం చేసుకుని, క్షమాపణలు అవసరం లేదని తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేసేలా యెన్నం శ్రీనివాస్ రెడ్డికి హితబోధ చేయాలని కిషన్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. ఆ క్రమంలో భాగంగానే వెంకయ్యనాయుడిపై చేసిన వ్యాఖ్యాలను వెనక్కి తీసుకుంటున్నట్లు యెన్నం శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement