రాయచోటి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ రెండోమారు అధికారంలోకి వస్తుందని రాజంపేట వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెఢ్డి మిథున్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డిలు ఽధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాయచోటి మండలం, యండపల్లె గ్రామంలో బోయనపల్లెలోని స్టేట్ సివిల్ సప్లైస్ డైరెక్టర్ పోలు సుబ్బారెఢ్డి నివాసంలో వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ఐదేళ్లపాటు పాలన అందించిన జగన్ సంక్షేమ పాలనకు ఎక్కడ చూసినా జనం జేజేలు పలుకుతున్నారన్నారు. బడుగు, బలహీన వర్గాల హృదయాలలో సీఎం జగన్ ఉన్నారన్నారు. ఎన్నికల హామీల అమలులో సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. జగనన్న విడుదల చేసిన మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదన్నారు. ప్రజలకు మరింత సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందాలంటే మరోమారు జగన్ను సీఎంను చేయాలని వారు కోరారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని మిథున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు బసిరెడ్డి సిద్దారెడ్డి, మండల బీసీ నాయకుడు పల్లపు రమేష్, సింగిల్ విండో అధ్యక్షుడు బసిరెడ్డి సుబ్బారెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అమరనాథరెడ్డి, దివాన్, కౌన్సిలర్లు కసిరెడ్డి వెంకటనరసింహారెఢ్డి, చంద్రశేఖర్, మాధవరం రమేష్ రెఢ్డి, సైకం రమేష్ రెడ్డి, యర్ర బయన్న, హరినాథ రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆనందరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నల్లబయన్న, అమర తదితరులు పాల్గొన్నారు.
జగన్ సంక్షేమ పాలన కు అండగా ప్రజలు నిలవాలి
ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు