నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు | Sakshi
Sakshi News home page

నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్‌ సూచీలు

Published Tue, May 7 2024 3:37 PM

Stock Market Rally On Today closing

దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 141 పాయింట్లు నష్టపోయి 22,301 వద్దకు చేరింది. సెన్సెక్స్‌ 383 పాయింట్లు దిగజారి 73,511 వద్దకు చేరింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, టెక్‌మహీంద్రా, నెస్లే, విప్రో, టీసీఎస్‌, ఐటీసీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, భారతీ ఎయిర్‌టెల్‌ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.

పవర్‌గ్రిడ్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, యాక్సిస్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మా కంపెనీ షేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.

(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)

Advertisement
 
Advertisement
 
Advertisement