ఆరు గ్యారంటీలతో ప్రజాసంక్షేమ పాలన | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలతో ప్రజాసంక్షేమ పాలన

Published Fri, Apr 19 2024 1:50 AM

మాట్లాడుతున్న వెంకటేశ్వర్లు
 - Sakshi

డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు

జనగామ: సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలతో ప్రజాసంక్షేమ పాలన అందిస్తున్నారు.. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్‌ పార్టీ భువనగి రి పార్లమెంట్‌ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తు న్న చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించాలని ఉమ్మడి రాష్ట్ర మాజీ ప్రధాన సమాచార కమిషనర్‌ డాక్టర్‌ వర్రె వెంకటేశ్వర్లు కోరారు. గురువారం సమాచార హక్కు వికాస సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి, ప్రేమ సేవా సదన్‌ డైరెక్టర్‌ మహమ్మద్‌ ఖుర్షీద్‌ పాషా అధ్యక్షతన స్థానిక ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ జీఓలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా ఆన్‌లైన్‌కు శ్రీకారం చుట్టిన సీఎంకు అభినందలు తెలిపారు. సమాచార హక్కు వికాస సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రమాద కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కావాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. సీనియర్‌ జర్నలిస్టు, సమాచార హక్కు వికాస సమితి ముఖ్య సలహాదారులు కన్న పరశురాములు, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఎన్‌.రవి, ఉపాధ్యక్షులు శ్రీను, శ్రీకాంత్‌, నాగరాజు, వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు పూర్ణచందర్‌, సీనియర్‌ న్యాయవాది ఉమాపతి, మాజీ ఎంపీపీ గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement