● బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం ● బస్తర్ మహరాజు, కాకతీయుల వంశ వారసుడు కమల్చంద్ర
వైరా/ఖమ్మం మామిళ్లగూడెం: కేంద్రంలో మరో మారు బీజేపీ అధికారంలోకి రావడం.. మోదీ ప్రధాని కావడం ఖాయమని బస్తర్ మహరాజు, కాకతీయుల వంశ వారసుడు కమల్చంద్ర భంజ్దేవ్ స్పష్టం చేశారు. ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు తరఫున వైరాలో నిర్వహించిన ప్రచార ర్యాలీ తో పాటు ఖమ్మంలో నిర్వహించిన కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొనగా.. బీజేపీ, టీడీపీ, జనసేన, ఎమ్మార్సీఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. వైరాలో నిర్వహించిన ర్యాలీలో మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, అభ్యర్థి వినోద్రావుతో కలిసి పాల్గొన్న కమల్చంద్ర మాట్లాడుతూ దేశంలో బీజేపీ అధికారంలోకి రానున్న నేపథ్యాన ఖమ్మంలోనూ వినోద్రావును గెలిపిస్తే ఉమ్మడి జిల్లా అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రూ.12 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి చేసిన ఘనత మోడీదేనని తెలిపారు. అనంతరం అభ్యర్థి వినోద్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలు నమ్మకపోవడంతో ఈ ఎన్నికల్లో మాయ చేసేందుకు రిజర్వేషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తనను గెలిపిస్తే పాయాయిల్ బోర్డు సాధించడంతో పాటు సింగరేణి గనుల అనుమతులు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి పాటుపడతానని తెలిపారు. అనంతరం వైరా శాస్తానగర్లోని అయ్యప్ప స్వామి క్షేత్రంలో పూజలు చేశారు. ఇక ఖమ్మంలో నిర్వహించిన కమ్మ ఆత్మీయ సమ్మేళనంలో కూడా బీజేపీ అభ్యర్థి వినోద్రావు, బస్తర్ మహరాజు కమల్చంద్ర భంజ్దేవ్ పాల్గొనగా... బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు టీడీపీ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ప్రకటించారు. ఈసమావేశాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి, బీజేపీతో పాటు వివిధ పార్టీల నాయకులు నున్నా రవికుమార్, శ్యాంరాథోడ్, కోటేశ్వరరావు, రంగా కిరణ్, భద్రయ్య, వెంకటకృష్ణ, హరీశ్చంద్ర, వరలక్ష్మి, కళ్యాణం లక్ష్మీపతి, కొండబాల కరుణాకర్, మల్లెంపాటి అప్పారావు గుత్తా సీతయ్య నున్నా నవీన్, పృథ్వీ, లక్ష్మణ్, చావా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.