గోదావరిఖని/గోదావరిఖనిటౌన్: స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక దుర్గానగర్ ఫంక్షన్హాల్లో జరిగిన స్వర్ణకారుల నూతన కార్యవర్గ ప్రమా ణ స్వీకారానికి ఆయన హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్, బీజేపీకి ఓటుద్వారా బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్పొరేటర్ బాల రాజ్కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు రంగు శ్రీనివాస్, నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కొండపర్తి నరహరి, ప్రధాన కార్యదర్శి కట్ట నగేశ్కుమార్, గౌరవ అధ్యక్షుడు సత్యనారాయణ, కోశాధికారి కట్ట శ్రీధరాచారి, ప్రతినిధులు ఉప్పుల లక్ష్మీనర్సయ్య, గుగ్గిళ్ల రవీందరాచారి, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, ప్రకాశ్, నజీముద్దీన్, శివ, ముబీన్ తదితరులు పాల్గొన్నారు.