వల్లూరు : పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అష్టోత్తర కలశాభిషేకాన్ని బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు అఖిల్ దీక్షితులు ఉదయం స్వామికి విశ్వక్సేన పూజ, పంచామృతాభిషేకం, పారమాత్మక హోమం నిర్వహించారు. 108 కలశాలను ఏర్పాటుచేసి నదీజలాలు, విశేష ద్రవ్యాలతో నింపి 108 మంది దేవతలను ఆవాహన చేశారు. అనంతరం కలశాలలోని ద్రవ్యాలతో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవ స్వామి ఉత్సవ మూర్తులను అభిషేకించారు. రాత్రి యాళీ వాహనంపై స్వామిని కొలువుంచి గ్రామోత్సవం జరిపారు. వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో ఽఅర్చకులు శ్రీనివాస మూర్తి స్వామికి రుద్రాభిషేకం, శ్రీచక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. తిరుచ్చి వాహన సేవ నిర్వహించారు. కాగా .. గురువారం ఉదయం లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో చందనోత్సవం నిర్వహిచనున్నారు.