కృష్ణాయపాలెం (మంగళగిరి రూరల్), న్యూస్లైన్: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడే సత్తా లేక భారతీయ జనతాపార్టీతో పొత్తుపెట్టుకుందని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు.
మంగళగిరి మండలంలోని ఆయా గ్రామాల్లో సోమవారం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)తో కలసి ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. కృష్ణాయపాలెంలో బాలశౌరి మీడియాతో మాట్లాడారు. టీడీపీకి సొంతగా పోటీచేసి గెలవగలమనే విశ్వాసమే వుంటే బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తాను చేసిన చారిత్రాత్మక తప్పిదం అని గతంలో చంద్రబాబు చెప్పారని, అయితే నేడు ఆ తప్పు ఏమైంది.. ఆయన విశ్వసనీయత ఏమైంది.. విలువలు ఏమయ్యాయని బాలశౌరి ప్రశ్నించారు.
ప్రజల్లో విశ్వాసం కోల్పో యి బీజేపీ వారి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం చంద్రబాబుకు రావడం సిగ్గుచేటన్నారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ దెబ్బకు ఓడిపోతాననే భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తుపెట్టుకున్నారని విమర్శించారు. టీడీపీ బీజేపీల పొత్తుతో రాష్ట్రంలోని మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలంతా ఏకమవుతున్నారని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్లను అభిమానించే ప్రతి ఒక్కరూ వైఎస్సార్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలంతా గమనిస్తూనే వున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై జగన్ను అన్యాయంగా కేసుల్లో ఇరికించి 16 నెలల పాటు జైల్లో పెట్టినా కడిగిన ముత్యంలా బెయిలుపై బయటకు వచ్చారని ఆయన గుర్తుచేశారు.
రానున్న ఎన్నికల్లో ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ను, ఆయన తనయుడు వైఎస్ జగన్ను, విజయమ్మను, షర్మిలను గుర్తుంచుకుని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బాలశౌరి కోరారు. రానున్న ఎన్నికల్లో అంతిమ విజయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు.
టీడీపీకి సత్తాలేకే బీజేపీతో పొత్తు
Published Tue, Apr 8 2014 1:28 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
తప్పక చదవండి
- అమిత్ షాను కలిసిన ఈటల.. బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు?
- నిన్ను టీవీలోనే చాలామంది చూశారు.. ఇంకా ఓటీటీలో కష్టమే అన్నారు
- ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
- బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు
- వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు హేయం : సామినేని
- ధరణిలో గోల్మాల్.. మణికొండలో భారీ భూకబ్జా!
- వరల్డ్కప్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. సచిన్ ట్వీట్ వైరల్
- చదువుకు దాచిన డబ్బులు... సైబర్ నేరగాళ్ల పాలు!
- మోదీ కేబినెట్లో ఇదొక సర్ప్రైజ్ ప్యాక్!
- ఒకే రన్వేపై రెండు విమానాలకు అనుమతి ఉందా?
Advertisement