రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, క్రిసిల్ విశ్లేషణ
► ప్రతికూల అవుట్లుక్ ఇచ్చిన ఫిచ్
► మొండిబకాయిల సమస్య తీవ్రమన్న క్రిసిల్
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్కు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలు.. ఫిచ్, క్రిసిల్ షాకిచ్చాయి. అంతర్జాతీయ దిగ్గజం ఫిచ్ రేటింగ్స్ భారత్ బ్యాంకులకు ప్రతికూల ఔట్లుక్ ఇవ్వగా, మొండిబకాయిల(ఎన్పీఏ) భారం తీవ్రంగా ఉందని క్రిసిల్ పేర్కొంది. అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం స్టాండర్డ్ అండ్ పూర్స్కు క్రిసిల్లో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. తగినంత తాజా మూలధన నిధుల కల్పన విషయంలో బలహీనతలనూ రెండు సంస్థలూ ప్రస్తావించాయి.
ఫిచ్ నివేదికలో ముఖ్యాంశాలు...
► తాజా మూలధన పరిస్థితి కల్పన విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. అధిక మొండిబకాయిలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం దీనికి కారణం. ఆయా అంశాలు బ్యాంకుల లాభదాయకతపై కూడా ప్రభావం చూపుతాయి. మా నెగిటివ్ అవుట్లుక్ ప్రధాన కారణాల్లో ఇదొకటి.
► వచ్చే 12 నెలల్లో రుణ నాణ్యత సవాలుగా కొనసాగవచ్చు. విద్యుత్రంగంలో ఇబ్బంది, వ్యవసాయ రుణ మాఫీలు, చిన్న తరహా పరిశ్రమల ప్రతికూల ధోరణి వంటి అంశాలు దీనికి కారణం.
► తాజా మూలధనానికి సంబంధించి అంతర్జాతీయ బాసెల్ 3 ప్రమాణాలను చేరుకోడానికి 2019 మార్చి నాటికి భారత్ బ్యాంకింగ్కు 65 బిలియన్ అమెరికా డాలర్లు అవసరం. దీనిలో 90 శాతం ప్రభుత్వ రంగ బ్యాంకులకే అవసరం అవుతుంది.
► ఎన్పీఏలు, బలహీన ప్రొవిజనింగ్ కవర్, పేలవ రుణ వృద్ధి వంటి అంశాల నేపథ్యంలో బ్యాంకింగ్ రంగానికి ప్రభుత్వం నుంచి మరింత మూలధన నిధుల సాయం అందాలి.
► రుణ నాణ్యత విషయంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ బ్యాంకులకన్నా, ప్రైవేటు రంగం పరిస్థితి బాగుంది.
► మొండిబకాయిల సమస్య పరిష్కారానికి రిజర్వ్ బ్యాంక్ తీసుకుంటున్న చర్యలు కొంత సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనబడుతోంది.
► 2016–17 ఏడాదిలో రుణ వృద్ధి 4.4 శాతానికి పడిపోయింది. ఇదే ధోరణి సమీప భవిష్యత్తులోనూ కొనసాగే వీలుంది.
క్రిసిల్ ఏమంటోందంటే..
► వచ్చే ఏడాది మార్చి ముగిసే నాటికి వార్షికంగా మొండిబకాయిల భారం 1% పెరిగి (రుణాల్లో) 10.5 శాతానికి చేరే వీలుంది.
► ఒత్తిడిలోఉన్న కొన్ని రుణాలనూ పలు బ్యాంకులు మొండిబకాయిలుగా ప్రకటించే అవకాశం ఉండటం ఆందోళనకరం.
► ఒత్తిడిలో ఉన్న రుణాలు ప్రధానంగా మౌలికరంగం, విద్యుత్, ఇంజనీరింగ్, నిర్మాణ రంగాలకు మంజూరు చేసినవే. ఈ రంగాల పునరుద్ధరణ తక్షణ అవసరం.
► దివాలా చట్టం అలాగే ఇతర పలు వ్యవస్థాగత పథకాల ద్వారా ఒత్తిడిలో ఉన్న రుణ సంబంధ అంశాల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవాలి.
► నిజానికి గడచిన రెండేళ్లలో రికవరీలు చాలా తక్కువగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏల్లో తగ్గుదల అధిక రైటాఫ్స్ వల్లనే.
మూడీస్ భిన్నం...
కాగా ఫిచ్, క్రిసిల్ అభిప్రాయం మరో అంతర్జాతీయ దిగ్గజం– మూడీస్కన్నా కొంత భిన్నంగా ఉండటం గమనార్హం. దాదాపు పక్షం రోజుల క్రితం మూడీస్ – భారత్ బ్యాంకింగ్కు ‘స్టేబుల్’ అవుట్లుక్ను ఇస్తున్నట్లు పేర్కొంది. రుణ నాణ్యత పెంపునకు చర్యలు బాగున్నాయనీ, నిర్వహణ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, దీనితో దేశ బ్యాంకింగ్ వ్యవస్థకు స్టేబుల్ అవుట్లుక్ను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. తమ రేటింగ్లో ఉన్న 15 బ్యాంకుల్లో పదింటికి కూడా స్టేబుల్ అవుట్లుక్ ఉన్నట్లు తెలిపింది. ఈ మొత్తం 15 బ్యాంకుల మొత్తం రుణ పరిమాణం వ్యవస్థలో 70 శాతం. అయితే వ్యవసాయం, చిన్న మధ్య తరహా పరిశ్రమల రుణ నాణ్యత విషయంలో బ్యాంకింగ్ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
భారత్ బ్యాంకింగ్ బాగోలేదు
Published Fri, Sep 15 2017 12:11 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం
నకలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి
సదరం స్లాట్.. సమస్య లేదిక..!
పుస్తకాలు వచ్చేశాయ్
నిర్మల్
తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్
స్వచ్ఛత అందరి బాధ్యత
పార్కింగ్ పరేషాన్
● ఫుట్పాత్ల ఆక్రమణ.. ఆపై బిజినెస్ ● చిరువ్యాపారులకు అద్దెకిస్తూ మరికొందరి అక్రమార్జన ● తరచూ తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య ● ఈ – చలాన్లతో వాహనదారుల జేబులు గుళ్ల ● రామగుండం కార్పొరేషన్ సహా బల్దియాల్లో దుస్థితి ఇది
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement