సాధారణమైన వ్యక్తుల కథ కేవలం అక్షరాలతో తయారవుతుంది. కాని యోగుల ఆత్మకథలు మాత్రం అనుభవాలతో కూడి తరువాతి తరాలకు మార్గదర్శకాలవుతాయి. చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. భారతీయ సంస్కృతికి గౌరవాన్ని ఇనుమడింపచేసి చరిత్రపుటల్లో నిలిచిన యోగిగురువులు పరమహంస యోగానంద. వీరు సనాతన ధ్యాన ప్రక్రియ అయిన క్రియాయోగాన్ని విశ్వవ్యాప్తం చేసి భారతీయ యోగసమున్నతిని విశ్వమంతా చాటారు.
భక్తిభావం... క్రియాయోగం
ఎంతోమంది మహనీయులకు జన్మనిచ్చిన గోరఖ్పూర్ ప్రపంచానికి అందించిన యోగిరత్నమే ముకుందలాల్ ఘోష్. బాల్యం నుంచే భక్తిభావాలతో యోగవిద్యను తెలుసుకునేందుకు పలువురు సాధువులను, సన్యాసులను కలుసుకునే సందర్భంలో పదిహేడో ఏట కోల్కతాలో ఓ సాధువును కలిశారు. వారే యుక్తేశ్వరగిరి. వీరివద్దే సన్యాసాశ్రమ స్వీకారం చేసి స్వామియోగానందగా గుర్తింపుపొందారు. క్రియాయోగ సాధనలో మెలకువలనూ నేర్చారు.
యోగవిద్యకు ప్రాచుర్యం
అనంతరం పశ్చిమబెంగాల్లో తొలి యోగ పాఠశాలను స్థాపించారు. ఆ మరుసటి ఏడాదే రాంచీలో మరో యోగ పాఠశాలను స్థాపించగా, తర్వాతి కాలంలో అదే భారత యోగా సత్సంగంగా రూపొందింది. పిమ్మట ప్రపంచవ్యాప్తంగా అనేకదేశాలలో పర్యటించి భారతీయ యోగవిద్యకు విశేష ప్రచారం కల్పించారు. వీరి ప్రభావంతో క్రియాయోగం వైపు మళ్లిన వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు.
వినోదం, విజ్ఞానం... కలిస్తే ఒక పుస్తకం
ఖండాంతర కీర్తికలిగిన యోగానంద మహానుభావుని జీవిత చరిత్రను ‘ఒక యోగి ఆత్మకథ’ పేరుతో గ్రంథరూపంలో ప్రకటించారు. ఈ గ్రంథం 20వ శతాబ్దపు 100 అత్యుత్తమమైన గ్రంథాలలో ఒకటిగా పేరుగాంచి నేటివరకు ఎన్నో ముద్రణలను పొందుతూ భారతదేశపు ప్రాచీన విజ్ఞానసారాన్ని ప్రపంచానికి అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఆరు భాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఎంతోమంది సత్యాన్వేషకుల ఆధ్యాత్మిక పిపాసను తీర్చుతోంది.
కృషియే సాధనం
మనిషి చేసే మానసిక ఆధ్యాత్మిక కృషికి మాత్రమే శాశ్వతమైన విలువ ఉంటుందనీ, మనిషి తనశక్తిని సరిగ్గా ఉపయోగించగలిగితే భౌతికంగా ఎదురయ్యే ఎన్నో అవరోధాలను జయించగలడనీ వీరి జీవితం ద్వారా మనం గ్రహించగలం. చెడును మంచితోనూ, విచారాన్ని సంతోషంతోనూ, క్రూరత్వాన్ని దయతోనూ, అజ్ఞానాన్ని జ్ఞానంతోనూ జయించగలమనే వీరి సందేశం శిరోధార్యం. మానవ అస్తిత్వపు అంతిమ మర్మాలను విడమరిచే యోగానందుల జీవితాన్ని అర్థం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టగలిగితే మనిషి జీవితం ఉన్నతమవుతుంది.
– అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని
వేదపండితులు
పరమహంస యోగానంద
Published Sun, Oct 20 2019 1:47 AM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా రజనీ..ఆ విషయంలో అందరికంటే టాప్..
కౌంటింగ్ ప్రక్రియకుపరిశీలకుల నియామకం
ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు
16కు తగ్గదు.. 30కి పెరగదు.. ఏసీతో ఎందుకలా?
అసలు విషయం చెప్పేసిన రష్మిక..గాల్లో తేలుతున్న రౌడీ బాయ్స్..
విద్యుదీకరణ త్వరగా పూర్తి చేయండి
వన్యప్రాణులపై తూటా..!
బెస్ట్ వేల్యూ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఏయూకు స్థానం
మరో ముగ్గురు అటవీఅధికారులపై వేటు
కేజీహెచ్కు కారు వితరణ
తప్పక చదవండి
- ఎలాన్ మస్క్కు నాగ్ అశ్విన్ రిక్వెస్ట్.. ఇండియాకు రావాలంటూ ట్వీట్
- India vs China: టగ్ ఆఫ్ వార్లో భారత బలగాల గెలుపు
- నన్ను వాళ్లు మోసం చేశారు: నటుడు జగపతిబాబు
- రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
- JC Diwakar Reddy: వేధించి, ఆపై సంతకాన్ని ఫోర్జరీ చేసి..
- ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
- స్కానింగ్ సెంటర్ వికృత చేష్టలపై కలెక్టర్ సీరియస్.. నలుగురి కమిటీ
- ప్రమాదమా.. గాయాలేవీ? ఖమ్మం కేసులో ట్విస్ట్
- ముస్లిం ఓటు బ్యాంకు ప్రభావమెంత? ఏ పార్టీకి ప్రయోజనం?
- 'గోరుముద్ద'కు తాజ్ రుచులు
Advertisement