-
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
అలియా సొగసులు.. జాన్వీ వయ్యారాలు.. జాక్వెలిన్ నాభి అందాలు
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ రోజు రోజుకు మరింత అందంగా రెడీ అవుతోంది. తాజాగా తన నాభి అందాలను చూపిస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్లీవ్ లెస్ బ్లౌజ్.. చీరకట్టులో కట్టిపడేస్తున్న అలియా భట్ అనసూయ విదేశాల్లో ట్రిప్ ఎంజాయ్ చేస్తుంది. వాషింగ్టన్లోని సిటీలో ఫుల్ డ్రెస్తో నవ్వూతూ రోడ్లు, హార్బర్లో దిగిన పిక్స్ని షేర్ చేసింది View this post on Instagram A post shared by Jacqueliene Fernandez (@jacquelienefernandez) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Olivia (@oliviakmorris) View this post on Instagram A post shared by Komalee Prasaad (@komaleeprasad) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) -
మెట్గాలా 2023: ప్రియాంక చోప్రా నెక్లెస్ ధర తెలిస్తే షాకవుతారు!
న్యూఢిల్లీ: న్యూయార్క్లో అంతర్జాతీయ అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ మెట్గాలా 2023లో తారలు సందడి గురించి ప్రత్యేకంగాచెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, తొలిసారి భర్త నిక్ జోనాస్ స్టైలిష్గా కనిపించారు. ఈ సందర్భంగా ఆమె ధరించిన ఖరీదైన డైమండ్ నెక్లెస్ హాట్టాపిక్గా నిలిచింది. మెట్గాలా 2023లో ప్రియాంక చోప్రా ప్రముఖ డిజైనర్ వాలెంటినో రూపొందించిన సెక్సీ బ్లాక్ గౌనులో చూపరులను కట్టి పడేసింది. ముఖ్యంగా బల్గారీకి చెందిన 11.6 క్యారెట్ డైమండ్ నెక్లెస్ను ధరించింది. ఈ డైమండ్ నెక్లెస్ విలువ రూ. 204 కోట్లు అని వార్త హల్చల్ చేస్తోంది. మరోవైపు ఈ ఈవెంట్ తర్వాత 25 మిలియన్ల బల్గేరియో ఫీషియల్ నెక్లెస్ వేలం వేయనున్నారు. (Realme 5th Anniversary Sale:స్మార్ట్ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లపై భారీ ఆఫర్) ప్రియాంక మూడోసారి ఈ ఈవెంట్లో తళుక్కు మనగా, తొలిసారిగా భర్తతలో కలిసి సందడి చేసింది. ఇద్దరూ బ్లాక్ అండ్వైట్ వాలెంటినో దుస్తుల్లో అలరించారు. ప్రియాంక ఇటీవల విడుదలైన యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిన అమెరికన్ వెబ్ సిరీస్కు సిరీస్ సిటాడెల్కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మెట్ గాలా రెడ్ కార్పెట్పై అలియా భట్ అరంగేట్రంతో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. అంతేకాదు రిలయన్స్అధినేత కుమార్తె ఇషా అంబానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోయారు. ఇంకా ఫ్లోరెన్స్ పగ్, అన్నే హాత్వే, జారెడ్ లెటోరా కిమ్ కర్దాషియాన్, జెన్నిఫర్ లోపెజ్, నవోమి కాంప్బెల్ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్యాషన్ షోలలో ఒకటి 'మెట్ గాలా'. ఈ ఈవెంట్లో ఫ్యాషన్ దుస్తులపై ఫోకస్ చేస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఫ్యాషన్ డిజైనర్ 2019లో మరణించిన ప్రసిద్ధ జర్మన్ ఫ్యాషన్ డిజైనర్ కార్ల్ లాగర్ఫెల్డ్. ఆయనకు ఈ ఈవెంట్ ఘన నివాళులర్పించింది. (దుర్భర జైలు జీవితం, భార్యతో విడాకులు.. అయినా వేల కోట్ల కంపెనీ!) Her $25 million @Bulgariofficial necklace is going to be auctioned off after #MetGala @priyankachopra pic.twitter.com/LK0otVUHea — SAMBIT ⚡ (@GirlDontYell) May 2, 2023 -
సూపర్ స్టార్ మహేష్ కూతురు సితారకు అలియా భట్ సప్రైజ్ గిఫ్ట్
-
సీక్రెట్గా నా ఫోటోలు తీశారు.. సరైనా పనేనా?.. అలియా ఫైర్
సినీ ప్రముఖుల పర్సనల్ విషయాలపై సామాన్యులకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఖాళీ సమయాల్లో వాళ్లు ఎం చేస్తారు? ఎలా ఉంటారు? అనే విషయాలు తెలుసుకోవడానికి అభిమానులు ఉత్సాహం కనబరుస్తారు. అయితే అది కొంతవరకు బాగానే ఉన్నా..ఒక్కోసారి వారిని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. వాళ్లకు ప్రైవసీని భంగం కలించినట్లవుతుంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్కు అలాంటి ఘటనే ఎందురైంది.ఆమె లివింగ్ రూమ్లో కూర్చొని ఉండగా.. సీక్రెట్గా ఫోటోలు తీసేందుకు ఇద్దరు ఫోటో గ్రాఫర్లు ప్రయత్నించారు. పక్క బిల్డింగ్ టెర్రస్పై నిలబడి కెమెరాలతో ఆమె ఇంటిని ఫోకస్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అలియా.. సోషల్ మీడియా వేదికగా వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. ఏం జరిగిందనే విషయాన్ని చెప్పుకొచ్చింది. ‘నేను ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఉండగా.. ఎవరో నన్ను గమనించినట్లు అనిపించింది. పక్కకు తిరిగి చూస్తే ఎవరు ఇద్దరు వ్యక్తులు పక్క బిల్డింగ్పై నుంచి కెమెరాలతో నా ఫోటోలు తీస్తున్నారు. ఇది సరైన పనేనా? ఒకరి వ్యక్తిగత విషయాలపై గోప్యత పాటించాలనే విషయం తెలియదా? మీరు హద్దులు దాటి ప్రవర్తించారు’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంట్లో ఉన్న వారిని సీక్రెట్ గా ఫోటోలు తీయడం అంటే తమ ప్రైవసీకి పూర్తి భంగం కలిగించడమేనని అలియా చెప్పింది. ఇన్స్టా పోస్ట్లో ముంబై పోలీసుకు ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిని ఖండిస్తూ పలువురు సినీ ప్రముఖులు పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ స్పందిస్తూ.. ‘ఇది నిజంగా సిగ్గు చేటు. నా కూతురి విషయంలో ఇలాంటి ఘటనే ఎదురైంది. తన ఫోటోలను తీయొద్దని ఎంత రిక్వెస్ట్ చేసినా..వారు ఆమె ఫోటోలను నెట్టింట పెట్టారు’అని రాసుకొచ్చింది. ఇక జాన్వీ కపూర్ స్పందిస్తూ.. ‘ఆది అసహ్యమైన చర్య. నా విషయంలోనూ ఇలాంటి ఘటన జరిగింది. నాకు తెలియకుండా.. నా పర్మిషన్ లేకుండా ఫోటోలు తీశారు’చెప్పింది. -
బ్రహ్మాస్త్రకు వారిద్దరు రెమ్యునరేషన్ తీసుకోలేదా.. అందులో నిజమెంత?
బాలీవుడ్ రొమాంటిక్ జోడీ ఆలియాభట్, రణ్బీర్ కపూర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మాస్త్ర'. ఇటీవల విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనిరాయ్ కీలక పాత్రల్లో పోషించారు. అయితే ఈ సినిమా బడ్జెట్, కలెక్షన్స్ విషయంలో పలు రకాల వదంతులు వ్యాపించాయి. ఈ సినిమా బడ్జెట్ పెరిగడంతో.. అలియాభట్, రణ్బీర్ కపూర్ రెమ్యునరేషన్ తీసుకోలేదనే రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై తాజాగా సినిమా దర్శకుడు అయాన్ ముఖర్జీ క్లారిటీ ఇచ్చారు. అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ‘చాలా మంది త్యాగాలతో ఈ చిత్రాన్ని నిర్మించాం. ఈ సినిమాలో నటించినందుకు రణ్బీర్ ఎలాంటి డబ్బులు తీసుకోలేదు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అలియాభట్ ఈ ప్రాజెక్టులో 2014లో జాయినైంది. ఆమెకు ఈ చిత్రానికి ఇచ్చిన పారితోషికం ప్రస్తుతం తాను తీసుకుంటున్న దానికి చాలా తక్కువ. మేం సినిమా పూర్తి చేసే సమయానికి అలియా కూడా ఈ చిత్రంలో భాగమైంది’ అని అన్నారు. (చదవండి: బిగ్బాస్ షో.. ఆ స్టార్ హీరో పారితోషికం భారీగా తగ్గనుందా..!) రెమ్యునరేషన్పై వస్తున్న వార్తలపై రణ్బీర్ కపూర్ కూడా స్పష్టత ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ నిజానికి నేను బ్రహ్మాస్త్ర మొదటి భాగానికి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నేను ఈ చిత్రానికి నిర్మాతను కూడా. కానీ నేను అంతకు మించి పొందాను. ఈ సినిమాను మూడు భాగాలుగా తీయగలమనే నమ్మకం ఉంది. ఒక నటుడిగా నేను ఇంతకంటే పొందగలిగేది ఏముంటుంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను’’ అని అన్నారు. " -
రణబీర్ ఫేవరెట్ హీరోయిన్ ఆమెనట.. ఆలియా భట్ కాదండోయ్!
బాలీవుడ్లో ఇటీవల పెళ్లి చేసుకున్న క్యూట్ కపుల్ ఎవరంటే రణబీర్ కపూర్ ఆలియా భట్. ఈ జంట కొంత కాలం రిలేషన్షిప్లో ఉండి ఇటీవలే వివాహం కూడా చేసుకున్నారు. చివరగా ఈ చాక్లెట్ బాయ్ ‘సంజు’ సినిమాలో కనిపించాడు. ఆ తర్వాత పలు కారణాల వల్ల దాదాపు నాలుగేళ్లు ప్రేక్షకులకు దూరంగా ఉన్నాడు. ఆ గ్యాప్ని పూరించడానికి 'షంషేరా', 'బ్రహ్మాస్త్ర' వరుస చిత్రాలతో తన అభిమానులకు ముందుకు రాబోతున్నాడు. వీటిలో ‘షంషేరా’ చిత్రం జూలై 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్తో పాటు రణ్బీర్ కూడా మూవీ ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల ఓ చానెల్కిచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రణ్బీర్. అందులో యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ రిప్లై ఇచ్చాడు ఈ చాక్లెట్ బాయ్. ఏంటా ప్రశ్నంటే? రణ్బీర్ని తన ఫేవరెట్ కో-స్టార్గా ఎవరని అడగగా సౌరభ్ శుక్లా పేరును చెప్పాడు. అతనితో గతంలో బర్ఫీ (2012), జగ్గా జాసూస్ (2017), త్వరలో విడుదల కానున్న ‘షంషేరా’ చిత్రంలో కలిసి నటించారు. ఇక రణ్బీర్కి ఇష్టమైన నటి ఎవరన్న ప్రశ్నకు బదులుగా.. అనుష్క శర్మ పేరుని చెప్పాడు. వీరిద్దరూ గతంలో.. ఏ దిల్ హై ముష్కిల్ (2016), బాంబే వెల్వెట్ (2015), సంజు (2018) చిత్రాలలో కలిసి నటించారు. అయితే అనుష్క తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఇద్దరూ ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారని తెలిపాడు. అంతే కాకుండా ఇద్దరం క్రియేటివిటి విషయంలో ఒకేలా ఆలోచిస్తారని కూడా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అనుష్క చక్దా 'ఎక్స్ప్రెస్లో నటిస్తోంది. ఇందులో ఆమె భారత మాజీ క్రికెటర్ ఝులన్ గోస్వామిగా నటిస్తుంది. నాలుగేళ్ల తర్వాత ఆమె మళ్లీ తెరపై కనిపించనుంది. చదవండి: Allu Arjun: బన్నీ షాకింగ్ లుక్ వైరల్, దారుణంగా ట్రోల్ చేస్తున్న నార్త్ నెటిజన్లు -
అలియా బర్త్డే సర్ప్రైజ్, బ్రహ్మస్త్ర నుంచి ఫస్ట్లుక్ వచ్చేసింది
Alia Bhatt First Look Released From Brahmastra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, ఆమె ప్రియుడు రణ్బీర్ కపూర్ తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే నేడు అలియా బర్త్డే సందర్భంగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. మార్చి 15న అలియా 29వ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అయాన్ తన ఇన్స్టాగ్రామ్లో అలియా ఫస్ట్లుక్ రిలీజ్ చేస్తూ సర్ప్రైజింగ్ వీడియో షేర్ చేశాడు. కాగా ఇందులో అలియా పాత్ర పేరు ఇషా. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్డే మై లిటిల్ వన్. ఈ ప్రత్యేకమైన రోజున మా బ్రహ్మస్త్ర శక్తి.. ఇషా స్పెషల్ వీడియోను రిలీజ్ చేస్తున్నాం’ అంటూ రాసుకొచ్చాడు. కాగా ఈ చిత్రంలో రణ్బీర్ సూపర్ హీరో తరహా పాత్రతో సందడి చేయనున్నారని తెలుస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ వచ్చే ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటీవల చిత్ర బృందం మోషన్ పోస్టర్ ద్వారా తెలిపింది. ఇందులో బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘మన్మధుడు’ నాగార్జున్ అక్కినేని ముఖ్యపాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Ayan Mukerji (@ayan_mukerji) -
మనసు మార్చుకున్న జాన్వీ కపూర్.. ఇక టీటౌన్పైనే ఫోకస్!
దఢక్తో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కూతరు జాన్వీ కపూర్. తొలి సినిమాతోనే ఫేమస్ అయింది. ప్రస్తుతం అక్కడ వరుస సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. ఈ బ్యూటీని టాలీవుడ్ కు తీసుకొచ్చేందుకు మన డైరెక్టర్ట్స్ అండ్ ప్రొడ్యూస్స్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. కానీ జాన్వీ మాత్రం బాలీవుడ్పైనే ఫోకస్ పెట్టింది. ముందు బాలీవుడ్లో స్టార్డమ్ అందుకున్న తర్వాతే సౌత్ వైపు చూడాలనుకుంటోంది. అందుకే ఇంత కాలం టాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె మనసు మారిందట. బాలీవుడ్ లీడింగ్ లేడీస్ దీపిక, ఆలియాల మాదిరే జాన్వీ కూడా టాలీవుడ్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అందుకే రెండు తెలుగు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కుదుర్చుకుందట. అయితే ఈ రెండూ కూడా ప్యాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఒకటి పూరి జగన్నాథ్ మేకింగ్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ జనగణమన, మరోకొటి కరణ్ జోహర్ అక్కినేని హీరో అఖిల్ తో ప్లాన్ చేస్తోన్న ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ అట. మరి టాలీవుడ్లో జాన్వీ లక్ ఎలా ఉంటుందో చూడాలి. -
ఒట్టేసి చెబుతున్నా, అది చేసి తీరతాను: ఆలియా
‘కామాటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు.. ఎందుకంటే అక్కడ గంగూబాయి ఉంటుంది’ అనే డైలాగ్తో ‘గంగూబాయి కతియావాడి’ ట్రైలర్ విడుదలైంది. ఆలియా భట్ టైటిల్ రోల్లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతున్న సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు. ‘శ్రద్ధగా వినండి.. మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది.. అదెలా అంటారా? మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్టే.. మేమయితే రోజూ మా మానాన్ని అమ్ముకుంటాం.. అది అంతమే అవదు, ఒట్టేసి చెబుతున్నా.. మా పిల్లలందరికీ చదువులు నేర్పించే తీరతాను’ అంటూ ఆలియా చెప్పే డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘వేశ్యలు, వారి కుటుంబాల హక్కుల కోసం గంగూబాయి చేసిన పోరాటం నేపథ్యంలో సినిమా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
అలియా భట్ సీతగా ఎలా మారిందో చూశారా ?.. మేకింగ్ వీడియో వైరల్
Alia Bhatt To Seetha Making Video From RRR Movie: ధర్శక ధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కాంబినేషనల్లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మల్టీసారర్ చిత్రం 'ఆర్ఆర్ఆర్'. వీరి ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న 'ఆర్ఆర్ఆర్'పై సినిమాకు బడ్జెట్కు (సుమారు రూ. 450 కోట్లు) మించిన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. జనవరి 7, 2022న వస్తున్న ఈ సినిమా సంక్రాంతి సీజన్కు అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వబోతోందని టాలీవుడ్ గట్టిగా నమ్ముతోంది. రేపు (డిసెంబర్ 9) ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధానమైన థియేటర్లలో ప్రదర్శించబోతోంది చిత్రబృందం. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లు, వీడియోలు, పాటలు విడుదల చేశారు. వాటికి అనూహ్య స్పందన వస్తోంది. తాజాగా అలియా భట్ పాత్రకు సంబంధించిన ఒక వీడియోను రీలీజ్ చేసింది చిత్రబృందం. ఈ తాజా వీడియోలో అలియా నుంచి సీతగా మారే క్రమాన్ని చూపించారు. బాలీవుడ్ బ్యూటీ అలియా.. ఆర్ఆర్ఆర్ కోసం రాజమౌళితో చర్చలు జరపడం దగ్గర నుంచి సీత పాత్రలో ఒదిగిపోయే వరకు చూపించారు. అందులో అలియా పోషిస్తున్న సీత పాత్రను తయారు చేసే విధానం, యాక్టింగ్ సీన్స్ను చూపించారు. వీడియోలోని బిహైండ్ సీన్స్లో అలియా భట్ క్యూట్ క్యూట్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ముచ్చటగా కనిపించింది. ఇందులో పదహారణాల తెలుగమ్మాయిగా అలియా ఆకట్టుకుంటుంది. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. ఇందులో రామ్ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా పాత్ర కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమాచారం. అలియాది.. ఇద్దరు మహావీరుల మధ్య ఆమె రిలీఫ్ అని సీత పాత్ర ప్రేక్షకుల మనసులు దోచుకుంటుందని.. రామారాజు, భీమ్ ల మధ్య ఆమె ఒక కనెక్టింగ్ అంశమని ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by RRR Movie (@rrrmovie) -
అలియా సంపాదనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మహేశ్ భట్
‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన అలియా భట్ తోలి సినిమాతో భారీ విజయం సాధించింది. ప్రముఖ ప్రొడ్యూసర్ మహేశ్ భట్ వారసురాలిగా సినిమాల్లోకి అడుగు పెట్టి పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది. ఇక సంపాదన విషయంలో అయితే తండ్రినే మించిపోయిందట. ఈ విషయంలో అలియా గురించి చెబుతూ మురిసిపోతున్నాడు మహేశ్ భట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆలియా గురించి మాట్లాడుతూ.. ‘సినిమా రంగంతో పాటు ఎక్కడైనా సరే రాణించాలంటే టాలెంట్ ఉండాలి. చదవండి: మరో వివాదంలో చిక్కుకున్న రాజ్కుంద్రా దంపతులు కొంతమంది తమ టాలెంట్తో చిన్న వయసులోనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు. అందులో నా కూతురు అలియ ఉండటం గర్వంగా ఉంది. తన టాలెంట్తో ఆలియా మంచి పేరుని సంపాదించడమే కాక నేను 50 ఏళ్లలో కష్టపడి సంపాదించినంత డబ్బును ఆలియా కేవలం రెండేళ్లలోనే సంపాదించింది’ అంటూ తండ్రిగా మురిపిపోయాడు. అయితే గతేడాది అలియా లండన్లో ఓ విల్లా కొనుగోలు చేయగా ఇటీవల ముంబైలోని జూహులో ఓ ఇల్లు ఖరీదు చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక అలియా సినిమాల విషయానికోస్తే ప్రస్తుతం ఆమె చేతిలో పలు భారీ బడ్జెట్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆమె తెలుగులో నటించిన ‘ఆర్ఆర్ఆర్’, హాందీ బ్రహాస్త్ర చిత్రాలు షూటింగ్ను పూర్తి చేసుకోని విడుదలకు సిద్దమవుతున్నాయి. చదవండి: ఓటీటీకి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, స్ట్రీమింగ్ ఎప్పుడంటే -
మరోసారి రామ్చరణ్తో జతకట్టనున్న బాలీవుడ్ భామ!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రంలో భారత సినీ పరిశ్రమకు చెందిన పులువురు స్టార్ నటీనటులు నటించనున్నట్లు ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్గా బాలీవుడ్ భామా అలియా భట్ను తీసుకోవాలని శంకర్ చిత్ర బృందంతో చర్చించారని వినికిడి. దీంతో డైరెక్టర్ శంకర్ టీం ఇటీవల ఆమెతో చర్చలు కూడా జరిపారనే వార్త ఫిలిం దూనియాలో హల్చల్ చేస్తోంది. అయితే దీనిపై ఆమె స్పష్టత ఇవ్వాల్సి ఉందట. ప్రస్తుతం అలియా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’తో పాటు బాలీవుడ్లో పలు సినిమాలకు సంతకం చేసిందట. ఇప్పటికి ‘ఆర్ఆర్ఆర్’లో అలియా షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తికాలేదు, దీనితో పాటు హిందీలో తాను సంతకం చేసిన పలు చిత్రాలు లైన్లో ఉన్నాయట. మరీ ఇంత బిజీ షెడ్యూల్లో అలియా శంకర్-చరణ్ ప్రాజెక్ట్కు ఒకే చేస్తుందో లేదో ఆమె స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ అంతా ఒకే అయితే అలియాకు చరణ్తో ఇది రెండవ సినిమా అవుతుంది. కాగా డైరెక్టర్ శంకర్ తల్లి ముత్తు లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. -
ఆలియా @ ప్రెసిడెంట్ ఆఫ్ కామాటిపురా
‘‘కామాటిపురాలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగు ఉంటుంది. గౌరవంతో బతకాలి.. ఎవ్వరికీ భయపడకూడదు. నేను గంగూ బాయి.. ప్రెసిడెంట్ కామాటిపురా. మీరు కుమారి అంటూనే ఉన్నారు... నన్ను ఎవరూ శ్రీమతిని చేసిందే లేదు’’ వంటి డైలాగ్స్ ‘గంగూబాయి కాఠియావాడీ’ టీజర్లో ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ప్రధానపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గంగూబాయి కాఠియావాడీ’. జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో వేశ్యా గృహం నడిపే యజమాని గంగూబాయిగా నటిస్తున్నారు ఆలియా భట్. కాగా ‘వకీల్ సాబ్’ సినిమా ఆడుతున్న థియేటర్లలో ‘గంగూబాయి కాఠియావాడీ’ తెలుగు టీజర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. ‘‘ఓ వేశ్య అందరినీ శాసించే నాయకురాలిగా ఎలా ఎదిగారు? అనేదే సినిమా ప్రధానాంశం. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ‘గంగూబాయి కాఠియావాడీ’ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో అజయ్ దేవ్గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. -
రణ్బీర్, అలియా వివాహం అప్పుడే!
ముంబై : బాలీవుడ్ ప్రేమ జంట రణ్బీర్ కపూర్, అలియా భట్ వివాహ బంధంతో త్వరలో ఒక్కటవుతారని బాలీవుడ్లో ఎప్పటినుంచో వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఈ వ్యవహారం మరోసారి హాట్టాపిక్గా మారింది. రణ్బీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడంతో రణ్బీర్, అలియా మ్యారేజ్పై మళ్లీ చర్చ మొదలైంది. స్టార్ జంట వివాహానికి రిహార్సల్స్ కోసమే నీతూ డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తున్నారని బాలీవుడ్లో గుసగుసలు వినిపించాయి. అయితే ఇవి కేవలం ఊహాగానాలేనని కపూర్ కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. ఈ ఏడాది వివాహ వేడుక లేదని, వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే శుభకార్యంపై స్పష్టత వస్తుందని కపూర్ కుటుంబ సభ్యులు ఒకరు వెల్లడించారు. రణ్బీర్ తండ్రి రిషి కపూర్ ఈ ఏడాది ఏప్రిల్లో మరణించారని, దీంతో 2021 ద్వితీయార్ధం వరకూ పెళ్లి ఊసే ఉండదని పేర్కొన్నారు. మరోవైపు వివాహంపై రణ్బీర్, అలియా సానుకూలంగా ఉంటే నీతూజీకి ఎలాంటి అభ్యంతరం ఉండబోదని చెప్పుకొచ్చారు. అసలు రణ్బీర్, అలియా భట్లో ఏ ఒక్కరూ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించడం లేదని అన్నారు. వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యేందుకు చాలా సమయం పడుతుందని తేల్చేశారు. చదవండి : తెలుగు పాఠాలు -
తెలుగు పాఠాలు
‘మా మాటలు మేమే మాట్లాడుకుంటాం’ అని పరభాషా తారలు తెలుగు సినిమాలు చేసినప్పుడు తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తెలుగులో ఫుల్ బిజీగా సినిమాలు చేస్తున్న రకుల్ ప్రీత్సింగ్, రాశీ ఖన్నా వంటి ఉత్తరాది భామలు అప్పుడప్పుడూ తమ పాత్రలకు డబ్బింగ్ చెబుతున్నారు. అయితే ఓ పది సినిమాలు చేశాక వాళ్లు ఈ ప్రయత్నం చేశారు. కానీ ఆలియా భట్ మాత్రం తెలుగులో చేస్తున్న తొలి సినిమాకే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. ఎన్టీఆర్, రామ్చరణŠ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’లో రామ్చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ టైమ్లో ఈ సినిమా నుండి ఆలియా తప్పుకున్నారనే వార్తలు షికారు చేశాయి. కానీ ఆలియా తప్పుకోలేదు. సీత పాత్ర కోసం ప్రిపేర్ అవుతున్నారు. తెలుగు నేర్చుకోవటం కోసం కోచ్ను కూడా పెట్టుకున్నారని టాక్. డబ్బింగ్ చెప్పుకోవాలని అనుకుంటున్నారట. సోమవారం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ మళ్లీ మొదలైన విషయం తెలిసిందే. నవంబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణలో ఆలియా పాల్గొంటారని సమాచారం. -
‘దీపికా’ రాజకీయవేత్త అని మీకు తెలుసా?
హిందీలో ‘రామాయణ్’ (1987) టీవీ సీరియల్లో సీతగా నటించి విశేష ఆదరణ పొందారు దీపికా చిఖలియా. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. తాజాగా స్వాతంత్య్ర సమరయోధురాలు, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు పొందిన సరోజినీ నాయుడు బయోపిక్ ‘సరోజిని’లో టైటిల్ రోల్ పోషిస్తున్నారు. గురువారం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా లాక్డౌన్ కారణంగా హిందీ రామాయణ్ను దూరదర్శన్లో పునఃప్రసారం చేస్తున్నారు. దీంతో దీపిక క్రేజ్ మరోసారి అమాంతం పెరిగిపోయింది. అయితే నటిగా మంచి గుర్తింపు పొందిన దీపిక రాజకీయ రంగప్రవేశం చేశారని చాలా కొంతమందికే తెలుసు. అయితే ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటి సీత ఇప్పటి సరోజిని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ‘రామాయణం సినిమాగా తెరకెక్కించాలనే డిమాండ్ ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయంది. అయితే ఈ సినిమాలో నటించాలన్నా, తెరకెక్కించాలన్న రామాయణం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఒక వేళ రామాయణాన్ని సినిమాగా తెరకెక్కిస్తే సీతారాముల పాత్రలకు హృతిక్ రోషన్, అలియాభట్లు పర్ఫెక్ట్గా సెట్ అవుతారు. అంతేకాకుండా అజయ్ దేవ్గణ్ రావణుడు, వరుణ్ ధావన్ లక్ష్మణుడి పాత్రలు చేస్తే బాగుంటుంది. ఇక రామయణ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో పలు మ్యాగజైన్స్ ఫోటో షూట్కు పిలిచారు. అందుకు భారీ మొత్తం కూడా ఆఫర్ చేశారు. కానీ ఓ వైపు సీత పాత్ర పోషిస్తూ ఫోటో షూట్లో పాల్గొనడం భావ్యం కాదని సున్నితంగా తిరస్కరించాను. 1991లో భారతీయ జనతా పార్టీలో చేరాను. దివంగత నాయకులు అటల్ బిహార్ వాజ్పేయ్ స్పూర్థితో రాజకీయం రంగ ప్రవేశం చేశాను. మా తాత ఆరెస్సెస్ కార్యకర్త. దీంతో నాలో చిన్నప్పట్నుంచే ఆరెస్సెస్ భావాలు ఉండేవి. ఎల్కే అద్వానీ, సుష్మాస్వరాజ్, నరేంద్ర మోదీ తదితరులు నా రాజకీయ సహచరులు. గుజరాత్లోని బరోడా లోని లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచాను. ఇప్పటికీ పార్టీకి అవసరమైనప్పుడు నా వంతు సహాయం, సలహాలు అందిస్తుంటాను’అంటూ దీపికా చిఖలియా పేర్కొన్నారు. ఈ నటి తెలుగులో కూడా యమపాశం అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాజశేఖర్ హీరోగా నటించారు. చదవండి: ‘సాహో ఎన్టీఆర్.. నీకు సెల్యూట్’ ‘సితారా.. సింగర్గా ట్రై చేయ్’ -
ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకున్న బాలీవుడ్ బ్యూటీ ?
హైదరాబాద్ : మెగా పవర్స్టార్ రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల కాంబినేషన్లో దర్శక ధీర రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ నుంచి షాకింగ్ అప్డేట్ ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ఈ మూవీ హీరోయిన్లలో ఒకరైన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ మూవీ కోసం భారీ మొత్తం పారితోషికం అందుకున్న అలియా ఎందుకు సినిమా నుంచి వైదొలిగారనేది ఆసక్తికరంగా మారింది. డేట్లను సర్దుబాటు చేయలేకే గల్లీ బాయ్ నటి రాజమౌళి మూవీ నుంచి వైదొలిగనట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, హైదరాబాద్, గుజరాత్, పుణేల్లో ఈనెల ఆరంభంలో జరిగిన షూటింగ్లోనూ అలియా పాల్గొన్నారని తెలిసింది. కరోనా వైరస్ ఆందోళనతో షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది. చదవండి : సంక్రాంతికి సై ఇక మే షెడ్యూల్ కోసం అలియా భట్ మేనేజర్తో రాజమౌళి బృందం సంప్రదింపులు జరుపుతోందని సమాచారం. సడక్ 2, బ్రహ్మాస్త్ర, సంజయ్ లీలా భన్సాలీ ప్రాజెక్ట్ వంటి పలు సినిమాలతో ఆమె ఊపిరిసలపని బిజీలో ఉన్నారు. ఇంతటి బిజీ షెడ్యూల్లో డేట్లు కేటాయించలేని స్ధితిలో ఆమె రాజమౌళి ప్రాజెక్టును వదులుకునేందుకు సిద్ధమయ్యారని చెబుతున్నారు. ఈ వార్తలను నిర్మాత ధ్రువీకరించకపోయినా పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నాయి. స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంల విప్లవ కథ ఆధారంగా రూ 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదలకు సన్నద్ధమవుతోంది. చదవండి : ఆర్ఆర్ఆర్తో కేజీఎఫ్ 2 ఢీ : యష్ వివరణ -
డిసెంబర్ 4న ‘బ్రహ్మస్త్ర’
రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం విడుదలకు సంబందించి ఒక ఫోటోను బిగ్బీ తన ట్వీటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘బ్రహ్మస్త్ర సినిమా హింది, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి.. డిసెంబర్ 4, 2020 ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని బిగ్బీ వెల్లడించారు. T 3429 BRAHMĀSTRA.. coming to cinemas on 4/12/20 & Ayan is NOT allowed to change it now! #Brahmastra #RanbirKapoor @aliaa08 @iamnagarjuna @RoyMouni #AyanMukerji @ipritamofficial @karanjohar @apoorvamehta18 #NamitMalhotra @MARIJKEdeSOUZA @DharmaMovies @FoxStarHindi @BrahmastraFilm — Amitabh Bachchan (@SrBachchan) February 2, 2020 ‘బ్రహ్మస్త్ర’ ఓ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అదేవిధంగా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్న ఆలియా భట్ తన ఇస్టాగ్రామ్ ఖాతాలో చిత్ర విడుదలకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేశారు. ‘బ్రహ్మస్త్ర మూవీ డిసెంబర్ 4న విడుదల అవుతుంది’ అని ఆమె తెలిపారు. పాన్ ఇండియా చిత్రంగా తెరుకెక్కుతున్న ఈ సినిమా చూడాలంటే డిసెంబర్ నాలుగు వరకు ఆగాల్సిందే. చదవండి: పరిశోధకుడు View this post on Instagram @amitabhbachchan #RanbirKapoor #AkkineniNagarjuna @imouniroy @ayan_mukerji @ipritamofficial @karanjohar @apoorva1972 #NamitMalhotra @marijkedesouza @dharmamovies @foxstarhindi @brahmastrafilm A post shared by Alia ☀️ (@aliaabhatt) on Feb 1, 2020 at 9:50pm PST -
అలియా భట్ తల్లి వివాదాస్పద వ్యాఖ్యలు..
ముంబై : పార్లమెంట్పై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురూను ఉరితీయడంపై బాలీవుడ్ నటి అలియా భట్ తల్లి సోనీ రజ్దాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అఫ్జల్ గురూను బలిపశువును చేశారని ఆమె వ్యాఖ్యానించారు. న్యాయం ఎలా అపహాస్యమవుతుందనేందుకు ఇదే ఉదాహరణని అంటూ అఫ్జల్ గురూ అమాయాకుడైతే పోయిన అతడి ప్రాణాన్ని ఎవరు తీసుకురాగలరని ప్రశ్నించారు. అందుకే మరణ శిక్షను అంత తేలికగా విధించరాదని, ఈ కారణంచేతే అఫ్జల్ గురూను ఎందుకు బలిపశువును చేశారనే దానిపై విచారణ చేపట్టాలని ఆమె ట్వీట్ చేశారు. కశ్మీర్ నుంచి ఢిల్లీకి ఓ ఉగ్రవాదిని తీసుకురావాలని జమ్ము కశ్మీర్ డీజీపీ దేవీందర్ సింగ్ తనపై ఒత్తిడి తెచ్చారని అఫ్జల్ గురూ రాసిన లేఖలో పేర్కొన్నాడని, ఆ ఉగ్రవాదే తర్వాత పార్లమెంట్పై దాడికి తెగబడ్డాడని అదే లేఖలో పొందుపరిచాడని రజ్దాన్ పేర్కొన్నారు. ఈ లేఖ నేపథ్యంలో డీజీపీపై ఎందుకు దర్యాప్తు చేపట్టలేదనేది నిగ్గు తేల్చాలని కోరారు. అఫ్జల్ వంటి వారు ఎలాంటి వేధింపులకు గురయ్యారు..నేరస్తుల కోసం ఉగ్ర కార్యకలాపాలు చేపట్టవలసివచ్చిందో విచారణ చేపట్టిన అనంతరమే మరణ శిక్ష విధించాలని అన్నారు. కాగా ప్రస్తుతం జమ్ము కశ్మీర్ పోలీసుల కస్టడీలో ఉన్న దేవీందర్ సింగ్ను ఎన్ఐఏ త్వరలో విచారించనుందని భావిస్తున్నారు. చదవండి : ‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’ -
పరిశోధకుడు
వారణాసిలో పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల ఫలితాలు వచ్చే ఏడాది వెండితెరపై విడుదలవుతాయి. రణ్బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అమితాబ్ బచ్చన్, నాగార్జున, డింపుల్ కపాడియా, మౌనీరాయ్ కీలక పాత్రధారులు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. ఒక శక్తిమంతమైన ఆయుధం చుట్టూ ఈ సినిమా కథాంశం తిరుగుతుంది. చేతుల నుంచి నిప్పును రప్పించే శివ పాత్రలో రణ్బీర్, ఇషా పాత్రలో ఆలియా కనిపిస్తారు. శివ పాత్రకు గురువుగా అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. పురాతత్వ శాస్త్రవేత్తగా నాగార్జున నటిస్తున్నారు. ఆల్రెడీ ఈ ఏడాది జూన్లో నాగార్జునపై వారణాసిలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మనాలిలో జరుగుతోంది. అమితాబ్ బచ్చన్, రణ్బీర్ కపూర్, ఆలియాభట్లపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. మూడు విభాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి విభాగం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. -
‘రణబీర్ సలహాతో కోలుకున్నా’
న్యూఢిల్లీ : కళంక్ మూవీ బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో నిరాశలో కూరుకుపోయిన తాను రణ్బీర్ కపూర్ సూచనలతో కోలుకున్నానని బాలీవుడ్ నటి అలియా భట్ చెప్పుకొచ్చారు. రూ 100 కోట్లతో తెరకెక్కిన కళంక్ లైఫ్టైమ్ వసూళ్లు రూ 80 కోట్లకే పరిమితమవడం చిత్ర బృందాన్ని నిరుత్సాహపరిచింది. తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా తన కష్టానికి ఫలితం దక్కలేదని తాను తీవ్ర నిర్వేదానికి లోనయ్యాయని అలియా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ఈ సమయంలో తనకు తన బాయ్ఫ్రెండ్ రణబీర్ కపూర్ అండగా నిలిచారని, ఆయన చెప్పిన మాటలు తనకు స్వాంతన చేకూర్చాయని అలియా చెప్పారు. నువ్వు నీ శక్తిమేర కష్టపడ్డావని, అది ఇప్పటికిప్పుడు ఫలితాలు ఇవ్వకపోయినా కష్టపడే నటిగా, వ్యక్తిగా నీ శ్రమ వృధా కాదని, మరో సినిమా రూపంలో మంచి ఫలితంగా అది కనిపిస్తుందని రణబీర్ తనలో ధైర్యం నూరిపోశారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళంక్ నిర్మాత కరణ్ జోహార్, నటి కరీనా కపూర్లు కూడా పాల్గొన్నారు. -
రాహుల్ ప్రేమలో పడ్డాడా!
ఆకాంక్ష రంజన్ కపూర్ ప్రముఖ మోడల్ అయినప్పటికీ ఆమె.. అలియా భట్ స్నేహితురాలిగానే అందరికీ సుపరిచితం. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్కు ఈ మోడల్కు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని గతంలో పుకార్లు వచ్చాయి. ఇక ఆకాంక్ష ఏప్రిల్ 25న రాహుల్, అతియా శెట్టితో ఉన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా ఇది మరిన్ని ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది. పైగా ‘ఈ ప్రేమతో నేనెంతో సంతోషంగా ఉన్నాను’ అంటూ క్యాప్షన్ జత చేసింది. దీంతో రాహుల్ ఆ ఊహాగానాలు నిజమని ఒప్పుకోలేక, కాదని కొట్టిపారేయలేక అవస్థ పడుతున్నారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ ‘ఈ విషయాల గురించి మీడియా ఏం రాసిందో నాకు తెలియదు. ఎందుకంటే నేను పెద్దగా పేపర్లు చదవను. కాబట్టి నా గురించి ఏం రాశారనేది నాకు తెలీదు. అయినా నా వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచడానికే ఇష్టపడుతాను. దాని గురించి పబ్లిక్లో మాట్లాడటం ఇష్టముండదు’ అంటూ అసలు విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా ‘నాకైతే ఏం తెలీదు. తెలిసినపుడు మీకు తప్పకుండా చెప్తా’నని తెలివిగా సమాధానమిచ్చి తప్పించుకున్నాడు. గతంలో నిధి అగర్వాల్, అథియా శెట్టిలతో రాహుల్ డేటింగ్ చేసినట్లు వచ్చిన వార్తలను ఖండించిన విషయం తెలిసిందే. అయితే తాజా ప్రేమ వ్యవహారంపై నోరు మెదపటానికి కూడా అతడు ఎందుకు ఇష్టపడట్లేదో! View this post on Instagram ...n i’m so good with that 💛 A post shared by 🦋Kanch (@akansharanjankapoor) on Apr 25, 2019 at 7:01am PDT -
ఆ సెలబ్రిటీ జోడీ పెళ్లి ఇప్పట్లో లేనట్టే..
ముంబై : బాలీవుడ్లో హాట్ లవ్ కపుల్గా ప్రచారం సాగుతున్న రణ్బీర్ కపూర్, అలియా భట్ల అనుబంధం ఇప్పట్లో పెళ్లిపీటలకు ఎక్కడం లేదని వెల్లడైంది. అలియా భట్ తన పెళ్లి కోసం అప్పుడే వెడ్డింగ్ లెహెంగా కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీకి ఆర్డర్ ఇచ్చినట్టు వార్తలు రాగా అలియా కుటుంబ సభ్యులు అలాంటిదేమీ లేదని తేల్చేశారు. రణ్బీర్ కపూర్తో అలియా భట్ వివాహంపై వస్తున్నవన్నీ రూమర్లేనని ఆమె అంకుల్, నిర్మాత ముఖేష్ భట్ కొట్టిపారేశారు. ఇవన్నీ అసత్య వార్తలే..అసలు వీటిని ఎవరు పుట్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు అలియా స్టెప్ బ్రదర్ రాహుల్ భట్ సైతం ఆమె పెళ్లి వార్తలను తోసిపుచ్చారు. అలియా, రణ్బీర్ల వివాహంపై తనకేమీ తెలియదని, వారిద్దరి పెళ్లికి తనను ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని చెప్పుకొచ్చారు. -
ఆన్ వర్క్ మోడ్
ఇటీవల సౌతాఫ్రికాలో సతీమణి ఉపాసనతో కలిసి హాలిడేను బాగా ఎంజాయ్ చేసిన రామ్చరణ్ ఇక వర్క్ మోడ్లోకి రానున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. రామ్చరణ్ సరసన ఆలియా భట్ కథానాయికగా నటిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ సినిమా తాజా షెడ్యూల్ షూటింగ్లో సోమవారం నుంచి రామ్చరణ్ పాల్గొంటారని సమాచారం. కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు టీమ్ ప్లాన్ చేసిందని తెలిసింది. 1921 నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్వాతంత్య్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 30న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ విడుదల కానుంది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
Election 2024 Voters Selfie Photos: ఓటు హక్కు వజ్రాయుధం (ఫొటోలు)
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
తొలిసారి ఓటేశారు (ఫొటోలు)
పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేతల దాడి
నా ఓటు .. నా హక్కు (ఫొటోలు)
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement