-
వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
ఉసిరి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయో తెలిసిందే. అయితే దీన్ని వేసవిలో తీసుకోవచ్చా. తింటే మంచిదేనా..? అని చాలామందికి ఎదురయ్యే సందేహం. ఆయుర్వేదం పరంగా ఔషధంగా ఉపయోగించే ఈ ఉసిరిని వేసవిలో తీసుకోవచ్చా అంటే..నిపుణులు బేషుగ్గా తీసుకోవచ్చని చెబుతున్నారు. సమ్మర్ హీట్కి సరైన ఫ్రూట్ అని చెబుతున్నారు. వేసవిలో ఉసిరి తీసుకోవడంలో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో సవివరంగా తెలుసుకుందామా..!వేసవిలో అందరూ ఎదుర్కొనే సమస్య డీహైడ్రేషన్. దీని కారణంగా జీర్ణ సమస్యలు, అలర్జీలు, ఫుడ్ పాయిజనింగ్ వంటి పలు సమస్యలు ఎదుర్కొంటారు. వాటికి చెక్పెట్టడంలో ఉసిరి సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ సమ్మర్ హీట్ని తట్టుకునేలా రోగనిరోధక శక్తినిపెంచి, పొట్టలో వచ్చే మంటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే అధిక విటమిన్ సీ కంటెంట్ ఫ్రీ రాడికల్స్గా పిలిచే హానికరమైన అణువుల వల్ల కలిగే నష్టాన్ని అరికడుతుంది. అలాగే శరీర కణాలు, కణాజాలా ఆరోగ్యకరమైన పనితీరులో కీలకపాత్ర పోషిస్తుంది. ఈ ఉసిరి హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్ వంటి ఉష్ణ సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. శరీరానికి చలువ చేస్తోంది. ఇది హైడ్రేట్గా ఉంచడంతో అంతర్గత ఉష్ణోగ్రత పెరగకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా చాలా నీరు చెమట రూపంలో వెళ్లినా.. శరీరాన్ని హైడ్రేటడ్గా ఉంచడంలో సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువే. అందువల్ల జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడటమే గాక మలబద్ధకాన్ని నివారిస్తుంది. ప్రేగు కదలికలను నియంత్రించి ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ను ప్రోత్సహిస్తుంది. అంతేగాదు దగ్గు, జలుబు, జ్వరం, అలెర్జీలు వంటి వ్యాధుల నుంచి వేగంగా కోలుకునేలా చేస్తుంది. కొలస్ట్రాల్కి చెక్పెడుతుంది. ముఖ్యంగా రక్తంలో ఎల్డీఎల్ లేదా చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే ఇది ఆకలిని తగ్గించి, బరువు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యూవీ రేడియేషన్, పర్యావరణ కారకాల నుంచి రక్షిస్తుంది. ఇది మిమ్మల్ని యవ్వనంగా ఉండేలా చేసి ముఖంపై పడే ముడతలను నివారిస్తుంది. అందువల్ల సమ్మర్లో ఎండ వేడిని తట్టుకోవడంలో ఉసిరి అద్భుతంగా పనిచేస్తుందని, తప్పక తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: కే బ్యూటీ బ్రాండ్ అంబాసిడర్గా సచిన్ కూతురు!) Breadcrumb -
ఆమ్లా ఛుందా..ఇలా చేస్తే ఎక్కువకాలం తాజాగా ఉంటుంది
ఆమ్లఛుందా తయారీకి కావల్సినవి: ఉసిరికాయలు – అరకేజీ; బెల్లం – అరకేజీ; అల్లం – చిన్నముక్క; బ్లాక్సాల్ట్ – ఒకటిన్నర టీస్పూన్లు; మిరియాలు – టీస్పూను; యాలక్కాయలు – ఎనిమిది; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; పసుపు – టీస్పూను; కశ్మీరీ కారం – ఒకటిన్నర టీస్పూన్లు; గరం మసాలా – అర టీస్పూను; నిమ్మకాయలు – రెండు. తయారీ విధానమిలా: ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, ఆవిరి మీద మెత్తగా (10 నిమిషాలు) ఉడికించాలి ∙అల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకోవాలి ∙యాలక్కాయలు, మిరియాలను విడివిడిగా దంచి పెట్టుకోవాలి ∙ఉడికిన ఉసిరికాయలు చల్లారాక గింజలు తీసి సన్నగా తురుముకోవాలి. ఉసిరి తురుములో బెల్లం వేసి మీడియం మంట మీద పెట్టాలి అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ►నీరు పైకి తేలగానే అల్లం తురుము, బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, యాలకుల పొడిని వేయాలి ∙దాల్చిన చెక్కను తుంచి వేయాలి ∙చివరిగా పసుపు వేసి కలుపుతూ ఉడికించాలి ∙మీడియం మంట మీదే ఉంచి కలుపుతూ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు కారం, గరంమసాలా వేసి కలపాలి. బాగా కలిసిన తరువాత దించేసి, నిమ్మరసం పిండితే ఆమ్లా ఛుందా రెడీ. గమనిక: గాజు లేదా పింగాణీ పాత్రల్లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. -
క్యాన్సర్ ముప్పుని తగ్గించే ఉసిరి.. పచ్చడి పెట్టుకోండిలా
తిన్న తిండి ఒంటికి పట్టేలా చేయడంతో ఉసిరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచడం, క్యాన్సర్ ముప్పుని తగ్గించడంలో ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇన్ని సుగుణాలు ఉన్న ఉసిరి ప్రస్తుతం మార్కెట్లో దండిగా దొరుకుతోంది. అందుకే ఊరించే ఉసిరిని మరింత రుచిగా ఇలా చేసుకోమని చెబుతోంది ఈ వారం మన వంటిల్లు... స్పైసీ పచ్చడి తయారికి కావలసినవి: ఉసిరికాయలు – ఆరు; పచ్చి శనగపప్పు – పావు కప్పు; పచ్చిమిర్చి – మూడు; వెలుల్లి రెబ్బలు – నాలుగు; ఉప్పు – రుచికి సరిపడా; నూనె – టీస్పూను; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీస్పూను; పసుపు – పావు టీస్పూను; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెండు రెమ్మలు; కొత్తిమీర తరుగు – కాస్తంత తయారీ విధానమిలా: పచ్చిశనగపప్పుని శుభ్రంగా కడిగి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ∙ఉసిరికాయలను శుభ్రంగా కడిగి గింజలు తీసేసి ముక్కలుగా తరుగుకోవాలి. ∙ఉసిరికాయ ముక్కలు, నానిన శనగపప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లుపోసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ అయిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి ∙బాణలిలో నూనె వేసి, ఆవాలు జీలకర్ర, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి తాలింపు పెట్టాలి ∙ఈ తాలింపుని పచ్చడిలో వేసి కలపాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపితే స్పైసీ పచ్చడి రెడీ. చపాతీ, రోటీ, అన్నంలోకి ఈ పచ్చడి చాలా బావుంటుంది. -
కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే..
చర్మ యవ్వనంగా కనిపించాలని.. మేని మెరిసిపోవాలని కోరుకునే వారు ఈ చిట్కాలు ట్రై చేస్తే సరి. కొబ్బరి పాలతో.. ►కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనివల్ల ఎక్కువ కాలం చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ►కొబ్బరి పాలల్లో దూదిని ముంచి ముఖానికి, మెడకు రుద్దుకోవాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ►ఇలా యాంటీ ఏజింగ్ ప్యాక్స్ను వారానికి రెండు నుంచి మూడు సార్లు వేసుకోవడం ద్వారా చర్మాన్ని ముడతలు పడకుండా కాపాడుకోవచ్చు. మేనికాంతికి ఉసిరి.. నిమ్మ... నారింజ తేమను తరచూ మన ముఖానికి రాసుకుంటూ ఉంటే, ముఖం మీద ఉండే నల్లటి మచ్చలు తగ్గుముఖం పడతాయి. తేనెతో పెదవులకు మసాజ్ చేస్తే మృదువుగా, అందంగా కనిపిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా మెరిపించడంలో విటమిన్ సి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందువల్ల విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరిని అది దొరికినంతకాలం విరివిగా తీసుకోవాలి. నిమ్మకాయ, నారింజలోనూ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరి దొరకనప్పుడు వీటిని తరచూ తీసుకోవడం వల్ల కూడా అందంగా మారవచ్చు. అలాగే, వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం, తరచు ముఖాన్ని కడుక్కోవడం, ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు లేకుండా మేని చర్మం మెరుపులీనుతూ ఉంటుంది. చదవండి: Beauty: అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే డివైజ్! ధర ఎంతంటే! -
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..
శరీరంలో అక్కడక్కడ రక్తం గడ్డ కడుతోందా? రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? సాధారణంగా రక్తం మూడు విధాలుగా గడ్డ కడుతుంది. 1. సిరలలో... అది ముఖ్యంగా కాళ్ళలో వస్తుంది. కాలికి వాపు రావడంతో పాటు నొప్పి ఉంటుంది. కొన్ని సార్లు చర్మం రంగు మారుతుంది. 2. ఊపిరితిత్తులలో కొన్ని సార్లు గడ్డ కడుతుంది. ఇది చాలా ప్రమాదకరం. కాళ్ళలో నుంచి రక్తప్రవాహంలో సిరల ద్వారా ఊపిరితిత్తులకు చేరవచ్చు. ఆయాసం, ఛాతీ నొప్పి ముఖ్య లక్షణాలు. 3. గుండె లో కూడా గడ్డ కడుతుంది. కొన్నిసార్లు ధమనుల ద్వారా మెదడుకు వెళ్లి పక్షవాతం రావచ్చు. D-dimer అనే రక్త పరీక్ష వలన సిరలలో ఉండే రక్త గడ్డ ను కొనుక్కో వచ్చు. గుండెలో ఉన్న రక్త గడ్డను Echocardiogramతో కనుక్కో వచ్చు. ఊపిరితిత్తుల రక్త గడ్డ ను ఛాతీ CT scanతో తెలుసుకోవచ్చు. రక్తం మన శరీరంలో చేసే కీలకమైన పనులేంటీ? 1. ఆక్సిజన్ను సరఫరాచేసేది రక్తమే మనం బతకాలంటే ఆక్సిజన్ తప్పనిసరి అని తెలుసు. అయితే, ఆ ఆక్సిజన్ కేవలం ఊపిరితిత్తులకే పరిమితం కాదు. శరీరమంతా వ్యాపిస్తుంది. మరి గాలి రూపంలో ఉండే ఆక్సిజన్ శరీరానికి ఎలా అందుతుందనేగా మీ అనుమానం? ఆ ఆక్సిజన్ను సరఫరా చేసేది వాహకం రక్తమే. కేవలం ఆక్సిజన్ మాత్రమే కాదు, శరీరానికి కావల్సిన పోషకాలు, హార్మోన్లకు సైతం సరఫరా చేస్తుంది. అయితే, మనం తినే ఆహారం, మన అలవాట్లు సక్రమంగా ఉన్నప్పుడు రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. ప్రవాహానికి కూడా ఎలా ఆటంకాలు ఉండవు. 2. రోజూ వ్యాయామం చేయాలి వ్యాపారం లేదా ఉద్యోగరీత్యా ఎక్కువ సేపు కుర్చొనే వ్యక్తులు తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామానికి కేటాయించాలి. వాకింగ్ చేయడానికి సమయం లేనట్లయితే.. ఇంట్లో యోగాతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను అదుపులో ఉంచుకోవచ్చు. శ్వాసక్రియలో సమస్య లేనప్పుడే.. రక్తం కూడా స్వచ్ఛంగా ఉంటుంది. 3. చక్కగా నిద్రపోండి నిద్ర సమయంలోనే శరీరంలో కణజాలంలో మార్పులు జరుగుతుంటాయి. కణాల పుననిర్మాణానికి అవసరమైన హార్మోనులు విడుదలవుతాయి. నిద్ర సమయంలో శరీరంలోని కండరాలు విశ్రాంతి తీసుకోవడం వల్ల పెద్దగా పని ఉండదు. ఆ సమయంలోనే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్తుంటాయి. కాబట్టి ప్రతీ రోజూ తప్పనిసరిగా కంటి నిండా నిద్రపోండి. 4. బీట్రూట్ జ్యూస్ తాగండి లేదా తినండి బీట్రూట్లో శరీరానికి మేలు చేసే ఫైబర్, ఫొలేట్, విటమిన్ ఆ9, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ఇ ఉంటాయి. రక్తాన్ని శుభ్రపరచడమే కాకుండా రక్తనాళాలు సంకోచించడాన్ని అరికడుతుంది. బీట్రూట్ను ఆహారంగా గానీ, జ్యూస్గా గానీ తీసుకోవచ్చు. 5. నీళ్లు ఎక్కువగా తాగండి శరీరంలో ఎన్నో రకాల విషతుల్యాలు (టాక్సిన్) ఉంటాయి. అవన్నీ బయటకు పోవాలంటే తప్పకుండా నీళ్లు తాగాలి. రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగితే చాలు శరీరం టాక్సిన్లు విసర్జించి రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 6. తులసి ఆకులు తులసి ఆకులు, విత్తనాల్లో విటమిన్-కె , ఐరన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఎర్ర రక్తకణాలు, రక్త శుద్ధికి, వృద్ధికి తులసి ఆకులు, విత్తనాలు ఎంతో మంచివి. 7. పసుపు తప్పనిసరి భారతీయులు పసుపును శుభ సూచకంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. పసుపు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త కణాలకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో కుర్కుమీన్ శరీరంలోని కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ను నాశనం చేస్తుంది. అందుకే, మీరు తినే ఆహారంలో తప్పకుండా పసుపు ఉండేలా చూడండి. 8. ఆకుకూరలు ఎక్కువగా తినండి పచ్చని ఆకు కూరలతోపాటు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి వారంలో ఒక్కసారైనా తీసుకోండి. ఇవి రక్తాన్ని శుద్ధి చేసి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. వీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు రక్తాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 9. నిమ్మరసం మంచిది కాలేయంలోని టాక్సిన్లను తొలగించాలంటే నిమ్మరసం తాగాల్సిందే. రోజూ గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసం పిండుకుని తాగితే రక్త సరఫరా మెరుగవుతుంది. జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తి పెంచుతుంది. 10. ఉసిరి తినండి ఇటీవల ఉసిరి వాడకం చాలా తగ్గిపోయింది. పూర్వికులు ఏదో ఒక రూపంలో ఉసిరిని ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఇది దొరకడమే గగనమైపోయింది. ఒక వేళ మీకు ఉసిరి దొరికితే అస్సలు వదలొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫిటో న్యూట్రియంట్లు, విటమిన్ ఈ, సీ పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా శుద్ధి చేస్తుంది. 11. అల్లం వెల్లులి మంచిది మన వంటకాల్లో అల్లం వెల్లులి ప్రాధాన్యం తెలిసిందే. ఇవి నోటికి రుచే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. వెల్లులిలో అనేక న్యూట్రియంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. పొటాషియం, ఐరన్, విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటాయి. వెల్లులి రక్తపోటును అదుపులోకి ఉంచుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే అల్లంలో విటమిన్ C, B3, B6, మెగ్నీషియం ఉన్నాయి. ఇది శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. రక్తాన్ని శుద్ధిగా ఉంచుతుంది. 12. బ్లాక్ కాఫీ తాగండి రక్తాన్ని శుద్ధి చేసేది కాలేయమే. కాబట్టి.. ఇది సక్రమంగా పనిచేస్తేనే రక్తం కూడా శుద్ధిగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకోండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని, రక్తాన్ని శుద్ధిగా ఉంచుతాయి. ఇందులో ఇంకా విటమిన్ B2, B3 కూడా ఉన్నాయి. మెగ్నీషియం, పోటాషియం, మ్యాంగనీస్లు కూడా శరీరానికి అందుతాయి. 13. ఇవి కూడా మంచివే రక్తంలో ఐరన్ లోపిస్తే బెల్లం తీసుకోండి. ఒమెగా 3 ఎక్కువగా ఉండే సోయాబీన్, చేపలు, అవిసె గింజలు, వాల్నట్స్ను తప్పకుండా తీసుకోండి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు చదవండి: 37 Days Challenge: అతడి విజయ రహస్యమిదే! చెడు అలవాట్లకు దూరంగా.. ఇంకా ఇలా చేశారంటే! Suman Kalyanpur Facts: సుమన్ గొంతు లతాతో సమానం! అయినా ఆమెను ఎదగనివ్వలేదా? ఇన్నాళ్లకు ఎట్టకేలకు.. -
జుట్టు నిగనిగల కోసం... ఆవనూనె, మెంతి పొడి, ఉసిరి పొడి.. ఇంకా
Hair Care Tips: నల్లని నిగనిగలాడే ఒత్తైన కురులు కావాలని కోరుకోని అమ్మాయి ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి వాళ్లు ఈ చిన్న చిట్కాతో నల్లటి జుట్టు సొంతం చేసుకోవచ్చు. ఆవనూనె, మెంతి పొడి.. ఇంకా ►ఇనుప మూకుడు తీసుకుని దానిలో టీకప్పు ఆవనూనె, మరోకప్పు కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ మెంతి పొడి లేదా మెంతులు, టేబుల్ స్పూన్ ఉసిరి పొడి, అరకప్పు ►గోరింటాకు పొడి వేసి బాగా కలపాలి. ►ఇప్పుడు సన్నని మంట మీద ఈ మూకుడు పెట్టి పదినిమిషాల పాటు మరగనివ్వాలి. ఆయిల్ రంగు మారిన తరువాత స్టవ్ ఆపేసి దించి పక్కనపెట్టుకోవాలి. ►చల్లారిన తర్వాత దీనిని ఒక శుభ్రమైన పొడి సీసాలో పోసుకుని ఒక పూటంతా పక్కన పెట్టాలి. ►దీనిని రోజూ తలకు రాసుకోవాలి. ►ఇలా చేయడం వల్ల వెంట్రుకలు నల్లగా నిగనిగలాడతాయి. ►రోజూ వాడటం ఇష్టం లేనివాళ్లు వారానికి ఒకటి రెండుసార్లు తలకు పట్టించి రెండు మూడు గంటల తర్వాత తలస్నానం చేయాలి. ►ఈ ఆయిల్ను వాడటం వల్ల నల్లని ఒత్తైన కురులు మీ సొంతమవుతాయి. చదవండి: Aparna Tandale: మధ్యతరగతి కుటుంబం.. నటి కావాలనే కోరిక.. చీపురు పట్టి స్టార్ అయ్యింది! -
Health Tips: ఉసిరి టీ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!
Health Tips In Telugu- Amla Tea: కొందరికి రెండు గంటలకోమాటు టీ తాగడం అలవాటు. అయితే మధుమేహం ఉన్నవారు పంచదార వేసిన టీ తాగకూడదు. కానీ టీ అలవాటు ఉన్నవారు టీకి బదులు పంచదార కలపని టీ కోసం ప్రయత్నిస్తుంటారు. అయితే ఉసిరి టీ తాగితే ఇటు టీ తాగాలన్న కోరిక తీరడంతోపాటు.. విటమిన్ సి, పీచుపదార్థం, క్యాల్షియం వంటివి శరీరానికి అందుతాయని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి టీని ఎలా తయారు చేసుకోవాలంటే... ►రెండు ఉసిరికాయలు, అరంగుళం అల్లం ముక్క తీసుకోవాలి ►ఈ రెండింటిని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. ►గ్లాసు నీళ్లు తీసుకుని స్టవ్పై పెట్టి గింజలు తీసేసిన ఉసిరి, అల్లం ముక్కలను దానిలో వేసి మరిగించాలి. ►ఇవి మరిగాక నీళ్లలో అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి స్టవ్ ఆపేసేయాలి. ►ఈ నీళ్ల గిన్నెపై మూతపెట్టి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►తరువాత వడగట్టి టీలా తాగాలి. ►ఈ టీని రోజూ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బరువు తగ్గొచ్చు! ►ఉసిరి, అల్లం తాజాగా అందుబాటులో లేనప్పుడు.. కప్పు నీళ్లను వేడిచేసి దానిలో స్పూను ఉసిరిపొడి, స్పూను సొంఠి పొడి, అరస్పూను దాల్చిన చెక్కపొడి వేసి కలపాలి. ►ఈ నీళ్లపై మూతపెట్టి ఐదు నిమిషాలు మరిగించాలి. ►నీళ్లు బాగా మరిగాక దించేసి తాగే వేడికి వచ్చాక వడకట్టకుండా నేరుగా తాగాలి. ►దీనిని తాగడం వల్ల కొవ్వు తగ్గుతుందని.. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యం మీద అవగాహన కోసం మాత్రమే! ఆరోగ్య సమస్యలను బట్టి వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సరైన పరిష్కారం పొందవచ్చు. చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు Heart Healthy Foods: గుండెకు మేలు చేసే ఆహార పదార్థాలు ఇవే! అయితే ప్రతి రోజూ ఓట్స్ తినడం వల్ల.. -
రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఉసిరి!.. ఆమ్ల క్యాండీ తయారీ ఇలా
ఆరోగ్యసిరినిచ్చే ఉసిరితో ఆమ్ల క్యాండీ ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు అందిపుచ్చుకోండి. ఆమ్ల క్యాండీ తయారీకి కావలసినవి: ►ఉసిరి కాయలు – 250 గ్రాములు ►చక్కెర – 150 గ్రాములు ►జీలకర్ర పొడి– టీ స్పూన్ ►శొంఠి పొడి– టీ స్పూన్ ►చక్కెర పొడి –2 టీ స్పూన్లు ►ఫుడ్ కలర్ – చిటికెడు (ఇష్టమైతేనే). తయారీ: ►ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి. ►ఒక పాత్రలో వేసి కాయలు మునిగేటట్లు నీటిని పోసి మరిగించాలి. ►నీరు మరిగిన తర్వాత ఉసిరికాయలను వేసి రెండు నిమిషాలు మరిగించిన తర్వాత పాత్రను స్టవ్ మీద నుంచి దించి నీటిని వంపేయాలి. ►ఉసిరికాయలను కట్ చేసి గింజలను తీసివేయాలి. ►ఉసిరి పలుకులలో జీలకర్ర, అల్లం పొడి, చక్కెర వేసి పాత్రకు మూతపెట్టి పక్కన పెట్టాలి. ►మరుసటి రోజుకు చక్కెర కరిగి ఉసిరి పలుకులు చక్కెర ద్రావణంలో తేలుతుంటాయి. ►మూడవ రోజుకు చక్కెర ద్రావణాన్ని ఉసిరి పలుకులు దాదాపుగా పీల్చుకుంటాయి. ►మూడవ రోజు ఉదయం ఉసిరి ముక్కలను ఒక పాలిథిన్ షీట్ మీద వేసి ఆరనివ్వాలి. ►తేమ పూర్తిగా పోవాలంటే రెండు రోజులు ఎండలో ఆరబెట్టాలి. ►తగినంత ఎండ లేకపోతే మూడవరోజు కూడా ఆరబెట్టాల్సి ఉంటుంది. ►చివరగా చక్కెర పొడిలో ఫుడ్ కలర్ కలిపి ఆ పొడిని ఎండిన ఉసిరి పలుకుల మీద చల్లాలి. వీటిని గాలిచొరని సీసాలో నిల్వ చేసుకుని రోజుకొకటి తినవచ్చు. ఆరోగ్య లాభాలు ►ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ పెరగడానికి దోహదం చేస్తాయి. ►నోరు రుచిలేనట్లు ఉన్నప్పుడు భోజనానికి గంట ముందు ఒక పలుకు తింటే రుచిగ్రంథులు ఉత్తేజితమవుతాయి. ►గర్భిణికి కడుపులో వికారం తగ్గిస్తుంది. చదవండి: Health Tips: రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల ఇవి కూడా ట్రై చేయండి: Green Peas Akki Roti: బియ్యప్పిండి, పచ్చి బఠాణీలతో.. గ్రీన్ పీస్ అక్కీ రోటీ తయారీ కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా -
Health: మానసిక దృఢత్వం కోసం.. ముడి పెసలు, ఉసిరి.. ఇంకా! ఇవి మాత్రం తినొద్దు!
ఇటీవలి కాలంలో మానసిక వ్యాధులు అధికం అవుతున్నాయి. అతి సున్నితమైన మనస్తత్వం వల్ల, చిన్నప్పటినుంచి ఎక్కువ గారాబంగా పెరగడం వల్ల, జీవితంలో ఏదయినా అనుకోని సంఘటనలు ఎదుర్కొనవలసి రావడం వల్ల మానసిక వ్యాధులు కలుగుతాయి. అలా మానసిక వ్యాధులు రాకుండా ఉండాలంటే మానసికంగా దృఢంగా ఉండాలి.... మానసికంగా దృఢంగా ఉండాలంటే మన జీవనశైలిలో తగిన మార్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే పదార్థాలు తీసుకోవాలి, ఏయే పదార్థాలు తీసుకోకూడదో చూద్దాం. Foods That Boost Mental Health: ఇవి తీసుకోవాలి ►ఎక్కువ పాలిష్ చేయని బియ్యం ►ముడి పెసలు ►తాజా పాలు ►నెయ్యి ►గోధుమలు ►వెన్న ►బూడిద గుమ్మడికాయ ►పరిశుభ్రమైన ఆహారం ► సీజనల్ పండ్లు, కూరగాయలు ►ద్రాక్ష ►దానిమ్మ ►ఉసిరి ►చేపలు ►కొవ్వు ఎక్కువగా ఉండని మాంసం ►యాపిల్ ►ఆర్గానిక్ ఎగ్స్. మానేయవలసినవి ►కలుషిత ఆహారం అంటే రోడ్డు వెంట దొరికే అపరిశుభ్రమైన ఆహారం తినడం ►రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ ►కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం (దీనివల్ల న్యూరోట్రాన్స్మిటర్స్ పనితీరుపై ప్రభావం పడుతుంది) ►స్మోకింగ్, గుట్కాలు తినడం ►ఫాస్ట్ఫుడ్కు అలవాటు పడటం ►ఊరగాయలు, కారాలు, మసాలాలు అధికంగా ఉన్న ఆహారం ►డీప్ ఫ్రీజర్లో నిల్వ ఉంచిన కోల్డ్ ఫుడ్ ►అధికంగా పుల్లగా ఉండే పదార్థాలు (పులియబెట్టినవి, వెనిగర్ లాంటివి) ►అతి కష్టంమీద జీర్ణమయ్యే ఆహారం ►బూజు పట్టిన, పాడైన, కుళ్లిన ఆహారం తీసుకోవడం ►అధికంగా తినడం, తీసుకున్న ఆహారం అరగకముందే మళ్లీ తినడం ►పాలు–గుడ్డు లేదా చేపలు, వేడి–చల్లని పదార్థాలు కలిపి తీసుకోవడం, పండ్లు–పాలు కలిపి తీసుకోవడం. చదవండి: Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! నల్లని, ఒత్తైన కురులు..! Health Tips: కాలీఫ్లవర్, క్యారెట్లు, బీట్రూట్, పుట్టగొడుగులు అతిగా తింటే అంతే సంగతులు! కాస్త.. -
నష్టమే రాని పంట.. ఒక్కసారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడి
నగరి/విజయపురం(చిత్తూరు జిల్లా): సంప్రదాయ పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఒకసారి సాగు చేస్తే 40 ఏళ్ల వరకు దిగుబడినిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయం అందిస్తోంది. తెగుళ్ల బెడద నుంచి కాపాడుతోంది. పెట్టుబడి ఖర్చును తగ్గిస్తోంది. మరోవైపు ఈ పంట సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. ఇది ఆయుర్వేద ఔషధంగానూ ఉపయోగపడుతోంది. అధిక దిగుబడితోపాటు రైతులకు లాభాల పంట పండిస్తోంది. చదవండి: జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ! పండించే పంట దిగుబడి లేదని, దిగుబడి బాగా వచ్చినా మార్కెట్లో మంచి ధర పలకలేదని, నేల సారవంతంగా లేదని.. ఇలా రకరకాల కారణాలు రైతులను కుంగదీస్తున్నాయి. అయితే వ్యవసాయంలో ఆశించిన లాభాలు చూడలేమని నీరసించిన రైతులకు ఉసిరి పంట ఊరటనిస్తోంది. ఏడాదికి రెండు సార్లు ఫలసాయాన్ని అందిస్తూ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను కురిపిస్తూ రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు రూ.18 వేలు సబ్సిడీ అందిస్తోంది. ఆయుర్వేద ఔషధం ఆయుర్వేద వైద్యంలో ఉసిరే కీలకం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవిత కాలంలో ఐదు ఉసిరి మొక్కలైనా నాటాలని పూర్వీకులు చెబుతారు. మనకు రోగనిరోధకశక్తి పెరగాలంటే సి–విటమిన్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. కరోనా పుణ్యమా అని దీనిపై అందరికీ అవగాహన పెరిగింది. అయితే సి విటమిన్ ఎక్కువగా ఉండే వాటిలో ప్రథమ స్థానం ఉసిరికే దక్కుతుంది. ఆరోగ్యాన్ని అందించే ఉసిరి రైతులు లాభాలను కూడా మెండుగా అందిస్తోంది. 200 ఎకరాల్లో సాగు విజయపురం మిట్టూరు, శ్రీహరిపురం, కాకవేడు ప్రాంతాల్లోని రైతులు ఉసిరి పంటను సాగు చేస్తున్నారు. రెండు మండలాల్లో సుమారు 200 ఎకరాల్లో ఉసిరి సాగవుతోంది. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకునే రైతులు ఈ ప్రాంతాల్లో సాగుచేస్తున్నారు. ఒక్క సారి సాగు చేసి మొక్కలు నాటితే రెండేళ్లకు కాత వచ్చి ఏడాదికి రెండు సార్లు ఫల సాయం అందుతోంది. ఎకరాకు 200 చెట్లు నాటి సాగుచేసిన రైతులు చెట్టు పెరుగుదలను అనుసరించి ఎకరాకు రెండు నుంచి 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. ఒక్క సారి మొక్కలు నాటితే 30 నుంచి 40ఏళ్ల వరకు ఫలసాయం అందుతుందని ఉద్యానవన అధికారులు తెలుపుతున్నారు. ఉసిరి చెట్టు నీటి కొరతను చాలా వరకు తట్టుకుంటుంది. చీడపీడలు, తెగులు ఎక్కువగా ఆశించదు. ఈ కారణంగా సాగు ఖర్చు తగ్గుతుంది. రాబడిలో ఖర్చు 10 శాతం మాత్రమే ఉంటుంది. డిమాండ్ను బట్టి టన్నుకు రూ.30 వేలు నుంచి 50 వేలు వరకు ధర పలుకుతుంది. నగరి, విజయపురం మండలాల్లో సాగుచేసే ఉసిరి మన రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, తెనాలితో పాటు తమిళనాడు, తెలంగాణలని ఫ్యాక్టరీలకు రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి ఫ్యాక్టరీలకు తరలి వెళ్లే ఉసిరితో మందులు, సిరప్లు, ఆయిల్, సోపు, ఊరగాయలు తయారుచేసి మార్కెట్లో విక్రయిస్తారు. లాభాలనిస్తోంది.. పదిహేనేళ్ల నుంచి ఉసిరి సాగు చేస్తున్నాను. తమిళనాడు తంజావూరు నుంచి మొక్కలను తెచ్చుకున్నా. ఇప్పటి వరకు ఆ చెట్లే ఫలసాయాన్ని అందిస్తున్నాయి. ఏడాదికి రెండు సార్లు కాపు వస్తోంది. తెగుళ్లు, చీడపీడల సమస్య ఎక్కువగా ఉండదు. పంట మధ్య కలుపు పెరగకుండా చూసుకుంటూ, చెట్లను పరిశీలించి తెగులు ఎక్కడైనా కనిపిస్తే మందులు స్ప్రే చేసుకుంటే చాలు. మంచి దిగుబడి చూడవచ్చు డిమాండ్ను అనుసరించి ఎకరాకు రూ.లక్ష వరకు లాభం ఉంటుంది. – జయరామరాజు, మిట్టూరు, విజయపురం మండలం. అవగాహన కల్పిస్తున్నాం నగరి, విజయపురం మండలాల్లో 15 యేళ్ల క్రితం నుంచి ఉసిరి పంట సాగవుతోంది. మెలమెల్లగా ఉసిరి సాగులో లాభాలను చూసిన రైతులు సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి ఉసిరి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పంట సాగులో నష్టాలు వచ్చేందుకు ఆస్కారం లేదు. ఒక్క సారి సాగుచేస్తే 40 ఏళ్ల వరకు ఈ పంట దిగుబడిని అందిస్తుంది. ప్రస్తుతం ఉసిరికి మార్కెట్లో ఎక్కువగా డిమాడ్ ఉంది. ఈ పంట సాగుకు ప్రభుత్వం హెక్టారుకు 18 వేలు వరకు సబ్సిడీ అందిస్తుంది. – లోకేష్, ఉద్యానవన అధికారి, నగరి -
రసాయనాలు వాడకుండా ఇంట్లోనే షాంపు తయారు చేసుకోవచ్చు.. అదెలాగంటే..
కాలుష్యం, జీవనశైలిలో మార్పులు, సరిగా పట్టించుకోకపోవడం, రసాయన షాంపుల వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతిని నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా విపరీతంగా జుట్టు రాలడం, త్వరగా రంగు మారడంతోపాటు, వెంట్రుకలు చిట్లిపోతుంటాయి. ఈ సమస్యలన్నింటిని అధిగమించేందుకు ఇంట్లోనే ఎంచక్కా ఎటువంటి రసాయనాలు వాడకుండా షాంపు తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. ► ఉసిరి పొడి, కుంకుడు కాయలు, శీకాకాయ, మెంతులను వందగ్రాముల చొప్పున తీసుకోవాలి. వీటన్నింటిని బాగా ఎండబెట్టాలి. ► తడిలేకుండా ఎండిన తరువాత అన్నింటిని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. ► ఉదయం దీనిలో ఒక గ్లాసు నీళ్లు పోసి సన్నని మంటమీద ఉడికించాలి. ► అరగంట తరువాత చల్లారనిచ్చి వడగట్టి సీసాలో నిల్వచేసుకోవాలి. తలస్నానం చేయాలనుకున్నప్పుడల్లా ఈ నీటిని షాంపుగా వాడుకోవాలి. ► ఈ షాంపు తలలో అధికంగా ఉన్న ఆయిల్, దుమ్ము దూళిని వదిలించి కుదుళ్లకు పోషణ అందిస్తుంది. ► ఈ షాంపుని క్రమం తప్పకుండా వాడితే జుట్టురాలడం తగ్గి, కొత్త జుట్టువస్తుంది. చదవండి: నిద్ర లేకపోతే ఎంత డేంజరో తెలుసా? మీకు తెలియని షాకింగ్ విషయాలు ►ఐదారు ఉల్లిపాయ తొక్కలు, వందగ్రాముల మెంతులు, యాభై గ్రాముల అలోవెరా జెల్, యాభై గ్రాముల టీ పొడి, విటమిన్ ఈ క్యాప్య్సూల్ ఒకటి, బేబి షాంపు యాభై గ్రాములు తీసుకోవాలి. ► ఉల్లిపాయ తొక్కలు, మెంతులు, టీ పొడిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి మరిగించాలి. అన్ని మరిగి, నీళ్లు రంగు మారాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ► చల్లారాక ఈ నీటిని సీసాలో వేసి విటమిన్ ఈ క్యాప్సూయల్, అలోవెరా జెల్, బేబి షాంపు వేసి బాగా షేక్ చేయాలి. ►పదిగంటలపాటు కదల్చకుండా పక్కన పెట్టేయాలి. తరువాత దీనిని షాంపులా వాడుకోవచ్చు. ► ఈ షాంపు జుట్టుకు పోషణ అందించడంతోపాటు, చుండ్రును దరిచేరనివ్వద్దు. ► ఉల్లిపాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి, మందంగా పెరిగేలా చేస్తాయి. చదవండి: రంగుల కేళీ హోలీ రోజున ఈ స్వీట్ రుచి చూడాల్సిందే.. -
రోజూ ఉసిరికాయ తింటున్నారా... ఇందులో ఉండే క్రోమియం వల్ల
ఏ విద్యలో అయినా ఫలానా వారు బాగా నిష్ణాతులు అని చెప్పడానికి వారికి అది కరతలామలకం అని అనడం తెలుసు కదా... ఆమలకం అంటే ఉసిరికాయ. కరతలం అంటే అరచేయి. అంటే అరచేతిలో ఉసిరికాయలా అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, అరచేతిలో ఉసిరికాయ ఉంటే అది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దివ్యౌషధంలా పని చేస్తుందని. అవేమిటో చూద్దాం. ►ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరిని మించిన మందు మరొకటి లేదని అనుభవజ్ఞులు చెబుతుంటారు. ►రోజూ ఓ ఉసిరికాయని తింటే శ్లేష్మ సమస్యలన్నీ తొలగిపోతాయి. కంటి సమస్యలకి ఉసిరి చాలా మంచిది. ►ఉసిరికాయల్ని ముద్దగా చేసి తలకి పట్టిస్తే కళ్ల మంటలు తగ్గుతాయట. ►ముఖ్యంగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా చేయడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడకుండా ఉంటుంది. ►ఆయుర్వేదమే కాదు, అల్లోపతీ కూడా ఉసిరిని ఔషధ సిరి అని కొనియాడుతుంది. ఎందుకంటే ఉసిరిలోని యాంటీ మైక్రోబియల్, యాంటీవైరల్ గుణాల వల్ల రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. ఇందులో ఉండే క్రోమియం ఇన్సులిన్ స్రావాన్ని పెంచడం ద్వారా చక్కెర నిల్వల్ని తగ్గించి హృద్రోగాలూ మధుమేహం... వంటివి రాకుండా అడ్డుకుంటుందనీ తేలింది. కొన్నిరకాల క్యాన్సర్లను సైతం తగ్గించగల గుణాలు ఉసిరికి ఉన్నాయి. ►రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు అనేకం. అందుకే మన దేశంలో అధికంగా పండే ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, ట్యాబ్లెట్ల రూపంలో నిల్వచేసి ప్రపంచ వ్యాప్తంగా విక్రయిస్తున్నారు. కురులకు ఉ‘సిరి’ ►కురుల సంరక్షణకు ఉసిరి చేసే మేలు అంతా ఇంతా కాదు. రోజూ తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదుళ్లకు పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో బాటు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఉసిరితో చేసే షాంపూలూ నూనెలూ జుట్టుకి బాల నెరుపునీ చుండ్రునీ తగ్గిస్తాయి. అలాగే ఇందులోని సి–విటమిన్ ఎండ నుంచీ, చర్మరోగాల నుంచీ కాపాడటమే కాదు, శరీరానికి మంచి మెరుపునీ ఇస్తుంది. ►రోజూ ఓ ఉసిరికాయని తింటే కాల్షియం ఒంటికి పట్టడం పెరుగుతుంది. దాంతో ఎముకలూ, దంతాలూ, గోళ్లూ, వెంట్రుకలూ ఆరోగ్యంగా ఉంటాయి. అందుకే మరి... తాజాగా, ఎండు పండుగా, ట్యాబ్లెట్గా లేదా పొడి రూపంలో–ఎలా తీసుకున్నా ఉసిరి... అందాన్నీ ఆరోగ్యాన్నీ సంరక్షించే అద్భుత ఔషధ సిరి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
Beauty Tips: ఈ సమయంలో హెయిర్ డ్రయ్యర్ అస్సలు వాడకూడదు!
Amazing Beauty And Kitchen Tips In Telugu Hair Care And Face Pack: సి విటమిన్ పుష్కలంగా కలిగి ఉండే ఉసిరితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఉసిరి పేస్టుతో అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడం ఎలాగో తెలుసుకుందామా? ►రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పేస్టులో టేబుల్ స్పూను పెరుగు, టీస్పూను తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. రెగ్యులర్గా ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద, మెడ మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుతుంది. చర్మంపై ముడతలు తొలగించుకోవచ్చు! ►రెండు టేబుల్ స్పూన్ల తాజా అలోవెరా జెల్లో, టేబుల్ స్పూను తేనె, టేబుల్ స్పూను గంధం పొడి వేసి పేస్టులా కలుపుకోవాలి. ఈ పేస్టుని ముఖం, మెడకు అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవాలి. దీనివల్ల అలోవెరా జెల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి తేమనందించి మృదువుగా మారుస్తాయి. గంధం పొడి మొటిమలను తగ్గించడమేగాక, చర్మంపై ఉన్న ముడతలను తొలగిస్తుంది. ►ఉసిరికాయ ముక్కలను నాలుగురోజుల పాటు నీడలో ఎండబెట్టాలి. ఈ ముక్కలను కొబ్బరి నూనెలో వేసి రంగు మారేంత వరకు మరిగించాలి. నూనె చల్లారాక తరువాత తలకు రాసుకుని మర్దన చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. శీతాకాలంలో అస్సలు ఇలా చేయొద్దు ►చలికాలంలో జుట్టు బలహీనంగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో హెయిర్ స్టైల్ కోసం ఎటువంటి హెయిర్ స్టైలింగ్ స్టూల్స్ను వాడకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ హెయిర్ డ్రైయ్యర్ను వాడకూడదు. కిచెన్ టిప్స్: ►వంటనూనెలో లవంగాలు వేసి ఉంచితే పాడవకుండా ఎక్కువకాలం ఉంటుంది. ►పచ్చిబటానీలను ఉడికించేటప్పుడు చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి. ►చపాతీ పిండిలో ఉడికించిన బంగాళదుంపను కలపాలి. ఈ పిండితో చపాతీలు చేస్తే చపాతీలు మృదువుగా ఎక్కువసేపు తాజాగా ఉంటాయి. ►పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో టీ స్పూను నెయ్యి కలపాలి. ►చెక్కతో చేసిన గరిటెలు, చెంచాలు వాసన వస్తుంటే.. వెనిగర్ కలిపిన నీటిలో కాసేపు నానబెట్టి తరువాత కడిగి వాడుకోవాలి. -
ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్నారో పార్లర్కి వెళ్లాల్సిన పనేలేదు!
మీ వయసు కంటే పదేళ్ల పెద్దవాళ్లలా కనిపిస్తున్నారా? పని ఒత్తిడి, కాలుష్యం కారణమేదైనా.. చర్మంపై ముడతలు, మచ్చలు, నల్లని వలయాలు, మృతకణాలు ఏర్పడి చర్మాన్ని జీవం కోల్పోయేలా చేస్తుంది. ఇంట్లోనే తయారు చేసుకునే ఈ ఫేస్ ఫ్యాక్ ద్వారా మీ చర్మానికి తిరిగి జీవం పోయొచ్చంటున్నారు బ్యూటీషియన్లు. మందారం, ఉసిరిలతో ఫేస్ ప్యాక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో, ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. కావల్సిన పదార్ధాలు ►1 మందారం పువ్వు లేదా 2 టేబుల్ స్పూన్ల మందారం పువ్వు పొడి ►1 టేబుల్ స్పూన్ తేనె ►2 టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి లేదా 1 మీడియం సైజు ఉసిరి కాయ తయారీ ఇలా ►మందారం పువ్వు పొడి లేనట్లయితే ఒక మందారం పువ్వును ఒక రాత్రంతా నానబెట్టి మెత్తగా గ్రేండ్ చెయ్యాలి. ►అలాగే ఉసిరి పొడి అందుబాటులో లేకపోతే మీడియం సైజు ఉసిరి కాయను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ►వీటికి తేనె జోడించి అన్నింటినీ బాగా కలుపుకుంటే ఫేస్ ప్యాక్ రెడీ. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! ఎలా అప్లై చేయాలంటే.. 5-7 నిముషాలు ముఖానికి ఆవిరిపట్టించాలి. ఇలా చేయడం ద్వారా చర్మ గ్రంధులన్నీ తెరచుకుంటాయి. ఫలితంగా ఫేస్ ప్యాక్లో ఉన్న అన్ని పధార్థాలు చర్మంలోకి చొచ్చుకుని పోయి రెట్టింపు ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమాన్ని ముఖం అంతటా ఫ్యాక్లా వేసుకుని 20 నిముషాల పాటు ఉంచుకుని, చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇవీ ప్రయోజనాలు.. వారానికి కనీసం ఒక్కసారైనా ఈ ఫేస్ ప్యాక్ వాడితే, దీనిలోని విటమిన్ సి, చర్మానికి న్యాచురల్ మాయిశ్చరైజర్లా పనిచేసి, తడిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా కాపాడి, చర్మం మెరిసేలా చేస్తుంది. అలాగే మందారం పువ్వు చర్మంలోని మృతకణాలను, మురికిని తొలగించి కాంతివంతం చేస్తుంది. నల్లని వలయాలను, ముడతలను కూడా నివారిస్తుంది. చదవండి: Health Tips: గుడ్డు, బీట్రూట్, ఉసిరి, పాలకూర.. వీటితో ఐరన్ లోపాన్ని తరిమేద్దాం..! -
ఇమ్యూనిటి బూస్టింగ్ డ్రింక్ తయారు చేసుకోండిలా!
తాజాగా ఉన్న మునగాకులను అరకప్పు తీసుకుని దానిలో విత్తనం తీసేసిన పచ్చి ఉసిరికాయను ముక్కలుగా కోసి వేయాలి. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దానిలో అరగ్లాసు నీళ్లు పోసి జ్యూస్లా చేసుకోవాలి. తరువాత జ్యూస్ను వడగట్టి రోజూ పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మునగ ఆకులు అందుబాటులో లేనివారు, వీటికి బదులు కొత్తిమీర, పుదీనాను వాడ వచ్చు. ఉసిరి కాయ లేకపోతే మునగ ఆకుల పేస్టులో నిమ్మరసాన్ని పిండుకోవచ్చు. ఇమ్యూనిటీ పేస్ట్! నాలుగు కరివేప ఆకులు, తులసి ఆకులు నాలుగు తీసుకుని మెత్తని పేస్టులాగా నూరుకోవాలి. ఈ పేస్టుని ఒక గిన్నెలోకి తీసుకుని స్పూన్ తేనె వేసి బాగా కలుపుకోని తినాలి. రోజూ ఏదోక సమయంలో ఈ పేస్టు తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది. బ్యూటిప్స్ బ్లాక్ హెడ్స్, మృతకణాలు తొలగిపోతే ముఖవర్ఛస్సు పెరుగుతుంది. ఈ రెండింటిని తొలగించుకోవడానికి.. ఒక అరటిపండును తీసుకుని మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. దీనిలో బరకగా పొడిచేసుకున్న ఒక స్పూన్ ఓట్స్, స్పూను తేనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఎనిమిదో నంబర్ ఆకారంలో గుడ్రంగా, పైనుంచి కిందకు, కింద నుంచి పైకి మర్దనా చేసుకుని పది నిమిషాలపాటు అలా వదిలేయాలి. తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడిగి, తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే బ్లాక్హెడ్స్ పోయి ముఖం మెరుస్తుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ ఉన్న వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. -
జుట్టు సమస్యకు రవీనా టండన్ చిట్కాలివే ..
ముంబై: పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందిన బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఓ చిట్కా చెప్పింది. ప్రస్తుత ప్రపంచంలో జుట్టు రాలడమనేది అతి పెద్ద సమస్య. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి. కాగా రవీనా వరుసగా బ్యూటీ సిరీస్ పేరుతో ఆరోగ్య చిట్కాలను చెప్పనున్నారు. ప్రస్తుతం జట్టు సమస్యతో బాధపడుతున్న వారికి స్వాంతన కలిగించే చిట్కా చెప్పారు. ఎన్ని కెమికల్స్ వాడినా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని, కొద్ది రోజుల తర్వాత జుట్టు సమస్యతో బాధపడుతుంటారని రవీనా తెలిపింది. కాగా ప్రతి రోజు కొన్ని ఉసిరికాయలను(ఆమ్లా)తినడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చని పేర్కొంది. జట్టు రాలడాన్ని నివారించే రవీనా ఉసురికాయ(ఆమ్లా) మిశ్రమం: మొదట ఓ కప్పు పాలలో కొన్ని ఉసురుకాయాలను వేయాలి. ఆ తర్వాత ఉసిరి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. కాగా బయట ఉన్న ఉసురి పోరలను తీసి వేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జను జుట్టుకు మర్దన చేశాక, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రపరచాలి. ఈ పద్దతిని మీరు పాటించగలిగితే త్వరలోనే షాంపో వాడకాన్ని తగ్గించవచ్చని రవీనా టండన్ తెలిపింది. (చదవండి: వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు) -
ఆహా! ఆవకాయ
పచ్చళ్ల సీజన్ వచ్చేసింది.. మార్కెట్లో మామిడి, ఊసిరి, పండు మిర్చి, చింతకాయలు సందడి చేస్తున్నాయి.. ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకోవడం ఆనవాయితీ.. మామిడికి మంచి గిరాకీ ఉంది.. ముద్దపప్పు, ఆవకాయకు తోడు నెయ్యి ఉంటే నోరురాల్సిందే.. ప్రస్తుతం లాక్డౌన్ ఉన్నా నిబంధనలు పటిస్తూనే పచ్చళ్ల తయారీలో మహిళలు మునిగిపోయారు. సాక్షి, విజయవాడ: ఊరగాయ పచ్చళ్ల తయారీకి కృష్ణా జిల్లా ప్రసిద్ధి. పచ్చడి నిల్వకు అనువుగా ఉండే కాయలు అందుబాటులో ఉన్నాయి. అందులో మామిడి పచ్చడికి అగ్రస్థానం ఉంది. ఇక్కడ తయారీ చేసినా పచ్చళ్లు దేశవిదేశాలకు సరఫరా చేస్తుంటారు. పల్లె నుంచి పట్టణాల వరకు ప్రజలు పచ్చళ్లు సొంతగా తయారు చేసుకునే అలవాటు తెలుగు ప్రజలకు ఎప్పటి నుంచో ఉంది. దీంతో మహిళలు రకరకాల ఊరగాయ పచ్చళ్లు, వడియాలు, అప్పడాలు, ఊరమిరపకాయలు ఏడాదికి సరిపడా సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మామిడి తరువాత చింతకాయ, ఊసిరికాయ, మాగాయి పచ్చళ్లు ఉంటాయి. ఎవరి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో తినేవారి తిండిపుష్టిని పట్టి ఏడాదికి సరిపోను పచ్చళ్లు తయారు చేసుకుని నిల్వ చేసుకుంటారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూనే... కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం లాక్డౌన్ను అమలు చేస్తోంది. నిబంధనలు పరిధిలో మహిళలు వేసవిలో పట్టాల్సిన ఊరగాయపచ్చళ్లు పట్టేస్తున్నారు. ఉదయం లాక్డౌన్ సడలించిన సమయంలో మహిళలు హడావుడిగా మార్కెట్కు, రైతుబజార్లకు వచ్చి మామిడికాయలు కొనుగోలు చేసి అక్కడే అందుబాటులో ఉంటే మేదర్లు చేత ఆవకాయ ముక్కలు కొట్టించుకుని 9 గంటల లోగా ఇళ్లకు చేరుతున్నారు. అక్కడ నుంచి ఒకటి రెండు రోజుల్లో రుచికరమైన ఆవకాయ పచ్చడి సిద్ధం చేస్తున్నారు. పురుషులు ఇళ్లలోనే ఉండటం ఊరగాయ పచ్చళ్లు, వడియాలు తయారీలో మహిళలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మహిళల ముందు చూపు.. రాత్రికి రాత్రి కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించినా ఆంధ్రా మహిళలు ఏమాత్రం బెదిరిపోలేదు. నెలరోజులుగా ఇళ్లలో కూరలు, సరుకులు లేకపోయినా.. కుటుంబాలు పస్తులు ఉండకుండా నాలుగు పచ్చడి మెతుకులతోనైనా భోజనం కానిచ్చేయడం వెనుక మహిళల ముందు చూపు ఎంతో ఉంది. పచ్చళ్లకు తోడుగా వడియాలు, అప్పడాలు కలిపారంటే భోజనం సంపూర్ణంగా పూర్తయినట్లే. ప్రస్తుత వేసవిలో ఊరగాయపచ్చళ్లు పెట్టుకోకపోతే ఏడాదంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని పద్మావతి అనే మహిళ ‘సాక్షి’కి తెలిపింది. లాక్డౌన్ ఎత్తి వేసే వరకు ఆగితే మామిడికాయలు పండిపోయి పచ్చడి పాడైపోతుందని, అందువల్ల తప్పని పరిస్థితుల్లో ఇప్పుడే పెట్టేస్తున్నామని చెబుతున్నారు. నిరుపేదలకు ఉపాధి.. వెదురు కర్రతో తడికలు, బుట్టలు తయారు చేసుకునే మేదర్లకు ప్రస్తుత సీజన్లో మామిడి కాయలు ముక్కలుగా నరికి ఇచ్చి నాలుగు రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క కాయను ముక్కలుగా కట్ చేయడానికి సైజును బట్టి రూ.5 నుంచి రూ.10 వసూలు చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం పూట మూడు గంటలు కష్టపడితే రూ.200 వరకు ఆదాయం వస్తోందని కేదారేశ్వరపేట వంతెన వద్ద మామిడి కాయలు తరిగే ప్రసాద్ తెలిపాడు. లోకమణికి డబ్బులు పంపిస్తున్న ఎన్నారైలు -
చుండ్రుకు ఉసిరి
కాలానికి తగ్గట్టు వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రకృతి కొన్ని వరాల ఔషధాలను కూడా ఇచ్చింది. వాటిలో ప్రధానమైంది ఉసిరి. ఈ కాలంలో మనల్ని విసిగించే చుండ్రు సమస్యను ఉసిరితో తేలిగ్గా పరిష్కరించుకోవచ్చని ప్రకృతి వైద్యులు చెబుతున్నారు. రాత్రిపూట ఉసిరి ముక్కలు లేదా ఉసిరి పొడి నీళ్లలో వేసి నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఆ నీటిని మాడుకు పట్టించి, జుట్టును తడపాలి. పదినిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీని వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఉసిరి రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు తలకు రాసుకోవాలి. దీని వల్ల వెంట్రుకలు రాలడం, చుండ్రు తగ్గుతుంది. ఎండిన ఉసిరి ముక్కలను కొబ్బరినూనెలో వేసి బాగా మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెతో మాడుకు మసాజ్ చేసుకోవాలి. రోజూ ఈ విధంగా చేస్తూ ఉంటే చిన్నతనంలో వచ్చే తెల్ల జుట్టు నల్లబడే అవకాశాలు ఎక్కువ. చుండ్రు కూడా తగ్గుతుంది. -
ఆమలకం అత్యుత్తమం
ప్రాణికోటి సమస్తం ఆరు ఋతువుల ధర్మాలకు అనుగుణంగా నడచుకోవటం ఆరోగ్యానికి అవసరం. శరదృతువులో వచ్చే కార్తిక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసే ఉత్సవం వన భోజనం. ఈ కాలంలో లభించే ఉసిరికాయ క్రమంగా ఫలంగా మారి బలీయమైన గుణధర్మాలు కలిగి ఉంటుంది. సంస్కృతంలో ఆమలకీ, అమృతఫల, శ్రీఫల, శివ మొదలైన పేర్లతో పిలుస్తారు. గుణధర్మాలు: దీని రుచి షడ్రసాలలో ఉప్పు మినహా తక్కిన ఐదు (తీపి, పులుపు, కటు, తిక్త, కషాయ రసాలు) కలిగి ఉంటుంది. ప్రధానంగా నోటికి తగిలేది పులుపు, తీపి, వగరు, త్రిదోష (వాత, పిత్త, కఫ) శ్యామకం. వివిధ ఔషధ రూపాలు: పచ్చిగా రసం తీసినా, ఎండబెట్టి వరుగులు చేసినా, గింజలు తీసేసి, ఎండిన వరుగులను చూర్ణం చేసినా, మురబ్బా చేసినా, రోటి పచ్చడి చేసినా నిల్వ ఉండే ఊరగాయగా మలచినా, కొంచెం వేడి చేసినా, దీనిలోని పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. విశిష్ట ఔషధ ప్రయోగాలు: వయస్థాపకం (ముసలితనాన్ని రానీయదు), వృష్యం (శుక్ర కరం), రసాయనం. (సప్త ధాతు పుష్టికరం): ప్రతిదినం రెండు చెంచాల ఉసిరిక రసం ఒక చెంచా తేనెతో సేవించాలి. ఇది మెదడుకి పదును పెట్టి తెలివితేటలు పెంచుతుంది. జ్వరాలు: ఉసిరికాయల రసాన్ని నేతితో వేడి చేసి సేవించాలి. ఆకలి కలగడానికి: ఉసిరికాయలకు నెయ్యి, జీలకర్ర, ఇంగువ చేర్చి, నేతితో ఉడికించి తినాలి. అర్శస్ (పైల్స్/మూల శంక): మజ్జిగలో తిప్ప తీగ, ఉసిరిక రసాలను కలిపి తాగాలి. ఉసిరిక చూర్ణానికి కరక్కాయ, తానికాయ చూర్ణాలను కూడా కలిపి సేవించాలి (త్రిఫల చూర్ణం) కామెర్లు (జాండిస్): ఉసిరిక రసం + ద్రాక్ష రసం ముక్కులోంచి రక్తస్రావం (ఎపిన్టాక్సిన్): ఉసిరి కాయల ముద్దను నేతితో కలిపి వేడి చేసి తలపై పట్టించాలి. బొంగురు గొంతు: ఉసిరిక రసం + పాలు ఎక్కిళ్లు (హిక్క): ఉసిరిక రసం + వెలగ కాయ, పిప్పళ్ల చూర్ణం + తేనె దగ్గు: ఆమలకీ చూర్ణం + పాలు, నెయ్యి మూర్ఛ: ఉసిరిక చూర్ణ కషాయం + తేనె హృదయ రోగాలు: చ్యవనప్రాశ, అగస్త్య లేహ్యాలు (వీటిలో – ఆమలకీ ప్రధాన ద్రవ్యం) వాంతులు: పెసరపప్పుతో జావ కాచి, చల్లార్చి, ఉసిరిక రసం కలిపి సేవించాలి. ఉసిరి వలన తగ్గే ఇతర రోగాలు: దద్దుర్లు, దురదలు, మచ్చల వంటి అనేక చర్మరోగాలు; తెల్లబట్ట వంటి స్త్రీ రోగాలు, మూత్ర రోగాలు (ప్రమేహ): శృంగార సమస్యలను తొలగించే వాజీకరణం కూడా. శిరోజాలకు మంచిది. కంటి చూపునకు చాలా మంచిది. ఆధునిక శాస్త్రం రీత్యా పోషక విలువలు: పీచు అధికంగా ఉండి శక్తి వర్ధక పోషకాలు కలిగి ఉంటుంది. విటమిన్ సి ప్రధానంగా అన్ని విటమినులూ ఉంటాయి. క్యాల్షియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీసు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఐరన్ వంటి లవణాలన్నీ పుష్కలంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు అతి తక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంటుగా పనిచేసి క్యాన్సరును దూరం చేస్తుంది. అతి ముఖ్య సారాంశం... అధిక పుష్టినొసగు అన్ని యంగములకు సర్వరోగ హరము వయస్థాపకంబు అన్ని వయసుల వారికిన్ అమృత సమము ఉత్తమోత్తమ ద్రవ్యంబు ఉసిరి ఫలము. డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
ఉసిరి కొసిరి కొసిరి వడ్డించండి
కార్తీక మాసం ఉత్సవ మాసం. ఒకవైపు నాలుకపై శివనామ స్మరణం.. మరోవైపు జిహ్వకు ఉసిరి భోజనం... ఆధ్యాత్మికత మానసిక ఆరోగ్యం ఇస్తుంది. ఉసిరి సిరి శారీరక ఆరోగ్యం ఇస్తుంది జిహ్వకు సరికొత్త సత్తాని కూడా ఇసు ్తంది... అందుకే కొసిరి కొసిరి వడ్డించండి... ఆమ్ల గోలీ కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; బెల్లం – 150 గ్రా.; వాము – పావు టీ స్పూను; వేయించిన జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఆమ్చూర్ పొడి – అర టీ స్పూను; నల్ల ఉప్పు – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – కొద్దిగా. తయారీ: ►శుభ్రంగా కడిగిన ఉసిరికాయలకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్లో ఉంచి ఉడికించాలి ►రెండు విజిల్స్ వచ్చాక దింపి, చల్లారాక నీళ్లు వేరు చేయాలి ►ఉసిరికాయల నుంచి గింజలు వేరు చేసి, కాయలను చిన్న చిన్న ముక్కలుగా చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద పాన్ వేడయ్యాక నెయ్యి వేసి కరిగాక, ఉసిరికాయ ముద్దను వేసి కలపాలి ►బెల్లం పొడి జత చేసి సుమారు ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి ►వాము, ఇంగువ, వేయించిన జీలకర్ర పొడి, ఆమ్చూర్ పొడి, నల్ల ఉప్పు, ఉప్పు జత చేసి బాగా కలిపి దింపేయాలి ►కొద్దిగా చల్లారాక గోళీలుగా చేసి, పంచదార పొడిలో దొర్లించి, బాగా ఆరిన తరవాత గాలిచొరని డబ్బాలోకి తీసుకోవాలి. ట్రెజర్ హంట్ కావలసినవి మైదా పిండి – 50 గ్రా.; జొన్న పిండి – 50 గ్రా.; ఉసిరికాయ తురుము – పావు కప్పు, బెల్లం తురుము – అర కప్పు; తేనె – పావు కప్పు ; వెనిగర్ – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – కొద్దిగా; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను; ఎగ్లెస్ కేక్ పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఆలివ్ ఆయిల్ – పావు కప్పు; పాలు – అర కప్పు; నీళ్లు – అర కప్పు. తయారీ ►ఒక పాత్రలో అన్ని పదార్థాలను వేసి ఎక్కువసేపు బాగా కలపాలి ►ఈ మిశ్రమాన్ని కేక్ కంటెయినర్లో పోసి, సమానంగా పరవాలి ►అవెన్ను 180 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ►కేక్ కంటెయినర్ను అందులో ఉంచి, సుమారు అర గంట సేపు బేక్ చేశాక తీసి, చల్లారాక కట్ చేసి అందించాలి. ఆమ్ల గ్రీన్ చిల్లీ పికిల్ కావలసినవి: ఉసిరి కాయలు – పావు కేజీ; తాజా పచ్చి మిర్చి – పావు కేజీ; ఆవ పొడి – ఒక కప్పు; ఆవ నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత, పసుపు – 2 టీ స్పూన్లు ఇంగువ – ఒక టీ స్పూను. తయారీ: ► ఒక పాత్రలో తగినన్ని నీళ్లు పోసి ఉసిరికాయలు, పచ్చి మిర్చి కాయలను శుభ్రంగా కడగాలి ►పచ్చి మిర్చిని మధ్యకు కట్ చేయాలి (గుత్తి వంకాయ మాదిరిగా) ►కుకర్లో అర గ్లాసు నీళ్లు, ఉసిరి కాయలు వేసి మూత ఉంచి, స్టౌ మీద పెట్టి, ఒక విజిల్ వచ్చాక దింపేయాలి ►బాగా చల్లారాక ఉసిరి కాయలలోని గింజలను వేరు చేయాలి ►తరిగిన పచ్చి మిర్చి, ఉసిరి ముక్కలు, పసుపు, ఆవ పొడి, ఉప్పు ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ►స్టౌ మీద బాణలిలో ఆవ నూనె వేసి కాగాక ఇంగువ వేసి బాగా కలిపాక, సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడి మీద పోసి, బాగా కలియబెట్టాలి ►ఈ మిశ్రమాన్ని రెండు రోజులు ఎండబెట్టాలి ∙గాలి చొరని జాడీలోకి తీసుకోవాలి ►వేడి వేడి అన్నంలో, కమ్మటి నువ్వుల నూనెతో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది. ఆమ్ల స్వీట్ అండ్ హాట్ పికిల్ కావలసినవి: ఉసిరి కాయ ముక్కలు – పావు కేజీ; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; నువ్వు పప్పు నూనె – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5; ఇంగువ – పావు టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; వెల్లుల్లి రేకలు – 10; కరివేపాకు – 3 రెబ్బలు; మిరప కారం – 2 టేబుల్ స్పూన్లు; మెంతులు – అర టీ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెల్లం పొడి, ఉసిరి ముక్కలు వేసి రెండు నిమిషాల పాటు కలపాలి ►తడి బయటకు వస్తుంటే, మంట బాగా తగ్గించి, మరో రెండు నిమిషాలు ఉడికించి, మరోపాత్రలోకి తీసుకోవాలి ►స్టౌ మీద మరో బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు మిర్చి, ఇంగువ, పసుపు, వెల్లుల్లి రేకలు వేసి బాగా కలపాలి ►కరివేపాకు జత చేసి మరోమారు వేయించాక, ఎండు మిర్చి జత చేసి కలిపి దింపేయాలి ►సిద్ధంగా ఉన్న ఉసిరి పచ్చడిలో ఈ మిశ్రమం, ఉప్పు, మిరపకారం వేసి బాగా కలపాలి ►ఒక గంట తరవాత వేడి వేడి అన్నంలోకి తింటే రుచిగా ఉంటుంది ►రోటీలలోకి కూడా బాగుంటుంది. ఆమ్ల క్యారట్ జ్యూస్ కావలసినవి: క్యారట్ – పావు కేజీ; ఉసిరి కాయలు – 4, అల్లం తురుము – అర టీ స్పూను, తాజా నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; తేనె – ఒక టేబుల్ స్పూను; నీళ్లు – తగినన్ని; ఐస్ క్యూబ్స్ – తగినన్ని. తయారీ: ►క్యారట్లను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి, కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేయాలి ►మిక్సీలో క్యారట్ ముక్కలు, అల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టి, వడ కట్టి, రసం వేరు చేయాలి ►ఉసిరి కాయలను శుభ్రంగా కడిగి, గింజలను వేరు చేసి, కాయలను సన్నగా తురమాలి ►తగినన్ని నీళ్లు, ఉసిరి కాయ తురుములను మిక్సీలో వేసి మెత్తగా చేసి, వడకట్టి, నీరు వేరు చేసి పక్కన ఉంచాలి ►ఒకపెద్ద పాత్రలో క్యారట్ రసం, ఉసిరి రసం పోసి, తేనె జత చేసి బాగా కలపాలి ►ఐస్ క్యూబ్స్ జత చేసి చల్లగా అందించాలి. -
సిగనిగలు
వైట్ హెయిర్ రావడానికి అనేక కారణాలు. అయితే ఈ సమస్యను నేచురల్ పద్ధతిలో శాశ్వతంగా నివారించుకోవచ్చట. అది కూడా మన వంటగదిలో చౌకగా లభించే వస్తువులతోనే. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయితే సరి... గోధుమలు: తెల్లజుట్టును నివారించడంలో గోధుమలు బెస్ట్ నేచురల్ క్యూర్. గోధుమపిండితో అల్లం మిక్స్ చేసి దానికి ఒక స్పూన్ తేనె కలిపి తలకు పట్టించాలి. ఒక వారంలో మార్పును గమనించండి. కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని తలకు బాగా మసాజ్ చేయాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పని చేసి తెల్ల జుట్టును నివారిస్తుంది. ఆమ్లా: ఉసిరికాయను ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన ఉసిరికాయ ముక్కల్ని కొబ్బరి నూనెలో కలపాలి. ఇప్పుడు నూనెను వేడి చేసి గోరువెచ్చగా అయిన తర్వాత తలకు పట్టించాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. మెంతులు: తెల్లజుట్టును నివారించే మరో సహజమైన ఇంటి చిట్కా – మెంతులు. గుప్పెడు మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఈ నీటిని తలస్నానం చేయడానికి ఉపయోగించండి. -
తెల్లజుట్టు సమస్యా.. ఇలా చేయండి!
ఒక వ్యక్తి అందాన్ని ఇనుమడిపంజేసేది శిరోజాలే అంటారు. ఇక ఆడవాళ్లైతే శిరోజాలనే తమ అందానికి గుర్తుగా భావిస్తానరడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటిది ఆధునిక జీవన శైలి, కాలుష్యం కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా జుట్టు రాలడం అనే సమస్య అందరినీ వేధిస్తోంది. అంతేకాదు జుట్టు తక్కువగా ఉన్నా సరే బాగుంటే చాలు అనుకునే వారు తెల్లజుట్టు రావడంతో మరింతగా ఆందోళనకు గురవుతున్నారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి కాస్త విముక్తి పొందవచ్చు. బ్లాక్ టీ తెల్లజుట్టు నివారణలో బ్లాక్ టీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఒక కప్పు బ్లాక్ టీ తీసుకుని(పాలు కలపకుండా) దానిలో ఒక టీ స్పూన్ ఉప్పు కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించి మసాజ్ చేయాలి. జుట్టు కుదుళ్లకు చేరేలా మర్దనా చేసి.. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. సేజ్ ఆకులు ఎండిన సేజ్(జాజికాయ) ఆకులను తీసుకుని మరుగుతున్న నీటిలో కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెండు గంటల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. అనంతరం దీనికి నాలుగైదు చుక్కల గ్లిజరిన్ కలపాలి. తద్వారా జుట్టు పోషణకు అవసరమైన విటమిన్-ఇ అందుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం ద్వారా సహజ పద్ధతిలోనే నల్లని జుట్టు పొందవచ్చు. హెన్నా తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడేందుకు దాదాపుగా అందరూ పాటించే చిట్కా ఇది. మార్కెట్లో దొరికే నాణ్యమైన హెన్నా పౌడర్ తీసుకుని.. దానికి పెరుగు, మెంతులు, కాఫీ, తులసి రసం, పుదీనా రసం కలపాలి. ఈ మిశ్రమాన్ని సుమారు పదిహేను నిమిషాల పాటు నీటిలో మరగబెట్టాలి. 12 నుంచి 15 గంటల పాటు ఒక నానబెట్టిన తర్వాత.. జుట్టుకు పట్టించి మూడు గంటల పాటు అలాగే ఉంచాలి. అనంతరం షాంపూతో కడిగేస్తే సరి. అయితే రాత్రి మొత్తం నానబెట్టి తెల్లవారి హెన్నా పెట్టుకోవడం ద్వారా మళ్లీ మళ్లీ తలస్నానం చేసే ఇబ్బంది ఉండదు. ఉసిరి నల్లని శిరోజాలు పెంపొందించడంలో ఉసిరిది ప్రధాన పాత్ర. ఎండిన ఉసిరి కాయలను నీళ్లలో నానబెట్టాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అనంతరం ఉసిరిని నానబెట్టిన నీళ్లలో హెన్నా పౌడర్, గ్రైండ్ చేసిన ఉసిరి మిశ్రమాన్ని కలపాలి. ఆ తర్వాత దీనికి ఐదు చెంచాల నిమ్మకాయ రసం, కాఫీ, పచ్చి గుడ్డు తెల్లని సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో కడిగేసి.. షాంపూ అప్లై చేసుకోవాలి. వారానికొకసారి ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనె, అల్లం కొబ్బరి నూనెలో ఉసిరి ముక్కలను వేడి చేసి కాసేపు మరగబెట్టాలి. ఒక రాత్రంతా ఈ మిశ్రమాన్ని నానబెట్టి... దీనికి కాసింత తేనె కలిపి జుట్టుకు పట్టించి మర్దనా చేయాలి. మెరుగైన ఫలితం కోసం ఉసిరితో పాటు అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. -
మేలైన కాంతి
చలికాలంలో చర్మం పొడిబారి, కళ తప్పి కనిపిస్తుంది. మృతకణాలు పెరుగుతాయి కాబట్టి వీటిని సరిగా శుభ్రం చేయకపోతే రంగు కాస్త తగ్గినట్టు కనిపిస్తారు. ఈ సమస్యకు పరిష్కారంగా..ఉదయం స్నానం చేయడానికి ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి అరగంటసేపు ఆగాలి. తర్వాత మరీ వేడిగా అలాగని చల్లగా కాకుండా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్నానానికి సబ్బు ఉపయోగించేవారు క్రీమీగా ఉండేవాటిని చలికాలానికి ప్రత్యేకం అనేవాటిని ఎంచుకోవాలి. లేదంటే సొంతంగా తయారుచేసుకున్న సున్నిపిండిని వాడాలి.బాదంపప్పుల నూనె, అవిసెగింజల నూనె వంటివి మేనిపైకే కాదు లోపల కూడా కావాలి. అందుకని శరీరానికి మేలు చేసే బాదంపప్పులు, అవిసెగింజలు.. రోజూ కొన్ని తినాలి.ఈ కాలం ఉసిరికాయలు లభిస్తాయి. వీటిలో విటమిన్–సి సమృద్ధిగా లభిస్తుంది. ఏదో విధంగా రోజూ ఒక ఉసిరికాయ అయినా తినాలి. పొడిరూపంలోనూ ఉసిరిని తయారుచేసి, నిల్వచేసుకొని, కషాయం చేసుకొని సేవించవచ్చు. దీనివల్ల చర్మంలోపలి మలినాలు కూడా శుద్ధమవుతాయి.పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్లు బారి నలుపుగా అవడం వంటివి ఈ కాలంలో సహజంగా జరుగుతుంటాయి. రాత్రి పడుకునేముందు నెయ్యిని పెదవులపై రాసి, మృదువుగా మర్దన చేయాలి. పగలు కూడా రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారం సమస్య రాదు.చలికి చాలా మంది మంచినీళ్లు తాగడం బాగా తగ్గిస్తారు. దీని వల్ల కూడా చర్మం పొడిబారడం, ముడతలు పడటం జరుగుతుంటుంది. రోజుకు కనీసం మూడు లీటర్ల నీళ్లు తాగేలా శ్రద్ధ పెట్టాలి. ఈ జాగ్రత్తలు చర్మకాంతినే కాదు ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. -
పుల్లన జిల్లున
ఉసిరిని సంస్కృతంలో ‘ధాత్రి’ అని అంటారు. ధాత్రి అంటే సంపదకు నిలయం. నిజంగానే ఉసిరి ఆరోగ్య సిరికి నిలయం. విటమిన్ ‘సి’ ఇందులో పుష్కలం. రోగనిరోధక శక్తికి ఇది సాధనం. ఈ సీజన్లో ఉసిరికి చింతకాయను, నిమ్మకాయను జతచేయండి. తుమ్ముకు, దగ్గుకు జల్ల కొట్టి కారం కారంగా జిల్లుమనిపించండి. ఉసిరి ఊరగాయ కావలసినవి: ఉసిరి కాయలు – అర కేజీ; మిరప కారం – పావు కప్పు; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; మెంతులు – అర టీ స్పూను; సోంపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను. తయారీ: ∙ఒక పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి ∙ఆ పైన రంధ్రాలున్న ప్లేట్ ఉంచి వాటి మీద ఉసిరికాయలను ఉంచి మూత పెట్టి, పది నిమిషాలు స్టౌ మీదే ఉంచి దింపేయాలి ∙ఉసిరికాయలలోని గింజలను వేరుచేయాలి ∙ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక ఆవాలు, మెంతులు, సోంపు వేసి దోరగా వేయించి దింపేయాలి ∙చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసి పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, ఇంగువ వేసి వేయించాలి ∙ఉసిరి ముక్కలను జత చేసి వేయించాలి ∙మిరప కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి ∙పొడి చేసుకున్న ఆవాల పొడి మిశ్రమం జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. టొమాటో, పండు మిర్చి పచ్చడి కావలసినవి: టొమాటోలు – అర కేజీ; ఉప్పు – 1 + అర టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; పండు మిర్చి – అర కేజీ; చింతపండు – 50 గ్రా.; తయారీ: ∙టొమాటోలను శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో శుభ్రంగా తుడిచి, గాలికి ఆరబెట్టాలి ∙ పూర్తిగా తడి పోయిన తరవాత పెద్ద పెద్ద ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద పాత్రలో టొమాటో ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి, మూత పెట్టి రెండు రోజులు అలాగే వదిలేయాలి ∙పండుమిర్చి తొడిమలు తీసి, నీళ్లలో శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి, తడిపోయే వరకు గాలికి ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి, కొద్దిగా మెత్తపడేవరకు మిక్సీ పట్టాలి ∙ సీసాలో ఉన్న టొమాటో ముక్కలను బయటకు తీయాలి ∙రసాన్ని వేరు చేయాలి ∙వేరు చేసిన రసంలో చింతపండు వేసి, ముక్కలను, రసాన్ని విడివిడిగా రెండు రోజుల పాటు ఎండబెట్టాలి ∙ఒక పెద్ద పాత్రలో చింతపండు నానబెట్టిన టొమాటో రసం, ఎండ బెట్టిన టొమాటో ముక్కలు, పండు మిర్చి తొక్కు వేసి బాగా కలిపి, మిక్సీలో వేసి మెత్తగా చేసి బయటకు తీసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నువ్వుల నూనె కాగిన తరవాత ఇంగువ, ఆవాలు, ఎండు మిర్చి ముక్కలు వేసి వేయించి దింపి చల్లారనివ్వాలి ∙తయారుచేసి ఉంచుకున్న పచ్చడిలో వేసి కలపాలి ∙ఈ పచ్చడి సుమారు పదిహేను రోజులు నిల్వ ఉంటుంది. చింతకాయ పచ్చడి కావలసినవి: పండు చింతకాయలు – 10; పసుపు – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: మెంతులు – అర టీ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పచ్చి మిర్చి – తగినన్ని; ఎండు మిర్చి – 1 తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి ∙ఉప్పు, పసుపు జత చేసి బాగా కలిపి గాలి చొరని సీసాలో ఉంచి మూత పెట్టి మూడు రోజుల తరవాత బయటకు తీసి, గింజలను వేరు చేయాలి ∙చింతకాయ తొక్కును మరోమారు మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙వేయించిన పోపు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ∙కమ్మటి నేతితో అన్నంలో తింటే రుచిగా ఉంటుంది పచ్చి మిర్చి– నిమ్మరసం పచ్చడి కావలసినవి: పచ్చి మిర్చి – పావు కేజీ; పంచదార – 2 టీ స్పూన్లు; ఉప్పు – ఒక టీ స్పూను; ఆవాల పొడి – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; నూనె – తగినంత; నిమ్మ రసం – అర కప్పు; ఇంగువ – కొద్దిగా తయారీ: ∙ముందుగా పచ్చి మిర్చిని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాక, రెండేసి ముక్కలుగా కట్ చేయాలి ∙జాడీలో పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, ఆవాల పొడి, మెంతులు వేసి బాగా కలిపి మూత పెట్టి, రెండు రోజులు వదిలేయాలి ∙మూడో రోజు, స్టౌ మీద బాణలిలో నూనె వేసి కొద్దిగా కాగాక ఇంగువ వేసి కలిపి దింపేయాలి ∙çపచ్చి మిర్చి ఉంచిన జాడీ మూత తీసి, కాచిన నూనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి ∙ఇది చపాతీ, పూరీలలోకి రుచిగా ఉంటుంది. చింతకాయ పులుసు కావలసినవి: చింతకాయలు – 200 గ్రా.; వంకాయలు – 4 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటోలు – 2 (ముక్కలు చేయాలి); సొరకాయ ముక్కలు – 4; ములక్కాడ–1; క్యారెట్–1; ఉప్పు – తగినంత; పసుపు – ఒక టీ స్పూను. పేస్ట్ కోసం: బియ్యం – ఒక టేబుల్ స్పూను (గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి); ఆవాలు – అర టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; (ఈ పదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి). పోపు కోసం : ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు. (స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఈ పదార్థాలన్నీ వేసి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు జత చేసి వేయించి దింపేయాలి). తయారీ: ∙చింతకాయలను శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో తగినన్ని నీళ్లు, చింతకాయలు వేసి స్టౌ మీద ఉంచి చింతకాయలు మెత్తపడే వరకు ఉడికించి, దించి చల్లార్చాలి ∙బాగా చల్లారాక చింతకాయలను గట్టిగా పిండి, చెత్తను తీసేయాలి ∙మరొక పాత్రలో నీళ్లు, తరిగి ఉంచుకున్న కూర ముక్కలు వేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙ చింతకాయ రసం జత చేసి కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించాలి ∙ముద్ద చేసి ఉంచుకున్న బియ్యం మిశ్రమం, పోపు జత చేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి ∙ పులుసు బాగా మరుగుతుండగా ఇంగువ జత చేసి కలిపి దింపేయాలి ∙అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి ఉసిరి తొక్కు పచ్చడి కావలసినవి: ఉసిరి కాయలు – 20; నీళ్లు – తగినన్ని; నువ్వుల నూనె – 4 టేబుల్ స్పూన్లు; ఆవాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; మిరప కారం – 5 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; బెల్లం – ఒక టీ స్పూను. తయారీ: ∙స్టౌ మీద ఒక పాత్ర ఉంచి, అందులో నీళ్లు పోసి కాగాక, ఉసిరి కాయలు వేసి పావు గంట సేపు ఉడికించి తీసేయాలి ∙గింజలను వేరు చేసి, ఉసిరి కాయ ముక్కలను ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ముక్కలు బాగా చల్లారిన తరవాత మిక్సీలో వేసి, కొద్దిగా నీళ్లు జత చేసి, మెత్తగా మిక్సీ పట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఇంగువ, మెంతులు, ఆవాలు వేసి వేయించాలి ∙ మిరప కారం వేసి బాగా వేయించాలి ∙చివరగా మెత్తగా చేసి ఉసిరి ముద్ద వేసి బాగా దగ్గర పడే వరకు వేయించాలి ∙ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ∙బెల్లం పొడి వేసి బాగా కలిపి దింపేయాలి. పండు మిర్చి నిమ్మకాయ నిల్వ పచ్చడి కావలసినవి: పండు మిర్చి – అర కేజీ; నిమ్మకాయలు – డజను (చిన్న సైజువి); ఉప్పు – తగినంత; ఆవాలు–ఒక టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 10; నూనె – 100 గ్రా.; ఇంగువ – అర టీ స్పూను; ఆవ పొడి–ఒక టేబుల్ స్పూను; మెంతి పొడి–పావు టేబుల్ స్పూను; మిరప కారం–రెండు టీ స్పూన్లు. తయారీ: ∙ముందుగా పండు మిర్చిని నీళ్లలో శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, కొద్ది సేపు ఆరబెట్టాలి మిక్సీలో వేసి, ఉప్పు జత చేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాక, బయటకు తీసి, ఒక పాత్రలో రెండు రోజుల పాటు మూత పెట్టి ఉంచాలి నిమ్మకాయలను శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి, ఆరబెట్టాలి ∙తడి పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరిగి, తగినంత ఉప్పు జత చేసి బాగా కలిపి, జాడీలో రెండు రోజుల పాటు ఉంచాలి ∙మూడో రోజు పండు మిర్చి మిశ్రమం, నిమ్మకాయ ముక్కలను బయటకు తీసి, ఒక పాత్రలో వేసి బాగా కలపాలి ∙మెంతి పొడి, ఆవ పొడి, మిరప కారం జత చేసి బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఎండు మిర్చి వేసి వేయించి దింపేయాలి ∙చల్లారాక పండుమిర్చి నిమ్మకాయ పచ్చడిలో వేసి కలపాలి ∙ ఈ పచ్చడి సుమారు పది రోజులు నిల్వ ఉంటుంది. (ఉప్పు సరిపడేలా చూసుకోవాలి). -
కలపకండి కలుసుకోండి
వనభోజనాలంటేనే ప్రకృతితో ఏకమవ్వడం... అన్నం పెట్టిన చెట్టుకు దండం పెట్టుకోవడం...కుటుంబంలో తను ఒక సభ్యులని గుర్తు చేసుకోవడం...తనతోపాటు కలిసి భోజనం చేయడం... వనభోజనం కృతజ్ఞతల ఘనభోజనం...ప్రకృతి మాత పిల్లలకు ముద్దలు చేసి పెడితే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారు కదా!అందుకే ఈ వారం అన్నీ కలిపిన వంటలే... ముద్దలు చేసుకుని తినడం మాత్రమే!కలపకండి... కలుసుకోండి. క్యారట్ దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – ఒక కప్పు; పెరుగు – 3 కప్పులు; మిరియాలు – ఒక టీ స్పూను; క్యారట్ తురుము – ఒక కప్పు; జీడి పప్పులు – 15; కిస్మిస్ – గుప్పెడు; దానిమ్మ గింజలు – అర కప్పు; పాలు – 2 టేబుల్ స్పూన్లు; మీగడ – పావు కప్పు ; ఉప్పు – తగినంత పోపు కోసం: పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 5 ; పచ్చి మిర్చి – 5; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙బియ్యం శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన ఉంచాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగించాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, మిరియాలు, కరివేపాకు వరుసగా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసి పక్కన ఉంచుకోవాలి ∙అదే బాణలిలో మరి కాస్త నెయ్యి వేసి కాగాక జీడి పప్పులు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ∙మరి కాస్త నెయ్యి వేసి కరిగాక క్యారట్ తురుము వేసి దోరగా వేయించి తీసేయాలి ∙ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి పల్చగా పరవాలి ∙వేయించి ఉంచుకున్న పోపు, జీడిపప్పులు, కిస్మిస్, క్యారట్, ఉప్పు వేసి బాగా కలపాలి. పెరుగు, పాలు, మీగడ జత చేసి కింద నుంచి పైకి కలియబెట్టాలి ∙దానిమ్మ గింజలు వేసి మరోమారు కలపాలి. చివరగా కొత్తిమీరతో అలంకరించి అందించాలి. ఉసిరి రైస్ కావలసినవి బాస్మతి బియ్యం – ఒక కేజీ; పెద్ద ఉసిరి కాయల తురుము – అర కప్పు; పచ్చి సెనగ పప్పు – పావు కప్పు; మినప్పప్పు – పావు కప్పు; ఆవాలు – రెండు టీ స్పూన్లు; జీలకర్ర – రెండు టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 6; బెల్లం పొడి – ఒక టీ స్పూను; ఇంగువ – తగినంత; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – తగినంత; పసుపు – తగినంత; జీడి పప్పులు – 50 గ్రా.; వేయించిన పల్లీలు – 100 గ్రా.; నువ్వుల నూనె/ నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి వెంటనే పెద్ద పళ్లెంలోకి తీసి ఆరబోయాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి ∙ఆవాలు, జీలకర్ర , పచ్చి మిర్చి, ఎండు మిర్చి, ఇంగువ వరుసగా వేసి బాగా కలపాలి ∙దోరగా వేగిన తరవాత ఉసిరి కాయ తురుము జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ∙కరివేపాకు జత చేసి బాగా కలపాలి ∙చివరగా జీడి పప్పులు, వేయించిన పల్లీలు వేసి మరో సారి వేయించి దింపేయాలి ∙పళ్లెంలో ఉన్న అన్నం మీద ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి ∙వేయించి ఉంచుకున్న ఉసిరి + పోపు మిశ్రమం, బెల్లం పొడి చివరగా వేసి బాగా కలియబెట్టాలి ∙సుమారు గంట సేపు ఊరిన తరవాత దేవుడికి నివేదన చేసి సేవించాలి ∙వనభోజనాలలో ఉసిరి తప్పనిసరిగా తినాలంటారు కనుక, విడిగా ఉసిరి తినవలసిన అవసరం లేకుండా ఉసిరి రైస్ సిద్ధం చేసుకుంటే సరి. డ్రై ఫ్రూట్స్ క్షీరాన్నం కావలసినవి బియ్యం – ఒక కప్పు; చిక్కటి పాలు – 4 కప్పులు; బెల్లం పొడి – 2 కప్పులు; నెయ్యి – ఒక కప్పు; జీడి పప్పులు – 25 గ్రా.; కిస్మిస్ – 25 గ్రా.; పిస్తా – 25 గ్రా.; ఎండు కొబ్బరి ముక్కలు – ఒక టేబుల్ స్పూను; గింజలు లేని ఖర్జూరాలు – 5; ఏలకుల పొడి – పావు టీ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు తయారీ: ∙ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లలో నానబెట్టాలి ∙చిక్కటి పాలను బాగా మరిగించాలి ∙బియ్యంలోని నీళ్లను ఒంపేసి పాలలో వేసి కలియబెట్టాలి ∙బాగా మెత్తగా ఉడికేవరకు అడుగు అంటకుండా కలుపుతూ ఉడికించాలి (పాలు చాలకపోతే మరిన్ని పాలు కాని నీళ్లు కాని జత చేయాలి) ∙ఒక చెంచాడు నెయ్యి వేసి కలియబెట్టాలి ∙బెల్లం తురుము వేసి మరోమారు బాగా కలిపి దింపేయాలి ∙బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిçపప్పులు, కిస్ మిస్, ఎండు కొబ్బరి ముక్కలు, పిస్తాలను విడివిడిగా వేయించి తీసి చక్ర పొంగలిలో వేసి కలపాలి ∙ఖర్జూరాలను కూడా జత చేసి మరోమారు కలపాలి ∙చివరగా కుంకుమపువ్వు వేసి కలియబెట్టాలి ∙క్షీరాన్నం బాగా చల్లారాక అందించాలి. నేతి బీరకాయ బజ్జీ కావలసినవి: నేతి బీరకాయలు – 2; సెనగ పిండి – అర కేజీ; బియ్యప్పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; పచ్చి మిర్చి పేస్ట్ – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; తినే సోడా–చిటికెడు; నూనె – వేయించడానికి తగినంత తయారీ: ∙ముందుగా నేతి బీరకాయలను శుభ్రంగా కడిగి, సన్నగా చక్రాల్లా తరిగి పక్కన ఉంచాలి ∙ఒక పెద్ద గిన్నెలో సెనగ పిండి, బియ్యప్పిండి, ఉప్పు, మిరప కారం, అల్లం తురుము, పచ్చి మిర్చి పేస్ట్, ధనియాల పొడి, జీల కర్ర పొడి, చిటికెడు సోడా వేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, నేతి బీర కాయ చక్రాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి, రెండు వైపులా దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙కొబ్బరి చట్నీతో కాని, గ్రీన్ చట్నీతో కాని తింటే రుచిగా ఉంటాయి. బిసిబేళ బాత్ కావలసినవి: ధనియాలు – 4 టీ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – 4 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; ఏలకులు – 4; దాల్చిన చెక్క – చిన్న ముక్క; లవంగాలు – 4; ఎండు కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; గసగసాలు – 2 టీ æస్పూన్లు; నువ్వులు – ఒక టీ స్పూను; నూనె – ఒక టీ స్పూను; కాశ్మీరీ ఎండు మిర్చి – 12; కరివేపాకు – మూడు రెమ్మలు; ఇంగువ – చిటికెడు; క్యారట్ – 1 (చిన్నది); బీన్స్ – 5; పచ్చి బఠాణీ – 2 టేబుల్ స్పూన్లు; బంగాళదుంప – అర చెక్క (ముక్కలు చేయాలి); పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నీళ్లు – 2 కప్పులు; పసుపు – పావు టీ స్పూను; ఉప్పు – తగినంత; చింతపండు రసం – ముప్పావు కప్పు (కొంచెం చిక్కగా ఉండాలి); బెల్లం పొడి – అర టీ స్పూను; ఉల్లి పాయ – అర చెక్క (ముక్కలు చేయాలి); ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; అన్నం – రెండున్నర కప్పులు; నీళ్లు – ఒక కప్పు; నెయ్యి – ఒక టేబుల్ స్పూను పోపు కోసం: నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); ఇంగువ – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; జీడిపప్పులు – 10 తయారీ: ∙ఒక పెద్ద పాత్రలో కూరగాయ ముక్కలు, పల్లీలు, నీళ్లు, పసుపు, ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి ముక్కలు మెత్తపడే వరకు ఉడికించాలి ∙ముక్కలు బాగా ఉడికిన తరవాత చింతపండు రసం, బెల్లంపొడి, ఉల్లి తరుగు వేసి సుమారు పదినిమిషాల పాటు ఉడికించాలి ∙ఉడికించిన పప్పు, అన్నం జతచేసి బాగా కలిపి మరో కప్పు నీళ్లు పోసి కలియబెట్టి, మూత పెట్టాలి ∙çకొద్దిసేపటి తరవాత 4 టీ స్పూన్ల బిసిబేళబాత్ మసాలా వేసి సన్నని మంట మీద 20 నిమిషాల పాటు ఉడికించి దింపేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద ఉంచి వేడయ్యాక నెయ్యి లేదా నూనె వేసి కాగాక పోపు కోసం తీసుకున్న సరుకులను వేసి వేయించి, సిద్ధం చేసుకున్న బిసిబేళబాత్ మీద వేసి బాగా కలిపి, వేడివేడిగా అందించాలి.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
జీఎస్టీ నమోదుకు ఆధార్ బయోమెట్రిక్!
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
మాస్ ఎంట్రీ.. చైనాలో పుతిన్కు గ్రాండ్ వెల్కమ్!
జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్
సన్నీ లియోన్ బర్త్డేను ఎందుకు జరుపుకున్నారో చెప్పిన యువకులు
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
తప్పక చదవండి
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్మెన్ దారుణ హత్య
- కాకిస్నూరు.. ఓటింగ్లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్పై టీడీపీ మూకల హత్యాయత్నం
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- సెన్స్క్స్ డౌట్!
Advertisement