-
అనిల్ అంబానీ పిల్లలు ఆ బిజినెస్లో.. ఒకప్పుడు లగ్జరీ కార్లలో!
ముఖేష్ అంబానీ ఫ్యామిలీ గురించి తెలిసిన అందరికీ.. దాదాపు అనిల్ అంబానీ కుటుంబం గురించి తెలియకపోవచ్చు. ఎందుకంటే.. అనిల్ అంబానీ పిల్లలు ఇద్దరూ మీడియాకు కొంత దూరంగా ఉంటారు. ఈ కథనంలో వీరి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.ఒకప్పుడు ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ, కొన్ని సొంత నిర్ణయాల వల్ల భారీ నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. అనిల్ అంబానీ, టీనాలకు ఇద్దరు కుమారులు. వారే 'జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీ'. వీరిరువురు చాలావరకు తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు.జై అన్మోల్ అంబానీ.. అనిల్ అంబానీ, టీనాల పెద్ద కొడుకు. 1991 డిసెంబర్ 12న జన్మించిన ఈయన ముంబైలోని ప్రసిద్ధ కేథడ్రల్, జాన్స్ కాన్వెంట్ స్కూల్ నుండి తన ప్రాథమిక విద్యను పూర్తి చేసి, ఆ తరువాత యూకేలో సెవెన్ ఓక్స్ స్కూల్లో చేరారు. 18 ఏళ్ల వయసులోనే చదువుకుంటూ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లో ఇంటర్న్షిప్ ప్రారంభించారు.చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్లోనే పని చేయడం ప్రారంభించారు. ఆ తరువాత 2017లో రిలయన్స్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పదవి చేపట్టారు. ఆ తరువాత వివిధ పదవులను చేపట్టారు.ఇక అనిల్ అంబానీ రెండో కుమారుడు జై అన్షుల్ అంబానీ విషయానికి వస్తే.. ముంబైలోని కేథడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తరువాత ఎన్వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తరువాత రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, రిలయన్స్ క్యాపిటల్లో కూడా పనిచేశారు. ఆ తరువాత 2019లో జై అన్మోల్ అంబానీతో కలిసి రిలయన్స్ ఇన్ఫ్రా డైరెక్టర్ల బోర్డులోకి ప్రవేశించారు.జై అన్మోల్, జై అన్షుల్ ఇద్దరికీ లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. ఈ కారణంగానే వీరు మెర్సిడెస్ బెంజ్ జీఎల్కే350, లంబోర్ఘిని గల్లార్డో, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ వోగ్ వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. కార్లు మాత్రమే కాకుండా వీరి వద్ద హెలికాఫ్టర్లు కూడా ఉండేవని తెలుస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ ఉన్నాయా? లేదా అనేది తెలియాల్సిన విషయం. -
ఫీజుకు డబ్బుల్లేక భార్య నగలమ్మిన అనిల్ అంబానీ.. ఎంతటి దుస్థితి!
ముఖేష్ అంబానీ గురించి తెలిసిన చాలా మందికి 'అనిల్ అంబానీ' గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ముకేశ్ అంబానీ ప్రస్తుతం దేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కానీ అనిల్ అంబానీ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు ముఖేష్ అంబానీ మాదిరిగానే.. అనిల్ అంబానీ కూడా ఆసియాలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో ఒకరుగా ఉండేవారు. ఆ తరువాత అన్నతో వచ్చిన విభేదాలు.. ముందుచూపు లేని వ్యాపారాలు చేయడం వల్ల సంపన్నుల జాబితా నుంచి లాయర్ ఫీజు కట్టడానికి కూడా డబ్బు లేకుండా పోయిన స్థితికి చేరారు. సరైన ప్రణాళిక, విజన్ లేకుండా ఏకకాలంలో అనిల్ అంబానీ ఎన్నో కంపెనీలను ప్రారంభించారు. టెలికామ్, పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటర్టైన్మెంట్ రంగాలలో గొప్ప సక్సెస్ సాధించాలని కలలు కన్నారు. కానీ ఈ కంపెనీలన్నీ అనుకున్న విజయం సాధించలేక పోయాయి. ఊహించిన దానికంటే ఎక్కువ ఖర్చులు, సరైన ప్రణాళికలు లేకపోవడం, పెట్టుబడికి తగిన రాబడి లేకపోవడం వంటివి కుబేరుడైన అనిల్ అంబానీని అప్పుల్లోకి నెట్టడం ప్రారంభించాయి. అప్పులు పెరిగిపోవడంతో ఒక కంపెనీ తర్వాత మరో కంపెనీని అమ్ముకోవాల్సి వచ్చింది. అనిల్ అంబానీ వ్యక్తిగత పూచీకత్తుపై చైనా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా, తిరిగి చెల్లించలేకపోయారు. మూడు బ్యాంకులకు సుమారు రూ.5446 కోట్లను తిరిగి చెల్లించాలని ఆయన లండన్ కోర్టుకు హాజరుకావాల్సి వచ్చింది. తన వద్ద డబ్బులు లేవని అనిల్ అంబానీ కోర్టులో చెప్పుకున్నారు. ఈయన మొత్తం అప్పు దాదాపు రూ.40,000 కోట్లు ఉంటుందని అంచనా. ముందు చూపు లేకపోవడం వల్ల రాజ్యాలు కూలిపోతాయి అనటానికి అనిల్ అంబానీ జీవితం ఓ ఉదాహరణ. ఇదీ చదవండి: వెయ్యి రూపాయలకు రూ.2 కోట్లు గిఫ్ట్ ఇచ్చాడు.. నువ్వు దేవుడు సామీ! లాయర్ల ఫీజు చెల్లించడానికి కూడా డబ్బు లేకపోవడం వల్ల.. అతను తన భార్య బంగారు నగలను అనిల్ అంబానీ విక్రయించినట్లు సమాచారం. తనకు కారు తప్ప మరేమీ లేదని, సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నానని ఆయన చెప్పుకున్నారు. ఫిబ్రవరి 2023 నాటికి అతని మొత్తం సంపద దాదాపు రూ. 250 కోట్లు, ముంబైలో 17 అంతస్తుల ఇంటిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్మెంట్ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్క్యాప్ షేర్లను ఇండస్ఇండ్కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
అమ్మకు 90 ఏళ్లు : అంబానీ కుటుంబంసెలబ్రేషన్స్
వ్యాపారం ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన అద్భత మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా, దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. భార్యగా, తల్లిగా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని అంబానీ కుటుంబానికి పెద్ద దిక్కుగా బలమైన అండగా నిలిచారు. దివంగత భర్త ధీరూభాయ్ అంబానీ కలలకు అండగా నిలవడమే కాకుండా, ఆయన మరణానంతరం కుమారులు ముఖేష్ అంబానీ , అనిల్ అంబానీను నిలబెట్టిన మాతృమూర్తి. ఈ రోజుతో ఆమెకు (ఫిబ్రవరి 24) 90 ఏళ్లు . అంబానీ ఫ్యాన్ ప్యాజ్ ఇన్స్టా ప్రకారం ఆమె బర్త్డేని పురస్కరించుకొని కోకిలాబెన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్, వారి జీవిత భాగస్వాములు ఆమె పుట్టినరోజు వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. కోకిలాబెన్ అంబానీ తన పుట్టినరోజు సందర్భంగా టీనా అంబానీ, అనిల్ అంబానీలతో కలిసి ప్రత్యేకంగా రాజస్థాన్లోని రాజ్సమంద్లోని శ్రీనాథ్జీ ఆలయాన్ని శనివారం సందర్శించారు. 'మనోరత్ భోగ్', ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహించారు. శ్రీనాథ్జీ మందిర్ మండల్ బోర్డ్ వైస్ చైర్పర్సన్ కూడా అయిన కోకిలా బెన్ నాధ్ద్వారాలోని పుష్టి మార్గీయ ప్రధాన్ పీఠ్ శ్రీనాథ్జీ భవనంలో 56 నైవేద్యాలు సమర్పిస్తారు. ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియాలో కూడా కోకిలాబెన్ పూజలు చేశారు. అలాగే ఆంటిలియాలోని మందిరం దగ్గర పలువురు పండితులు కోకిలాబెన్ ఆరోగ్యం కోసం ప్రార్థన్లు చేశారు. గతంలో 2022లో ముత్యాల అంచుతో త్రీ స్టెప్స్ కేక్ అద్భుతమైన కేక్ను తయారుచేయించారు. ఇందులో విశేషం ఏమిటంటే, అంబానీ వంశానికి చెందిన ప్రతి సభ్యుని ఫోటోలు ఇందులో ఉన్నాయి. గుజరాత్లో జామ్ నగర్లో పుట్టిన ఆమె ఇష్టదైవం కృష్ణుడు. ఇష్టమైన కలర్ పింక్. ఆరోగ్యంగా ఉండేందుకు రోజూయోగ సాధన, చక్కటి ఆహారం తీసుకుంటారట. -
‘బెంజ్ టు బడ్జెట్ కారుకి పడిపోయిన అంబానీ బ్రదర్’
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. అన్నది పెద్దలు చెప్పిన మాట. కానీ ఈ విషయంలో కొందరే విజేతలవుతుంటారు. పెట్రోల్ బంకులో కేవలం 300 రూపాయల జీతానికి పనిచేసిన ధీరూభాయ్ వేల కోట్లను సంపాదించి దిగ్గజ వ్యాపారవేత్తగా నిలిచారు. దేశంలోనే అతిపెద్దదైన రిలయన్స్ ఇండస్ట్రీని స్థాపించి అంబానీ వారసులకు బంగారు బాట పరిచారు. అయితే ఆయన వారసుల పరిస్థితి కొంచెం విచిత్రంగా ఉంటుంది. దీరుభాయ్ ఆయన పెద్ద కుమారుడు ముకేష్ దీరుభాయ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడు, చిన్న కుమారుడు అనిల్ దీరూభాయ్ అంబానీ ఒకప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలి పది స్థానాల్లో ఉన్నారు. కానీ కాలం కలిసి రాక పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దేశంలోనే ఎక్కువ మార్కెట్ విలువ ఉన్న కంపెనీ కాగా, అనిల్ అంబానీ సంస్థలు మాత్రం అప్పులు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు ఉన్న ఆస్తుల్ని అమ్మేస్తున్నారు. సాధారణ జీవితం గడుపుతున్నారు. తాజాగా, అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అనంతరం తిరిగి తన ఇంటికి వచ్చే సమయంలో ముంబై ఎయిర్పోర్ట్లో ఓ సాదాసీదా హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లో తిరుగుతూ దర్శనమిచ్చారు. దీనిపై నెటిజన్లు అనిల్ అంబానీ గతం, వర్తమానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ‘జర్నీ మెర్సిడెజ్ టూ హ్యుందాయ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు అపరకుబేరుల జాబితాలో ఉన్న అనిల్ అంబానీ ఓ వెలుగు వెలిగారు. ‘అంబానీ’ల స్టేటస్ ఏ మాత్రం తగ్గకుండా రేంజ్ రోవర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్, రోల్స్ రాయిస్ రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డోలో తిరిగే వారు. కానీ అదంతా గతం ఇప్పుడు బ్లాక్ కలర్ హ్యుందాయ్ ఐయోనిక్ 5లో ప్రయాణిస్తున్నారు. ఇక అనిల్ అంబానీ ప్రయాణిస్తున్న కారు రూ.44.95 లక్షల ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) ప్రారంభం కాగా చివరికి రూ. 46.05 లక్షలకు (ఎక్స్-షోరూమ్) లభ్యమవుతుంది. ఈ కారు ప్రత్యేకతల విషయానికి వస్తే మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారు 215 బీపీహెచ్ పవర్, 350 ఎన్ఎం టారిక్ను ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రిక్ వాహనం 72.6కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ 631 కిమీ రేంజ్ వరకు ఉంది. హ్యుందాయ్ వెబ్సైట్ ప్రకారం ఈ కారు కేవలం 18 నిమిషాల్లో 10 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు. అదనంగా, 100 కి.మీ పరిధిని పొందడానికి కేవలం ఐదు నిమిషాలు మాత్రమే ఛార్జింగ్ పెడితే సరిపోతుంది. View this post on Instagram A post shared by Voompla (@voompla) -
అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?
గత కొన్ని సంవత్సరాలకు ముందు ఇండియన్ టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్కు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై ఎన్సిఎల్టి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ఇటీవల తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్)కి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన కొన్ని అపరిమిత ఆస్తుల విక్రయాన్ని చేపట్టేందుకు ఎన్సిఎల్టి నుంచి అనుమతి కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఆర్డర్ను దాఖలు చేసింది. ఈ ట్రిబ్యునల్ ఆమోదం కోసం రిజల్యూషన్ ప్లాన్ను సమర్పించిన తర్వాత CIRP రెగ్యులేషన్స్లోని రెగ్యులేషన్ 29 ప్రకారం దరఖాస్తుదారు/RP కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తులను విక్రయించవచ్చని ఈ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తుంది. విక్రయానికి ఎంచుకున్న ఆస్తులలో భూమి, భవనంతో కూడిన RCom చెన్నై హాడో ఆఫీస్ ఉన్నాయి. అంతే కాకుండా చెన్నైలోని అంబత్తూర్లో సుమారు 3.44 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్, పూణేలో 871.1 చదరపు మీటర్ల ల్యాండ్, భువనేశ్వర్ బేస్డ్ ఆఫీస్ స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లలో పెట్టుబడి, రిలయన్స్ రియల్టీ షేర్లలో పెట్టుబడి వంటివి విక్రయించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి చాలా దిగజారింది. అన్న ప్రకటించిన డేటా వార్ కారణంగా తమ్ముడు భరించలేని నష్టాల్లోకి జారుకున్నాడు. ఆ విధంగానే కంపెనీ తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో డిఫాల్ట్ అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. -
అనిల్ అంబానీకి అనుకూలంగా.. గెలుపు నాదే!
రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ అధినేత అనిల్ అంబానీ గ్రూప్కి భారీ ఊరట లభించింది. వెస్ట్ బెంగాల్కు చెందిన ప్రభుత్వ సంస్థ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) పై చేస్తున్న న్యాయ పోరాటంలో విజయం సాధించారు. కోల్కత్తా హైకోర్టు డీవీసీ మధ్యవర్తిత్వం కింద అనిల్ అంబానీకి రూ.405 కోట్లు, బ్యాంక్ గ్యారెంటీ కింద రూ.354 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా అనిల్ అంబానీ రూ.1,354 కోట్లను దక్కించుకోనున్నారు. కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే 10 ఏళ్ల క్రితం అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్ వెస్ట్ బెంగాల్లోని రఘునాథ్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.3,750 కోట్లతో థర్మల్ వపర్ ప్రాజెక్ట్ నిర్మించే కాంట్రాక్ట్ను దక్కించుకుంది. అయితే, అన్వేక కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పట్టాలెక్కలేదు. దీనిపై ప్రభుత్వ సంస్థ అభ్యంతరం తెలిపింది. నష్టపరిహారం కింద తమకు కొంత చెల్లించాలని కోరింది. కోర్టు మెట్లెక్కిన అనిల్ అంబానీ దీంతో అనిల్ అంబానీ కోర్టు మెట్లెక్కారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ సదరు సంస్థపై న్యాయపోరాటానికి దిగారు. ఈ అంశంపై పలు దఫాలుగా కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కోల్కత్తా హైకోర్టు అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పిచ్చింది. తక్షణమే డీవీసీ రిలయన్స్ ఇన్ఫ్రాస్టక్చర్కు రూ.405 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. బ్యాంకు గ్యారెంటీ కింద మరో రూ.354 కోట్లు. మొత్తం రూ. 1,354 కోట్లు అనిల్ అంబానీ పొందనున్నారు. -
అంబానీ సోదరులకు శాట్లో ఊరట
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్ఏఎస్టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్ ఆదేశించింది. 2000కు ముందు కేసు.. 2000కు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్క్లోజర్ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. -
రిలయన్స్ క్యాపిటల్పై హిందూజా బ్రదర్స్ కన్ను: బిలియన్ డాలర్ల ఫండ్
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ను కొనుగోలు చేసేందుకు హిందూజా కుటుంబం ప్లాన్ చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం దాదాపు రూ. 8,200 కోట్లు (1 బిలియన్ డాలర్లు) గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్ను సమీకరించిందట. ఒకప్పుడు రూ.93,851 కోట్ల విలువైన రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు ప్రయత్నించిన దిగ్గజ కంపెనీల్లో హిందుజాలు ప్రాధాన్యమైన బిడ్డర్ కావడం గమనార్హం. (లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ ట్వీట్ చూశారా? ఇంటర్నెట్ లేటెస్ట్ హల్చల్) తాజాగా ఫరాలోన్ క్యాపిటల్, ఓక్ట్రీ, అరేస్ ఆసియా అండ్ ఆసెర్బెరస్ లాంటి వాటితో హిందుజాలు టచ్లో ఉన్నారని మూలాలను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. రిలయన్స్ క్యాపిటల్ లైఫ్, జనరల్ ఇన్సూరెన్స్ షేర్ల ద్వారా హిందుజాలు ఫైనాన్సింగ్కు మద్దతు ఇవ్వవచ్చని దీనికి సంబంధించి బీమా రెగ్యులేటర్ నుండి అవసరమైన అనుమతికి ఫండింగ్ పార్టనర్లు హిందుజాల నుండి గ్యారెంటీని కోరే అవకాశం ఉందని నివేదించింది. (Google Doodle Pani Puri Game: క్రిస్పీ..క్రిస్పీ పానీ పూరీ లవ్: గూగుల్ డూడుల్ ఇంటరాక్టివ్ గేమ్) స్వాధీనానికి కోర్టు అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫైనాన్సింగ్ చేయనున్నారని, రాబోయే వారాల్లో ఫైనాన్షియర్ల తుది జాబితా మారే అవకాశం ఉందని పేర్కొంది. హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ లిమిటెడ్ (IIHL) సమర్పించిన రూ. 9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్ రుణదాతలు దివాలా అండ్ దివాలా కోడ్ (IBC) నిబంధనల ప్రకారం ఆమోదించారని హిందూజా గ్రూప్ జూలై 3న తెలిపింది. చెల్లింపు డిఫాల్ట్లు , పాలనాపరమైన సమస్యల కారణంగా నవంబర్ 29, 2021న ఆర్బీఐ రిలయన్స్ క్యాపిటల్ బోర్డ్ను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. బోర్డు టేకోవర్ తర్వాత, కంపెనీ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ ప్రాసెస్ (CIRP)కి సంబంధించి నాగేశ్వరరావు వైని అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. రిలయన్స్ క్యాపిటల్ మొదటి వేలం డిసెంబర్లో జరగ్గా, ఇందులో టోరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ రూ. 8,640 కోట్ల ఆఫర్తో అత్యధిక బిడ్డర్గా, హిందుజా గ్రూప్ రూ. 8,110 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ 24 గంటల్లోనే 9,000 కోట్ల రూపాయలతో సవరించిన బిడ్ను సమర్పించింది . అయితే టోరెంట్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT)దీన్ని సవాలు చేసింది. ఇక తదుపరి వేలం ఏప్రిల్ 26న జరిగింది, 9,650 కోట్ల రూపాయలతో ఐఐహెచ్లో మాత్రమే వేలంలో పాల్గొంది. ఈప్లాన్ ఆమోదంకోసం ఈ వారంలోనే ఎన్సీఎల్టీని సంప్రదించనున్నారు.ఈ అంచనాలపై అటు రిలయన్స్ క్యాపిటల్గానీ, ఇటు హిందూజా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
స్విస్ బ్యాంక్ అకౌంట్లలో రూ.814 కోట్లు.. ఈడీ విచారణలో టీనా అంబానీ
ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీని ఈడీ అధికారుల విచారిస్తున్నారు. విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హాజరయ్యారు. టీనా అంబానీ కంటే ముందే అనిల్ అంబానీ ఈడీ అధికారుల విచారణను ఎదుర్కొన్నారు. 2020లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అనిల్ అంబానీతో పాటు యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్లపై మనీ ల్యాండరింగ్ కేసు నమోదు చేశారు. తాజాగా, ఈ కేసులో భాగంగా విచారణకు హాజరైన ఆయనను ఈడీ ప్రశ్నలు సంధించింది. ఆయన సమాధానాలను రికార్డు చేసినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో మరోమారు ప్రశ్నించేందుకు నోటీసులు జారీ అయ్యాయి. రూ.420 కోట్లు ట్యాక్స్ ఎగవేత 2021లో ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు స్విస్ బ్యాంక్ అకౌంట్లలో రూ.814 కోట్లు ఉండగా.. వాటికి రూ.420 కోట్లు ట్యాక్స్ చెల్లించలేదంటూ నల్లధన నియంత్రణ చట్టం కింద అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేశారు.అంతేకాదు ఉద్దేశపూర్వకంగా తన విదేశీ బ్యాంకు ఖాతా వివరాలను అధికారులకు వెల్లడించలేదని, ఉద్దేశపూర్వకంగా ఎగవేతకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ అభియోగాలు మోపింది. అనిల్ అంబానీకి ఊరట 2021లో ఐటీ అధికారులు జారీ చేసిన నోటీసుల్ని సవాలు చేస్తూ అనిల్ అంబానీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్ట్ అదే ఏడాది సెప్టెంబర్లో అనిల్ అంబానీకి ఊరట కల్పిస్తూ ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖను కోరింది. తాజాగా, ఈ కేసులకు సంబంధించి అనిల్ అంబానీ, భార్య టీనా అంబానీలు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫెమా, మనీ ల్యాండరింగ్ కేసుల్లో అనిల్ అంబానీ దంపతులపై ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉 ఎన్నాళ్ల కెన్నాళ్లకు..అనిల్ అంబానీకి భారీ ఊరట -
ఈడీ విచారణకు హాజరైన అనిల్ అంబానీ!
సాక్షి,ముంబై: రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ముంబైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణకు హాజరైనారు. ఈడీ కార్యాలయానికి సోమవారం ఉదయం చేరుకోవడం చర్చనీయాంతంగా నిలిచింది. అయితే ఏ కేసుకు సంబంధించి అంబానీని పిలిచారనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఫెమా ఉల్లంఘన కేసులో అంబానీనీ విచారించినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, 1999 (ఫెమా) కింద అనిల్ అంబానీ ఈడీ ముందు హాజరైనట్టు తెలుస్తోంది. కాగా 2020లో మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు అధికారులను, అనిల్ అంబానీని అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో యెస్ బ్యాంక్స్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్, తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యస్ బ్యాంక్ నుంచి అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు రూ. 12,800 కోట్ల రుణాలు పొందాయి. రిలయన్స్తోపాటు, పాటు చాలా కంపెనీలు బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలం కావడంతో మొండి బకాయిలుగా మారిపోయాయి. ఈ కేసులో విచారణలో భాగంగా ఈడీ గతంలో అంబానీకి సమన్లు జారీ చేసి విచారించింది. -
రిలయన్స్ గ్రూప్లో కీలక పరిణామం: ప్రెసిడెంట్గా పారుల్ శర్మ
సాక్షి, ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్లో కీలక పరిణామం చేసుకుంది. గ్రూప్ ప్రెసిడెంట్గా పారుల్ శర్మను నియమించింది. జూన్ 20 నుంచి ఈమె నియామకం అమల్లోకి వచ్చింది. కమ్యూనికేషన్ వ్యూహకర్తగా మంచి అనుభవం ఉన్న శర్మ నియామకంతో కంపెనీ పునర్వైభవాన్ని సంతరించు కునే ప్రయత్నం చేస్తోందని భావిస్తున్నారు. గ్రూప్ కార్పొరేట్ ఇమేజ్, పబ్లిసిటీ ,రిలేషన్ షిప్లతో సహా రూపర్ట్ మర్డోక్ యాజమాన్యంలోని స్టార్ ఇండియాలో 15 సంవత్సరాలపాటు పనిచేశారు. అలాగే కొలోన్లో ఉన్న జర్మన్ బ్రాడ్కాస్టర్ 'డ్యుయిష్ వెల్లే'లో పనిచేశారు. (హైదరాబాద్లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు) పారుల్ గ్రూప్ ప్రెసిడెంట్గా చేరడంపై సంతోషాన్ని ప్రకటించారు అనిల్ అంబానీ. గ్రూప్తో ఇది ఆమెకు తొలి వృత్తిపరమైన అనుబంధమే అయినా, టోనీ భార్యగా విస్తృత రిలయన్స్ కుటుంబంలో భాగమేననీ, టోనీ జ్ఞాపకాలు, సేవలు, పారుల్ చేరికతో మరింత ప్రత్యేకంగా నిలుస్తాయని అనిల్ అంబానీ ఒక ప్రకటనలో తెలిపారు. శర్మ భర్త రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్, కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ టోనీ జేసుదాసన్ను ఈ ఫిబ్రవరిలో కన్నుమూశారు. దాదాపు 40 సంవత్సరాల పాటు టోనీ రిలయన్స్ గ్రూప్లో విశేష సేవలందించారు. పారుల్ శర్మ మంచి రచయిత. 2020లోకరోనా మహమ్మారి వలసదారుల దుస్థితి , మరణాలపై 'డయలెక్ట్స్ ఆఫ్ సైలెన్స్' అనే పుస్తకాన్ని రచించారు. అలాగే 'కొలాబా' పేరుతో రాసిన మరో పుస్తుతం ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) పారుల్ మంచి ఫోటోగ్రాఫర్ కూడా. 2017లో ఫోటోగ్రఫీపై దృష్టి పెట్టడానికి స్టార్ కంపెనీని వీడారు. అనేక దేశాల్లో ఆర్కిటెక్చర్, అర్బన్ ల్యాండ్స్కేప్లు అండ్ హ్యూమన్ ఫామ్స్ పై శర్మ పనిచేశారు. కుంభమేళాపై ఆమె చేసిన వర్క్ 2019లో ప్రతిష్టాత్మక ఫ్లోరెన్స్ పబ్లిక్ మ్యూజియం ‘మారినో మారిని’లో ప్రదర్శించారు. -
ఆర్క్యాప్ నష్టాలు తగ్గాయ్
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని రుణ పరిష్కార ప్రణాళికలకు చేరిన అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్(ఆర్క్యాప్) గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టాలను భారీగా తగ్గించుకుంది. రూ. 1,488 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అంతక్రితం ఏడాది(2021–22) ఇదే కాలంలో రూ. 4,249 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం రూ. 4,770 కోట్ల నుంచి రూ. 4,436 కోట్లకు క్షీణించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 8,982 కోట్ల నుంచి రూ. 5,949 కోట్లకు దిగివచ్చాయి. 2021 నవంబర్ 29న కంపెనీ దివాలా ప్రక్రియకు చేరిన సంగతి తెలిసిందే. ఇక స్టాండెలోన్ నష్టం భారీగా పెరిగి రూ. 1,389 కోట్లను తాకింది. అంతక్రితం కేవలం రూ. 25 కోట్ల నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు తగ్గింది. -
క్రిషా అంబానీ బర్త్డే అత్తగారి ప్రశంసలు: వైరల్ వీడియో, ఎవరీ క్రిషా!
సాక్షి,ముంబై: అంబానీ ఫ్యామిలీకి సంబంధించి సోషల్మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ, నటి టీనా అంబానీ దంపతుల కుమారుడు జై అన్మోల్ అంబానీ తన భార్య క్రిషా అంబానీ పుట్టిన రోజును (మే 5న) వీడియోలో ఇపుడు సోషల్ మీడియాలో హాట్టాపిక్గా నిలిచింది. ఈ వీడియోలో జై అన్మోల్ అంబానీ పక్కనే నిలబడి భార్యతో కేక్ కట్ చేయించడాన్ని చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్లో అభిమానులు ఈ స్టైలిష్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. అటు క్రిషా కూడా తన స్టైలిష్ ఔట్ఫిట్తో ఫ్యాన్స్ను ఫిదా చేసింది. బెల్ స్లీవ్స్, ప్రింటెడ్ మస్టర్డ్-హ్యూడ్ మ్యాక్సీ డ్రెస్లో చాలా అందంగా కనిపించింది. ఈ కపుల్ కేక్ కటింగ్ వేడుక ఆసక్తికరంగా మారింది. మరోవైపు క్రిషా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా, క్రిషా అంబానీ అత్తగారు టీనా అంబానీ ఇన్స్టా ద్వారా కోడలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. "హ్యాపీ బర్త్డే డార్లింగ్ క్రిషా.. నువ్వు మాతో ఉండటం చాలా గర్వంగా ఉంది’’ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేశారు. (తొలి పదిరోజుల్లోనే కోట్ల అమ్మకాలు: వామ్మో అన్ని కొనేశారా!) తెలివైన అమ్మాయి. ఇన్నోవేషన్లకు, ఐడియాల పుట్ట. ఇంటికి శక్తి, యుక్తి వెలుగు.. అన్నింటికి మించి లవింగ్ డాటర్ టీనా కోడలిపై ప్రశంసలు కురిపించారు. కాగా జై అన్మోల్ అంబానీ, క్రిషా గత ఏడాది ఫిబ్రవరి 20న ముంబైలో వివాహం చేసుకున్నారు. ఈ జంట తరచు సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటుంది. (బీమా పాలసీపై క్రెడిట్ కార్డ్ లోన్స్: ఇకపై ఇలా చేయలేరు!) View this post on Instagram A post shared by Tina Ambani (@tinaambaniofficial) View this post on Instagram A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) -
ఆసియాలో అత్యంత ధనవంతుడు! ఆస్తులు సున్నా అంటున్నాడు..
భారతదేశంలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తమ్ముడు 'అనిల్ అంబానీ' గురించి దాదాపు అందరికి తెలుసు. ఒకప్పుడు ఆసియాలోని ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆయన సంపాదన భారీగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇంతకీ ఆయన సంపాదన పడిపోయిందా..లేదా ? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎన్ని అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం. అనిల్ అంబానీ యునైటెడ్ కింగ్డమ్లోని కోర్టులో తన ప్రస్తుత నికర విలువ రూ.0 అని వెల్లడించాడు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ రెండో రౌండ్ బిడ్డింగ్ వేలంలో హిందుజా గ్రూప్ అత్యధిక బిడ్డర్గా నిలిచింది. దివాళా తీసిన కంపెనీని రూ. 9650 కోట్ల ఖర్చుతో కొనుగోలు చేయడానికి ఆఫర్ చేసింది. ముఖేష్ అంబానీ మాదిరిగా అపర కుబేరుడుగా ప్రపంచంలో ఉన్న ధనవంతుల జాబితాలో ఒకరుగా ఉన్న అనిల్ అంబానీ 2020 ఫిబ్రవరిలో UK కోర్తులో హాజరైనప్పుడు తన నికర ఆస్తుల విలువ సున్నా అని చెప్పారు. నిజానికి ఆయన ఆస్తుల విలువ 13.7 బిలియన్ డాలర్లు అని నివేదికల ద్వారా తెలుస్తోంది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది దాదాపు రూ. 1.12 లక్షల కోట్లకంటే ఎక్కువ. అనిల్ అంబానీ తన ఆస్తులు సున్నా రూపాయలు అని కోర్టులు చెప్పినప్పటికీ.. ముంబైలో 17 అంతస్థుల భవంతి, రూ. 20 కోట్ల విలువైన కార్లు, అత్యంత ఖరీదైన బోట్స్, ప్రైవేట్ జెట్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. నికర ఆస్తుల విలువ భారీగా తగ్గినప్పటికీ, ప్రస్తుత ఆస్తులు రూ. 83 మిలియన్ల కంటే ఎక్కువ అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: Matter Aera Electric Bike: ఈ బైక్ కావాలా? ఇదిగో ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోండి!) నిజానికి అనిల్ అంబానీ వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరం, ఆసియాలో ఆరవ ధనవంతుగా ఎదిగాడు. కానీ కంపెనీ నిధులను స్వాహా చేసిన ఆరోపణలకు గానూ సెబీ మార్కెట్ నుంచి నిషేదించింది. ఆ తరువాత క్రమంగా ఆయన నికర ఆస్తులు పతనం కావడం ప్రారంభమైంది. -
రిలయన్స్ ఫౌండర్ అంబానీ: తొలి జీతం రూ.300, ఆసక్తికర విషయాలు
సక్సెస్ఫుల్ బిజినెస్ మేన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫౌండర్ ధీరజ్లాల్ హీరాచంద్ అంబానీ (ధీరూభాయ్) ఏం చదువుకున్నారో తెలుసా? దిగ్గజ కార్పొరేట్ సామ్రాజ్యాన్ని స్థాపించిన ధీరూభాయ్ పదో తరగతి మాత్రమే పూర్తి చేశారంటే నమ్ముతారా? ఒకప్పుడు పెట్రోల్ పంపులో పని.. కానీ ఆ తరువాత వేల కోట్ల రూపాయలతో వ్యాపార దిగ్గజంగాఎదిగిన ధీరూభాయ్ అంబానీ గురించి అంతగా తెలియని ఆసక్తికరమైన విషయాలు సాధారణ కుటుంబంలో జననం, కష్టాలు ధీరూభాయ్ అంబానీ గుజరాత్, జునాగద్ జిల్లాలో చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో 1932, డిసెంబరు 28న జన్మించారు. సామాన్య టీచర్ కుటుంబంలో నలుగురు తోబుట్టువులతో జీవితం కష్టాలతోనే ప్రారంభమైంది. ముఖ్యంగా కుటుంబ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ధీరూభాయ్ అంబానీ తన చదువును కూడా మధ్యలోనే వదిలివేసి కుటుంబానికి అండగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేశారు. పెట్రోలు బంకులో పని, నెలకు రూ.300 బిలియన్ డాలర్ల కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ ప్రారంభంలో బ్రిటిష్ కాలనీ ఆఫ్ అడెన్లోని పెట్రోల్ బంకులో అటెండెంట్గా పనిచేశారు. ఆ సందర్భంగా నెలకు 300రూపాయలు జీతంగా తీసుకునేవారట. అంతకుముందు కుటుంబ పోషణ కోసం అనేక పనులు చేశారు.కానీ అవి నచ్చకపోవడంతో మిడిల్ ఈస్ట్ ఆసియా దేశమైన యెమెన్కు వలస వెళ్లి పెట్రోల్ బంకులో పని మొదలు పెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తీప్పింది. సూయజ్కు తూర్పున ఉన్న అతిపెద్ద ఖండాంతర వాణిజ్య సంస్థలో ట్రేడింగ్, అకౌంటింగ్, ఇతర వ్యాపార నైపుణ్యాలను నేర్చుకున్నారు. కొన్నేళ్లలోనే మంచి స్థానానికి ఎదిగారు. ఆ తరువాత అన్నింటినీ వదిలి తిరిగి భారతదేశానికి తిరిగి వచ్చేశారు. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ఇండియాకి వచ్చిన తరువాత 1958లో తన బంధువు చంపక్లాల్దమానీతో కలిసి తొలి కంపెనీ రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ (సుగంధ ద్రవ్యాలు, నూలు వ్యాపారం) కంపెనీ స్థాపించారు. నూలు వ్యాపార పరిశ్రమలో పెరుగుతున్న అవకాశాలను గుర్తించిన తర్వాత ధీరూభాయ్ తన వ్యాపారాన్ని మార్చేశారు. మూడేళ్ల తర్వాత 1962లో రిలయన్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ను లాంచ్ చేశారు. బంధువు చంపక్లాల్ దమానీతో విడిపోయిన తరువాత 1966లో గుజరాత్లోని అహ్మదాబాద్లో 'రిలయన్స్ టెక్స్టైల్స్' అనే బట్టల మిల్లును ప్రారంభించారు. దీంతో అతని జీవితంలో అత్యంత మలుపు తిరిగింది. ఇక తరువాత మళ్ళీ ఎప్పుడూ వెనుదిరిగి చూసింది లేదు. అంచెలంచెలుగా రిలయన్స్ సామ్రాజాన్నివిస్తరించారు. అలాగే భారతదేశంలోని సగటు పెట్టుబడిదారులకు స్టాక్ మార్కెట్ను పరిచయం చేసిన ఘనత అంబానీకి దక్కుతుందని మార్కెట్ నిపుణులమాట. భారతదేశంలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఫార్చ్యూన్ 500లోచోటు దక్కించుకున్న తొలి ఇండియన్ ప్రైవేట్ కంపెనీగా రిలయన్స్ టెక్స్టైల్స్ నిలిచింది. అలాగే 1996, 1998, 2000 సంవత్సరాల్లో ఆసియావీక్ పత్రిక 'పవర్ 50- ఆసియాలో మోస్ట్ పవర్ఫుల్ పీపుల్' జాబితాలో చేరారు. దీంతోపాటు1999 సంవత్సరంలో బిజినెస్ ఇండియా 'బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్' అవార్డును కూడా అందుకున్నారు. 69 ఏళ్ల వయసులో ధీరూభాయ్ అంబానీ 2002 జూలై 6న ముంబైలో కన్నమూశారు. (టాటా, బిర్లా సక్సెస్ సీక్రెట్ ఇదే? అనంత్, రాధికా మర్చంట్ అడోరబుల్ వీడియో వైరల్) ఖరీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారు తాజా వ్యాపార ఆలోచనలకోసం, తన సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ధీరూభాయ్ అంబానీ సంపన్న వ్యాపారవేత్తలతో కలిసి తిరిగేవారట. నెట్వర్క్ , పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి, ఖనీదైన రెస్టారెంట్లలో టీ తాగేవారని చెబుతారు. (అమెరికాలో ఉద్యోగం వదిలేసి: ఇండియాలో రూ.36 వేలకోట్ల కంపెనీ) ధీరూభాయ్ అంబానీ భార్య పేరు కోకిలాబెన్. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వీరు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ, నినా కొఠారి, దీప్తి సల్గోకర్. ఆస్తులను తన ఇద్దరు కుమారులు ముఖేశ్, అనిల్ అంబానీలకు పంచి ఇచ్చారు. 2002లో ఆయన మరణించే ముందు వరకు కంపెనీని పర్యవేక్షించిన ఆయన 1980ల మధ్యకాలంలో తన కుమారులు ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు అప్పగించారు, ఆయన వారసత్వాన్ని అందుకున్న ముఖేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆసియా బిలియనీర్, భారతదేశంలో అత్యంత సంపన్నుడుగా నిలిచిన సంగతి తెలిసిందే. (షాకింగ్! ప్రపంచంలోనే ఖరీదైన లిక్విడ్: చిన్న డ్రాప్ ధర పదివేలకు పైనే) -
పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను వివరిస్తూ ‘అడ్వాంటేజ్ ఏపీ’ పేరుతో విశాఖపట్నంలో నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సూపర్ హిట్ అయ్యింది. దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు ఒకే వేదికపైకి రావడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడులను పెడుతూ ఒప్పందాలు చేసుకున్నారు. రెండు రోజుల సమావేశాలకు రిలయన్స్ గ్రూపు చైర్మన్ ముఖేష్ అంబానీతో పాటు కరణ్ అదానీ, జిందాల్, బంగూర్, ఒబెరాయ్, భజాంకా, దాల్మియా, మిట్టల్, జీఎం రావు, కృష్ణ ఎల్లా, అపోలో ప్రీతా రెడ్డి, సతీష్ రెడ్డి, బీవీఆర్ మోహన్ రెడ్డి, మసహిరో యమగుచి, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎబర్హార్డ్ వంటి 30కిపైగా కార్పొరేట్ దిగ్గజాలు హాజరయ్యారు. అంబానీ మొదలు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్త వరకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చుకోవడమే కాకుండా అందులో భాగస్వామ్యమవుతామంటూ ప్రకటించారు. ఈ రెండు రోజుల సమావేశాల్లో 20 రంగాల నుంచి రూ.13,41,734 కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి. 378 ఒప్పందాల ద్వారా రాష్ట్ర యువతకు ప్రత్యక్షంగా 6,09,868 ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. గత ప్రభుత్వాల వలే ప్రచారం కోసం ఒప్పందాలు కుదుర్చుకొని వదిలేయకుండా వాటిని తక్షణం అమల్లోకి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి.. సీఎస్ అధ్యక్షతన ఒప్పందాల పర్యవేక్షణ కమిటీ వేశారు. ఈ కమిటీ ప్రతి వారం సమావేశమై ఒప్పందాల అమలు తీరు, అనుమతుల మంజూరు వంటి అంశాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటుందని సీఎం ప్రకటించడంపై పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అర్థవంతమైన చర్చలు ఈ సమావేశాల సందర్భంగా 15 రంగాలపై అర్థవంతమైన చర్చలు జరిగాయి. ఇందులో ఆయా రంగాలకు చెందిన 100 మందికిపైగా ప్రముఖ నిపుణులు పాల్గొని చర్చించారు. పలు దేశాల్లో ఉన్న పరస్పర పెట్టుబడుల అవకాశాలపై వియత్నాం, నెదర్లాండ్స్, యూఏఈ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా దేశాలతో కంట్రీసెషన్స్ జరిగాయి. పలు దేశాలకు చెందిన ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. రాష్ట్రంలోని పెట్టుబడులు, ఉత్పత్తులు, ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టుల నిర్మాణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేలా 137 స్టాల్స్తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి పేరుతో జిల్లాల వారీగా ఎగుమతులను ప్రోత్సహిస్తున్న ఉత్పత్తుల స్టాల్ విశేషంగా ఆకర్షించింది. 25 దేశాల నుంచి 46 మంది రాయబారులతో పాటు మొత్తం 14,000కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. 14 యూనిట్లు ప్రారంభం రాష్ట్రంలో వాణిజ్యపరంగా ఉత్పత్తికి సిద్ధమైన 14 యూనిట్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ సమక్షంలో వర్చువల్గా ప్రారంభించారు. ఈ యూనిట్ల ప్రారంభం ద్వారా రూ.3,841 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడమే కాకుండా 9,108 మందికి ఉపాధి లభించనుంది. క్లింబెర్లీ క్లార్క్, బ్లూస్టార్, అంబర్, హావెల్స్, ఎక్సలెంట్ ఫార్మా, ఎన్జీసీ టాన్స్మిషన్స్, చార్ట్ ఇండస్ట్రీస్, లారస్ ల్యాబ్, అమరా లైఫ్, శారదా ఫెర్రో అల్లాయిస్, విన్విన్ స్పెషాలిటీ, ఏవోవీ ఆగ్రో ఫుడ్స్, ఎస్హెచ్ ఫుడ్, అవేరా కంపెనీలున్నాయి. -
వాస్తవం ఆవిష్కృతం
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న విధంగా వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ను విజయవంతంగా నిర్వహించింది. గత సర్కారు హయాంలో మాదిరిగా పెట్టుబడుల సదస్సు పేరిట హంగు, ఆర్భాటాలు కాకుండా దేశ, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను ఇనుమడింప చేసింది. టీడీపీ అధికారంలో ఉండగా సదస్సుకు ఊరు పేరు తెలియని సంస్థలు, డ్రైవర్లను తరలించి సూటు బూటు వేసి భారీ సంఖ్యలో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకుంది. నాడు చంద్రబాబు సర్కారు నాలుగు సమ్మిట్స్ ద్వారా రూ.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకోగా కనీసం పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదు. తొలిసారిగా అంబానీ రాక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన విశాఖ సదస్సుకు రిలయన్స్, అదానీ, జేఎస్డబ్ల్యూ, జిందాల్, ఒబెరాయ్, దాల్మియా, బంగర్, బజాంకా తదితర పారిశ్రామిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. చంద్రబాబు హయాంలో నిర్వహించిన సదస్సులకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ముఖేష్ అంబానీ హాజరు కాకపోవడం గమనార్హం. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ పెట్టుబడుల సమావేశానికి ఆయన హాజరైన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన పెట్టుబడుల సమావేశానికి భారీ సంఖ్యలో పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కావడం వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కార్పొరేట్ల నమ్మకానికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. దుష్ప్రచారానికి చెంపపెట్టులా సదస్సు విశాఖ సమ్మిట్ ద్వారా ఒక్క సమావేశంతో రికార్డు స్థాయిలో రూ.13.4 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ అంతర్జాతీయంగా పేరు పొందినవే. థర్మల్ పవర్ నుంచి గ్రీన్ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ ఎన్టీపీసీ అందుకు రాష్ట్రాన్ని వేదికగా చేసుకుని రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది. రిలయన్స్, ఏబీసీ, జేఎస్డబ్ల్యూ ఆదిత్య బిర్లా, జిందాల్, ఫ్యూచర్, అదానీ, ఐవోసీఎల్ , అరబిందో, హీరో తదితర దిగ్గజ కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా తరచూ చేస్తున్న దుష్ప్రచారానికి తాజా సదస్సు చెంపపెట్టు లాంటిదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సదస్సులకు గతంలో ఒకరిద్దరు మాత్రమే ప్రముఖులు హాజరయ్యే వారని అలాంటిది ఈసారి ఇంతమంది కార్పొరేట్ దిగ్గజాలు ఒకేసారి రావటాన్ని నమ్మలేకపోతున్నామని సమావేశానికి హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు పేర్కొన్నారు. కార్యాచరణ ప్రారంభం కేవలం పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుని వదిలేయడం కాకుండా అమల్లోకి తెస్తూ కార్యాచరణను సైతం రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ప్రారంభించింది. ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. త్వరగా కార్యరూపం దాల్చే ఒప్పందాలకు ఎర్లీబర్డ్ రాయితీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ తెలిపారు. ఆరోగ్య రంగంలో ఆదర్శ రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ద్వారా పెట్టుబడులకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతంగా మారింది. హెల్త్కేర్ విభాగంలో దేశానికి ఆదర్శంగా నిలిచే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్కు ఉంది. పారిశ్రామికంగానే కాకుండా రాష్ట్రం సామాజికంగా పురోగమించడంలో సీఎం జగన్ చేస్తున్న కృషి అభినందనీయం. విశాఖ మరింతగా ఎదుగుతుంది. విశాఖలో మాకు 5 ఫార్ములేషన్ యూనిట్లు, రెండు బల్క్ డ్రగ్ యూనిట్లు ఉన్నాయి. మున్ముందు కూడా పెట్టుబడులను కొనసాగిస్తాం. – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ చైర్మన్ సతీష్రెడ్డి రెండేళ్లలో రూ.2 వేల కోట్లు ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, సీఎం జగన్ సహకారం వల్ల ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. – వంశీకృష్ణ బండి, హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ ‘అపాచీ’ మరో 100 మిలియన్ డాలర్లు అపాచీకి చైనా, భారత్, వియత్నాంలో ప్లాంట్లు ఉండగా ఏపీ ప్లాంటే అతి పెద్దది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లు వెచ్చించాం. మరో 100 మిలియన్ డాలర్ల (రూ. 820 కోట్లు) పెట్టుబడుల కోసం ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం. తద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారాల నిర్వహణ సులభతరంగా మారిందనడానికి మా సంస్థే ఉదాహరణ. – అపాచీ ఇండియా డైరెక్టర్ సెర్గియో లీ ‘దివీస్’ రెండు కొత్త ప్లాంట్లు రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు నెలకొల్పబోతున్నాం. రూ.780 కోట్ల ప్రతిపాదన ఆమోదం పొందగా.. మరో రూ.700 కోట్ల ప్రతిపాదనలకు సంబం ధించి ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో అదనంగా 22 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. – దివీస్ వైస్ ప్రెసిడెంట్ మధుబాబు -
అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?
అంబానీ కుటుంబం గురించి అందరికీ తెలుసు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం కలిగిన కుటుంబం వారిది. దివంగత ధీరూభాయ్ అంబానీ స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు మరింత విస్తరించారు. వివిధ వ్యాపారాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ప్రసిద్ధి చెందారు. అయితే వారి సోదరీమణుల గురించి ఎక్కువ మందికి తెలియదు. ధీరూభాయ్ అంబానీకి ముఖేష్, అనిల్లతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి పేర్లు నీనా కొఠారి, దీప్తి సల్గావ్కర్. వీరిలో నీనా కొఠారి రూ.68 వేల కోట్ల విలువైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ కంపెనీకి అధిపతి. 2003లో ఆమె జావగ్రీన్ అనే కాఫీ, ఫుడ్ చైన్ని స్థాపించారు. నీనా కొఠారి 1986లో వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అర్జున్ కొఠారి, కుమార్తె నయనతార కొఠారి ఉన్నారు. అనారోగ్య కారణాలతో శ్యామ్ కొఠారి 2015లో మరణించారు. ఆ తర్వాత నీనా కొఠారి వారి కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ బాధ్యతలను తీసుకున్నారు. 2015లో ఆమె కంపెనీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. కార్పొరేట్ షేర్హోల్డింగ్స్ ప్రకారం.. నీనా భద్రశ్యామ్ కొఠారి పబ్లిక్గా రెండు స్టాక్లను కలిగి ఉన్నారు. వాటి నికర విలువ రూ. 52.4 కోట్లకు పైగానే. -
అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ముంబైలో గురువారం జరిగిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్కు బాలీవుడ్ నుంచి దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ పాల్గొన్నారు. తాజాగా ఈ వేడుకలో పాల్గొన్న బాలీవుడ్ జంట ధరించిన దుస్తులపై నెట్టింట చర్చ నడుస్తోంది. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె సంప్రదాయ దుస్తులు ధరించి హాజరు కాగా.. దీపికా చీరలో అద్భుతంగా కనిపించగా.. రణ్వీర్ షేర్వాణీ ధరించి తళుక్కున మెరిశారు. దీపికా ధరించిన సిందూరి తాషి చీర దాదాపు రూ. 1.50 లక్షలుగా ధర ఉన్నట్లు తెలుస్తోంది. బంగారం, ఎరుపు కలయికతో రూపొందించిన ఈ చీరను షాలీనా నథాని అనే స్టైలిస్ట్ తయారు చేశారు. రణ్వీర్ సింగ్ షేర్వాణీ ధరించడంతో ఈ జంట మరింత ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో వీరితో పాటు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, మనీష్ మల్హోత్రా, అర్జున్ కపూర్, బోనీ కపూర్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య, కత్రినా కైఫ్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. -
రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ను కొనుగోలు చేసిన జియో!
ముంబై: రిలయన్స్ ఇన్ఫ్రాటెల్లో (ఆర్ఐటీఎల్) 100 శాతం వాటాలను రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఆర్పీపీఎంఎస్ఎల్) దక్కించుకుంది. ఇందుకోసం రూ. 3,725 కోట్లు వెచ్చించింది. ఆర్పీపీఎంఎస్ఎల్ మాతృ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ విషయాలు వెల్లడించింది. వివరాల్లోకి వెళ్తే.. దివాలా చర్యలు ఎదుర్కొంటున్న రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ (ఆర్ఐటీఎల్) మొబైల్ టవర్, ఫైబర్ అసెట్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు టెలికం దిగ్గజం జియోలో భాగమైన ఆర్పీపీఎంఎస్ఎల్ 2019లో రూ. 3,720 కోట్లకు బిడ్ చేసింది. ఈ మొత్తాన్ని ఎస్క్రో ఖాతాలో డిపాజిట్ చేస్తామంటూ నవంబర్ 6న ప్రతిపాదించింది. దీనికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేయడంతో తాజాగా రూ. 3,720 కోట్లను ఎస్బీఐ ఎస్క్రో ఖాతాలో జమ చేసింది. -
రుణ సంక్షోభంలో అనిల్ అంబానీ కంపెనీ..ఈవేలానికి రిలయన్స్ క్యాపిటల్ రెడీ
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న అనిల్ అంబానీ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ విక్రయానికి ఈవేలం నిర్వహించేందుకు విధానాలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వేలం విధానాలు, నిబంధనలను రుణదాతలు అనుమతించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ఈ నెల 19న ఈవేలం ప్రారంభంకానున్నట్లు తెలియజేశాయి. కాస్మియా పిరమల్ కన్సార్షియం వేసిన రూ. 5,300 కోట్ల బిడ్ను వేలానికి ప్రాథమిక ధరగా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రౌండ్ 1లో భాగంగా బిడ్డర్లు ఈ ధరకుపైన కోట్ చేయవలసి ఉంటుందని సంబంధిత వర్గాలు వివరించాయి. ఒక ఎన్బీఎఫ్సీ రుణ పరిష్కార ప్రణాళిక కోసం ఈస్థాయిలో ఈవేలాన్ని నిర్వహించడం ఇదే తొలిసారని తెలియజేశాయి. -
జియో చేతికి రిలయన్స్ ఇన్ఫ్రా..ఎన్సీఎల్టీ ఆమోదం!
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్ అనుబంధ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ సొంతం చేసుకునేలా జియోకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ కు చెందిన టవర్లు, ఫైబర్ ఆస్తులు జియో సొంతం కానున్నాయి. రిలయన్స్ ఇన్ఫ్రా దివాలా తీయడంతో ఆ కంపెనీ స్వాధీనానికి ముకేశ్ అంబానీ 2019 నవంబర్లో రూ.3,720 కోట్లతో బిడ్ దాఖలు చేశారు. అయితే ఈ బిడ్డింగ్ను వ్యతిరేకిస్తూ రుణదాతలు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కొనసాగుతుండగా... గత నెల జియో ఎన్సీఎల్టీ ఆశ్రయించి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరింది. ఆలస్యమయ్యేకొద్దీ ఇరువర్గాలకూ నష్టం చేకూరుతుందని, ఆస్తుల విలువ కూడా తగ్గుతుందని పేర్కొంది. ఈ క్రమంలో ఎన్సీఎల్టీ తాజాగా ఆమోదం తెలిపింది. -
ఎన్నాళ్ల కెన్నాళ్లకు..అనిల్ అంబానీకి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ కంపెనీ రిలయన్స్ క్యాపిటల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో తిరిగి లాభాల్లోకి ప్రవేశించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో రూ. 215 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో దాదాపు రూ. 1,116 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న కంపెనీ మొత్తం ఆదాయం సైతం రూ. 6,002 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు పుంజుకుంది. ప్రస్తుత క్యూ2లో రూ. 290 కోట్ల పన్నుకుముందు లాభం ఆర్జించగా.. గత క్యూ2లో రూ. 1,115 కోట్ల నిర్వహణా నష్టం ప్రకటించింది. రుణ చెల్లింపుల వైఫల్యం నేపథ్యంలో గతేడాది నవంబర్లో ఆర్బీఐ కంపెనీ బోర్డును రద్దు చేయడంతోపాటు.. వై.నాగేశ్వరరావును పాలనాధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఫలితాల నేపథ్యంలో రిలయన్స్ క్యాపిటల్ షేరు బీఎస్ఈలో దాదాపు 5 శాతం జంప్చేసి రూ. 11.22 వద్ద ముగిసింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ఆగని టీడీపీ అరాచకాలు
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
Advertisement