-
ఇక ఉచితంగా మాట్లాడను!
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను. ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
నన్ను కలవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే!
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కొత్త పాట పాడుతున్నాడు. ఇకనుంచి ఎవరినీ ఊరికే కలిసేది లేదంటున్నాడు. డబ్బులిస్తేనే పని జరుగుతుందంటున్నాడు. ఎంతోమందిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆయన ఇకనుంచి ఏదీ ఫ్రీగా చేయనంటున్నాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టాడు. 'ఇండస్ట్రీకి వచ్చే కొత్తవాళ్లకు సాయం చేయడం కోసం ఇప్పటికే నేను చాలా సమయాన్ని వృథా చేశాను. కొన్నిసార్లు టైం వేస్ట్ తప్ప ఏమీ మిగల్లేదు. కాబట్టి నేనో నిర్ణయానికి వచ్చాను. పావుగంటకు లక్ష.. గంటకు..? మేము తెలివైనవాళ్లం.. మా దగ్గర టాలెంట్కు కొదవే లేదని చెప్పుకుని తిరిగేవాళ్లతో నా సమయం వృథా చేయాలనుకోవడం లేదు. ప్రతిదానికి ఓ రేటు పెడుతున్నాను. నన్ను ఒక పది, పదిహేను నిమిషాలు కలవాలంటే రూ.1 లక్ష చెల్లించాలి. అరగంట మాట్లాడాలంటే రూ.2 లక్షలు.. అదే గంటసేపు నాతో మాట్లాడటానికి రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. షార్ట్కట్స్ కావాలా? మీరు అంత డబ్బు ఇవ్వగలిగేవారైతేనే రండి. లేదంటే వెళ్లిపోండి. షార్ట్కట్స్ వెతుక్కుంటూ వచ్చేవారిని చూసి అలిసిపోయాను. మరో ముఖ్య విషయం.. ఆ డబ్బంతా కూడా ఒక్కసారే అడ్వాన్స్గా ఇచ్చేయాలి' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అతడి కూతురు ఆలియా.. నీకు ఫార్వర్డ్ చేయమంటూ నాకు స్క్రిప్టులు పంపుతున్న ప్రతిఒక్కరికీ ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేస్తాను అని రిప్లై ఇచ్చింది. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: మొన్నే ప్రియుడితో ఎంగేజ్మెంట్.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్ -
కోలీవుడ్లో ఎంట్రీ ఇవ్వనున్న దర్శకుడు!
ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్.. గ్యాంగ్ ఆఫ్ వసీపూర్ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయన పలు హిట్ చిత్రాలను తెరకెక్కించాడు. నటుడిగానూ, పలు చిత్రాలలో యాక్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడే. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఇమైకా నొడిగల్ చిత్రంలో విలన్గా నటించి తన విలక్షణ నటనను ప్రదర్శించాడు. ఇటీవల విజయ్ కథానాయకుడిగా నటించిన లియో చిత్రంలోనూ చిన్న పాత్రలో మెరిశాడు. ఈయన దర్శకత్వం వహించిన కెన్నడీ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే దర్శకుడిగా ఈయన కోలీవుడ్ ఎంట్రీ షురూ అయినట్లు సమాచారం. ఈయన దర్శకత్వంలో జీవీ ప్రకాష్కుమార్ హీరోగా పాన్ ఇండియా చిత్రం తెరకెక్కనుంది. దీని గురించి జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్కశ్యప్ తనను హీరోగా నటించమని అడిగారన్నాడు. ఇది పాన్ ఇండియా చిత్రంగా ఉంటుందన్నాడు. కాగా జీవీ ప్రకాష్కుమార్ ప్రస్తుతం నటుడిగా, సంగీత దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు. ఈయన నటించిన రెబల్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనితో పాటు 13, ఇడి ముళక్కమ్, కల్వన్ చిత్రాల్లో కథానాయకుడిగా నటిస్తున్నాడు. అదేవిధంగా సైరన్, సియాన్ విక్రమ్ 62వ చిత్రం, శివకార్తికేయన్ 21వ చిత్రం , సూర్య 43వ చిత్రం అంటూ సంగీత దర్శకుడిగానూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఈయన అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. చదవండి: 10 మంది పొగిడితే, 50 మంది తిట్టారు: నయనతార -
ఆ సమయంలో ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా: స్టార్ డైెరెక్టర్
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఆయన కెన్నెడీ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో సన్నిలియోన్, రాహుల్ భట్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన బాలీవుడ్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ఎదురైన పరిస్థితుల వల్ల ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. (ఇది చదవండి: ప్రియాంక చోప్రా భర్తకు అవమానం.. పాట పాడుతుండగానే!) అదే సమయంలో తనకు తమిళం, మలయాళం ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయని వెల్లడించారు. అందుకు గల కారణాలను కూడా అనురాగ్ వివరించారు. నెగెటివిటీ కారణంగా ఒకానొక సమయంలో బాలీవుడ్ వదిలి వెళ్లిపోవాలనుకున్నానని దర్శకుడు అనురాగ్ కశ్యప్ అన్నారు. నెగెటివిటీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. 'ఒకటి, రెండు సంవత్సరాల పాటు నాకు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నా. 2021కి ముందు రెండేళ్లపాటు ఎక్కువగా ప్రభావితమయ్యా. ఆ సమయంలో బయటకు వెళ్లాలని అనుకున్నా. దక్షిణాదికి చెందిన నా స్నేహితులు తమిళంలో సినిమాలు చేయమని ఆహ్వానించారు. కేరళకు చెందిన నా స్నేహితుడు మలయాళంలో సినిమాలు చేయమని పిలిచారు. జర్మన్, ఫ్రెంచ్ సినిమాలు చేయమని కూడా ఆహ్వానం అందింది. కానీ నాకు భాషలు తెలియక వాటిని అంగీకరించలేకపోయా. విమర్శలు అన్నింటినీ ఎదుర్కొన్నప్పటికీ.. ఈ రంగంలోనే కొనసాగుతున్నందుకు ఆనందంగా ఉన్నా. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా విమర్శించినా నేను పెద్దగా పట్టించుకోను. అవీ నన్ను ఏమాత్రం బాధపెట్టడం లేదు. వాళ్లు ఏం మాట్లాడినా.. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతా.' అని అన్నారు. (ఇది చదవండి: భార్య వల్లే హీరో ప్రశాంత్ కెరీర్ దెబ్బతిందా.. పెళ్లికి ముందే ఆమె మరొకరితో) అనురాగ్ కెరీర్ అనురాగ్ కశ్యప్ మొదట రామ్ గోపాల్ వర్మ చిత్రం సత్యలో కో- డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆ తర్వాత బ్లాక్ ఫ్రైడే, నో స్మోకింగ్, దేవ్.డి, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, అగ్లీ, రామన్ రాఘవ్ 2.0 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన చివరిసారిగా మేడ్ ఇన్ హెవెన్ సీజన్ -2లో ప్రత్యేక పాత్రలో కనిపించారు. -
Aaliyah Kashyap: స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్మెంట్లో మెరిసిన తారలు (ఫొటోలు)
-
ప్రియుడితో ఎంగేజ్మెంట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ కూతురు!
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. గురువారం ముంబయిలో జరిగిన ఈ వేడుకలో పలువురు బాలీవుడ్ సినీతారలు మెరిశారు. ఈ ఫంక్షన్లో ఖుషీ కపూర్, సుహానా ఖాన్, పాలక్ తివారీ, ఇబ్రహీం అలీ ఖాన్తో సహా పలువురు స్టార్ కిడ్స్ హాజరయ్యారు. ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్స్టాలో షేర్ చేయగా.. పలువురు ఈ జంటకు అభినందనలు తెలిపారు. ( ఇది చదవండి: చేసింది కొన్ని సినిమాలే.. భారీ చిత్రంలో ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ!) కాగా.. ఆలియా కశ్యప్.. తన ప్రియుడైన షేన్ గ్రెగోయిర్ను త్వరలోనే పెళ్లి చేసుకోనుంది. ప్రస్తుతం ఆలియా యూట్యూబర్గా రాణిస్తోంది. పలు వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అనురాగ్ కశ్యప్ మొదటి భార్య ఆర్తి బజాజ్ కూతురే ఆలియా. ఇంతకుముందే ప్రియుడు షేన్ గ్రెగోయిర్ ప్రపోజ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమెకు డైమండ్ రింగ్తో ప్రపోజ్ చేసినట్లు ఆలియా వెల్లడించింది. ఈ వేడుకలో అనురాగ్ మాజీ భార్య కల్కి కోచ్లిన్ తన బేబీ, భర్తతో సహా హాజరైంది. ( ఇది చదవండి: షారుఖ్పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) -
మహారాజా రెడీ
విజయ్ సేతుపతి కెరీర్లో 50వ మైలురాయిగా తెరకెక్కిన చిత్రం ‘మహారాజా’. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్, మమతా మోహన్దాస్, నట్టి నటరాజ్ కీలక పాత్రలు పోషించారు. ప్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరం, ది రూట్–థింక్ స్టూడియోస్ జగదీష్ పళనిసామి సమర్పణలో రూపొందిన ఈ సినిమా రిలీజ్కు రెడీ అవుతోంది. -
ఆ డైరెక్టర్ నా పీరియడ్స్ డేట్ అడిగాడు: బాలీవుడ్ నటి
ఓపక్క సినిమాలు, మరోపక్క వెబ్ సిరీస్లు చేస్తూ జోరు మీదుంది బాలీవుడ్ నటి అమృత సుభాష్. ద మిర్రర్, లస్ట్ స్టోరీస్ 2లోనూ యాక్ట్ చేసిన ఈమె తాజాగా తనకు షూటింగ్లో ఎదురైన ఓ ఆసక్తికర సంఘటనను చెప్పుకొచ్చింది. 'నేను సాక్ర్డ్ గేమ్స్ 2 సిరీస్లో తొలిసారి శృంగార సన్నివేశాల్లో నటించాను. ఈ సీన్స్ షూట్ చేయడానికి ముందు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అప్పుడు నన్ను ఓ ప్రశ్న అడిగాడు. నీ పీరియడ్స్ డేట్ ఎప్పుడు? అని ప్రశ్నించాడు. నాకు కొద్ది క్షణాలపాటు ఏం అర్థం కాలేదు. అతడు తిరిగి.. నీ డేట్ ఎప్పుడో చెప్తే మనం ఇంటిమేట్ సీన్స్కు ఆ రోజుల్లో కాకుండా ఇతర రోజుల్లో షెడ్యూల్ సర్దుబాటు చేద్దాం అన్నాడు. డైరెక్షన్ టీమ్తో మాట్లాడి షెడ్యూల్లో మార్పుచేర్పులు చేశాడు. అతడు చాలా మృదుస్వభావి. నటీనటులను ఎంతగానో అర్థం చేసుకుంటాడు' అని చెప్పుకొచ్చింది అమృత. కాగా అమృత సుభాష్ సాక్ర్డ్ గేమ్స్ రెండో సీజన్లో రా ఏజెంట్గా నటించింది. అలాగే కొంకణ సేన్ దర్శకత్వం వహించిన ద మిర్రర్లోనూ యాక్ట్ చేసింది. అయితే ఇందులో తన పాత్ర గురించి చెప్పినప్పుడు ఏదీ తన బుర్రకు ఎక్కలేదట. ఒకరకంగా అదే మేలంటోంది అమృత. తన పాత్ర గురించి పూర్తిగా తెలిసిపోతే రిలాక్స్ అయిపోతామని, అదే కాస్త సందిగ్ధంగా ఉంటే దాని గురించి తెలుసుకునేందుకు, అందులో లీనమైపోయేందుకు మరింత కష్టపడతామని చెప్తోంది. చదవండి: కాలు విరగ్గొట్టుకున్న నవదీప్ -
పాక్ నటి పెళ్లి.. హెల్ప్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్
పాక్ నటి ఉస్నా షా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. తమ దేశానికి చెందిన గోల్ఫ్ ప్లేయర్ హమ్జా అమీన్ తో నిఖా చేసుకుంది. అయితే ఈ వేడుకలో ఉస్నా.. ఎర్రని లెహంగా ధరించడం సోషల్ మీడియాలో అప్పట్లో పెద్ద రచ్చ అయింది. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఈమె డ్రస్ వేసుకోవడాన్ని కొందరు తప్పుబట్టారు. ఇప్పుడు ఏకంగా తన పెళ్లి జరగడానికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కారణమని బయటపెట్టింది. పాకిస్థాన్కు చెందిన ఉస్నా షా.. సినిమాలు, సీరియల్స్ తో చాలా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం కాస్త బిజీగానే ఉంది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తో తాను దిగిన ఫొటోని ఇప్పుడు ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఆయన్ని జీనియస్ అని మెచ్చుకుంటూనే.. తన పెళ్లి జరగడానికి ఈ దర్శకుడే కారణమని చెప్పుకొచ్చింది. అయితే అది ఎప్పుడూ ఎలా అనేది మాత్రం బయటపెట్టలేదు. పాక్ నటికి బాలీవుడ్ డైరెక్టర్ తో ఎక్కడా ఎలా పరిచయం అయిందా అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారిపోయింది. (ఇదీ చదవండి: నటిపై దాడి.. ఆ విషయమై గొడవ జరగడంతో!) View this post on Instagram A post shared by Ushna Shah-Amin (@ushnashah) -
Aaliyah Kashyap: డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
ప్రముఖ దర్శకుడి కూతురి నిశ్చితార్థం, ఫోటోలు వైరల్
ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కూతురు ఆలియా కశ్యప్ గుడ్న్యూస్ చెప్పింది. గత కొంతకాలంగా షేన్ గ్రెగోయిర్ ప్రేమలో మునిగి తేలుతున్న ఆమె అతడితో ఏడడుగులు వేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఆలియా నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా తన ప్రేయసి వేలికి ఉంగరాన్ని తొడిగాడు షేన్. ఈ ఫోటోలను లవ్ బర్డ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఇందులో తన చేతి వేలికి ఉన్న ఉంగరాన్ని హైలైట్ చేసిన ఆలియా మరో ఫోటోలో ప్రియుడికి గాఢంగా ముద్దు పెట్టింది. 'మొత్తానికి మేము అనుకుంది జరిగింది. నా బెస్ట్ ఫ్రెండ్, నా పార్ట్నర్, నా సోల్మేట్ ఇప్పుడు నా భర్త అయ్యాడు. నా జీవితానికి దొరికిన అమూల్యమైన ప్రేమవు నీవే.. అసలు సిసలైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించినందుకు థ్యాంక్స్. నీ ప్రపోజల్కు ఎస్ చెప్పడం నేను చేసినవాటిలో అత్యంత సులువైన పని. నీతో జీవితాన్ని కొనసాగించడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ఫియాన్సీ అని పిలిచే రోజు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను' అని క్యాప్షన్లో రాసుకొచ్చింది ఆలియా. కాగా ఆలియా- షేన్ గ్రెగోయిర్ 2020లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. గతేడాది జూన్లో తమ ప్రేమకు రెండేళ్లు నిండటంతో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు షేన్. ఆలియాను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తూనే ఆమె వేలికి ఉంగరాన్ని తొడిగే రోజు కోసం ఎదురుచూస్తున్నానని రాసుకొచ్చాడు. ఎట్టకేలకు అనుకున్నది సాధించడంతో షేన్కు శుభాకాంక్షలు చెప్తున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Shane Gregoire (@shanegregoire) చదవండి: రామ్ గోపాల్ వర్మ నన్ను మోసం చేశాడు: బాలీవుడ్ నటుడు -
నా జీవితంలో అత్యంత చెత్త సందర్భం అదే: సన్నీ లియోన్
బాలీవుడ్ భామ సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కెన్నెడీ'. ఈ చిత్రాన్ని దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ నెటిజన్స్ దృష్టిని ఆకర్షించింది. సన్నీ లియోన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సినిమా ఆడిషన్పై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెన్నెడీ సినిమాకు ఆడిషన్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డానని తెలిపింది. రూమ్ మొత్తం మనుషులు ఉండటం చూసి చాలా కంగారు పడ్డానన్నారు. సన్నీ లియోన్ మాట్లాడుతూ..' కెన్నెడీలో ఆఫర్ కోసం అనురాగ్ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. దర్శక, నిర్మాతలు మాత్రమే ఆడిషన్ చేస్తారని తెలుసు. అందుకే ఎలాంటి భయం లేకుండా వెళ్లాను. తీరా చూస్తే అక్కడ సినిమా యూనిట్ అంతా ఉంది. సినిమా కోసం పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇతర టీమ్ మొత్తం అక్కడే రూమ్లో ఉన్నారు. దీంతో వాళ్లందర్నీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఇది నాకు కంఫర్ట్గా అనిపించలేదు. నాలో చాలా కంగారు మొదలైంది. నేను ఆడిషన్ ఇవ్వడం పూర్తయిన వెంటనే అనురాగ్ వాళ్ల టీమ్ వైపు చూసి.. ఆమె ఎలా చేసింది? అని అడిగారు. ఆ క్షణం సినీ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత చెత్త ఆడిషన్ అదే అనిపించింది,.' అని అన్నారు. అదృష్టవశాత్తు తాను ఆ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని సన్నీ లియోన్ తెలిపారు. -
ఆ డైరెక్టర్ లైంగిక దాడి చేశాడు.. హీరోయిన్ సంచలన ఆరోపణలు!
బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ టాలీవుడ్కు సుపరిచితమైన పేరు. మంచు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ ఊసరవెల్లి చిత్రంలోనూ కనిపించింది పాయల్. ఆ తర్వాత మిస్టర్ రాస్కెల్ సినిమా కూడా చేసింది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ సినిమాలలో తనదైన నటనతో మెప్పించింది. బెంగాలీ అయినా పాయల్ ఘోశ్ తాజాగా సంచలన ట్వీట్స్ చేసింది. తనను దర్శకుడు అనురాగ్ కశ్యప్ లైంగిక వేధింపులకు గురి చేశాడని ఇప్పటికే ఫిర్యాదు చేసిన నటి మరోసారి వరుస ట్వీట్లతో వార్తల్లో నిలిచింది. పాయల్ ట్వీట్లో రాస్తూ..' నేను సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2 నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్తో కలిసి పనిచేశా. కానీ ఎవరూ నన్ను ఆ విధంగా టచ్ చేయలేదు. కానీ బాలీవుడ్లో దర్శకుడు అనురాగ్ కశ్యప్తో పని చేయలేదు. అతన్ని మూడోసారి కలిసినప్పుడే నన్ను రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఎందుకు సౌత్ గురించి గొప్పగా చెప్పుకోకూడదో చెప్పండి. అలాగే తెలుగులో జూనియర్ ఎన్టీఆర్తో కూడా పనిచేశా. కానీ అతను కూడా నాతో ఎప్పుడూ అనుచితంగా ప్రవర్తించలేదు. ఆయనొక జెంటిల్మెన్. అందుకే నాకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం.' అంటూ పోస్ట్ చేసింది. తాజాగా ఆమె చేసిన ట్వీట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. I have also worked with a Super star @tarak9999 but even him never behaved with me inappropriately , such a gentleman he was , I have all the love for south film industry ❤️ — Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023 I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!! — Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023 -
సుశాంత్ మరణించేముందు మెసేజ్ వచ్చింది, నేను పట్టించుకోలే!
యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం బాలీవుడ్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే! బాలీవుడ్ సెలబ్రిటీలు సుశాంత్ను పట్టించుకోలేదని, అతడిని సైడ్ చేయడం వల్లే సుశాంత్ కుమిలిపోయి ఆత్మహత్యకు యత్నించాడంటూ అభిమానులు విమర్శలు గుప్పించారు. ఇప్పటికీ సుశాంత్ను తలుచుకుంటూ నిత్యం అతడి ఫ్యాన్స్ సోషల్మీడియాలో ఏదో ఒక పోస్టు పెడుతూనే ఉంటారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ సుశాంత్ విషయంలో తానిప్పటికీ బాధపడుతున్నానన్నాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'అందరి ముందు అరుస్తున్నానని నాకు చాలా లేట్గా తెలిసొచ్చింది. కొన్ని విషయాలను గ్రహించడానికి నాకు ఏడాదిన్నర పట్టింది. సోషల్ మీడియా వచ్చాక నేను వెనక్కు తగ్గాను. ప్రతిదానికి రియాక్ట్ అవ్వాల్సిన పని లేదని గ్రహించాను. సుశాంత్ మరణంతో చాలా కుంగిపోయాను. తను చనిపోవడానికి మూడు వారాల ముందు సుశాంత్ టీమ్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. అతడు నాతో కలిసి పని చేయాలని కోరుకుంటున్నాడని, నాతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పారు. నేను మాత్రం కుదరదు, మాట్లాడనని చెప్పేశా. గతంలో నా ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడన్న కోపంతో అలా మాట్లాడాను. కానీ సుశాంత్ చనిపోయాక ఎంత గిల్టీగా ఫీలయ్యానో! తర్వాత ఓసారి అభయ్కు ఫోన్ చేసి అతడికి సారీ చెప్పాను. ఎందుకంటే నేను పబ్లిక్గా అతడి గురించి మాట్లాడినందుకు తను హర్ట్ అయ్యాడని తెలిసింది. అందుకే మరేం ఆలోచించకుండా క్షమాపణలు చెప్పాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. I am sorry that I am doing this but this chat is from three weeks before he passed away. Chat with his manager on 22 May .. havent don’t it so far but feel the need now .. yes I didn’t want to work with him for my own reasons .. https://t.co/g4fLmI5g9h pic.twitter.com/cHSqRhW9BD — Anurag Kashyap (@anuragkashyap72) September 9, 2020 చదవండి: నా కన్నీళ్లు నేనే తాగి బతికిన.. నన్నాపకుండ్రి..: రచ్చ రవి కీర్తి సురేశ్ పెళ్లి.. వరుడెవరో తెలిసిపోయింది -
మోదీజీ.. పరిస్థితి చెయ్యి దాటిపోయింది!
ముంబై: సొసైటీలో సినిమాల ప్రభావం ఎలా ఉన్నా.. ప్రస్తుతం సినిమాల చుట్టూరానే రాజకీయాలు కచ్ఛితంగా నడుస్తున్నాయి. తాజాగా.. సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల మీద కామెంట్లు చేయడం, అతిగా స్పందించడం మానుకోవాలని ప్రధాని మోదీ.. కార్యకర్తలకు సూచించారాయన. అయితే.. ప్రధాని సలహాపై తాజాగా ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ ఫిల్మ్మేకర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. పరిస్థితి ఎప్పుడో చెయ్యి దాటిపోయిందనన్నారు ఆయన. ముంబైలో తన తాజా చిత్రం ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ తన పార్టీ కార్యకర్తలకు చేసిన సూచనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేద’’ని కశ్యప్ అభిప్రాయపడ్డారు. మరోవైపు చిత్ర నిర్మాత షరీఖ్ పటేల్ మాత్రం ప్రధాని సూచనపై సానుకూలంగా స్పందించారు. ఇకనైనా మంచి జరుగుతుందని ఆశిస్తున్నానని, ఇండస్ట్రీలో ఏర్పడిన నెగటివిటీ కనుమరుగు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారాయన. ఇదిలా ఉంటే.. బాలీవుడ్లో ఉత్త పుణ్యానికే బాయ్కాట్ ట్రెండ్ తెర మీదకు వస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి.. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్కు ఈ ట్రెండ్కు అడ్డుకట్ట పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో రెండు వారాల తర్వాత పార్టీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ సలహా ఇవ్వడం విశేషం. కిందటి ఏడాది బాయ్కాట్ ట్రెండ్ను చాలానే ఎదుర్కొన్నాయి. లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్, దొబారా, లైగర్, బ్రహ్మస్త్ర: పార్ట్ వన్-శివ బాయ్కాట్ ట్రెండ్లో అల్లలాడిపోయాయి. ఈ ఏడాది ప్రారంభంలో షారూక్ ఖాన్ పథాన్ చిత్రం బాయ్కాట్ట్రెండ్ను ఎదుర్కొంటోంది. -
అత్యంత ధనవంతులైన డైరెక్టర్ల లిస్ట్లో రాజమౌళి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ధనవంతులైన దర్శకులు ఎవరో తెలుసా? స్క్రీన్పై అభిమానులకు వినోదాన్ని అందిస్తూ కోట్లు సంపాదించిన డైరెక్టర్లను వేళ్ల మీదే చెప్పొయొచ్చు. అలాంటి ఇండియాలో ధనవంతులైన దర్శకులెవరో ఓ లుక్కేద్దాం. జీక్యూ ఇండియా తాజాగా దర్శకుల జాబితాను ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ జాబితాలో టాలీవుడ్కు చెందిన ఎస్ఎస్ రాజమౌళి మాత్రమే ఉన్నారు. బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ గురించి బాలీవుడ్తో పాటు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో ఫేమస్ అయ్యారు. ఆయనకు దాదాపు రూ.1640 కోట్ల ఆస్తులతో మొదటిస్థానంలో ఉన్నారు. రెండోస్థానంలో రాజ్కుమార్ హిరాణీ రూ.1105 కోట్లతో నిలవగా.. రూ.940 కోట్లతో సంజయ్ లీలా భన్సాలీ మూడోస్థానం పొందారు. ఆ తర్వాత వరుసగా రూ.720 కోట్లతో అనురాగ్ కశ్యప్, రూ.300 కోట్లతో కబీర్ ఖాన్, రూ.280 కోట్లతో రోహిత్ శెట్టి, రూ.158 కోట్లతో ఎస్ఎస్ రాజమౌళి, రూ.76 కోట్లతో జోయా అక్తర్ నిలిచారు. View this post on Instagram A post shared by GQ India (@gqindia) -
‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్
ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. భారీ బడ్జెట్, స్టార్ నటీనటులు అనే సంబంధం లేకుండ కంటెంట్ ఉన్న చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. బాషతో సంబంధం లేకుండ సౌత్ సినిమాలకు నార్త్లో సైతం విశేష ఆదరణ లభిస్తోంది. ఇందుకు ఇటీవల విడుదలైన కాంతార చిత్రమే ఉదాహరణ. ఈ ప్రాంతీయ సినిమా వచ్చిన ఈ కన్నడ మూవీ దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది. దీంతో పాన్ ఇండియా అనే అంశం ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. చదవండి: వాల్తేరు వీరయ్య: కేక పుట్టిస్తున్న రవితేజ ఫస్ట్లుక్ టీజర్ ఈ నేపథ్యంలో కాంతార మూవీపై స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్చప్ చేసిన వ్యాఖ్యలు హాట్టాపిక్ నిలిచాయి. సైరత్ మూవీ విజయం మరాఠి ఇండస్ట్రీని నాశనం చేసిందని గతంలో ఆ మూవీ డైరెక్టర్ నాగరాజు మంజులే చేసిన వ్యాఖ్యలను అనురాగ్ గుర్తు చేశాడు. ప్రాంతీయ సినిమాలు, సొంత కథల సినిమాలు మంచి విజయం సాధించినప్పటికీ.. వాటి సక్సెస్ కారణంగా ఇండస్ట్రీ నాశనమైపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ హవా కొనసాగుతుందని, దానివల్ల బాలీవుడ్ ఇండస్ట్రీ నాశనమైపోతుందన్నాడు. చదవండి: అంజలి పెళ్లి చేసుకుందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హవా నడుస్తోంది. దీంతో ఈ ట్రెండ్పైనే బాలీవుడ్ దర్శక-నిర్మాతలు దృష్టిపెడుతున్నారు. ఇప్పుడు ఇదే బాలీవుడ్ను నాశనం చేస్తోంది. పుష్ప, కేజీయఫ్ 2, కాంతార వంటి చిత్రాలు దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్ హిట్ అయ్యిండోచ్చు. కానీ అలాంటి సినిమాలు బాలీవుడ్లో వర్కౌట్ కావు. వాటినే కాపీ కొట్టి పాన్ ఇండియా సినిమాలుగా తీయాలని చూస్తే మాత్రం బాలీవుడ్కు భారీ నష్టం తప్పుదు. ప్రస్తుతం బాలీవుడ్కు కావాల్సింది పాన్ ఇండియా సినిమాలు కాదు. ఇండస్ట్రీకి ధైర్యం చెప్పే సినిమాలు కావాలి. కథల్లో ఎప్పుడూ కొత్తదనం ఉండాలి.. అప్పుడే సినిమాలు హిట్ అవుతాయి’’ అని అనురాగ్ పేర్కొన్నాడు. -
మూడేళ్లు డిప్రెషన్లో, ఇంతలో గుండెపోటు: స్టార్ డైరెక్టర్
స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఒకానొక సమయంలో ఎంతగానో ఒత్తిడికి లోనయ్యాడట. తన కూతురి గురించి ఆందోళనపడి మూడున్నరేళ్ల పాటు డిప్రెషన్లో ఉండిపోయాడట. ఈ విషయాన్ని స్వయంగా అతడే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'పౌరసత్వ సవరణ (సీఏఏ) చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నామీద, నా కుటుంబం మీద ఎంతో ద్వేషం చూపించారు. నా కూతుర్ని అత్యాచారం చేసి చంపుతానని బెదిరించారు. ఆ బెదిరింపుల వల్ల ఆమె ఎంతో ఒత్తిడికి లోనయ్యేది. ఇంత నెగెటివిటీ భరించలేక ట్విటర్ నుంచి వైదొలిగాను. పోర్చుగల్ వెళ్లిపోయాను. కొంతకాలానికి ప్యార్ విత్ డీజే మొహబ్బత్ సినిమా షూటింగ్ ఉండటంతో భారత్కు తిరిగి రావాల్సి వచ్చింది. నా కూతురు ఆలియా కశ్యప్ ఏదున్నా బయటకు మాట్లాడేస్తుంది. కానీ ఆమె లోలోపల పడే ఆందోళన నన్ను ఎంతగానో బాధపెట్టింది. సోషల్ మీడియాలో మొదలైన బెదిరింపుల వల్ల ఆమె చాలా డిస్టర్బ్ అయింది. తన కోసమే నేను అన్నీ వదిలేసి అమెరికాకు వెళ్లిపోయాను. ప్రతిదానికీ ఆలియా కంగారుపడిపోతుంది, అదొక్కటే నన్ను టెన్షన్ పెడుతుంది. దాదాపు మూడేళ్లు డిప్రెషన్లో ఉన్నాను. గతేడాది గుండెపోటు వచ్చి ఆస్పత్రిపాలయ్యాను. కానీ కోలుకున్న వెంటనే తిరిగి సినిమాలు మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు అనురాగ్ కశ్యప్. కాగా అనురాగ్ డైరెక్ట్ చేసిన ప్యార్ విత్ డీజే మొహబ్బత్ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది. చదవండి: ఫైమాకు ఇంకా వెటకారం తగ్గలేదు నిహారికతో బ్రేకప్.. సింగర్ క్లారిటీ -
హతవిధీ.. తాప్సీ సినిమాకు కూడా అదే గతి!
బాలీవుడ్కు ఏదో శని పట్టుకున్నట్లే ఉంది. వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న హిందీ పరిశ్రమకు ఊపిరిపోద్దామనుకున్న బడా డైరెక్టర్లు, స్టార్ హీరోల ఆశ అత్యాశే అయింది. బస్తీమే సవాల్ అంటూ బాక్సాఫీస్ బరిలో దిగిన ఎన్నో పెద్ద సినిమాలు అట్టర్ ఫ్లాప్గా నిలిచాయి. తాజాగా ఈ జాబితాలో తాప్సీ కొత్త మూవీ దొబారా వచ్చి చేరింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 19న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అనూహ్యంగా కేవలం 2 నుంచి మూడు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అవుతున్నాయట. అసలు జనాలే రాకపోవడంతో చాలావరకు షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నారట. మహా అయితే ఈ సినిమా మొదటి రోజు రూ.30 లక్షలు, ఫుల్ రన్లో కోటిన్నర రూపాయలు రాబడుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి సినీవిశ్లేషకులు. నిజానికి సినిమా ప్రమోషన్స్లో బాయ్కాట్ ట్రెండ్పై తాప్సీ, అనురాగ్లు స్పందిస్తూ.. దొబారా మూవీని కూడా బాయ్కాట్ చేయాలని కోరారు. అన్నట్లే ఆ సినిమాను ఆదరించే నాదుడే కరువయ్యాడు. కాగా దొబారా సినిమా 2018లో వచ్చిన మిరేగ్ అనే స్పానిష్ సినిమాకు రీమేక్. For Me….#Dobaaraa is a Successful film, it SUCCESSFULLY MADE ME SLEEP inside the theatre also made me believe in TIME TRAVEL because I wanted to go back in time when I purchased the ticket for the film… 1.5*/5 ⭐️ ½ #DobaaraaReview #AnuragKashyap #TaapseePannu pic.twitter.com/XPFIuaelTz — Rohit Jaiswal (@rohitjswl01) August 19, 2022 #Dobaaraa is off to a DISASTROUS start at the box office, film is registering merely 2-3% occupancy while many early shows are getting canceled due to NO AUDIENCE.. — Sumit Kadel (@SumitkadeI) August 19, 2022 చదవండి: బుల్లితెర తారలతో నిండిన 'వాంటెడ్ పండుగాడ్' మూవీ రివ్యూ స్టార్ హీరోల సినిమాలను వెనక్కునెట్టిన నిఖిల్ మూవీ -
ఇద్దరు మాజీ భార్యలతో స్టార్ డైరెక్టర్, ఫొటో వైరల్
బాలీవుడ్లో బాయ్కాట్ ట్రెండ్ నడుస్తోంది. స్టార్ల సినిమా వస్తుందంటే చాలు చూసేదే లేదని తెగేసి చెప్తున్నారు హిందీ ఆడియన్స్. ప్రేక్షకుల దెబ్బకు కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమా బడ్జెట్లో కనీసం పావు వంతైనా రాబట్టకపోవడంతో నిర్మాతలు అల్లాడిపోతున్నారు. త్వరలో తాప్సీ- అనురాగ్ కశ్యప్ల నుంచి కొత్త సినిమా రాబోతోంది. వీరి కాంబినేషన్లో వచ్చిన దొబారా ఆగస్టు 19న విడుదల కాబోతోంది. అయితే తమ సినిమాను కూడా బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేయాలని, అప్పుడే తమ చిత్రం అందరికీ రీచ్ అవుతుందని వింతగా స్పందించారు తాప్సీ, అనురాగ్. ఇక మరోవైపు తాప్సీ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యాడీ డైరెక్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన మాజీ భార్యలతో కలిసి ఫొటోలను పోజిచ్చాడు. దొబారా సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న ఆయన తన మాజీ భార్యలు కల్కి కొచ్లిన్, ఆర్తి బజాజ్లతో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. వీరిద్దరూ తన రెండు పిల్లర్లు అని రాసుకొచ్చాడు. ఈ ఫొట నెట్టింట వైరల్ అవగా అనురాగ్- ఆర్తిల కూతురు ఆలియా కశ్యప్ ఐకానిక్ అంటూ ఈ పోస్ట్పై కామెంట్ చేసింది. కాగా అనురాగ్ కశ్యప్- ఆర్తి బజాజ్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి కూతురు ఆలియా జన్మించింది. ఆ తర్వాత 2009లో వీరు విడిపోయారు. అనంతరం అనురాగ్ 2011లో నటి కల్కి కొచ్లిన్ను పెళ్లాడగా 2015లో విడాకులు తీసుకున్నాడు. View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) View this post on Instagram A post shared by Anurag Kashyap (@anuragkashyap10) చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు -
‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్... అనురాగ్ అంచనాలు నిజమైతే!
ఇండియన్ సినిమాకు ఆస్కార్ అన్నది ఒక కల. ప్రతీ ఏటా మనం సినిమాను ఎంపిక చేసి ఆస్కార్ కమిటీకి పంపడం.. వారు మన సినిమాను రిజెక్ట్ చేయడం పరిపాటిగా మారింది. కాని 2023 ఆస్కార్ కు ఇండియా నుంచి వెళ్లే సినిమాను ఎంపిక చేయాల్సి వస్తే గుడ్డిగా ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేయమంటున్నాడు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ కు మన దేశం తరుపున కమిటీ కనుక ఆర్ ఆర్ ఆర్ ను సెలక్ట్ చేసి పంపితే ఉత్తమ విదేశి చిత్రం క్యాటగరీలో ఆస్కార్ అందుకోవడానికి 99 శాతం చాన్స్ ఉందని అభిప్రాయపడ్డాడు. తాప్సీ ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన హిందీ చిత్రం ‘దోబారా’. ఆగస్ట్ 19న ఈ చిత్రం విడుదల కాబోతుంది. కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అనురాగ్ మీడియాతో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ లభిస్తే.. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ లభించే అవకాశం ఉందని చెప్పారు. (చదవండి: తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు) హాలీవుడ్పై ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రభావితం చేసిందని, అక్కడ తెరకెక్కిన మార్వెల్ మూవీస్ కంటే కూడా ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ ఆడియెన్స్ కు బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు అనురాగ్. ఇక వెరైటీ అనే మరో హాలీవుడ్ మ్యాగజైన్ఆస్కార్ బెస్ యాక్టర్ క్యాటగరీస్ లిస్ట్ లో తారక్ కూడా ఎంపిక అయ్యే అవకాశం ఉందంటూ లిస్ట్ బయటపెట్టింది.మొత్తంగా నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన తర్వాత ఆర్ ఆర్ ఆర్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. -
తాప్సీపై డైరెక్టర్ వల్గర్ కామెంట్స్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను ప్రస్తుతం తన తాజా చిత్రం ‘దొబారా’ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనురాగ్తో కలిసి తాప్సీ ఓ చానల్ ఇంటర్య్వూకు హాజరైంది. ఈ సందర్భందగా అనురాగ్ తాప్సీపై చేసిన వల్గర్ కామెంట్స్ ప్రస్తుతం హాట్టాపిక్ నిలిచాయి. ఈ సందర్భంగా యాంకర్ రణ్వీర్ సింగ్ నగ్న ఫొటోషూట్పై మీ అభిప్రాయం ఏంటని అనురాగ్ కశ్యప్ను ప్రశ్నించాడు. దీనిపై డైరెక్టర్ స్పందిస్తూ.. అది తనకు నచ్చిందని, ప్రస్తుతం ఇలాంటివి సర్వసాధారణమని బదులిచ్చాడు. చదవండి: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే మీరు కూడా ట్రై చేయండి.. ఆ ఫొటోషూట్ బాగా వైరల్ అవుతుందంటూ యాంకర్ చమత్కిరించాడు. దీంతో తాప్సీ మధ్యలో మాట్లాడుతూ.. ప్లీజ్ హారర్ షోకు తెరలేపకండి అని సరదాగా కామెంట్స్ చేసింది. ఇక తాప్సీ కామెంట్స్కు రియాక్ట్ అయిన దర్శకుడు అనురాగ్.. నువ్వేందుకు భయపడుతున్నావ్.. ‘హో తనకంటే నా బూ** పెద్దగా ఉంటాయి.. అందుకే తను అసూయ పడుతుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అతడి కామెంట్కి కాస్తా ఇబ్బంది పడ్డ తాప్సీ ఆ తర్వాత లైట్ తీసుకుని నవ్వేసింది. దీంతో నెట్టింట ఈ వీడియో వైరల్గా మారింది. అనురాగ్ అంత అసభ్యంగా కామెంట్స్ చేయడంతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక తాప్సీ రియాక్షన్ చూసి ఆమెను తప్పుబడుతూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
తాప్సీ మూవీని బాయ్కాట్ చేయాలంటూ డిమాండ్!
సినిమా రిలీజ్ అవడానికంటే ముందే దాన్ని నిలిపివేయాలంటూ బాయ్కాట్ చేసే ప్రచారం ఈమధ్య పరిపాటి అయింది. బాలీవుడ్లో ఈ వైఖరి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడ బడా హీరోల నుంచి ఏదైనా సినిమా వస్తుందంటే చాలు దాన్ని చూడొద్దంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ జాబితాలో నేడు రిలీజైన ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా కూడా ఉంది. తాజాగా ఇప్పుడు మరో సినిమాను బాయ్కాట్ చేయాలంటూ ట్విటర్ హోరెత్తిపోతోంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన దొబారా మూవీ ఆగస్టు 19న రిలీజ్ కాబోతోంది. ఇందులో తాప్సీ పన్ను ప్రధాన కథానాయిక. అయితే అన్ని బాలీవుడ్ సినిమాల్లాగే తమ మూవీని కూడా బాయ్కాట్ చేయాలంటూ సోషల్ మీడియా ఊగిపోవాలని తాప్సీ, అనురాగ్ కోరుకోవడం గమనార్హం. అసలు థియేటర్లలో రిలీజయ్యే అర్హత దొబారాకు లేనే లేదు, తాప్సీ ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్ని చేస్తుంది? మేము చూడటం ఆపేస్తే అప్పుడు తెలిసొస్తుంది, మన దేశం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే చూస్తూ సహించాల్సిన అవసరం లేదు, ఇలాంటి చీప్ మనుషులను మనం గౌరవించాల్సిన అవసరం లేదు అంటూ క్యాన్సల్ దొబారా అనే హ్యాష్ట్యాగ్ను ట్రెండ్ చేస్తున్నారు. They used to show the capability of net together and will boycott your film.#CancelDobaaraa @anuragkashyap72 @taapsee pic.twitter.com/yHfKtcayFo — Rishabh (@rishi12300) August 10, 2022 Its not cool to create always controversies by speaking against our country #CancelDobaaraa pic.twitter.com/ThinlwbxWp — Rahul (@Rahul__Roy18) August 10, 2022 I think this #CancelDobaaraa trend has been planned by the two jokers Anurag Kashyap and Taapsee Pannu. — Debmalya Banerjee (@DebmalyaDgp) August 10, 2022 Fake people are @anuragkashyap72 & @taapsee don't deserve our attention at all #CancelDobaaraa 💯 pic.twitter.com/W3Ll5y9y0e — Nitin_Reddy (@Nitinreddy2003) August 10, 2022 #CancelDobaaraa is needy thing at this time of point.. We need to full boycott such films pic.twitter.com/ilx9WwE6EC — Aayan (@ayanali9563) August 10, 2022 చదవండి: ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ ఆ హీరోయిన్తో బ్రేకప్, మరొకరితో డేటింగ్? స్పందించిన హీరో -
జోయా అఖ్తర్ యాక్టర్స్కు సెలవులివ్వదట, కారణం?
సినిమా.. ఆన్ స్క్రీన్ .. ఆఫ్ స్క్రీన్ సంగతులు భలే సరదాగా ఉంటాయి. వినోదాన్నీ పంచుతాయి. వీటిల్లో హీరోహీరోయిన్స్ గురించిన ముచ్చట్లకు ఉండే క్రేజ్ సరే.. దర్శకుల స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్ పట్లా ఓ ఆసక్తి ఉంటుంది సినీ అభిమానులకు. ఆ ఇంటరెస్ట్నే క్యాచ్ చేశాం. ఇలా.. ! బయటకు వెళ్లిపోతారనే.. జోయా అఖ్తర్.. దర్శకురాలిగానే కాదు.. రైటర్గానూ ప్రసిద్ధి. రాసుకున్నదాన్ని రాసుకున్నట్టే చిత్రీకరించాలనే పట్టుదలతో ఏమీ ఉండదు. ఏదైనా సీన్ను షూట్ చేస్తున్నప్పుడు కొత్త ఐడియా తడితే మార్చడానికి ఏమాత్రం వెనుకాడదు. రీటేక్స్ విషయంలో చాలా లిబరల్గా ఉంటుంది. వైవిధ్యమైన నటీనటులతో సినిమాలు చేయడం ఆమెకు ఇష్టం. సాంఘిక అంశాలు, నిజ జీవితాల్లోని అనుబంధాలను మిళితం చేసి సినిమాలు తీయడం ఆమె ప్రత్యేకత. ‘దిల్ ధడక్నే దో’లోని అక్కాతమ్ముడి బాండింగ్కు.. తన తోబుట్టువు ఫర్హాన్ అఖ్తర్తో తనకున్న అనుబంధమే ప్రేరణట. సినిమా షూటింగ్ షెడ్యూల్స్లో యాక్టర్స్కు సెలవులివ్వదట.. నటీనటులు కథా పాత్రల్లోంచి బయటకు వెళ్లిపోతారనే భయంతో. నో డీటైలింగ్.. సంజయ్ లీలా భన్సాలీ .. సినిమాల్లో డీటైలింగ్స్ మిస్ అవడు కానీ నటీనటులకు మాత్రం ఎక్కువ డీటైల్స్ ఇవ్వడు. ఏ మూవీకైనా కొన్నేళ్ల ముందుగానే స్క్రిప్ట్ను సిద్ధం చేసిపెట్టుకుంటాడు. ఆయన చిత్రాల్లోని చాలా సన్నివేశాలు.. తాను చిన్నప్పుడు ఎరిగిన మనుషులు, తిరిగిన ఊళ్లు, పెరిగిన వాతావరణాన్ని తలపించేవిగా ఉంటాయిట. డార్క్ స్టోరీ అనురాగ్ కశ్యప్ సినిమాలు ఎక్కువగా డార్క్ టాపిక్స్ మీదే ఉంటాయి. కారణం.. ఆయన చైల్డ్ అబ్యూజ్ విక్టిమ్ కావడమే. తన సినిమాల్లోని క్యారెక్టర్స్ గురించి నటీనటులకు ఎలాంటి సూచనలివ్వడు. స్క్రిప్ట్ను క్షుణ్ణంగా చదివి నటీనటులే ఆయా క్యారెక్టర్స్ను అర్థం చేసుకోవాలి. సీన్స్ బాగా రావడానికి.. తమ జీవితాల్లో జరిగిన డార్క్ ఇన్సిడెంట్స్ను గుర్తుతెచ్చుకొమ్మని నటీనటులకు చెప్తాడట. రీటేక్స్ను ఇష్టపడడు. -
ప్రియుడితో పెళ్లికి రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ కిడ్
ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. అందుకు కారణం లేకపోలేదు. ఆలియా, షేర్ గ్రెగోయిర్ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటున్న ఫొటోలను వారివారి సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా షేన్.. 'నా ప్రియాతిప్రియమైన దేవతకు హ్యాపీ సెకండ్ యానివర్సరీ. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్, పార్ట్నర్ మాత్రమే కాదు, నా సర్వస్వం నువ్వే! నిత్యం నాకోసం సమయం కేటాయిస్తూ నాకు సంతోషాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషం. ఐ లవ్యూ, నిజం చెప్పాలంటే నీ వేలికి ఎప్పుడెప్పుడు ఉంగరం తొడుగుదామా? అని తెగ ఆరాటపడుతున్నాను' అని రాసుకొచ్చాడు. షేన్ ఆదుర్దా చూస్తోంటే కాలం కలిసొస్తే త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు కనిపిస్తోంది. కాగా ఆలియా, షేన్ తొలిసారిగా డేటింగ్ యాప్లో కలుసుకున్నారు. అప్పటి నుంచి వీరు డేటింగ్ చేసుకుంటున్నారు. వీరిద్దరూ కలిశారంటే చాలు రొమాంటిక్ ఫొటోలు దిగి వాటిని అభిమానులతో పంచుకుంటారు. View this post on Instagram A post shared by Aaliyah Kashyap (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Shane Gregoire (@shanegregoire) చదవండి:
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జగన్ ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గుర్తింపు
ముస్లింలపై కూటమి కుట్ర
ఆ ఇంటికి నవరత్నాలే జీవనాధారం
నేడు పిఠాపురానికి సీఎం జగన్
కూటమిలో కుమ్ములాట
ఆర్ట్స్ కళాశాలలో సర్టిఫికెట్ కోర్సులు
వైఎస్సార్ సీపీ కార్యకర్తపై దాడి
ఓటమి భయంతో దాడులకు తెగబడుతున్న టీడీపీ
గాండ్ల, తెలుకుల, దేవతెలుకులకు సముచిత స్థానం
మద్యం అక్రమ రవాణాపై కేసులు
తప్పక చదవండి
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement