-
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
-
సీఎం జగన్పై చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎన్నికల్లో వైఎస్ జగన్ను ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యంలేక కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబుకు కళ్ల ముందే ఓటమి స్పష్టంగా కనిపించడంతో చేసేదిలేక తీవ్ర నిరాశ, నిస్పృహలతో బహిరంగ సభల్లో ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెం సభలో.. ‘జగన్మోహన్రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది’.. అంటూ ఆయన బరితెగించి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలను ఆయన ఎటువైపు తీసుకెళ్తున్నారనే ఆందోళన సాధారణ ప్రజలు, మేథావులు, తటస్థులు వ్యక్తంచేస్తున్నారు. జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ను భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఇటీవలే తాడికొండలో జరిగిన సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకుని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి’.. అంటూ సీఎంపై దాడికి పురికొల్పేలా మాట్లాడారు. ఆ తర్వాతే విజయవాడ సింగ్నగర్లో బస్సుయాత్ర చేస్తున్న జగన్పై హత్యాయత్నం జరిగింది. ముఖ్యమంత్రిని దున్నపోతు అంటూ సంభోదించడం, రాయిపెట్టి కొట్టాలనడం ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని మేధావులు సైతం ప్రశ్నిస్తున్నారు. మరో సభలో.. గాజు గ్లాసు తీసుకుని పొడవమంటూ ఆయన సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడడంతో చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఆయన ఆ మాట అన్నారంటే జగన్పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని చంపేయాలని ప్రతిపక్ష నేత మాట్లాడడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ విషయంలోనూ వైఎస్ జగన్ను దీటుగా ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. సీఎంని పదేపదే వ్యక్తిగతంగా దూషించడం, దాడులకు ప్రోత్సహించేలా వ్యాఖ్యలు చేస్తుండడం, చివరికి ఇంకా దిగజారి చంపమని చెప్పడం బాబు మానసిక దౌర్భల్యాన్ని సూచిస్తోందంటున్నారు. ఆయన ప్రతి సభలోనూ, ప్రతి సమావేశంలోనూ జగన్పై విద్వేషం వెళ్లగక్కుతూనే ఉన్నారు. సీఎంను సైకో అంటూ దిగజారుడుగా సంభోదిస్తూ తన అక్కసు, కడుపుమంట చల్లార్చుకుంటున్నారు.బాబు తీరుతో టీడీపీ కేడర్లో ఆందోళన..అలాగే.. జగన్ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం ‘చంపండి.. పొడవండి.. రాళ్లు విసరండి.. గాలిలో వస్తాడు, గాలిలో పోతాడు’.. అంటూ మాట్లాడడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్ జగన్ తన పాలనలో తాను చేసిన పనులు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి చక్కగా చెబుతున్నారని, చంద్రబాబు వైఫల్యాలు ఆయన గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోను చూపించి దాన్ని అమలుచేయలేదని చెబుతున్నారని వీటిపై మాట్లాడకుండా అదే పనిగా తిట్టడంవల్ల ఉపయోగం ఉండదని భావిస్తున్నారు. జగన్ తన మేనిఫెస్టోను, టీడీపీ మేనిఫెస్టోను పోల్చిచూపడం, అందులోని అంశాలను వివరించి చెప్పే విధానం ప్రజల్లోకి బాగా వెళ్తోందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. తమ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలుచేయలేదనే విషయాన్ని చాలా సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని, దీనికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి తమ పార్టీకి లేకుండాపోయిందనే వాపోతున్నారు.టీడీపీని రద్దు చేయాలి: ఎమ్మెల్యే ప్రసన్నబుచ్చిరెడ్డిపాళెంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కోవూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి సీరియస్ అయ్యారు. చంద్రబాబు తన పాలనా దక్షత కన్నా.. కుట్రలు, కుతంత్రాలు, హత్యలను నమ్ముకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకుని చంద్రబాబుపై కేసు నమోదు చేసి, టీడీపీని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు సుమోటోగా కేసు ఫైల్ చేయాలని కోరారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు.వేమిరెడ్డీ.. బాబు వ్యాఖ్యలను సమర్థిస్తున్నావా?బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో ఎంపీ, ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి దంపతులు పక్కనే ఉన్నప్పటికీ వారు వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై నెల్లూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.దారుణంగా పడిపోయిన చంద్రబాబు ఇమేజ్సీఎం జగన్ హుందాగా మాట్లాడుతుంటే.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంత నీచస్థాయికి దిగజారి మాట్లాడుతుండడం సాధారణ ప్రజానీకంలోనూ చర్చనీయాంశమైంది. ఇప్పటికే ప్రజల్లో, జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టిలో నమ్మదగని నేతగా ముద్రపడిన చంద్రబాబు ఇమేజ్ దారుణంగా పడిపోయింది. ప్రజలే కాదు.. ఏ రాజకీయ పక్షం ఆయన్ను నమ్మే పరిస్థితిలేదు. ప్రస్తుతం ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా ఆయన్ను బీజేపీ పెద్దలు నమ్మడంలేదని టీడీపీ నేతలు వాపోతున్నారు. చంద్రబాబు నిలకడలేని స్వభావం, అవకాశవాద వైఖరి, ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం ద్వారా తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఈ వైఖరే ఆయన్ను ప్రజల్లో మోసగాడిగా నిలబెట్టింది.ఓటమి భయంతోనే ఇలా..బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడంవల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడంలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. హద్దులు దాటిపోయి చేస్తున్న ఆరోపణలు, దూషణలు చంద్రబాబులో ఉన్న అసహనం, భయాన్ని చూపుతున్నాయని, ఓటమి భయంతోనే ఆయన అలా మాట్లాడుతున్నారని తటస్థులు సైతం చెబుతున్నారు. తాను చేసిందేమీలేక చెప్పుకోలేకపోవడం, ఏం చేస్తానో చెప్పలేకపోవడం, ఆయన చెప్పే ఇతర విషయాలను జనం పట్టించుకోకపోవడంతో జీవిత చరమాంకంలో ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో ఆయన విద్వేషపూరిత ప్రసంగాలవల్ల రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య నెలకొనే పరిస్థితి ఏర్పడుతోంది. -
మంచి చేయడమే.. మాట తప్పకపోవడమే.. 'మన కల్చర్': సీఎం జగన్
పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్.. అంటూ మనపై వేలెత్తి చూపించే కార్యక్రమం నిత్యం జరుగుతోంది. యస్.. మన కల్చర్ మంచి చేయటం.. మన కల్చర్ మంచి మనసు..మన కల్చర్ మాట తప్పకపోవటం.. మన కల్చర్ బెదిరింపులకు లొంగకపోవడం.. అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. నమ్మకం.. ధైర్యం.. అభివృద్ధి.. సక్సెస్ స్టోరీపులివెందుల అంటే నమ్మకం. పులివెందుల అంటే ధైర్యం. పులివెందుల అంటే అభివృద్ధి. పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందులలో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెత్తుతోందంటే ఈ అభివృద్ధి, ఆ మార్పులకు మూలం నా తండ్రి, మనందరి ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ అయితే.. ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని సవినయంగా తెలియజేస్తున్నా. పులివెందులలో ఏముంది? అని ఒకప్పుడు అడిగిన పరిస్థితుల నుంచి పులివెందులలో ఏం లేదో చెప్పాలని అడిగే స్థాయికి మన పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మార్చుకుంటూ అడుగులు వేశాం. రాబోయే రోజుల్లో కూడా వేస్తాం.నమ్మకాన్ని నింపింది పులివెందుల బిడ్డలేఒక్కటి గమనించండి. మనందరి పులివెందుల మనకే కాదు... రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ప్రసాదించింది. మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని తెలుగు నేలపై అణువణువునా నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా.కాబట్టే ఆ చంద్రబాబుకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ, ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తుంటారు. పులివెందులను తెలుగుసీమ అభిమానించింది. నమ్మింది, కలిసి నడిచింది. పులివెందుల, కడప, రాయలసీమ మంచితనం, మాటపై నిలబడే గుండెధైర్యం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికీ అర్థమైంది కాబట్టే ఓ వైఎస్సార్, ఓ జగన్ను మారుమూల ప్రాంతాల్లో కూడా అభిమానించే కోట్ల మంది ఈరోజు కనిపిస్తున్నారు.కొత్తగా వైఎస్సార్ వారసులం అంటూ..వైఎస్సార్, జగన్లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, ఓ వదినమ్మ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు. వీరికి తోడు, వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్సార్ వారసులం.. అంటూ మీ ముందుకు వస్తున్నారు. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నా. ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలు, వైఎస్సార్ను ప్రేమించేవారు కాదా? ఒక్క విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.ఆ దివంగత మహానేత, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా, ఆయన చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జిషీట్లో పెట్టింది ఎవరు? ఒక వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? వైఎస్సార్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ పులివెందుల ప్రజలకు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్సార్ పోరాడిన వారితో కుమ్మక్కు!రాజకీయంగా అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితోనే కలిసిపోయి.. కాంగ్రెస్, టీడీపీతో చేయి కలిపి, వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్లందరితోనూ కలిసిపోయి, ఆ కుట్రలను అమలు చేస్తున్న శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా... వైఎస్సార్ వారసులు? వైఎస్సార్గారు బతికున్నంతకాలం ఎవరితో పోరాటం చేశారు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ప్రతి గ్రామంలో వైఎస్సార్ను అభిమానించే అభిమానులు, కార్యకర్తలు ఎవరితో యుద్ధం చేశారు? అని ఆలోచన చేయమని కోరుతున్నా. కుట్రలో భాగస్వాములు వారసులా?వైఎస్సార్ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి, వారికి మోకరిల్లి, వారి స్క్రిప్టులను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ, వారి కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు? వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను, ఏకంగా ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్సార్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ ఉండకూడదని, ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెక్కలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు? ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్సార్ లెగసీకి ఓటు వేసినట్లా? లేక వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలకు ఓటు వేసినట్టా? రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా.వారి వెనుక ఎవరున్నారో కనిపిస్తూనే ఉందిఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంత మంది కలిసి ఏకమవుతున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతున్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా మీ అందరికి కనిపిస్తూనే ఉంది.ఆశ్చర్యం ఏమిటంటే.. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. ఔను నేనే చంపానని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరే చూస్తున్నారు కదా! నాడు చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలు, అధికార బలంతో ఓడించిన వారితో ఈరోజు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి? చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా? కాదా? ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లాడు? అవినాష్ పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్లలో అడిగిన ప్రశ్నలు సహేతుకమే కదా! ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారిపై కూడా అడ్డగోలు ఆరోపణలతో కుట్ర రాజకీయాలు చేయడం ధర్మమేనా? చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా?కాంగ్రెస్కు ఓటేస్తే బాబు, బీజేపీకి లాభంఅసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లెన్ని వచ్చాయి? నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన ఆ కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ గారి పేరును, ఆయన చనిపోయిన తర్వాత కూడా చార్జ్ షీట్లో చేర్చిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తంగా వైఎస్సార్ పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటం అంటే దానివల్ల ఎవరికి లాభమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అసలు ఎవరికి వైఎస్సార్ గారి మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. పులివెందుల, కడప గడ్డపై ఎవరికి ప్రేమ ఉందో ఆలోచన చేయండి. వైఎస్సార్, పులివెందుల, వైఎస్సార్ జిల్లా పేర్లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ఆలోచన చేయండి. మరోపక్క ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు కుట్రలు చేస్తున్నారో గమనించమని కోరుతున్నా. పేదలకు మంచి చేసేందుకే అధికారంపులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నామీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చుకున్నా. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న నా బంధువులకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. మరొక్క విషయం కూడా నిండుమనసుతో చెబుతున్నా.వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చా. అవినాశ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా అవినాశ్ను దూషించడం, అతడిని తెరమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. మా అందరికన్నా అవినాష్ చాలా చిన్నోడు. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా? మన పాలనలో మనసు, మానవత్వం..ఈరోజు పులివెందులలోగానీ, కడపలోగానీ మొత్తం తెలుగు నేలమీద గానీ ఒక జలయజ్ఞం, ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ.. వీటన్నింటితోపాటు మీ జగన్ తెచ్చిన అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, చేయూత, వైఎస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ,, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్, రైతు భరోసా, ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు, డీబీటీతో బటన్ నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయడం.. ఇవన్నీ మన మనసు, మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? నాన్న మరణం తర్వాత పట్టించుకున్నారా?నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా, ఎవరైనా మన పులివెందులను పట్టించుకున్నారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మళ్లీ పులివెందుల దశ మారింది ఎప్పుడంటే? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, ఈ 58 నెలల్లోనే కాదా? పులివెందులను, వైఎస్సార్ జిల్లాను ఇంకా అభివృద్ధి చేయాలి. వచ్చే ఐదేళ్లలో మీ అందరి అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా మన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్సార్, వైఎస్ జగన్.. ఇవన్నీ మనసున్న పేర్లు కాదా? ఈ పేర్లను చెరిపివేయాలనుకునే వారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులేనని గమనించాలని కోరుతున్నా. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్లు మన పులివెందుల అభివృద్ధి ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. మీ బిడ్డకు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అవినాశ్ను కూడా అంతే ఆప్యాయతతో, గొప్ప మెజార్టీతో దీవించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా. ► ఈ కార్యక్రమంలోఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్బాషా, కడప మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ సతీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్కుమార్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి చేయడంలో మీ జగన్ను కొట్టలేరు!జగన్ను పథకాలలో కొట్టలేరు. పాలనలో, పనితీరులో జగన్ను కొట్టలేరు. పల్లెకు మంచి చేయడంలో జగన్ను కొట్టలేరు. జగన్ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు. జగన్ను రైతులకు అందించిన రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల్లో కొట్టలేరు. జగన్ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు. జగన్ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు.వారి ఆత్మగౌరవం కాపాడటంలో కూడా జగన్ను కొట్టలేరు. జగన్ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. తమ 14 ఏళ్ల పాలనలో జగన్ కంటే మంచి చేశాం అని వాళ్లు చెప్పలేరు. అందుకే ఆలోచన చేయమని అడుగుతున్నా. మన బ్రాండ్ జగన్, మన బ్రాండ్ వైఎస్సార్, మన బ్రాండ్ కడప, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సీఎం జగన్ నామినేషన్ దాఖలుపులివెందుల: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం సీఎస్ఐ చర్చి మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం 11.10 గంటలకు అంబకపల్లె రోడ్డు మినీ సెక్రటేరియట్లో ఉన్న ఆర్వో కార్యాలయానికి సీఎం రోడ్డు మార్గాన చేరుకున్నారు. 11.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో వెంకటేశులుకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప ఉన్నారు.అనంతరం సీఎం జగన్ భాకరాపురంలోని స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కాసేపు గడిపారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కడప బయలుదేరి వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద పులివెందుల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రుక్మిణి, కౌన్సిలర్ శైలజ, పలువురు మహిళలు గుమ్మడికాయతో ముఖ్యమంత్రికి దిష్టి తీశారు. కాగా, సీఎం జగన్ తరఫున పులివెందులలో వైఎస్ మనోహర్రెడ్డి గత సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. నా ప్రాణానికి ప్రాణం.. నా పులివెందుల పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. నన్ను నిరంతరం ప్రేమిస్తూ ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే పులివెందుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ జగన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. పులివెందుల అభివృద్ధికి మూలం వైఎస్సార్.పులివెందులను ఆదర్శంగా తీర్చిదిద్దాంపులివెందుల అభివృద్ధికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక.. ఆ కనిపిస్తున్న మెడికల్ కాలేజీ. నాన్న కలలుగన్న ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ఈమధ్యనే పులివెందుల ప్రజలకు అంకితం చేశాం. ఈ జూలై, ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానంలో భాగంగా రూ.900 కోట్లతో కాలేటివాగు సామర్థ్యాన్ని 1.02 టీఎంసీలకు పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో గతంలో మూడు, నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితిని మారుస్తూ ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపు రూ.250 కోట్లు చెల్లించాం. 2020 నుంచి క్రమంతప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10 టీఎంసీల నీటిని ఏటా నింపుతూ వస్తున్నాం. పైడిపాలెం రిజర్వాయర్ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు తీసుకున్నాం.యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఏకంగా రూ.1,000 కోట్లతో ఎరబ్రల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు వేగంగా జరగడం మన కళ్లెదుటే కనిపిస్తోంది. వాటర్ గ్రిడ్ ద్వారా రూ.480 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీటి సరఫరా దాదాపుగా పూర్తయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ క్యాంపస్ను ప్రారంభించాం. ఏపీ కార్ల్లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతోపాటు వైఎస్సార్ వ్యవసాయ కళాశాల, ఉద్యాన కళాశాలలను నెలకొల్పాం. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమను పులివెందులకు తెచ్చాం. కేంద్రంతో పలుదఫాలు చర్చించి హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు సాధించాం. ఇవన్నీ మీ బిడ్డ సీఎం కాబట్టే కదా..పులివెందులలో కొత్త బస్టాండ్, క్రికెట్ స్టేడియం, పార్కులు లాంటివి మీరంతా చూస్తున్నారు. మొత్తంగా దాదాపు రూ.5,900 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరగడం కళ్లెదుటే కనిపిస్తోంది. ఇవన్నీ కాకుండా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము మరో రూ.2,069 కోట్లు ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పులివెందులలో నవరత్నాలు పథకాల ద్వారా 94.4 శాతం గడపలకు లబ్ధి చేకూరింది. చీనీ అమ్మకాలకు అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పులివెందులలోనే విక్రయించే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేశామంటే కారణం మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. – సాక్షి ప్రతినిధి, కడప -
28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో అగ్రభాగాన నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఈనెల 28 నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార భేరి మోగించనున్నారు. ప్రతి రోజూ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభలలో పాల్గొంటారు. ఈనెల 28న (ఆదివారం) ఉదయం పది గంటలకు తాడిపత్రిలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు వెంకటగిరిలో, 3 గంటలకు కందుకూరులో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఈనెల 28వతేదీ నుంచి మే 1 వరకు సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం విడుదల చేసింది. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఒక రోజు ముందు అంటే 27న (శనివారం) వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు.కదన కవాతు..వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ‘సిద్ధం’ సభలు జనసంద్రాలను తలపించాయి. ఒకదానిని మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచిపోయాయి. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ బుధవారం శ్రీకాకుళం జిల్లా అక్కవరం వద్ద నిర్వహించిన సభతో ముగించారు. 22 రోజుల పాటు 23 జిల్లాలు, 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీ. మేర సాగిన బస్సు యాత్ర పొడవునా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకూ సీఎం జగన్కు బ్రహ్మరథం పట్టారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 బహిరంగ సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం తరలి వచ్చారు. దేశ రాజకీయ చరిత్రలో సీఎం జగన్ బస్సు యాత్ర అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఒంటరిగా ఎదుర్కోలేక చంద్రబాబు జనసేన, బీజేపీలతో జతకట్టినా ప్రజల స్పందన కరువైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి కలిసి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడమే అందుకు నిదర్శనం. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన సీఎం జగన్ బస్సు యాత్రతో వైఎస్సార్సీపీ శ్రేణులు కదనోత్సాహంతో దూసుకెళ్తుంటే కూటమి శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి చెల్లాచెదురవుతున్నాయి.మంచిని వివరిస్తూ.. మోసాలను ఎండగడుతూఎన్నికల మేనిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్ ప్రజల్లో విశ్వసనీయతను చాటుకున్నారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలతో సుపరిపాలన అందిస్తున్నారు. డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. దేశ చరిత్రలో డీబీటీ, నాన్ డీబీటీ రూపంలో ఈ స్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూర్చిన దాఖలాల్లేవు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో సంస్కరణలతో రాష్ట్రాన్ని ప్రగతిపథాన నిలిపారు. ఇదే అంశాన్ని సిద్ధం సభల్లో, బస్సు యాత్రలో సీఎం జగన్ ప్రజలకు వివరించారు. విభజన తర్వాత 2014 ఎన్నికల్లో జనసేన–బీజేపీతో జట్టు కట్టి 650కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను వంచించటాన్ని, నాటి అరాచకాలను ప్రజలకు గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు అదే కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. తాజాగా విడుదల చేయనున్న మేనిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లనున్నారు. -
చంద్రబాబు, లోకేశ్ ప్రకటించిన ఆస్తులు రూ.1,474 కోట్లు
సాక్షి, అమరావతి: చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ వారి ఆస్తుల గురించి ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాలు చర్చనీయాంశమయ్యాయి. అపారమైన ఆస్తులు ఉన్నా చాలా తక్కువ ఆస్తుల్ని మాత్రమే వారు బయటపెట్టినట్లు తెలుస్తోంది. కుప్పం అసెంబ్లీ అభ్యర్థిగా చంద్రబాబు, మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా లోకేశ్ విడివిడిగా ఆస్తులు చూపించారు. కానీ వారు కలిసే ఉంటున్నారు. ఆస్తుల్ని మాత్రం పక్కాగా పంచుకున్నారు. అందరూ కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్నప్పటికీ, విడివిడిగా ఆస్తుల్ని చూపించడం ద్వారా తక్కువ ఆస్తిపరులని ప్రజలను మభ్య పెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. అఫిడవిట్లలో అధికారికంగా వారు ప్రకటించిన ఆస్తుల విలువ రూ.1,474 కోట్లు. చంద్రబాబు, భువనేశ్వరి ఆస్తుల విలువ రూ.931.83 కోట్లు కాగా, లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల విలువ రూ.542.17 కోట్లుగా చూపారు. వారి ఆస్తుల్లో ఎక్కువ హెరిటేజ్ షేర్ల రూపంలో ఉన్నాయి. స్థిరాస్తులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా ఉండగా, కొన్ని తమిళనాడులోనూ ఉన్నాయి. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మాత్రం నామమాత్రంగా రెండు స్థలాలున్నాయి. వారు తమదిగా చెప్పుకునే అమరావతి, విజయవాడ ప్రాంతాల్లో మాత్రం ఈ కుటుంబంలోని ఐదుగురిలో ఎవరికీ ఒక్క ఆస్తి కూడా లేదు. వారి సొంతిల్లు హైదరాబాద్లోనే ఉన్న విషయం తెలిసిందే. లోకేశ్, భువనేశ్వరి హెరిటేజ్ షేర్ల విలువే రూ.1102 కోట్లు చంద్రబాబు ఆస్తుల్లో ఆయన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్కి ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షేర్ల విలువే రూ.1102.11 కోట్లు. భువనేశ్వరికి రూ.763 కోట్ల విలువైన షేర్లు ఉండగా, లోకేశ్కి రూ.339.11 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. మొత్తంగా చంద్రబాబు, భువనేశ్వరి పేరు మీద రూ.121.41 కోట్ల స్థిరాస్తులు, రూ.815.17 కోట్ల చరాస్తులుగా చూపించారు. అలాగే భువనేశ్వరికి రూ.1.84 కోట్ల విలువైన బంగారం, రూ. 1.09 కోట్ల విలువైన ముత్యాలు, వజ్రాభరణాలు, రూ.30 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పులు రూ. 10.31 కోట్లుగా చూపారు. లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్కు కలిపి రూ.394 కోట్ల చరాస్తులు ఉండగా, స్థిరాస్తులు రూ.148.07 కోట్ల విలువైనవి ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రాహ్మణికి 2500.338 గ్రాముల బంగారం, 97.441 కిలోల వెండి, రూ.1.48 కోట్లు విలువైన వజ్రాభరణాలు ఉండగా, దేవాన్స్ వద్ద 7.5 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి. ఆస్తుల విలువ తగ్గించి చూపారు చంద్రబాబు కుటుంబం అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించింది. హైదరాబాద్ మదీనగూడలో లోకేశ్, భువనేశ్వరి పేరు మీద ఉన్న 10 ఎకరాల వ్యవసాయ భూమి విలువను రూ.100 కోట్లుగా చూపించారు. నిజానికి అక్కడ ఎకరం రూ.50 కోట్లకు పైనే ఉంటుంది. ఆ లెక్కన ఆ భూమి విలువ రూ.500 కోట్లకు పైమాటే. అలాగే ఈ భూమి వ్యవహారాన్ని చంద్రబాబు గతంలో రహస్యంగా ఉంచారు. 10 ఎకరాల్లో 5 ఎకరాలు లోకేశ్కి ఉన్నట్లు బయటపడినప్పుడు అది ఎలా వచ్చిందనే దానిపై మల్లగుల్లాలు పడ్డారు. నానమ్మ అమ్మణ్ణమ్మ నుంచి లోకేశ్కి గిఫ్ట్గా రాసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ విషయంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కుప్పంలో ఉండే అమ్మణ్ణమ్మకు ఖరీదైన ప్రాంతంలో అంత భూమి ఎలా వచ్చిందనే ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేదు. మదీనగూడలోనే మరో 5 ఎకరాలను భువనేశ్వరి కొన్నట్లు చూపారు. రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల ఆస్తి కొన్న దేవాన్ష్ చంద్రబాబు మనుమడు దేవాన్ష్ రెండేళ్ల వయసులోనే రూ.20 కోట్ల విలువైన ఆస్తిని కొన్నట్లు చూపడం విశేషం. జూబ్లీహిల్స్లో తల్లి బ్రాహ్మణితో కలిపి ఉన్న వాణిజ్య భవనాన్ని దేవాన్ష్ 2017లో కొన్నట్లు పేర్కొన్నారు. అతను పుట్టింది 2015లో. పిల్లలకు వారసత్వంగా ఆస్తి ఇవ్వడం మామూలుగా జరుగుతుంటుంది. కానీ ఆ వయసులో కొన్నట్లు చూపడమే కొసమెరుపు. చంద్రబాబు పేరుతో ఉన్న స్థిరాస్థులు 1. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొడుకు లోకేశ్తో కలిపి 1,285 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.70.20 కోట్లుగా చూపారు. 2. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం కడపల్లి వద్ద 96.23 సెంట్ల భూమి. విలువ రూ.77.33 లక్షలుగా చూపించారు. 3. నారావారిపల్లె శేషాపురంలో ఇల్లు. విలువ రూ.43.66 లక్షలుగా పేర్కొన్నారు. భువనేశ్వరి పేరుతో స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో 5 ఎకరాల వ్యవసాయ భూమి (ఫామ్ హౌస్). దాని విలువ రూ.55 కోట్లుగా చూపారు. 2. తమిళనాడు కాంచీపురం జిల్లా సెన్నేర్ కుప్పం గ్రామంలో 2.33 ఎకరాల వాణిజ్య భూమి. విలువ రూ.30.10 కోట్లుగా చూపారు. లోకేశ్ స్థిరాస్థులు 1. హైదరాబాద్ మదీనగూడలో నానమ్మ గిఫ్ట్గా ఇచ్చిన 5 ఎకరాల వ్యవసాయ భూమి. దాని విలువ రూ.57.21 కోట్లుగా చూపారు. 2. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తండ్రి చంద్రబాబుతో కలిపి (50 శాతం వాటా) 1285 గజాల్లో నివాస భవనం. విలువ రూ.35.10 కోట్లుగా పేర్కొన్నారు. బ్రాహ్మణి స్థిరాస్థులు 1. హైదరాబాద్ మాదాపూర్లో 924 గజాల స్థలం. విలువ రూ.4.15 కోట్లుగా పేర్కొన్నారు. 2. రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో 4 వేల గజాల స్థలం. విలువ రూ.90.39 లక్షలుగా చూపించారు. 3. హైదరాబాద్ మణికొండలో 2,440 గజాల స్థలం. విలువ రూ.3.66 కోట్లుగా చూపారు. 4. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో కొడుకు దేవాన్ష్తో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల్లో వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా చూపారు. 5. చెన్నైలో 383 గజాల స్థలం. విలువ రూ.6.69 కోట్లుగా పేర్కొన్నారు. దేవాన్ష్ స్థిరాస్థులు 21. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో తల్లి బ్రాహ్మణితో కలిపి (50 శాతం వాటా) 1,024 గజాల వాణిజ్య భవనం. విలువ రూ.20.17 కోట్లుగా పేర్కొన్నారు. -
రేపటి నుంచే నామినేషన్ల పర్వం, సర్వేలన్నీ బంద్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరో అంకం ప్రారంభం కానుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు (ఏప్రిల్ 18) నోటిషికేషన్ విడుదల కానుంది. ఉదయం 9 గంటలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. అదే విధంగా నాలుగో విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. 26న నామినేషన్ల పరిశీలించి.. 29న నామినేషన్ల ఉపసహరణకు గడవు ఇచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. సర్వేలు బంద్ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు పుల్స్టాప్ పడ్డట్టయింది. రేపటి నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి.. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. ప్రీపోల్ సర్వే కానీ, ఒపినియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ.. ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఏపీ, తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ఏప్రిల్ 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ఏప్రిల్ 25 నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు నియోజకవర్గాలు తెలంగాణలోనూ మే 13నే ఎన్నికలు తెలంగాణలో 17 పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీకి మే 13న ఉప ఎన్నిక జూన్ 4న ఓట్ల లెక్కింపు ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు? ఏ జిల్లాలో ఎవరెవరు బరిలో ఉన్నారు? ఈ లింకు నొక్కండి. ఎన్నికల సమస్త సమాచారం ఒకచోట చూడండి. -
సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రలో జనగర్జన
ముదిగుబ్బ నుంచి కదిరికి వెళ్లే మార్గం మధ్యలో నడిమిపల్లి వద్ద బస్సు దిగిన సీఎం.. ఓ వృద్ధురాలితో ఆప్యాయంగా మాట్లాడారు. ‘మీకు వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటి దగ్గర ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు. ఈసీకి ఫిర్యాదు చేసి ఇంటి దగ్గరకు పెన్షన్ పంపిణీ నిలిపివేయించాడు’ అని చెప్పారు. ఈ క్రమంలో వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘చంద్రబాబుతో మాకు పనిలేదు. ఎన్నాళ్లు ఆపుతాడు? మాకు నువ్వే కావాలి. నువ్వుంటే మాకు ఏ కష్టం ఉండదు’ అంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ప్రజాభిమానం పోటెత్తింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర ఐదో రోజు సోమవారం విజయవంతంగా కొనసాగింది. కిలోమీటర్ల కొద్దీ జనం రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా బస్సు వెనుక యువత పరుగులు తీయడం గ్రామ గ్రామాన కనిపించింది. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం సంజీవపురంలోని బస కేంద్రం నుంచి ఉదయం 10.30 గంటలకు బస్సు యాత్ర మొదలైంది. అయితే ఉదయం 6 గంటల నుంచే బస కేంద్రం వద్దకు జనం భారీగా తరలివచ్చారు. అనంతపురం–చెన్నై జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు చేరుకోవడంతో పండుగ వాతావరణం తలపించింది. రోడ్షో బత్తలపల్లి మండల కేంద్రానికి చేరుకునేలోపే రోడ్డుపై ఇసుకేస్తే రాలనంత మంది సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. బత్తలపల్లి జంక్షన్, ప్రభుత్వ పాఠశాల ఎదురుగా భారీ గజమాలలతో ప్రజలు సీఎంను సత్కరించారు. అంజినమ్మ అనే మహిళ తన పొలంలో పండిన వేరుశనగ పంటను సీఎంకు అందించింది. ఈ క్రమంలో ఇన్పుట్ సబ్సిడీ, రైతు భరోసా ఇతర పథకాలు అందాయా.. అని ఆమె కుటుంబ యోగ క్షేమాలను సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అప్పస్వామి అనే వ్యక్తి సీఎం జగన్కు గొంగడి (కంబడి), గొర్రె పిల్లను బహూకరించారు. జన సముద్రాన్ని తలపించిన బత్తలపల్లి జంక్షన్లో సీఎం కాన్వాయ్ ఎంతో కష్టంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సీఎం రోడ్షో ఆ ఊరిలోనే కొనసాగిందంటే ఎంతగా అభిమాన జనం అడ్డుపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పెత్తందారులతో పోరుకు మీ వెంటే అంటూ జనం నినాదాలు చేశారు. మేమంతా సిద్ధం అంటూ గర్జించారు. కాన్వాయ్తో సమాంతరంగా పరుగులుపెట్టారు. మురిసిన ముదిగుబ్బ బత్తలపల్లి నుంచి ముదిగుబ్బ మధ్య రామాపురం, కట్టకిందపల్లి, రాళ్ల అనంతపురం సహా పలు గ్రామాల ప్రజలు జాతీయ రహదారిపైకి చేరుకుని సీఎంకు ఘన స్వాగతం పలికారు. రామాపురంలో బస్సు దిగి సీఎం జగన్ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ముదిగుబ్బకు చేరుకునేలోపే ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపై బారులు తీరారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా, జగనన్న చేదోడు తదితర పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా తాము నిలదొక్కుకోవడానికి, గౌరవ ప్రదమైన జీవనం కొనసాగించడానికి దోహదపడ్డ నాయకుడిని ఒక్కసారైనా చూడాలనే పట్టుదలతో ఆ ప్రాంత ప్రజలు పోటీపడ్డారు. మధ్యాహ్నం 2.50 గంటలకు ముదిగుబ్బ చేరుకున్న సీఎంకు గజమాలతో స్వాగతం చెప్పారు. పెద్ద ఎత్తున కదలివచ్చిన జనానికి బస్సుపై నుంచి సీఎం అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. 3.27 గంటల వరకు సుమారు 37 నిమిషాలు సీఎం జగన్ ముదిగుబ్బ జనంతో మమేకమయ్యారు. అక్కడి నుంచి కదిరికి బయలుదేరిన సీఎం జగన్ను గ్రామగ్రామాన ప్రజాభిమానం అడ్డుకుంది. నాగారెడ్డిపల్లి గ్రామస్తులు భారీ గజమాలతో సీఎంకు స్వాగతం పలికారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంలో ఓ భాగం కదం తొక్కిన కదిరి కదిరి పట్టణంలోకి వస్తున్న సీఎం జగన్కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. సీఎం రాక నేపథ్యంలో నేల ఈనిందా అన్నట్టు జనంతో కదిరి రోడ్లు కిటకిటలాడాయి. జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ప్రజలు కదం తొక్కారు. సీఎం వస్తున్నారని ఉదయం నుంచే కదిరి పట్టణంలో పెద్ద ఎత్తున కోలాహలం నెలకొంది. ప్రజాభిమానం అడ్డు పడటం వల్ల నిర్దేశించిన షెడ్యూల్ కంటే మూడు గంటలు పైనే ఆలస్యం అయినప్పటికీ, తమ అభిమాన నేతను చూడాలన్న ఆశతో ప్రజలు ఓపికతో వేచి చూశారు. సాయంత్రం 5:45 గంటలకు కదిరిలోకి ప్రవేశించిన సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తమ సెల్ఫోన్లలోని టార్చ్లైట్లను ఆన్ చేసి ప్రజలు సీఎం జగన్ యాత్రకు సంఘీభావం తెలిపారు. ఇలా రాత్రి 7.55 గంటల వరకు సీఎం జగన్ రోడ్షో రెండు గంటల పాటు కదిరిలోనే కొనసాగింది. అనంతరం బస్సుపై నుంచి రోడ్షో నిర్వహించిన సీఎం జగన్.. పీవీఆర్ కళ్యాణ మండపంలో ముస్లిం సోదరులతో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ‘సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలానా మేలు చేస్తాం.. మాకు ఓటు వేయండి’ అని ప్రజలకు నాయకులు హామీ ఇవ్వడాన్ని చూస్తుంటాం. అయితే బస్సు యాత్రలో సీఎం జగన్ను కలిసిన పలువురు ‘మీ పాలనలో ఏదో ఒక రూపంలో మా ఇంటికి మేలు జరిగింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి మిమ్మల్నే గెలిపించుకుంటాం’ అని హామీ ఇస్తున్నారు. అటువైపు బీజేపీ, టీడీపీ, జనసేన, ఇలా ఎన్ని పార్టీలు, ఎంత మంది వ్యక్తులు కలిసి వచ్చినా మీ వెంట మేమంతా ఉన్నామంటూ ప్రజలు సీఎంకు భరోసానిచ్చారు. కదిరి నుంచి నల్లచెరువు, తనకల్లు మండల కేంద్రాల మీదుగా రాత్రి 10 గంటలకు చీకటివానిపల్లె విడిది కేంద్రానికి సీఎం జగన్ చేరుకున్నారు. షెడ్యూల్ కంటే నాలుగు గంటలు ఆలస్యమైనా ప్రజలు, మహిళలు దారి పొడవునా వేచి చూశారు. ఇదే మా హామీ వితంతు మహిళనైన నాకు ఈ ప్రభుత్వంలో ఇంటి స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అండగా నిలిచారు. వితంతు పెన్షన్ను నెలనెలా ఒకటో తేదీనే ఇంటికి పంపారు. ఇంత మేలు చేసిన ఆయన్ను గెలిపించుకోకుంటే ఇంకెవరిని గెలిపించుకుంటాం? ఇది జగనన్నకు మా హామీ. – వెంకటలక్ష్మి, బత్తలపల్లి మళ్లీ జగన్ను గెలిపించుకుంటాం నాకు 60 ఏళ్లు పైనే ఉన్నాయి. కర్రసాయం లేనిదే నడవలేని పరిస్థితి. నా కొడుకు చనిపోయాడు. ఈ క్రమంలో నెలనెలా రూ.3 వేల పెన్షన్ను ఇంటికి పంపి పెద్ద కొడుకులా సీఎం జగన్ నన్ను సాదుకొచ్చాడు. ఆ టీడీపీ వాళ్లు వలంటీర్లతో పెన్షన్ పంచకుండా అడ్డుపడ్డారట. ఏం పర్లేదు. ఒకటి రెండు నెలలేగా.. మళ్లీ నా పెద్ద కొడుకు జగన్ ఇంటి దగ్గరకే పెన్షన్ పంపుతాడు. ఆయన్ను మేం గెలిపించుకుంటాం. – సాకలి చెన్నప్ప, కదిరి శివారు గ్రామం కుటగుళ్ల ఏమ్మా.. తల్లీ ఎలా ఉన్నారు? ‘ఏమ్మా తల్లీ.. ఎలా ఉన్నారు? ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయా? వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారా’ అంటూ మహిళా కూలీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముచ్చటించారు. బస్సు యాత్ర బత్తలపల్లి సమీపంలోకి వచ్చినప్పుడు సీఎం జగన్మోహన్రెడ్డిని చూడాలన్న తపనతో పొలంలో వేరుశనగ తొలగిస్తున్న కూలీలు పరుగు పరుగున రోడ్డుపైకి చేరుకున్నారు. వారిని గమనించిన సీఎం వైఎస్ జగన్... బస్సు ఆపించి వారితో మాట్లాడారు. ‘ఆసరా డబ్బులు చేతికి అందాయా తల్లీ.. పొదుపు సంఘాలు ఎలా నడుస్తున్నాయి.. అమ్మఒడి వస్తోందా...’ అని ఆరా తీశారు. తమను అంత ఆప్యాయంగా పలకరించే సరికి సంబరపడిన కూలీలు..‘మన ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయి సార్..’ అని బదులిచ్చారు. -
కింజరాపు కోటపై తిరుగుబాటు బావుటా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ‘అచ్చెన్నకు మాపై ఎందుకంత కక్ష’.. అంటూ మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ వందలాది ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అచ్చెన్న, కూన రవికుమార్ కుట్ర వల్లే నాకు టికెట్ రాలేదు. ఎంపీకై నా ఇక్కడి ఓట్లు అక్కర్లేదా..’ అంటూ పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కార్యకర్తల ముందు బాధనంతా వెళ్లగక్కారు. బాబాయ్, అబ్బాయ్ల ఆధిపత్య ధోరణిపై జిల్లా టీడీపీ సీనియర్ నాయకులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. టికెట్ల ప్రకటన తర్వాత ఇది మరింత ఎక్కువైంది. పార్టీలో ఏం జరిగినా తమ కనుసన్నల్లోనే జరగాలనే ధోరణిలో వ్యవహరిస్తున్న కింజరాపు కుటుంబంపై స్వపక్ష నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శ్రీకాకుళంలో కావాలనే.. శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండ ఫ్యామిలీని తొక్కాలని కింజరాపు ఫ్యామిలీ మొదటి నుంచీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడది మరింత ఎక్కువైంది. తమ చెప్పు చేతుల్లో ఉండే నాయకుడు తప్ప తమ ను ప్రశ్నించే నాయకుడు ఉండకూదని గుండ అప్ప లసూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులను సమ యం వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. వ్యూహాత్మకంగానే గొండు శంకర్ను రంగంలోకి దించి ఉసిగొల్పారు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించారు. చెప్పాలంటే గుండ ఫ్యామిలీపై గొండు శంకర్ను ఎక్కు పెట్టారు. బాగా డబ్బులు ఖర్చు పెట్టగ ల శంకర్తో నానా హడావుడి చేయించారు. గొండు శంకర్కే తప్ప గుండ ఫ్యామిలీకి ఏమీ లేదన్నట్టుగా అధిష్టానం దృష్టికి వెళ్లేలా చేశారు. చివరికొచ్చేసరికి టికెట్ విషయంలో పైరవీలు చేశారు. ప్రస్తుతం టీడీపీ అంతా డబ్బు మయమైపోయింది. ఎవరెక్కువ ఇస్తే వాళ్లకే టిక్కెట్ అంటూ లాబీయింగ్కు పెద్ద పీట వేసింది. ఈ క్రమంలో ఒక వైపు డబ్బు, మరోవైపు కింజరాపు ఫ్యామిలీ ఒత్తిడి వెరసి గుండ ఫ్యామిలీకి టిక్కెట్ దక్కకుండా చేసింది. ఇదంతా బహిరంగ రహస్యమే. డబ్బుతోనే టిక్కెట్ సాధించుకున్నానని, మీకు అది చేతకాలేదని గొండు శంకర్ అందరి దగ్గర అంటున్నారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబుకు రూ.10కోట్లు, లోకేష్కు రూ.10కోట్లు, అచ్చెన్నాయుడికి ఇన్ని కోట్లు, రామ్మోహన్నాయుడికి ఇన్ని కోట్లు, కూన రవికుమార్కు ఇన్ని కోట్లు ఇచ్చానని టిక్కెట్ సాధించిన వ్యక్తే చెబుతున్నాడని మీడియా ముందు టీడీపీ నాయకులు ఆరోపించ డం గమనార్హం. దీన్ని బట్టి టిక్కెట్ల కేటాయింపులో డబ్బుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. డబ్బుకు రుచి మరిగారు.. పాతపట్నంలోనూ దాదాపు అదే పరిస్థితి చోటు చేసుకుంది. అక్కడ కూడా మామిడి గోవిందరావు ఆఫర్కు తలొగ్గి తనకు అచ్చెన్నాయుడు దెబ్బకొట్టారని బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు. కింజరాపు ఫ్యామిలీని నమ్ముకుని టిక్కెట్ కోసం ప్రయత్నించగా, సైలెంట్గా కింజరాపు ఫ్యామిలీ దెబ్బకొట్టిందని కలమట వెంకటరమణ ఆవేదన చెందుతున్నారు. అంతా వారే చేశారని ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. పార్టీ పూర్తిగా డబ్బులకు అమ్ముడు పోయిందని, ప్లాట్ల పేరిట డబ్బులు తీసుకుని మోసం చేసిన మామిడి గోవిందరావును అభ్యర్థిగా పెట్టారంటే పార్టీ ఏ స్థాయికి దిగజారిపోయిందో అర్థమైపోయిందని, నాయకులు ఏ విధంగా అమ్ముడు పోయారనేది స్పష్టమవుతుందని టీడీపీని నమ్ముకుని మొదటి నుంచి రాజకీయాలు చేస్తున్న నాయకులు ఓపెన్ అవుతున్నారు. మామిడి గోవిందరావు ఇచ్చిన డబ్బులకు రుచిమరిగి నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టేశారని భంగ పడిన నాయకులంతా ఆరోపిస్తున్నారు. సీనియర్ ఉంటే ఎదురు తిరుగుతారని, జూనియర్ను పెట్టుకుంటే చెప్పినట్టు నడుచుకుంటారని, తమ మాట జవదాటరనే ఉద్దేశంతో కలమటకు వ్యూహాత్మకంగా దెబ్బకొట్టారని చెబుతున్నారు. కళా.. చివరికిలా.. జిల్లాలో మరో సీనియర్ నేత కళా వెంకటరావు కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. తమకు సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారన్న కారణంతో ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కే ప్రయత్నం చేశారు. అదును చూసి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కట్టబెట్టేలా పావులు కదిపారు. ఎచ్చెర్లకు ప్రాతిని ధ్యం వహిస్తే తమకు అడ్డు తగులు తారని, ఈ జిల్లాలోనే లేకుండా చేస్తే పనైపోతుందని భావించి కళా వెంకటరావుకు పొత్తు సెగ పెట్టారు. కుడితి లో పడ్డ ఎలుకలా ప్రస్తుతం కళా గిలగిల కొట్టుకుంటున్నారు. కింజరాపు ఫ్యామిలీ కుట్రలను ఛేదించలేక చతికిలపడ్డారు. చివరికి చీపురుపల్లి అసెంబ్లీ స్థానం కేటాయించి పార్టీ చేతులు దులుపుకుంది. ఎన్నికల్లో మూల్యం తప్పదు కింజరాపు ఫ్యామిలీ కుట్రలకు బలైన నాయకులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తమను టార్గెట్ చేసి రాజకీయంగా తొక్కేసిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడుకు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎంపీ రామ్మోహన్ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. తమను ఇబ్బంది పెట్టిన వారికి బదులివ్వాల్సిందేనని, రేపు ఎలా ఓట్లు పడతాయో చూస్తామంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నారు. వారి స్వార్థ రాజకీయాలకు మమ్మల్ని బలి పశువు చేస్తారా? అని ఆగ్రహంతో రగిలిపోయి ఉన్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు అంటేనే ఒంటి కాలితో లేస్తున్నారు. మమ్మల్ని దెబ్బకొట్టినోళ్లకు తమ దెబ్బ ఏంటో చూపిస్తామంటున్నారు. -
టీడీపీ మునస్వామి.. థామస్ ఎలా అయ్యాడు?
‘డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరావుగారంటారు ధనముంటే అప్పలమ్మనే అప్సరసని పొగిడేస్తారు కాషే ఉంటే ఫేస్కు విలువస్తుంది నోటే ఉంటే మాటకు బలమొస్తుంది..’ ఇది ఓ తెలుగు సినిమాలో ఫేమస్ పాట. అచ్చం ఇలాంటిదే జీడీనెల్లూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. టీడీపీ తురఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న వీ.ఎం.థామస్ కులం, మతం, చదవులపై పలు అనునాలు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్మీడియెట్ టీసీలో వీ.మునస్వామిగా ఉన్న ఆయన పేరు ఆ తర్వాత కొంత కాలానికి వీ.ఎం.థామస్గా మారిపోవడం వెనుక ఆంతర్యమేమిటో అంతుపట్టడంలేదు. ఇక ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా పేరుగడిస్తున్న ఆయన చదువుపైనా హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు నిజనిజాలు నిగ్గు తేల్చాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు కలెక్టరేట్: జిల్లాలోని గంగాధరనెల్లూరు నియోజకవర్గం టీడీపీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి మునస్వామి (థామస్) 1990–91లో కార్వేటినగరం మండల కేంద్రంలోని ఆర్కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తిచేశారు. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న ఆయనపై పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మునస్వామి మతం, విద్యార్హతలు, నేరచరిత్ర పైన సమగ్ర విచారణ చేయాలని హిందూ ధర్మ పరిరక్షణ సమితి కన్వీనర్ మిట్టపల్లి సతీష్రెడ్డి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇంటర్మీడియెట్ కోర్సు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (టీసీ)లో వీ.మునస్వామిగా ఉన్న వ్యక్తి ప్రస్తుతం ఉన్న పాస్పోర్టు, కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్గా ఎలా అయ్యారనే విషయాన్ని సమగ్ర విచారణ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంబీబీఎస్ చేయకున్నప్పటికీ డాక్టర్గా చెలామణి అవుతున్నారని ఆరోపించారు. ప్రస్తుతం థామస్ అనే క్రిస్టియన్ పేరు మీద చెలామణి అవుతున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. థామస్ పేరులోనే క్రిస్టియానిటీ ఉందని, కావున అతని ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసి, థామస్ నామినేషన్ను తిరస్కరించి, ఎన్నికల్లో అనర్హత వేటు వేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తప్పుడు పత్రంతో ఎన్నికల్లో పోటీ క్రైస్తవ మతం స్వీకరించిన థామస్కు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని ఫిర్యాదులో పేర్కొన్నారు. మతం మారిన ఎస్సీలను బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతోందన్నారు. అయినప్పటికీ ఆయన తప్పుడు కులధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నారు. ఆయన ఎంబీబీఎస్ చదవక పోయినా పీహెచ్డీని అడ్డుపెట్టుకుని డాక్టర్గా చలామణి అవుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తను ప్రపంచ ప్రఖ్యాత సంతాన సాఫల్య వైద్యునిగా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే ఆయన నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2017లో తన వద్ద డాక్టర్గా పనిచేసి మానేసిన డాక్టర్ ఎస్.రమ్యను హత్య చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలున్నాయన్నారు. ఆ కేసులో ఆయనతో పాటు ఆరుగురు అరెస్టు కాగా, తరువాత ఆ కేసు ఏమైందో తెలియడం లేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా కులధ్రువీకరణపత్రం 2022లో కార్వేటినగరం మండలంలో పనిచేసిన తహసీల్దార్ క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే నిబంధనలకు వ్యతిరేకంగా థామస్కు కులధ్రువీకరణ పత్రం జారీచేశారని తెలిసింది. 2022లో కార్వేటినగరం తహసీల్దార్గా పనిచేసిన షబ్బర్బాషా 26–04–2022న వీ.మునస్వామికి వీ.మునస్వామి థామస్ అని కులధ్రువీకరణ పత్రం ఎలా ఇచ్చారు?.. కులంపై వివాదం వచ్చినపుడు సంబంధిత గ్రామంలో నలుగురిని అడిగి పంచనాయా చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కులధ్రువీకరణ పత్రం ఎలా జారీచేశారని ఫిర్యాదుదారులు ప్రశ్నిస్తున్నారు. థామస్ మత మార్పిడి విషయాన్ని సమగ్రంగా విచారణ చేయాలని జై హిందుస్థాన్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అక్కిలిగుంట మధు ఈనెల మార్చి 15న జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్కు వినతి పత్రం అందజేశారు. ఆయన అందజేసిన వినతిలో సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరన్నారు. అలాంటిది మునస్వామి థామస్ అని పాస్పోర్టులో పొందారన్నారు. పేరు మార్చుకోవాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలని, మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందన్నారు. కాబట్టి పాస్పోర్టు సమయంలో మత మార్పిడి ధ్రువీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారని, సంబంధిత కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుని విచారణ చేయాలని ఆ ఫిర్యాదులో కోరారు. వీటిపై సమగ్ర విచారణ 1.ఇంటర్ సర్టిఫికేట్లో వీ.మునస్వామి అని ఉన్న పేరు, పాస్పోర్టులో వీ.ఎం.థామస్గా ఎలా మారింది? 2.ఆయన జన్మస్థలం అల్లాగుంటని టీసీలోనూ, చైన్నె అని పాస్పోర్టులోనూ పేర్కొన్నారు. ఇందులో ఏది నిజం? 3. ఆయన వైద్యశాస్త్రం చదివారా..? లేక డాక్టరేట్ పొందిన వ్యక్తా? 4. ఆయనపై ఉన్న హత్యా ప్రయత్నం కేసు ఏమైంది. విచారణ కొనసాగుతోందా..? లేక కేసు కొట్టి వేశారా? పకడ్బందీగా విచారణ ఆధార్ కార్డులో వీ.ఎం, థామస్ అని ఉంది. ఏప్రిల్ 2022లో పనిచేసిన తహసీల్దార్ జారీచేసిన కులధ్రువీకరణ పత్రంలో వీ.మునస్వామి థామస్ అని జారీచేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నుంచి అందిన ఫిర్యాదులను సమగ్రంగా విచారిస్తున్నాం. ఆ ఫిర్యాదులకు సంబంధించిన రుజువులను పంపుతాం. ఈ ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేసి వాస్తవాలు తెలుసుకుంటాను. – పుష్పకుమారి, తహసీల్దార్, కార్వేటినగరం మండలం -
March 30th: ఏపీ ఎన్నికల అప్డేట్స్
AP Political News And Election News March 30th Telugu Updates 9:50 PM, March 30th 2024 కాకినాడ: వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారు: కురసాల కన్నబాబు ఈ ఐదేళ్ళ కాలంలో వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది. ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు. తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు. దీని వల్ల నష్టం ఎవరికీ? రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు. ప్రజలకు అందే సేవలను నియంత్రించారు. ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది. మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది. ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు. వాలంటీర్లను నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం. చంద్రబాబు తీరు పూర్వం కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది 9:25 PM, March 30th 2024 కాకినాడ: చేబ్రోలులో పవన్ సభ అట్టర్ ప్లాప్ పవన్ సభకు జనం కరువు పవన్ మాట్లాడుతుండగానే వెనుదిరిగిన జనం 9:00 PM, March 30th 2024 ప. గో. జిల్లా: చంద్రబాబుని మాయల ఫకీరు, జిత్తులమారి నక్కగా అభివర్ణించిన మంత్రి కారుమూరి నిమ్మగడ్డ రమేష్ చేత ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయించి వాలంటరీల సేవలు నిలిపి వేయించిన నీచుడు చంద్రబాబు ప్రజలకు మేలు చేసేది ఏదైనా చంద్రబాబుకి ద్వేషమే ఎవరైనా ఏడుస్తుంటే చంద్రబాబు ఆనందిస్తాడు ఎండలు మండుతున్నాయి . పెన్షన్ ల కోసం అవ్వాతాతలు మళ్ళీ లైన్లో నిలబడి సొమ్మ సిల్లీ పడిపోతే చంద్రబాబుకి సంతోషం చంద్రబాబుకి అయన తోక పార్టీకి ఏనాడూ వాలంట్రీలు అంటే ఇష్టం లేదు. చంద్రబాబు సిగ్గు లేకుండా, దుర్మార్గంగా, హేయమైన విధానాలు పాటిస్తూ నిమ్మగడ్డ రమేష్ చేత వాలంట్రీల పై పిర్యాదు చేయించాడు. వాలంట్రీల పై చంద్రబాబు నీచ బుద్ది కపట ప్రేమ ఈ రోజు బయట పడింది 8:50 PM, March 30th 2024 విజయవాడ: పెన్షన్ పంపిణీపై నిమ్మగడ్డ అండ్ కో ఫిర్యాదుపై ఎంపీ కేశినేని నాని , ఎమ్మెల్యేలు వెలంపల్లి, మల్లాది విష్ణు ఫైర్ సీఎం జగన్ చెప్పినట్లు పేదలకు పెత్తందార్లకు మధ్య యుద్ధమిది పేదలకు అందించే పెన్షన్లు నిలుపుదల చేయడం చాలా దారుణం పెన్షన్ల పంపిణీ అంశం పై ఈసీ పునరాలోచించుకోవాలి పెన్షన్లు ఆపేస్తే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు మొన్నటి వరకూ ఒకటవ తేదీనే పెన్షన్ ఇచ్చేవాళ్లం ఆ విధానాన్ని కొనసాగించేలా ఈసీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం -ఎంపీ,కేశినేని నాని మేధావుల ముసుగులో 64 లక్షల మంది పెన్షనర్ల నోట్లో మట్టికొట్టారు నిమ్మగడ్డ రమేష్తో పాటు మరికొందరు చంద్రబాబు ఏజెంట్లుగా... తొత్తులుగా మారారు చంద్రబాబు డైరెక్షన్ లోనే పెన్షన్లు ఇవ్వొద్దని చెప్పించారు దీనికి టీడీపీ కచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే -ఎమ్మెల్యే , మల్లాది విష్ణు నిమ్మగడ్డ రమేష్ అండ్ బ్యాచ్ రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు చంద్రబాబు సమయంలో మూడురోజులు క్యూలో నిలబడితేనే పెన్షన్లు వచ్చేవి కాదు ఈ కుట్రకు కారణం చంద్రబాబే వృద్ధుల ఉసురు చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుంది సీఎం జగన్ ఇంటికే పెన్షన్లు అందిస్తున్నారు వాలంటీర్ల ద్వారా ఇంటికే పెన్షన్లు ఇస్తున్న ప్రక్రియను అడ్డుకోవాలని చూస్తున్నారు -ఎమ్మెల్యే ,వెలంపల్లి శ్రీనివాసరావు 7:40 PM, March 30th 2024 పల్నాడు జిల్లా: వాలంటర్లీపై ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమైంది: అంబటి రాంబాబు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారు సీఎం జగన్పైన కక్షతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాలంటరీ పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయించాడు ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి పెన్షన్లు తీసుకునే వారి పైన కక్షతోనే చంద్రబాబు నాయుడు ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలతో వాలంటీర్లను బలి చేయాలనుకుంటున్నాడు కాని బలవుతుంది వాలంటీర్లు కాదు... అవ్వ తాతలు వికలాంగులు, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న లబ్ధిదారులు 6:00 PM, March 30th 2024 పాడేరు: మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు. రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు.. పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి. లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని ఓడించి తీరుతాం... గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా... ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా 5:34 PM, March 30th 2024 నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు అదే మాట మీద ఉండు రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు ఈ ఎలక్షన్తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు. అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది. మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు. అదే మాట మీద ఉండు. రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును. ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ… — Vijayasai Reddy V (@VSReddy_MP) March 30, 2024 5:06 PM, March 30th 2024 విశాఖ: చంద్రబాబు అహంకారంతో మాట్లాడుతున్నాడు: గుడివాడ అమర్నాథ్ పేదవాడికి - పెత్తందారుడికి మధ్య యుద్ధం జరుగుతుందని సీఎం జగన్ ముందే చెప్పారు అందుకే పేదవారికి టికెట్లు ఇస్తున్నారు టిప్పర్ డ్రైవర్, ఉపాధి హామీ కూలి, సామాన్య కార్యకర్త వీరందరికి సీఎం జగన్ పోటీ చేసే అవకాశం కల్పించారు ఇవన్నీ చూసి చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నాడు చంద్రబాబు పెత్తందారీ పోకడలను ప్రజలకు గమనిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు 3:40 PM, March 30th 2024 కర్నూలు జిల్లా: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా ముమ్మడివరం నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి భారీగా వైఎస్సార్సీపీలో చేరికలు మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తుగ్గలి వద్ద సీఎం శ్రీ వైయస్.జగన్ సమక్షంలో వైఎస్సార్సీలో చేరిన ముమ్మడివరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లిఖార్జున్ సహా పలువురు జనసేన పార్టీ కీలక నేతలు 3:06 PM, March 30th 2024 నెల్లూరు జిల్లా: కందుకూరు ఎమ్మెల్యే మహీధర్రెడ్డి నాకు గురువు తో సమానం: విజయసాయిరెడ్డి మహీధర్ రెడ్డి చేసిన మేలు నా జీవితంలో మరిచిపోలేను కందుకూరు లో పిలిస్తే పలికే దేవుడిగా మహీధర్ రెడ్డి అన్న ను ప్రజలు కొలుస్తారు కందుకూరు లో మహీధర్ రెడ్డి అన్న పోటీచేయలని కోరుకున్నా కానీ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోషల్ ఇంజినీరింగ్లో భాగంగా బీసీ అభ్యర్థికి కేటాయించారు భవిష్యత్లో మహీధర్రెడ్డి ఆలోచనల మేరకే కందుకూరులో పరిపాలన ఉంటుంది మానుగుంట మహీధర్రెడ్డి ప్రజా సేవలోనే ఉండాలని కోరుకుంటున్నా మహీధర్ రెడ్డి అన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి పార్టీ గౌరవిస్తుంది 2:57 PM, March 30th 2024 ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తాం : బాలినేని సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి బాబు అబద్ధాలను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు మరోసారి బాబుకు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్ధం 2:55 PM, March 30th 2024 ప్లీజ్.. నన్ను సపోర్ట్ చేయు గొల్లప్రోలులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మతో పవన్ సమావేశం నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ స్థానిక పరిస్థితులు, సభలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ ఓటు వేయించే బాధ్యత తీసుకోవాలని కోరిన పవన్ ఇండిపెండెంట్గా దిగితే ఇద్దరూ ఓడిపోతామని హెచ్చరిక 2:30 PM, March 30th 2024 విశాఖ: గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ భీమిలి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా శ్రీనివాసరావు పాల్పడ్డారు గంటా శ్రీనివాసరావు ఒక అవినీతిపరుడు గంట భూ అక్రమాలకు పాల్పడ్డాడని సైట్ కు ఫిర్యాదులు అందాయి జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు 4 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు యువతకి 40 శాతం సీట్లు ఇస్తామన్నారు స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు 2:20 PM, March 30th 2024 నెల్లూరు జిల్లా: సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా: కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్రెడ్డి కందుకూరు నియోజకవర్గంలో కులాలకు అతీతంగా పనిచేశా నాకు టికెట్ రాలేదన్నా..బాధ లేదు పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉంటా వచ్చే ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని, కందుకూరు అసెంబ్లీ అభ్యర్థిగా బుర్రా మధుసూధన్ యాదవ్ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం కార్యకర్తలు ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేసి కందుకూరులో వైస్సార్సీపీ జెండా ఎగరేయాలి 2:10 PM, March 30th 2024 చంద్రబాబుకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్.. డబ్బున్న వాళ్లకే చంద్రబాబు టికెట్లు ఇచ్చారు. వెనుకబడిన వర్గాలవారిని అసెంబ్లీకి పంపాలనే ఆలోచన సీఎం జగన్ది. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధిచెబుతారు. 1:40 PM, March 30th 2024 చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్: ప్రతాప్ కుమార్ రెడ్డి చంద్రబాబు సభపై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్. కావలిలో చంద్రబాబు రోడ్ షో అట్టర్ ప్లాప్ అయ్యింది. జనాలు లేక గంటసేపు బస్సులో ఉండి ఆ తర్వాత 2000 మందితో సభ పెట్టుకొన్నారు. చంద్రబాబు హయాంలో కావలికి చేసింది ఏమీ లేదు.. శిలాఫలకాలు తప్ప. రామాయపట్నం, పోర్ట్ ఫిషింగ్ హార్బర్, రోడ్లు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది సీఎం జగన్ ఆధ్వర్యంలోనే. గ్రావెల్ మాఫియాకు నాకు ఎలాంటి సంబంధం లేదు. బోగోలు మండలం బిట్రగుంట వద్ద నేను భూములు ఆక్రమించానని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా. 1:19 PM, March 30th 2024 ఏలూరు ఎంపీ సీటుపై కూటమిలో రగడ ఏలూరు పార్లమెంట్ సీటుపై బీజేపీలో అసమ్మతి జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కామినేని ఆత్మీయ సమావేశానికి దూరంగా బీజేపీ నేతలు టీడీపీ పుట్టా మహేష్ కుమార్కి కేటాయించడంపై అభ్యంతరాలు గారాపాటి చౌదరికి టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తులు ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేయాలని గారాపాటిపై అనుచరుల ఒత్తిడి రెండు మూడు రోజుల్లో గారాపాటి ప్రకటన? 1:16 PM, March 30th 2024 వర్మ ఇంట్లో పవన్ భోజనం గొల్లప్రోలు చేరుకున్న పవన్ కల్యాణ్ నేరుగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటికి పవన్ వర్మ ఇంట్లోనే పవన్ భోజనం సాయంత్రం చేబ్రోలు రామాలయం వీధిలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ 1:12 PM, March 30th 2024 బండారుకు చంద్రబాబు పిలుపు బండారు సత్యనారాయణమూర్తికి చంద్రబాబు పిలుపు పెందుర్తి టికెట్ ఆశించి భంగపడ్డ బండారు తీవ్ర అస్వస్థతో ఆస్పత్రిపాలైన వైనం మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల ఫలితమేనంటూ స్థానికంగా చర్చ బుజ్జగించి చంద్రబాబు ఏ హామీ ఇస్తారో అనే చర్చ 1:09 PM, March 30th 2024 ఎచ్చెర్లలో బీజేపీ బీసీ నేతల ఆందోళన శ్రీకాకుళం ఎచ్చెర్లలో నడికుర్తి ఈశ్వర్ రావుకు టికెట్ ఇవ్వడంపై బీజేపీ బీసీ నేతల అభ్యంతరాలు కళా వెంకట్రావ్ను చీపురుపల్లికి పంపంచి మరీ.. బీజేపీకి టికెట్ ఇప్పించిన చంద్రబాబు బీసీలు అధికంగా ఉన్న చోట.. ఓసీకీ ఇవ్వడంపై బీజేపీ నేతల అభ్యంతరం అభ్యర్థిని మార్చాలంటూ ఆందోళనకు సిద్ధమైన బీజేపీ నేతలు 1:05 PM, March 30th 2024 ఏప్రిల్ 1న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్ నేత రఘువీరారెడ్డి 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి 12:55 PM, March 30th 2024 గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు: వల్లభనేని వంశీ పేదవర్గాలన్నీ ఆత్మగౌరవంతో బ్రతుకుతున్నారు బడుగు, బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వం అండగా నిలిచింది ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలకు నమ్మకం ఉంది ప్రజలతో పాటు నాకు ఈ ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి ఎక్కువగా ఉంది అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం సాయం చేసింది నేను ఆ ప్రభుత్వంలోనూ పనిచేశా.. ఈ ప్రభుత్వంలోనూ పనిచేశా గత ప్రభుత్వాల్లో ఒకరు చనిపోతేనే మరొకరికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉండేది ఈ ప్రభుత్వమే ఉత్తమమైనది అని నేను భావిస్తున్నా నన్ను ఓడిస్తానని నియోజకవర్గానికి సంబంధం లేని వాళ్లు చెబితే సరిపోదు గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారు ఇక్కడున్న ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు గెలుస్తారు నిత్యం వార్తల్లో ఉండటానికి కొత్తగా వచ్చిన వారు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు నేను 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 12:45 PM, March 30th 2024 జనసేసలో వీడని గందరగోళం.. జనసేన అభ్యర్థుల ప్రకటనలో వీడని గందరగోళం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరీ అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ అభ్యర్థులను ప్రకటించని పవన్ కళ్యాణ్ పాలకొండకి అభ్యర్థి లేక వెతుకుతున్న జనసేన అవనిగడ్డలో అభ్యర్థిని ఇంకా ప్రకటించని జనసేన ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి వదిలేసిన జనసేన విశాఖ సౌత్ సీటుపై సందిగ్ధత విశాఖ సౌత్ సీటు కూడా టీడీపీకి వదిలేస్తారంటూ ప్రచారం విశాఖ సౌత్ సీటు వంశీ కృష్ణకి ఇస్తామని గతంలో పార్టీలో చేర్చుకున్న పవన్ విశాఖ సౌత్ అభ్యర్థిని ఇప్పటికీ ప్రకటించని జనసేన 12:25 PM, March 30th 2024 మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరీ మచిలీపట్నం లోక్సభ జనసేన అభ్యర్థిగా బాలశౌరీ ఈ మేరకు అధికార ప్రకటన చేసిన పవన్ కల్యాణ్ కాకినాడ జనసేన లోక్సభ అభ్యర్థిగా ఉదయ్ ఇంకా పెండింగ్లో మూడు అసెంబ్లీ స్థానాలు 11:50 AM, March 30th 2024 ఎన్నికల తర్వాత టీడీపీకి మనుగడ ఉండదు : విజయసాయిరెడ్డి చంద్రబాబు అమలు చేయలేని హామీలను ఇస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోతాయి టీడీపీకి సిద్ధాంతాలు, విధివిధానాలు లేవు రాజకీయమే పరమావధిగా టీడీపీ నడుచుకుంటోంది ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ఉండదు ఎన్నికల తర్వాత బీజేపీలో టీడీపీ, జనసేన కలిసిపోతాయి చంద్రబాబుకు ఇది ఆఖరి ఎన్నిక అందుకే అమలు చేయలేని హామీలు ఇస్తున్నారు ధనవంతులను పార్టీలోకి చేర్చుకుంటూ ధనంతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు దేశ రాజకీయాల్లో ఇది దురదృష్టకరం 11:30 AM, March 30th 2024 గంటాకు వ్యతిరేకంగా సమావేశం.. భీమిలి నియోజకవర్గంలో మాజీమంత్రి గంటాకు వ్యతిరేకంగా సమావేశం. సమావేశాన్ని ఏర్పాటు చేసిన నియోజకవర్గం ఇన్చార్జ్ కోరాడ రాజబాబు. హాజరైన టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు. గంటా శ్రీనివాస్కు సీటు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నాయకులు. పార్టీ కోసం కష్టపడిన కోరాడ రాజబాబుకు అన్యాయం జరిగిందనే అభిప్రాయం. చంద్రబాబు వైఖరిని తప్పుపట్టిన నేతలు. భీమీలి అసెంబ్లీ సీటు రాజబాబుకి ఇవ్వాలని తీర్మానం. పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచన చేయకపోతే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం. 11:12 AM, March 30th 2024 సీపీఎం అరకు ఎంపీ అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స లోక్సభ ఎన్నికల బరిలో సీపీఎం ఒంటరిపోరు తొలి జాబితా విడుదల చేసిన జాతీయ అధిష్టానం ఆంధ్రప్రదేశ్లోని అరకు (ఎస్టి) సీటుకు సీపీఎం పోటీ సీపీఎం అభ్యర్థిగా పాచిపెంట అప్పలనర్స 10:49 AM, March 30th 2024 మైసూర్ బోండాకు అంత సీన్ లేదు: వెల్లంపల్లి టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమను.. మైసూర్ బోండాంగా అభివర్ణిస్తూ వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా గతంలో మైసూర్ బోండా నియోజకవర్గంలో 32 డివిజన్లలో అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. బోండా ఉమా కు చిత్తశుద్ధి లేదు.. అందుకే ప్రజల నుంచి మద్దతు లేదు రాష్ట్రంలో ఆర్యవైశ్యులంతా సీఎం జగన్ వైపే ఉన్నారు బోండా ఉమా కుల, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే వ్యక్తి రాష్ట్రంలో సీఎం జగన్ కులమతాలకు అతీతంగా పాలనందిస్తున్నారు బోండా ఉమా పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడినంత మాత్రాన ఏమి జరిగిపోదు విజయవాడ సెంట్రల్ ప్రజలు బోండా ఉమను తరిమి కొడతారు. 10:29 AM, March 30th 2024 గంటాకు సీటు.. రెబల్గా జనసేన అభ్యర్థి పోటీ? భీమిలి సీటు గంటాకు కేటాయించడంపై భగ్గుమన్న జనసేన.. తీవ్ర అసంతృప్తి ఇండిపెండెంట్ గా పంచకర్ల సందీప్ పోటీ చేయాలని కార్యకర్తలు ఒత్తిడి భీమిలిలో చందాలు వేసుకొని జనసేన పార్టీని గెలిపించుకుంటాం 10 సంవత్సరాల కష్టపడిన వారిని పవన్ కల్యాణ్ మోసం చేశారు పవన్ కళ్యాణ్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నాం భీమిలి నియోజకవర్గంలో టీడీపీకి సహకరించేది లేదు పొత్తులో భాగంగా 21 స్థానాలు తీసుకోవడంపై అసంతృప్తి కష్టపడి కాకుండా కొత్తగా పార్టీ లోకి వచ్చినవారికి సీట్లు ఇస్తున్నారు నియోజకవర్గాల మారే గంటా శ్రీనివాసరావు సంగతి మాకు తెలుసంటున్న జనసేన శ్రేణులు 10:17 AM, March 30th 2024 నంద్యాల టీడీపీ సెక్రటరీపై కోడ్ ఉల్లంఘన కేసు నంద్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన టీడీపీ నేత నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు... నంద్యాల సాయి బాబా నగర్ లోని 24 వ వార్డులు ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా టీడీపీ శంఖారావం కిట్లను పంపిణీ చేసిన టీడీపీ నాయకుడు ఫిరోజ్ పై ఫిర్యాదు స్థానికంగా ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన వీడియో ఆధారంగా ఎన్నికల అధికారి పోలీసులకు ఫిర్యాదు చేసిన డిప్యూటీ తహసీల్దార్ నాగరాజు 188 ఐపిసి సెక్షన్ క్రింద నంద్యాల టీడీపీ జిల్లా కార్యదర్శి ఫిరోజ్ పై కేసు నమోదు చేసిన టూ టౌన్ పోలీసులు... 10:15 AM, March 30th 2024 నాలుగో రోజు ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర కొనసాగుతున్న వైఎస్సార్సీపీ మేమంతా సిద్ధం యాత్ర కర్నూలు జిల్లా పత్తిపాడు నుంచి ప్రారంభమైన సీఎం జగన్ బస్సు యాత్ర తగ్గలి ప్రజలతో నేడు ముఖాముఖి కార్యక్రమం మధ్యాహ్నాం అనంతపురంలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ యాత్ర రాత్రికి ధర్మవరం నియోజకవర్గం సంజీవపురంలో బస 10:02 AM, March 30th 2024 విశాఖ YSRCPలోకి భారీగా చేరికలు గాజువాకలో వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పార్టీ కార్యాలయం ప్రారంభించిన రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో వైఎస్సార్సీపీలోకి భారీగా చేరికలు జనసేన, టీడీపీ సీనియర్లకు YSRCP కండువా కప్పిన వైవీ సుబ్బారెడ్డి గాజువాకలో అమర్నాథ్ను, విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిలుపు మళ్లీ జగన్ సీఎం అయ్యేలా ఆశీర్వదించాలని ప్రజల్ని కోరిన సుబ్బారెడ్డి 9:30 AM, March 30th 2024 టీడీపీకి భార్ షాక్.. ఆత్మకూరులో టీడీపీకీ భారీ షాక్.. దశాబ్దాలుగా టీడీపీలో ఉంటున్న అనంతసాగరం మండల అధ్యక్షుడు రవీంద్ర, మైనార్టీ నాయకుడు ఖాజావలి సహా మరో 200 మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరిక జిల్లా పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి విక్రమ్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేసిన విజయ సాయిరెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ అడ్డా.. మరోసారి పార్టీ జెండా ఎగరడం ఖాయమన్న విక్రమ్ రెడ్డి 9:00 AM, March 30th 2024 టీడీపీలో భగ్గుమంటున్న అసంతృప్త జ్వాలలు.. కడప జిల్లా రాజంపేట టీడీపీ అసంతృప్తి నిన్న అర్ధరాత్రి తన అనుచరులతో సమావేశమైన చెంగల్రాయుడు. టీడీపీలో పనిచేసిన వారికి గుర్తింపు లేదని ఆగ్రహం అనుచరులతో చర్చించిన అనంతరం కీలక నిర్ణయం ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయం 8:40 AM, March 30th 2024 ఉత్తరాంధ్ర టీడీపీలో ప్రకంపనలు.. చివరి జాబితా సీట్లు ప్రకటనపై అసంతృప్తి జ్వాలలు. పాడేరులో టీడీపీ ఫ్లెక్సీలు, ఇదేం ఖర్మ పాంప్లెట్స్ తగలబెట్టిన గిడ్డి ఈశ్వరి అనుచరులు. పాడేరు సీటు రమేష్ నాయుడుకు ఇవ్వడంపై గిడ్డి ఈశ్వరి తీవ్ర అసంతృప్తి. భీమిలి సీటు గంటాకు ఇవ్వడంపై అసంతృప్తితో రగిలిపోతున్న కోరాడ రాజబాబు. భీమిలిలో గంటాకు సహకరించేది లేదన్న జనసేన నేతలు. చీపురుపల్లి సీటు కళా వెంకట్రావు ఇవ్వడంపై కిమిడి నాగార్జున ఆగ్రహం. పార్టీకి రాజీనామా చేసిన కిమిడి నాగార్జున చంద్రబాబు ఫోటోతో ఉన్న కరపత్రాలు దహనం జనసేనకు నెలుమర్ల సీటు కేటాయించడంపై బంగార్రాజు అసంతృప్తి. చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ టీడీపీకి రాజీనామా చేసిన బంగార్రాజు. పెందుర్తి సీటు జనసేనకు ఇవ్వడంపై టీడీపీలో అసంతృప్తి. నేడు అనుచరులతో సమావేశమవుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి. 8:20 AM, March 30th 2024 గిరిజన నేతలను నట్టేట ముంచిన బాబు.. నమ్ముకున్న గిరిజన నేతలను నట్టేట ముంచిన చంద్రబాబు. అరకు ఎమ్మెల్యే అభ్యర్థి దున్ను దొరే అంటూ రా కదలిరా సభలో ప్రకటించిన చంద్రబాబు. ప్లేట్ ఫిరాయించి ఆ సీటును బీజేపీకి అప్పగించిన బాబు. మాజీ ఎమ్మెల్యే దివంగత కిడారి సర్వేశ్వరరావు కుమారుడు మాజీ మంత్రి కిడారి శ్రావణ్కు కూడా టికెట్ ఇస్తానని మోసం చేసిన బాబు. పాడేరులో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి హ్యాండిచ్చి వేరొకరికి టికెట్ కేటాయించిన టీడీపీ హైకమాండ్ రంపచోడవరం నియోజకవర్గం నుంచి వంతల రాజేశ్వరిని కూడా వంచించిన టీడీపీ అధినాయకత్వం. చంద్రబాబుపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ గిరిజన నేతలు. బాబు నమ్మించి మోసం చేశాడంటూ నేరుగా చంద్రబాబు ఇంటి వద్ద కొద్దిరోజులు క్రితం నిరసనకు దిగిన వంతల రాజేశ్వరి. ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సిద్ధమైన దొన్ను దొర 8:00 AM, March 30th 2024 టీడీపీ అభ్యర్థికి నోటీసులు.. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖత్కు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోటీసులు ఈనెల 25వ తేదీన సద్దాం హుస్సేన్పై చంద్రశేఖర్ అనుచిత వ్యాఖ్యలు ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లు చీల్చి ముస్లిం మనోభావాలను దెబ్బతీసేలా ఉద్దేశపూర్వకంగా కామెంట్స్ ఈ క్రమంలో తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు. దీంతో, చంద్రశేఖర్కు నోటీసులు జారీ చేసిన రిటర్నింగ్ అధికారి 7:45 AM, March 30th 2024 అనపర్తి టీడీపీలో కొనసాగుతున్న అసమ్మతి తూర్పు గోదావరిలో అనపర్తి టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నల్లమిల్లి అనుచరుల ఆగ్రహం.. టీడీపీ జెండాలు, సైకిల్ దహనం అనుచరుల సమావేశంలో కుటుంబ సభ్యులతో కలిసి కంటతడి పెట్టిన నల్లమిల్లి బుజ్జిగించేందుకు యత్నించిన అధినేత చంద్రబాబుతో ఫోన్లోనూ అసహనం ప్రదర్శించిన నల్లమిల్లి ఇవాళ రెండోరోజు ప్రజల ముందుకు నల్లమిల్లి బిక్కవోలులో నల్లమిల్లి కుటుంబ సభ్యుల పర్యటన నల్లమిల్లి తన సింపథీ డ్రామాలు ఆపి.. చంద్రబాబునే నిలదీయాలంటున్న వైఎస్సార్సీపీ 7:35 AM, March 30th 2024 అనంత టీడీపీలో అసమ్మతి జ్వాలలు టిక్కెట్ల కేటాయింపులో సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి దక్కని టిక్కెట్ అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలకు నిప్పు పెట్టిన టీడీపీ నేతలు అనంతపురం ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి తన కుమారుడు జేసీ పవన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ వస్తుందని ఆశించిన జేసీ మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్నకు గుంతకల్లు టిక్కెట్ ఇచ్చిన చంద్రబాబు గుంతకల్లు టిక్కెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ గుమ్మనూరు జయరామ్నకు టిక్కెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ గుంతకల్లులో టీడీపీ నేతల నిరసన చంద్రబాబు, నారా లోకేష్ ఫ్లెక్సీలు చించేసి దహనం చేసిన టీడీపీ నేతలు 7:30 AM, March 30th 2024 మేమంతా సిద్ధం@డే-4 నేడు కర్నూలు, అనంత జిల్లాల్లో సీఎం జగన్ బస్సు యాత్ర శనివారం(మార్చి 30) ఉదయం పత్తికొండ బస నుంచి ప్రారంభం కానున్న మేమంతా సిద్ధం యాత్ర రాతన, తుగ్గలి, జోన్నగిరి మీదుగా సాగనున ఎన్నికల ప్రచార యాత్ర కర్నూలు జిల్లా తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి కానున్న సీఎం జగన్ ఈరోజు మధ్యాహ్నం అనంతపురం జిల్లాలోకి ప్రవేశించనున్న సీఎం జగన్ బస్సు యాత్ర జొన్నగిరి మీదుగా గుత్తిలోకి ప్రవేశించనున్న ప్రచార రథం గుత్తి శివారులో భోజన విరామం గుత్తి, పామిడి, గార్లదిన్నె, అనంతపురం, రాప్తాడు మీదుగా సాగనున్న సీఎం జగన్ రోడ్ షో ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం శివారులో రాత్రి బస 7:25 AM, March 30th 2024 నేడు మూడు జిల్లాలో చంద్రబాబు పర్యటన నెల్లూరు, తిరుపతి, కడపలో ప్రతిపక్ష నేత ఎన్నికల ప్రచారం సూళ్లురుపేట, నాయుడుపేట, ప్రొద్దుటూరులో టీడీపీ బహిరంగ సభలు ప్రజా గళం సభల్లో పాల్గొననున్న చంద్రబాబు 7:20 AM, March 30th 2024 పిఠాపురం ప్రచారం.. నేడు వర్మ ఇంటికి పవన్ నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం పిఠాపురంలో నాలుగు రోజుల పాటు ప్రచారం శక్తిపీఠం అమ్మవారి ఆలయంలో వారాహి వాహనానికి పూజలు దొంతమూరులోని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి పవన్ వర్మ ఇంట్లో కేడర్, వివిధ వర్గాలతో సమావేశం సాయంత్రం బహిరంగ సభ 7:15 AM, March 30th 2024 ప్రచారంలోకి ఏపీ మాజీ సీఎం నేడు ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరఫున కిరణ్కుమార్రెడ్డి పోటీ శనివారం మదనపల్లెలో రోడ్షోలో పాల్గొననున్న నల్లారి కిరణ్ 7:10 AM, March 30th 2024 పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి టీడీపీ తుదిజాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు అనంతపురంలో పార్టీ కార్యాలయానికి నిప్పు గుంతకల్లు కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు గుమ్మనూరు జయరాం టికెట్పై చెలరేగిన నిరసనలు సత్యవేడులో ఆదిమూలం మాకొద్దంటూ ర్యాలీ చీపురుపల్లి టీడీపీలో ‘కళ’కలం అనపర్తిపై ఫలించని ‘దేశం’ రాయబారం తంబళ్లపల్లెలో ఆవిర్భావ దినోత్సవానికి వర్గపోరు రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు బద్వేలు టీడీపీ అభ్యర్థికే బీజేపీ సీటంటూ ఆగ్రహం ‘గంటా’కు రూ. కోట్లున్నాయని టికెట్ ఇచ్చారంటూ ధ్వజం 7:00 AM, March 30th 2024 టీడీపీ అభ్యర్థి కొలికిపూడికి షాక్.. తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాస్కు షాకిచ్చిన మహిళలు గంపలగూడెం మండలం దుందిరాల పాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొలికపూడి సైకిల్కు ఓటేయాలని కోరిన కొలికపూడి తమకు సైకిల్ వద్దు.. ఫ్యానే కావాలన్న మహిళలు సైకిల్ రాదు.. ఫ్యాన్కే ఓటేస్తామన్న మహిళలు మహిళలు తిరగబడటంతో అక్కడ్నుంచి జారుకున్న కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ శ్రేణులు 6:50 AM, March 30th 2024 ఎమ్మిగనూరు మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ నా కళ్లముందు ఉన్న ఒక దృశ్యం చూస్తూ ఉంటే ఒక మాట చెప్పాలని ఉంది ఎమ్మిగనూరు సభ ఎప్పటికీ సువర్ణాక్షరాలతో చరిత్రలో నిలిచిపోతుంది వాన చినుకులన్నీ చేరి ఒక్కటైనట్లు, బిందు బిందువు చేరి ఒక సింధువు అయినట్లు ఒక జన సముద్రం కనిపిస్తోంది మంచి చేసిన ప్రభుత్వానికి మద్దతుగా చేయి చేయి కలిపినట్లుంది జెండాలు జత కట్టిన వారిని, పేదల వ్యతిరేకులను ఓడించి.. మీ వాడిని, మీ బిడ్డని ఆశీర్వదించడం కోసం, గెలిపించడం కోసం ఇక్కడకి రావడం నా పూర్వ జన్మ సుకృతం మే 13న కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది పెత్తందార్లను ఓడించడానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా?\ నేను మీ సోదరుడిగా అడుగుతున్నాను.. రాఖీ కట్టమని ప్రతీ అక్క చెల్లెమ్మను కోరుతున్నాను.. ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని అక్కా చెల్లెమ్మలను అడుగుతున్నాను నా చేతికి మాత్రమే కాదు.. ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రాఖీ కట్టమని కోరుతున్నాను అక్క చెల్లెమ్మల కోసం 31 లక్షల ఇళ్ల పట్టాలు వారి పేరుతో రిజిస్టేషన్ చేయడమే కాకుండా, అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్న ప్రభుత్వానికి రాఖీ కట్టమని అడుగుతున్నాను. ఎప్పుడూ చూడని విధంగా మహిళల కోసం దిశ యాప్ తీసుకొచ్చిన ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వానికి రక్షా బంధన్ కట్టమని కోరుతా ఉన్నా 6:40 AM, March 30th 2024 కళ్యాణదుర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ టీడీపీకి రాజీనామా యోచనలో కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఉమామహేశ్వర నాయుడును కలిసిన కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం పరిశీలకులు ఎంఆర్సీ రెడ్డి టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించిన నేతలు 6:30 AM, March 30th 2024 టీడీపీ, జనసేనలకు షాక్.. ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమిని వీడుతున్న ముఖ్య నేతలు తాడేపల్లిగూడెంలో ఈలి నాని టీడీపీకి గుడ్బై ఆయన దారిలోనే నూజివీడు మాజీ ఎమ్మెల్యే రామకోటయ్య ఇటీవలే టీడీపీని వీడిన ఎన్ఆర్ఐ గోపాల్ యాదవ్ చేగొండి సూర్యప్రకాశ్, నౌడు వెంకటరమణలు జనసేనకు రాం రాం.. తాజాగా జనసేనకు రాజీనామా చేసిన ముమ్మిడివరం నేత పితాని -
చంద్రబాబు వెన్నులో వణుకు.. అందుకే రూట్ మారిందా?
సాక్షి, చిత్తూరు: ఏపీలో ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహంలా సింగిల్గా వస్తుంటే.. చంద్రబాబు మాత్రం అన్ని పార్టీలతో కలిసి కూటమిగా బయలుదేరారు. మరోవైపు.. చంద్రబాబు తనకు కంచుకోట అని చెప్పుకునే కుప్పంపైనే ఓటమి భయం వెడుతోంది. వెన్నులో వణుకు మొదలైంది. ఈ నేపథ్యంలో కుప్పంపై చంద్రబాబు దృష్టిసారించారు. టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు కుప్పం చేరుకున్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కుప్పం ఓటర్లను ఆకర్షించేందుకు వరాలను ప్రకటించబోతున్నారు. ఇక, గతంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అసలు కుప్పాన్ని పట్టించుకునేవారు. కానీ, ఈసారి మాత్రం ఎన్నికల హాడావుడి మొదలవగానే మొదటగా కుప్పంపైనే ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని గ్రహించిన చంద్రబాబు కుప్పం దారి పట్టారు. ఇదిలా ఉండగా.. 2019 ఎన్నికల నుంచే కుప్పం నియోజకవర్గం ఓటర్లలో మార్పు కనిపించింది. గత ఎన్నికల్లోనే చంద్రబాబుకు మోజార్టీ భారీగా తగ్గింది. దీంతో బాబు సైతం షాకయ్యాడు. ఇక, తాజాగా కుప్పం నియోజకవర్గ పరిధిలో భారీగా దొంగ ఓట్లను తొలగించడంతో అటు చంద్రబాబు, ఇటు టీడీపీలో వణుకు మొదలైంది. మరోవైపు.. ఇటీవలి కాలంలో కుప్పం నియోజకవర్గ పరిధిలో ఎన్నిక ఎలాంటిదైనా వైఎస్సార్సీపీ భారీ మెజార్టీతో గెలుస్తోంది. కుప్పం మున్సిపాలిటీ, స్థానిక సంస్థలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయఢంకా మోగించింది. ఇక, సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు కుప్పం ప్రజలకు దండిగా చేరుతుండటంతో ఓటర్లు సైతం మార్పును కోరుకుంటున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. దీంతో, చంద్రబాబుతో భయం మొదలైంది. -
Bus Yatra: 'మేమంతా సిద్ధం'.. YSRCPలో నయా జోష్
సాక్షి, తాడేపల్లి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు.. మరోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుని అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి మోగించనున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి.. ఎన్నికల సంగ్రామానికి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 21 రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఇక, పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు (విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల) మినహా మిగతా జిల్లాల్లో బస్సు యాత్ర జరగనుంది. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉదయం పూట వివిధ వర్గాలు, రంగాల ప్రజలతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగు పర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కొందరు పార్టీ కార్యకర్తలను, అభిమానులను కూడా కలుస్తారు. సాయంత్రం పార్లమెంట్ నియోజకవర్గంలో బహిరంగ సభ ఉంటుంది. మార్చి 27 బస్సుయాత్ర షెడ్యూల్ బుధవారం ఉదయం 10:56 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుండి కడపకు సీఎం జగన్ 12:20కి ఇడుపులపాయ చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 నుండి 1:20 వరకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్న జగన్ 1:30కి బస్సుయాత్ర ప్రారంభం వేంపల్లి, వి.ఎన్.పల్లి, యర్రగుంట్ల మీదుగా ప్రొద్దుటూరు చేరుకోనున్న బస్సుయాత్ర సాయంత్రం 4 గంటలకు ప్రొద్దుటూరులో బహిరంగ సభలో పాల్గొననున్న వైఎస్ జగన్ అనంతరం దువ్వూరు, చాగలమర్రి మీదుగా ఆళ్లగడ్డ చేరుకోనున్న వైఎస్ జగన్ ఆ రాత్రి ఆళ్లగడ్డలోనే బస చేయనున్న వైసీపి అధినేత మరో 48 గంటలే.. కాగా, వైఎస్సార్సీపీ బస్సుయాత్ర మరో 48 గంటల్లో ప్రారంభం కానుంది. ఈనెల 27న ఇడుపులపాయలో కార్యక్రమం ప్రారంభించిన తర్వాత వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సీఎం జగన్ ప్రొద్దుటూరుకు చేరుకోనున్నారు. ఎర్రగుంట్ల రోడ్డులోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద సీఎం జగన్ విడిది చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకన్యకాపరమేశ్వరి సర్కిల్, సినీ హబ్, ఆర్టీసీ బస్టాండ్, శివాలయం వీధి, రాజీవ్ సర్కిల్, కొర్రపాడు రోడ్డు మీదుగా బస్సు యాత్ర జరగనుంది. ఐదు గంటలకు పొట్టిపాడు రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించనున్నారు. ఇందు కోసం సభ నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నారు. ఫుల్ జోష్లో పార్టీ శ్రేణులు బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకం కానున్నారు. యాత్రలోనే ఎక్కడికక్కడ విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని చెబుతూ.. ప్రతి ఇంటికీ మేలు చేశామని వివరించనున్నారు. గత 58 నెలల్లో డీబీటీ రూపంలో 2.70 లక్షల కోట్లు, నాన్ డీబీటీ రూపంలో రూ.1.79 లక్షల కోట్లు వెరసి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనాన్ని 87 శాతం కుటుంబాలకు చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా గుమ్మం వద్దకే ప్రజలకు ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. చేసిన మంచిని ప్రతి ఇంటా వివరించి.. ఆశీర్వాదం తీసుకోవడానికి చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గత 58 నెలల పాలనలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి నియోజవకర్గం, ప్రతి గ్రామం, ప్రతి ఇంటా కనిపిస్తున్నప్పుడు 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం సుసాధ్యమేనని సీఎం జగన్.. శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు సముద్రంతో పోటీ పడుతూ జనం హాజరయ్యారు. రాప్తాడు, మేదరమెట్ల సభలు రాష్ట్ర చరిత్రలో అతి పెద్ద ప్రజా సభలుగా నిలిచాయి. ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ ప్రభంజనం ‘సిద్ధం’ సభల్లో కళ్లకు కట్టినట్లు కన్పించడంతో పార్టీ శ్రేణులు కదనోత్సాహంతో కదం తొక్కుతున్నాయి. క్లీన్ స్వీపే లక్ష్యంగా అడుగులు టీడీపీ–జనసేన–బీజేపీ శ్రేణులు నైతిక స్థైర్యం కోల్పోయి కకావికలమైతే.. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఈ దశలో సీఎం జగన్ బస్సు యాత్ర వారిలో మరింత ఉత్సాహాన్ని నింపనుంది. క్లీన్ స్వీప్ లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను ‘మేం సిద్ధం.. మా బూత్ సిద్ధం.. ఎన్నికల సమరానికి మేమంతా సిద్ధం’ పేరుతో గ్రామ స్థాయి నుంచి మరింత పటిష్టంగా ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం జగన్ దిశా నిర్దేశం చేస్తారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18న విడుదల కానున్న నేపథ్యంలో, ఆలోగా తొలి దశ ప్రచారంగా బస్సు యాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక మలి విడత ప్రచారాన్ని చేపట్టనున్నారు. -
Check Vote : ఓటు వివరాలు ఇలా తెలుసుకోండి
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికల్లో ప్రతి పౌరుడూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి తరుణంలో ఓటరు జాబితాలో తన పేరు ఉన్నదో? లేదో? అనే ఆత్రుత అందరిలోనూ నెలకొంది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న భారత ఎన్నికల కమిషన్... జాబితాలో ఓటు వివరాలు తెలుసుకునే సదవకాశాన్ని కల్పించింది. జాబితాలో ఓటు లేదని గుర్తిస్తే వెంటనే ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. కొత్తగా ఓటరు నమోదుకు ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసే ఏప్రిల్ 25వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా అనుబంధ జాబితాలో చేరుస్తారు. అందుబాటులో ఓటర్ హెల్ప్లైన్.. ● ఓటరు జాబితాలను పోలింగ్ కేంద్రాల పరిధిలోని బూత్ లెవల్ అధికారి (బీఎల్ఓ), తహసీల్దారు కార్యాలయంలో ఇప్పటికే అధికారులు అందుబాటులో ఉంచారు. ఆయా అధికారిక కార్యాలయాలకు వెళ్లి జాబితాను పరిశీలించి ఓటు హక్కు ఉందో... లేదో నిర్ధారించుకోవచ్చు. అలా కాకపోతే ఆన్లైన్లో చూసుకునే అవకాశాన్ని కూడా భారత ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇందు కోసం ప్రత్యేకంగా ఓటర్ హెల్ప్లైన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ● స్మార్ట్ఫోన్లలో ‘ఓటర్ హెల్ప్లైన్ యాప్’ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఓటరు వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ను గూల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ఆప్షన్లు వస్తాయి. ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై’ కింద వచ్చిన ఆప్షన్లలో ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. ● కంప్యూటర్ ద్వారా ఓటర్ వివరాలు తెలుసుకునే వారు https:// electoralsearch.eci. gov.in/ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. అందులో సెర్చ్ బై ఎపిక్ నంబర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి, ఓటర్ ఐడీ నంబర్, స్టేట్ అనే చోట ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ను క్లికి చేయగానే ఓటు వివరాలు కనిపిస్తాయి. ● ఓటు వివరాలు తెలుసుకునేందుకు 1950 టోల్ ఫ్రీ నంబర్ను సైతం ఎన్నికల కమిషన్ అందుబాటులో ఉంచింది. ఈ నంబర్కు ఫోన్ చేసి ఓటర్ ఐడీ నంబర్ చెబితే... అక్కడి సిబ్బంది ఆన్లైన్లో పరిశీలించి ఓటు ఉందా లేదా అనే విషయం చెబుతారు. ఓటు లేకపోతే నమోదు చేసుకోవాలి.. ఓటు లేదని తెలిస్తే వెంటనే ఓటరుగా నమోదుకు ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీఎల్ఓ, తహసీల్దారు కార్యాలయంలో మాన్యువల్గా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లోనూ ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటు ఉంది. ఫోన్ నంబర్తో అనుసంధానం ఇలా... ఓటును మీ మొబైల్ ఫోన్ నంబర్కు అనుసంధానం చేసుకోవడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైనా మీ ఓటును సవరించాలనో, తొలగించాలనో చూస్తే వెంటనే అనుసంధానం చేసుకున్న నంబర్కు సంక్షిప్త సమాచారం అందుతుంది. ఈ సౌలభ్యం పొందేందుకు వెబ్లింక్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. http:// ceoaperms.ap.gov.in/ AP&MobileNoRegistration/MobileNo Registration.aspx లింక్ను తెరిచి, ఇందులో ఓటరు ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. దాని కిందనే ఫోన్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత ఓటర్ ఐడీకి ఫోన్ నంబర్ అనుసంధానమవుతుంది. -
కోడ్లో ఏం చేయవచ్చు? ఏం చేయొద్దు?
కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ – ఎంసీసీ) అమలులోకి వచ్చింది. ప్రజాస్వామ్య పాలనలో అత్యంత కీలకమైన ఎన్నికలను ఎటువంటి ప్రలోభాలకు తావు లేకుండా.. పూర్తి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, సజావుగా నిర్వహించే లక్ష్యంతో.. వివిధ రాజకీయ పార్టీల ఆమోదంతో కేంద్ర ఎన్నికల సంఘం చాలా దశాబ్దాల కిందటే కోడ్ను రూపొందించింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇందులో అనేక అంశాలను నూతనంగా చేరుస్తూ వచ్చారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు, ప్రజలు ఎన్నికల సమయంలో ఏవిధంగా నడచుకోవాలో కోడ్ వివరిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే ఎదురయ్యే ఇబ్బందులను కూడా పేర్కొంటుంది. తద్వారా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ కోడ్.. కొండంత అండగా నిలుస్తుంది. జిల్లాలో ఎన్నికల కోడ్ అమలుకు నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్యను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతికా శుక్లా నియమించారు. కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులపై కేసులు నమోదు చేయడం, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో వెనుకడుగు వేసేదే లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కోడ్ అమలులో ఉంటుంది. ఏం చేయవచ్చంటే.. ● ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే క్షేత్ర స్థాయిలో వాస్తవంగా ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించవచ్చు. ● వరదలు, కరువు, తెగుళ్లు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లోని ప్రజలకు ఉపశమనం, పునరావాస చర్యలు ప్రారంభించవచ్చు. కొనసాగించవచ్చు. ● ఎన్నికల సమావేశాల నిర్వహణకు మైదానాల వంటి బహిరంగ స్థలాలు, హెలిప్యాడ్లు అన్ని పార్టీలకు, అభ్యర్థులకు అందుబాటులో ఉండాలి. ● సభలు, సమావేశాలు, రోడ్లపై ర్యాలీల నిర్వహణకు స్థానిక పోలీసు అధికారుల నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోవాలి. ఏదైనా సమావేశం జరిగే ప్రదేశంలో నిర్బంధ లేదా నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటే, వాటిని పూర్తిగా పరిగణనలోకి తీసుకుని, తగిన మినహాయింపులు, అనుమతులు పొందాలి. ● అభ్యర్థుల సభలకు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య లౌడ్ స్పీకర్లు, ఇతర సౌకర్యాల వినియోగానికి పోలీసు లేదా సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందాలి. ● సమావేశాలకు భంగం కలిగించే లేదా అశాంతి సృష్టించే వారితో వ్యవహరించేటప్పుడు పోలీసుల సహాయం పొందాలి. ● ఊరేగింపు, ర్యాలీ జరిగే సమయంలో సాధారణ ప్రజల రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఉండాలి. ● ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలి. ● పోలింగ్ శాంతియుతంగా, క్రమబద్ధంగా జరిగేందుకు అన్ని సమయాల్లోనూ ఎన్నికల అధికారులందరికీ సహకరించాలి. ● ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా బ్యాడ్జిలు లేదా గుర్తింపు కార్డులు ధరించాలి. ● ఓటర్లకు జారీ చేసిన గుర్తింపు స్లిప్పులు తెల్ల కాగితం పైనే ఉండాలి. సంబంధిత పార్టీ గుర్తు, అభ్యర్థి లేదా పార్టీ పేరు ఉండరాదు. ● ప్రచార సమయంలో, పోలింగ్ రోజున వాహనాల రాకపోకలపై నిబంధనల మేరకు పరిమితులు పాటించాలి. ●ఓటర్లు, అభ్యర్థులు, వారి ఎన్నికల, పోలింగ్ ఏజెంట్లు మినహా ఇతరులు పోలింగ్ బూత్లోనికి వెళ్లరాదు. సంబంధిత అధికారి సిఫారసు లేఖ ఉన్నవారిని మాత్రం అనుమతిస్తారు. ఈ షరతుల నుంచి ముఖ్యమంత్రి, మంత్రి, ఎంపీ లేదా ఎమ్మెల్యే వంటి ఉన్నత స్థానంలో ఉన్న వారికి సైతం మినహాయింపు లేదు. చేయకూడనివి ● కోడ్ అమలులోకి రాక ముందే వర్క్ ఆర్డర్లు జారీ చేసిన వాటికి సంబంధించి ఏ పనీ ప్రారంభించకూడదు. ● రోడ్ల నిర్మాణం, తాగునీటి సదుపాయం వంటి పనులకు మంత్రులు, ఇతర అధికారులు ఎటువంటి ఆర్థిక గ్రాంట్లు లేదా వాగ్దానాలు ప్రకటించకూడదు. ● మంత్రులు, ఇతర అధికారులు (సివిల్ సర్వెంట్లు తప్ప) కొత్త ప్రాజెక్టులు, పథకాలకు పునాది రాళ్లు వేయకూడదు. ● అధికార పార్టీ సాధించిన విజయాల గురించి ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రకటనలు ఇవ్వరాదు. ● మంత్రులు, అభ్యర్థులు ఓటు వేయడానికి తప్ప, ఏ పోలింగ్ స్టేషన్ లేదా కౌంటింగ్ ప్రదేశంలోకి ప్రవేశించకూడదు. ● ఎలాంటి అధికారిక పనిని ఎన్నికల ప్రచారంతో కలపకూడదు. ● ఓటర్లను ఎటువంటి ఆర్థికపరమైన ప్రలోభాలకు గురి చేయరాదు. ● వివిధ కులాలు, వర్గాలు, మత, భాషా సమూహాల మధ్య పరస్పర ద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఎటువంటి కార్యాచరణకూ ప్రయత్నించకూడదు. ● ఇతర పార్టీల నాయకులు లేదా కార్యకర్తల వ్యక్తిగత జీవితంలోని ఏ అంశంపై విమర్శించరాదు. ● ఆలయాలు, ప్రార్థనా స్థలాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు. ఈ ప్రదేశాల్లో ప్రచార పోస్టర్లు అతికించడం, సంగీతం ప్లే చేయడం నిషేధం. ● పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలో ఓటర్లను మభ్యపెట్టే చర్యలకు పాల్పడటం, బెదిరించడం, ప్రచారం చేయడం నిషేధించారు. ● పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు బహిరంగ సభలు నిర్వహించరాదు. ఓటర్లు పోలింగ్ స్టేషన్ల పరిసరాల్లో తిరగరాదు. ● అభ్యర్థులు, ఓటర్ల అభిప్రాయానికి, కార్యకలాపాలకు వ్యతిరేకంగా ఎవరి ఇంటి ముందు ప్రదర్శనలు లేదా పికెటింగ్ చేయరాదు. ● ఆయా యజమానుల అనుమతి లేకుండా వారి భూమి, భవనం, ప్రహరీ, వాహనాలను ఎవరూ ఉపయోగించరాదు. వారి ఇళ్లపై జెండా కర్రలు కట్టడం, బ్యానర్లు పెట్టడం, నోటీసులు అతికించడం, నినాదాలు రాయడం వంటివి చేయరాదు. ● మరో పార్టీ సమావేశాలు నిర్వహిస్తున్న ప్రదేశాల వెంట ఊరేగింపులు చేపట్టకూడదు. ● ఊరేగింపుల్లో ఎటువంటి ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉండరాదు. ● పోలింగ్ రోజున ఓటర్ స్లిప్పుల పంపిణీ చేసే స్థలం లేదా పోలింగ్ స్టేషన్లకు 100 మీటర్ల పరిధిలో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇతర ప్రచార సామగ్రిని ప్రదర్శించరాదు. ● సంబంధిత అధికారుల నుంచి ముందస్తుగా రాత పూర్వక అనుమతి లేకుండా వాహనాలపై అమర్చిన లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటలకు ముందు, రాత్రి 10 గంటల తర్వాత ఉపయోగించకూడదు. ● రాత్రి 10 గంటలు దాటాక బహిరంగ సభలు, ఊరేగింపులు కొనసాగించడానికి అనుమతి ఉండదు. ● ఎన్నికల కోడ్ అమలు సమయంలో ఎక్కడా మద్యం పంపిణీ చేయరాదు. ● పోలింగ్ రోజున అధికారిక భద్రత కల్పించిన ఏ ఒక్కరూ తన భద్రతా సిబ్బందితో పోలింగ్ స్టేషన్కు 100 మీటర్ల పరిధిలోకి ప్రవేశించరాదు. -
కండువా కప్పుతాం.. పచ్చ కుట్ర మీరే చూడండి
అచ్చంపేట: నిన్నా మొన్నటి వరకు నియోజకవర్గం ఎటో కూడా తెలియని టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎలాగైనా వైఎస్సార్ సీపీకి చెందిన ప్రజాప్రతినిధులను వశపరుచుకునే కుటిల యత్నాలు మొదలు పెట్టారు. ఇంట్లో ఉన్న వారిని సైతం ఇప్పుడే వెళుదువుగానంటూ తీసుకెళ్లి డబ్బు ఎరచూపి బలవంతంగా మెడలో పచ్చ కండువా కప్పి ఫొటోలు తీసి మా పార్టీలో వచ్చాడంటూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టి ఆనందపడి పోతున్నాడు. వివరాల్లోకి వెళితే... అచ్చంపేట–1 ఎంపీటీసీ షేక్ మహిద్దీన్ను ఇంటికి బుధవారం సాయంత్రం కొంతమంది టీడీపీ నాయకులు వచ్చారు. ‘నీతో పనుంది.. వెంటనే వద్దువు రమ్మనమని’ టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ వద్దకు తీసుకెళ్లారు. ఆయన తమ పార్టీలోకి రమ్మంటూ ప్రలోభ పెట్టారు. అయినా వినకపోయే సరికి బలవంతంగా టీడీపీ కండువా కప్పి, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. అది చూసుకుని అవాక్కైన సదరు ఎంపీటీసీ మొహిద్దీన్ గురువారం ఉదయాన్నే ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వద్దకు వెళ్లి తాను వైఎస్సార్ సీపీలోనే ఉన్నానన్నారు. ప్రాణం పోయినా వైఎస్సార్ సీపీని వీడేది లేదని, టీడీపీ వారు తమ పార్టీలోకి రావాలంటూ బలవంతంగా పచ్చ కండవా వేసి ఫొటోలు తీశారంటూ ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్నారు. తిరిగి ఎమ్మెల్యే చేత వైఎస్సార్ సీపీ కండువా కప్పించుకున్నారు. టీడీపీవి చీఫ్ పాలిటిక్స్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ టీడీపీవారు అధికారంలో ఉండగా నియోజకవర్గంలో ఏంచేశారో, ఇకపై ఏంచేస్తారో చెప్పుకునే ధైర్యంలేక ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తూ ప్రజలలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో అలజడులు సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కానీ ప్రజలెవ్వరూ టీడీపీ మాటలు నమ్మే పరిస్థితులలో లేరని, గత 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎవరెవరికి ఎన్ని సంక్షేమ ఫలాలు అందాయో అందరికీ తెలుసునన్నారు. మంచి చేసే వారిని వదులుకునేందుకు ఎవరూ సిద్ధంగా లేరని, మళ్లీ వైఎస్సార్ సీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వివరించారు. జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగసాని బాబు, అచ్చంపేట సర్పంచ్ షేక్ జాని, మాజీ సర్పంచ్ కంబాల వీరబాబు, వ్యవసాయ యూనివర్శిటి మాజీ డైరెక్టర్ నెల్లూరి చంద్రబాబు, పెదకూరపాడు ఎంపీపీ బెల్లంకొండ మీరయ్య, రవి, ఈపూరి శ్రీనివాసరెడ్డి, విప్పర్ల వాసు తదితరులు పాల్గొన్నారు. తప్పు తెలుసుకుని తిరిగొచ్చాం అమరావతి: ప్రలోభాలకు లోనై గురువారం ఉదయం టీడీపీలో చేరిన అమరావతి గాజులపాలెం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు సాయంత్రానికి తమ తప్పు తెలుసుకుని మళ్లీ సొంత గూటికి చేరారు. గురువారం సాయంత్రం క్రోసూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఓర్సు రవి, దేవాళ్ళ పవన్, పల్లపు రాజు, బండారు కోటేశ్వరరావులకు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఈసందర్భంగా ఓర్సు రవి మాట్లాడుతూ మా కాలనీకి చెందిన ఓ వ్యక్తి మభ్యపెట్టి మీటింగ్ ఉందని తీసుకువెళ్లి టీడీపీ కండువాలు కప్పించారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలమైన తమను ఇష్టం లేకుండానే టీడీపీలో చేర్చారన్నారు. నిజం తెలుసుకొని ఇవాళ మళ్లీ పార్టీలోకి తిరిగి వచ్చామన్నారు. టీడీపీ నేతలు ఇలాగే మరికొంత మందిని ప్రలోభాలకు గురిచేయడానికి చూస్తున్నారని ఎవరూ నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు తన్నీరు శ్రీనివాసరావు, కోవూరి వెంకటేశ్వరరావు, నండూరు కరుణకుమార్ పాల్గొన్నారు. -
యువతా మేలుకో... ఓటరుగా దరఖాస్తు చేసుకో
సాక్షి, నంద్యాల: సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. మరో 50 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో ఓటు వేసి మీకు ఇష్టమైన నేతను ఎన్నుకోవచ్చు. ఎన్నికల రోజు ఓటు వేయాలి అంటే ముందుగా మీరు ఓటరుగా నమోదు చేసుకుని ఉండాలి. ఓటరుగా నమోదు చేసుకుని ఉన్నా తుది ఓటరు జాబితాలో మీ పేరు లేకుంటే ఓటు వేసేందుకు అనర్హులు. ఇలాంటి వారి కోసమే కేంద్ర ఎన్నికల సంఘం చివరి అవకాశం కల్పించింది. తుది ఓటరు జాబితాలో పేరు లేని వారు.. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన వారు ఏప్రిల్ 15వ తేదీలోపు ఓటరుగా దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు దరఖాస్తుదారుల వివరాలను పరిశీలించి, అన్ని వివరాలు సక్రమంగా ఉంటే తుది ఓటరు జాబితాలో పేరును చేరుస్తారు. ఆన్లైన్లో... ముందుగా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్వీఎస్పీ.ఇన్ వెబ్సైట్లో మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకుని లాగిన్ అవ్వాలి. ‘రిజిస్టర్ యూజ్ ఏ న్యూ ఓటర్’ పై క్లిక్ చేస్తే ఫాం–6 దరఖాస్తు వస్తుంది. అక్కడే దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని, దాన్ని పూర్తి చేయాలి. తర్వాత మీ ఫోన్ నంబర్కు రెఫరెన్స్ ఐడీ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా అదే వెబ్సైట్లో అప్లికేషన్ స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులోని వివరాల ఆధారంగా బూత్ స్థాయి అధికారి మీ అడ్రస్కు వచ్చి మీ వివరాలను పరిశీలించి, నిర్ధారించుకున్న తర్వాత ఓటరు జాబితాలో మీ పేరు చేరుస్తారు. అలాగే హెచ్టీటీపీఎస్//ఓటర్ పోర్టల్.ఈసీఐ.జీఓవీ.ఇన్ వైబ్సైట్లోకి వెళ్లి మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి. లాగిన్ అయ్యాక వెబ్సైట్లో న్యూ ఓటర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్లి వివరాలు పొందుపరిస్తే నిర్ధారించుకున్నాక మీ పేరు ఓటరు జాబితాలో చేరుస్తారు. మొబైల్లో ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. -
Bus Yatra: జనంలోకి సీఎం జగన్
సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టబోతున్నారు. అధికార పార్టీ వైఎస్సార్సీపీ భారీ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతోంది. ఈ నెల 27వ తేదీ నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో దాదాపు 21రోజులపాటు బస్సు యాత్ర కొనసాగనుంది. ఒక పార్లమెంటరీ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా కొనసాగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా నెలరోజులపాటు మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగనుంది. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా.. ప్రతి రోజూ ఒక జిల్లాలో బస్సు యాత్ర కొనసాగనుంది. తద్వారా ఈ యాత్రలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారాయన. తొలి విడతలో బస్సు యాత్ర, ఆతర్వాత ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు. ( ఫైల్ ఫోటో ) ఇప్పటికే రీజియన్ల వారీగా ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జిల్లాల వారీగా/ పార్లమెంటు నియోజకవర్గాల్లో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రలు నిర్వహించబోతుంది వైఎస్సార్సీపీ. బస్సు యాత్ర సందర్భంగా పూర్తి క్షేత్రస్థాయిలోకి వైఎస్ జగన్ వెళ్లనున్నారు. ఇదీ చదవండి: ప్రతిపక్షాల దిమ్మతిరిగిపోయేలా వైఎస్సార్సీపీ మేనిఫెస్టో!? -
ఆదిలోనే హంసపాదు
కొవ్వూరు: టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన గోపాలపురం మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు కొవ్వూరులో ఆదిలోనే హంసపాదు ఎదురైంది. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పరిచయ కార్యక్రమం నిర్వహించారు. దీనికి బీజేపీ, జనసేన నేతలతో పాటు మాజీ మంత్రి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కేఎస్ జవహర్ వర్గీయులు, టీడీపీ ఆశావహులు డుమ్మా కొట్టారు. తద్వారా రానున్న ఎన్నికల్లో ముప్పిడికి సహకరించేది లేదని చెప్పకనే చెప్పారు. మూడు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా కొవ్వూరు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న వెంకటేశ్వరరావు నిర్వహించిన మొదటి సభలో జనసేన నియోజకవర్గ ఇన్చార్జి టీవీ రామారావుతో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి, ఇతర ముఖ్య నాయకులు, టీడీపీ ఆశావహులు పత్తా లేకపోవడం చర్చనీయాంశమైంది. వెంకటేశ్వరరావు తన ప్రసంగంలో మూడు పార్టీలు అంటూ పదేపదే ప్రస్తావించినప్పటికీ ఈ సభకు టీడీపీలోని కొంత మంది నాయకులు మాత్రమే హాజరు కావడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే తాను పోటీలో ఉంటానని మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించడం, ఆయనకు పార్టీ ఆశావహులు జత కలవడం టీడీపీని కలవరపరుస్తోంది. ఈ ఎన్నికల్లో కొవ్వూరు నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తలారి వెంకట్రావు ప్రస్తుతం గోపాలపురం ఎమ్మెల్యే కూడా. గత ఎన్నికల్లో ఆయన చేతిలో ముప్పిడి 36 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అటువంటి అభ్యర్థిని తిరిగి కొవ్వూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా అది కూడా తలారి వెంకట్రావు పైనే పోటీకి దింపడమేమిటంటూ టీడీపీ శ్రేణులు తల పట్టుకుంటున్నాయి. తాజా పరిణామాలతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. వైఎస్సార్ సీపీ అభ్యర్థి తలారి వెంకట్రావు ఇప్పటికే ఇంటింటి ప్రచారంతో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని ఎదుర్కోవడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
వెన్నుపోటు నేతలకు భంగపాటు
వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్చంద్రబాబు అని తెలిసి కూడా..నాయకులుగా మలిచి.. చట్టసభలకు పంపించిన పార్టీని వెన్నుపోటు పొడిచి మరీ.. ఆయన పంచన చేరారు. తీరా.. వారి అవసరం లేదని అనుకున్న చంద్రబాబు.. కూరలో కరివేపాకులా పక్కన పెట్టేశారు. విజ్ఞత కలిగిన పార్టీకి దూరమై.. విలువల్లేని పార్టీలో చేరి.. ఇప్పుడు వంచనకు గురయ్యామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు నేతలు వైఎస్సార్సీపీని వంచించి.. టీడీపీలో చేరి.. పాపాలు మూటకట్టుకున్నామంటూ అనుచరగణం ఎదుట బోరుమంటున్నారు. సాక్షి, విశాఖపట్నం : ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కేస్తూ.. గెలిపించిన ప్రజల నమ్మకాన్ని.. ఆదరించిన పార్టీ విశ్వాసాన్ని అమ్ముకున్న ప్రజా ప్రతినిధులు.. ఇప్పుడు బేల చూపులు చూస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంతలో పశువుల్లా ఎమ్మెల్యేల్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొనేశారు. ఒడ్డు దాటే వరకే ఓడ మల్లన్న.. ఆ తర్వాత బోడి మల్లన్న అనే సూత్రాన్ని ప్రతిసారీ తూచ తప్పకుండా పాటించే నాయకుడు చంద్రబాబే అన్న విషయం జగమెరిగిన సత్యం. అది తెలిసి కూడా.. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు తల్లిలా ఆదరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి.. టీడీపీ కండువా కప్పేసుకున్నారు. ఇప్పుడా టీడీపీ.. టికెట్ ఇవ్వకుండా బలిపశువుల్ని చేయడంతో రోడ్డున పడ్డారు. ఫిరాయింపుదారుల రాజకీయ పరిస్థితి గాల్లో దీపాల్లా మారిపోయాయి. ‘కిడారి’ సీటుకు కిరికిరి..! రూ.కోట్లు.. మైనింగ్ లైసెన్సుల ఆశ చూపి.. మరో గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుని సైతం ఫిరాయింపు ఎమ్మెల్యేగా ముద్రవేసేశారు చంద్రబాబు. 2014లో వైఎస్ జగన్ నమ్మి అరకు టికెట్ని ఇస్తే.. వైఎస్సార్సీపీ దయతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే.. బాకై ్సట్ మైనింగ్ లైసెన్సుల కోసం ఆశపడుతున్నట్లు గ్రహించిన టీడీపీ.. కిడారికి.. అదే ఎర వేసేసింది. రూ.12 కోట్లు.. మైనింగ్ లైసెన్స్ ఇస్తామని లోకేష్ చెప్పడంతో.. జంప్ అయ్యారు. ఈ విషయాలన్నీ.. మావోయిస్టుల ఎదురుగా.. స్వయంగా కిడారి చెప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు అప్పట్లో చెప్పడం కలకలం రేపాయి. మావోయిస్టుల చేతిలో కిడారి సర్వేశ్వరరావు హత్యకు గురైన తర్వాత.. ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్ని ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా కనీసం అవకాశం ఇవ్వకుండానే ఆగమేఘాలపై చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. సరిగ్గా ఆరు నెలల తర్వాత లోకేష్ కోసం మంత్రి పదవుల సర్దుబాటులో భాగంగా కిడారి శ్రావణ్తో మంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయించేశారు. ఆ తర్వాత 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్గా, పార్లమెంటరీ పార్టీ ఇన్చార్జీగా ఐదేళ్లుగా టీడీపీని అరకులో నిలబెట్టారు. అలాంటి కిడారిని కూడా కరివేపాకులా తీసిపారేయడంతో ఈ యువనాయకుడికి దిక్కుతోచని పరిస్థితి. అధినేతతో మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో భవిష్యత్తు కార్యచరణపై అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. నైరాశ్యంలో ‘వంతల’ గిడ్డి, కిడారి బాటలో చంద్రబాబుని నమ్మి మోసపోయిన జాబితాలో వంతల రాజేశ్వరి కూడా చేరారు. రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. టీడీపీ ఆకర్ష్లో భాగంగా.. తాను పార్టీ మారితే రూ.20 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారంటూ 2016 మార్చిలో సంచలన వ్యాఖ్యలను బహిరంగంగా చేసిన వంతల.. ఏడాది కాలంలోనే వైఎస్సార్సీపీని వీడి.. డబ్బు ఆశ చూపిన పచ్చ కండువానే కప్పుకున్నారు. చట్టసభలకు పంపించిన వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే చివరి వరకూ నా రాజకీయ ప్రయాణమని చెప్పి.. ప్రలోభాల ఎరలో చిక్కుకొని టీడీపీలోకి జంప్ అయ్యారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసినా.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన వంతలను ఇంటిలోనే కూర్చోబెట్టారు. ఆ తర్వాత నియోజకవర్గంలో టీడీపీని బతికించేందుకు వ్యయప్రయాసలతో ఐదేళ్లు పనిచేసినా.. చంద్రబాబు గుర్తించకుండా.. వంతల సేవలకు స్వస్తి చెప్పారు. టికెట్ రాకపోవడంతో రాజేశ్వరి నైరాశ్యంలో కూరుకుపోయారు. పార్టీ కోసం సేవచేసినా.. మిరియాల శిరీషకు టికెట్ రావడంతో చంద్రబాబు తనకు కూడా వెన్నుపోటు పొడిచేశారంటూ సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పుడైనా సరైన నిర్ణయం తీసుకోకుంటే.. ముగ్గురు ఫిరాయింపుదారులకూ టీడీపీ చెక్ పెట్టింది. వైఎస్సార్సీపీకి వెన్నుపోటు పొడిచిన వారందరికీ.. చంద్రబాబు మళ్లీ వెన్నుపోటు పొడిచారంటూ ప్రజలే మాట్లాడుకోవడం విశేషం. రాజకీయాల్లో ఉన్న వారు.. పదవులు కోల్పోయినా.. ఇప్పుడు కాకపోతే మరోసారైనా విజయం దక్కించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే.. సానుభూతిని.. ప్రజలలో విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా చూసుకోవాలి. ఈ విషయంలో మాత్రం వైఎస్సార్సీపీని కాదని టీడీపీకి వెళ్లిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు చంద్రబాబుని నమ్మి పూర్తిగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే వీరి రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడినట్లే అవుతుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పాలుపోని ఈశ్వరి.. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి.. ఎమ్మెల్యేగా విజయం సాధించిన గిడ్డి ఈశ్వరి.. తర్వాత చంద్రబాబు మాయమాటలతో పార్టీ ఫిరాయించేశారు. రూ.5 కోట్ల డీల్ తోపాటు మంత్రి పదవి ఇస్తానని చెప్పి.. చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించడంతో.. అన్నలా ఆదరించిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాదని.. నయవంచకుడి పంచన చేరి.. 2018లో పచ్చ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి గిడ్డికి అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. టీడీపీలో సరైన ప్రాధాన్యమివ్వడం తగ్గించేశారు. 2019 టీడీపీ నుంచి కష్టపడి టికెట్ సాధించి పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీకి అన్యాయం చేసిన గిడ్డి ఈశ్వరిపై విశ్వాసం కోల్పోయిన ప్రజలు.. ఆమెని ఇంటికే పరిమితం చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా ఈశ్వరిని పొమ్మనకుండా పొగపెట్టే ప్రయత్నాలు చేస్తూ.. పొత్తుల్లో భాగంగా టికెట్ని బీజేపీకి కట్టబెట్టేశారు. దీంతో.. గిడ్డి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తన గోడు వినిపించేందుకు వెళ్దామని అనుకున్నా.. చంద్రబాబు రానివ్వడం లేదని తెలుస్తోంది. దీంతో.. గిడ్డి అనుచరులు మండిపడుతున్నారు. రెబల్గా పోటీ చేయాలని పార్టీ శ్రేణులు చెబుతున్నా.. ఏం చెయ్యాలో పాలుపోక నడిసంద్రంలో నిలిచిపోయినట్లు తన పరిస్థితి ఉందని సన్నిహితుల వద్ద వాపోతున్నారు. -
కూటమికి ఓటమి తప్పదు!
రెండో ప్రపంచ యుద్ధం గొప్ప సైన్యాధ్యక్షుడైన జనరల్ మెకార్థర్ ఒక సందర్భంలో ‘‘నిజమైన నాయకుడు ఆత్మవిశ్వాసంతో ఒంటరిగా నిలబడ తాడు, కఠిన నిర్ణయాలకు వెనుకాడడు, ప్రజా సంక్షేమమే తన కర్తవ్యంగా భావిస్తాడు’’ అంటారు. మార్చి పదో తేదీ మేదరమెట్ల సిద్ధం సభలో జగన్ ప్రసంగం విన్న వారు, 58 నెలల పాలన చూసిన వారు జనరల్ మెకార్థర్ చెప్పిన ధీరోధాత్తుడి లక్షణాలు ఆయనలో చూస్తారు. మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు కలిసి కట్టుగా వచ్చినా ప్రజా బలం ఉన్న తనను ఏమీ చేయలేరన్న ఆత్మవిశ్వాసం ఆయనలో కనిపించింది. తన స్టార్ క్యాంపైనర్లు ప్రజలే నంటూ ఒంటరిగానే 175 సీట్లు గెలుస్తామన్న ధీమాను ఆయన మరోసారి వ్యక్తం చేశారు. కూటమిలోని పార్టీల గత ఎన్నికల ఫలితాలు, తాజా పరిణామాలు, సంక్షేమాభివృద్ధి రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతి పరిశీలిస్తే మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.కూటమిలోని ప్రధాన పార్టీ తెలుగుదేశం క్రమంగా ప్రజాదరణ కోల్పోతోంది. ఎన్టీ రామారావు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళి సగటున 43.22 శాతం వోట్లు పొందగా చంద్రబాబు హయాంలో ఐదు సార్లు దేశం పార్టీ ఎన్నికలకు వెళ్ళి 36.20 శాతం వోట్లు పొందింది. చంద్రబాబు హయాంలో సుమారు 7.02 శాతం ఓట్ బ్యాంక్ కోల్పోయిన ఆ పార్టీ ప్రతి ఎన్నికల్లోనూ గతంలో కన్నా తక్కువ ఓట్లు పొందడం విశేషం. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీ రామారావు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కొద్దినెలలకే చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వాన్ని కూల్చి వేశారు. ఆ ఏడాదితో పోల్చితే 1999 ఎన్నికల నాటికి చంద్రబాబు నాయకత్వంలోని పార్టీ సుమారు ఒక శాతం, 2004 ఎన్నికల్లో 6.55 శాతం, 2009 ఎన్నికల్లో 9.47 శాతం, 2014 ఎన్నికలో 15.41 శాతం, 2019 నాటికి 3.54 శాతం ఓట్లు కోల్పోయింది. చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు ఎన్నిక లకు వెళితే రెండు సార్లు మాత్రమే విజయం సాధించింది. అంతేకాక గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ 40 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క సారి కూడా గెలవలేకపోయింది. పొత్తు వల్ల తాను తిరిగి అసెంబ్లీకి ముఖ్యమంత్రిగా వెళతాననే భావనతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఆయనకు మద్దతునిస్తున్న మిత్రుల వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ జరిగినా ఆశ్చర్యపోనక్కర లేదు. కాపుల చిరకాల వాంఛ రాజ్యాధికారం. గతంలో చిరంజీవిని నమ్ముకున్న కాపులు నట్టేట మునిగారు. పవన్ను తమ ఆశయ సాధకుడిగా సామాన్య కాపులతో పాటు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి సీనియర్లు కూడా ఆశించారు. అయితే పవవ్ కమ్మ పాలకవర్గ ప్రతినిధైన చంద్రబాబుతో చేతులు కలిపి ఆయననే ముఖ్యమంత్రి చేయాలనే కృతనిశ్చయంతో ఉండడంతో కాపు సామాజిక వర్గం మరో సారి నిరాశకు గురయింది. అంతే కాక పవన్ గత ప్రసంగాల్లో పట్టుమని పదివేల ఓట్లు తెచ్చుకోలేని వారు కూడా టికెట్లు కావాలంటున్నారని నాయకులను ఎద్దేవా చేశారు. జనసేన పార్టీని కాపుల కోసం మాత్రమే పెట్టలేదంటూ ఆ వర్గాన్ని దూరం చేసుకునే విధంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కులాల ప్రభావం అతిగానే ఉంది. కాపులు– కమ్మల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం రంగా హత్యానంతరం ప్రారంభమైంది. చంద్రబాబుతో పవన్ చేతులు కల పడం, టికెట్ల విషయంలో దిగజారుడు తనాన్ని ప్రదర్శించడం; పవన్కు ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులపై లోకేష్ చేసిన ప్రకటన తదితరాలను చాలామంది కాపులు జీర్ణించు కోలేకపోతున్నారు. గత ఎన్నికల్లో జనసేన, బీజేపీలకు 20 లక్షల వోట్లు మాత్రమే వచ్చాయి. బీజేపీకి ‘నోటా’ కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. అయినా ఆ పార్టీతో పొత్తుకు చంద్రబాబు తహ తహలాడారు. ఆయన తన లక్ష్యమైతే నెరవేర్చుకున్నారుగానీ ఆ పార్టీ వల్ల సంభవించబోయే నష్టాన్ని అంచనా వేయలేక పోయారనిపిస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పట్ల అనుమానంతో, అభద్రతా భావంతో ఉన్నారు. ఈ అభ ద్రతా భావమే వారిని ఏకం చేస్తోంది. కర్ణాటకలో హిజాబ్ వివాదం తర్వాత ముస్లిం పెద్దలందరూ ఏకమై బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్కు మద్దతునిచ్చి ఆ పార్టీ విజయానికి దోహద పడ్డారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తినా ఆశ్చర్య పోనక్కర లేదు. ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల్లో ముస్లిమ్లకు మూడు నుంచి 17 శాతం ఓట్లు ఉన్నాయి. 40 అసెంబ్లీ స్థానాల్లో, ముఖ్యంగా కర్నూలు (17 శాతం), కడప (16 శాతం), గుంటూరు (12 శాతం), అనంతపురం (11 శాతం), నెల్లూరు (10 శాతం), చిత్తూరు (10 శాతం) కృష్ణా (7 శాతం), ప్రకాశం (7 శాతం) జిల్లాల్లో జయాప జయాలపై వీరి ప్రభావం ఉంటుంది. జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ముస్లిమ్ కుటుంబాల్లో 90 శాతం మంది లబ్ధిపొందారు. అందువల్ల వారిలో ఎక్కువ మంది వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికే మద్దతునిచ్చే అవకాశం ఉంటుంది. జగన్ ప్రభుత్వం కాలం మహిళలు, పేదలకు స్వర్ణయుగంగా మారింది. రాష్ట్రంలోని 90 శాతం గృహాలకు సంక్షేమ ఫలాలు అందాయి. గత 58 నెలలుగా ఈ ప్రభుత్వం వీరికి రూ. 12.75 లక్షల కోట్ల సంపద సమకూర్చింది. వీరికి నగదు బదిలీ, సంక్షేమ పథకాల రూపంలో సుమారు రూ. 4 లక్షల కోట్ల రూపాయలు,గృహాల రూపంలో లక్ష కోట్ల రూపాయల లబ్ధి చేకూర్చింది. అంతేకాక మహిళలకు 31 లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా అందజేసింది. ఒక్కో ఇంటి స్థలం కనీస విలువ రెండున్నర లక్షల రూపాయలు అనుకుంటే ఆ 31 లక్షల ఇళ్ళ స్థలాల విలువ సుమారు రూ. 7.75 లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. అంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సంక్షేమ పథకాల విలువ రూ. 12.75 లక్షల కోట్లుగా భావించాలి. ఈ మొత్తం రాష్ట్ర బడ్జెట్ కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ. దేశంలోని మరే రాష్ట్రం పేదలకు, మహిళలకు ఇంత పెద్ద మొత్తంలో సంపద సమ కూర్చలేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయానికి వారే నిర్ణయా త్మక శక్తిగా మారే అవకాశం ఉంది. వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మొబైల్: 89859 41411 -
Pawan Babu : బద్రీ.. దాన్నే వెన్నుపోటు అంటారు..!
-
Pawan - Babu : బద్రీ.. దాన్నే వెన్నుపోటు అంటారు..!
పొత్తు కుదిరిందట.. అసలు దాన్ని పొత్తు అంటారా.? ఆ విషయం తర్వాత ఆలోచిద్దాం కానీ.. ఇంతకీ ఢిల్లీలో ఏం జరిగిందంటే.. కలిసి పోటీచేయాలని మూడు పార్టీలు.. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నిర్ణయించుకున్నాయని కనకమేడల రవీంద్ర కుమార్ ప్రకటించారు. పార్టీల బలబలాలను బట్టి స్థానాల నిర్ణయం ఉంటుందని, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పొత్తు పెట్టుకున్నామని, అధికారం కోసం కాదని ప్రకటించారు. మూడు పార్టీల పొత్తులో రాష్ట్ర భవిష్యత్తు ప్రస్తావన ఏంటో .. ఆయనే చెప్పాలి కానీ చెప్పలేదు. ఈ పొత్తును జాగ్రత్తగా పరిశీలిస్తే.. పాపం పవన్ కళ్యాణ్ అని చిన్నపిల్లలైనా అంటారు. ఈ ఫోటో స్టోరీని కాస్తా సమయం పెట్టి చదవండి. మీరు కూడా అంటారా లేదా అప్పుడు చూద్దాం. వెనకాటికి ఒకడు.. నాది, మా రాజు గారిది కలిపి వంద ఎకరాలు అన్నాట్ట. అలా కాదురా అబ్బి.. నీ కెంత భూమి ఉందని అడిగితే.. మళ్లీ అదే సమాధానం చెప్పాడట. అలా కాదని నీ భూమి ఏది చూపించమంటే.. గట్టు చూపించాడట. అలా ఉంది చంద్రబాబు స్కెచ్. అధికారంలో వాటా ఇస్తాం.. సీట్లలో వాటా ఇస్తాం.. బాబ్బాబు.. కాస్తా రాగలరు అంటూ జైలుకు రప్పించుకుని మరీ పొత్తు ప్రకటన చేయించాడు. నీకు కావాల్సినవన్నీ ఇస్తాం.. కాపులంతా మనకే ఓటేసేలా చూడాలంటూ అదరగొట్టాడు. అప్పటికీ చంద్రబాబు గురించి తెలిసిన కొందరు "అబ్బీ.. ఈ వ్యవహారం షానా డేంజర్" అని పవన్ను హెచ్చరించారు. "గెలిస్తే.. నీకు ముఖ్యమంత్రి పదవి వస్తుందా? కనీసం ఓ నెల పాటయినా నిన్ను కుర్చీలో కూర్చోబెడతారా? అసలు నీకు "అత్తారింటికి దారేది" టైపులో అసెంబ్లీకి దారుందా? " అంటూ జాగ్రత్తగా అడిగితే .. "గుడుంబా శంకర్" గయ్యిమన్నాడు. ఇప్పుడు ఎల్లో మీడియాకు చంద్రబాబు ఇచ్చిన లీకులేంటంటే.. "బీజేపీ, జనసేనకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాలు అలాగే టిడిపికి 145 అసెంబ్లీ స్థానాలు, జనసేన, బీజేపీకి 30 స్థానాలు". ఒకప్పుడు ముఖ్యమంత్రి అవుతా.. ముఖ్యమంత్రి అవుతా.. అని ప్రకటించుకున్న నోటితోనే.. నేను రాజీ పడతా, రాజీ పడతా అని చెప్పుకోవాల్సిన దుస్థితిని చాలా అందంగా క్రియేట్ చేశాడు చంద్రాలు. ఎంతయినా బాబు గారి స్క్రీన్ ప్లే.. అబ్బో.. అదో అంతు లేని కథ. 50,60 సీట్లన్న పవన్ కళ్యాణ్ను 2 డజన్లకు తెచ్చాడు. అప్పటికీ పవన్ ఏమన్నాడు.. 24 అంటే 24 మాత్రమే కాదు, వాటి పక్కన మూడు పార్లమెంటు సీట్లున్నాయి.. అంటే ఓ 40 చోట్ల పోటీ చేస్తున్నట్టు లెక్క.. అని పాతకాలం మార్వాడీ కథ ఒకటి వినిపించాడు. ఇప్పుడు ఆ సీట్లలోనూ కోత.. కాదు కాదు ఊచకోత. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కలుపుకోవాలన్న ఐడియా చంద్రబాబుది. ఆ ఐడియాను అమలు చేయాల్సిన బాధ్యత "అజ్ఞాతవాసి"ది. అందుకే నన్ను నానా మాటలు అంటున్నా.. చీవాట్లు పెడుతున్నా.. కాళ్లు పట్టుకుని పొత్తుకు ఒప్పిస్తున్నానంటూ "గబ్బర్ సింగ్" పలుకులు పలికాడు. ఇక్కడ బాబు మంత్రాంగం ఇప్పుడిప్పుడే సంపూర్ణంగా తెలిసివస్తోంది. గంజి వంచే సమయంలో అన్నం గిన్నెను దించినట్టు.. బీజేపీ అడిగిన సీట్ల మేరకు జనసేన సీట్లలో కత్తెర పడుతుందట. పైగా దీనికి త్యాగం అని పేరు పెడుతున్నారు. సింగిల్గా పోటీ చేయు నాయనా అంటూ "కాటమరాయుడికి" అప్పుడు అర్థం కాలేదు, బాబు వెంట తిరిగితే.. "తీన్మార్" అన్న విషయం కాస్తా ఆలస్యంగా "పంజా" పడిన తర్వాత గానీ అర్థం కావడం లేదు. ఇప్పటిదాకా ఉన్న "ఖుషి" కాస్తా.. ఇప్పుడిప్పుడే ఆవిరవుతోంది. "జల్సా" చేద్దామనుకుని జనం ముందుకు రావాలనుకుంటే.. నిజాయతీగా రావాలి గానీ.. వెన్నుపోటులో పీహెచ్డీ చేసిన వాడెనక వస్తే.. కొట్టాల్సింది "శంకర్ దాదా జిందాబాదే". అన్నట్టు లక్ష పుస్తకాలు చదివిన పవన్ కళ్యాణ్ లిస్టులో "చివరికి మిగిలేది" పుస్తకం ఉందా? లేదా? జన సైనిక్స్.. కాస్తా చెప్పండి ప్లీజ్. -
Vasantha vs Devineni: బల ప్రదర్శనలో ఆంతర్యమేంటి?
జి.కొండూరు: మైలవరం నియోజకవర్గం టీడీపీ నుంచి గత పదిహేనేళ్లుగా ఏకచత్రాధిపత్యం వహించిన దేవినేని ఉమామహేశ్వరరావుకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. ఎమ్మెల్యే అభ్యర్ధిత్వం కోసం బల ప్రదర్శన చేసే స్థాయికి దిగజారాల్సిన వచ్చింది. నాడు దేవినేని ఉమా అన్న దేవినేని వెంకటరమణకు నందిగామ సీటు నిరాకరించి వేరే వ్యక్తికి కేటాయించినప్పుడు రమణ బలప్రదర్శన చేసి సీటు సాధించిన ఘటనలు నేడు మైలవరం నియోజకవర్గంలో రిపీట్ కావడంతో కేడర్ గందరగోళంలో పడింది. ఒక వైపు వసంత వెంకటకృష్ణప్రసాద్ మైలవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిని నేనంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు తన అనుచరులతో కలిసి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. మరో వైపు సీటు నాదేనంటూ దేవినేని ఉమా సైతం తన అనుచరులతో గొల్లపూడిలో శుక్రవారం సాయంత్రం శంఖారావం సభ నిర్వహించారు. నాడు దేవినేని వెంకటరమణ, మరో వ్యక్తికి మధ్య జరిగిన ఆధిపత్య పోరులో రమణ విజయం సాధించినట్లే నేడు వసంత వెంకటకృష్ణప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య జరుగుతున్న సీటు ఫైట్లో ఉమానే పంతం నెగ్గించుకుంటారని ఆయన అనుచరులు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవినేని ఉమా శంఖారావం సభలో మాట్లాడుతూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం నిర్వహించిన సర్వేలో టీడీపీ కేడర్ తమ నిర్ణయాన్ని ప్రకటించారని, మరో రెండు మూడు పర్యాయాలు మైలవరం సీటు తనదేనన్న భావనను అనుచరులకు చెప్పినట్లు తెలిసింది. అంతే కాకుండా వసంత కృష్ణప్రసాద్కు ఎట్టి పరిస్థితులలో సహకరించవద్దని, సాధ్యమైనంత వరకు సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ ప్రచారం చేయాలని అనుచరులకు సూచించినట్లు సమాచారం. దేవినేని ఉమా, వసంత మధ్య ఆధిపత్యపోరు నడుస్తున్న క్రమంలో బొమ్మసాని సైతం తగ్గేదేలేదన్నట్లు మైలవరం టీడీపీ సీటు తనకే కేటాయించాలని కోరుతూ తన అనుచరులను బుధవారం రాత్రి గన్నవరం ఎయిర్పోర్టుకు పంపి నేరుగా చంద్రబాబుకే వినతిపత్రం అందించేలా చేశారు. ఈ క్రమంలో మైలవరం టీడీపీ సీటు కోసం జరుగుతున్న త్రిముఖపోరులో అంతిమంగా నెగ్గేదవెవరో కానీ కేడర్లో ఏర్పడిన గందరగోళానికి మాత్రం ఇప్పటిలో తెరపడేలా లేదు. అధిష్టానం ఆదేశాలను పెడచెవిన పెట్టిన దేవినేని ఉమా శంఖారావం పేరుతో అనుచరులతో సమావేశం మరోవైపు టీడీపీలో చేరేందుకు హైదరాబాద్ వెళ్లిన వసంత -
హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది...
అనకాపల్లి: హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది. పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండగా అసలే టీడీపీ పరిస్థితి దీనంగా ఉంది. దానికి తోడు జనసేనతో పొత్తు బెడిసికొట్టి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా గోడ దూకేస్తున్న దుస్థితి. అందుకే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘కొత్త’ నాటకానికి తెర తీశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. (పాత సీసాలో కొత్త సారా అనాలేమో) ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి కండువాలు కప్పి కొత్తగా చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారు. బుధవారం నాటి నాటకంలో పాత్రధారులు పాత కాపులే అన్న సంగతి తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో అయ్యన్నపాత్రుడి సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి 10 మంది టీడీపీలో చేరినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే టీడీపీ కండువాలు కప్పుకున్న వారంతా గతంలో తమ పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక వేస్తున్న ఎత్తులతో నవ్వువులపాలయ్యామని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్లీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో పార్టీలో చేరడం చాలా సిగ్గుచేటుగా ఉందని నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎద్దేవా చేశారు. ఆయన గురువారం విలేకర్లుతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఉప్పులూరి రంగా, కులం రాము, కంకిపూడి మంగరాజు, చంటిబాబు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరితో పాటు మరో నలుగురు 2019లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులేనని తెలిపారు. వీరికే మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ సుబ్రమణ్యం తదితర్లు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి పులివెందుల టీడీపీ నేత సతీష్రెడ్డి
సాక్షి, తాడేపల్లి: పులివెందుల టీడీపీ నేత సతీష్రెడ్డి వైఎస్సార్సీపీలోకి చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సతీష్రెడ్డి మాట్లాడుతూ, 27 సంవత్సరాలుగా తాను టీడీపీ కోసం పని చేశానని, తాను వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టినా నన్ను సీఎం జగన్ ఆహ్వానించారని పేర్కొన్నారు. ‘‘నాతో వైఎస్సార్సీపీ నేతలు టచ్లోకి వచ్చాక చంద్రబాబు రాయబారం పంపారు. ఇంతకాలం పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు తన స్వార్ధం కోసం మళ్లీ రాయబారం చేశారు. చంద్రబాబు నాయకత్వం రోజురోజుకీ దిగజారిపోయింది. ఇప్పుడు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోంది. సీనియర్లకు గౌరవం లేదు. టీడీపీ ఒక వ్యాపార సంస్థగా మారింది. వైఎస్ ఫ్యామిలీని నేను ఇబ్బంది పెట్టినా జగన్ నా మీద ఎంతో ప్రేమ చూపించారు’’ అని సతీష్రెడ్డి చెప్పారు. ఈ ప్రేమ, ఆప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మంచి ఫ్యామిలీపై నేను ఎందుకు పోరాటం చేశానా అనిపించింది. సీఎం జగన్ ఏం చెబితే అదే చేస్తా’’ అని సతీష్రెడ్డి స్పష్టం చేశారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement