-
భారత్ సేవల రంగం నెమ్మది
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటినెల ఏప్రిల్లో నెమ్మదించింది. హెచ్ఎస్బీసీ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ మార్చిలో 61.2 వద్ద ఉంటే, ఏప్రిల్లో 60.8కి తగ్గింది. అయితే ఈ స్థాయి కూడా 14 ఏళ్ల గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుండటం గమనార్హం. కాగా, ఈ సూచీ 50పై ఉంటే దానిని వృద్ధి బాటగా, దిగువకు పడిపోతే క్షీణతగా పరిగణించడం గమనార్హం. మరోవైపు తయారీ, సేవలు కలగలిపిన హెచ్ఎస్బీసీ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ మార్చిలో 61.8 ఉంటే, ఏప్రిల్లో 61.5కు తగ్గడం మరో అంశం. అయితే ఇది కూడా 14 సంవత్సరాల గరిష్ట స్థాయే కావడం గమనార్హం. -
Income tax: నెల రోజుల్లో 6 లక్షల ఐటీ రిటర్న్స్
ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ స్వీకరణ ప్రారంభమైన నెల రోజుల్లో దాదాపు 6 లక్షల ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిని ఆదాయపన్ను శాఖ అంతే వేగంగా ప్రాసెస్ చేయడం విశేషం. వెరిఫై చేసిన రిటర్న్స్లో దాదాపు మూడింట రెండు వంతులు ఇప్పటికే ప్రాసెస్ అయినట్లు బిజినెస్ లైన్ నివేదించింది.2024-25 అసెస్మెంట్ ఇయర్ (FY25) మొదటి నెలలో ఏప్రిల్ 29 నాటికి 5.92 లక్షలకు పైగా రిటర్న్స్ దాఖలయ్యాయి. వీటిలో 5.38 లక్షలకు పైగా వెరిఫై కాగా 3.67 లక్షల వెరిఫైడ్ రిటర్న్స్ను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్ చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి రోజున అంటే ఏప్రిల్ 1న ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ పోర్టల్ను ప్రారంభించింది.ముందస్తుగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులు త్వరగా రీఫండ్ పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా పెనాల్టీ లేకుండా రిటర్న్స్ను రివైజ్ చేయడానికి లేదా సరిచేయడానికి తగినంత సమయం లభిస్తుంది. అయితే, ఉద్యోగులు మాత్రం కొంత సమయం వేచి ఉంటే మంచిదని సూచిస్తున్నారు. కా 2024-25 అసెస్మెంట్ ఇయర్కు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి జూలై 31 చివరి తేదీ. -
పరిమిత శ్రేణి ట్రేడింగ్
ముంబై: పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఏప్రిల్లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు, ప్రోత్సాహకర తయారీ రంగ పీఎంఐ డేటా, విదేశీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు సూచీలకు దన్నుగా నిలిచాయి. ఇంట్రాడేలో 415 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్ చివరికి 128 పాయింట్లు లాభపడి 74,611 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్లో 74,361 వద్ద కనిష్టాన్ని 74,812 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ రోజంతా 22,568 – 22,711 పాయింట్ల మధ్య ట్రేడైంది. ఆఖరికి 43 పాయింట్లు పెరిగి 22,648 వద్ద నిలిచింది. యుటిలిటి, విద్యుత్ సరీ్వసెస్, ఆటో, మెటల్, కన్జూమర్, ఇంధన, ఫార్మా రంగాల చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. -
ఏప్రిల్లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
న్యూఢిల్లీ: దేశవాప్తంగా ఏప్రిల్లో వాహన విక్రయాలు అంతంత మాత్రంగా సాగాయి. 2024–25 తొలి నెలలో మొత్తం 3.38 లక్షల ఆటో మొబైల్ అమ్మకాలు జరిగాయి. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3.32 లక్షల యూనిట్లతో పోలిస్తే 1.77% మాత్రమే అధికంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిమాండ్ తగ్గడం, అంతకు ముందు రెండేళ్ల అధిక బేస్ ప్రభావం ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ⇒ దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఏప్రిల్లో 168,089 కార్లు విక్రయించింది. గత ఏడాది ఇదేనెలలో అమ్మకాలు 1,60,529 కార్లతో పోల్చితే 5% వృద్ధిని నమోదు చేసింది. ⇒ హ్యుందాయ్ గతేడాది ఏప్రిల్లో మొత్తం 58,201 వాహనాలను విక్రయించగా, ఈ సంఖ్య 9.5% పెరిగి 63,701 యూనిట్లకి చేరింది. ⇒ టాటా మోటార్స్ వాహన విక్రయాలు 11.5% వృద్ధి సాధించాయి. ఏప్రిల్లో 77,521 వాహనాలు అమ్ముడయ్యాయి. ఇవి ఏడాది ఏప్రిల్లో 69,599 యూనిట్లుగా ఉన్నాయి. -
చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ!
చార్ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి. పర్యాటక శాఖ వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్ధామ్ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. -
ఏప్రిల్ 2న ఉత్తరాఖండ్లో ప్రధాని మోదీ బహిరంగ సభ!
రాబోయే లోక్సభ ఎన్నికల కోసం ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఏప్రిల్ 2న ఉత్తరాఖండ్లోని నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ లోక్సభ నియోజకవర్గం రుద్రాపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య కొఠారి ప్రధాని బహిరంగ సభ షెడ్యూల్ వివరాలను తెలియజేశారు. ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ సన్నాహాలు ప్రారంభించింది. ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రుద్రపూర్లో ప్రధాని బహిరంగ సభ ఉండనుంది. ఆ తర్వాత అదే రోజు జైపూర్ రూరల్లోనూ బహిరంగ సభ జరగనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏప్రిల్ 3న పితోర్గఢ్, వికాస్నగర్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్లోని ఐదు లోక్సభ స్థానాల్లో ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారధ్యం వహిస్తున్నారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీలు కూడా బహిరంగసభలు నిర్వహించనున్నారు. -
ఏప్రిల్లో బ్యాంక్ హాలిడేస్ ఇవే.. చూశారా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏప్రిల్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి. ఏప్రిల్ 2024లో సెలవుల జాబితా ఏప్రిల్ 1 (సోమవారం): మిజోరాం, చండీగఢ్, సిక్కిం, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మినహా మిగిలిన రాష్ట్రాల్లో ఇయర్లీ అకౌంట్స్ క్లోజింగ్ కారణంగా బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 5 (శుక్రవారం): బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజు. జుమాత్-ఉల్-విదా కోసం తెలంగాణ, జమ్మూ మరియు శ్రీనగర్లలో బ్యాంకులకు సెలవు. ఏప్రిల్ 9 (మంగళవారం): మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మణిపూర్, గోవా, జమ్మూలో గుఢి పడ్వా/ఉగాది పండుగ/తెలుగు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఏప్రిల్ 10 (బుధవారం): రంజాన్ ( కేరళలోని బ్యాంకులకు హాలిడే) ఏప్రిల్ 11 (గురువారం): చండీగఢ్, గ్యాంగ్టక్, కొచ్చి, సిమ్లా, తిరువనంతపురం మినహా చాలా రాష్ట్రాల్లో రంజాన్ కారణంగా బ్యాంకులకు హాలిడే. ఏప్రిల్ 13 (శనివారం): అగర్తలా, గౌహతి, ఇంఫాల్, జమ్మూ, శ్రీనగర్లలో బోహాగ్ బిహు/చీరోబా/బైసాఖీ/బిజు ఫెస్టివల్ ఏప్రిల్ 15 (సోమవారం): గౌహతి, సిమ్లాలో బోహాగ్ బిహు/హిమాచల్ డే ఏప్రిల్ 17 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, చండీగఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో శ్రీరామ నవమి ఏప్రిల్ 20 (శనివారం): అగర్తలాలో గరియా పూజ కోసం బ్యాంకులకు హాలిడే ఏప్రిల్ 21- ఆదివారం ఏప్రిల్ 27- నాలుగో శనివారం ఏప్రిల్ 28- ఆదివారం బ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి. -
అయోధ్యలో మరో ఉత్సవానికి సన్నాహాలు.. 24 గంటలూ దర్శనం!
అయోధ్యలోని రామాలయంలో బాలక్ రాముని ప్రాణప్రతిష్ఠ అనంతరం ఇప్పుడు మరో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలరాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. అయోధ్యలో బాలరాముని పుట్టినరోజును ఏప్రిల్ 17న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ తలుపులు మూడు రోజుల పాటు 24 గంటలూ తెరచి ఉండనున్నాయి. భగవంతునికి నైవేద్యం సమర్పించేటప్పుడు, అలంకారం చేసేటప్పుడు మాత్రమే తలుపులు మూసివేయనున్నారు. శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు అయోధ్యకు వచ్చే రామభక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం రామాలయ తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటున్నాయి. అయితే బాలరాముని జన్మదిత్సవాన్ని పురస్కరించుకుని దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ మీడియాకు తెలిపారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
ఏపీలో అరబిందో ప్లాంటు సిద్ధం
హైదరాబాద్: ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్–జి (పెన్సిలిన్) ప్లాంటు ఏప్రిల్లో ట్రయల్ రన్కు సిద్ధం అయింది. జూన్లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్, ఎండీ కె.నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్–జి ధర విషయంలో చైనాతో పోటీపడాలన్నది తమ లక్ష్యం అని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్టు వివరించారు. ఏటా 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ఈ కేంద్రం కోసం సంస్థ రూ.2,400 కోట్లు వెచి్చస్తోంది. ఈ ప్లాంటు జూలై–సెపె్టంబర్ కాలంలో పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకోనుంది. 80–90 శాతం పెన్సిలిన్ను కంపెనీ దేశీయంగా విక్రయించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద పెన్సిలిన్ ప్లాంటు ఆమోదం పొందింది. మరో రూ.1,000 కోట్లు.. అరబిందో ఫార్మా 8–10 ప్లాంట్ల ఏర్పాటుకు గడిచిన మూడు నాలుగేళ్లలో రూ.5,000 కోట్లు ఖర్చు చేసింది. వచ్చే రెండేళ్లలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి చేయనుంది. చైనాలో ఏర్పాటు చేస్తున్న ఓరల్ సాలిడ్స్ తయారీ ప్లాంటులో వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని సంస్థ సీఎఫ్వో శాంతారామ్ సుబ్రమణియన్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అరబిందో టర్నోవర్ 3.4–3.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాగా పేర్కొన్నారు. డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలంలో టర్నోవర్ 2.6 బిలియన్ డాలర్లు నమోదైంది. అరబిందో ప్రస్తుతం అంటువ్యాధుల విభాగంలో ఐదు వ్యాక్సిన్ల తయారీలో నిమగ్నమైంది. సంస్థ ఖాతాలో 25 తయారీ, ప్యాకింగ్ కేంద్రాలు ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న 10 ప్లాంట్లు ఒకట్రెండేళ్లలో కార్యరూపం దాల్చనున్నాయి. -
మాఘమాసం.. మంచి ముహూర్తం!
మాఘం...శుభ ముహూర్తాల మాసం. అందుకే అందరూ ఈ మాసం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు.ఈ నెల 11 నుంచి మాఘమాసం ప్రారంభం కానుండగా.. జిల్లాలో పెద్ద ఎత్తున పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కల్యాణ మంటపాల వద్ద సందడి కనిపిస్తోంది. హిందూపురం అర్బన్: వివాహం... ప్రతి ఒక్కరి జీవితంలో అపురూపమైన వేడుక. అందుకే కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలని అందరూ భావిస్తుంటారు. పిల్లల తల్లిదండ్రులైతే మంచి ముహూర్తంలో మూడుముళ్లు వేయించాలని భావిస్తుంటారు. అందుకోసం అవసరమైతే నెలల తరబడి వేచి చూస్తుంటారు. మిగతా మాసాలు ఎలా ఉన్నా మాఘమాసం మాత్రం మంచి ముహూర్తాలను మోసుకువస్తుంది. అందుకే అందరూ ఎదురుచూస్తుంటారు. ఈ నెల 11 నుంచి క్రోదనామ సంవత్సర చైత్రమాసం వరకు (ఏప్రిల్ 26) మూడు నెలల పాటు 30 మాత్రమే వివాహ ముహూర్తాలున్నాయి. తర్వాత శ్రావణ మాసం(ఆగస్టు)లోనే తిరిగి వివాహాలు జరుగుతాయని పండితులు చెబుతున్నారు. అన్నింటికీ డిమాండ్.. ఈ మాఘ మాసంలో జిల్లా వ్యాప్తంగా వేలాది జంటలు ఒక్కటి కానున్నాయి. ఈ మేరకు ఆయా కుటుంబాలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నెల 13న మంచి ముహూర్తం ఉండటంతో జిల్లా వ్యాప్తంగా భారీగా స్థాయిలో వివాహాలు జరగనున్నాయి. సుమారు రెండు నెలల తరువాత మంచి ముహూర్తాలు వస్తుండటంతో ఇప్పటికే కల్యాణ మంటపాలన్నీ ఫుల్ అయ్యాయి. ప్రముఖ దేవాలయాల వద్ద పెళ్లి సందడి కనిపిస్తోంది. ఇక బంగారం, దుస్తుల దుకాణాలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. పురోహితులు, కేటరింగ్, సన్నాయి మేళం, డెకరేషన్స్, సప్లయర్స్కు గిరాకీ పెరిగింది. ప్రధానంగా హిందూపురం, కదిరి, ధర్మవరం ఇలా ప్రధాన పట్టణాలతో పాటు, అక్కడి దేవాలయాల ప్రాంగణాల్లో ఎక్కువ పెళ్లిల్లు జరగనున్నాయి. వివాహ సముహూర్తాలు ఇవే.. మాఘమాసం : ఫిబ్రవరి 13, 14, 17, 18, 24, 28, 29, మార్చి నెల 2, 3 తేదీలు. పాల్గుణం: మార్చి 15, 17, 20, 22, 24, 25, 27, 28, 30 తేదీలు, ఏప్రిల్ 3, 4 తేదీలు. చైత్రం: ఏప్రిల్ 9, 18, 19, 20, 21, 22, 24, 26 తేదీలు. ఏప్రిల్ వరకూ ముహూర్తాలు ఫిబ్రవరి 2 ఆదివారం మొదలు మంచి ముహూర్తాలు. కానీ మాఘమాసంలోనే ఎక్కువగా వివాహాలు జరుగుతాయి. మాఘమాసం ప్రారంభం నుంచి ఏప్రిల్ 26 వరకు మంచి ముహూర్తాలున్నాయి. అవి దాటితే మళ్లీ ఆగస్టులోనే. ఉపనయనాలు, వివాహాలు, గృహ ప్రవేశాలకు ఇదే మంచి తరుణం. – సునీల్శర్మ, పండితులు, హిందూపురం. -
సవాళ్లున్నా... 6.2 శాతం వృద్ధి!
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 6.2 శాతం పురోగమిస్తుందని విదేశీ బ్రోకరేజ్ సంస్థ– యూబీఎస్ నివేదిక పేర్కొంది. విదేశీ ఒత్తిడులు, గృహ రుణ స్థాయిలు 15 సంవత్సరాల గరిష్ట స్థాయిలో (జీడీపీలో 5.8 శాతం) ఉన్నప్పటికీ సానుకూల పాలసీ విధానాలు, రుణ వృద్ధి, తగిన స్థాయిల్లో ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు వంటి స్థూల ఆర్థిక అంశాలు దేశం 2024–25లో 6.2 శాతం వృద్ధి బాటన నడవడానికి దోహదపడతాయని భావిస్తున్నట్లు నివేదిక ఆవిష్కరణ సందర్భంగా యుబీఎస్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ తన్వీ గుప్తా జైన్ పేర్కొన్నారు. నివేదికలోని అంశాల్లో కొన్ని... ► 2023–24లో 6.3 శాతం వృద్ధి అంచనా. 2024–25లో 6.2 శాతంగా ఉంటుందని విశ్వసిస్తున్నాం. వినియోగ రంగంలో వృద్ధి రేటు 4.5 శాతం నుంచి (2023–24 అంచనా), 4.7 శాతానికి మెరుగుపడే వీలుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం మూలధన మరింత విస్తృత ప్రాతిపదికన మెరుగుపడే వీలుంది. ఎన్నికల ముందు నెమ్మదించే అవకాశం ఉన్న ఈ విభాగం, ఎన్నికల అనంతరం వేగం పుంజుకునే వీలుంది. ► 2025–26 నుంచి 2029–30 మధ్య వార్షికంగా భారత్ 6.5 శాతం పురోగమించవచ్చు. 2030లో దేశం 6 ట్రిలియన్ డాలర్ల ఎకనామీగా ఆవిర్భవించే అవకాశం ఉంది. ► డిజిటలైజేషన్, సేవల ఎగుమతుల పురోగతి, తయారీ రంగం పటిష్టత ఎకానమీకి దన్నుగా నిలుస్తాయి. ► 2024–25లో రుణ వృద్ధి 13 నుంచి 14 శాతం ఉండే వీలుంది. ► దేశంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోని వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే రాజకీయ స్థిరత్వం విధాన నిర్ణయాల కొనసాగింపునకు తద్వారా వివిధ రంగాల పురోగతికి దోహదపడే అంశాలు. ► 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం సగటు 5.4 శాతం, 2024–25లో 4.8 శాతం నమోదయ్యే వీలుంది. సరఫరాల పరిస్థితి మెరుగుపడ్డం ఈ అంచనాలకు కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి కేంద్రం నిర్దేశాల ప్రకారం– 4 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను చేరుకోడానికి దీర్ఘకాలం పట్టే వీలుంది. 4 ట్రిలియన్ డాలర్లకు ఎకానమీ: పీహెచ్డీసీసీఐ భారత్ ఎకానమీ విలువ 2024–25లో 4 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్డీసీసీఐ ఒక నివేదికలో పేర్కొంది. 2024–25లో ఈ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని విశ్లేíÙంచింది. 2024 ముగిసే సరికి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ప్రస్తుతం 6.5 శాతం నుంచి 5.5 శాతం వరకూ తగ్గించే వీలుందని కూడా ఇండస్ట్రీ చాంబర్ విశ్లేíÙంచింది. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొంటూ దూసుకుపోతున్న భారత్– 2047 నాటికి ‘వికసిత భారత్ ఎకానమీ’ లక్ష్యాలను చేరుకోగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. 2024లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటు 4.5 శాతంగా ఉంటుందని అంచనావేసింది. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్స్టైల్, దుస్తులు, ఫార్మాస్యూటికల్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టానిక్స్, ఫిన్టెక్ సహా వృద్ధికి ఆశాజనకంగా ఉన్న పలు రంగాలను కూడా ఇండస్ట్రీ సంస్థ గుర్తించింది. నాలుగు విభిన్న కాల వ్యవధులను విశ్లేషణకోసం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కరోనా ముందస్తు సంవత్సరాలు(2018, 2019), కరోనా పీడిత సంవత్సరాలు (2020, 2021), కరోనా తర్వాతి సంవత్సరాలు (2022,2023) భవిష్యత్ అవుట్లుక్ సంవత్సరాలుగా(2024,2025) వీటిని విభజించింది. ఈ నాలుగు కాలాల్లో లీడ్ ఎకనామిక్ ఇండికేటర్స్ ర్యాంకింగ్ను గమనించినట్లు ఇండస్ట్రీ బాడీ పీహెచ్డీసీసీఐ తెలిపింది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
ప్రకృతి వైపరీత్యాలతో 2,038 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రుతుపవనాల కారణంగా సంభవించిన వరదలు, పిడుగులు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 2,038 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. ఇందులో అత్యధికంగా బిహార్లో 518 మంది, ఆ తర్వాతి స్థానంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో 330 మంది చనిపోయారని వివరించింది. ఏప్రిల్ 1–ఆగస్ట్ 17వ తేదీ మధ్య కాలంలో వర్షాలు, వరదలకు సంబంధించిన ఘటనల్లో 101 మంది జాడ తెలియకుండా పోగా 1,584 మంది గాయపడినట్లు పేర్కొంది. వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగుపాటు ఘటనలతో 335 జిల్లాలు ప్రభావితమైనట్టు తెలిపింది. -
ఎన్బీఎఫ్సీలు అవుట్లుక్ మరింత మెరుగు: ఐసీఆర్ఏ
నాన్–బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ–రిటైల్) హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (హెచ్ఎఫ్సీ–రిటైల్) రుణాలు ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగ్గా ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు తన అవుట్లుక్ను ఎగువముఖంగా సవరించింది. ఎన్బీఎఫ్సీల నిర్వహణలోని రిటైల్ రుణాలు (ఏయూఎం) 2023 మార్చి నాటికి రూ.14 లక్షల కోట్లు ఉంటే, 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇది 18 నుంచి 20 శాతం పురోగమించే అవకాశం ఉందని అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 12 నుంచి 14 శాతంగా ఉంది. ఇక హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల రిటైల్ రుణాలు 2023 మార్చి నాటికి రూ.7లక్షల కోట్లయితే, 2023–24లో 12 నుంచి 14 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. ఇంతక్రితం ఈ అంచనా 11 నుంచి 13 శాతం. ఇక మౌలిక రంగానికి సంబంధించి మొత్తం ఎన్బీఎఫ్సీల రుణాలు మార్చి 2023 నాటికి రూ.40 లక్షల కోట్లయితే, ఈ విభాగంలో 2023–24లో క్రితం అంచనాల (10 నుంచి 12 శాతం)కన్నా అధికంగా 13 నుంచి 15 శాతం వృద్ధి నమోదుకావచ్చని పేర్కొంది. -
ఈపీఎఫ్ఓలోకి భారీగా చేరికలు.. సగం మందికిపైగా పాతికేళ్లలోపు వారే!
న్యూఢిల్లీ: రిటైర్మెంట్ ఫండ్ సంస్థ– ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ)లో ఈ ఏడాది ఏప్రిల్లో నికరంగా 17.20 లక్షల మంది సభ్యులు చేరారు. చేరిన మొత్తం ఈ సభ్యుల్లో కొత్త సభ్యుల సంఖ్య 8.47 లక్షలు. ఈ మేరకు విడుదలైన పేరోల్ డేటా ప్రకారం.. 8.47 లక్షల మంది కొత్త సభ్యుల్లో 54.15 శాతం మంది 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్కులు. అంటే కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో మెజారిటీ సభ్యులకు సంఘటిత రంగంలో స్థానం లభించిందన్నమాట. మొత్తం 17.20 లక్షల మందిని తీసుకుంటే, 2023 మార్చితో పోల్చితే (13.40 లక్షల మంది) వీరి సంఖ్య పెరిగింది. ఇక ఏప్రిల్లో రీజాయినర్స్ ఎన్రోల్ అయిన నికర మహిళా సభ్యుల సంఖ్య ఏప్రిల్లో 3.48 లక్షలుకాగా, మార్చిలో వీరి సంఖ్య 2.57 లక్షలు. కొత్త సభ్యులను మాత్రమే తీసుకుంటే 8.47 లక్షల మందిలో 2.25 లక్షల మంది మహిళలు. ఏప్రిల్లో చేరిన నికర సభ్యుల్లో మెజారిటీ (59.20 శాతం మంది) వరుసగా మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, ఢిల్లీలకు చెందినవారు ఉన్నారు. తయారీ, ఐటీ సంబంధ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తరువాతి స్థానాల్లో ఎలక్ట్రికల్, మెకానికల్, జనరల్ ఇంజనీరింగ్, వాణిజ్య సంబంధ సంస్థలు, దుస్తులు, నిర్మాణం, ఎగుమతుల సేవా రంగాలు ఉన్నాయి. 7 కోట్లకుపైగా సభ్యత్వం.. ఉద్యోగి రికార్డుల నవీకరణ నిరంతర ప్రక్రియ. ఈ ప్రాతిపదికన పేరోల్ డేటాను తాత్కాలికమైనదిగా పరిగణించాలి. మునుపటి డేటా ప్రతి నెలా మారుతుంది. ఏప్రిల్ 2018 నుండి (సెప్టెంబర్ 2017 తరువాత కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటూ) పేరోల్ డేటా విడుదలవుతోంది. ఈపీఎఫ్ఓ తన సభ్యులకు సభ్యులకు ఈపీఎఫ్, ఎంపీ చట్టం, 1952 చట్టం కింద లభించే పలు ప్రయోజనాలను అందించడానికి బాధ్యత వహించే సామాజిక భద్రతా సంస్థ. ఇది సభ్యులకు వారి పదవీ విరమణపై భవిష్య నిధి, పెన్షన్ ప్రయోజనాలు అలాగే సభ్యుడు అకాల మరణం సంభవించినప్పుడు వారి కుటుంబాలకు కుటుంబ పెన్షన్, బీమా ప్రయోజనాలను అందిస్తుంది. ఈపీఎఫ్ఓ దాదాపు 7 కోట్ల మందికి పైగా చందాదారులతో రూ.12 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులను కలిగి ఉంది. పటిష్టమైన స్థాయిలో రూ.300 కోట్లకు పైగా మిగులునూ నిర్వహిస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) డిపాజిట్లపై 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.15 శాతం వడ్డీ రేటు చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ఇటీవలే ఆమోదముద్ర వేసింది. డెట్ ఇన్వెస్ట్మెంట్ నుంచి పొందిన వడ్డీ అలాగే ఈక్విటీ పెట్టుబడుల నుంచి వచ్చిన ఆదాయ అంశాలను పరిగణనలోకి తీసు కుని ఈపీఎఫ్ఓ అత్యున్నత స్థాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) వడ్డీరేటును నిర్ణయిస్తుంది. 2015–16లో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను ఈపీ ఎఫ్ఓ ప్రారంభించింది. ఈక్విటీల్లో తన మొత్తం నిధుల్లో 5 శాతంతో ప్రారంభమైన ఈపీఎఫ్ఓ పెట్టుబడులు, ప్రస్తుతం 15 శాతానికి చేరాయి. (అమ్మ ఆశీస్సులతో రూ. 22000 కోట్ల కంపెనీ,అంతేనా..!) ఈఎస్ఐసీ కిందకు కొత్తగా 17.88 లక్షల మంది ఏప్రిల్ నెలలో చేరిక ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కిందకు ఏప్రిల్ నెలలో కొత్తగా 17.88 లక్షల మంది సభ్యులుగా చేరారు. ఈఎస్ఐ అనే సామాజిక భద్రతా బీమా పథకాన్ని ఈఎస్ఐసీ నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ కింద 3 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. ఈఎస్ఐసీ కింద కొత్తగా 30,249 సంస్థలు రిజిస్టర్ చేసుకున్నాయి. (ఈ ఏడాది జోరుగా ఇళ్ల అమ్మకాలు) ఏప్రిల్లో కొత్తగా 17.88 లక్షల మందికి ఉపాధి లభించినట్టు కార్మిక శాఖ తెలిపింది. వీరిలో 8.37 లక్షల మంది సభ్యులు 25 ఏళ్లలోపు వారేనని పేర్కొంది. నికరంగా 3.53 లక్షల మంది మహిళా సభ్యులున్నట్టు తెలిపింది. అంతేకాదు, ట్రాన్స్జెండర్ కేటగిరీ నుంచి 63 మంది సభ్యులుగా చేరారు. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
మే నెలలో నియామకాలు ఓకే
హైదరాబాద్: దేశవ్యాప్తంగా కార్యాలయ ఉద్యోగుల నియామకాలు (వైట్ కాలర్) మే నెలలో 2,849గా ఉన్నాయి. 2023 ఏప్రిల్ నెల నియామకాలతో పోల్చి చూసినప్పుడు 5 శాతం పెరగ్గా, 2022 మే నెలలో నియామకాలు 2,863తో పోల్చినప్పుడు ఎలాంటి వృద్ధి లేకుండా ఫ్లాట్గా నియామకాలు ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, వివిధ రంగాల్లో నియామకాల ధోరణలు భిన్నంగా ఉన్నట్టు పేర్కొంది. ఆయిల్ అండ్ గ్యాస్తోపాటు, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఫార్మా రంగాలు ఈ ఏడాది మే నెలలో నియామకాల్లో వృద్ధిని ముందుండి నడిపించాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాలు ఏకంగా 31 శాతం పెరిగాయి. అదే ఐటీ రంగంలో నియామకాలు 2022 మే నెలతో పోల్చినప్పుడు 23 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశ ఇంధన భద్రతకు ప్రాధాన్యం పెరగడం, రిఫైనరీల విస్తరతో ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో అధిక నియామకాలు ఏర్పడినట్టు తెలుస్తోంది. అంతకుముందు నెలల్లో ఈ రంగంలో నియామకాల్లో వృద్ధి 10–20 శాతం మించకపోవడం గమనార్హం. ► రియల్ ఎస్టేట్లో 22 శాతం, బ్యాంకింగ్లో 14 శాతం అధికంగా నియామకాలు నమోదయ్యాయి. రియల్టీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్కిటెక్ట్, సివిల్ ఇంజనీర్, సైట్ సూపర్ వైజర్ ఉద్యోగాలకు.. బ్యాంకింగ్లో రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్లకు డిమాండ్ నెలకొంది. ► ప్రొడక్షన్ ఇంజనీర్లు, ప్రాసెస్ ఇంజనీర్లు, క్వాలిటీ ఆడిటర్లకు డిమాండ్ ఏర్పడింది. ► హైదరాబాద్, చెన్నై, పుణె నగరాల్లో మధ్య స్థాయి, సీనియర్ ఉద్యోగాల్లో నియామకాలు ఎక్కువగా నమోదయ్యాయి. ► నియామకాలకు నాన్ మెట్రోలు కొత్త కేంద్రాలుగా అవతరిస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. అహ్మదాబాద్లో 26 శాతం, వదోదరలో 22 శాతం, జైపూర్లో 17 శాతం చొప్పున అధిక నియామకాలు (క్రితం ఏడాది మే నెలతో పోల్చినప్పుడు) జరిగాయి. ఇక్కడ బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలు వృద్ధికి మద్దతుగా నిలిచాయి. ► పెద్ద మెట్రోల్లో నియామకాల పరంగా ఫ్లాట్ లేదా క్షీణత నమోదైంది. పెద్ద మెట్రోల్లో ముంబై, ఢిల్లీలో మాత్రం 5 శాతం వృద్ధి కనిపించింది. రియల్ ఎస్టేట్, టెలికం, హెల్త్కేర్, ఆటోమొబైల్ ఇక్కడ వృద్దికి దోహదపడ్డాయి. ► సీనియర్లకు అధిక డిమాండ్ నెలకొంది. 13–16 ఏళ్లు, అంతకుమించి సర్వీసు ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యం ఇచ్చాయి. ► ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల్లో సీనియర్లకు నియామకాల పరంగా ప్రాధాన్యం నెలకొంది. ఇన్సూరెన్స్, హెల్త్కేర్ ఫ్రెషర్లకు అవకాశాలు ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఫ్రెషర్లకు నియామకాల్లో 7 శాతం క్షీణత నమోదైంది. -
మందగించిన మౌలిక రంగాల వృద్ధి..
న్యూఢిల్లీ: క్రూడాయిల్, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, విద్యుత్ ఉత్పత్తి క్షీణించడంతో ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి ఏప్రిల్లో 3.5 శాతానికి పరిమితమైంది. ఇది ఆరు నెలల కనిష్టం. 2022 అక్టోబర్లో చివరిసారిగా ఇన్ఫ్రా వృద్ధి 0.7 శాతంగా నమోదైంది. 2022 ఏప్రిల్లో మౌలిక రంగాల వృద్ధి 9.5 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.6 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఎనిమిది మౌలిక రంగాల గ్రూప్నకు 40.27 శాతం వెయిటేజీ ఉంటుంది. -
ఏప్రిల్లో ఆన్లైన్ హైరింగ్ తగ్గింది
ముంబై: వైట్ కాలర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నియామకాలు ఏప్రిల్లో తగ్గాయని ఫౌండిట్ నివేదిక వెల్లడించింది. 2022 ఏప్రిల్తో పోలిస్తే గత నెలలో ఇది 6 శాతం క్షీణత నమోదైందని వివరించింది. ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ స్టార్టప్స్లో హైరింగ్ పెరిగిందని తెలిపింది. ‘ప్రస్తుత ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు వ్యాపారాలకు సవాలుతో కూడిన వాతావరణాన్ని సృష్టించాయి. నియామకా లు తగ్గినప్పటికీ ఉద్యోగార్థులకు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగావకాశాలు పుష్క లంగా ఉన్నాయి. భారత స్టార్టప్ వ్యవస్థ ఒక మలుపు తీసుకుంది. జాబ్ మార్కెట్ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ నియామకాల విషయంలో మళ్లీ జోరు ప్రదర్శిస్తోంది’ అని తెలిపింది. టాప్–5లో ఎడ్టెక్.. ఉద్యోగావకాశాల పట్ల జాగ్రత్తతో కూడిన సెంటిమెంట్లు కొనసాగుతాయని ఆశిస్తున్నప్పటికీ, అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉంది. ప్రత్యేకించి స్టార్టప్లు ప్రతిభ, ఆవిష్కరణల కోసం డిమాండ్ను పెంచుతూనే ఉన్నాయి. స్టార్టప్ నియామకాల్లో టాప్–5 రంగాల్లో ఎడ్టెక్ ఉంది. బీఎఫ్ఎస్ఐ/ఫిన్టెక్, మీడియా, ఎంటర్టైన్మెంట్ వంటి ఇతర విభాగాలు కూడా స్టార్టప్ హైరింగ్లో గణనీయ డిమాండ్ను కలిగి ఉన్నాయి. ఆరోగ్య సేవలు, బీపీవో విభాగాలు తిరోగమన వృద్ధిని నమోదు చేశాయి. స్టార్టప్స్ హైరింగ్లో 33 శాతం వాటాతో బెంగళూరు టాప్లో నిలిచింది. ఢిల్లీ, ముంబై, పుణే సైతం మెరుగైన ప్రతిభ కనబరిచాయి. జోరుగా రిటైల్ రంగం.. రిటైల్ రంగం 22% వృద్ధి నమోదు చేసింది. ఈ రంగం అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో ఉద్యోగార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఈ వృద్ధికి ఈ–కామర్స్ గణనీయంగా దోహదపడింది. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆన్లైన్ రిటైలర్లకు వేదికైంది. ఈ విస్తరణ రిటైల్ ఔట్లెట్లలో నిపుణులకు డిమాండ్ను పెంచింది. ఉద్యోగార్థులకు పుష్కలమైన అవకాశాలను రిటైల్ రంగం కల్పిస్తోంది. ఇతర విభాగాల్లో ఇలా.. ట్రావెల్, టూరిజం విభాగం 19 శాతం, టెలికం 14, ఎన్జీవో, సోషల్ సర్వీస్ 11, ప్రకటనలు, మార్కెట్ పరిశోధన, పబ్లిక్ రిలేషన్స్ 7, చమురు, వాయువు 3, షిప్పింగ్, మెరైన్లో హైరింగ్ 2 శాతం ఎగసింది. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్స్పై ఆధారపడటం పెరుగుతున్న కారణంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులకు అధిక డిమాండ్ ఉంది. బీఎఫ్ఎస్ఐ 4 శాతం, బీపీవో, ఐటీఈఎస్ విభాగంలో నియామకాలు 13 శాతం క్షీణించాయి. ఆరోగ్య సేవలు, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ 16, ఐటీ–హార్డ్వేర్, సాఫ్ట్వేర్ విభాగాలలో 22 శాతం తిరోగమన వృద్ధి నమోదైందని నివేదిక వివరించింది. -
తగ్గేదేలే అంటున్న మారుతి సుజుకి - గత నెల అమ్మకాలు ఇలా!
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి గత కొంతకాలంగా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పుడు 2023 ఏప్రిల్ నెల అమ్మకాల నివేదికను కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం, మారుతి సుజుకి గత నెలలో మొత్తం 1,60,529 యూనిట్లను విక్రయించినట్లు తెలిసింది. ఇందులో దేశీయ అమ్మకాలు 1,39,519 యూనిట్లు కాగా.. 16,971 యూనిట్లు ఎగుమతులుగా నమోదయ్యాయి. అయితే ఇదే నెల గతేడాది కంపెనీ అమ్మకాలు 1,50,661 యూనిట్లు. మినీ సెగ్మెంట్ విభాగంలో మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. వీటి మొత్తం అమ్మకాలు 14,110 యూనిట్లు. ఇక కాంపాక్ట్ సెగ్మెంట్ విభాగంలో బాలెనొ, సెలెరియో, డిజైర్, స్విఫ్ట్ వంటివి ముందంజలో ఉన్నాయి. ఈ కార్ల అమ్మకాలు 89,045 యూనిట్లు. ఇక ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలలో సియాజ్ 1,017 యూనిట్ల అమ్మకాలను పొందింది. (ఇదీ చదవండి: మార్కెట్లో 'పెబల్ కాస్మోస్ బోల్డ్ ప్రో' స్మార్ట్వాచ్ లాంచ్ - ధర ఎంతంటే?) మారుతి సుజుకి యుటిలిటీ వెహికల్స్ సేల్స్ లో బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్-క్రాస్, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా వంటివి ఉత్తమ అమ్మకాలు పొందాయి. ఈ కార్ల అమ్మకాలు ఏకంగా 90,062 యూనిట్లు. మొత్తం మీద మారుతి సుజుకి అమ్మకాలు గత నెలలో కూడా మంచి స్థాయిలో పెరిగాయి, రానున్న రోజుల్లో కూడా మరిన్ని మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
గత నెలలో పుంజుకున్న గ్లోబల్ సేల్స్!
న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్ల వృద్ధి, ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గుతుండటం తదితర సానుకూల అంశాల ఊతంతో దేశీయంగా తయారీ కార్యకలాపాలు ఏప్రిల్లో పుంజుకున్నాయి. నాలుగు నెలల గరిష్టానికి చేరాయి. ఇందుకు సంబంధించిన పీఎంఐ సూచీ (ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) మార్చిలో 56.4 పాయింట్లు ఉండగా ఏప్రిల్లో 57.2 పాయింట్లకు పెరిగింది. సూచీ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. అంతర్జాతీయంగా అమ్మకాలు పెరుగుతుండటం, సరఫరా వ్యవస్థపరమైన పరిస్థితులు మెరుగుపడుతుండటం వంటివి కూడా ఇందుకు దోహదపడినట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోల్యానా డి లిమా తెలిపారు. దీనికి సంబంధించిన సర్వే ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు ఫ్యాక్టరీ ఆర్డర్లు, ఉత్పత్తి వృద్ధి రేటు పటిష్టంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరిగిందని, తగ్గిపోయే నిల్వలను భర్తీ చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు కూడా మరింతగా ముడి సరుకులను కొనుగోలు చేస్తున్నాయని లిమా వివరించారు. భారతీయ తయారీ సంస్థలు ముందుకు దూసుకెళ్లడానికి పుష్కలమైన అవకాశాలు కనిపిస్తున్నాయని లిమా పేర్కొన్నారు. మార్కెట్లో సానుకూల పరిస్థితులు, డిమాండ్ మెరుగ్గా ఉండటం వంటి అంశాలు కొత్త ఆర్డర్లకు దోహదపడుతున్నాయని చెప్పారు. -
ఏప్రిల్లో ఇంధన అమ్మకాలు పెరగటానికి కారణం ఇదే!
న్యూఢిల్లీ: రబీ పంటల కోత పనులు ప్రారంభం కావడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం వంటి అంశాల దన్నుతో ఏప్రిల్లో ఇంధనాలకు డిమాండ్ పెరిగింది. గతేడాది ఏప్రిల్తో పోలిస్తే డీజిల్ అమ్మకాలు 6.7% పెరిగి 7.15 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయి. నెలవారీగా చూస్తే మార్చితో పోల్చినప్పుడు 4.8% వృద్ధి నమోదైంది. సోమవారం వెలువడిన గణాంకాల ప్రకారం.. పెట్రోల్ అమ్మకాలు ఏప్రిల్లో వార్షికంగా 2.5% పెరిగి 2.64 మిలియన్ టన్నులకు చేరగా, నెలవారీగా మాత్రం స్వల్పంగా 0.5% మేర తగ్గాయి. రబీ పంటల కోతకు ట్రాక్టర్లను ఉపయోగిస్తుండటం వల్ల డీజిల్ వినియోగం పెరుగుతుంది. -
ఆర్థిక ఫలితాలు, ఎఫ్అండ్వో ఎఫెక్ట్!
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లపై ఈ వారం ప్రధానంగా రెండు అంశాలు ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నెల డెరివేటివ్ సిరీస్ గడువు గురువారం(27న) ముగియనుంది. అంటే ఏప్రిల్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు తీరనుంది. దీంతో ట్రేడర్లు తమ పొజిషన్లను మే నెలకు రోలోవర్ చేసుకునే అవకాశముంది. మరోపక్క ఇప్పటికే ప్రారంభమైన క్యూ4(జనవరి–మార్చి) త్రైమాసిక ఫలితాల సీజన్ ఊపందుకోనుంది. గత ఆర్థిక సంవత్సరం(2022–23) చివరి త్రైమాసిక ఫలితాలతోపాటు.. పూర్తి ఏడాది పనితీరును సైతం దేశీ కార్పొరేట్ దిగ్గజాలు వరుస గా వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫలితాలు ప్రకటించగా.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, ప్రయివేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్ వారాంతాన పనితీరును వెల్లడించాయి. దీంతో సోమవారం(24న) రిలయ న్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ కౌంటర్లపై ఫలి తాల ప్రభావం కనిపించనున్నట్లు మార్కెట్ నిపుణు లు తెలియజేశారు. వెరసి మార్కెట్లు ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఫలితాల జోరు ఈ వారం మరిన్ని కంపెనీలు గతేడాది చివరి త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్ ఈ నెల 24న, బజాజ్ ఆటో, నెస్లే ఇండియా, టాటా కన్జూమర్ ప్రొడక్టŠస్ 25న, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ టవర్స్, ఎల్అండ్టీ టెక్నాలజీ సర్వీసెస్, మారుతీ సుజుకీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సాఫ్ట్వేర్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 26న ఫలితాలు వెల్లడించనున్నాయి. ఈ బాటలో ఇతర దిగ్గజాలు ఏసీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, హిందుస్తాన్ యూనిలీవర్, ఎల్టీఐ మైండ్ట్రీ, టెక్ మహీంద్రా, విప్రో 27న, ఎల్అండ్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, ఎంఅండ్ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్, అల్ట్రాటెక్ సిమెంట్ 28న క్యూ4తోపాటు.. పూర్తి ఏడాదికి పనితీరును తెలియజేయనున్నాయి. ఇతర అంశాలూ కీలకమే నెలల తరబడి రష్యా– ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొ నసాగుతుండటం, అమెరికా, యూరప్లలో బ్యాంకింగ్ ఆందోళనలు, ఆర్థిక మాంద్యంపై ఆందోళనలు వంటి అంశాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లలో నెలకొనే ట్రెండ్ దేశీయంగానూ ప్రభావం చూపనుంది. దీనికితోడు ఇటీవల డాలరుకు పోటీ గా చైనా యువాన్ తదితర కరెన్సీలపై పలు దేశాలు దృష్టి సారిస్తున్నాయి. ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి కొంతమేర రికవరీ సాధించినప్పటికీ తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ముడిచమురు ధరలకు సైతం ప్రాధాన్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. విదేశీ అంశాలకూ ప్రాధాన్యం దేశీయంగా సెంటిమెంటును ప్రభావితం చేయగల విదేశీ అంశాల విషయానికి వస్తే.. మార్చి నెలకు మన్నికైన వస్తువుల ఆర్డర్ల గణాంకాలను ఈ నెల 26న యూఎస్ విడుదల చేయనుంది. మార్చి నెలకు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు ఈ నెల 27న వెల్లడికానున్నాయి. బ్యాంక్ ఆఫ్ జపాన్(బీవోజే) వడ్డీ రేట్లపై నిర్ణయాలను 28న ప్రకటించనుంది. ఇప్పటికే అనుసరిస్తున్న సరళతర విధానాలనే బీవోజే మరోసారి అవలంబించే వీలున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారమిలా.. ఆటుపోట్ల మధ్య దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. అయితే బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు నామమాత్రంగా బలపడ్డాయి. గత వారం సెన్సెక్స్ 776 పాయింట్లు క్షీణించి 59,655 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 204 పాయింట్లు తక్కువగా 17,624 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం లాభంతో 24,845 వద్ద, స్మాల్ క్యాప్ 0.3 శాతం పుంజుకుని 28,234 వద్ద నిలిచాయి. ఎఫ్పీఐల పెట్టుబడులు దేశీ మార్కెట్లను ప్రభావితం చేయగల విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) కొత్త ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల(ఏప్రిల్)లో ఇప్పటివరకూ నికరంగా రూ. 8,643 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత నెల(మార్చి)లోనూ ఎఫ్పీఐలు నికరంగా రూ. 7,936 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేసిన విషయం విదితమే. ఇందుకు ప్రధానంగా అదానీ గ్రూప్ కంపెనీలలో యూఎస్ సంస్థ జీక్యూజీ పార్ట్నర్స్ రూ. 7,936 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దోహదపడింది. ఈ నెల తొలి రెండు వారాలలో ఎఫ్పీఐలు ఫైనాన్షియల్ రంగ స్టాక్స్లో రూ. 4,410 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! అయితే గతేడాది(2022–23) ఎఫ్పీఐలు దేశీ స్టాక్ మార్కెట్ల నుంచి నికరంగా రూ. 37,631 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు, రష్యా– ఉక్రెయిన్ యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపాయి. -
ఎగుమతులు 900 బిలియన్ డాలర్ల పైనే..!
న్యూఢిల్లీ: భారత్ వస్తు, సేవల ఎగుమతులు ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 900 బిలియన్ డాలర్లను దాటే అవకాశం ఉందని ఎగుమతిదారులు అంచనావేస్తున్నారు. అమెరికాసహా కీలక ప్రపంచ మార్కెట్లలో దేశీయ వస్తువులకు పటిష్ట డిమాండ్, అలాగే వాణిజ్య ఒప్పందాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు దోహదపడతాయన్నది వారి విశ్లేషణ. రష్యా వంటి ఇతర దేశాల్లో డిమాండ్ కూడా భారత్ ఎగుమతులకు దోహదపడే అంశమని వారు పేర్కొంటున్నారు. ఆయా దేశాలకు ముఖ్యంగా వ్యవసాయ, ఆహార ప్రాసెసింగ్ రంగాలలో భారీ ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. 2023–24లో 500 నుంచి 510 బిలియన్ డాలర్ల మేర వస్తు ఎగుమతులు జరిగే అవకాశం ఉందని భారత్ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఎఫ్ఐఈఓ) పేర్కొంది. దీనితోపాటు సేవల ఎగుమతులు సైతం 2022–23తో పోల్చితే (322.72 బిలియన్ డాలర్లు) భారీగా 390 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. 2021–22లో భారత్ వస్తు ఎగుమతులు 422 బిలియన్ డాలర్లు ఉంటే, 2022–23లో 6 శాతం పెరిగి 447.5 బిలియన్ డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే. అంచనాలు ఇలా... ► అంతర్జాతీయ వాణిజ్యంలో మన రూపాయికి కూడా తగిన స్థాయిని కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం... ఎగుమతులకు సంబంధించి లావాదేవీల వ్యయాలను తగ్గిస్తుంది. ► పర్యాటకం, రవాణా, వైద్యం, ఆతిథ్యం సహా పలు రంగాలు గతేడాది వృద్ధికి దోహదం చేశాయి. ఐటీ, ఐటీ ఆధారిత సేవల ఎగుమతులు బలంగా సాగుతున్నాయి. యాత్రల రంగం త్వరలో వృద్ధి బాట పట్టనుంది. ► కరోనా అనంతర ఆర్థిక పునరుద్ధరణ విదేశీ మార్కెట్ల నుండి వస్తువులు, సేవలకు పెరుగు తున్న డిమాండ్ను సృష్టించింది. సరుకు రవాణా ఛార్జీల స్థిరీకరణ, సరఫరా వ్యవస్థ సాధారణీకరణ రవాణా రంగానికి సానుకూల పరిణామాలు. ► ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లీగల్, అకౌంటింగ్ సేవలు, పరిశోధన, మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వంటి వ్యాపార సేవలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అందించిన అవకాశాలను సద్వినియో గం చేసుకోవడంలో ప్రయోజనం పొందుతాయి. ► ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో వృద్ధికి గణనీయమైన అవకాశం ఉంది. ఎగుమతి గమ్యస్థానాల వైవిధ్యం సంప్రదాయ మార్కెట్లపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఎగుమతులకు కొత్త అవకాశాలను తెరవడానికి సాయపడుతుంది. ► ఎగుమతుల పురోగతే లక్ష్యంగా దేశం ఇటీవల ఆవిష్కరించిన విదేశీ వాణిజ్య పాలసీ (ఎఫ్టీపీ)ని భారత్ను ఈ రంగంలో వృద్ధి బాటన నడుపుతుంది. 2030 నాటికి దేశ ఎగుమతులను ఏకంగా 2 ట్రిలియన్ డాలర్లకు చేర్చడంతో పాటు రూపాయిని గ్లోబల్ కరెన్సీగా చేయాలని పాలసీ దోహదపడుతుందన్న విశ్వాసం ఉంది. ► వృద్ధి రేటును మరింత పెంచేందుకు కొన్ని ప్రో త్సాహకాలు అవసరం ఎంతైనా ఉంది. ప్రభు త్వం సరైన సహాయంతో గేమింగ్, ఎంటర్టైన్మెంట్లు చాలా బాగా పని చేస్తాయి. మిగిలిన రంగాలకూ తగిన సహాయ సహకారాలు అందాలి. ఎఫ్టీఏల దన్ను... వస్తు, సేవల ఎగుమతులు రెండూ కలిసి 2023–24లో విలువ 900 బిలియన్ డాలర్లుగా ఉండే వీలుంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఆ మార్కెట్లలో ఎగుమతులను పెంచడానికి భారీ వేదికను అందిస్తాయి. ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా భారత్ ఎగుమతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఎందుకంటే ప్రోత్సా హకాల కారణంగా దేశీయ ఉత్పత్తి పెరుగుతుంది. – అజయ్ సహాయ్, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ జనరల్ ఆర్డర్ బుక్ పటిష్టం అమెరికా ఆర్థిక వృద్ధి పుంజుకుంటుందన్న సంకేతాలు ఉన్నాయి. భారత్ ఎగుమతుల్లో అమెరికా మార్కెట్ వాటా దాదాపు 18 శాతం. ఎగుమతులకు సంబంధించి ఆర్డర్ బుక్ బాగుంది. ఇదే ట్రెండ్ 2023–24 అంతా కొనసాగుతుందని భావిస్తున్నాం. దీనితో వస్తు ఎగుమతులు 500 బిలియన్ డాలర్లు దాటతాయని భావిస్తున్నాం. – ఎస్సి రాల్హాన్, హ్యాండ్ టూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యుద్ధ ప్రభావం తగ్గుతోంది 2022–23 కంటే 2023–24 ఆర్థిక సంవత్సరం ఎగుమతులుకు బాగుంటుందని భావిస్తున్నాం. మన పరిశ్రమపై రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం తగ్గిపోతోంది. ఎందుకంటే వాణిజ్యం–ఇంధన వనరులకు పరిశ్రమ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. భారతదేశంలో మౌలిక సదుపాయాలలో గణనీయమైన మెరుగుదల ఉంది. అది ఎగుమతిదారులకు గట్టి మద్దతునిస్తుంది. – శారదా కుమార్ సరాఫ్, టెక్నోక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ చైర్మన్ 2022–23కంటే బెటర్... గత ఆర్థిక సంవత్సరం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు పటిష్టంగా ఉంటాయని విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా... కార్మికరంగం ఆవశ్యకత ఉన్న రంగాలు మంచి పనితనాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఇది ఎగుమతులకు దోహపదడే అంశాల్లో ఒకటి. – ఖలీద్ ఖాన్, జికో ట్రేడింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ -
భారత్ వృద్ధి రేటు 5.9 శాతమే!
వాషింగ్టన్: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏప్రిల్తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో (2023–24) 5.9 శాతానికి పరిమితం అవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తాజాగా అంచనావేసింది. ఈ మేరకు క్రితం 6.1 శాతం అంచనాలకు 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. అయితే 5.9 శాతం వృద్ధి సాధించినప్పటికీ, ఇది ప్రపంచంలోనే వేగవంతమైన వృద్ధి రేటు కావడం గమనార్హం. సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ పటిష్ట పనితీరును కనబరుస్తుందని అభిప్రాయపడింది. కాగా, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు అంచనాలను 6.8 శాతంగా ఐఎంఎఫ్ ప్రపంచ వార్షిక ఎకనమిక్ అవుట్లుక్ అంచనావేస్తోంది. 2024–25లో భారత్ వృద్ధి రేటు అంచనాలను సైతం క్రితం (జనవరిలో) 6.8 శాతం అంచనాల నుంచి అవుట్లుక్ 6.3 శాతానికి తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా భారత్ వృద్ధికి సంబంధించి ఐఎంఎఫ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. 2022–23లో 7 శాతం, 2023–24లో 6.4 శాతం వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23 భారత్ జీడీపీ అధికారిక గణాంకాలు వెలువడాల్సి ఉంది. నివేదికలో మరికొన్ని అంశాలు చూస్తే... ► 2023లో చైనా వృద్ధి రేటు 5.2 శాతంగా ఉంటుంది. 2024లో ఈ రేటు 4.5 శాతానికి తగ్గుతుంది. అయితే 2022లో నమోదయిన 3 శాతం వృద్ధిరేటు కన్నా తాజా అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. ► మహమ్మారి, ఉక్రెయిన్పై రష్యా యుద్ధం వల్ల ఎదురవుతున్న సవాళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నట్లే కనబడుతోంది. చైనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సరఫరాల సమస్యలు తొలుగుతున్నాయి. అయితే ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిలో భాగంగా సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానమే వృద్ధికి ప్రతికూలతలు సృష్టించవచ్చు. ► ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో 2.8 శాతంగా నమోదుకావచ్చు. 2024లో ఈ రేటు 3 శాతానికి పెరుగుతుందని అంచనావేస్తున్నాం. ► 2022లో 8.7 శాతంగా ఉన్న గ్లోబల్ ఇన్ఫ్లెషన్ (అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం) 2023లో 7 శాతానికి, 2024లో 4.9 శాతానికి తగ్గవచ్చు. ► యూరోజోన్, బ్రిటన్లు మందగమనం అంచన నిలబడ్డాయి. యూరోజోన్లో 2023లో కేవలం 0.8 శాతం వృద్ది నమోదయ్యే అవకాశం ఉంది. బ్రిటన్లో అసలు వృద్ధిలేకపోగా 0.3 శాతం క్షీణత నమోదుకావచ్చు. అయితే 2024లో ఈ రేట్లు వరుసగా 1.4 శాతం, 1 శాతం వృద్ధి బాటకు మళ్లవచ్చు. -
Fact Check: ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో భారీ భూకంపం?
న్యూఢిల్లీ: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. మార్చి 21న అఫ్గనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో 187 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దీంతో ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హర్యానా, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భూమి కంపించింది. రిక్టర్స్కేలుపై తీవ్రత 6.5 గా నమోదైంది. భూకంపం దాటికి ప్రజలు ఆందోళనకు గురై. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే తాజాగా ఏప్రిల్ మొదటి వారంలో ఢిల్లీలో మరోసారి భారీ భూకంపం రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే నెలలో దేశ రాజధానిలో రిక్టర్ స్కేల్పై 9.8 తీవ్రతతో భూకంపం సంభవించనున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని జాతీయ మీడియా సంస్థ (timesnow) ఫ్యాక్ట్ చెక్ చేయగా వీటిని అసత్య ప్రచారాలుగా తేల్చింది. ఏప్రిల్లో ఢిల్లీలో భూకంపం చోటు చేసుకోనున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని.. అదంతా ఫేక్ అని స్పష్టం చేసింది. ఇదిలాఉండగా.. మార్చి 21న ఢిల్లీతోపాటు పాకిస్తాన్, అఫ్గనిస్తాన్లో పలు ప్రాంతాల్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. భూకంపం ధాటికి కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి, కొండచరియలు విరిగిపడ్డాయి. పాక్లో భూకంపం ధాటికి ఇద్దరు మహిళలు సహా 9 మంది ప్రాణాలు కోల్పోగా 160 మందికిపైగా గాయపడ్డారు. అఫ్గనిస్తాన్ ఈశాన్య లాగ్మాన్ ప్రావిన్స్లో ఇద్దరు మరణించగా ఎనిమిదిమంది గాయపడ్డారు. చదవండి: చీరకట్టులో ఫుట్బాల్ ఇరగదీసిన మహిళలు.. వీడియో వైరల్..
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడత బరిలో..695 మంది
- అ్రస్టాజెనెకా టీకాలు వెనక్కి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Advertisement