-
రోజు ఉదయం ఆవు మూత్రం తాగుతా..
ఆవు మూత్రానికి భారతీయ సంస్కృతిలో చాలా ప్రాధాన్యత ఉంది. ఇప్పటికి గ్రామాల్లో చిన్న పిల్లలకు ఆవు పంచకంతో ఒక్కసారి అయిన స్నానం చేయిస్తారు. ఇక చాలా మంది దీన్ని సేవిస్తారు. ఈ నేపథ్యంలో హీరో అక్షయ్ కుమార్ తాను ప్రతి రోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ఆయుర్వేద పరంగా ఇది ఎంతో మంచిదన్నారు. అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. అక్షయ్ ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షోలో పాల్గొన్న సంగతి తెలిసిందే. దానిలో భాగంగా ఏనుగు మలవిసర్జనతో చేసిన టీని తాగారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం బేర్ గ్రిల్స్, హ్యూమా ఖురేషిలతో ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్లో పాల్గొన్నారు అక్షయ్. దానిలో భాగంగా హ్యుమా ఖురేషి ‘ఆ ప్రత్యేకమైన టీని తాగమని అక్షయ్ని ఎలా ఒప్పించారని’ బేర్ గ్రిల్స్ని అడిగింది. అందుకు ‘ఆ పని ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ చెడ్డ పని మాత్రం కాదు’ అన్నారు బేర్ గ్రిల్స్. (చదవండి: రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్) ఇంతలో అక్షయ్ ‘నేను ప్రతి రోజు ఆము మూత్రం తాగుతాను. కాబట్టి ఈ టీ తాగడానికి నేను పెద్దగా భయపడలేదు.. ఆశ్చర్యపడలేదు’ అని తెలిపారు. అక్షయ్ ఆవు మూత్రం తాగుతానని తెలపడం ఇదే ప్రథమం. ఈ సమాధానంతో హ్యుమా ఖురేషీతో పాటు నెటిజనులు కూడా ఆశ్చర్యపోయారు. అక్షయ్ మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదపరంగా ఆవు మూత్రం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేను ప్రతి రోజు సేవిస్తాను. ఏనుగు వ్యర్థాలతో చేసిన టీ కూడా ఆయుర్వేదపరంగా మంచిదే. అందుకే తాగడానికి ఇబ్బంది పడలేదు’ అని తెలిపారు. ఇక ‘ది వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ షో రేపు (సెప్టెంబర్ 11) రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ చానల్లో.. సెప్టెంబర్ 14 న రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో టెలికాస్ట్ అవుతుంది. View this post on Instagram @beargrylls @iamhumaq @discoveryplusindia @discoverychannelin A post shared by Akshay Kumar (@akshaykumar) on Sep 10, 2020 at 2:06am PDT -
బేర్గ్రిల్స్తో సాహసయాత్రలో అక్షయ్ కుమార్!
ముంబై: డిస్కవరీ ఛానల్లో ప్రసారమయ్యే ‘ఇన్ టూ ది వైల్డ్’ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అడవిలో ఉండే జంతువులను, సాహోసపేతమైన చర్యలను ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం గురించి తప్పక తెలిసి ఉంటుంది. ఈ కార్యక్రమానికి హోస్ట్గా సాహసవీరుడు బియర్ గ్రిల్స్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. భారతదేశం నుంచి ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అలాగే సూపర్స్టార్ రజనీ కాంత్ పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో బేర్ గ్రిల్స్తో పాటు హీరో అక్షయ్కుమార్ కూడా పాల్గొన్నారు. చదవండి: రజనీకాంత్ వర్సెస్ బియర్ గ్రిల్స్ ఇందుకు సంబంధించిన టీజర్ను అక్షయ్ కుమార్ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ‘మీరు నాకు పిచ్చి అనుకోవచ్చు. పిచ్చి ఉన్న వాళ్లే ఇంత దట్టమైన అడవిలోకి వెళ్లగలుగుతారు’ అని అక్షయ్ ఆ వీడియోకు క్యాప్షన్ జోడించారు. ఈ యేడాది మొదటిలో జనవరి నెలలో ఈ షూటింగ్ జరిగింది. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఈ ఎపిసోడ్ను షూట్ చేశారు. ఈ షూటింగ్ను అక్షయ్ కుమార్ ఒక్కరోజులో పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం సెప్టెంబరు 11న రాత్రి 8 గంటలకు డిస్కవరీ ప్లస్ ఇండియాలోప్రసారం చేస్తుండగా.. డిస్కవరీ చానెల్లో సెప్టెంబరు 14 రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. View this post on Instagram You thinking I mad… but mad only going into the wild. #IntoTheWildWithBearGrylls @beargrylls @discoveryplusindia @discoverychannelin A post shared by Akshay Kumar (@akshaykumar) on Aug 20, 2020 at 10:32pm PDT -
రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్
సూపర్ స్టార్ రజనీకాంత్, సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’. డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ వెబ్ సిరిస్ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటినుంచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రజనీకాంత్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ రియాలిటీ టెలివిజన్ షో ప్రీమియర్ ఎపిసోడ్ మార్చి 23న డిస్కవరీ నెట్వర్క్(12 ఛానెల్స్)లో ప్రసారమైన విషయం తెలిసిందే. అయితే ఈ షో రెండో అత్యధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా గుర్తింపు పొందింది. ఇక ఈ ఏడాదిలో అధిక రేటింగ్ సాధించిన రియాలిటీ షోగా, అదేవిధంగా రియాలిటీ షోల చరిత్రలోనే అత్యధిక రేటింగ్ పొందిన రెండో ప్రదర్శనగా రికార్డు సృష్టించింది. (రజనీకాంత్ సాహసయాత్ర) బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్) లెక్కల ప్రకారం.. ‘ఇన్టూ ద వైల్డ్ బేర్ గ్రిల్స్’ ప్రీమియర్ షోను సుమారు 12.4 మిలియన్ల మంది విక్షించారు. ఇది గత నాలుగు వారాలతో పోల్చితే సుమారు 86 శాతం అధికం. ఈ షోను తమిళ డిస్కవరీ చానెల్లో ప్రసారం చేయగా.. అత్యధికమంది విక్షించారు. ఇక తమిళ ఛానెల్స్.. కలర్స్ తమిళం, రాజ్ టీవీ, జయ టీవీ వంటి వాటిలో ప్రసారమయ్యే పలు షోలను రజనీ రియాలిటీ షో వెనక్కి నెట్టింది. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్ గ్రిల్స్ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం రజనీకాంత్ ‘అన్నాత్త’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తీసుకురావడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. -
వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ప్రిమియర్ షో అదుర్స్
సూపర్ స్టార్ రజనీకాంత్ సాహస యాత్రికుడు బేర్ గ్రిల్స్ కలిసి చేసిన వెబ్ సిరిస్ ‘ఇన్టూ ద వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్’ ప్రత్యేక ఎపిసోడ్ సోమవారం విడుదలైంది. రజనీ డిస్కవరీ ఛానెల్ రూపోదించిన ఈ ప్రత్యేక ఎపిసోడ్ విడుదలైనప్పటీ నుంచి సోషల్ మీడియాలో ట్రేండ్ అవుతోంది. ఇది చూసిన చూసిన ఆయన అభిమానులు రజనీకాంత్పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బేర్ గ్రిల్స్తో సమానంగా ఆయన చేసిన స్టంట్స్ చూసి అభిమానులంతా ఇలా తలైవాను ఎప్పుడు చూడలేదంటూ.. ‘వయస్సు కేవలం సంఖ్య మాత్రమే’ ‘ఇది నిజంగా సూపర్ స్టార్ కోసమే’ ఇప్పడే ప్రిమియర్ చూశాను.. వావ్ ఎంత గొప్ప ఆత్మ విశ్వాసమో తలైవాది’ ‘అడవుల్లో ఆయన స్టైలిష్గా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేగాక ‘ రజనీ వయసు కేవలం సంఖ్య మాత్రమే అని బేర్ గ్రిల్స్ ఇదివరకే చాలసార్లు చెప్పారు. అయితే అది ఇప్పుడు రుజువైంది’ ఇద్దరు గొప్ప వ్యక్తులు కలిసి అద్భతమైన ప్రదర్శన ఇచ్చారు. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. (రజనీకాంత్ సూపర్ హీరో: బేర్ గ్రిల్స్) ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు’ ఈ డాక్యుమెంటరీ షూటింగ్ కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ జరిగింది. కాగా బేర్ గ్రిల్స్తో పాటు తలైవా బండిపూర్ నేషనల్ పార్కు ఆరణ్యాన్ని అన్వేషించారు. ఈ క్రమంలో బేర్తో కలిసి రజనీ 50 అడుగుల ఎత్తులో ఉన్న ఇనుప వంతేనను అధిరోహించడమే కాకుండా, అడ్వెంచర్ ట్రిప్లో భాగంగా నడుము లోతు నీళ్లలో అవలీలగా నడుచుకుంటూ వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీ డిస్కవరీ వైల్డ్ విత్ బేర్ గ్రిల్స్ ఎపిసోడ్ను జనవరిలో షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆయనకు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ వార్తలపై స్పందించిన రజనీ చిన్న ముల్లు కారణంగా గీతలు పడ్డాయని స్పష్టం చేశారు. బేర్ గ్రిల్స్తో కలిసి అడ్వెంచర్ షోలో పాల్గొన్న రెండవ భారతీయుడు రజనీకాంత్ కావడం గమనార్హం. గత ఏడాది ఆగస్టులో ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కనిపించిన సంగతి తెలిసిందే. Just watched the premiere.,wooow whata beautiful Soul u r thalaivaaa😘😘😘...so stylish & charming even in the woods😍😍...thank u #beargrylls for returning our Thalaivar #Rajinikanth safely to us🙏🙏🙏...luv uuu thalaivaa😘😘 pic.twitter.com/SywKT4GvdI — Sri (@RRsri777) March 23, 2020 -
కండక్టర్ నుంచి సూపర్ స్టార్ వరకు..
నా జీవితం అంతా ఆశ్యర్యమేనని నటుడు రజనీకాంత్ పేర్కొన్నారు. ఈయన మొట్టమొదటి సారిగా నటించిన అడ్వెంచర్ డాక్యుమెంటరీ చిత్రం ది మ్యాన్ వర్సెస్ వైల్డ్. ప్రముఖ డాక్యుమెంటరీ రూపకర్త బేర్ గ్రిల్స్ ఇంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇలాంటి సాహసోపేతమైన డాక్యుమెంటరీని రూపొందించారు. తాజాగా నటుడు రజనీకాంత్తో రూపొందించారు. ఆ మధ్య బెంగళూర్ సమీపంలోని అడవుల్లో చిత్రీకరించిన సన్నివేశాల్లో రజనీకాంత్ నటించారు. ఇందులో పలు సాహసోపేతమైన సన్నివేశాల్లో ఈ సూపర్స్టార్ను చూడబోతున్నాం. ఈ డాక్యుమెంటరీ చిత్రం రేపు (సోమవారం) రాత్రి 8 గంటలకు డిస్కవరీ చానల్లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నటుడు రజనీకాంత్ ఇటీవల బేర్ గ్రిల్స్తో కలిసి ఇన్ టు ది వైల్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తన జీవితమే ఒక ఆశ్చర్యం అని పేర్కొన్నారు. ఒక బస్సు కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు ఇండియాలోని ప్రముఖ స్టార్ నటులలో ఒకరుగా ఎదగడం వరకూ, ఇంకా పలు ఆశ్చర్యాలను చూస్తారని ఆయన అన్నారు. అందుకు ఈ డాక్యుమెంటరీ చిత్రమే ఒక ఉదాహరణ అని అన్నారు. తాను ఇలాంటి డాక్యుమెంటరీ చిత్రంలో నటిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. అదేవిధంగా డిస్కవరీ చానల్లో ఇలాంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటానని భావించలేదన్నారు. ఆయన తన వ్యక్తిగత జీవితం, సినీ పయనం గురించి పలు విషయాలను పంచుకున్నారు. కాగా ఇండియాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరువాత వైల్డ్ డాక్కుమెంటరీలో నటించిన వ్యక్తి రజనీకాంత్నేనన్నది గమనార్హం. చదవండి: నవ్వుకున్న వారే ఇప్పుడు ఆలోచిస్తున్నారు! ఇది తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, బెంగాలీ, హిందీ, మరాఠి సహా 8 భాషల్లో విడుదల కానుంది. దీని కోసం రజనీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ డాక్యుమెంటరీ టీజర్ను ఇటీవలే విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కాగా ప్రస్తుతం రజనీకాంత్ అన్నాత్త అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నటి నయనతార, కుష్బూ, మీనా, కీర్తీసురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఆగింది. అయితే అన్నాత్త చిత్రాన్ని దసరాకు తెరపైకి తాసుకురావడానికి యూనిట్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నారన్నది తాజా సమాచారం. చదవండి: జనతా కర్ఫ్యూ: ఆ 14 గంటలు ఏం జరగబోతుంది?
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
Advertisement