-
PKL 10: బెంగాల్ వారియర్స్ అవుట్
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ‘ప్లే ఆఫ్స్’ రేసులో నిలవాలంటే మిగిలివున్న రెండు మ్యాచ్ల్ని కచ్చితంగా గెలవాల్సిన స్థితిలో బెంగాల్ వారియర్స్ 26–29తో పుణేరి పల్టన్ చేతిలో ఓడిపోయింది. దీంతో హరియాణా స్టీలర్స్కు నాలుగో సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైంది. బుధవారం జరిగిన మ్యాచ్లో పుణేరి రెయిడర్లు ఆకాశ్ షిండే 10, పంకజ్ మోహితే 6 పాయింట్లు సాధించగా, బెంగాల్ జట్టులో నితిన్ కుమార్ (5), మణిందర్ (4) రాణించారు. మరో మ్యాచ్లో దబంగ్ ఢిల్లీ 45–43తో తమిళ్ తలైవాస్పై గెలిచింది. ఢిల్లీ తరఫున అశు మలిక్ (18) అదరగొట్టాడు. తలైవాస్ జట్టుల -
Pro Kabaddi League 2024: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్.. సీజన్లో పదో పరాజయం
ముంబై: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో తెలుగు టైటాన్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ జట్టు 26–46తో బెంగాల్ వారియర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో టైటాన్స్ జట్టుకిది పదో పరాజయం. టైటాన్స్ జట్టులో కెపె్టన్ పవన్ సెహ్రావత్ మినహా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. పవన్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. వారియర్స్ జట్టులో వైభవ్ 9 పాయింట్లు, నితిన్ 9 పాయింట్లు, విశ్వాస్ 8 పాయింట్లు, శుభమ్ 6 పాయింట్లు సాధించారు. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో తమిళ్ తలైవాస్; యు ముంబాతో హరియాణా స్టీలర్స్ తలపడతాయి. -
వారియర్స్ విక్టరీ
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్లో బెంగాల్ వారియర్స్ రెండో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 48–38 పాయింట్ల తేడాతో గెలిచింది. కెపె్టన్ మణీందర్ సింగ్ అత్యధికంగా 16 పాయింట్లు స్కోరు చేసి వారియర్స్ విక్టరీలో కీలకపాత్ర పోషించాడు. తమిళ్ తలైవాస్ తరఫున నరేందర్ 13 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 35–33తో దబంగ్ ఢిల్లీ జట్టును ఓడించింది. -
Pro Kabaddi 2022: మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం హైదరాబాద్ అంచె మ్యాచ్లు మొదలయ్యాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28–36తో బెంగాల్ వారియర్స్ చేతిలో ఓడిపోయింది. ఈ లీగ్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్ ఒక్క మ్యాచ్లో నెగ్గి, 14 మ్యాచ్ల్లో ఓటమి చవిచూసింది. తొమ్మిది పాయింట్లతో టైటాన్స్ చివరిదైన 12వ స్థానంలో ఉంది. వారియర్స్తో మ్యాచ్లో టైటాన్స్ తరఫున రెయిడర్లు అభిషేక్ సింగ్ తొమ్మిది పాయింట్లతో, సిద్ధార్థ్ దేశాయ్ ఎనిమిది పాయింట్లతో, పర్మేశ్ ఐదు పాయింట్లతో రాణించారు. వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలువగా... శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశాడు. ఇతర మ్యాచ్ల్లో పుణేరి పల్టన్ 41–28తో హరియాణా స్టీలర్స్పై, బెంగళూరు బుల్స్ 45–38తో గుజరాత్ జెయింట్స్పై గెలిచాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో జైపూర్ పింక్ పాంథర్స్; యు ముంబాతో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో పట్నా పైరేట్స్ తలపడతాయి. -
తెలుగు టైటాన్స్ ఓటమి
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ వరుసగా రెండో పరాజయం చవిచూసింది. బెంగాల్ వారియర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 25–45 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. టైటాన్స్ తరఫున వినయ్ ఎనిమిది పాయింట్లు, మోనూ గోయట్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. బెంగాల్ జట్టులో రెయిడర్లు మణీందర్ సింగ్ 11 పాయింట్లు, దీపక్ హుడా 11 పాయింట్లు, శ్రీకాంత్ జాదవ్ ఏడు పాయింట్లు స్కోరు చేశారు. ఇతర మ్యాచ్ల్లో బెంగళూరు బుల్స్ 41–39తో పుణేరి పల్టన్పై, జైపూర్ పింక్ పాంథర్స్ 35–30తో పట్నా పైరేట్స్పై నెగ్గాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధాస్తో యు ముంబా; గుజరాత్ జెయింట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: Women's Asia Cup 2022: మరో విజయమే లక్ష్యంగా... థాయ్లాండ్తో భారత్ ఢీ -
Pro Kabaddi league 2022: పట్నాను నిలువరించిన పుణేరి పల్టన్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం మూడు మ్యాచ్లు జరగ్గా... చివరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. మాజీ చాంపియన్ పట్నా పైరేట్స్తో జరిగిన మ్యాచ్ను పుణేరి పల్టన్ 34–34తో ‘డ్రా’ చేసుకోగా... గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మ్యాచ్ కూడా 31–31తో సమంగా ముగిసింది. మూడో మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 41–33తో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నాతో మ్యాచ్లో పుణేరి ఆటగాళ్లు అస్లాం ఇనామ్దార్ 7, మోహిత్ గోయట్ 8, ఆకాశ్ 6 పాయింట్లు స్కోరు చేశారు. పట్నా జట్టులో రోహిత్ గులియా (6), సచిన్ (8) రాణించారు. తలైవాస్తో మ్యాచ్లో గుజరాత్ రెయిడర్ రాకేశ్ 13 పాయింట్లతో అదరగొట్టాడు. బెంగాల్తో మ్యాచ్లో హరియాణా రెయిడర్ మంజీత్ ఏకంగా 19 పాయింట్లు సాధించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో జైపూర్ పింక్ పాంథర్స్తో పట్నా పైరేట్స్; బెంగాల్ వారియర్స్తో తెలుగు టైటాన్స్; పుణేరి పల్టన్తో బెంగళూరు బుల్స్ తలపడతాయి. -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ విజయం.. ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా..
Pro Kabaddi League- బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–26 స్కోరుతో పుణేరీ పల్టన్ను చిత్తు చేసింది. తద్వారా ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. పట్నా తరఫున గుమాన్ సింగ్ 13 పాయింట్లు స్కోర్ చేయగా, పుణేరీ ఆటగాళ్లలో అస్లమ్ ఇనామ్దార్ 9 పాయింట్లు సాధించాడు. ఇక ఇప్పటి వరకు మొత్తంగా 18 మ్యాచ్లు ఆడిన పట్నా పదమూడింట గెలిచి 70 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉంది. ఇదిలా ఉండగా... బెంగాల్ వారియర్స్, దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మరో మ్యాచ్ 39–39తో ‘టై’గా ముగిసింది. బెంగాల్ తరఫున మణీందర్ సింగ్, ఢిల్లీ తరఫున నవీన్ కుమార్ చెరో 16 పాయింట్లు స్కోర్ చేశారు. చదవండి: Ind Vs Wi 3rd ODI: ప్రయోగాలకు సిద్ధం.. అతడు కచ్చితంగా తుది జట్టులో ఉంటాడు: రోహిత్ శర్మ -
Pro Kabaddi League: పట్నా పైరేట్స్ని గెలిపించిన సచిన్
Pro Kabaddi League: Patna Pirates Beat Bengal Warriors: ప్రొ కబడ్డీ లీగ్లో ఆదివారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 38–29తో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ సచిన్ తన్వర్ 11 పాయింట్లు స్కోరు చేశాడు. ఈ లీగ్లో 11వ విజయంతో పట్నా మొత్తం 60 పాయింట్లతో టాప్ ర్యాంక్లోకి దూసుకొచ్చింది. మరో మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ 40–36తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
Pro Kabaddi League: బెంగాల్ వారియర్స్కు హరియణా షాక్
Pro Kabaddi League- Haryana Steelers Beat Bengal Warriors, Patna Pirates Defeat Gujarat Giants: ప్రొ కబడ్డీ లీగ్లో హరియాణా స్టీలర్స్ జట్టు ఏడో విజయం నమోదు చేసింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 46–29తో ఘనవిజయం సాధించింది. హరియాణా కెప్టెన్ వికాశ్ కండోలా పది రెయిడింగ్ పాయింట్లు సంపాదించి తమ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు బుల్స్, దబంగ్ ఢిల్లీ మ్యాచ్ 36–36తో ‘టై’ కాగా... మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–23తో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. చదవండి: U19 WC Final Ind Vs Eng: 11 మందిలో ఏకంగా 8వ వరుస బ్యాటర్ దాకా పరుగులు చేసే సత్తా వాళ్లది.. హోరాహోరీ తప్పదు! -
బెంగాల్ వారియర్స్కు మరో ఓటమి..
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ జట్టు నిరాశాజనక ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో పుణేరి పల్టన్ 39–27 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. ఈ లీగ్లో బెంగాల్ వారియర్స్ జట్టుకిది ఐదో పరాజయం కావడం గమనార్హం. పుణేరి పల్టన్ రెయిడర్ ఇనామ్దార్ 17 పాయింట్లు స్కోరు చేశాడు. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 13 పాయింట్లతో ఆకట్టుకున్నా అతనికి ఇతర సభ్యుల నుంచి సహకారం లభించలేదు. మరో మ్యాచ్లో యూపీ యోధ 42–27తో బెంగళూరు బుల్స్పై గెలిచింది. యూపీ యోధ రెయిడర్ శ్రీకాంత్ జాదవ్ 15 పాయింట్లతో రాణించాడు. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో హరియాణా స్టీలర్స్; జైపూర్ పింక్పాంథర్స్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. చదవండి: IPL- 2022: ఐపీఎల్పై బీసీసీఐ కీలక ప్రకటన! -
బెంగాల్ వారియర్స్కు పట్నా పైరేట్స్ షాక్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్లో పట్నా పైరేట్స్ జట్టు తమ ప్రతాపం చూపించింది. డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్కు షాక్ ఇచ్చింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 43–29 పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. పట్నా రెయిడర్ మోనూ గోయట్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. పట్నా 32–25తో ఆధిక్యంలో ఉన్న దశలో మోనూ గోయట్ సింగిల్ రెయిడ్లో ఏకంగా ఏడు పాయింట్లు సాధించి అబ్బురపరిచాడు. మ్యాచ్ మొత్తంలో మోనూ 15 పాయింట్లు సాధించి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓవరాల్గా ఈ లీగ్ చరిత్రలో మోనూ 500 రెయిడింగ్ పాయింట్లు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ లీగ్లో పట్నాకిది మూడో విజయం. బెంగాల్ వారియర్స్ తరఫున మణీందర్ సింగ్ 12 పాయింట్లు సాధించాడు. అంతకుముందు జరిగిన మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 36–26తో పుణేరి పల్టన్ను ఓడించి ఈ లీగ్లో తొలి విజయం నమోదు చేసింది. నేడు జరిగే మ్యాచ్ల్లో యు ముంబాతో యూపీ యోధ; బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్; దబంగ్ ఢిల్లీతో తమిళ్ తలైవాస్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
అహ్మదాబాద్: తొలి 6 నిమిషాల ఆటను చూస్తే దబంగ్ ఢిల్లీదే టైటిల్ అనుకున్నారు. అయితే అద్భుతమైన ఆటతీరుతో పుంజుకున్న బెంగాల్ వారియర్స్ సీజన్లో టాప్ ఫామ్లో ఉన్న దబంగ్ ఢిల్లీకి షాక్ ఇస్తూ ప్రొ కబడ్డీ లీగ్ టైటిల్ను తొలిసారి కైవసం చేసుకుంది. ఢిల్లీ రైడర్ నవీన్ కుమార్ 18 పాయింట్లతో జట్టు విజయం కోసం తుది వరకు చేసిన పోరాటం... బెంగాల్ సమష్టి ప్రదర్శన ముందు ఓడిపోయింది. దీంతో శనివారం జరిగిన టైటిల్ పోరులో బెంగాల్ వారియర్స్ 39–34తో దబంగ్ ఢిల్లీపై గెలిచింది. బెంగాల్ తరఫున నబీబ„Š (10 పాయింట్లు), సుకేశ్ హెగ్డే (8 పాయింట్లు), ట్యాక్లింగ్లో జీవన్ (4 పాయింట్లు) ప్రదర్శన జట్టుకు టైటిల్ను ఖాయం చేసింది. సీజన్ మొత్తం అద్భుతంగా రాణిస్తూ వచ్చిన ఢిల్లీ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. ఆరంభంలో అద్భుతంగా ఆడి 11–3తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఇక్కడి నుంచి అనూహ్యంగా గాడి తప్పిన ఆ జట్టు మళ్లీ కోలుకోలేకపోయింది. బెంగాల్ స్టార్ రైడర్ మణీందర్ సింగ్ గాయం కారణంగా ఫైనల్ బరిలో దిగలేదు. దీంతో రైడింగ్ భారాన్ని సుకేశ్, నబీబ„Š మోశారు. తొలుత తడబడి పుంజుకున్న వీరు ప్రత్యరి్థని ఆలౌట్చేసి విరామానికి స్కోర్ను 17–17తో సమం చేశారు. రెండో అర్ధభాగంలో మరింతగా చెలరేగిన బెంగాల్ ప్రత్యరి్థని మరో రెండు సార్లు ఆలౌట్ చేసి కబడ్డీ కింగ్గా నిలిచింది. విజేత బెంగాల్ వారియర్స్ జట్టుకు రూ. 3 కోట్లు... రన్నరప్ ఢిల్లీ జట్టుకు రూ. కోటీ 80 లక్షలు ప్రైజ్మనీగా లభించాయి. -
ఎవరో కొత్త విజేత?
అహ్మదాబాద్: 13 వారాల పాటు 13 నగరాల్లో వందకు పైగా మ్యాచ్లతో సాగిన ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ తుది ఘట్టానికి చేరింది. టోర్నీ మొత్తం అదరగొట్టి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్లే తుది పోరుకు అర్హత సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య నేడు జరిగే ఫైనల్తో ప్రొ కబడ్డీ లీగ్లో సరికొత్త చాంపియన్ అవతరించనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో సత్తా చాటి తొలిసారి ట్రోఫీని ముద్దాడడానికి రెండు జట్లూ పూర్తిగా సంసిద్ధమయ్యాయి. నవీన్ కుమార్ గీ మణీందర్ సింగ్ ఈ సీజన్ మొత్తం రైడింగ్లో అదరగొట్టిన రైడర్ నవీన్ కుమార్ ఢిల్లీ జట్టుకు వెన్నెముకగా నిలుస్తూ వచ్చాడు. దాదాపు ప్రతీ మ్యాచ్లో సూపర్ ‘టెన్’తో చెలరేగిన అతడు జట్టును పాయింట్ల పట్టికలో టాప్లో నిలిపాడు. సెమీస్లో కూడా 15 పాయింట్లతో చెలరేగిన అతను జట్టును ఫైనల్ చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతడు మరోసారి చెలరేగితే ఢిల్లీ టైటిల్ గెలవడం ఖాయం.గాయం కారణంగా ముంబైతో జరిగిన మ్యాచ్కు దూరమైన బెంగాల్ కెప్టెన్, స్టార్ రైడర్ మణీందర్ సింగ్ ఫైనల్కి సిద్ధమయ్యాడు. నేడు జరిగే మ్యాచ్లో సత్తా చాటి జట్టుకు టైటిల్ని అందించాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఇక డిఫెన్స్లోనూ రెండు జట్లూ సమానంగా ఉన్నాయి. ఢిల్లీ తరఫున రవీందర్ పహల్, బెంగాల్ తరఫున బల్దేవ్ సింగ్లు ప్రత్యర్థి రైడర్లను ఒక పట్టు పట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే అన్ని విభాగాల్లోనూ కాస్త ఆధిక్యంలో ఉన్న ఢిల్లీ జట్టుకు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
ఫైనల్లో ఢిల్లీ, బెంగాల్
అహ్మదాబాద్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఏడో సీజన్లో దబంగ్ ఢిల్లీ, బెంగాల్ వారియర్స్ ఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగిన సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు 44–38తో డిఫెండింగ్ చాంపియన్ బెంగళూరు బుల్స్కు షాకిచి్చంది. ఈ మ్యాచ్లో దబంగ్ టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. రైడర్లలో నవీన్ 15, చంద్రన్ రంజీత్ 9 పాయింట్లు సాధించారు. డిఫెండర్ అనిల్ 4 పాయింట్లు చేశాడు. మిగతావారిలో విజయ్, రవీందర్, జోగిందర్ తలా 3 పాయింట్లు తెచ్చిపెట్టారు. బెంగళూరు జట్టు తరఫున పవన్ షెరావత్ (18) చక్కని పోరాటపటిమ కనబరిచాడు. రెండో సెమీస్లో బెంగాల్ వారియర్స్ 37–35తో యు ముంబాపై నెగ్గింది. వారియర్స్ తరఫున సుకేశ్ (8), నబీబ„Š (5), ప్రపంజన్ (4) రాణించారు. యు ముంబా జట్టులో అభిõÙక్ 11 పాయింట్లు సాధించాడు. రెండు రోజుల విశ్రాంతి అనంతరం శనివారం ఢిల్లీ, బెంగాల్ జట్ల మధ్య ఇక్కడే టైటిల్ పోరు జరగనుంది. -
ప్రదీప్ ప్రతాపం
గ్రేటర్ నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో పట్నా పైరేట్స్ రైడర్ ప్రదీప్ నర్వాల్ మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు. ఏకంగా 36 పాయింట్లు సాధించాడు. దీంతో పట్నా 69–41తో బెంగాల్ వారియర్స్పై ఘన విజయం సాధించింది. అతడికి జాంగ్ కున్ లీ (8 పాయింట్లు), ట్యాక్లింగ్లో నీరజ్ కుమార్ (5 పాయింట్లు) చక్కని సహకారం అందించారు. ఆట మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్కు వెళ్లిన ప్రదీప్... ఏకంగా ఆరుగురిని ఔట్ చేసి రైడింగ్లో తనకు ఎదురులేదని చాటాడు. ఈ మ్యాచ్లో పట్నా ప్రత్యరి్థని నాలుగు సార్లు ఆలౌట్ చేయడం విశేషం. బెంగాల్ తరఫున సౌరభ్ (11 పాయింట్లు), రాకేశ్ (10 పాయిం ట్లు) ఆకట్టుకున్నారు. ఈ సీజన్లో 300 పాయింట్ల మార్కును అందుకున్న రెండో రైడర్గా ప్రదీప్ (304 పాయింట్లు) నిలిచాడు. బెంగళూరు రైడర్ పవన్ షెరావత్ 309 పాయింట్లతో ముందున్నాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 43–39తో పుణేరి పల్టన్పై గెలిచింది. నేటి మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో తెలుగు టైటాన్స్; తమిళ్ తలైవాస్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి. -
టైటాన్స్ పదో పరాజయం
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్లో తెలుగు టైటాన్స్ పదో పరాజయాన్ని నమోదు చేసింది. బుధవారం జరిగిన మ్యాచ్లో టైటాన్స్ 39–40తో బెంగాల్ వారియర్స్ చేతిలో పోరాడి ఓడింది. టైటాన్స్ రైడర్ సిద్దార్థ్ దేశాయ్ 15 పాయింట్లతో ఒంటరి పోరాటం చేశాడు. అతడికి తోడుగా ట్యాక్లింగ్లో సారథి అ»ొజర్ మోహజెర్ మిఘాని ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో చెలరేగినా అది జట్టుకు విజయం అందించలేదు. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచాడు. తాజా విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి ఎగబాకింది. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బెంగాల్... టైటాన్స్ను 15వ నిమిషంలో ఆలౌట్ చేసింది. మొదటి భాగాన్ని 19–13తో ముగించింది. రెండో భాగంలో జోరు పెంచిన టైటాన్స్ ప్రత్యరి్థని ఆలౌట్ చేసింది. ఈ సమయంలో బెంగాల్ను రైడింగ్తో ఆదుకున్న మణీందర్ గెలుపు ఖాయం చేశాడు. తాజా ఓటమితో టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 43–34తో పుణేరి పల్టన్పై గెలుపొందింది. జైపూర్ స్టార్ రైడర్ దీపక్ హుడా సూపర్ ‘టెన్’ (12 పాయింట్లు)తో రాణించాడు. నేటి మ్యాచ్లో పట్నా పైరేట్స్తో దబంగ్ ఢిల్లీ తలపడుతుంది. -
పట్నా, బెంగాల్ విజయం
కోల్కతా: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్ ఆరంభంలో వరుస విజయాలతో అదరగొట్టిన జైపూర్ పింక్ పాంథర్స్ అపజయాల బాటలో పయనిస్తుంది. గురువారం జరిగిన మ్యాచ్లో పట్నా పైరేట్స్ 36–33తో జైపూర్ను చిత్తు చేసింది. స్టార్ రైడర్ దీపక్ హుడా (5 పాయింట్లు) నిరాశపరిచాడు. పట్నా తరఫున ప్రదీప్ నర్వాల్ 14 పాయింట్లతో చెలరేగగా... జాన్ కున్ లీ (8 పాయింట్లు) అతనికి చక్కని సహకారం అందించాడు. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 42–40తో బెంగళూరు బుల్స్పై విజయం సాధించింది. బెంగాల్ రైడర్ మణీందర్ సింగ్ 17 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. -
హరియాణాను గెలిపించిన వికాశ్
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో హరియాణా స్టీలర్స్ 36–33తో బెంగాల్ వారియర్స్ను కంగుతినిపించింది. హరియాణా రైడర్ వికాశ్ కండోలా 11 పాయింట్లతో చెలరేగాడు. మరో రైడర్ వినయ్ 9 పాయింట్లతో వికాశ్కు చక్కని సహకారం అందించాడు. బెంగాల్ వారియర్స్ రైడర్ మణీందర్ సింగ్ 15 పాయింట్లతో ‘టాప్’ స్కోరర్గా నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మరో మ్యాచ్లో యూపీ యోధ 35–30తో పుణేరి పల్టన్పై నెగ్గింది. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో హరియాణా స్టీలర్స్; యు ముంబాతో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
వారియర్స్ విజయం
చెన్నై: ప్రొ కబడ్డీ లీగ్ ఏడో సీజన్లో బెంగాల్ వారియర్స్ ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 35–26తో పట్నా పైరేట్స్పై గెలుపొందింది. రైడర్ మణీందర్ సింగ్ సూపర్ ‘టెన్’తో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. అతనికి డిఫెండర్ రింకు నర్వాల్ (5 పాయింట్లు) నుంచి చక్కని సహకారం అందింది. పట్నా తరఫున ఒంటరి పోరాటం చేసిన ప్రదీప్ నర్వాల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచినా... సహచరులు రాణించకపోవడంతో జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ లో బెంగాల్ ప్రత్యర్థిని 4 సార్లు ఆలౌట్ చేయగా... పట్నా రెండు సార్లు ఆలౌట్ చేసింది. ఈ విజయంతో బెంగాల్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. నేడు జరిగే మ్యాచ్ల్లో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో పట్నా పైరేట్స్, తమిళ్ తలైవాస్తో యు ముంబా తలపడతాయి. -
వారియర్స్తో ‘టై’టాన్స్
అహ్మదాబాద్: గుజరాత్పై విజయంతో ఇక తెలుగు టైటాన్స్ గాడిలో పడిందని అనుకుంటే... ఆ దూకుడు కేవలం ఒక విజయానికి మాత్రమే పరిమితమైంది. సోమవారం బెంగాల్ వారియర్స్తో జరిగిన మ్యాచ్ను టైటాన్స్ 29–29తో ‘టై’ చేసుకుంది. ఈ సీజన్లో టైటాన్స్కిది రెండో ‘టై’ కావడం విశేషం. ఆట ఆరంభంలోనే సిద్ధార్థ్ దేశాయ్ తన రైడ్తో పాయింట్ తెచ్చి జట్టు ఖాతా తెరిచాడు. మ్యాచ్ మొదటి భాగంలో ప్రత్యర్థి నుంచి పోటీ ఎదురవడంతో తెలుగు టైటాన్స్ 13–11తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేసిన టైటాన్స్ 17–12తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే ఆధిక్యంలో ఉన్నామన్న అతివిశ్వాసం జట్టును దెబ్బతీసింది. ప్రతి రైడర్ను పట్టేయాలని డిఫెండర్ విశాల్ భరద్వాజ్ చూపించిన అనవసరపు దూకుడు అతడిని పలుమార్లు కోర్టును వీడేలా చేసింది. అప్పటి వరకు నిలకడగా రాణించిన సిద్ధార్థ్ దేశాయ్, సూరజ్ దేశాయ్ల రైడింగ్ లయ తప్పడంతో ప్రత్యర్థులకు సులభంగా దొరికిపోయారు. ఒక్కో పాయింట్ సాధిస్తూ వచ్చిన వారియర్స్ టైటాన్స్ను ఆలౌట్ చేసి 23–21తో ఆధిక్యంలోకెళ్లింది. అయితే చివర్లో పుంజుకున్న టైటాన్స్ స్కోర్ను సమం చేసి ఊపిరి పీల్చుకుంది. టైటాన్స్ రైడర్ సూరజ్ దేశాయ్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన మరో మ్యాచ్లో యూపీ యోధ జట్టు 35–33తో బెంగళూరు బుల్స్ను ఓడించింది. యూపీ రైడర్ పవన్ శెరావత్ అటు రైడింగ్లో, ఇటు ప్రత్యర్థిని పట్టేయడంలోనూ చెలరేగాడు. మొత్తం 15 పాయింట్ల (6 రైడ్, 3 టాకిల్, 6 బోనస్)తో జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. నేడు ప్రొ కబడ్డీ లీగ్లో విశ్రాంతి దినం. బుధవారం జరిగే మ్యాచ్ల్లో యూపీ యోధతో హరియాణా స్టీలర్స్; గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో బెంగాల్ వారియర్స్ తలపడతాయి. -
వారెవ్వా వారియర్స్
పట్నా: పేరుకు తగ్గట్టే బెంగాల్ వారియర్స్ అసలైన వారియర్లా పోరాడింది. ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు 5 పాయింట్ల అంతరాన్ని పూడ్చి విజేతగా నిలిచింది. ఒత్తిడి సమయాన ఎలా ఆడాలో మిగతా జట్లకు నేర్పింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 32–30తో యు ముంబాను ఓడించింది. అదిరే ఆరంభం లభించినా... దానిని సద్వినియోగం చేసుకోలేని యు ముంబా సీజన్లో నాలుగో పరాభవాన్ని మూటగట్టుకుంది. యు ముంబా రైడర్ అర్జున్ దేశ్వాల్ సూపర్ ‘టెన్’తో చెలరేగినా... వారియర్స్ సమష్టి కృషి ముందు అది ఏ మాత్రం నిలవలేదు. వారియర్స్ డిఫెండర్లయిన మణీందర్ సింగ్, బల్దేవ్ సింగ్లు చెరో 5 టాకిల్ పాయింట్లతో మెరిశారు. ముంబా... విజయం ముంగిట... మ్యాచ్ మొదటి అర్ధ భాగంలో యు ముంబా ఆడిన తీరు చూస్తే ఆ జట్టు ఖాతాలో మరో విజయం ఖాయమన్నట్లు కనిపించింది. విరామ సమయానికి ఆ జట్టు 16–11తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో అర్ధ భాగం ఆరంభమైన కాసేపటికే సూపర్ రైడ్తో చెలరేగిన వారియర్ రైడర్ ప్రపంజన్ కుమార్ యు ముంబా ఆధిక్యాన్ని 14–16కు తగ్గించాడు. అనంతరం మరో నాలుగు పాయింట్లు సాధించిన బెంగాల్ జట్టు 18–17తో ముందంజ వేసింది. ప్రత్యర్థి ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్లు కనిపించిన ముంబై జట్టు వరుసగా పాయింట్లు సాధించి 26–21తో మరోసారి ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇటువంటి ఒత్తిడి సమయంలో ముంబైని తమ పట్టుతో పట్టేసిన బెంగాల్ డిఫెండర్లు ఆ జట్టును ఆలౌట్ చేసి... అనంతరం ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకున్నారు. సొంత మైదానంలో పట్నా పైరేట్స్ ఎట్టకేలకు విజయం సాధించింది. అంతకు ముందు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడిన పట్నా... చివరి మ్యాచ్లో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. 41–20తో యూపీ యోధపై ఘన విజయం సాధించింది. పట్నా తరపున ప్రదీప్ నర్వాల్ 12 పాయింట్లతో రాణించాడు. నేటి నుంచి గుజరాత్ అంచె పోటీలు అహ్మదాబాద్లో ఆరంభం కానున్నాయి. నేడు జరిగే మ్యాచ్ల్లో తమిళ్ తలైవాస్తో గుజరాత్ ఫార్చున్ జెయింట్స్; పుణేరి పల్టన్తో దబంగ్ ఢిల్లీ తలపడతాయి. -
బెంగాల్ చేతిలో పుణెరి చిత్తుచిత్తుగా..
ముంబై : బెంగాల్ వారియర్స్ దూకుడుకు పుణెరి పల్టన్ కుదేలైంది. మ్యాచ్ ఆరంభం నుంచే అటాకింగ్ గేమ్ ఆడిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇక బెంగాల్ ఆటగాళ్ల దూకుడైన ఆటకు పుణెరి ఆటగాళ్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. సోమవారం ముంబై ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 43-23 తేడాతో పుణెరి పల్టాన్పై ఘన విజయం సాధించింది. బెంగాల్ వారియర్స్ రైడర్ మణిందర్ సింగ్(14) హోరెత్తించగా.. మహ్మద్ నబిబక్ష్(8), రింకూ నర్వాల్(5) రాణించారు. ఆ జట్టు స్టార్ రైడర్ ప్రపంజన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఇక పుణెరి ఆటగాళ్లలో ఏ ఒక్కరూ కూడా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. సారథి సుర్జీత్ సింత్ చేతులెత్తేయగా.. పంకజ్ మోహితె(6) ఒక్కడే పర్వాలేదనిపించాడు. ఇక డిఫెండర్ గిరీష్ ఎర్నాక్(3) ప్రత్యర్థి రైడర్లను కట్టడి చేయలేకపోయాడు. ఓవరాల్గా బెంగాల్ వారియర్స్ 22రైడ్, 12 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. పుణెరి జట్టు 13 రైడ్, 9 టాకిల్ పాయింట్లతో అందుకోలేకపోయింది. దీంతో పుణెరి ఖాతాలో హ్యాట్రిక్ ఓటమి పడింది. -
గెలుపు ముంగిట బోర్లా పడిన బెంగాల్
ముంబై : బెంగాల్ వారియర్స్ విజయం ముంగిట బోల్తాపడింది. యూపీ యోధపై భారీ విజయంతో ఊపు మీదున్న బెంగాల్కు జైపూర్ పింక్ పాంథర్స్ ఊహించని షాక్ ఇచ్చింది. ప్రొ కబడ్డీ సీజన్ 7లో భాగంగా జైపూర్ పింక్ పాంథర్స్ 27-25 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. మరో రెండు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందన్న సమయంలో బెంగాల్ నాలుగు పాయింట్లతో లీడింగ్లో ఉంది. కనీసం ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్నా బెంగాల్ విజయం సాధించేదే. కానీ జైపూర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన.. బెంగాల్ ఆటగాళ్ల తొందరపాటుతో గెలుపు సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. జైపూర్ విజయంలో సారథి దీపక్ హుడా, డిఫెండర్ సందీప్ దుల్లు కీలకపాత్ర పోషించారు. మ్యాచ్ను ఘనంగా ఆరంభించిన బెంగాల్.. ప్రత్యర్థి జట్టును తొలి నాలుగు నిమిషాలు పాయింట్ల ఖాతాను తెరవనివ్వలేదు. దీంతో 0-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. ప్రపంజన్(7), మణిందర్ సింగ్(6), బల్దేవ్ సింగ్(6)లు రాణించడంతో తొలి అర్ద భాగం ముగిసే సరికి బెంగాల్ 14-10తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో అర్దభాగంలోనూ బెంగాల్ ఆటగాళ్లు ఆచితూచి ఆడారు. అయితే చివర్లో తడబడటంతో భారీ మూల్యాన్నే చెల్లించుకున్నారు. జైపూర్ ఆటగాళ్లు సందీప్ దుల్(8), దీపక్ హుడా(6), దీపక్ నర్వాల్(4) కీలక సమయంలో రాణించి విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇక ఓవరాల్గా జైపూర్ 12 రైడ్, 10 టాకిల్ పాయింట్లు సాధించగా.. బెంగాల్ 13 రైడ్, 11 టాకిల్ పాయింట్లను సాధించింది. అయితే బెంగాల్ను ఓ సారి ఆలౌట్ చేయడం, మూడు ఎక్సట్రా పాయింట్లు సాధించడం జైపూర్కు కలిసొచ్చింది. -
గర్జించిన బెంగాల్.. కుదేలైన యూపీ
హైదరాబాద్: ప్రో కబడ్డీ సీజన్ లీగ్-7 తమ తొలి మ్యాచ్లోనే బెంగాల్ వారియర్స్ జూలు విదిల్చింది. బెంగాల్ దెబ్బకు యూపీ యోదా చిత్తుచిత్తుగా ఓడింది. బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఏకపక్షపోరులో యూపీ యోధాపై బెంగాల్ వారియర్స్ 48-17 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభంలో బెంగాల్ను ప్రతిఘటించిన యూపీ యోధా.. మ్యాచ్ జరిగే కొద్ది పట్టు విడిచింది. తొలుత పాయింట్ల ఖాతా తెరిచిన యూపీ 4-0తో మంచి లీడింగ్లో ఉంది. అనంతరం తొలిహాఫ్ ముగిసే సరికి యూపీ 8-11తో స్పల్ప వెనుకంజలో నిలిచింది. రెండో అర్ధభాగం ప్రారంభమయ్యాక బెంగాల్ వారియర్స్ అసలు ఆట ప్రారంభమైంది. బెంగాల్ ఆటగాళ్ల దూకుడుతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అటాకింగ్ గేమ్తో విరుచుకపడటంతో యూపీ ఆటగాళ్లకు ఏం చేయాలో పాలు పోలేదు. యూపీ స్టార్ రైడర్ మోనూ గోయత్(6) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బెంగాల్ ఆటగాళ్లలో మహ్మద్ నబిబక్ష్ 10 పాయింట్లతో రెచ్చిపోయాడు. అతడికి తోడుగా మనిందర్ సింగ్(8), బల్దేవ్ సింగ్(7), ప్రపంజన్(5) ఆకట్టుకున్నారు. ఓవరాల్గా బెంగాల్ 24 రైడ్ పాయింట్లు, 14 టాకిల్ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ యోధా 10 రైడ్ పాయింట్లతో, 5 టాకిల్ పాయింట్లతో ప్రత్యర్థి జట్టును అందుకోలేకపోయింది. ఇక బెంగాల్ ధాటిక యూపీ జట్టు నాలుగు సార్లు ఆలౌటవ్వడం గమనార్హం. -
‘ప్లే ఆఫ్స్’కు యూపీ యోధ
ప్రొ కబడ్డీ లీగ్ కోల్కతా: ‘ప్లే ఆఫ్స్’కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూపీ యోధ జట్టు సత్తా చాటింది. ప్రొ కబడ్డీ లీగ్ ఆరో సీజన్లో భాగంగా గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో యూపీ యోధ 41–25తో బెంగాల్ వారియర్స్పై గెలిచి 57 పాయింట్లతో జోన్ ‘బి’ నుంచి ‘ప్లే ఆఫ్’కు చేరింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ (55 పాయింట్లు) పట్టికలో నాలుగో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలకమైన మ్యాచ్లో పటిష్టమైన డిఫెన్స్తో ఆకట్టుకున్న యూపీ యోధ అలవోకగా గెలిచింది. యూపీ తరఫున రిషాంక్ 9, శ్రీకాంత్, నితేశ్ చెరో 6 పాయింట్లతో చెలరేగగా... బెంగాల్ తరఫున ఆదర్శ్ 4, జాంగ్ కున్ లీ 3 పాయింట్లు సాధించారు. నామమాత్రమైన మరో మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 40–32తో జైపూర్పింక్ పాంథర్స్పై గెలిచింది. జోన్ ‘ఎ’ నుంచి గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ (93 పాయింట్లు), యు ముంబా (86 పాయింట్లు), దబంగ్ ఢిల్లీ (68 పాయింట్లు) ‘ప్లే ఆఫ్స్’కు చేరగా... జోన్ ‘బి’ నుంచి బెంగళూరు బుల్స్ (78 పాయింట్లు), బెంగాల్ వారియరర్స్ (69 పాయింట్లు), యూపీ యోధా (57 పాయింట్లు) నాకౌట్కు అర్హత సాధించాయి. ఆదివారం కొచ్చిలో జరుగనున్న ఎలిమినేటర్–1లో యు ముంబాతో యూపీ యోధ... ఎలిమినేటర్–2లో దబంగ్ ఢిల్లీతో బెంగాల్ వారియర్స్ తలపడనున్నాయి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఈ రాశివారికి నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి
అక్రమ రిజిస్ట్రేషన్పై కలెక్టర్ సీరియస్
‘వాగ్దేవి’ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు
మామిడికి మార్కెట్ కష్టాలు
No Headline
వేసవి దుక్కులు.. లాభాలు దక్కు
వైన్స్ ఘటనలో 8 మంది రిమాండ్
జడ్చర్లలో భారీ వర్షం
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఆటో డ్రైవర్ ఆత్మహత్యపై కేసు నమోదు
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement