-
ఎంపీ టికెట్ నిరాకరణ.. ఆప్లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
పంజాబ్ కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దల్వీందర్ సింగ్ గోల్డీ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.దల్వీందర్ కాంగ్రెస్ నుంచి సంగ్రూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం దల్వీందర్ సింగ్కు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్పాల్ సింగ్ ఖైరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దల్వీందర్ సింగ్ పార్టీ చేరికపై భగవంత్ మాన్ మాట్లాడుతూ.. నా తమ్మడు, కష్టపని చేసే యువకుడు గోల్డీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోల్డీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ స్థానం నుంచి భగవంత్ మాన్పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గోల్డీ పరాజయం పాలయ్యారు. ఆప్లో చేరిన అనంతరం పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించాని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్కు రాసిన రాజీనామా లేఖలో గోల్డీ, రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. -
మరోసారి కేజ్రీవాల్ను కలవనున్న పంజాబ్ సీఎం
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను ఇప్పటికే ఓ సారి కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' మళ్ళీ కలవనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఏప్రిల్ 30న తీహార్ జైలులో కలవనున్నట్లు సమాచారం.గతంలో ఓ సారి కేజ్రీవాల్ను కలిసిన తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ గతంలో తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. -
పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ను అలా ట్రీట్ చేస్తున్నారంటూ..
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' కలిశారు. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్తో కలిసి వచ్చిన భగవంత్.. కేజ్రీవాల్తో అరగంట సేపు కలిసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థులకు అందించే కనీస సౌకర్యాలను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి అందించడంలేదని ఆయన ఆరోపించారు. భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పాఠక్ చెప్పారు. జైలులో ఉన్నా.. ఆయన ఢిల్లీ ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం నుంచి సమస్యలపై చర్చించడానికి ఇద్దరు మంత్రులను పిలుస్తానని, అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన కోరినట్లు సందీప్ పాఠక్ అన్నారు. #WATCH | Delhi: After meeting AAP convener and Delhi CM Arvind Kejriwal in Tihar Jail, Punjab CM Bhagwant Mann says, "It was very sad to see that he isn't getting the facilities which are available even to hardcore criminals. What's his fault? You're treating him as if you have… https://t.co/HA4Xu1a1lE pic.twitter.com/HkihsLbPMK — ANI (@ANI) April 15, 2024 -
ఎలాగైనా ఆ సీటు మళ్లీ గెలవాల్సిందే: సీఎం
జలంధర్: లోక్సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం జలంధర్లోని స్థానిక హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రి బల్కర్ సింగ్, నకోదర్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ కౌర్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రమణ్ అరోరా, జలంధర్ లోక్సభ సీటు పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ముగ్గురు ఇన్ఛార్జ్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 14న జలంధర్ అభ్యర్థిగా తమ సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూను ప్రకటించింది. అయితే, రింకూ మార్చి 27న పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. రింకూతో పాటు ఆప్ జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ కూడా రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారు. గత ఏడాది జరిగిన జలంధర్ లోక్సభ ఉపఎన్నికల్లో రింకు 58,691 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన దోబా ప్రాంతంలో కీలక దళిత నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించే దళితుల ప్రాబల్యం ఉన్న జలంధర్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి సమిష్టి కృషి చేయాలని సీఎం భగవంత్ మాన్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. "జలంధర్ లోక్సభ స్థానంపై దృష్టి అంతా ఉంది. పార్టీ ఎలాగైనా ఈ సీటును మళ్లీ గెలవాలనుకుంటోంది" అని సీఎం మాన్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. -
మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం.. కుమార్తె ఫోటో షేర్ చేసిన భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య.. డాక్టర్ ''గురుప్రీత్ కౌర్'' గురువారం మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవంత్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా షేర్ చేశారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్. ఈయన 2022 జులైలో గురుప్రీత్ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోయారు. భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్ కౌర్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తన కుమార్తె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb — Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024 -
సీఎం భగవంత్ మాన్ వీడియో వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు
లోక్సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్లోని సంగ్రూర్ లోక్సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. While Rome was burning Nero was playing flute ! Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor. ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ! ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024 ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్! -
ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్!
దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్లో లోక్సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్లోని ఒక హోటల్లో రోజంతా గడిపినట్లు తెలిసింది. ‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు. “సీఎం విశ్రాంతి మోడ్లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్కతా/చండీగఢ్: రానున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పంజాబ్లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా 300 లోక్సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
ఇండియా కూటమికి డబుల్ షాక్!
చంఢీగర్: ఇండియా కూటమికి డబుల్ షాక్ తగిలింది. పంజాబ్లో లోక్సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండబోదని సీఎం మమతా బెనర్జీ చెప్పిన కొన్ని గంటల తర్వాత భగవంత్ మాన్ కూడా పొత్తుపై స్పష్టతనిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ వర్గం చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 13 లోక్సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఒంటరిగానే పోటీ.. ఇండియా కూటమికి సీఎం మమత షాక్ ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇదీ చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
తీహార్ జైళ్లో పుట్టిన పార్టీ ఆప్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కొనసాగడం సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్,ఆప్ నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు రెండు పార్టీల మధ్య దూరం పెంచుతున్నాయి. కాంగ్రెస్ అనేది ఒక చరిత్రగా మారిందని పంజాబ్ సీఎం, ఆప్ అగ్రనేత భగవంత్మాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ తీహార్ జైలులో పుట్టింది. ఆ పార్టీకి చెందిన సగం మంది నేతలు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆప్ నమ్మదగిన పార్టీ కాదు. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు పొత్తు రాజకీయాలు అర్థం కావు. ఆప్ ఇండియా కూటమిలో ఉందో లేదో వాళ్లకే తెలియాలి. కూటమిలో ఉండాలంటే ఆప్ ఇతర పార్టీలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది’అని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ అన్నారు. కాంగ్రెస్ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్మాన్ సోమవారం ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లలో ఆ పార్టీ గురించి తల్లులు పిల్లలకు కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ ఉండేదని పిల్లలకు కథ చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్గా కాంగ్రెస్, ఆప్పై విరుచుకుపడుతోంది. ఇదీచదవండి..కేరళ గవర్నర్పై బృందాకారత్ సంచలన వ్యాఖ్యలు -
సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.. బీజేపీ నేత ఫైర్
బీజేపీ చెత్త రాజకీయలు చేస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలపై ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే ఘాటాల వ్యవహారంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మన్జిందర్ అన్నారు. ఇటీవల ఇదే విషయంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఘాటాల విషయంలో పంజాబ్పై తీవ్రమైన వివక్ష చూపుతోందని మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ స్పందించి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర ఘాటాన్ని తిరస్కరించడానికి అసలైన నిజం మరోటి ఉందని తెలిపారు. పంజాబ్ రూపొందించే ఘాటంపై మై భాగో జీ, అమరవీరుల ఫొటోలకు బదులుగా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలు ఉన్నాయని అన్నారు. భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే పంజాబ్ ఘాటం తిరస్కరణకు గురైందని తెలిపారు. భగవంత్ మాన్.. పంజాబ్ సార్వభౌమత్వాన్ని కేజ్రీవాల్ కాళ్ల వద్ద వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. The real reason for rejection of Punjab Tableau is that it prominently showed pics of Arvind Kejriwal & Bhagwant Mann rather than Mai Bhago Ji or martyrs! Mann Sahab is shamelessly lying; and worst is he has surrendered Punjab’s sovereignty in the feet of Kejriwal. Tussi Ta… pic.twitter.com/qF81TUHOyC — Manjinder Singh Sirsa (@mssirsa) December 29, 2023 ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సంబంధించిన ఘాటాలను ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలకు పంజాబ్ ఘాటం ఎంపిక చేయకుండా బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆప్ నేత ప్రియాంఖ్ కక్కర్ శుక్రవారం విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తర్ఖండ్లకు చెందిన ఘాటాను వరుసగా ఎంపిక చేస్తోందని.. ఢిల్లీ, పంజాబ్లను మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు తప్పించిందని మండిపడ్డారు. చదవండి: క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ.. -
మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్..
చండీగఢ్: పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. మలేర్కోట్లా జిల్లాలోని అమర్గఢ్లో సోమవారం ఉదయం ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను అదుపులోకీ తీసుకున్నారు. గతేడాది నమోదైన రూ. 40 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఈడీ ఈ చర్యకు పాల్పడింది. ఈ కేసులో పంజాబ్ శాసనసభ్యుడికి ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని జశ్వంత్ సింగ్ పట్టించుకోకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ సాయంత్రం ఎమ్మెల్యేను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అసలేం జరిగిందంటే.. పంజాబ్ లూదియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గతేడాది తారా కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతోపాటు జశ్వంత్ సింగ్, మరికొందరిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరంతా తమ బ్యాంకును రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బ్యాంకు, ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆప్.. తమను దెబ్బతీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పించింది. జశ్వందర్ సింగ్ ఆప్లో చేరే ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది తమ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన పన్నాగమని ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ కాంగ్ ఆరోపించారు. బహిరంగ సభలో నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిన విధానం చూస్తుంటే ఆప్ను కించపరిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అనుసరిస్తుందనే విషయం అర్థమవుతుందని మండిపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని నుంచి రూ. 508 కోట్లు లంచంగా తీసుకున్న ఆరోపణలపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ను కూడా ఈడీ విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని కోరగా.. ఇందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. ఇక ఇటీవల డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ విచారణలో భాగంగా మరో ఆప్ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్కు చెందిన పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. చదవండి: బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు -
సీఎం మాన్కు గవర్నర్ ఘాటు లేఖ.. ఆప్ సీరియస్
చండీగఢ్: ఆప్ సర్కార్ అధికారంలో ఉన్న పంజాబ్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు పీక్ స్టేజ్కు చేరుకొన్నాయి. తాను పంపిన లేఖలకు సీఎం భగవంత్ మాన్ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తానని, ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తానని హెచ్చరించారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల ప్రకారం.. సీఎం భగవంత్ మాన్కు పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం మాన్ను గవర్నర్ హెచ్చరించారు. తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే ఐపీసీలోని సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొంటానని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. తాను గతంలో రాసిన లేఖలకు మీరు(సీఎం మాన్) సమాధానం ఇవ్వకపోవడం పట్ల చాలా కలత చెందానని గవర్నర్ తన తాజా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తానని హెచ్చరించారు. పొలిటికల్ హీట్.. అంతేకాకుండా.. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని, అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గవర్నర్ పురోహిత్ లేఖపై ఆప్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పంజాబ్కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.. వీలైతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది. ఇది కూడా చదవండి: రైలు బోగీలో పేలిన సిలిండర్.. పలువురు మృతి -
పంజాబ్ సర్కార్ కీలక ముందడుగు.. ఇక ఉచితంగా గుర్బానీ ప్రసారాలు
అమృత్సర్లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసేలా ‘సిక్కు గురుద్వారాస్ (సవరణ) బిల్లు 2023’ను పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. రాజకీయంగా వివాదాల నడుమ ఈ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోద ముద్ర పడింది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. గుర్బానీ ప్రసారాన్ని అందరికీ ఉచితంగా అందించడమే ఈ బిల్లు లక్ష్యమని, దీనికి టెండర్ అవసరం లేదని తెలిపారు. ఇకపై గుర్భానీని ప్రసారాలను ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఛానల్ నుంచి అయినా ఉచితంగా వినవచ్చు, చూడవచ్చని సీఎం పేర్కొన్నారు. బాదల్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ తను సొంతంగా ఎలాంటి ఛానల్ నిర్వహించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘నా ఛానల్కు టెలికాస్ట్ హక్కులు ఇవ్వాలని నేను అడగడం లేదు. అలాంటప్పుడు బాదల్కు ఎందుకు సమస్య’ అని ప్రశ్నించారు. ఇకపై గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి.. కాగా, గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. 2007 నుంచి రాజకీయంగా శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీకి ప్రతి ఏడాది రూ. 2 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్కాలంనాటి సిక్కు గురుద్వారాస్ చట్టం 1925 సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారమే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. హర్యానాకు ప్రత్యేక గురుద్వారా కమిటీ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని, ఇది రాష్ట్ర పరిధిలోనిదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) మండిపడుతోంది. 1925 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శిస్తోంది. మరోవైపు పీటీసీ ప్రైవేట్ చానెల్కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది . -
నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
న్యూఢిల్లీ: ప్రఖ్యాత టెలివిజన్ షో ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మీరు గత 10-12 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా బాగా మద్యం సేవిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమేనా? అని ప్రశ్నించగా పంజాబ్ ముఖ్యమంత్రి.. నా లివర్ ఇనుముతో తయారైందనుకున్నారా ఏంటని చమత్కరించారు సీఎం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పెద్ద తాగుబోతు అని ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఆయనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. నా లివర్ ఇనుముతో తయారయ్యిందనుకున్నారా? ఏంటి? 10-12 ఏళ్లపాటు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతూ కూర్చుంటే అసలు బ్రతికేవాడినా? ప్రతిపక్షాలకు నా గురించి మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి చెత్త విమర్శలే చేస్తుంటారన్నారు సీఎం. నేను పొద్దున్న లేస్తూనే మొదటి ఫైల్ తెప్పించుకుని దాని గురించే ఆలోచిస్తాను. ఇలా పనిచేసే పంజాబ్లో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలోనే చేసి చూపించా. చిత్తశుద్ధితో పని చేశాను కాబట్టే ఈరోజు 88% ఇళ్లలో విద్యుత్తు ఇవ్వగలిగాము. 2019లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో భగవంత్ మన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన తల్లి సమక్షంలో మద్యం మానేస్తున్నట్టు బాహాటంగానే మాటిచ్చారు. ఆయన ఆ అలవాటు మానుకున్నా కూడా ఆయనకు ఆ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోయింది. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కారణమే ఇప్పుడు అదనుగా మారింది. मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं? जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है 88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है। नीयत होनी चाहिए काम करने की। —CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4 — AAP (@AamAadmiParty) June 18, 2023 ఇది కూడా చదవండి: "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా? -
బీజేపీపై పోరులో మాది ప్రత్యేక శైలి!
సాక్షి, హైదరాబాద్: నూతన పార్లమెంటు భవన ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్, ఆప్ సహా 19 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనపై తాము సంతకం చేయకున్నా.. కార్యక్రమానికి తాము కూడా దూరంగా ఉంటామని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేర్కొంది. బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తమదైన శైలిలో పనిచేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకించాలని కోరుతూ ఆప్ అధినేత, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రగతిభవన్లో కేసీఆర్తో భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్సింగ్ మాన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీపై కేంద్ర ఆర్డినెన్స్ను వ్యతిరేకించడం మొదలు జాతీయ రాజకీయాలు, బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్కు కేజ్రివాల్ వివరించినట్టు తెలిసింది. విపక్షాల ఐక్యతకు విశాల ఎజెండా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరిస్తూనే, భావసారూప్య పార్టీ లను కలుపుకొని ముందుకెళ్లే ధోరణితో వ్యవహరించాల న్నది తమ విధానంగా సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు భావ సారూప్య పార్టీల నడుమ విశాల ఎజెండా అవసరమని పేర్కొన్నట్టు సమాచారం. విపక్షాల ఓట్ల చీలిక ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటూ పలు ఉదాహరణలను పేర్కొన్నట్టు తెలిసింది. 1970వ దశకంలో ఎమర్జెన్సీ విధింపు దేశంలో కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, ప్రత్యామ్నాయ భావజాలానికి పురుడు పోసిందని.. ప్రస్తుత బీజేపీ విధానాలు కూడా దేశ రాజకీయాల్లో మార్పులకు కారణమవుతాయని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ప్రధాని మోదీ మోడల్ విఫలమైందని, కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని ముగ్గురు సీఎంలు అభిప్రాయపడినట్టు తెలిసింది. బీజేపీ కార్యాలయాలుగా గవర్నర్ ఆఫీసులు విపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అధికారం చేపట్టిన రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని ముగ్గురు సీఎంల భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఢిల్లీ, పంజాబ్లలో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్ పేర్కొనగా.. తెలంగాణలోనూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టిన వైనం, దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయాన్ని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ముందు వరుసలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే జూన్ మొదటి వారంలో జాతీయస్థాయిలో విపక్షాల నేతలు, సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉందని కేజ్రీవాల్ వెల్లడించినట్టు సమాచారం. అయితే ఇతర విపక్షాలతో కలిసి నడిచే అంశంలో కేసీఆర్ కొంత ఆచితూచి స్పందించినట్టు తెలిసింది. -
Hyderabad: కేసీఆర్తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో భేటీ కానున్నారు. కేజ్రీవాల్తో పాటు కూడా వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఈ భేటీలో పాల్గొంటారు. ప్రగతి భవన్ చేరుకున్న ఈ ఇద్దరికీ కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. లంచ్ తర్వాత వీళ్ల భేటీ జరగనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీ, పోస్టింగ్లపై కేంద్రంతో ఢీ కొట్టడానికి కేజ్రీవాల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. పలువురు ముఖ్యమంత్రులను కలిశారు కూడా. తాజాగా కేసీఆర్తోనూ కేజ్రీవాల్ ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అయ్యి మరీ ఈ ముగ్గురు సీఎంలు భేటీ అవుతుండడం గమనార్హం. సమావేశం అనంతరం ముగ్గురు సీఎంలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్పూర్ మధ్య.. వందేభారత్ -
గ్రాండ్గా పరిణీతి- రాఘవ్ ఎంగేజ్మెంట్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మే 13న జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కపుర్తలా హౌస్ వేదికగా మారింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్ కలర్ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఫంక్షన్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత చిదరంబరం సహా దాదాపు 150 మంది హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పరిణితి కజిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. కాగా ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! వాటికి బలం చేకూర్చుతూ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీరిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కారు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్ మ్యాచ్లోనూ జంటగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిన విషయం తెలిసిందే! ఎంత ప్రచారం జరిగినా దీనిపై స్పందించని ఈ జంట తాజాగా నిశ్చితార్థ వేడుకతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by @parineetichopra చదవండి: సమంతకు నేను పెద్ద ఫ్యాన్ను.. ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే.. -
Bhagwant Mann Daughter: ‘చంపేస్తాం’
ఢిల్లీ: పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్పాల్ సింగ్ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, సందేశాలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెప్పారు. సియాటెల్(సీటెల్)లో ఉంటున్న సీరత్ కౌర్కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్ కోరుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వొకేట్ తన ఫేస్బుక్ పోస్ట్లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా?.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్తాన్ సిద్ధిస్తుందా? అని ఖలీస్తానీ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్చేశారు. బెదిరింపులను సీరత్ కౌర్ తల్లి ఇందర్ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక.. స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఇందర్ప్రీత్, భగవంత్ మాన్కు మొదటి భార్య. వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్, కొడుకు దిల్షాన్ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్ప్రీత్ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది మాన్, గుర్ప్రీత్ కౌర్ అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. ఖలీస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్, ‘సిక్స్ ఫర్ జస్టిస్’.. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి కూడా. అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఖలీస్తానీ నేత(ఉగ్రవాది) జర్నైల్ సింగ్ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 గా అమృత్పాల్సింగ్ను పిలుచుకుంటున్నారు ఖలీస్తానీ మద్దతుదారులు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్పాల్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. -
80వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?
ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అమృత్పాల్ సింగ్ Amritpal Singh వ్యవహరంలో పంజాబ్-హర్యానాల హైకోర్టు.. పంజాబ్ ప్రభుత్వంపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్పాల్ను అరెస్ట్ చేయడంలో విఫలం కావడంపై మండిపడ్డ కోర్టు.. చేపట్టిన ఆపరేషన్ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్ పోలీస్ శాఖను ఆదేశించింది. మీదగ్గర ఎనభై వేలమంది పోలీసులున్నారు. ఏం చేస్తున్నట్లు? అసలు అమృత్పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నట్లు? అని పంజాబ్ సర్కార్పై ఆగ్రహం వెల్లగక్కింది. ఇది పూర్తిగా నిఘా వర్గాల ఫెయిల్యూర్ అంటూ వ్యాఖ్యానించింది కోర్టు. ఈ తరుణంలో.. అతన్ని అరెస్ట్ చేసేందుకు శనివారం నుంచి భారీ ఎత్తున్న చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఇప్పటిదాకా 120 మంది అమృత్పాల్ అనుచరుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ పరిణామాలపై స్పందించారు. పంజాబ్ కోరుకునేది శాంతి, అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఊపేక్షించబోం. కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు. ఖలీస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్గా అమృత్పాల్ సింగ్ పంజాబ్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ‘వారిస్ పంజాబ్ దే’ సిక్కు గ్రూప్ చీఫ్గా.. అమృత్పాల్ సింగ్ పంజాబ్లో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి దానిని స్థాపించింది సందీప్ సింగ్ అలియాస్ దీప్ సింగ్ అనే పంజాబీ నటుడు కమ్ ఉద్యమకారుడు. పంజాబీల హక్కుల సాధన-పరిరక్షణ విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకు ఈ గ్రూప్ను స్థాపించాడు. సందీప్ నుంచి వారసత్వంగా విభాగపు బాధ్యతలు తీసుకున్నాడు అమృత్పాల్ సింగ్. అయితే హక్కుల గ్రూప్ను కాస్త.. ఉగ్రవాదంపై మళ్లించినట్లు అమృత్పాల్ సింగ్పై అభియోగాలు నమోదు అయ్యాయి ఇప్పుడు. ఉదమ్యం ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు నిఘా వర్గాలు కాస్త ఆలస్యంగా గుర్తించాయి. కిందటి నెలలో తన అనుచరులను ఉసిగొల్పి ఓ పోలీస్ స్టేషన్పై మారణాయుధాలతో దాడికి దిగి.. తన ప్రధాన అనుచరుడిని విడిపించుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న పంజాబ్లోని ఆప్ సర్కార్, కేంద్రంతో పాటు అసోం ప్రభుత్వ సాయంతో అమృత్పాల్ సింగ్ని, అతని ప్రధాన అనుచరుల్ని అరెస్ట్ చేసేందుకు రహస్య ప్రణాళికను అమలు చేసింది. ఈ మేరకు మార్చి 2వ తేదీన పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అమృత్పాల్ సింగ్ అరెస్ట్కు వ్యూహం అమలు చేసే విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అయిన అమృత్పాల్ సింగ్ పక్కా ప్లాన్తోనే పంజాబ్లో వారిస్ పంజాబ్ దే గ్రూప్ను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. అనుచరుల పేరుతో బలగం తయారు చేసుకుని.. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక గీశాడు. ఈ మేరకు పాక్ నుంచి వచ్చిన అక్రమాయుధాలను.. డీ ఆడిక్షన్ కేంద్రాల్లో భద్రపరిచినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు అమృత్పాల్ సింగ్పై ఆయుధాల చట్టం కింద మరో కేసు నమోదు చేసి.. ఉగ్రకోణంలో దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ కేసులో ఏ1గా అమృత్పాల్ సింగ్ పేరును చేర్చింది కూడా. ఇదిలా ఉంటే.. అమృత్పాల్ సింగ్ అనుచరుల అరెస్ట్ పేరిట.. పంజాబ్ గ్రూప్ల కీలకసభ్యులను.. ఉద్యమకారులను, అమాయకపు పంజాబీ యువతను అరెస్ట్ చేస్తున్నారని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నారని, కుట్రను అంచనా వేయడంలో ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే.. అలాంటిదేం జరగడం లేదని సీఎం మాన్ ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. విదేశాల్లోని పంజాబీ గ్రూప్లను.. ఖలిస్తానీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. అమృత్పాల్ సింగ్ కోసం నాలుగు రోజులుగా వేట కొనసాగుతున్న వేళ.. విదేశాల్లోని వివిధ భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు తెగపడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అమృత్పాల్ సింగ్ పంజాబ్ దాటేసి పారిపోయి ఉంటాడన్న అనుమానాలతో అంతర్జాతీయ సరిహద్దులను సైతం అప్రమత్తం చేసింది కేంద్రం. సంబంధిత వార్త: పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్పాల్ సింగ్? -
AAP: కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్
భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారాయన. ఈ మేరకు ఆ రాష్ట్రంలో గెలిపిస్తే.. ఉచిత కరెంట్, విద్య, ఆరోగ్యభద్రత ఉంటుందని మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారాయన. మంగళవారం బీహెచ్ఈఎల్లోని దసరా మైదాన్లో ఏర్పాటు చేసిన జనసభలో ప్రసంగిస్తూ.. కేజ్రీవాల్ పై ప్రకటన చేశారు. అంతేకాదు.. మధ్యప్రదేశ్లో అధికారంలోకి వస్తే గనుక ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని, అవినీతికి చరమగీతం పాడతామని పేర్కొన్నారాయన. ఢిల్లీ, పంజాబ్లలో ఆప్ ప్రభుత్వాల పని తీరును ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. మధ్యప్రదేశ్లోనూ ఆప్కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. -
Gun Culture: ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..
పంజాబ్లో తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విరుచుకుపడింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకే రోజు సుమారు 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్పూర్ నుంచి 10, ఫరీద్కోట్ నుంచి 84, పఠాన్కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగర్ నుంచి 16 తపాకీ లైసెన్స్లను రద్దు చేసింది. అలాగే తుపాకుల లైసెన్సు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను పేర్కొంది. పంజాబ్లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకువెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది. రానున్న రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్లు నిర్వహిస్తారని, హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్లో మొత్తం మూడు లక్షల ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, 28 ఏళ్ల పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా హత్యోదంతంతో రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ సంస్కృతిపై దృష్టి సారించి, నియంత్రణ కోసం పిలుపునిచ్చింది. వాస్తవానికి సిద్ధు మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి, అవి తుపాకీ సంస్కృతిని బహింరంగంగా ప్రోత్సహించడమే గాక గ్యాంగ్స్టర్లను కీర్తించింది. అతను రైఫిల్తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. (చదవండి: ఫుల్గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..) -
తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్
-
ఎర్రవల్లికి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం ఎర్రవల్లిని సందర్శించనుంది. కాగా బుధవారం రాత్రి భగవత్మాన్సింగ్ హైదరాబాద్కు చేరుకొని సీఎం కేసీఆర్ను కలిశారు. మాన్సింగ్ బృందం కొండపోచమ్మ సాగర్ జలాశయంతో పాటు ఎర్రవల్లిలోని చెక్డ్యాం, పాండవుల చెరువును పరిశీలించనుంది. గురువారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి నగరానికి చేరుకోనుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ ఈ పర్యటనలో పాల్గొని.. ఆయా ప్రాజెక్టుల గురించి పంజాబ్ బృందానికి వివరించనున్నారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎంతో పాటు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయ ఐఏఎస్ అధికారులు, నీటిపారుదల శాఖాధికారులు పాల్గొంటారు.
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
టీడీపీ నేతలు కలసి రాకపోవడంతో నైరాశ్యం
ఓటమి భయంతో వసంత బూతు పురాణం
సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
మేనిఫెస్టో అమలు ఘనత వైఎస్ జగన్దే
వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్న చేరికలు
మరోసారి సీఎం వైఎస్ జగన్ను ఆశీర్వదించండి
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
ఆఖరికి మోదీ కూడా..దిగజారుడు మాటలు ఎందుకు..?
సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబంలో సంతోషం
తప్పక చదవండి
- PK: 'పులుసు కారుతోంది'..!
- సీఎం నితీష్కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- భరత్.. వైజాగ్ ఇప్పుడు గుర్తొచ్చిందా?
- Lok Sabha Election 2024: ఎన్నికల చరిత్రలో ఏకగ్రీవాలు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
Advertisement