-
మహిళా వలంటీర్లపై గూండాగిరి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకులందరినీ గుండాలు, రౌడీలంటూ నోరు పారేసుకుంటుంటారు. కానీ, ఆయన పార్టీ అభ్యర్థులు, నాయకులు మహిళా వలంటీర్ల పైన కూడా దౌర్జన్యానికి దిగి, గృహ నిర్బంధానికి పాల్పడ్డారు. కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ సహా ఆ పార్టీ నాయకులు గురువారం సాగించిన గూండాగిరీతో మహిళా వలంటీర్లు బెంబేలెత్తిపోయారు. ఓ మహిళా వలంటీరు పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటుండగా ఆ భవనంలోకి చొరబడటమే కాకుండా, ఆమెతో పాటు వేడుకలకు వచ్చిన మిగతా మహిళా వలంటీర్లపై దౌర్జన్యం చేసి, కుర్చిలు విరగ్గొట్టి, వారిని గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులకు గురి చేశారు. భయంతో మహిళలు కేకలు వేసినా, గర్భిణి ఉందని మొత్తుకున్నా ఖాతరు చేయలేదు. గంటన్నర పాటు మహిళలు ప్రాణాలు అరచేత పట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ప్రాణ భయంతో పోలీసులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి ఆ మహిళలను విడిపించారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మహిళా వలంటీరు మొయ్యా దుర్గా భవాని కాకినాడ రూరల్ నియోజకవర్గం వినాయక కేఫ్ సమీపంలోని ఓ భవనంలో గురువారం ముందస్తు పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ఆమె స్నేహితురాళ్లైన పలువురు మహిళా వలంటీర్లు హాజరయ్యారు. పుట్టిన రోజు కేకు, కూల్ డ్రింక్లు సిద్ధం చేసుకున్నారు. ఇంతలోనే హఠాత్తుగా 30 మందిని వెంట బెట్టుకుని కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అక్కడకు వచ్చారు. ఇక్కడ పార్టీ సమావేశం పెట్టుకుంటున్నారంటూ పెద్దగా కేకలు వేస్తూ వారిపై విరుచుకుపడ్డారు. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటున్నామని చెబుతున్నా వినకుండా తలుపులు తన్నుకుంటూ లోపలకు వెళ్లి వీరంగం సృష్టించారు. దీంతో మహిళా వలంటీర్లు భయాందోళనలకు గురయ్యారు. తమతో పాటు గర్భిణి ఉన్నారని, ఆమె భయపడిపోతున్నారని, కేకలు వేయవద్దని బతిమిలాడారు. అయినా వారు వినలేదు. నానా రచ్చ చేసి, వలంటీర్లు కూర్చున్న కుర్చిలను ధ్వంసం చేశారు. మహిళా వలంటీర్లు లోపల ఉండగానే నానాజీ కనుసైగలతో ఆ పార్టీ కార్యకర్తలు గది తలుపులు మూసేసి గొళ్లేలు పెట్టేసి, భవనం కింది భాగంలోకి వెళ్లిపోయారు. మహిళా వలంటీర్లు కిటికీల వద్దకు వచ్చి తలుపులు తీయాలని, ఊపిరి ఆడటంలేదని ఎంతసేపు అర్థించినా వినిపించుకోలేదు. జనసేన నాయకుల విధ్వంసంతో గర్భిణి నున్న చిట్టమ్మ గదిలోనే సొమ్మసిల్లి పడిపోవడంతో అంతా భయకంపితులయ్యారు. వారిలో ఒక వలంటీరు తన మొబైల్ ఫోను ద్వారా కాకినాడ డీఎస్పీ హనుమంతరావుకు సమాచారం అందించింది. దీంతో సర్పవరం సీఐ వైఆర్కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అక్కడకు చేరుకున్నాయి. పోలీసులు తలుపులు తెరిచి మహిళా వలంటీర్లను విడిపించారు. అక్కడ రాజకీయ పార్టీ సమావేశం జరుగుతోందంటూ పంతం నానాజీ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆ కార్యాలయంలో రాజకీయ పార్టీకి సంబంధించి ఎటువంటి ఆధారాలూ లేవని ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి బీబీబీ రాజు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశామని, అన్ని వివరాలు రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్కు నివేదిస్తామని రాజు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు జనసేన నాయకుల దాడిపై రమణయ్యపేట కూరగాయల మార్కెట్ వీధికి చెందిన బాధిత వలంటీరు దుర్గాభవాని సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు జనసేన అభ్యర్థి పంతం నానాజీతో పాటు పలువురిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మహిళల గృహ నిర్బంధం, భయభ్రాంతులకు గురి చేయడం, మూకుమ్మడిగా వచ్చి దౌర్జన్యం చేశారనే అభియోగాలపై ఐపీసీ 143, 452, 341, 342, 506 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. భయంతో వణికిపోయాం ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి పడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. నాకు ఏడో నెల. గర్భిణి అని కూడా కనీసం జాలి, కరుణ కూడా లేకుండా గదిలో నిర్బంధించి తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఏం జరుగుతుందోనని భయంతో వణికిపోయాం. తీవ్ర ఆందోళనతో సొమ్మసిల్లి పడిపోయాను. – నున్న చిట్టమ్మ, రమణయ్యపేట మహిళలని కూడా చూడలేదు జనసేన నాయకులు, కార్యకర్తలు అమానుషంగా ప్రవర్తించారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంటున్న వారు మహిళలని కూడా చూడకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారు. కుర్చీలు విరగ్గొట్టేశారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే దౌర్జన్యం చేసి, తలుపు గడియ పెట్టేసి వెళ్లిపోయారు. ఏ రాజకీయ పార్టీ సమావేశం పెట్టుకోవడంలేదని ఎంత చెప్పినా వినలేదు. – కుసనం శాంతకుమారి, రమణయ్యపేట పుట్టిన రోజు చేసుకుంటుంటే నిర్బంధించారు నా పుట్టిన రోజు శుక్రవారం అయినప్పటికీ స్నేహితులందరూ అందుబాటులో ఉండరని చెప్పడంతో గురువారమే వేడుకలు చేసుకునేందుకు వారందరినీ ఆహా్వనించాను. కేకు తెచ్చుకొని పార్టీ సిద్ధమవుతుండగా ఒకేసారి గుంపుగా వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా కార్యాలయం గది తలుపులు మూసేసి, గడియ పెట్టి నిర్బంధించారు. ఎంత వేడుకున్నా తలుపులు తీయలేదు. – మొయ్యా దుర్గాభవాని, రమణయ్యపేట, కాకినాడ రూరల్ -
Natarajan Birthday Photos: నటరాజన్ బర్త్డే సెలబ్రేషన్స్.. కేక్ తినిపించిన అజిత్ (ఫోటోలు)
-
హీరో శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకలు
-
Chiranjeevi Srikanth Latest Photos: శ్రీకాంత్ ఇంటికి వెళ్లి మరీ కేక్ కట్ చేయించిన మెగాస్టార్ (ఫోటోలు)
-
యాంకర్ లాస్య రెండో కుమారుడి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
లేడీ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ బర్త్ డే (ఫొటోలు)
-
Sree Vishnu: నాలుగేళ్లకోసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న కుర్ర హీరో (ఫోటోలు)
-
బిర్యానీ కోసం వెళ్లి.. ముగ్గురు మృతి
గద్వాల క్రైం: ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుడి కుమార్తె జన్మదిన వేడుకలను సిబ్బంది సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య జరుపుకొన్నారు. అనంతరం సిబ్బంది బిర్యానీ తినేందుకు వైద్యుడి కారులో హోటల్కు వెళ్లారు. అయితే డ్రైవర్ అత్యు త్సాహంతో అతి వేగంగా కారును నడపడంతో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి కక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన జోగుళాంబ గద్వాల మండలం జమ్మిచేడ్ వద్ద శనివారం తెల్లవారుజమున చోటు చేసు కుంది. ప్రత్యక్ష సాక్షులు, గద్వాల సీఐ శ్రీనివాసులు కథనం ప్రకారం వివరాలు.. గద్వాలలోని అనంత ఆస్పత్రిలో స్థానిక చింతల్పేటకు చెందిన ఆంజనేయులు (50) సెక్యూరిటీగా పనిచేస్తుండగా, వనపర్తిజిల్లా పెబ్బేరుకు చెందిన పవన్ (28), మల్దకల్ మండలానికి చెందిన నరేశ్ (23), పాల్వా యి గ్రామానికి చెందిన నవీన్, కేటీదొడ్డి మండలం మైల గడ్డకు చెందిన గోవర్ధన్ ల్యాబ్ టెక్నీషియన్లుగా పనిచేస్తున్నా రు. వైద్యుడు వెంకటేశ్ కూతురు పుట్టినరోజు ఉండటంతో శుక్ర వారం అర్ధరాత్రి సిబ్బంది సమక్షంలో వేడుకలు నిర్వ హించారు. ఆ తర్వాత ఆరుగురు సిబ్బంది బిర్యానీ తింటా మని చెప్పడంతో వెంకటేశ్ వారికి రూ.5వేలు ఇచ్చారు. డ్రైవర్ మ హబూబ్తో కలిసి ఆరుగురు అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎర్రవల్లి వైపు బయలుదేరారు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి జమ్మిచేడ్ శివారులో కల్వర్టు వద్ద డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారు గాల్లోఎగిరి 100 మీ టర్ల వరకు పల్టీలు కొట్టింది. ఈ క్రమంలోనే కారు పైభాగం (సన్రూఫ్) తెరుచుకోవడంతో ఆంజనేయులు, పవన్, నరేశ్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ మహబూబ్, నవీ న్, గోవర్ధన్లను అనంత ఆస్పత్రికి తరలించారు. విషమంగా ఉన్న నవీన్ను మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. మృతుడు ఆంజనేయులు కుమారుడు నవీన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
కూతురు బర్త్డే సెలబ్రేషన్స్లో నిక్-ప్రియాంక (ఫొటోలు)
-
రోహిత్ శర్మ సొంత తమ్ముడి కవల పిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Navishka Birthday Celebrations Pics: మెగాస్టార్ మనవరాలు నవిష్క బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Samaira Birthday Celebrations: రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కూతురితో కలిసి చిన్నపిల్లాడిలా రోహిత్ శర్మ ఆటలు.. వీడియో
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గారాల పట్టి సమైరా శర్మ ఐదో పుట్టినరోజు నేడు(డిసెంబరు 30). ఈ సందర్భంగా హిట్మ్యాన్ తన చిన్నారి కూతురు కోసం తానూ చిన్నపిల్లాడిలా మారిపోయాడు. తన ముద్దుల కుమార్తెతో కలిసి టాయ్ ట్రైన్లో విహరిస్తూ సందడి చేశాడు. ఆమెతో కలిసి అల్లరి చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఆ తర్వాత.. కుటుంబ సభ్యుల సమక్షంలో సమైరా బర్త్డేను ఘనంగా సెలబ్రేట్ చేశాడు. భార్య రితికా సజ్దేతో కలిసి సమైరాతో కేక్ కట్ చేయించాడు. ‘సమైరా పోనివిల్లే థీమ్’ పేరిట నిర్వహించిన ఈ పార్టీకి సంబంధించిన వీడియోను రితిక ఇన్స్టాలో షేర్ చేసింది. రోహిత్ శర్మ సైతం.. ‘‘నీ ఎదుగులను చూస్తూ మురిసిపోవడమే మా జీవితానికి సార్ధకత’’ అంటూ ఉద్వేగపూరిత శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ నేపథ్యంలో సమైరాకు హిట్మ్యాన్ అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా రితికా సజ్దేతో ఆరేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన రోహిత్ శర్మ డిసెంబరు 13, 2015లో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు డిసెంబరు 30, 2018లో కుమార్తె జన్మించగా ఆమెకు సమైరాగా నామకరణం చేశారు. వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత.. రోహిత్ శర్మ సారథ్యంలో.. సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్లు గెలిచి టీమిండియా అజేయంగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లోనూ విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో ఒత్తిడిని జయించలేక బోల్తా పడ్డ రోహిత్ సేన.. రన్నరప్తో సరిపెట్టుకుంది. ఓటమిని తట్టుకోలేక కన్నీటి పర్యంతమైన భారత ఆటగాళ్లు భారమైన హృదయాలతో మైదానాన్ని వీడారు. ఇక ఈ మ్యాచ్ తర్వాత దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ సందర్భంగా మళ్లీ జట్టుతో చేరాడు. సఫారీ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన తొలి భారత కెప్టెన్గా సత్తా చాటాలని భావించాడు. కానీ అతడి కల నెరవేరలేదు. సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ బాక్సింగ్ డే టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన ప్రొటిస్.. ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించింది. ఈ మ్యాచ్లో రోహిత్ మొత్తంగా కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఆటగాడిగానూ విఫలమయ్యాడు. ఇక సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు జనవరి 3 నుంచి ఆరంభం కానుంది. చదవండి: టీమిండియాతో రెండో టెస్టు.. సౌతాఫ్రికాకు మరో ఊహించని షాక్ View this post on Instagram A post shared by Rohit Sharma (@rohitsharma45) -
లండన్ లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
UAE: దుబాయ్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
యూఏఈలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు కొనసాగుతున్నాయి. దుబాయ్లోని కరమా పార్క్లో వైఎస్ జగన్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రం, ఇర్షాద్, చక్రి, అబ్దుల్లా, ఖాజా అబ్దుల్ , విజయ భాస్కర్ రెడ్డి ,సిరాజ్లతో పాటు వందలాది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జగన్ అన్న మీద ఉన్న అభిమానం దేశాలు దాటి ఇలా విస్తరించడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రజల దీవెనలతో జగన్ అన్న శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని వారు ఆకాంక్షించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని యూఏఈ కన్వీనర్ సయ్యద్ అక్రం మహిళలకు చీరలు పంచిపెట్టారు. అనంతరం ప్రతి ఒక్కరికి విందు ఏర్పాటు చేసి వైభవంగా జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. -
ఊరూరా సంబరాలు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: సీఎం జగన్ పుట్టిన రోజును పురిష్కరించుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఊరూరా ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పేదలు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు, ఆహారం పంపిణీ చేశారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లండన్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగరం వరకు దారిపొడవునా వైఎస్సార్సీపీ నేత పుత్తా ప్రతాప్రెడ్డి.. సీఎం జగన్ చిత్రాలతో ఏర్పాటు చేసిన జెండాలు, ప్లెక్సీలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, మహేశ్బాబు ఎక్స్ (ట్విటర్) ద్వారా సీఎం జగన్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది సీఎం మరిన్ని విజయాలు సాధించాలని, నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు పేర్కొన్నారు. వీరికి సీఎం జగన్ కూడా ఎక్స్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. ‘మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు. పండుగలా జన్మదిన వేడుకలు ► చిత్తూరు, తిరుపతి జిల్లాల వ్యాప్తంగా ఓ పెద్ద పండుగలా జరిగింది. తిరుపతిలో టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకరరెడ్డి ఆ«ధ్వర్యంలో 115 మంది వైఎస్సార్సీపీ శ్రేణులు రక్తదానం చేశారు. రుయాలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. చంద్రగిరిలో తుడా చైర్మెన్ చెవిరెడ్డి మోహిత్రెడ్డి ఆధ్వర్యంలో 338 మంది రక్తదానం చేశారు. కేసీ పేటలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి సతీమణి లక్ష్మి విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు ఆధ్వర్యంలో వంద మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, తట్టలో పూలు విక్రయించే వంద మందికి గొడుగులు, 15 మందికి బంకులు, 50 మంది నాయి బ్రాహ్మణులకు కిట్లు, 100 మందికి జంగమదేవర కిట్లు పంపిణీ చేశారు. వడమాలపేట మండలం అప్పళాయగుంట నుంచి నగరి వరకు మంత్రి రోజా పార్టీ శ్రేణులతో కలసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పుత్తూరు ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినులు శిక్షణ పొందడానికి రూ.2.05 లక్షల విలువగల కుట్టుమిషన్లు అందించారు. ► ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. ఎస్ఆర్ఐటీ కళాశాలలో 430 మంది, తాడిపత్రిలో 100 మంది రక్తదానం చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో చిత్రావతి నదిలో బోట్లపై వైఎస్సార్ సీపీ జెండాలు ఎగురవేస్తూ సీఎం జగన్ చిత్రపటంతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో ఎంజీఎం పాఠశాల విద్యార్థులు ‘హ్యాపీ బర్త్డే జగన్ మామయ్యా’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి రక్తదానం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి, నరసరావుపేట, మాచర్లలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మంత్రి అంబటి సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంలో రక్తదానం చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి రక్తదానం చేశారు. వేమూరు సమీపంలోని ఓ చెరువు మధ్యలో జగన్ అభిమాని కారుమూరు వెంకటరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగనన్న’ అంటూ ఏర్పాటు చేసిన అక్షరాల ఆకృతి ఆకట్టుకుంది. ► ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పలు చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించారు. విజయవాడ తూర్పు, పశ్చిమలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నియోజకవర్గంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరై జగన్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ పుట్టిన రోజు సంబరాలు సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నులపండుగగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల కరతళధ్వానాలు, జై జగన్ నినాదాల మధ్య పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ను కట్ చేశారు. అంతకుముందు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. మత గురువులు సర్వమత ప్రార్థనలు జరిపి సీఎం జగన్ను ఆశీర్వదించారు. పేదలకు దుస్తులు, కుట్టుమిషన్లు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్ అందజేశారు. పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే తిప్పేస్వామి, తెలుగు అకాడమి చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, పార్టీ నేతలు జూపూడి ప్రభాకరరావు, పుత్తా ప్రతాప్రెడ్డి, చల్లా మధు, ఎన్. పద్మజ, నారాయణమూర్తి, రవిచంద్రారెడ్డి, కాకుమాను రాజశేఖర్, ఎన్ఆర్ఐ పండుగాయల రత్నాకర్, కనకరావు మాదిగ, మనోహర్రెడ్డి, పానుగంటి చైతన్య, బందెల కిరణ్, నాగదేవి రవికుమార్, పాల్గొన్నారు. తెలంగాణలోనూ సంబరాలు.. ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను తెలంగాణాలోనూ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లి, బాలాజీనగర్, కేపీహెచ్బీ, మూసాపేట, మోతీనగర్, బాలానగర్, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో కేక్లు కట్ చేశారు. కేపీహెచ్బీకాలనీలోని రమ్యా గ్రౌండ్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. రమ్యా గ్రౌండ్స్లో తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం వైఎస్ఆర్సీపీ ఐటి విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాక్షి ఫైనాన్షియల్ డైరెక్టర్ వై.వి.ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి, సినీ నటుడు కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు. భరత్నగర్ కాలనీ పోచమ్మ గ్రౌండ్లో అభిమానులు కేక్ కట్చేసి శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యి ఇళ్లల్లో గృహప్రవేశం ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. అన్న, రక్తదాన, దుప్పట్లు, దుస్తుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. నందికొట్కూరు పట్టణానికి చెందిన కళాకారుడు దేశెట్టి శ్రీనివాసులు తన రక్తంతో ముఖ్యమంత్రి చిత్రాన్ని గీశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో అన్నదాన, రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. కడపలో డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ సురేష్ బాబు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు అవయవదానానికి హామీ పత్రం ఇచ్చారు. రామేశ్వరం జగనన్న కాలనీలో 1000 ఇళ్లలో గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించారు. పులివెందుల్లో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రక్తదానం చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి స్థానిక వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో కేక్ కట్ చేశారు. మదనపల్లెలో మల్లెల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లెల పవన్కుమార్ ఆధ్వర్యంలో 5 వేల మంది ఆటో కార్మికులకు యూనిఫారాలు, మహిళలకు చీరలను పంపిణీ చేశారు. రూ.7 కోట్ల విలువైన కానుకలు పంపిణీ చిత్తూరు అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకొని చిత్తూరులో ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎం.సి.విజయానందరెడ్డి మహిళలకు భారీగా కానుకలను పంపిణీ చేశారు. దాదాపు రూ.7 కోట్ల విలువ చేసే నూతన వస్త్రాలను అందజేశారు. రూ.1,300 విలువ చేసే కిట్లను చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, మేయర్ అముద చేతుల మీదుగా 44 వేల మంది మహిళలకు అందచేశారు. ఈ సందర్భంగా విజయానంద రెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ బలమే మహిళలని, వారి ఆశీస్సులు ఆయనకు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురేస్తామని, చిత్తూరు నియోజకవర్గ నుంచి తొలి విజయాన్ని అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం గుడిపాల మండలంలో జరిగిన కార్యక్రమంలో 10 వేల మంది మహిళలకు సైతం ఈ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీకాంత్, సహదేవ, ఇందు, కోఆప్షన్ సభ్యులు చందు, అను, పలువురు సర్పంచ్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉప్పలపాడులో బజరంగ్ సేవా తత్పరత పెదకాకాని: గుంటూరు జిల్లా ఉప్పలపాడులో బజరంగ్ ఫౌండేషన్ పౌండేషన్ వ్యవస్థాపకుడు అంబటి మురళీకృష్ణ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. వైద్య శిబిరంలో 1,211 మంది కంటి, గుండె పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 35 మందికి వైద్యులు యాంజియోగ్రాం సూచించగా, వారిని శనివారం ప్రత్యేక వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తీసుకెళ్లనున్నారు. ఏడుగురు దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇద్దరికి జైపూర్ కాళ్లు, వెస్ట్రన్ కమోడ్లు అందజేశారు. మురళీకృష్ణ మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పాలనలో పేదల ఇంటి ముందుకే సంక్షేమ ఫలాలు అందుతున్నాయని కొనియాడారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని బజరంగ్ ఫౌండేషన్ అంకిత భావంతో ప్రజా సేవను కొనసాగిస్తోందన్నారు. గత సంవత్సర కాలంగా ‘బజరంగ్ జగన్నామ సంక్షేమ సంవత్సరం’లో కంటి సమస్యల నివారణకు నేత్రజ్యోతి ద్వారా ఉచిత నేత్ర వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఏడు పనిదినాల్లో కళ్లజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో పెద్దేటమ్మ తల్లి పీఠం వద్ద కేక్ కట్ చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పేదవాడి గుండె చప్పుడు సీఎం జగన్
-
పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్: సజ్జల
-
తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సీఎం జగన్ బర్త్ డే సెలబ్రేషన్స్
-
పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు సీఎం జగన్: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, ఎంపీ నందిగం సురేష్, పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత జగన్దేనన్నారు. ఇచ్చిన హమీలను నెరవేర్చి.. పేదల జీవితాల్లో వెలుగు తెచ్చిన నాయకుడు జగన్ అని పేర్కొన్నారు. ‘‘తండ్రిని మించిన తనయుడిగా జగన్ పాలన అందిస్తున్నారు. పూర్తి పారదర్శకంగా సంక్షేమం పథకాలు అందించిన ఘనత జగన్దే. అవినీతికి తావులేకుండా, అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘తండ్రికి మించిన తనయుడుగా జగన్ పేరు తెచ్చుకున్నారు. పేదల చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆస్పత్రులు ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు. అన్నీ కళ్లముందే కనిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకున్నారు. జగన్ పాలన పారదర్శకంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల కోసం మారీచశక్తులు మళ్లీ ఏకం అయ్యాయి. గతంలో మోసం తప్ప ప్రజలకు ఇంకేమీ చేయలేదు. ప్రజల కష్టాలు, కన్నీళ్ళు చూశానని లోకేష్ అంటున్నారు. మరి మంత్రిగా చేసినప్పుడు అవి కనపడలేదా?. అధికారంలో ఉన్న మిమ్మల్ని ప్రజలు ఈడ్చి కొట్టారు. అయినాసరే మళ్ళీ ప్రజలను నమ్మించేందుకు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎల్లో మీడియాని అడ్డుపెట్టుకుని ప్రజలను భ్రమల్లో ఉంచుతున్నారు’’ అంటూ సజ్జల మండిపడ్డారు. సీఎం జగన్ పుట్టిన రోజు పురస్కరించుకుని గురువారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో భారీఎత్తున సేవా కార్యక్రమాలను వైఎస్సార్సీపీ శ్రేణులు చేపట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడంతో పాటు అన్నదానం, వస్త్రదానాలు చేస్తున్నారు. ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేస్తున్నారు. రక్తదాన శిబిరాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో సీఎం జగన్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి ఇదీ చదవండి: జయహో జననేతా..ఏ దైవం పంపించాడో! -
సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ వైఎస్సార్సీపీ స్పెషల్ వీడియో
-
సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా మంత్రి రోజా స్పెషల్ గిఫ్ట్
-
హైదరాబాద్ లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
-
53 వేల కుటుంబాలకు మందికి బట్టల పంపిణీ కార్యక్రమం
-
అనంతపురం జిల్లాలో సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement