ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

Published Fri, May 10 2024 3:50 PM

ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

ఎస్పీ కిరణ్‌ ఖరే

భూపాలపల్లి రూరల్‌: ఈ నెల 13న జరగనున్న పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిహించాలని ఎస్పీ కిరణ్‌ఖరే పోలీస్‌ అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్ల వారీగా జిల్లాలోని పోలీస్‌ అధికారులు సిబ్బందితో గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్‌ ఖరే మాట్లాడుతూ సమస్యాత్మక, మావోయిస్టు ప్రభావిత పోలింగ్‌ స్టేషన్లను ఎస్‌హెచ్‌ఓలు ప్రత్యేకంగా సందర్శించాలన్నారు. గత ఎన్నికలలో అల్లర్లు సృష్టించిన వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఓటు హక్కు లేని స్థానికేతరులు ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదన్నారు. అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా సరిహద్దు చెక్‌ పోస్ట్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement