-
IND VS AUS: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్ విడుదల
ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25కు సంబంధించిన షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. భారత-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఈ హైఓల్టేజ్ సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. 1991-92 సీజన్ తర్వాత తొలిసారి ఈ సిరీస్ ఐదు మ్యాచ్ల సిరీస్గా మారింది. ఈ సిరీస్లో రెండో టెస్ట్ మ్యాచ్ డే అండ్ నైట్ మ్యాచ్గా సాగనుంది. పింక్ బాల్తో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన టికెట్లు జూన్ 4 నుంచి ఆన్లైన్లో లభ్యమవుతాయి. ఇటీవలికాలంలో జరిగిన నాలుగు BGT సిరీస్లను వరుసగా కైవసం చేసుకున్న టీమిండియా.. ఐదో సిరీస్పై కన్నేసింది. భారత్ 2017, 2019, 2021, 2023 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 షెడ్యూల్.. నవంబర్ 22-26- పెర్త్ డిసెంబర్ 6-10- అడిలైడ్ ఓవల్ (డే అండ్ నైట్, పింక్ బాల్ టెస్ట్) డిసెంబర్ 14-18- గబ్బా డిసెంబర్ 26-30- మెల్బోర్న్ 2025 జనవరి 3-7- సిడ్నీ -
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారు
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగాల్సి ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 వేదికలు ఖరారైనట్లు తెలుస్తుంది. ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (ఎఫ్టీపీ) ప్రకారం ఈ టోర్నీ ఈ ఏడాది నవంబర్-వచ్చే ఏడాది జనవరి మధ్యలో జరుగనుంది. ప్రతిష్టాత్మక సిరీస్కు ఈ దఫా ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది. సంప్రదాయానికి విరుద్దంగా ఈసారి నాలుగు మ్యాచ్ల సిరీస్ కాకుండా ఐదు మ్యాచ్ల సిరీస్ జరుగనుందని తెలుస్తుంది. ఇందులో ఓ డే అండ్ నైట్ మ్యాచ్ను కూడా యాడ్ చేశారని సమాచారం. ఆస్ట్రేలియా గడ్డపై గత రెండు సిరీస్ల్లో (BGT) భారత్ చారిత్రక విజయాలు సాధించిన విషయం తెలిసిందే. 2018-19, 2020-21 సిరీస్లను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. ఆసీస్ గడ్డపై టెస్ట్ల్లో భారత్ సాధించిన తొలి విజయాలు ఇవే. ఇటీవల భారత్ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ల సిరీస్లోనూ భారత్దే పైచేయిగా నిలిచింది. ఈ సిరీస్లోనూ టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేసింది. భారత్లో జరిగిన 2016-17 సిరీస్లోనూ టీమిండియానే విజయం వరించింది. ఆ సిరీస్లో కూడా భారత్.. 2-1 తేడాతో ఆసీస్ను ఓడించింది. ఈ లెక్కన టీమిండియా ఆసీస్పై వరుసగా నాలుగు టెస్ట్ సిరీస్ల్లో విజయాలు సాధించింది. అన్ని సిరీస్ల్లో టీమిండియా 2-1 తేడాతో ఆసీస్ను చిత్తు చేయడం విశేషం. ఈ నాలుగు సిరీస్ల్లో 2020-21 గబ్బా టెస్ట్కు చాలా ప్రత్యేకత ఉంది. అప్పటిదాకా గబ్బాలో ఓటమి ఎరుగని ఆసీస్కు టీమిండియా ఓటమి రుచి చూపించింది. ఆ మ్యాచ్లో రిషబ్ పంత్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. రాబోయే సిరీస్ 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ దృష్ట్యా చాలా కీలకం కానుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్పై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వేదికలను లాక్ చేసినట్లు సమాచారం. తొలి టెస్ట్: పెర్త్ రెండో టెస్ట్: అడిలైడ్ (డే అండ్ నైట్) మూడో టెస్ట్: గబ్బా నాలుగో టెస్ట్: మెల్బోర్న్ ఐదో టెస్ట్: సిడ్నీ -
ఆ విజయం తర్వాత ఆసీస్ మమ్మల్ని చూసి భయపడుతోంది: కోహ్లి
ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు ముందు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండు సిరీస్లో విజయం సాధించడంతో కంగారూ జట్టు కూడా టీమిండియాను చూసి భయపడుతుందని కోహ్లి తెలిపాడు. కాగా 2018-19 ఆసీస్ టూర్లో కోహ్లి కెప్టెన్సీలో టెస్టు సిరీస్ను భారత్ సొంతం చేసుకోగా.. 2020-21లో రహానే సారధ్యంలో కూడా చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించింది. అయితే ఈ సిరీస్లో తొలి టెస్టుకు విరాట్ కోహ్లినే నాయకత్వం వహించాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి స్వదేశానికి రావడంతో రహానే టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. ఇక ఇదే విషయంపై తాజాగా స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లి మాట్లాడాడు. "టెస్టు క్రికెట్ తొలి రోజుల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా తీవ్రంగా ఉండేది. ఇరు జట్ల మధ్య ఉద్రిక్త వాతావరణం ఉండేది. కానీ మేము ఆస్ట్రేలియాలో వరుసగా రెండు సిరీస్లు గెలిచిన తర్వాత ఆ పోటీ కాస్త గౌరవంగా మారింది. అప్పటి నుంచి మమ్మల్ని ఆసీస్ జట్టు తేలికగా తీసుకోవడం లేదు. వారి గడ్డపై కూడా మేము గట్టి పోటీని ఇచాం. అలా అని ఆసీస్ను మేము కూడా తేలికగా తీసుకోం" అని కోహ్లి పేర్కొన్నాడు.అదే విధంగా ఓవల్ మైదానం గురించి మాట్లాడుతూ.. అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన జట్టే చాంపియన్గా నిలుస్తుంది అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 7 నుంచి లండన్లోని ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. చదవండి: WTC Final 2023: అశ్విన్ వర్సెస్ ఉమేశ్ యాదవ్.. రోహిత్కు కఠిన పరీక్ష! -
హ్యాట్సాఫ్ హార్దిక్ పాండ్యా.. అశ్విన్ ప్రశంసల జల్లు! ఇలాంటి స్టార్ నోటి నుంచి..
India Vs Australia: ‘‘సాధారణంగా మనమంతా మన వైఫల్యాలకు ఇతరులను బాధ్యులను చేసేలా మాట్లాడతాం. మనం నిరాశ చెందాల్సి వచ్చిన సమయంలో మూఢనమ్మకాలు, ఇతరత్రా కారణాలు చూపి తప్పించుకోవాలని చూస్తాం. కానీ హార్దిక్ అలా కాదు. టెస్టులు ఆడేందుకు ప్రస్తుతం తాను అర్హుడిని కానని తనే స్వయంగా అంగీకరించాడు’’ అంటూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ప్రశంసించాడు. స్టార్ నోటి నుంచి ఇలాంటి మాటలు.. పాండ్యాలాంటి స్టార్ నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం అతడి గొప్పదనానికి నిదర్శనమని.. హ్యాట్సాఫ్ హార్దిక్ పాండ్యా అంటూ ఆకాశానికెత్తాడు. కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో తొలి మ్యాచ్కు పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా సారథిగా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన హార్దిక్కు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ జట్టు కూర్పు గురించి ప్రశ్న ఎదురైంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడే అవకాశం ఉందా అని విలేకరులు హార్దిక్ను ప్రశ్నించగా.. తానిప్పుడు టెస్టులు ఆడేందుకు ఏమాత్రం సిద్ధంగా లేనని, వేరొకరి స్థానాన్ని ఆక్రమించలేనని వ్యాఖ్యానించాడు. టీమిండియా టెస్టు విజయాల్లో తన పాత్ర ఏమాత్రం లేదని.. అలాంటిది జట్టులో చోటుకు అర్హుడినెలా అవుతానని ప్రశ్నించాడు. హార్దిక్ వ్యాఖ్యలపై స్పందించిన అశ్విన్ హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. అతడి నిజాయితీని మెచ్చుకున్నాడు. హార్దిక్ కెప్టెన్సీ అమోఘం ఇక ఆసీస్తో తొలి వన్డేల్లో టీమిండియా ఘన విజయం నేపథ్యంలో.. ‘‘రోహిత్ శర్మ గైర్హాజరీలో హార్దిక్ టీమిండియాను ముందుండి నడిపించాడు. ఆస్ట్రేలియా భారీ స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ హార్దిక్ తెలివిగా సిరాజ్, షమీతో వరుస ఓవర్లు వేయించి సఫలమయ్యాడు. స్పిన్నర్లు రెండు వికెట్లు తీసిన తర్వాత కూడా పేసర్లకు ఉన్న అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. 155కి కేవలం మూడు వికెట్లు కోల్పోయి పటిష్టంగా ఉన్న జట్టును 188 పరుగులకే ఆలౌట్ చేయడమంటే మాటలు కాదు’’ అని హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నైపుణ్యాలను ప్రశంసించాడు. కాగా ముంబై వన్డేలో గెలుపొందిన టీమిండియా.. వైజాగ్ మ్యాచ్లో ఆసీస్ చేతిలో ఓడిపోయింది. దీంతో 1-1తో సమమైన సిరీస్ ఫలితం మార్చి 22నాటి చెన్నై ఫలితంతో తేలనుంది. ఇదిలా ఉంటే.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023లో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన అశ్విన్.. జూన్ 7న మొదలుకానున్న డబ్ల్యూటీసీ ఫైనల్కు సిద్ధమవుతున్నాడు. చదవండి: IPL 2023: పంజాబ్ కింగ్స్కు ఊహించని షాక్.. విధ్వంసకర వీరుడు దూరం! ICC Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో భారీ కుదుపు.. నంబర్ 1 స్థానం కోసం కొత్త ఛాలెంజర్ -
ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా
ICC Test Rankings- Ravichandran Ashwin- Virat Kohli: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నంబర్ 1 బౌలర్గా అవతరించాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు ర్యాకింగ్స్లో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. మరోవైపు.. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ర్యాంకింగ్స్లో ఏకంగా ఎనిమిది స్థానాలు ఎగబాకాడు. తద్వారా 13వ ర్యాంకు సాధించాడు. ఇక స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సైతం బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 44వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఆల్రౌండర్ల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో సత్తా చాటి ఈ మేరకు టీమిండియా ఆటగాళ్లు ఆయా విభాగాల్లో ర్యాంకులు సాధించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అశ్విన్ సొంతగడ్డపై ఆసీస్తో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో అశ్విన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మొత్తంగా 25 వికెట్లు కూల్చి టీమిండియా ట్రోఫీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. మొత్తంగా 25 వికెట్లు తీయడంతో పాటు 86 పరుగులు సాధించిన అశూ.. మరో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా(22 వికెట్లు, 135 పరుగులు)తో కలిసి సంయుక్తంగా ఈ అవార్డు పంచుకున్నాడు. కాగా బీజీటీ-2023 నేపథ్యంలో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ను వెనక్కి నెట్టి నంబర్1గా అవతరించిన అశ్విన్.. మధ్యలో పాయింట్లు కోల్పోయి అతడితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆసీస్తో ఆఖరి టెస్టులో 7 వికెట్లు తీసి మళ్లీ నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 1205 రోజుల నిరీక్షణకు తెరదించి కోహ్లి టీమిండియా స్టార్ బ్యాటర్, రన్మెషీన్ దాదాపు మూడున్నరేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. ఆసీస్తో ఆఖరిదైన అహ్మదాబాద్ మ్యాచ్లో అంతర్జాతీయ కెరీర్లో 75, టెస్టుల్లో 28వ శతకం సాధించాడు. దీంతో బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో 13వ స్థానానికి చేరుకున్నాడు. కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్న రిషభ్ పంత్ 9, రోహిత్ శర్మ 10వ ర్యాంకుతో టాప్-10లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నాడు. చదవండి: Ban Vs Eng 3rd T20: ఏంటి.. అసలు ఈ మనిషి కనిపించడమే లేదు! ఏమైందబ్బా? కౌంటర్ అదుర్స్ WTC Final: కేఎస్ భరత్ స్థానానికి ఎసరు పెట్టిన టీమిండియా దిగ్గజం! అతడే సరైనోడు! అవునా.. నిజమా?! -
డ్యాన్స్ ఇరగదీసిన విరాట్ కోహ్లి.. సాహో అంటున్న నెటిజన్లు
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కొద్ది రోజుల కిందటే టెస్ట్ల్లో 27వ శతకాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. BGT-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్లో కోహ్లి ఈ ఫీట్ను సాధించి, అన్ని ఫార్మాట్లలో కింగ్ ఈజ్ బ్యాక్ అని సంకేతాలు పంపాడు. పరుగులు సాధించడంలో, రికార్డులు బద్దలు కొట్టడంలో, సెంచరీల మీద సెంచరీలు సాధించడంలో కసిగా వ్యవహరించే కింగ్ కోహ్లి.. తరుచూ మైదానంలో స్టెప్పులు వేసి అలరిస్తుంటాడు. అప్పుడప్పుడు ఆఫ్ ద ఫీల్డ్ కూడా తనలోని నాట్య ప్రావిణ్యానికి పని చెబుతూ ఫ్యాన్స్ మనసులు దోచుకుంటుంటాడు. The Man. The Celebration. Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9 — BCCI (@BCCI) March 12, 2023 ఆసీస్తో నాలుగో టెస్ట్ ముగిసాక కూడా కోహ్లి ఇలాంటి ఓ అదిరిపోయే నృత్య ప్రదర్శనే చేశాడు. ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన నార్వే డ్యాన్స్ గ్రూప్ 'క్విక్ స్టయిల్'తో కలిసి కోహ్లి డ్యాన్స్ ఇరగదీశాడు. క్విక్ స్టయిల్ కొన్ని షోలు చేసేందుకు ముంబైకి రాగా కోహ్లి ఆ బ్యాండ్ను కలిసి ఓ అదరిపోయే డ్యాన్స్ వీడియో చేశాడు. View this post on Instagram A post shared by Quick Style (@thequickstyle) ఇందులో కోహ్లి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కు (Stereo Nation's Ishq) తగ్గట్టుగా బ్యాట్ పట్టుకుని క్విక్ స్టయిల్ సభ్యులతో కలిసి ముందుకు కదులుతూ డ్యాన్స్ వేశాడు. ఈ వీడియోను క్విక్ స్టయిల్ తమ అఫీషియల్ ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయగా, నిమిషాల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వచ్చాయి. View this post on Instagram A post shared by Virat Kohli (@virat.kohli) క్విక్ స్టయిల్ బ్యాండ్తో కలిసి దిగిన ఫోటోను కోహ్లి సోషల్మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరలైంది. ఈ పోస్ట్కు కోహ్లి.. ముంబైలో ఎవరిని కలిసానో గెస్ చేయండి అంటూ క్యాప్షన్ పెట్టగా.. కోహ్లి సతీమణి అనుష్క శర్మ ఫైర్ ఏమోజీలతో రిప్లై ఇచ్చింది. మిలియన్ల కొద్ది లైకులు, వ్యూస్ వస్తున్న ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, నార్వే డ్యాన్స్ బ్యాండ్ క్విక్ స్టయిల్ ఇటీవలకాలంలో ప్రముఖ బాలీవుడ్ చిత్రాల్లోని సాడి గల్లీ, కాలా చష్మా పాటలతో విపరీతంగా పాపులరైన విషయం తెలిసిందే. ఈ పాటలకు క్విక్ స్టయిల్ అదిరిపోయే స్టెప్పులేసి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. -
అశ్విన్ సైంటిస్టా లేక బౌలరా..? జడేజా అదిరిపోయే సమాధానం
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్ డ్రా కావడంతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు కూడా చేరింది. BGT-2023లో ఆధ్యంతం అద్భుతంగా రాణించి, 4 టెస్ట్ల్లో 47 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు షేర్ చేసుకున్నారు. అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే స్టార్ స్పిన్ ద్వయాన్ని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఆడగ్గా, వారు కూడా అదే రేంజ్లో అదిరిపోయే సమాధానలు చెప్పారు. ఈ సంభాషణల్లో భాగంగా హర్షా భోగ్లే అడిగిన ఓ ఆసక్తికర ప్రశ్నకు జడ్డూ ఇచ్చిన అదిరిపోయే సమాధానం ప్రస్తుతం సోషల్మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ హర్షా ఏం అడిగాడు, జడ్డూ ఏం చెప్పాడంటే.. హర్షా: అశ్విన్ సైంటిస్ట్కు ఎక్కువా.. లేక బౌలర్కు ఎక్కువ..? జడేజా: అశ్విన్ అన్నింటి కంటే ఎక్కువ.. జడ్డూ సమాధానం విని హర్షా భోగ్లేకు ఫ్యూజులు ఎగిపోయాయి. ఇందుకు జడ్డూ వివరణ ఇస్తూ.. అశ్విన్కు చాలాచాలా మంచి క్రికెటింగ్ బ్రెయిన్ ఉంది.. అతను అనునిత్యం క్రికెట్ గురించే మాట్లాడుతుంటాడు.. అశ్విన్కు ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లపై అవగాహణ ఉంది.. ఏ జట్టు ఏ మూలలో ఏ టోర్నమెంట్ జరుగుతుందో కూడా అతనికి తెలిసి ఉంటుంది.. ఇందుకే నేను యాష్ క్రికెట్ బ్రెయిన్కు సలాం కొడతాను, అందుకే అశ్విన్ భాయ్ అన్నింటి కంటే ఎక్కువ అని అంటానన్నాడు. ఇదిలా ఉంటే, టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుని జోష్ మీద ఉన్న టీమిండియా ఈ నెల 17 నుంచి ప్రారంభంకాబోయే వన్డే సిరీస్పై కూడా కన్నేసింది. తల్లి మరణించిన కారణంగా స్వదేశానికి వెళ్లిన ఆసీస్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వన్డే సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవడంతో స్టీవ్ స్మితే వన్డే జట్టు పగ్గాలు కూడా చేపట్టనున్నాడు. మరోవైపు భారత జట్టుకు కూడా ఓ భారీ షాక్ తగిలింది. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికి దూరంగా ఉండనున్నాడు. -
సిరీస్ మనదే.. చివరి టెస్ట్ ‘డ్రా’.. డబ్ల్యూటీసీ ఫైనల్కు టీమిండియా
ఆఖరి రోజు ఏ మలుపూ లేదు. ఆలౌట్ చేయడం మన బౌలర్ల వల్ల కాలేదు. బ్యాటర్ల జోరులో ఏ మార్పూ లేదు. చివరకు ఎలాంటి డ్రామా లేకుండా నాలుగో టెస్టు ‘డ్రా’ అయింది. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఓ పది పరుగులు చేసుంటే ఇంకో ఈ టెస్ట్లో ఐదో సెంచరీ అయ్యేది. ఐదు రోజుల పాటు రోజుకో సెంచరీ చొప్పున ఈ మ్యాచ్కు అపూర్వ ఘనత దక్కేది. మరోవైపు క్రైస్ట్చర్చ్లో న్యూజిలాండ్ చేతిలో తొలి టెస్ట్లో శ్రీలంక ఓడిపోవడంతో ఈ మ్యాచ్ తుది ఫలితంతో సంబంధం లేకుండానే భారత్ ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్కు అర్హత సాధించింది. అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడు రోజుల్లో ముగిసిన గత టెస్టులకు భిన్నంగా ఆఖరి మ్యాచ్ ‘డ్రా’ అయ్యింది. 2–1తో సిరీస్ను వశం చేసుకున్న టీమిండియా ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని వరుసగా నాలుగోసారి చేజిక్కించుకుంది. నాలుగో టెస్టు చివరి రోజు కూడా బ్యాటర్స్ హవానే కొనసాగింది. దీంతో భారత బౌలర్లు శక్తికి మించి శ్రమించినా రెండు వికెట్లే పడగొట్టగలిగారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 78.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ట్రావిస్ హెడ్ (163 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), లబుషేన్ (213 బంతుల్లో 63 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. ఫలితానికి అవకాశం లేకపోవడంతో గంట ముందే ‘డ్రా’కు ఇరుజట్ల కెప్టెన్లు అంగీకరించారు. విరాట్ కోహ్లికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించగా... స్పిన్తో భారత్కు సిరీస్ విజయాన్నిచ్చిన బౌలింగ్ ద్వయం అశ్విన్–రవీంద్ర జడేజాలకు సంయుక్తంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు ఇచ్చారు. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ ఈనెల 17న ముంబైలో జరిగే తొలి మ్యాచ్తో మొదలవుతుంది. హెడ్ సెంచరీ మిస్... ఆఖరి రోజు ఓవర్నైట్ స్కోరు 3/0తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా కాసేపటికే ఓపెనర్ కునెమన్ (6) వికెట్ను కోల్పోయింది. జట్టు స్కోరు 14 పరుగుల వద్ద అతని వికెట్ను అశ్విన్ పడగొట్టగానే భారత శిబిరం సంబరపడింది. ఇక మ్యాజిక్ షురూ అనుకుంటే... అక్కడి పిచ్ ‘అంతలేదు’ అన్నట్లుగా బ్యాటర్లకే సహకరించింది. దీంతో హెడ్, వన్డౌన్ బ్యాటర్ లబుషేన్ నింపాదిగా ఆడుకున్నారు. రిస్క్ తీసుకోకుండా ‘డ్రా’ కోసమే వాళ్లిద్దరు క్రీజుకు అతుక్కుపోయారు. దీంతో భారత బౌలర్లు ఎంత చెమటోడ్చినా తొలి సెషన్లో మరో వికెటే దొరకలేదు. 73/1 స్కోరు వద్ద లంచ్ విరామానికికెళ్లారు. అనంతరం రెండో సెషన్లో హెడ్ 112 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... మరికాసేపటి ఆసీస్ స్కోరు 100 పరుగులు దాటింది. హెడ్ అడపాదడపా బౌండరీలతో పరుగులు సాధించడంతో ఐదో రోజు కూడా సెంచరీ ఖాయమనిపించింది. కానీ హెడ్ అహ్మదాబాద్ టెస్టుకు ఆ అరుదైన అవకాశం ఇవ్వకుండా 90 పరుగుల వద్ద అక్షర్ బౌలింగ్లో అవుటయ్యాడు. లబుషేన్ 150 బంతుల్లో అర్ధసెంచరీ సాధించగా, 158/2 వద్ద రెండో సెషన్ ముగిసింది. ‘డ్రా’ దిశగా సాగడంతో మూడో సెషన్లో 11 ఓవర్ల ఆటే ఆడారు. సిరీస్లో జరిగిన మూడు టెస్టుల్లోనూ 30 పైచిలుకు వికెట్లు మూడు రోజుల్లోనే రాలితే... ఆఖరి టెస్టు ఐదు రోజులు జరిగినా బౌలర్లు 22 వికెట్లను మించి పడగొట్టలేకపోయారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 480; భారత్ తొలి ఇన్నింగ్స్: 571; ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: కునెమన్ (ఎల్బీడబ్ల్యూ) అశ్విన్ 6; హెడ్ (బి) అక్షర్ పటేల్ 90; లబుషేన్ (నాటౌట్) 63; స్టీవ్ స్మిత్ (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 6; మొత్తం (78.1 ఓవర్లలో 2 వికెట్లకు డిక్లేర్డ్) 175. వికెట్ల పతనం: 1–14, 2–153. బౌలింగ్: అశ్విన్ 24–9–58–1, రవీంద్ర జడేజా 20–7–34–0, షమీ 8–1–19–0, అక్షర్ పటేల్ 19–8–36–1, ఉమేశ్ యాదవ్ 5–0–21–0, గిల్ 1.1–0–1–0, పుజారా 1–0–1–0. మరో మ్యాచ్ మిగిలుంది... అదే ఫైనల్! భారత్, ఆస్ట్రేలియాల మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్ అయితే ముగిసింది. కానీ ఇరుజట్ల మధ్య మరో ‘టెస్టు’ మిగిలుంది! అదేనండి... డబ్ల్యూటీసీ ఫైనల్. ఇక్కడ బోర్డర్–గావస్కర్ ట్రోఫీ విజేతను తేల్చినట్లే ఇంగ్లండ్లో ప్రపంచ టెస్టు చాంపియన్ ఎవరో కూడా తేలుతుంది. ఈ ఏడాది జూన్లో 7 నుంచి 11 వరకు లండన్లోని ది ఓవల్ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. 16 సొంతగడ్డపై భారత జట్టుకిది వరుసగా 16వ టెస్ట్ సిరీస్ విజయం. 1 మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టి20) కనీసం 10 చొప్పున ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్న తొలి క్రికెటర్గా కోహ్లి ఘనత. 50 భారత్ తరఫున తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్గా అక్షర్ పటేల్ గుర్తింపు పొందాడు. కెరీర్లో 12 టెస్టులు ఆడిన అక్షర్ 2,205 బంతుల్లో 50 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. బుమ్రా (2,465 బంతులు) పేరిట ఉన్న రికార్డును అక్షర్ సవరించాడు. 2 టెస్టుల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు గెల్చుకున్న ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. అశ్విన్ 37 సిరీస్లలో 10 సార్లు ఈ పురస్కారం గెల్చుకున్నాడు. ముత్తయ్య మురళీధరన్ (62 సిరీస్లలో 11 సార్లు) అగ్రస్థానంలో ఉండగా... జాక్వస్ కలిస్ (61 సిరీస్లలో 9 సార్లు) మూడో స్థానానికి పడిపోయాడు. -
Rahul Dravid: అటొక కన్ను.. ఇటొక కన్ను
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ను(బోర్డర్-గావస్కర్ ట్రోఫీ) టీమిండియా నిలబెట్టుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ డ్రా ముగియగా.. సిరీస్ను 2-1తో గెలిచిన టీమిండియా వరుసగా నాలుగోసారి ట్రోఫీని అట్టిపెట్టుకుంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై బ్యాటర్లు పండగ చేసుకున్నారు. టీమిండియా తరపున కోహ్లి, గిల్లు సెంచరీలు చేస్తే.. ఆసీస్ నుంచి ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ గ్రీన్లు శతకాలు చేశారు. అయితే మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికి టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్కు అర్హత సాధించింది. ఇదంతా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య తొలి టెస్టులో వచ్చిన ఫలితం ద్వారానే. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇదే విషయంపై స్పందించాడు. ''చాలా రోజుల తర్వాత రెండుజట్లు తీవ్రంగా పోటీ పడిన సిరీస్ ఇది. తీవ్రమైన ఒత్తిడిలోనూ ఆటగాళ్లు రాణించారు. తొలి టెస్టులోనూ సెంచరీ సాధించిన కెప్టెన్ రోహిత్ శర్మ జట్టును నడిపించిన విధానం అద్బుతం. శుబ్మన్ గిల్ తొలి రెండు టెస్టుల్లో బెంచ్కే పరిమితం అయినప్పటికి.. ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టాడు. గత నాలుగైదు నెలలుగా గిల్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఇలాంటి యువ ఆటగాడి ఆటను చూడడం చాలా బాగుంది. గిల్ తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు శ్రమించడం నచ్చింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే కివీస్-లంక తొలి టెస్టుపై కూడా ఒక కన్ను వేసి ఉంచాం. ఇక్కడ లంచ్ బ్రేక్ అవగానే అక్కడ లంక-కివీస్ మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ఇక టీమిండియాతో సిరీస్ ద్వారా ఆసీస్కు ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు దొరికారు. ఒకరు టాడ్ మర్ఫీ అయితే మరొకరు కున్హెమన్. మాములుగా విదేశీ జట్లలో స్పెషలిస్ట్ స్పిన్నర్ ఒక్కడికంటే ఎక్కువగా ఉండడం అరుదు. అయితే ఈసారి ఆసీస్ ఆ విషయంలో జాక్పాట్ కొట్టింది. సీనియర్ నాథన్ లియోన్తో పాటు కున్హెమన్, మర్ఫీలు పోటీ పడి మరి వికెట్లు తీశారు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. అయితే ప్రస్తుతం మాత్రం ఆస్ట్రేలియాతో సిరీస్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం.'' అని చెప్పుకొచ్చాడు. Moment to savour 👏👏 This is #TeamIndia 🇮🇳#INDvAUS | @mastercardindia pic.twitter.com/j6ZR8R8fZr — BCCI (@BCCI) March 13, 2023 చదవండి: కోహ్లి క్రీడాస్పూర్తి.. వీడియో వైరల్ -
'ఇలా అయితే ఎలా.. బౌలింగ్ జాబ్ వదిలేయాలా?'
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రా కావడంతో ట్రోఫీ వరుసగా నాలుగోసారి టీమిండియా వద్దే ఉండిపోయింది. ఇక అటు తొలి టెస్టులో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియాకు డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తుకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం పక్కనబెడితే నాలుగో టెస్టులో చివరి రోజు చివరి సెషన్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ఎలాగూ డ్రా అవుతుందనే ఉద్దేశంతో కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్తో ప్రయోగాలు చేశాడు. బ్యాటర్లుగా ముద్రపడిన ఆటగాళ్లతో బౌలింగ్ చేయించాడు. మొదట శుబ్మన్ గిల్ ఇన్నింగ్స్ 77వ ఓవర్ వేయగా.. ఇన్నింగ్స్ 78వ ఓవర్ టెస్టు స్పెషలిస్ట్ పుజారా చేత వేయించాడు. కాగా రైట్ ఆర్మ్ లెగ్బ్రేక్ బౌలర్ అయిన పుజారా కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల బౌలింగ్ కూడా సరిగ్గా పడని పిచ్పై పుజారా అద్బుతంగా బౌలింగ్ చేశాడు. దీంతో పుజారా బౌలింగ్పై అశ్విన్ తనదైన శైలిలో ఫన్నీగా స్పందించాడు. ''ఇప్పుడు నేనేం చేయాలి.. బౌలింగ్ జాబ్ వదిలేయాలేమో'' అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Main kya karu? Job chod du? 😂 pic.twitter.com/R0mJqnALJ6 — Ashwin 🇮🇳 (@ashwinravi99) March 13, 2023 Saurashtra Skipper Jaydev Unadkat happy to see teammate Pujara rip a leg break to Smith!! pic.twitter.com/vwtQI8kYr5 — arnav.🏏 (@Cricket_Arnav) March 13, 2023 చదవండి: IND VS Aus 4th Test: అశ్విన్, విరాట్ ఖాతాలో రికార్డులు శెభాష్.. ఓడించినంత పనిచేశారు... మరేం పర్లేదు! అసలైన మజా ఇదే! -
డ్రాగా ముగిసిన అహ్మదాబాద్ టెస్టు ( ఫొటోలు)
-
IND VS Aus 4th Test: అశ్విన్, విరాట్ ఖాతాలో రికార్డులు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్ పేలవ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగిన విరాట్ కోహ్లికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లకు సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. అశ్విన్, విరాట్లు ఈ అవార్డులకు ఎంపికైన అనంతరం వీరిద్దరి ఖాతాలో వేర్వేరు రికార్డులు వచ్చి చేరాయి. టెస్ట్ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు గెలిచిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ (9 ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు).. కల్లిస్ను (9) వెనక్కునెట్టి రెండో స్థానానికి ఎగబాకగా, భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ (10).. లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లేతో (10) సమంగా నిలిచాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డుల రికార్డు లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (11) పేరిట ఉండగా.. భారత్ తరఫున టెస్ట్ల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (14) పేరిట ఉంది. సచిన్ తర్వాత ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ (11) ఉన్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. బౌలర్లకు ఏమాత్రం సహకరించిన పిచ్పై నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (90) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్ (63) అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌట్ కాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలు చేయగా.. భారత తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (128), విరాట్ కోహ్లి (186) శతకాలతో అలరించారు. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
BGT 2023: గత నాలుగు సిరీస్ల్లో ఆసీస్కు ఇదే గతి..!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్ట్ పేలవ డ్రాగా ముగిసింది. ఆట ఆఖరి రోజు వికెట్ల వర్షం కురిసి, మ్యాచ్ భారత్వైపు మొగ్గు చూపుతుందని అంతా ఊహించినప్పటికీ, ఫలితం అందుకు విరుద్ధంగా వచ్చి నిరుత్సాహపరిచింది. మ్యాచ్ లాస్ట్ సెషన్ వరకు ఆసీస్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోగా.. భారత బౌలర్లు జీవం లేని పిచ్పై బౌలింగ్ చేసి అలిసి సొలసి నీరసించారు. ఇరు జట్లు డ్రాకు అంగీకరించే సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ట్రవిస్ హెడ్ (90) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకోగా.. లబూషేన్ (63) అజేయ అర్ధసెంచరీతో మెరిశాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులకు ఆలౌట్ కాగా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 480 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలు చేయగా.. భారత తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (128), విరాట్ కోహ్లి (186) శతకాలతో అలరించారు. నాలుగో టెస్ట్ డ్రాగా ముగియడంతో నాలుగు మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కాగా, ఇక్కడ ఓ ఆసక్తికర విశేషమేమింటంటే.. భారత్ గత నాలుగు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలను ఇదే మార్జిన్తో కైవసం చేసుకుంటూ వచ్చింది. 2017లో తొలిసారి 2-1 తేడాతో ఆసీస్కు మట్టికరిపించిన భారత్.. ఆతర్వాత 2018-19 సిరీస్లో, 2020-21 సిరీస్లో, తాజాగా BGT-2023లో ఆసీస్ను అదే 2-1 తేడాతో ఓడించి, ఆసక్తికర గణాంకాలను నమోదు చేసింది. ఈ అసక్తికర విషయాలతో పాటు భారత్ ఓ చెత్త రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకుంది. స్వదేశంలో గడిచిన 10 ఏళ్లలో టీమిండియా తొలిసారి వరుసగా రెండు టెస్ట్ల్లో విజయం లేకుండా (తొలి రెండు టెస్ట్లో భారత్ విజయం, మూడో టెస్ట్లో 9 వికెట్ల తేడాతో ఆసీస్ విజయం, నాలుగో టెస్ట్ డ్రా) సిరీస్ను ముగించింది. -
BGT 2023: ఆఖరి టెస్టు డ్రా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టీమిండియాదే
India vs Australia, 4th Test Drawn: టీమిండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితంగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 భారత్ సొంతమైంది. స్వదేశంలో రోహిత్ సేన 2-1తో సిరీస్ను కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసీస్తో సోమవారం ముగిసిన ఆఖరి రోజు ఆట కంటే ముందే టీమిండియా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్- శ్రీలంక మధ్య తొలి టెస్టులో కివీస్ గెలవడంతో భారత్కు బెర్తు ఖరారైంది. ఈ క్రమంలో ఇంగ్లండ్లో జూన్ 7 నుంచి 11 వరకు ఓవల్ వేదికగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనుంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ- 2023 అహ్మదాబాద్- నాలుగో టెస్టు మార్చి 9- 13 ►టాస్- ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ ►ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 480 ►టీమిండియా తొలి ఇన్నింగ్స్- 571 ►ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్- 175/2 డిక్లేర్డ్ ►ఫలితం- డ్రా ►2-1తో సిరీస్ టీమిండియా సొంతం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కోహ్లి(364 బంతుల్లో 15 ఫోర్ల సాయంతో 186 పరుగులు) ►ప్లేయర్ ఆఫ్ ది సిరీస్- స్పిన్ ఆల్రౌండర్లు రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు తుది జట్లు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ. ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 హైలైట్స్ 1. నాగ్పూర్ టెస్టు ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన రవీంద్ర జడేజా ఏడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించిన రవీంద్ర జడేజా కీలక సమయంలో 70 పరుగులతో జట్టును ఆదుకున్న జడ్డూ రెండున్నర రోజుల్లో ముగిసిన టెస్టు ఫిబ్రవరి9- 11 స్కోర్లు: టీమిండియా- 400 ఆస్ట్రేలియా- 177 & 91 2. ఢిల్లీ టెస్టు ఆరు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రవీంద్ర జడేజా 10 వికెట్లతో రాణించి జడ్డూ స్కోర్లు: ఆస్ట్రేలియా- 263 & 113 టీమిండియా- 262 & 118/4 3. ఇండోర్ టెస్టు టీమిండియాపై 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నాథన్ లియోన్(ఆసీస్ ప్రధాన స్పిన్నర్) 11 వికెట్లు పడగొట్టిన లియోన్ స్కోర్లు: ఇండియా 109 & 163 ఆస్ట్రేలియా- 197 & 78/1 చదవండి: Axar Patel: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశ్విన్కూ సాధ్యం కానిది.. Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺 The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT — BCCI (@BCCI) March 13, 2023 -
Ind Vs Aus: బుమ్రా రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన అక్షర్! అశూ వల్ల కానిది..
India vs Australia, 4th Test- Axar Patel Reocrd: టీమిండియా స్టార్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు. అదే విధంగా.. టెస్టుల్లో రికార్డుల రాజు, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను వెనక్కినెట్టాడు ఈ స్పిన్ ఆల్రౌండర్. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్లో ఆఖరిదైన నాలుగో టెస్టు ఆఖరి రోజు ఆట సందర్భంగా ఈ ఘనత సాధించాడు. అహ్మదాబాద్లో ఆసీస్ ఓపెనర్ ట్రవిస్ హెడ్ను బౌల్డ్ చేసిన అక్షర్.. అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. బుమ్రా రికార్డు బద్దలు.. అశూ వల్ల కానిది! ఈ క్రమంలో బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన అక్షర్.. అత్యంత తక్కువ బంతుల్లో టెస్టుల్లో 50 వికెట్ల ఘనత సాధించి చరిత్రకెక్కాడు. సెంచరీకి పది పరుగుల దూరంలో ఉన్న హెడ్ను అవుట్ చేసి ఈ అరుదైన ఫీట్ నమోదు చేశాడు. కాగా ఆసీస్తో నాలుగో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులు సాధించిన అక్షర్.. జట్టును పటిష్ట స్థితిలో తన వంతు పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. టెస్టుల్లో టీమిండియా తరఫున అత్యంత వేగంగా 50 వికెట్లు తీసిన బౌలర్లు 1. అక్షర్ పటేల్- 2205 బంతుల్లో 2. జస్ప్రీత్ బుమ్రా- 2465 బంతుల్లో 3. కర్సన్ ఘావ్రి- 2534 బంతుల్లో 4. రవిచంద్రన్ అశ్విన్- 2597 బంతుల్లో . చదవండి: Kane Williamson: 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.. న్యూజిలాండ్ అత్యంత అరుదైన రికార్డు! వారెవ్వా కేన్ మామ WTC Final- Ind Vs Aus: అప్పుడు అడ్డుకున్న న్యూజిలాండ్.. ఈసారి ఇలా! టీమిండియాకు.. India 🇮🇳 🤝🏻 Australia 🇦🇺 The final Test ends in a draw as #TeamIndia win the Border-Gavaskar series 2-1 🏆#INDvAUS pic.twitter.com/dwwuLhQ1UT — BCCI (@BCCI) March 13, 2023 Milestone 🚨 - Congratulations @akshar2026 who is now the fastest Indian bowler to take 50 wickets in terms of balls bowled (2205). Travis Head is his 50th Test victim.#INDvAUS #TeamIndia pic.twitter.com/yAwGwVYmbo — BCCI (@BCCI) March 13, 2023 -
శ్రీలంక ఆశలపై నీళ్లు చల్లిన న్యూజిలాండ్.. డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరిన భారత్
డబ్ల్యూటీసీ 2021-23 ఫైనల్కు చేరాలనుకున్న శ్రీలంక ఆశలపై న్యూజిలాండ్ మాజీ సారధి కేన్ విలియమ్సన్ నీళ్లు చల్లాడు. స్వదేశంలో శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్లో అజేయమైన సూపర్ సెంచరీ సాధించిన కేన్ మామ (121), తన జట్టుకు అపురూప విజయాన్ని అందించడంతో పాటు శ్రీలంకను డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరకుండా అడ్డుకున్నాడు. India have qualified for the World Test Championship final! They'll take on Australia at The Oval for the #WTC23 mace! More: https://t.co/75Ojgct97X pic.twitter.com/ghOOL4oVZB — ICC (@ICC) March 13, 2023 ఆఖరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో కేన్ మామ ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి, తన జట్టును 2 వికెట్ల తేడాతో గెలిపించుకున్నాడు. ఫలితంగా రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. New Zealand scurry to a famous Test win running a bye off the final ball! Sri Lanka's push for a spot in the #WTC23 final falls agonisingly short!#NZvSL Scorecard: https://t.co/p873rNARKS pic.twitter.com/CnFWN8xBti — ICC (@ICC) March 13, 2023 మరోపక్క ఆసీస్తో నాలుగో టెస్ట్లో భారత్ విజయావకాశాలు సన్నగిల్లడంతో, న్యూజిలాండ్-శ్రీలంక తొలి టెస్ట్ ఫలితంపై డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తు ఆధారపడి ఉండింది. ఈ మ్యాచ్తో పాటు న్యూజిలాండ్తో రెండో టెస్ట్లోనూ శ్రీలంక గెలిచి ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరి ఉండేది. Test century No.27 for Kane Williamson! Has he done enough to guide New Zealand to a Test victory at Hagley Oval? Watch the #NZvSL series live with a Black Caps Pass on https://t.co/CPDKNxpgZ3 📺 pic.twitter.com/hNYkPKh8bt — ICC (@ICC) March 13, 2023 అయితే, తొలి టెస్ట్లోనే లంక ఓటమిపాలుకావడంతో ఆసీస్తో నాలుగో టెస్ట్ ఫలితంతో సంబంధం లేకుండా టీమిండియా దర్జాగా ఫైనల్కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. A thriller in Christchurch. #NZvSL pic.twitter.com/7hv2j4bEjJ — BLACKCAPS (@BLACKCAPS) March 13, 2023 మ్యాచ్ విషయానికొస్తే.. శ్రీలంక నిర్ధేశించిన 321 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. కేన్ విలియమ్సన్ (121 నాటౌట్), డారిల్ మిచెల్ (81) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు ఆడటంతో ఆఖరి బంతికి విజయాన్ని ఖరారు చేసుకుంది. ముఖ్యంగా కేన్ మామ అన్నీ తానై వ్యవహరించి, చివరి బంతి వరకు క్రీజ్లో నిలిచి న్యూజిలాండ్ను విజయతీరాలకు చేర్చాడు. న్యూజిలాండ్కు విన్నింగ్ రన్ ఎక్స్ట్రా (బై) రూపంలో రావడం విశేషం. స్కోర్ వివరాలు.. శ్రీలంక: 355 & 302 న్యూజిలాండ్: 373 & 285/8 ఫలితం: 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం -
కోహ్లి విషయంలో స్మిత్ మొన్న అలా.. నిన్న ఇలా! బీసీసీఐ ట్వీట్ వైరల్
India vs Australia, 4th Test: టీమిండియా- ఆస్ట్రేలియా మ్యాచ్ అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇరు జట్ల మధ్య పోటాపోటీ క్రికెట్ ప్రేమికులకు మజా అందిస్తుంది. ఇక బోర్డర్- గావస్కర్ ప్రతిష్టాత్మక ట్రోఫీ గురించి చెప్పేదేముంది. సంప్రదాయ క్రికెట్లో ఇరు మేటి జట్లు తలపడుతుంటే ముచ్చటగా ఉంటుంది. అయితే, అదే సమయంలో స్లెడ్జింగ్ చేస్తూ శ్రుతిమించే ఆటగాళ్లను చూస్తే కాస్త చిరాకేస్తుంది. కానీ.. ఈసారి టీమిండియా- ఆసీస్ టెస్టు సిరీస్లో పిచ్ గురించి మినహా పెద్దగా మాటల యుద్ధాలు కనిపించలేదు. అందుకు భిన్నంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి- ఆస్ట్రేలియా తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ మధ్య ‘బ్రొమాన్స్’ సన్నివేశాలు హైలైట్గా నిలుస్తున్నాయి. మొన్న అలా చాలా కాలం తర్వాత టెస్టుల్లో కోహ్లి అర్ధ శతకం నమోదు చేసిన తర్వాత స్మిత్ అతడికి దగ్గరికి వచ్చి బ్యాట్ చెక్ చేస్తూ.. ఆ తర్వాత ఇద్దరూ నవ్వుకుంటున్న దృశ్యాలు వైరల్ అయిన విషయం తెలిసిందే. బీజీటీ- 2023లో ఆఖరిదైన అహ్మదాబాద్ టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలో రన్మెషీన్ కోహ్లి హాఫ్ సెంచరీని శతకంగా మలిచిన సంగతి తెలిసిందే. కెరీర్లో 75వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేసిన కోహ్లి.. డబుల్ సెంచరీ దిశగా పయనించగా టాడ్ మర్ఫీ బౌలింగ్లో 186 పరుగుల వద్ద బ్రేక్ పడింది. వెన్నుతట్టి.. దీంతో కోహ్లి పెవిలియన్ చేరుతున్న సమయంలో అతడిని అభినందించిన స్మిత్.. కోహ్లి చేతిలో చెయ్యి వేసి శభాష్ అన్నట్లుగా వెన్నుతట్టాడు. తన పట్ల స్మిత్ ఆప్యాయతకు బదులుగా కోహ్లి చిరునవ్వులు చిందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను.. ‘‘పరస్పర గౌరవం.. ఆరాధ్య భావన’’ అంటూ బీసీసీఐ ట్విటర్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది. ఫొటో ఎంత బాగుందో! ఈ నేపథ్యంలో టీమిండియా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘స్మిత్ నిన్ను ఇలా చూస్తుంటే బాగుంది. కింగ్ కోహ్లిని నువ్వు అభినందించిన తీరు మా హృదయాలు గెలుచుకుంది. ఆటలో మాత్రమే ప్రత్యర్థులు.. ఆటగాళ్లంతా ఒక్కటే అని మరోసారి నిరూపితమైంది. ఈ ఫొటో ఎంత బాగుందో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా భారత్- ఆస్ట్రేలియా మధ్య 75 ఏళ్ల అనుబంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మార్చి 9న అహ్మదాబాద్ టెస్టు ఆరంభమైన విషయం తెలిసిందే. తొలి రోజు ఆట సందర్భంగా ఇరు దేశాల ప్రధానులు నరేంద్ర మోదీ- ఆంటోనీ ఆల్బనీస్ స్టేడియానికి విచ్చేసి ఆటగాళ్లను కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ నేపథ్యంలో కోహ్లి- స్మిత్ ఫొటో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే.. 1205 రోజుల తర్వాత... అహ్మదాబాద్ టెస్టులో శతకం బాదిన కోహ్లి పలు రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చదవండి: 21 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. ఎట్టకేలకు అనుకున్నది సాధించిన సంజూ శాంసన్ Ind vs Aus- Ahmedabad Test: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా మరెన్నో.. 📸 Respect and admiration 👏👏#TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/e5QJcj4OiL — BCCI (@BCCI) March 12, 2023 -
Ind Vs Aus: ఆస్ట్రేలియా రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా! ఇంకా..
India Vs Australia 4th Test Day 4 Records: నాలుగో టెస్టులో నాలుగో రోజు నాలుగో శతకం నమోదైన విషయం తెలిసిందే. ఒక టెస్టులో నాలుగు సెంచరీలు కొత్తేం కాదు... కానీ ఈ ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’లో మాత్రం ఇది గొప్ప విశేషం. ఎందుకంటే ఇంతకుముందు జరిగిన మూడు టెస్టులు కూడా మూడో రోజుల్లోనే ముగిశాయి. స్పిన్నర్లు తిప్పేసిన ఆ మ్యాచ్ల్లో బ్యాటర్లు విలవిలలాడారు. గత మ్యాచుల్ని శాసించిన బౌలర్లపై ఇరు జట్ల బ్యాటర్లు సెంచరీలతో విరుచుకుపడ్డారు. మరి టీమిండియాకు అనుకూలంగా మారిన నాలుగో రోజు ఆటలో విశేషాలు, నమోదైన ప్రధాన రికార్డులన్నీ ఒకేచోట చూసేద్దామా?! 1205 రోజుల తర్వాత... భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి... సుదీర్ఘ టెస్టు సెంచరీ నిరీక్షణకు తెరదించాడు. ఆఖరి టెస్టులో మూడంకెల స్కోరు ముచ్చట తీర్చుకున్నాడు. ఓవర్నైట్ స్కోరు 289/3 ఓవర్నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆదివారం ఆట ప్రారంభించిన భారత్కు జడేజా (84 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రూపంలో గట్టిదెబ్బే తగిలింది. బ్యాటింగ్కు కలిసొచ్చే పిచ్పై కోహ్లికి జతయిన ఆంధ్ర క్రికెటర్ శ్రీకర్ భరత్ (44; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) జతయ్యాడు. ‘రన్ మెషిన్’ అండతో భరత్ భారీ సిక్సర్లతో అలరించాడు. 363/4 వద్ద లంచ్కు వెళ్లొచ్చాక ఎంతో ఓపిగ్గా ఆడిన కోహ్లి 241 బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2019లో నవంబర్ 23న క్రికెట్ మక్కా ఈడెన్ గార్డెన్స్లో బంగ్లాదేశ్పై కోహ్లి 27వ టెస్ట్ శతకం సాధించాడు. మళ్లీ 43 టెస్టుల తర్వాత భారత గడ్డపైనే 28వ సెంచరీ చేసి 1205 రోజుల నిరీక్షణకు ముగింపు పలికాడు. ఐదో వికెట్కు 84 పరుగులు జోడించాక లయన్ బౌలింగ్లో భరత్... హ్యాండ్స్కాంబ్ చేతికి చిక్కాడు. అనంతరం అక్షర్ పటేల్ కూడా పట్టుదలతో ఆడటంతో ఆస్ట్రేలియాకు కంగారు తప్పలేదు. ఇద్దరి జోడీ కుదరడంతో భారత్ భారీస్కోరుకు బాటపడింది. మూడో సెషన్లో టీమిండియా 500 మార్క్ను అందుకోగా, కోహ్లి 150 పరుగులు పూర్తయ్యాయి. కాసేపటికే అక్షర్ 95 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. అక్షర్ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో ఆరో వికెట్కు 162 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత కాసేపటికే భారత్ 571 పరుగుల వద్ద ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆసీస్ ఆట నిలిచే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. నాలుగో రోజు ప్రధాన రికార్డులు 75: టీమిండియా స్టార్, రన్మెషీన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 75వ సెంచరీ నమోదు చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 28వ శతకం. భారత గడ్డపై లియోన్ చరిత్ర భారత గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన విదేశీ జట్టు బౌలర్గా నాథన్ లయన్ గుర్తింపు పొందాడు. భారత్లో 11 టెస్టులు ఆడిన లయన్ 56 వికెట్లు పడగొట్టాడు. డెరిక్ అండర్వుడ్ (ఇంగ్లండ్; 16 టెస్టుల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును లయన్ బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో భారత్ కొట్టిన సిక్స్లు. 10: ఆస్ట్రేలియాపై ఓ టెస్ట్ ఇన్నింగ్స్లో భారత్ కొట్టిన అత్యధిక సిక్స్లు ఇవే. 1986లో ముంబైలో, 2013లో చెన్నైలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ల్లో భారత్ ఎనిమిది చొప్పున సిక్స్లు కొట్టింది. మూడో జట్టుగా భారత్ ఓ టెస్ట్ మ్యాచ్లో తొలి ఆరు వికెట్లకు 50 అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేసిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఆస్ట్రేలియా (1960లో వెస్టిండీస్పై), పాకిస్తాన్ (2015లో బంగ్లాదేశ్పై) ఈ ఘనత సాధించాయి. ఆస్ట్రేలియా రికార్డు బద్దలు నరేంద్ర మోదీ స్టేడియంలో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా 480 పరుగులతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా టీమిండియా ఆసీస్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. తొలి ఇన్నింగ్స్లో 571 పరుగులు సాధించిన భారత్.. పర్యాటక జట్టు పేరిట ఉన్న ఘనతను కనుమరుగు చేసింది. అయ్యర్ అవుట్! భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ నాలుగో రోజు బ్యాటింగ్కు దిగలేదు. వెన్నునొప్పితో బాధపడిన అతనికి స్కానింగ్ కూడా తీశారు. ముందు జాగ్రత్తగా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఆడించలేదు. మూడో రోజు ఆటలోనే అతనికి నొప్పి మొదలైనట్లు తెలిసింది. గాయం తీవ్రత దృష్ట్యా అతను ఈ నెల 17 నుంచి జరిగే మూడు వన్డేల సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. చదవండి: Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! ఇక కోహ్లి సాధించాల్సింది అదొక్కటే Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! -
BGT 2023, IND VS AUS: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు
Ind Vs Aus 4th Test Ahmedabad Day 5 Updates: డ్రాగా ముగిసిన నాలుగో టెస్టు భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ పేలవ డ్రాగా ముగిసింది. ఫలితంగా 4 మ్యాచ్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023 ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్కు చేరింది. ఈ ఏడాది జూన్ 7 నుంచి 11 వరకు లండన్లోని ఓవల్ మైదానం వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. 68: ఓవర్లలో ఆసీస్ స్కోరు: 168-2 స్టీవ్ స్మిత్ 8, లబుషేన్ 58 పరుగులతో క్రీజులో ఉన్నారు. 57.2: లబుషేన్ అర్ధ శతకం 59.1: రెండో వికెట్ కోల్పోయిన ఆసీస్ అక్షర్ పటేల్ బౌలింగ్లో ట్రవిస్ హెడ్ బౌల్డ్. సెంచరీకి పది పరుగుల దూరంలో ఉన్న హెడ్ భారంగా పెవిలియన్ చేరాడు. ఆసీస్ స్కోరు: 153-2(60). 62 పరుగుల ఆధిక్యం 33 పరుగుల ఆధిక్యంలోకి ఆస్ట్రేలియా 52 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు: 124/1. టీమిండియా కంటే 33 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో సెషన్ కొనసాగుతోంది. హెడ్ అద్భుత అర్ధశతకం (77)తో రాణిస్తుండగా.. లబుషేన్ 37 పరుగులతో క్రీజులో ఉన్నాడు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి ఆసీస్ స్కోరు: 123-1(51) 41 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 82-1 లబుషేన్ 29, హెడ్ 47 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా టీమిండియాతో డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో పోటీ పడిన శ్రీలంకకు న్యూజిలాండ్ చెక్ పెట్టింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన తొలి టెస్టులో లంకను కివీస్ 2 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో రోహిత్ సేన ఫైనల్కు చేరుకుంది. ఇంగ్లండ్లో జరిగే తుదిపోరులో ఆసీస్తో ట్రోఫీ కోసం తలపడనుంది. కాగా భారత జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడం వరుసగా ఇది రెండోసారి. మొట్టమొదటి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ట్రోఫీని న్యూజిలాండ్ గెలిచింది. కోహ్లి సేనను ఓడించి కేన్ విలియమ్సన్ బృందం టైటిల్ ఎగురేసుకుపోయింది. లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా స్కోరు: 73/1 (36) హెడ్ 45, లబుషేన్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత జట్టు కంటే ఆసీస్ ఇంకా 18 పరుగలు వెనుకబడి ఉంది. అంతకు ముందు అశ్విన్కు ఒక వికెట్ లభించిన విషయం తెలిసిందే. 31 ఓవర్లలో ఆసీస్ స్కోరు: 65/1. అర్ధ శతకం దిశగా హెడ్ ట్రవిస్ హెడ్ 40, లబుషేన్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఆసీస్ ఇంకా 26 పరుగులు వెనుకబడి ఉంది. నిలకడగా ఆడుతున్న ఆసీస్ బ్యాటర్లు 25 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు- 44/1. ట్రవిస్ హెడ్ 24, మార్నస్ లబుషేన్ 14 పరుగులతో నిలకడగా ఆడుతున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆచితూచి ఆడుతున్నారు. టీమిండియా కంటే ఆస్ట్రేలియా ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. 15 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 20/1 ట్రవిస్ హెడ్ 11, మార్నస్ లబుషేన్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా కంటే ఆసీస్ ఇంకా 71 పరుగులు వెనుకబడి ఉంది. 11: ఆస్ట్రేలియా స్కోరు: 14-1 తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా 10.4: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదో రోజు ఆటలో భారత్కు తొలి వికెట్ అందించాడు. అశూ బౌలింగ్లో కుహ్నెమన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు: 14/0 టీమిండియా కంటే ఇంకా 77 పరుగులు వెనుకబడి ఉంది. కుహ్నెమన్ 6, ట్రవిస్ హెడ్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. మార్చి 9న నాలుగో టెస్టు ఆరంభం టాస్- ఆస్ట్రేలియా.. తొలుత బ్యాటింగ్ స్ట్రేలియా తొలి ఇన్నింగ్స్- 480 టీమిండియా తొలి ఇన్నింగ్స్- 571 నాలుగో రోజు ఆటలో విరాట్ కోహ్లి (364 బంతుల్లో 186; 15 ఫోర్లు) భారీ శతకంతో చివరి టెస్టులో భారత్ పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 178.5 ఓవర్లలో 571 పరుగుల వద్ద ఆలౌటైంది. నాలుగో రోజు ఆటలో అక్షర్ పటేల్ (113 బంతుల్లో 79; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కోహ్లితో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో కీలకమైన 91 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఆఖరి రోజు సోమవారం ఉదయం ఆతిథ్య బౌలర్లు కూడా సమష్టిగా ఓ చేయి వేసి... ఆసీస్ను 200 పరుగుల్లోపు కట్టడి చేస్తే ఛేదించే లక్ష్యం మన ముందుంటుంది. తద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ వేటకు శుభం కార్డు పడుతుంది. బోర్డర్ - గావస్కర్ ట్రోఫీ ఆఖరి టెస్టు తుది జట్లు టీమిండియా రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ. ఆస్ట్రేలియా ట్రవిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), పీటర్ హ్యాండ్స్కాంబ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, మాథ్యూ కుహ్నెమాన్, టాడ్ మర్ఫీ, నాథన్ లియోన్ -
ఆసీస్తో వన్డే సిరీస్కు టీమిండియా స్టార్ ప్లేయర్ దూరం.. ఐపీఎల్కు కూడా..!
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు అతి భారీ షాక్ తగిలింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సందర్భంగా గాయపడిన టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ మొత్తానికే దూరం కానున్నాడని తెలుస్తోంది. గత కొంతకాలంగా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ, శస్త్ర చికిత్స సైతం చేయించుకున్న అయ్యర్.. అహ్మదబాద్ టెస్ట్ సందర్భంగా గాయం తిరగబెట్టడంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు కూడా దిగలేదు. మూడో రోజు ఆట సందర్భంగా అయ్యర్ వెన్నునొప్పితో విలవిల్లాడిపోయాడని సమాచారం. ప్రస్తుతం అయ్యర్ బీసీసీఐ వైద్యబృందం పర్యవేక్షణలో ఉన్నాడు. స్కానింగ్ రిపోర్టులు అధికారికంగా వెలువడే వరకు ఎలాంటి ప్రకటన చేయకూడని బీసీసీఐ అధికారుల బృందానికి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ అయ్యర్ గాయం తీవ్రత అధికంగా ఉంటే, ఆసీస్తో వన్డే సిరీస్తో పాటు ఐపీఎల్-2023కు కూడా దూరమయ్యే అవకాశముందని భారత క్రికెట్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది. కాగా, మార్చి 17 నుంచి ప్రారంభమయ్యే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్ కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, అహ్మదాబాద్ టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కోహ్లి (186)తో పాటు శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS AUS 4th Test Day 4: సువర్ణావకాశాలను చేజార్చుకున్న భారత్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. ఆట చివరి రోజైన రేపు (మార్యి 13) భారత బౌలర్లు ఆసీస్ను తక్కువ స్కోర్కు కట్టడి చేసి, ఆ తర్వాత నిర్ధేశించబడిన లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించగలిగితే సిరీస్తో (3-1) పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్తు కూడా భారత్ వశమవుతుంది. నాలుగో రోజు చివర్లో టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాల కారణంగా, ఆసీస్పై ఇవాల్టి నుంచే పట్టుబిగించే అవకాశాన్ని టీమిండియా కోల్పోయింది. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో ఆ జట్టు తాత్కాలిక ఓపెనర్ మాథ్యూ కుహ్నేమన్ (0) ఇచ్చిన క్యాచ్లను తొలుత కేఎస్ భరత్, ఆతర్వాత పుజారా జారవిడిచారు. ఒకవేళ ఈ రెండు అవకాశాల్లో భారత్కు ఒక్క వికెట్ లభించినా ఆసీస్ను పూర్తిగా ఒత్తిడిలోని నెట్టే అవకాశం ఉండేది. అందులోనే ఆ జట్టు రెగ్యులర్ ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా గాయం కారణంగా బరిలోకి దిగలేదు. ఈ సమీకరణలన్నీ భారత్కు కలిసొచ్చి ఉండేవి. భరత్, పుజారాలు ఏమాత్రం అప్రమత్తంగా వ్యవహరించి ఉండినా పరిస్థితి వేరేలా ఉండేది. భారత్కు గెలుపుపై ధీమా పెరిగేది. ఇప్పటికైన మించిపోయిందేమీ లేదు. ఆఖరి రోజు తొలి బంతిని నుంచి ప్రత్యర్ధిపై ఒత్తిడి తేగలిగితే, టీమిండియా గెలుపుకు ఢోకా ఉండదు. ఆసీస్ను 150 పరుగుల లోపు ఆలౌట్ చేసి, ఆతర్వాత 60, 70 పరుగుల టార్గెట్ను ఛేదించడం టీమిండియాకు అంత కష్టం కాకపోవచ్చు. అయితే ఇదంతా సాధ్యపడాలంటే భారత స్పిన్నర్లు రేపు తొలి బంతి నుంచే చెలరేగాల్సి ఉంటుంది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇది అంత ఈజీ కూడా కాకపోవచ్చు. కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, భారత తొలి ఇన్నింగ్స్ స్కోర్కు ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కోహ్లి (186)తో పాటు శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
IND VS AUS 4th Test Day 4: ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ
91 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖ్వాజా (180) రెండో ఇన్నింగ్స్లో ఓపెనర్గా బరిలోకి దిగలేదు. భారత బ్యాటింగ్ సందర్భంగా అక్షర్ పటేల్ కొట్టిన సిక్సర్ను ఆపే ప్రయత్నంలో ఖ్వాజా గాయపడ్డాడని, అందుకే అతన్ని ఓపెనర్గా పంపలేదని ఆసీస్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. ఖ్వాజా గాయపడటంతో అతని స్థానంలో ట్రవిస్ హెడ్కు జోడీగా మాథ్యూ కుహ్నేమన్ బరిలోకి దిగాడు. ఖ్వాజా గాయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అతను చివరి రోజు ఆటలో బరిలోకి దిగుతాడా లేదా అన్న విషయంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ ఖ్వాజా గాయం పెద్దదై అతను బరిలోకి దిగలేకపోతే, ఆ ప్రభావం ఆసీస్పై భారీగా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 10 మంది ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే అది ఆసీస్ విజయావకాశాలను భారీ దెబ్బకొడుతుందని, ఇది టీమిండియాకు కచ్చితంగా కలిసొస్తుందని టీమిండియా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టీమిండియా మిడిలార్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్కు కూడా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగని విషయం తెలిసిందే. 186 పరుగుల వద్ద కోహ్లి ఔటవ్వగానే టీమిండియా 571/9 స్కోర్ వద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 3 పరుగులు పరుగులు చేసి, ఇంకా 88 పరుగులు వెనుకపడి ఉంది. ట్రవిస్ హెడ్ (3), మాథ్యూ కుహ్నేమన్ (0) క్రీజ్లో ఉన్నారు. అంతకుముందు భారత ఇన్నింగ్స్లో కోహ్లితో పాటు శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అక్షర్ పటేల్ (79) మెరుపు అర్ధసెంచరీతో అలరించాడు. దానికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. ఆసీస్ బౌలర్లలో లియోన్, మర్ఫీ తలో 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, కుహ్నేమన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. 4 మ్యాచ్ల ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో మూడు మ్యాచ్ల అనంతరం భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతోంది. నాలుగో టెస్ట్లో భారత్ గెలిస్తే.. 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకోవడంతో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా అర్హత సాధిస్తుంది. -
IND VS AUS 4th Test: చరిత్ర సృష్టించిన నాథన్ లియోన్
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ చరిత్ర సృష్టించాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు (టెస్ట్ల్లో) పడగొట్టిన విదేశీ బౌలర్గా ఇంగ్లండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డెరెక్ అండర్వుడ్ (16 టెస్ట్ల్లో 54 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్లో కేఎస్ భరత్ (44) వికెట్ పడగొట్టడం ద్వారా లియోన్ ఈ రేర్ ఫీట్ సాధించాడు. ప్రస్తుతం లియోన్ ఖాతాలో 55 వికెట్లు (11 టెస్ట్ల్లో) ఉన్నాయి. భారతగడ్డపై లియోన్ ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనతను, ఓ సారి 10 వికెట్లు ఫీట్ను సాధించాడు. లియోన్, అండర్వుడ్ తర్వాత భారత గడ్డపై అత్యధిక టెస్ట్ వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ల జాబితాలో రిచీ బెనాడ్ (52), కోట్నీ వాల్ష్ (43), ముత్తయ్య మురళీథరన్ (40) మూడు నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు. భారత్పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్గా.. ప్రస్తుత భారత పర్యటనలో చెలరేగిపోతున్న నాథన్ లియోన్.. పలు ఆసక్తికర రికార్డులను తన పేరిట లిఖించుకుంటున్నాడు. భారతగడ్డపై అత్యధిక వికెట్లు పడగొట్టిన విదేశీ బౌలర్ రికార్డుతో పాటు భారత్పై అత్యంత విజయవంతమైన స్పిన్నర్గానూ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా భారత్పై 26 టెస్ట్ మ్యాచ్లు ఆడిన లియోన్.. 9 సార్లు ఐదు వికెట్ల ఘనతతో పాటు 2 సార్లు 10 వికెట్ల ఘనత సాధించి 115 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారతపై ఏ స్పిన్నర్ ఇన్ని వికెట్లు పడగొట్టలేదు. అలాగే భారత్పై అత్యధిక ఫైఫర్లు సాధించిన బౌలర్గాను లియోన్ రికార్డు నెలకొల్పాడు. భారత్పై అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్కు ముందు ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ (139) మాత్రమే ఉన్నాడు. BGT-2023లో భీకర ఫామ్లో ఉన్న లియోన్.. 4 టెస్ట్ల్లో 21 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా లియోన్ ఖాతాలో 480 వికెట్లు (119 టెస్ట్ల్లో) ఉన్నాయి. ఇందులో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత, 4 సార్లు 10 వికెట్ల ఘనత సాధించాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో లియోన్ ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మురళీథరన్ (800) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), ఆండర్సన్ (685), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (576), మెక్గ్రాత్ (563), వాల్ష్ (519) వరుసగా 2 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు మూడో సెషన్ సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 519 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (169), అక్షర్ పటేల్ (57) క్రీజ్లో ఉన్నారు. భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (128) సెంచరీ చేయగా.. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 482 పరుగులకు ఆలౌటైంది. ఉస్మాన్ ఖ్వాజా (180), గ్రీన్ (114) సెంచరీలతో కదంతొక్కగా.. అశ్విన్ 6 వికెట్లతో ఆసీస్ వెన్ను విరిచాడు. -
Ind VS Aus: ఏంటిది కోహ్లి?! పాపం భరత్.. మరీ ఇలా ట్రీట్ చేస్తావా? వైరల్
Virat Kohli Death Stare At KS Bharat Viral: కోన శ్రీకర్ భరత్.. ఈ ఆంధ్ర వికెట్ కీపర్ బ్యాటర్ ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియాతో నాగ్పూర్ టెస్టుతో టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్తో కలిసి అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్ నుంచే తన వికెట్ కీపింగ్ స్కిల్స్తో ఆకట్టుకున్నాడు భరత్. అయితే బ్యాటర్గా మాత్రం రాణించలేకపోయాడు. అరంగేట్ర టెస్టులో 8, ఢిల్లీ టెస్టులో వరుసగా 6, 23 నాటౌట్.. మూడో మ్యాచ్లో మొత్తంగా 20 పరుగులు మాత్రమే చేశాడు. ఆరోస్థానంలో వచ్చి.. అయితే, నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో భరత్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అహ్మదాబాద్ నాలుగో రోజు ఆటలో భాగంగా శ్రేయస్ అయ్యర్ వెన్నునొప్పితో దూరం కావడంతో ఆరోస్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు భరత్. రవీంద్ర జడేజా అవుట్ కావడంతో క్రీజులో వచ్చిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ విరాట్ కోహ్లితో కలిసి 50 పరుగుల పైచిలుకు మెరుగైన భాగస్వామ్యం నమోదు చేశాడు. 1993లో ఇంగ్లండ్తో మ్యాచ్ తర్వాత ఐదో వికెట్కు ఈ మేర పార్ట్నర్షిప్ నమోదు కావడం విశేషం. ఇదే అత్యధిక స్కోరు ఈ క్రమంలో 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 136.4వ ఓవర్లో నాథన్ లియోన్ బౌలింగ్లో భరత్ హ్యాండ్స్కాంబ్కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 88 బంతుల్లో రెండ ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 44 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్లో భరత్కు ఇదే అత్యధిక స్కోరు. ఇదిలా ఉంటే... 109వ ఓవర్లో టాడ్ మర్ఫీ బౌలింగ్లో కోహ్లి- భరత్ మధ్య సమన్వయం లోపించింది. పరుగు తీసేందుకు కోహ్లి కాల్ ఇవ్వగా.. నిరాకరించిన భరత్ మందకొడిగా కదిలాడు. అప్పటికే పిచ్ మధ్య వరకు వచ్చిన కోహ్లి వేగంగా వెనక్కి పరిగెత్తుకు వెళ్లాడు. కొద్దిలో రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. భరత్పై సీరియస్ అయిన కోహ్లి దీంతో కోహ్లి కోపం నషాలానికి అంటింది. భరత్ను సీరియస్గా చూస్తూ ఏదో తిట్టినట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘పాపం భరత్.. మరీ ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు కోహ్లి.. మొన్న అలా.. ఇప్పుడిలా? నువ్వు కూడా సింగిల్ విషయంలో చూసుకోవాలి కదా! ప్రతిదానికి ఎదుటివాళ్లను బాధ్యుల్ని చేయడం సరికాదు’’ అని కామెంట్లు చేస్తున్నారు. అది మాత్రం కనిపించలేదా? కాగా సమయంలో 68 పరుగులతో ఉన్న కోహ్లి 155 పరుగులు పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ దిశగా పయనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. మరికొందరేమో కోహ్లికి సపోర్టు చేస్తూ.. ‘‘కీలక సమయంలో ఇలాంటి తప్పిదాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే తను అలా స్పందించాడు. అందులో తప్పేముంది?’’ అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను హైలైట్ చేస్తున్నవాళ్లు.. ఆ తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ ఆడిన భరత్ను కోహ్లి అభినందించిన దృశ్యాలు కూడా షేర్ చేయాలంటూ చురకలు అంటిస్తున్నారు. చదవండి: WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్ అద్భుతం చేస్తేనే.. Virat Kohli 75th Century: కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది! WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్! This is very shameful reaction from Virat Kohli towards youngster KS Bharat Sad to see a youngster being Demotivated by someone's Ego💔pic.twitter.com/ygg3eDhcZl — Immy|| 🇮🇳 (@TotallyImro45) March 12, 2023 Virat Kohli appreciating KS Bharat knock. pic.twitter.com/vbo4nrVe4F — Mufaddal Vohra (@mufaddal_vohra) March 12, 2023 Virat Kohli is on song here. Back to back boundaries by him to get to his 150.#INDvAUS #TeamIndia @imVkohli pic.twitter.com/rEHsp7QvG8 — BCCI (@BCCI) March 12, 2023 -
Virat Kohli: ఎవరికీ అందనంత ఎత్తులో! అదొక్కటే మిగిలి ఉంది తప్ప!
India vs Australia, 4th Test- Virat Kohli: నేటితరం క్రికెటర్లలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రికార్డులు సాధించడంలో.. వాటిని తిరగరాయడంలో తనకు తానే సాటి. ఇప్పటికే తన సమకాలీన క్రికెటర్లకు ఎవరికీ సాధ్యం కాని రీతిలో అనేక రికార్డులు నెలకొల్పాడు రన్మెషీన్. తాజాగా అంతర్జాతీయ క్రికెట్లో 75వ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు నాలుగో రోజు ఆట సందర్భంగా ఈ అరదైన శతకం సాధించాడు. సెంచరీ సెంచరీలకు మూడొంతులు పూర్తిచేసి.. ఇంకొక్క 25 శతకాల దూరంలో నిలిచాడు. సమకాలీన క్రికెటర్లు కనీసం 50 సెంచరీల మార్కు అందుకోలేక ఆపసోపాలు పడుతున్న వేళ ఈ విధంగా ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న క్రికెటర్లలో కోహ్లికి దరిదాపుల్లో కూడా ఎవరూ లేరంటే ఈ పరుగుల యంత్రం సత్తా ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అదొక్కటే మిగిలి ఉంది ఇక ఇప్పటి వరకు 100 సెంచరీలతో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ శతకాల జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి అతడిని అనుసరిస్తున్నాడు. ఆసీస్ లెజెండ్ రిక్కీ పాంటింగ్ 71 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. కాబట్టి సచిన్ను అధిగమించడమే మిగిలి ఉంది తప్ప కోహ్లికి ఇప్పట్లో పోటీనిచ్చే వాళ్లు ఎవరూ లేరు! దీంతో కింగ్ కోహ్లి అభిమానుల సంతోషాలు మిన్నంటుతున్నాయి. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 ఆఖరి మ్యాచ్ను కనీసం డ్రా చేసుకోవాల్సిన కీలక పరిస్థితిలో కోహ్లి బ్యాట్ ఝులిపించడంతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యాక్టివ్ ప్లేయర్లలో సెంచరీల విషయంలో కోహ్లి తర్వాతి స్థానంలో ఉన్నది వీళ్లే! 1. విరాట్ కోహ్లి-75 2. జో రూట్- 45 3. డేవిడ్ వార్నర్- 45 4. రోహిత్శర్మ- 43 5. స్టీవ్ స్మిత్-42 . చదవండి: WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్ అద్భుతం చేస్తేనే.. WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్! The Man. The Celebration. Take a bow, @imVkohli 💯🫡#INDvAUS #TeamIndia pic.twitter.com/QrL8qbj6s9 — BCCI (@BCCI) March 12, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
దేవుడా.. నీవే దిక్కు !
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలి
జూన్ 4 తర్వాత వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే
24న డీఈఈ సెట్
యంత్రంలో ఫలితాలు.. బెట్టింగ్ల జోరు
గదులు నిర్మించండి
రైతులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు
బదిలీలతో బరితెగింపు
Lok Sabha Election 2024: బీజేపీ అభ్యర్థుల్లో... నాలుగోవంతు ఫిరాయింపుదారులే
తప్పక చదవండి
- అనంత్నాగ్–రాజౌరీలో... అంతుపట్టని ఓటరు నాడి
- పద్ధతి ప్రకారం పరిహారం
- కుమ్మక్కుతో విధ్వంసకాండ
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
Advertisement