-
పోలీసుల కళ్లెదుటే ‘మణిపూర్ ఘోరం’
మణిపుర్లో మైతీ తెగకు చెందిన మూకల చేతికి చిక్కిన ఇద్దరు కుకీ తెగ మహిళను నగ్నంగా ఊరేగించి.. లైంగిక హింసకు పాల్పడిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జిషీట్లో షాకింగ్ విషయాలను వెల్లడించింది. బాధిత మహిళలు సాయం చేయమని కోరినా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, వారు ఏమాత్రం పట్టించకోకుండా అల్లరిగుంపుకే సహకరించేలా వ్యవహరించారని తెలిపింది.కాంగ్పోక్పీ జిల్లాలో మైతీ అల్లరిగుంపు చేతికి చిక్కిన ఇద్దరు కుకీ మహిళలు ఘటనా ప్రాంతానికి సమీపంలో ఉన్న పోలీసు జీపు వద్దకు వెళ్లి సాయం చేయాలని కోరారు. అయితే పోలీసులే స్వయంగా బాధితులను ఆ అల్లరిగుంపకు అప్పగించినట్లు ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. దీంతో ఆ అల్లరి మూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వరిపొలాల్లో దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు వివరించింది.బాధితురాళ్లలో ఒక మహిళ తమను కాపాడి, సురక్షిత ప్రాంతాని తీసుకుళ్లాలని పోలీసులను కోరారు. అయితే జీపు తాళాలు తమ వద్ద లేవని పోలీసులు అబద్దాలు చెప్పినట్లు సీబీఐ ఛార్జిషీట్ పేర్కొంది. మరోవైపు.. అల్లరిగుంపు చేతికి చిక్కిన మూడో మహిళ వారి నుంచి త్రుటిలో తప్పించుకొంది.గతేడాది మే 4న జరిగిన ఈ ఘటన రెండు నెలల తర్వాత జులై నెలలో వైరల్గా మారి దేశమంతా కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆరుగురు నిందితులతోపాటు ఓ బాల నేరస్థుడిపై గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జిషీటు దాఖలు అయింది.ఈ దాడుల్లో అల్లరిగుంపు చేతిలో మృతిచెందిన కుకీ తెగకు చెందిన తండ్రీకొడుకుల మృతదేహాలను గ్రామ సమీపంలోని నీరులేని నదిలోకి విసిరేసినట్లు తెలిపింది. మైతీ గుంపు జీపు వద్దకు చేరుకోగానే బాధితులను అక్కడే వదిలేసి.. పోలీసులు పారిపోయినట్లు సీబీఐ మూడు పేజీల ఛార్జిషీటులో పేర్కొంది. -
15 నిర్వాకాలు.. 50 అంశాలు
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలు, మోసాల పేరిట కాంగ్రెస్ ఆ పార్టీపై చార్జిషీట్ వేసింది. ‘నయవంచన’పేరుతో విడుదల చేసిన అభి యోగ పత్రంలో.. తెలంగాణకు చేసిన ద్రోహం, నిధుల విడుదలలో వివక్ష, రైతులు, పేదలు, యువతకు దోఖా, ప్రాజెక్టుల కేటాయింపు, విద్యాసంస్థల ఏర్పాటులో మోసం పొందుపరిచింది. దేశాన్ని అమ్మేస్తున్న మోదీ, రైతు వ్యతిరేక బీజేపీ, సామాన్యుడిపై ధరల మోత, పబ్లిసిటీ సర్కార్, దేశ సార్వ¿ౌమత్వానికి భంగం, నిరంకుశత్వ మోదీ, పెరిగిపోయిన నిరుద్యోగం, ఎలక్టోరల్ బాండ్ల స్కామ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేకి మోదీ, ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం తదితర అంశాలను మోదీ నిర్వాకాల పేరుతో ప్రస్తావించింది. మోదీ జుమ్లాలు: మోదీ జుమ్లాలంటూ ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు, 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు, 2022 కల్లా అందరికీ ఇళ్లు, 100 రోజుల్లో నల్లధనం వెనక్కు తెచ్చి ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు జమ, నిత్యావసరాల ధరల తగ్గింపు, అవినీతిని రూపుమాపడం, నోట్ల రద్దుతో నల్లధనం నిర్మూలన, చైనా ఆక్రమణ వంటి అంశాల్లో బీజేపీ మాట తప్పిందని, మోసం చేసిందని పేర్కొంది. కాకినాడలో ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం నుంచి డాలర్తో రూపాయి విలువను రూ.40కి తీసుకెళ్తానని చెప్పి రూ.85కు దిగజార్చడం.. వరకు మొత్తం 50 అంశాలను ఈ 15 నిర్వాకాల్లో ప్రస్తావించింది. ప్రజలకు ప్రశ్నలు: లోక్సభ ఎన్నికల ప్రచారంలో వినియోగించనున్న ఈ చార్జిషీట్లో ప్రాసతో కూడిన 7 ప్రశ్నలను తెలంగాణ ప్రజలకు చార్జి షీట్ ద్వారా కాంగ్రెస్ వేసింది. యువతా.. ఈ మోసాలను సహిద్దామా?, రైతులారా.. ఈ వంచకులను క్షమిద్దామా?, దళిత, గిరిజనులారా ఈ దగాకోరులను నమ్ముదామా?, బీసీల్లారా ఈ అహంకారులను ఆదరిద్దామా?, ఈ భారం ఇంకా భరిద్దామా?, మహిళలారా.. ఈ అసమర్థులకు మద్దతిద్దామా?, ఈ కార్పొరేట్ శక్తులకు తలొగ్గుదామా? అంటూ ప్రశ్నలు సంధించింది. ‘పదేళ్ల కన్నీళ్లను యాదుంచుకుందాం.. ప్రజాద్రోహుల పాలనను అంతం చేద్దాం..’అనే నినాదంతో బీజేపీపై చార్జిషీట్ను ముగించింది. -
ఎయిరిండియా మాజీ సీఎండీ, ఐబీఎం, ఎస్ఏపీ కంపెనీలపై సీబీఐ కొరడా.. కారణం..
సాఫ్ట్వేర్ను కొనుగోలు చేసిన విషయంలో ఎయిరిండియా మాజీ సీఎండీ, ఎస్ఏపీ ఇండియా, ఐబీఎమ్లపై సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. 2011లో రూ.225 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ను ఎయిరిండియా కొనుగోలు చేసిన విషయంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈ ఘటన చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ కొనుగోలులో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా కనుగొన్న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) సీబీఐకు సిఫారసు చేసింది. దాంతో సీబీఐ దాదాపు ఆరేళ్ల దర్యాప్తు చేసింది. ఎయిరిండియా మాజీ సీఎండీ అరవింద్ జాధవ్, ఐబీఎమ్ ఇండియా, ఎస్ఏపీ ఇండియా, మరో ఆరుగురిపై ఐపీసీ సెక్షన్ 120-బీ(క్రిమినల్ కాన్స్పిరసీ), అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనల ప్రకారం ఛార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐకి సీవీసీ ఇచ్చిన నోట్లో..సరైన టెండర్ ప్రక్రియను అనుసరించకుండా ఎస్ఏపీ ఏజీ నుంచి ఈఆర్పీ సాఫ్ట్వేర్ వ్యవస్థను ఎయిరిండియా ఎంపిక చేసిందని పేర్కొంది. ఈ విషయం ఎయిరిండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పింది. ఈ కాంట్రాక్టుకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతులు లేవనే ఆరోపణలున్నాయి. అయితే 2009, 2010ల్లో కార్యదర్శుల బృందం, మంత్రుల బృందానికి ప్రెజెంటేషన్ ఇచ్చినట్లు ఎయిరిండియా చెబుతోంది. ఇదీ చదవండి: రూ.32 లక్షల సైకిల్ - ఎందుకింత రేటు? ఇదిలా ఉండగా, అప్పటికే ఒరాకిల్ నుంచి అదే మాదిరి ఈఆర్పీ సాఫ్ట్వేర్ ఉంది. మళ్లీ ఎందుకు సాఫ్ట్వేర్ తీసుకున్నారనేదానిపై సరైన వివరణ లేదు. ఒరాకిల్ సాఫ్ట్వేర్లో సమస్యలున్నాయని అంటున్నా సరిచేయడానికి ప్రయత్నాలు జరిగినట్లు కనిపించలేదని తెలిస్తుంది. ఓపెన్ టెండర్ ప్రక్రియను నిర్వహించకుండానే ఎస్ఏపీ, ఐబీఎమ్లకు నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టును అప్పగించారనే వాదనలున్నాయి. -
అది పచ్చపన్నాగమే..
విశాఖ విమానాశ్రయంలో పక్కా వ్యూహంతోనే జగన్పై హత్యాయత్నం జనబలం లేని చంద్రబాబుకు అడ్డదారిలో అధికారం కట్టబెట్టేందుకు పచ్చపక్షం తెగ తాపత్రయపడుతోంది. ప్రజలను తప్పుదారి పట్టించే రీతిలో అడ్డగోలు కథనాలు వండివారుస్తూ ఆపసోపాలు పడుతోంది. సింగిల్గా పోరాడుతున్న సింహాన్ని చూసి బెదిరిపోతున్న శక్తులన్నీ ఒక్కటై కత్తులు దూస్తున్నాయి. కుట్ర రాజకీయాలు చేస్తూ ప్రతి అంశాన్నీ జగన్కు వ్యతిరేకంగా చూపించేలా కట్టుకథలు అచ్చేయిస్తున్నాయి. చివరకు 2018లో ఆయనపై విశాఖ విమానాశ్రయం వేదికగా జరిగిన హత్యాయత్నం కేసుపైనా దు్రష్పచారానికి ఒడిగడుతున్నాయి. పథకం ప్రకారమే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ఓ వైపు ఎన్ఐఏ ధ్రువీకరిస్తున్నా... దానినీ పక్కదారి పట్టించేలా అసత్యాలను ప్రచారం చేయాలని కంకణం కట్టుకున్నాయి. –సాక్షి, అమరావతి ఎన్ఐఏ చార్జిషీట్లో ఏముంది? వైఎస్ జగన్ను హత్య చేసేందుకే నిందితుడు శ్రీనివాస్ ఆయనపై అరచేతిలో ఇమిడిపోయేంత పదునైన కత్తితో దాడికి పాల్పడ్డాడని కోర్టులో దాఖలు చేసిన చార్జ్షీట్లో ఎన్ఐఏ పేర్కొంది. జగన్ మెడ భాగంలో పొడిచి హత్య చేయాలన్నది నిందితుడి లక్ష్యమని కూడా అందులో వివరిస్తూ... చివరికి ఎడమ భుజం భాగంలోని ముఖ్యమైన ప్రాంతంలో గాయమైందని తెలిపింది. మెడమీద సున్నిత ప్రాంతంలో కత్తితో దాడి చేస్తే నరాలు తెగి మెదడుకు రక్త ప్రసరణ నిలిచిపోయి వ్యక్తి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్య నిపుణుల నివేదిక కూడా స్పష్టం చేస్తోంది. నాటి దాడి యాదృచ్చికం కాదనీ... హత్య చేసేందుకు పక్కా కుట్రేనన్నది నిర్ధారణ అవుతోంది. రెస్టారెంట్ యజమాని పక్కా టీడీపీ వైఎస్ జగన్పై హత్యా యత్యానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ‘ఫ్యూజన్ ఫుడ్స్’ రెస్టారెంట్లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్తూ నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడు. 2014లో ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించారు కూడా. ఆయన 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కించుకున్నది టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖమంత్రిగా ఉన్నపుడే. పక్కా పన్నాగంతోనే ఉద్యోగం 2018 అక్టోబర్ 25వ తేదీన వై.ఎస్.జగన్పై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. అప్పటికి 9 నెలల ముందే అంటే 2018, జనవరి 30న యలమంచిలికి చెందిన టీడీపీ నేత సుందరపు విజయ్కుమార్ సిఫార్సుమేరకు హర్షవర్ధన్ తన రెస్టారెంట్లో శ్రీనివాస్కు ఉద్యోగమిచ్చారు. ఈ విషయాన్ని ఆయనే ఎన్ఐఏ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు. అప్పటికే ఉత్తరాంధ్రలో పాదయాత్ర చేస్తున్న జగన్ విశాఖ విమానాశ్రయం నుంచే హైదరాబాద్ వెళ్లి వస్తారన్నది అందరికీ తెలిసిందే. ఆ విషయం తెలుసుకున్న కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడికి రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించి హత్యాయత్నానికి ప్రేరేపించారని తేటతెల్లమవుతోంది. నిందితుడు పాత నేరస్తుడే... కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల(సీఐఎస్ఎఫ్) భద్రతా వలయంలో ఉండే విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్లోగానీ అక్కడ ఉండే షాపులు, ట్రావెల్స్ ఏజెన్సీల డెస్్కలలో ఉద్యోగాల్లో చేరడం అంత ఆషామాషీ కాదు. అభ్యర్థులపై ఎలాంటి నేర చరిత్ర ఉండకూడదు. అందుకోసం అభ్యర్థుల నివాస, స్వస్థలాల్లోని పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ కచ్చితంగా సమర్పించాలి. నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ ఆయన స్వస్థలమైన తానేలంకలో పలు వివాదాల్లో ఉన్నట్టు ముమ్మడివరం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని రెస్టారెంట్లో చేర్చుకునేందుకు దాని యజమానే విశాఖ ఎయిర్పోర్ట్ పోలీస్స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకుని ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు సమర్పించడం.. అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదని ఆయనే నిర్ధారించడం గమనార్హ. ఠానేలంక పరిధిలోకి వచ్చే పోలీస్ స్టేషన్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అధికారులు స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా తన రెస్టారెంట్లో ఉద్యోగం కల్పించడం వెనుక పక్కా కుట్ర ఉంది. టీడీపీ దుష్ప్రచారంపై నిందితుడి నీళ్లు జగన్పై హత్యాయత్నం జరిగిన కొద్ది క్షణాల్లోనే టీడీపీ ఆ నింద తమపైకి రాకుండా దు్రష్పచారానికి తెరతీసింది. నిందితుడు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడని.. జగన్కి సానుభూతి రావాలన్న ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డాడని టీడీపీ నేతలు మీడియా సమావేశాలు పెట్టిమరీ వ్యాఖ్యానించారు. అప్పటి డీజీపీగా ఉన్న ఆర్పీ ఠాకూర్ సైతం కనీసం ప్రాథమిక విచారణ కూడా పూర్తి కాకుండానే జగన్కు సానుభూతి తీసుకురావడం కోసమే నిందితుడు దాడికి పాల్పడ్డాడని ప్రకటించారు. ఈ ప్రకటన వెనుక టీడీపీ ‘ముఖ్య నేత’ ఆదేశాలున్నట్టు స్పష్టమవుతోంది. కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఉద్దేశపూర్వకంగానే సరికొత్త భాష్యాలు చెప్పారన్నది తేటతెల్లమైంది. నిందితుడు శ్రీనివాస్ గతంలో బెయిల్పై విడుదల అయిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వైఎస్జగన్కు సానుభూతి తీసుకువచ్చేందుకు తాను దాడికి పాల్పడలేదని స్పష్టంగా వెల్లడించడంతో టీడీపీ నేతల దు్రష్పచారం బెడిసికొట్టింది. పచ్చ మీడియా పైశాచిక ఆనందం బాధితునిపై సానుభూతి చూపడం... నిందితుడిపై ఆగ్రహం ప్రదర్శించడం మానవీయ ధర్మం. ఎల్లోమీడియా అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కేసులో బాధితుడైన జగన్ను అవహేళన చేయడమే కాకుండా, నిందితుడు ఉపయోగించిన ఆయుధం పేరును కేసుకు జోడించి తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలంగా మలిచేందుకు ఏకంగా న్యాయ వ్యవస్థకే దురుద్దేశాలు ఆపాదిస్తోంది. హత్యాయత్నం కేసు దర్యాప్తును విశాఖపట్నం న్యాయస్థానానికి బదిలీ చేయడాన్ని ఈనాడు, ఇతర పచ్చ మీడియా వక్రీకరిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణను సాగదీసేందుకే ఆ కేసును విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేశారని తేల్చేస్తూ న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తూ న్యాయ వ్యవస్థను కించపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటి? ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఎన్నో కేసులు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్నాయి. మావోయిస్టు పార్టీ, వాటి అనుబంధ సంఘాల కేసులు, వివిధ తీవ్రవాద సంస్థల కేసులు పెండింగులో ఉండటం సమస్యగా మారింది. విజయవాడలో ఉన్న ఒకే ఒక ఎన్ఐఏ న్యాయస్థానం ద్వారా ఈ కేసుల విచారణకు ఎక్కువ కాలం పడుతోందని హైదరాబాద్లోని ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం భావించింది. రాష్ట్రంలో అదనంగా ఎన్ఐఏ న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రెండేళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విశాఖపట్నంలో మరో న్యాయస్థానం ఏర్పాటు చేస్తే ఎన్ఐఏ కేసుల విచారణ వేగవంతమవుతుందని చెప్పింది. అందుకే ఎన్ఐఏకు విజయవాడతోపాటు విశాఖç³ట్నంలో కూడా ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాలను విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానం పరిధిలోకి చేర్చారు. హత్యాయత్నం ఘటన విశాఖపట్నంలో జరిగినందున ఈ కేసు విచారణను కూడా విశాఖపట్నం ఎన్ఐఏ న్యాయస్థానానికి బదిలీ చేయాలని విజయవాడ న్యాయస్థానం నిర్ణయించింది. సమగ్ర దర్యాప్తునకు వినతి ఈ హత్యాయత్నం వెనుక ఉన్న కుట్రను ఛేదించాలని, వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని సీఎం జగన్ తరఫు న్యాయవాదులు ఎన్ఐఏను, కోర్టును కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.విశాఖపట్నం విమానాశ్రయంలోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరికి నిందితుడు శ్రీనివాస్కు సంబంధం ఏమిటి? నిందితుడు పాత నేరస్తుడైనప్పటికీ ఉద్యోగిగా ఎలా చేర్చుకున్నారు? ఈ విషయాన్ని ఎన్ఐఏ తన చార్జ్షీట్లో పేర్కొన్న విషయం వాస్తవమే కదా? విమానాశ్రయంలో ఉన్న జగన్కు కాఫీ ఇవ్వడానికి నిందితుడినే ఎందుకు పంపారు? జగన్ను తానే పొడిచానని గతంలో బెయిల్ వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూల్లో శ్రీనివాసరావు చెప్పిన మాట వాస్తవం కాదా? హర్షవర్ధన్ చౌదరికి రెస్టారెంట్ కాంట్రాక్టు దక్కడం వెనుక ఎవరు కీలకంగా వ్యవహరించారు? హర్షవర్దన్ చౌదరి, లోకేశ్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? హర్షవర్దన్కి ఎయిర్పోర్టులో 2017లో కేటరింగ్ కాంట్రాక్టు కేటాయింపు సమయంలో కేంద్రమంత్రిగా ఉన్నది టీడీపీ నేత, చంద్రబాబు సన్నిహితుడు అశోక్ గజపతిరాజే కదా? కథకం ప్రకారం దాడిచేసిన శ్రీనివాసరావును కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర పచ్చ మీడియా ఏకంగా న్యాయప్రక్రియను, విచారణను, దర్యాప్తును పక్కదారి పట్టించేలా వ్యవహరించడం లేదా? హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడ్ని టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లో మీడియా నిరంతరం ఎందుకు మోస్తున్నాయి? అంటే ఇందులో వారి ప్రమేయం ఉన్నట్టేనా? శ్రీనివాస్ను కాపాడేందుకు టీడీపీ, ఈనాడు, ఇతర ఎల్లోమీడియా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? -
బీఆర్ఎస్ పాలనలో యువత భవిష్యత్తు నాశనం
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో యువత ఉజ్వల భవిష్యత్తు నాశనమవుతోందని కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్ అసమర్థ పాలనలో యువకులు మద్యానికి బానిసలవుతున్నారని, విద్యారంగానికి కేటాయింపులు తగ్గించి, సకాలంలో ఉద్యోగాలు భర్తీ చేయక, ఉద్యోగ పరీక్షల నిర్వహణ కూడా సరిగా చేయలేకపోవడంతో రాష్ట్ర యువత నిర్వి ర్యం అయిపోతోందని ఆ పార్టీ అభిప్రాయపడింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ బుధవారం పది అంశాలతో కూడిన యూత్ చార్జిషీట్ను విడుదల చేసింది. యూత్ చార్జిషీట్లోని అంశాలివే.. ♦ దేశంలోనే విద్యారంగానికి తెలంగాణలో కేటాయింపులు తక్కువ. 2014–15లో రాష్ట్ర బడ్జెట్లో 10.98 శాతం నిధులు విద్యకు కేటాయించగా, 2023–24లో 7.6 శాతానికి తగ్గించారు. ♦ కేజీ టు పీజీ విద్యను 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. కానీ ఈ తొమ్మిదేళ్లలో ఒక్క కొత్త తరగతి గదిని కూడా నిర్మించలేదు. ఒక్క గంభీరావుపేటలో మాత్రమే కేజీ టు పీజీ క్యాంపస్ను నిర్మించారు. ♦ సీఎస్ఆర్ నిధులతో ఒక్క తరగతి గదినయినా కట్టించాలని కార్పొరేట్ కంపెనీలను అడుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. ♦ ప్రతి ఇంటికీ ఉద్యోగం అని కేసీఆర్ అబద్ధాలు చెప్పారు. కేవలం 60 శాతం ఉద్యోగులతో ఈ 60 శాతం సర్కార్ నడుస్తోంది. ♦ ఉద్యోగ పరీక్షలు రాసే లక్షలాది మంది యువత విశ్వాసాన్ని టీఎస్పీఎస్సీ కోల్పోయింది. ♦ పదో తరగతి నుంచి టీఎస్పీఎస్సీ పరీక్షల వరకు నిర్వహణ వైఫల్యంతో 2014–21 మధ్య కాలంలో తెలంగాణలో 3,600 మందికి పైగా యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ♦జాబ్ కేలండర్ లేకపోవడంతో ఒకే సమయంలో వివిధ పరీక్షలు నిర్వహించి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకున్నారు. ♦ రూ.4,592 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుండటంతో వేలాది మంది విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు సరి్టఫికెట్లు, టీసీలు ఇవ్వడం లేదు. ♦యూనివర్సిటీల్లో 2/3వ వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రైవేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ వర్సిటీలను నాశనం చేస్తున్నారు. ♦కేసీఆర్ అసమర్థ పాలనతో యువత మద్యానికి, డ్రగ్స్కు, జూదానికి బానిసలవుతున్నారు. వారి భవిష్యత్తు నాశనమవుతోంది. -
ఈఎస్ఐ స్కామ్లో చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని నిందితులుగా పేర్కొంటూ అభియోగపత్రాలనుసమర్పించారు. ఈఎస్ఐలో మందులు, మెడికల్ కిట్ల కొనుగోలులో గోల్మాల్ జరిగినట్లు దేవికారాణిపై ఆరోపణలు వచ్చాయి. నకిలీ ఇన్ వాయిస్ సృష్టించి పెద్ద మొత్తంలో లబ్ధి పొందినట్లు తేలింది. మెడికల్ క్యాంపు ల పేరుతో నిధులు గోల్మాల్ చేసి, అక్రమ సంపాదనతో 6 కోట్ల విలువ చేసే బంగారాన్ని దేవికరాణి ,ఫార్మసిస్ట్ నాగలక్ష్మి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. రియల్ ఎస్టేట్లోనూ నిందితులుపెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ కేసు నమోదుచేసింది. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే నిందితులకు చెందిన రూ.144 కోట్ల ఆస్తులు. ఓపెన్ ప్లాట్స్ కమర్షియల్ షాప్లను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ నమోదు చేసిన ఎనిమిది ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది. కాగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈస్ఐ కొనుగోళ్ల కుంభకోణం నిందితుల్లో దేవికారాణితోపాటు మాజీ జేడీ పద్మజ, షార్మాసిస్టు కే.నాగమణి, ఇద్దరు కాంట్రాక్టర్లు కే.శ్రీహరిబాబు, పీ.రాజేశ్వరరెడ్డి నిందుతులుగా ఉన్నారు. -
23 నుంచి బీజేపీ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ తమ కార్యాచరణను వేగవంతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ బన్సల్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ల నేతృత్వంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు పలు పార్టీ సమావేశాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా నిరసనలు, ఆందోళనలకు యాక్షన్ ప్లాన్ రూపొందించారు. 23 నుంచి ప్రజా ఆందోళనలు: కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఉద్యమ కమిటీ సమావేశంలో.. ఈనెల 23 నుంచి నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళన కార్యక్రమాల ప్రణాళికను ఖరారు చేశారు. 23న అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టి.. ఆయా ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల చేసిన అవినీతి, అక్రమాలు, హామీల ఉల్లంఘనపై చార్జిషిటును విడుదల చేస్తారు. 24న మంత్రుల ఇళ్ల ముట్టడి, ధర్నాలు చేపట్టి.. మంత్రుల అవినీతిపై చార్జిషిటును విడుదల చేస్తారు. 25న జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. అమిత్షా పర్యటన, బస్సు యాత్రలపై..: 27న ఖమ్మంలో నిర్వహించే అమిత్షా సభకు ఏర్పాట్లపైనా రాష్ట్ర బీజేపీ నేతలు మరో సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించిన బస్సు యాత్రలపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. భద్రాచలం సీతారామ దేవాలయం, బాసర సరస్వతి దేవాలయం, అలంపూర్ జోగులాంబ దేవాలయాల నుంచి బీజేపీ బస్సుయాత్రలను ప్రారంభించనున్నారు. అధికార పార్టీ ఉల్లంఘనలపై ఫోకస్ మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలో జరిగిన బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో.. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు స్పందించేలా చేపట్టాల్సిన చర్యలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశంలో.. నియోజకవర్గాల వారీగా పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా సోమవారం పార్టీ అనుబంధ సంఘాలైన ఏడు మోర్చాల సమావేశాలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించనున్నారు. -
సీబీఐ ఛార్జ్షీట్ కల్పిత కథ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలా: సజ్జల
సాక్షి, అమరావతి: కల్పితమైన కథ సీబీఐ ఛార్జ్షీట్లో కనిపిస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా, టీడీపీకి మసాలాతో అవసరమైన సరుకుగా ఛార్జ్షీట్ ఉపయోగపడుతుందని మండిపడ్డారు. సీబీఐ కూడా దర్యాప్తు పేరుతో ఎంత చెత్తగా ఛార్జ్షీట్ దాఖలు చేసిందో చూస్తున్నామన్నారు. ‘‘వివేకా కేసు దర్యాప్తు సీబీఐ చరిత్రలోనే మచ్చుతునక. బేసిక్ లాజిక్ను సీబీఐ మర్చిపోయింది. వ్యవస్థలో చంద్రబాబు వైరస్లా పాకారు. వివేకా హత్య వల్ల నష్టం ఎవరికో చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు. వ్యవస్థలను ప్రభావితం చేయడం వల్లే దర్యాప్తు ఇలా జరిగింది. వివేకా హత్య కేసు ఆధారాలను సీబీఐ ఏం చేసింది?. కథ ఎలా మలుపు తిరగాలో ఆ విధంగా స్టేట్మెంట్ వస్తుంది. గూగుల్ టేక్ అవుట్ నిలబడదని వారికి అర్థమైంది’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘నాలుగేళ్ల తర్వాత కొత్త కథ అల్లారు. సునీత ఇప్పటివరకు ఆరు, ఏడు స్టేట్మెంట్లు ఇచ్చారు. కొన్ని అంశాలను మాత్రమే తీసుకుని విషం చిమ్ముతున్నారు. వివేకా పేరు మీద మచ్చ పడకూడదని అవినాష్రెడ్డి, ఆయన కుటుంబం మౌనంగా భరిస్తూ వచ్చారు. వివేకా హత్య కేసులో దోషులు బయటకు రావాలని మొదటి నుంచి కోరుతున్నాం’’ అని సజ్జల తెలిపారు. ‘‘ఏ స్టేట్మెంట్ చూసినా ఒకవైపు మాత్రమే ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా స్టేట్మెంట్లు మార్చారు. అవినాష్రెడ్డి వైపు చూపేందుకు దస్తగిరిని అప్రూవర్గా మార్చారు. ఆధారాలన్నీ ఒకవైపు చూపిస్తుంటే.. దర్యాప్తు మరోవైపు సాగింది. సునీతకు వాళ్లు సలహాదారులుగా మారారు. అవినాష్రెడ్డికి ఎంపీ టికెట్ 2011లోనే ప్రకటించారు. అవినాష్రెడ్డి ఎంపీగా గెలవడం కోసం వివేకా పనిచేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. చదవండి: మాటలు మార్చారు.. మీకర్థమవుతోందా? ‘‘సునీత చెప్పినవన్నీ అబద్ధాలే.. భారతమ్మ, నేను కలిసి సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శించడానికి వెళ్లా. అవినాష్ను డిఫెండ్ చేయమని సునీతకు చెప్పలేదు. సునీతను ప్రెస్మీట్ పెట్టమని కూడా నేను చెప్పలేదు. గూగుల్ టేక్ఔట్ పేరుతో ముందు అవినాష్ తండ్రిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు గూగుల్ టేక్ ఔట్ ఆధారం కాదని తేలిపోయింది. జూన్ 19న అవినాష్రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సునీతతో మళ్లీ స్టేట్మెంట్ ఇప్పించారు.’’ అని సజ్జల తెలిపారు. చదవండి: సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్కు ఎంపీ అవినాష్రెడ్డి లేఖ -
వివేకా హత్య కేసులో గత చార్జ్ షీట్ కు వ్యతిరేకంగా సీబీఐ తుది చార్జ్ షీట్
-
ఆక్సిజన్ కుంభకోణంపై సీఐడీ చార్జ్షీట్!
వరంగల్: వరంగల్కు ధర్మాస్పత్రిగా పేరుగాంచిన ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిన ఆక్సిజన్ కుంభకోణాన్ని 2013లో ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తేగా.. విషయ తీవ్రతను గమనించిన సీఐడీ అధికారులు 2015లో కేసు నమోదు చేశారు. నెలలు, ఏళ్ల తరబడిగా విచారణ చేసిన అధికారులు శుక్రవారం ఎట్టకేలకు కుంభకోణం జరిగిన విధానంపై చార్జ్షీట్ దాఖలు చేశారు. 2007 నుంచి 2013 వరకు జరిగిన ఆక్సిజన్ టెండర్ విధానంలో నాలుగు కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు పేర్కొన్నారు. బహిరంగ మార్కెట్లో రూ.180కు సరఫరా జరిగే ఆక్సిజన్ టెండర్ను రూ.385 కొనుగోలు చేసినట్లు నిర్ధారించారు. అలాగే ఈ కుంభకోణానికి సహకరించిన 13 మంది అడ్మినిస్ట్రేటివ్ అధికారులతోపాటు వరంగల్ తులసీ ఏజెన్సీ నిర్వాహకులను నిందితులుగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. సంచలనంగా మారిన ఆక్సిజన్ దందా... ఆక్సిజన్ కాంట్రాక్టర్ వద్ద నుంచి డబ్బులు తీసుకుంటూ ఏకంగా ఓ సూపరింటెండెంట్ స్థాయి వ్యక్తి ఏసీబీకి పట్టుబడడంతో రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు ఎంజీఎం ఆస్పత్రి పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. అసలు ఆక్సిజన్ కాంట్రాక్టర్ లక్షల రూపాయలు సూపరింటెండెంట్కు లంచం ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారు. ఆక్సిజన్ సరఫరాలో ఏం జరుగుతుంది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం విజిలెన్స్, సీఐడీ విచారణకు ఆదేశించింది. అధికారులపై కేసు నమోదు.. ఆక్సిజన్ కుంభకోణంలో తులసీ ఏజెన్సీ నిర్వాహకులు నరహరి బిందురెడ్డి, నరహరి మనోహర్రెడ్డి, 2007 నుంచి 2013వ వరకు అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పని చేసిన 13 మంది అధికారులను నిందితులుగా చార్జ్షీట్లో పేర్కొన్నారు. ఆ కాలవ్యవధిలో పని చేసిన డాక్టర్ రఘురాం, అశోక్కుమార్, ఏ.ఎన్.ఆర్ లక్ష్మి, బలభద్ర పా త్రుని శ్యాంసుందర్రావు, తుంగతుర్తి సురేందర్, డాక్టర్ సత్యదేవ్, నరేంద్రకుమార్, బెంజీమెన్ సామెల్, కొండ్రు నాగేశ్వర్రావు, సుద్దాల లక్ష్మి రాజం, పిల్లి సాంబశివరావు, గంధన్ శేషాచారి నరసింహన్, వరికొటి విష్ణుమోహన్లను నిందితులుగా చార్జ్షీట్లో పేర్లు నమోదు చేశారు. కుంభకోణం వెలుగుచూసింది ఇలా... ప్రభుత్వ ఆస్పత్రుల్లో టెండర్ల విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న క్రమంలో వేలాది మంది పేద ప్రజలకు సేవలందిస్తున్న ఎంజీఎం ఆస్పత్రి వైద్యసేవల్లో ఆక్సిజన్ టెండర్ కీలకంగా మారింది. ఇందులో అక్రమాలు జరుగుతున్నట్లు ‘సాక్షి’ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో 2013 మే నెలలో ఆస్పత్రిలోని ప్రధాన వార్డులకు ఆక్సిజన్ ఎలా సరఫరా చేస్తున్నారు.. ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారనే విషయాన్ని పరిశీలించిన ప్రతినిధులకు ఖంగుతినే విషయాలను గమనించాల్సి వచ్చింది. బహిరంగ మార్కెట్లో రూ.180కు లభించే ఆక్సిజన్ సిలిండర్ను ఏకంగా డబుల్ ధరకు రూ. 385కు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు పెద్ద గండి కొడుతున్న విషయాన్ని గమనించి 2013 మే 17వ తేదీన ఆక్సిజన్ ‘టెండర్’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంలో సిలిండర్లో ఎంత కెపాసిటీ గేజ్తో ఆక్సిజన్ నింపాలి.. ఎంత గేజ్తో నింపుతున్నారు అనే విషయం సమగ్రంగా వచ్చింది. ఈ కథనాన్ని ఆసరా చేసుకున్న అప్పటి సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ.. కాంట్రాక్టర్ మనోహర్రెడ్డి వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేశారు. ఆతర్వాత కాంట్రాక్టర్ మనోహర్రెడ్డి.. 2013 జూలై నెలలో డాక్టర్ రామకృష్ణకు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తీగ లాగితే డొంక కదిలింది.. ప్రభుత్వం విచారణకు ఆదేశించగానే ‘సాక్షి’లో వచ్చిన కథనంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. 2007 నుంచి 2013 వరకు ఆస్పత్రిలో నామినేషన్ పద్ధతిన టెండర్ కేటాయించడంతోపాటు సరఫరా చేసిన సిలిండర్లకు సైతం అద్దె కట్టించుకున్నారు. ఈ విషయం సైతం ‘సాక్షి’ కథనంలో క్షుణ్ణంగా వచ్చింది. ఒక్కో సిలిండర్కు అదనంగా రూ.190తోపాటు, 2007 నుంచి 2013 వరకు ఎంజీఎం ఆస్పత్రి నుంచి రూ.35.29 లక్షల అద్దె చెల్లించినట్లు.. ఈ రకంగా ప్రతి సంవత్సరం లక్షల రూపాయల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. -
ఏది నిజం?: బాధితులనే దోషుల్ని చేస్తారా? పాత్రికేయమంటే ఇదేనా డ్రామోజీ?
నేను చెప్పిందే తీర్పు.... నేను రాసిందే చరిత్ర!!.నేను పడుకుంటే అది రాత్రి... నేను నిద్రలేస్తే అది ఉదయం... అనుకునే తెగ బలిసిన మోతుబరి తత్వం రామోజీరావుది.ఎందుకంటే... వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం చేసిన నిందితుడుజనిపల్లి శ్రీనివాసరావు 2019 జనవరి 17నే దర్యాప్తుఅధికారులకు వాంగ్మూలమిచ్చాడు. నిందితుడితో పాటు ఇతర అనుమానితులు, సాక్షులు, బాధితుడు వైఎస్ జగన్ తాలూకు వాంగ్మూలాలన్నీ తీసుకున్నాక కొంతమేర దర్యాప్తు జరిపి 2019 జనవరి 27న దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కోర్టుకు చార్జిషీట్ను సమర్పించింది. అందులో... అది హత్యాయత్నమేనని నిర్ధారించింది. వైఎస్ జగన్ను హతమార్చాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం నిందితుడు అన్నీ చేశాడనిస్పష్టంగా తేల్చింది. దీనివెనక ఏమైనా కుట్ర ఉందా?ఎవరైనా ప్రేరేపించారా? అనే విషయాలు తేల్చడానికి ఇంకా దర్యాప్తు అవసరమని కూడా స్పష్టం చేసింది. అంటే ఇక్కడ తెలిసేదేమిటి?వైఎస్ జగన్పై హత్యాయత్నం జరిగిందనేది వివాదానికి తావులేని అంశం. తేలాల్సిందల్లా... ఆ హత్యా ప్రయత్నం వెనక ఎవరున్నారనేదే!!. అలా తేల్చడంలో ఆలస్యమవుతోంది కాబట్టి, వేగంగా చేసేలా దర్యాప్తు సంస్థను ఆదేశించాలంటూ తాజాగా కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. ఇదీ జరుగుతున్న వాస్తవం. కానీ రామోజీరావు చేస్తున్నదేమిటి? ఎన్ఐఏ వేసిన చార్జిషీటును కూడా ప్రస్తావించకుండా... అంతకన్నా ముందు... నాలుగేళ్ల కిందట నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని, ఇప్పుడే వెలుగు చూసిందంటూ శనివారంనాడు తన పత్రికలో పతాక శీర్షికన ప్రచురించారంటే ఏమనుకోవాలి? ఈ రామోజీరావు బుద్ధి భూలోకాన్ని దాటి పాతాళానికి పడిపోతున్నదనుకోవాలా?లేక తెగ బలిసిన మోతుబరి వ్యవహారమనుకోవాలా? హత్యాయత్నం జరిగిందని దర్యాప్తు సంస్థలు కూడా తేల్చాక... బాధితుడు వైఎస్ జగన్ను అవమానపరిచేలా, నిందితుడి పక్షాన నిలుస్తూ నిందితుడి ఫోటోలు పతాక శీర్షికల్లో వేస్తూ... ఇలాంటి పనికిమాలిన వార్తలు రాస్తున్నారంటే ఏమనుకోవాలి? బాధితుల్ని వదిలి నిందితులకు కొమ్ముకాసే దగాకోరు పాత్రికేయం చరిత్రలో ఎక్కడైనా ఉందా? బాధితులనే దోషులుగా చూపించే కుట్రలు ఇంకెక్కడైనా జరుగుతాయా? ఇదేం తీరు రామోజీరావ్? ఇంకెన్నాళ్లు ఇలా..? హర్షవర్దన్ చౌదరి పాత్రను, తెలుగుదేశంతో ఆయన సంబంధాలను, ఈ కుట్రపై దర్యాప్తు జరగాల్సిన అవసరాన్ని పేర్కొంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం. నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్ యూనిఫామ్ వేసుకుని, వాటర్ బాటిల్తో వీఐపీ లాంజ్లో వైఎస్ జగన్ మోహన్రెడ్డి పక్కన నిల్చుని అవకాశం కోసం చూశాడని,అవకాశం దొరికిన వెంటనే పదునైన కత్తితో హతమార్చుదామని అనుకున్నాడని.. ఈ క్రమంలోనే జగన్మోహన్రెడ్డి వేగంగా పక్కకు తప్పుకోవటంతో భుజానికి గాయం అయిందని ఛార్జిషీట్లో పేర్కొన్న ఎన్ఐఏ. ఈ కేసులో కుట్ర కోణాన్ని, నిందితుడిని ప్రేరేపించిన పరిస్థితులుంటే వాటిని కూడా దర్యాప్తుచేస్తామని తొలి ఛార్జిషీట్లో కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ. కోర్టుకు ఎన్ఐఏ సమర్పించిన అఫిడవిట్లో జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం పోలీస్స్టేషన్లో 2017 మార్చి నెలలో కేసు నమోదు అయినట్లు పేర్కొన్న భాగం జనిపల్లి శ్రీనివాసరావుపై ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదు అంటూ హత్యాయత్నం జరిగిన నాడే ‘ఈనాడు’ రాసిన వార్త.. (ఫైల్) ఏది నిజం? గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను లేకుండా చేసే ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ. ఫలితం... నాటి ఎన్నికల్లో సరైన ప్రతిపక్షమే లేకుండా చేశారు ప్రజలు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబుకు గానీ, ఆయన రాజగురువు రామోజీకి గానీ బుద్ధి రాలేదు. అప్పటి చీప్ట్రిక్స్నే ఇప్పటికీ అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశాలు చూద్దాం... ♦ హత్య జరిగిన రోజే... నిందితుడు శ్రీనివాసరావుపై ఎక్కడా ఎలాంటి పోలీసు కేసులూ లేవని రామోజీరావు రాసేశారు. అంత హడావుడిగా నిందితుడి తరఫున వకాల్తా పుచ్చుకుని ‘ఈనాడు’ ఎందుకు రాయాల్సి వచ్చింది? ఎవరు రాయించారు? మరి తనపై ముమ్మిడివరంలో అప్పటికే పోలీసు కేసులున్నట్లు దర్యాప్తులో తేలింది కదా? దర్యాప్తు జరగకముందే రామోజీకి ఎందుకంత తొందర? ఎవరి ప్రయోజనాల కోసం? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ అభిమాని అని... హత్యాయత్నం జరిగిన రోజే ‘ఈనాడు’ రాసేసింది. దీనికోసం వైఎస్ జగన్ – శ్రీనివాసరావు కలిసి ఉన్న ఫ్లెక్సీని సాక్ష్యంగా చూపించింది. కానీ ఆ ఫ్లెక్సీ అప్పటికప్పుడు సృష్టించినదని, నకిలీదని ఆ తరవాత తేలింది. అసలు ‘ఈనాడు’కు ఈ ఫ్లెక్సీ బొమ్మ ఎవరు పంపారు? ♦ నిందితుడి సొంత ఊళ్లో ఇసుక కుప్పపై కప్పిన ఫ్లెక్సీని హత్యాయత్నం జరిగిన మూడురోజుల తరవాత అక్కడ చూశామని అక్కడకు విచారణ నిమిత్తం వెళ్లిన పోలీసులు పేర్కొన్నారు. కానీ నిందితుడి సోదరుడు ఇచ్చి న వాంగ్మూలంలో మాత్రం... ఆ ఫ్లెక్సీ లేదని, వానలకు పోయిందని చెప్పాడు. వీటిలో ఏది నిజం? వానలకు పోతే ఆ తరవాత పోలీసులకు ఎలా దొరికింది? అంటే అది అప్పటికప్పుడు సృష్టించినదనుకోవాలా? ♦ నిందితుడి జేబులో ఓ లేఖ దొరికింది. అందులో... తనకేమైనా అయితే తన అవయవాలు దానం చేయాలని కూడా పేర్కొన్నాడు. ఒకవేళ రామోజీరావు ప్రవచిస్తున్న సిద్ధాంతం ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతోనే... ఆయనకు సానుభూతి రావాలనే ఇదంతా చేస్తే తనకేమైనా అవుతుందనే భయం ఉంటుందా? వేరొకరు చెబుతున్నట్టుగా చేసినప్పుడే... తనకు ఏమవుతుందోనన్న భయం ఉంటుంది. ఈ లాజిక్ ఎలా మిస్సవుతున్నారు రామోజీ? ♦ జగన్ను చంపాలనుకుంటే మాంసం కోయడానికి ఉపయోగించే పెద్ద కత్తి వాడేవాడినని, ఆ ఉద్దేశం లేదు కాబట్టే చిన్న కత్తి వాడానని నిందితుడు చెప్పినట్టు కూడా ‘ఈనాడు’ బాక్సు కట్టి మరీ వేసేసింది. ఎయిర్పోర్టులో జనం ఉంటుండగా... అంతమంది మధ్యలోకి వెళ్లేటపుడు పెద్ద కత్తి తీసుకెళ్లడం సాధ్యమా? చిన్నదైతే కనపడకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే తీసుకెళ్లాడని అర్థం కావటం లేదా? అలాంటి సందేహాలు రామోజీకి రావా? ♦ నిందితుడిపై పోలీసు కేసులేవీ లేవంటూ పోలీసులకు, ఎయిర్పోర్టు సెక్యూరిటీకి డిక్లరేషన్ ఇచ్చి మరీ శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకున్న హర్షవర్దన్ చౌదరి టీడీపీ నాయకుడు కాదా? 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించలేదా? అన్ని అబద్ధాలు చెప్పి శ్రీనివాసరావును ఉద్యోగంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చి ంది? ♦ ఎయిర్పోర్టులోని ఫ్యూజన్ఫుడ్స్కు వచ్చే ఉద్యోగులంతా బయోమెట్రిక్ హాజరు వాడుతూ ఉంటారు. శ్రీనివాసరావు తమ దగ్గర ఉద్యోగం చేస్తున్నారనేది ఫ్యూజన్ ఫుడ్స్ చెప్పినదే. దానికి సంబంధించిన రికార్డులన్నీ ఫ్యూజన్ ఫుడ్స్ ఇచ్చి నవే. కానీ బయోమెట్రిక్ హాజరులో ఎన్నడూ శ్రీనివాసరావు వేలిముద్రలు రికార్డు కాలేదని దాన్ని విశ్లేషించిన వర్గాలు చెబుతున్న మాట. ఇదంతా కుట్ర అనటానికి ఇది కూడా ఒక సాక్ష్యాధారమే కదా? ♦ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విశాఖపట్నంలోకి అడుగుపెట్టినప్పటి నుంచీ విశాఖ ఎయిర్పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయటం మానేశాయి. ‘‘ప్రతి శుక్రవారం వైఎస్ జగన్ హైదరాబాద్లోని కోర్టుకు హాజరయ్యేవారు. దానికోసం ఆయన విశాఖ ఎయిర్పోర్టుకు రావటం... హైదరాబాద్ నుంచి విమానంలో విశాఖ విమానాశ్రయంలో దిగటం చేసేవారు. ఇది తెలుసుకున్న శ్రీనివాసరావు పథకం ప్రకారం ఈ హత్యాయత్నానికి ఒడిగట్టారు’’ అని ఎన్ఐఏ తన చార్జిషీట్లో పేర్కొంది. ఇదంతా తెలుసుకున్నాకే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారనే అనుమానాలున్నాయి. మరి ఇలా సీసీ కెమెరాలను పనిచేయకుండా చేసే అవకాశం ప్రతిపక్షంలో ఉండే జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉంటుందా? ♦ నిందితుడు శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ అభిమాని అయితే... ఆయనకు తెలుగుదేశం నేత హర్షవర్దన్ చౌదరి ఉద్యోగమెందుకు ఇస్తాడు? అది కూడా ఎయిర్ పోర్టు పోలీసులకు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి మరీ!!. కుట్ర కోణంలో ఇదే అసలు కోణం కదా? లోతైన దర్యాప్తు అవసరం... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ అడుగుతున్నదొక్కటే. హత్యాయత్నం జరిగిందని ఇప్పటికే ఎన్ఐఏ తే ల్చి... చార్జిషీట్లో కూడా దాన్ని ధ్రువీకరించింది. అయితే ఈ హత్యాయత్నం వెనక ఉన్నదెవరు? దానికి సహకరించింది ఎవరు? కుట్ర ఎవరిది? ఇవన్నీ తేలాలని, దీనికోసం దర్యాప్తునువేగవంతం చేసి... పూర్తి స్థాయి చార్జిషీటును వెయ్యాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోరుతున్నారు. ఇదే అభ్యర్థనతో ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై విచారణలో భాగంగానే ఎన్ఐఏకు కోర్టు నోటీసులిచ్చింది. ఆ నోటీసులకు సమాధానంగా కౌంటర్ వేసిన ఎన్ఐఏ.. దర్యాప్తును ఇంకా కొనసాగిస్తున్నామనే చెప్పింది తప్ప ముగించినట్లు పేర్కొనలేదు. కానీ ముగించేసినట్లుగా... కుట్ర కోణం లేదని తేల్చేసినట్లుగా ‘ఈనాడు’ దివాలాకోరు రాతలు రాస్తుండటమే అసలైన దుర్మార్గం. -
మానవ మృగాలు.. అంజలిని కాపాడే వీలున్నా..
క్రైమ్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్ ఖన్నా, కృష్ణన్, మనోజ్ మిట్టల్, మిథున్లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్షీట్లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక.. డ్రైవర్ పక్క సీట్లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్ సీట్లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది. పుర్రె భాగం సైతం పగలిపోయింది. ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది. తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు.. ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని పోలీసులు ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్షీట్ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్ 18వ తేదీన వాదనలు విననుంది. -
ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు, 30 పేజీల చార్జిషీట్.. 3 ఏళ్లు జైలు శిక్ష?
లక్నో: ఎలుకను చంపినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బదౌన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మనోజ్ కుమార్ ఓ ఎలుకను చిత్ర హింసలు పెడుతూ ఉండగా.. జంతు సంరక్షణ కార్యకర్త వికేంద్ర శర్మ ఈ మొత్తం ఘటనను చిత్రీకరించి నిందితుడు మనోజ్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విచిత్రమైన ఘటన తెరపైకి వచ్చింది. ఎలుక పట్ల అతను క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. శర్మ ఎలుకను కాపాడేందుకు ప్రయత్నించగా అది ఊపిరాడక చనిపోయిందని తెలిపాడు. కాగా మనోజ్పై జంతువుల పట్ల క్రూరత్వం నిరోధక చట్టం, జంతువులను చంపడం లేదా గాయపరచడం కింద కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, సంబంధిత వివిధ విభాగాల నిపుణుల అభిప్రాయాలతో సహా 30 పేజీల ఛార్జిషీట్ను పోలీసులు సిద్ధం చేశారు. పోలీసులు ఎలుక మృతదేహాన్ని బరేలీలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐవీఆర్ఐ)కి పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. వాపు కారణంగా ఎలుక ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, లివర్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చార్జిషీట్లో స్పష్టం చేశారు. అంతే కాకుండా మైక్రోస్కోపిక్ పరీక్షలో కూడా ఊపిరాడక ఎలుక చనిపోయిందని స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా స్థానిక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అటవీ శాఖ చట్టం ప్రకారం... ఎలుకను చంపడం నేరంగా పరిగణించబడదని బుదౌన్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డిఎఫ్ఓ) అశోక్ కుమార్ సింగ్ తెలిపారు. అయితే జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినందున చర్యలు తీసుకోవాల్సి ఉందని డిఎఫ్ఓ తెలిపారు. ఏ శిక్ష పడే అవకాశం ఉంది! జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకు జరిమానా, మూడేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా, మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ మాట్లాడుతూ.. ఎలుకను, కాకిని చంపడం తప్పుకాదని, అవి హానికర జీవులని, అలాంటి కేసులో మా కుమారుడికి శిక్ష పడితే కోళ్లు, మేకలు, మేకలను చంపే వారందరిపైనా చర్యలు తీసుకోవాలి. చేపలు, ఎలుకలను చంపే మందులను విక్రయించే వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో చార్జిషీట్
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన ఢిల్లీ హిట్ అండ్ రన్ కేసులో ఏడుగురు నిందితులపై పోలీసులు శనివారం 800 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. దాదాపు 120 మంది సాక్ష్యాలను అందులో పొందుపరిచారు. నిందితుల్లో నలుగురిపై హత్యా నేరం మోపారు. దీనిపై విచారణను ఏప్రిల్ 13కు మెట్రోపాలిటన్ జడ్జి సన్యా దలాల్ వాయిదా వేశారు. గత డిసెంబర్ 31న ఢిల్లీలో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుని అర్ధరాత్రి దాటాక స్కూటీపై వెళ్తున్న అంజలీసింగ్ అనే 20 ఏళ్ల యువతిని నిందితులు కారుతో ఢీకొట్టడం, ఆమె కారు కింద చిక్కుకుందని తెలిసి కూడా అలాగే 12 కిలోమీటర్లకు పైగా లాక్కెళ్లడం తెలిసిందే. దాంతో ఒళ్లంతా ఛిద్రమై అంజలి అత్యంత బాధాకరంగా మరణించింది. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: ఈడీ దూకుడు.. రెండో చార్జిషీట్ దాఖలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం రెండో చార్జిషీట్ దాఖలు చేసింది. 13,657 పేజీలతో కూడిన ఈ అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్లో 12 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను ప్రస్తావించింది. గతంలో ఈడీ అరెస్ట్ చేసిన విజయ్ నాయర్, శరత్రెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా పేర్లతోపాటు మరో ఏడు కంపెనీలపై అభియోగాలు మోపింది. అయితే ఈ చార్జిషీట్లోనూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పేరు చేర్చకపోవడం గమనార్హం. ఈ వివరాలను ఈడీ అధికారులు శనివారం కోర్టుకు సమర్పించనున్నారు. కాగా, ఇప్పటికే గత ఏడాది నవంబర్లో తొలి చార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రుకు సంబంధించిన చార్జిషీట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేర్లను ఈడీ ప్రస్తావించింది. ఇప్పటి వరకు ఈ కేసులో సమీర్ మహింద్రు, శరత్చంద్రారెడ్డి, బినోయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరాలను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీలో ఇటీవల అమల్లోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీని రూపొందించి అమలు చేయడంలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో సమీర్ మహింద్రు ఒకరు. ఈ కేసులోని నిందితులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా పేరు ఈడీ తొలి చార్జిషీట్లోనూ చేర్చలేదు. అయితే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (బీసీఐ) దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో మనీష్ సిసోడియా సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఇదిలా ఉండగా శనివారంతో ఢిల్లీ లిక్కర్ కేసు నిందితులైన విజయనాయర్, అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి , బినోయ్బాబు జ్యూడిషియల్ కస్టడీ ముగియనుంది. జనవరి 7న శరత్ చంద్రారెడ్డి బెయిల్ పిటిషన్పై సీబీఐ స్పెషల్ కోర్టు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈడీ నిందితులను ప్రవేశపెట్టనుంది. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు -
ఆరోగ్యం ముసుగులో ఉగ్రవాదం.. పీఎఫ్ఐ చార్జిషీటులో విస్మయకర అంశాలు
సాక్షి, కరీంనగర్: రాడ్డు.. కర్ర..కత్తి ఏ ఆయుధాన్ని ఎలా వాడాలి..? ఎలా దాడి చేయాలి? మనిషి శరీరంలో ఎక్కడెక్కడ సున్నిత ప్రాంతాలు ఉంటాయి..? ఎక్కడ కొడితే ప్రాణాలు పోతాయి..? ఇవీ.. ఆరోగ్య పరిరక్షణ ముసుగులో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) రహస్యంగా నిర్వహించిన కార్యకలాపాలు. శారీరక, మానసిక ఆరోగ్యం ముసుగులో పీఎఫ్ఐ చేసిన సంఘ వ్యతిరేక చర్యలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. యోగా.. కరాటే పేరుతో ఆయుధాల వినియోగం, మనుషులను సులువుగా చంపడం ఎలా..? తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తేలింది. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణలో అనేక కీలక విషయాలు వెలుగుచూశాయి. ఇవే విషయాలను ఎన్ఐఏ ఇటీవల దాఖలు చేసిన చార్జిషీటులోనూ పేర్కొంది. శారీరక ఆరోగ్యానికి, ఆత్మరక్షణ పేరిట నడిపిన కరాటే శిబిరాలు, యోగా పేరిట నడిపిన ధ్యానకేంద్రాలన్నీ ఉగ్ర కార్యకలాపాలకు నిలయంగా మారాయని చార్జిషీటులో పేర్కొంది. ఎలా బయటపడిందంటే..? పీఎఫ్ఐ కీలక సభ్యుడు, నిజామాబాద్కు చెందిన (స్వస్థలం జగిత్యాల) అబ్దుల్ఖాదర్ను పోలీసులు నిజామాబాద్లో అరెస్టు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఇతను నిజామాబాద్లో దాదాపు 200 మంది ముస్లిం యువకులకు శిక్షణ ఇచ్చినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. గతేడాది జూలై 4న పోలీసులు అబ్దుల్ ఖాదర్, అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సాదుల్లా, ఇమ్రాన్, మొబిన్ను మరుసటి రోజు అరెస్టు చేశారు. వీరి నెట్వర్క్ను ఏపీలోని కడప, కర్నూలు నుంచి పీఎఫ్ఐ సభ్యులు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. దీంతో నిజామాబాద్ 4వ టౌన్లో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో నిందితుడు అబ్దుల్ఖాదర్ విదేశాలకు వెళ్లి రావడం, పలు దేశాల నుంచి పీఎఫ్ఐకి నిధులు తెచ్చినట్టు కూడా పోలీసులకు సమాచారం ఉంది. దీంతో ఎన్ఐఏ రంగంలోకి దిగి సెక్షన్ 120 (బి), 153(ఎ), ఐపీసీ సెక్షన్లు 17, 18, 18(ఎ), 18(బి) యూఏ(పి) యాక్ట్ కింద ఆగస్టు 26న తిరిగి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో అబ్దుల్ ఖాదర్ (ఆటోనగర్, నిజామాబాద్), అబ్దుల్ అహ్మద్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), షేక్ ఇలియాస్ అహ్మద్ (ఖాజానగర్, నెల్లూరు), అబ్దుల్ సలీమ్ (ఇస్లాంపూర్, జగిత్యాల), షేక్ షాదుల్లా (గుండారం, నిజామాబాద్), ఫిరోజ్ ఖాన్ (శాంతినగర్, ఆదిలాబాద్), మహమ్మద్ ఉస్మాన్ (తారకరామనగర్, జగిత్యాల), సయ్యద్ యాహియా సమీర్ (ఆటోనగర్, నిజామాబాద్), షేక్ ఇమ్రాన్ (ముజాహెద్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ అబ్దుల్ ముబీన్ (హబీబ్నగర్, నిజామాబాద్), మొహమ్మద్ ఇర్ఫాన్ (హుస్సేన్పురా, కరీంనగర్)పై చార్జీషీటు దాఖలు చేసింది. హింసలో సుశిక్షితులు నిజామాబాద్లో శిక్షణ పొందిన 200 మంది యువతను పథకం ప్రకారం ముందుగా ఆరోగ్యం, ధ్యానం పేరిట యోగా, కరాటే అంటూ పోగుచేశారు. ఆపై వారిలో దేశ వ్యతిరేక భావజాలం నింపుతూ వారి మనసులను కలుషితం చేసేందుకు యత్నించారు. యోగా క్యాంపుల ముసుగులో విద్వేషాలు రెచ్చగొట్టడం, కరాటే పేరిట దాడి చేయడంలో తర్ఫీదు ఇచ్చారని ఎన్ఐఏ చార్జిషీటులో పేర్కొంది. గొంతు, తల, ఉదరం తదితర సున్నిత ప్రాంతాలపై దాడి చేయడం, ఎక్కడ కొడితే మనిషి త్వరగా మరణిస్తాడన్న విషయాలపైనా తరగతులు ఇచ్చినట్లు కూడా ఎన్ఐఏ ఛార్జిషీటులో స్పష్టం చేసింది. కొనసాగుతున్న నిఘా.. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాపై ఎన్ఐఏ నిఘా కొనసాగుతోంది. గతంలో క్రియాశీలకంగా ఉన్న సిమి (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) నిషేధానికి గురవడంతో పీఎఫ్ఐ ముసుగులో తిరిగి కార్యకలాపాలు మొదలుపెట్టినట్టు గుర్తించింది. అందుకే దేశవ్యాప్తంగా దీని కార్యకలాపాలకు కళ్లెం వేసేందుకు గతేడాది సెప్టెంబర్ 18న పీఎఫ్ఐ స్థావరాలపై దాడులు చేసింది. అందులోభాగంగా జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించింది. పలువురి నుంచి కీలక డాక్యుమెంట్లు, పీఎఫ్ఐ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకుంది. సంస్థకు సంబంధించి ఇంకా ఎవరైనా సానుభూతిపరులు, స్లీపర్సెల్స్ ఉన్నారా? అన్న కోణంలో నిరంతర నిఘా కొనసాగుతూనే ఉంది. -
కేసీఆర్ కుటుంబంతో ఆ ముగ్గురికి సంబంధాలు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్లగొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ చార్జ్ షీట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలవడానికి టీఆర్ఎస్ డ్రామాలాడుతోందని మండిపడ్డారు. చదవండి: ఫాంహౌస్ డీల్పై వెలుగులోకి షాకింగ్ విషయాలు.. రోహిత్రెడ్డి ఫిర్యాదులో ఏముంది? ‘‘పోటీ చేసే అభ్యర్థి ఏం చేశారు ఏం చేయబోతున్నారు అనేది మాట్లాడాలి. తెలంగాణలో మూర్ఖత్వంగా సాగిస్తున్న కేసీఆర్ పాలన అంతం చేసేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామా చేశారు. మునుగోడును అభివృద్ధి చేయలేదు. కనీస అవసరాలు తీర్చలేదు. రాజగోపాల్ రెడ్డి ప్రశ్నిస్తే అసెంబ్లీ నుంచి బయటకు గెంటారు. మునుగోడు ప్రజల కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు’’ అని బండి సంజయ్ అన్నారు. ‘‘సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు. కేవలం బీజేపీ, మోదీని తిట్టడమే పని పెట్టుకున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని పక్కన ఉంచుకుని తిప్పుకోవడమే నేతలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ముందుకుపోతున్నాం. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక ఇది. మునుగోడు ప్రజలకు వాస్తవాలను వివరించేందుకే ఈ చార్జ్షీట్ విడుదల చేశాం’’ అని బండి సంజయ్ అన్నారు. ఫాంహౌస్ ఎపిసోడ్ అంతా డ్రామా. కేసీఆర్ కుటుంబంతోనే ఆ ముగ్గురికి సంబంధాలు. ఆడియో టేపులు ఇంకా రెడీ కాలేదట. ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ఇంత అవసరమా. ఢిల్లీలో కేసీఆర్ను ఎవరెవరు కలిశారో వివరాలు బయటపెట్టాలి. కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై హైకోర్టును ఆశ్రయిస్తాం. సీబీఐ విచారణ కూడా జరగాల్సిందే’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు. -
‘చార్జ్షీట్’లో సుశీల్ పేరు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామం! దాదాపు ఏడాదిన్నర క్రితం రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ పేరును ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జ్ షీట్లో చేర్చారు. సుశీల్తో పాటు మరో 17 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఇకపై చార్జ్షీట్కు అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగనుంది. 2021 మే 4 ఛత్ర్శాల్ స్టేడియంలో సాగర్పై దాడి జరగ్గా, తీవ్రంగా గాయపడిన అతను ఆ తర్వాత మృతి చెందాడు. గత ఏడాది మే 23న అరెస్టయిన సుశీల్ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నాడు. -
లాలు యాదవ్, భార్య, కూతుళ్లు, మరో 13 మందిపై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతృత్వంలో లాలు ప్రసాద్ యాదవ్ రైల్వే మంతిగా ఉన్న సమయలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ కుంభకోణంలో ఆర్జేడి నేత లాలు ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రస్తుత బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, అలాగే రైల్వేలో ఉద్యోగాలు పొందిన 12 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ చార్జిషీట్లో రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సౌమ్య రాఘవన్ని కూడా నిందితుడిగా పేర్కొన్నారు. రాఘవన్ రైల్వే బోర్డు ఆర్థిక కమిషనర్గా పదవీ విరమణ చేశారు. రైల్వేలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సిబీఐ సెప్టెంబర్ 23, 2021న కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత దానిని మే 18న ఎఫ్ఐర్గా మార్చారు. విచారణలో రైల్వే అధికారులు మితిమీరిన తొందరపాటుతో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే గ్రూప్ డీ స్థానల్లో అభ్యర్థులను ప్రత్యామ్నాయంగా నియమించినట్లు తెలిపింది. ఈ కుంభకోణంలో వ్యక్తులు తమ పేరు, తమ దగ్గరి బంధువుల పేరు మీద భూములను బదలాయించనట్లు సీబీఐ వెల్లడించింది. ఈ భూమికి అసలు ఉన్న రేటు కంటే తక్కువగా, అలాగే మార్కెట్లో ఉన్న ధర కంటే చాలా తక్కువ ధరకు సేకరించారు. ఈ భూమి బదలాయింపు రబ్రీ దేవి, కుమార్తెలు భారతి, హేమ యాదవ్ల పేర్లతో బదలాయింపులు జరిగాయని సీబీఐ ఆరోపించింది. పాట్నాలో సుమారు 1.05 లక్షల చదరపు అడుగు భూమిని ప్రసాద్ కుటుంబ సభ్యులు అమ్మకందారులకు నగదు రూపంలో చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది. అలాగే ఈ నిందితుల్లో ఏడుగురు అభ్యర్థులు కూడా ఉన్నారని సీబీఐ పేర్కొంది. (చదవండి: దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్స్పెక్టర్... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..) -
రోజూ రెండు గంటలు పనిచేస్తే గెలుపు కాంగ్రెస్దే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడులో కాంగ్రెస్కు 97 వేల ఓటు బ్యాంకు ఉందని, ఈ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి కాపాడుకుంటే పార్టీ గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ కార్యకర్త ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున రోజుకు రెండు గంటలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తే లక్ష ఓట్లు సాధిస్తామని చెప్పారు. కాంగ్రెస్ను ఓడించే శక్తి ‘ఆ మోదీకి లేదు.. ఈ కేడీకి లేదు’అని వ్యాఖ్యానించారు. మునుగోడులో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎనిమిదేళ్ల టీఆర్ఎస్, బీజేపీ పాలన వైఫల్యాలపై కాంగ్రెస్ రూపొందించిన చార్జిషీట్ను మాజీ మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా విడుదల చేశారు. అనంతరం రేవంత్రెడ్డి మాట్లాడారు. 100 రోజులపాటు మండలాల్లోని నాయకులు తమ పరిధిలోని గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి టీఆర్ఎస్, బీజేపీ చేసిన మోసాలను పేర్కొంటూ రూపొందించిన చార్జ్షీట్ను, వరంగల్ డిక్లరేషన్ను వివరించాలన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సర్వం చేసిందని, ప్రజలు ఆయనకు లక్ష ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రూ.22 వేల కోట్లకు అమ్ముడుపోయారని ఆరోపించారు. తన రాజీనామాతో ఉప ఎన్నికలు వస్తే నిధులు వస్తాయన్న రాజగోపాల్రెడ్డి.. ఒక్కో ఓటును రూ.2 లక్షలకు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఉప ఎన్నిక వస్తే సర్పంచ్లకు, ప్రజాప్రతినిధులకు డబ్బులొచ్చాయి తప్ప ప్రజలకేం రాలేదని చెప్పారు. అమ్ముడుపోయిన సన్నాసులకు మాత్రమే డబ్బులు వచ్చాయన్నారు. కమ్యూనిస్టులను చూస్తే జాలే స్తోందన్నారు. ‘మీ నాయకులను కొనుక్కొని, మీ పార్టీని బొందపెట్టిన టీఆర్ఎస్కు మీరు మద్దతిస్తారా’ అని ప్రశ్నించారు. విలీన దినోత్సవం పేరుతో మత విద్వేషాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మరోవైపు టీఆర్ఎస్ అదే పేరుతో రాజకీయం చేస్తోందన్నారు. ఒక్క ఓటుతో ఆ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలన్నారు. అధికారికంగా నిర్వహిస్తాం ఇప్పటినుంచి వచ్చే ఏడాది సెప్టెంబరు 17 వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో విమోచన వజ్రోత్సవాలు నిర్వహించాలని, ఇందుకు కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. ఆ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ఇక్కడి నుంచి రైతాంగ సాయుధ పోరాటం చేసిన వారి చరిత్రను దేశానికి మరోసారి చాటాలని పిలుపునిచ్చారు. కేంద్రమే రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టి వజ్రోత్సవాలు నిర్వహించాలన్నారు. అక్రమ డబ్బుతో గెలవాలని చూస్తున్నారు: ఉత్తమ్ కాంట్రాక్టుల్లో వచ్చిన అక్రమ డబ్బుతో మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ గెలవాలని చూస్తున్నాయని ఎంపీ ఉత్తమ్ ఆరోపించారు. కాంగ్రెస్ను వదిలి రాజగోపాల్రెడ్డి బీజేపీకి అమ్ముడుపోయారని విమర్శించారు. డిండి, చర్లగూడెం, కిష్టరాయినిపల్లి, బ్రాహ్మణవెల్లెం ఎత్తిపోతల పథకాలు, చౌటుప్పల్ డిగ్రీ కాలేజీ, మునుగోడులో ప్రభుత్వ జూనియర్ కళాశాలపై కేసీఆర్ హామీ ఇచ్చి మరిచిపోయారన్నారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందని.. నల్లగొండ జిల్లాలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని మాజీ మంత్రి కె.జానారెడ్డి విమర్శించారు. ఈ భేటీలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రి బలరాంనాయక్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ, యాదాద్రి డీసీసీ అధ్యక్షులు శంకర్నాయక్, అనిల్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
మతం, ప్రాంతం పేరుతో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి
-
అప్పుడు డ్రగ్ తీసుకున్నట్లు ఆర్యన్ అంగీకరించాడు: ఎన్సీబీ
మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్ఖాన్ కుమారుడు ఆర్యన్ఖాన్కు క్లీన్చిట్ లభించిన సంగతి తెలిసిందే. ఆర్యన్కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీట్ సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో ఆర్యన్కు ఖాన్కు సంబంధించి పలు ఆసక్తికర అంశాలను ఎన్సీబీ పొందుపరిచింది. చదవండి: ముందుగా రాబోతున్న ‘విరాట పర్వం’?, కొత్త రిలీజ్ డేట్ ఇదే! అమెరికాలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న రోజుల్లో నిద్ర సమస్యల కారణంగా గంజాయి తీసుకోవడం ప్రారంభించినట్లు ఆర్యన్ ఖాన్ తమ విచారణలో తెలిపాడని ఎన్సీబీ పేర్కొంది. కాగా ఈ కేసులో అరెస్టు చేసిన 20 మంది 14 మందిపై ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసిన విషయం విధితమే. 2018లో అమెరికాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు గంజాయి తాగడం ప్రారంభించానని ఆర్యన్ ఎన్సీబీకి ముందు అంగీకరించినట్లు అభియోగపత్రం వెల్లడిస్తోంది. చదవండి: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన హీరో ఈ చార్జిషీట్లో ఏం చెబుతుంటే.. ‘ఆ సమయంలో తాను నిద్ర సమస్యలతో బాధపడ్డానని, గంజాయి తాగితే ఉపశమనం కలుగుతుందని ఇంటర్నెట్లో పలు కథనాలు చదివినట్లు వాంగ్ములమిచ్చాడు. సరదా కోసం మారిజునానూ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. తన ఫోన్లో దొరికిన గంజాయి వాట్సప్ డ్రగ్ చాట్ తానే చేశానని, దోఖా అనే కోడ్వర్డ్తో గంజాయి కొనుగోలు కోసం ఆచిత్తో(ఈ కేసులో మరో నిందితుడు) చాట్ చేశానని ఆర్యన్ ఒప్పుకున్నాడు. అయితే తన ఫోన్ను అధికారికంగా స్వాధినం చేసుకోలేదని, ఆ ఫోన్ నుంచి సేకరించిన చాటింగ్ వివరాలేవి ప్రస్తుత కేసుతో అతనికి సంబంధం ఉన్నట్లు నిరూపించలేదని ఎన్సీబీ తమ అభియోగపత్రంలో వెల్లడించింది. -
నిషేధిత హారన్ కొడితే చార్జిషీట్
సాక్షి, హైదరాబాద్: చిత్ర విచిత్రమైన ధ్వనులతో హారన్ కొడుతూ.. రోడ్లపై దూసుకుపోతున్నారా? తస్మాత్ జాగ్రత్త! జూన్ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయనున్నారు. ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్ వంటి నిషేధిత హారన్ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించేందుకు సిద్ధమయ్యారు. నిషేధిత హారన్లు వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్డు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత నెల 10 నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు ఉన్న నిషేధిత హారన్లను తొలగించారు. ఆయా వాహనదారులకు ఎంవీ యాక్ట్ 190 (2) సెక్షన్ ప్రకారం రూ.1,000 జరిమానా విధించినట్లు నగర ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్)–1988 సెక్షన్ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్లో ఎలాంటి మార్పులు చేయకూడదు. ప్రతి వాహనానికీ ఎలక్ట్రిక్ హారన్ మాత్రమే ఉండాలి. -
అందుకే ఒవైసీపై దాడి చేశారట!
ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో ఇద్దరిని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు యూపీ పోలీసుల ఛార్జీషీట్లో ఆసక్తికర విషయాల్ని పొందుపరిచారు. లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాల్పుల కేసులో సచిన్, శుభమ్ అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ కాపీని ఓ జాతీయ మీడియా సంస్థ సంపాదించింది. అందులో ఆసక్తికరమైన విషయాలు ఉన్నట్లు వెల్లడించింది. ఒవైసీపై దాడిని అంగీకరించిన ఇద్దరు నిందితులు.. వారి దాడి వెనుక ఉద్దేశ్యం ఏమిటో వివరించారు. మరొక వర్గానికి చెందిన ఒక పెద్ద రాజకీయ నాయకుడిని చంపడం ద్వారా ‘హిందుత్వ నేతలు’గా పేరు సంపాదించుకోవాలనే, ఎదగాలనే ఉద్దేశంతోనే ఆ పని చేశారట!. ‘‘పూర్తి సన్నద్ధతతో గౌరవ ఎంపీని లక్ష్యంగా చేసుకుని హత్యాయత్నం చేశారు. దాడిలో ఎవరైనా గాయపడినా.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి ఉండేవి. కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు పరిస్థితిని మరింత దిగజార్చేవి’’ అని ఛార్జిషీట్లో పోలీసులు పొందుపరిచారు. ఆధారాలు సమర్పణ యూపీ పోలీసులు సీసీటీవీ ఫుటేజీని ఛార్జ్షీట్లో ఆధారంగా పేర్కొన్నారు. కారు ఫోరెన్సిక్ పరీక్షల ఫలితంతో పాటు ఇద్దరు నిందితుల స్టేట్మెంట్, వాళ్లకు ఆయుధాలు సరఫరా చేసిన వాళ్ల స్టేట్మెంట్లను సైతం పొందుపరిచారు. ఒవైసీతో పాటు మొత్తం 61 మంది నుంచి తీసుకున్న స్టేట్మెంట్ను పొందుపరిచారట. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన.. పశ్చిమ యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి పయనమైన ఆయన వాహనంపై.. హపూర్–ఘజియాబాద్ మార్గంలో ఛిజార్సీ టోల్ప్లాజా సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదు. చదవండి: దయచేసి జడ్ కేటగిరిని అంగీకరించండి: అమిత్ షా -
చిన్నమ్మ మెడకు ‘లగ్జరీ’ ఉచ్చు
సాక్షి ప్రతినిధి, చెన్నై: నాలుగేళ్ల జైలు శిక్ష పూర్తిచేసినా చిన్నమ్మ శశికళను కారాగారం నీడ వెంటాడుతూనే ఉంది. బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సమయంలో లగ్జరీ జీవితం కోసం రూ.2 కోట్లు లంచం ఎరవేసిన వ్యవహారం రుజువై చిన్నమ్మ మెడకు బిగుసుకుంటోంది. వివరాలు.. తమిళనాడులో 1991–96 మధ్యకాలంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అప్పటి సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, ఇళవరసి, సుధాకరన్పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదైంది. నలుగురికీ నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ జయ మరణం తరువాత 2017 ఫిబ్రవరి 15వ తేదీన తుదితీర్పు వెలువడింది. దీంతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో శిక్షాకాలాన్ని పూర్తిచేసుకుని విడులయ్యారు. బెంగళూరు జైల్లో శశికళ సాధారణ ఖైదీలాగ కాకుండా లగ్జరీ వసతులతో కూడిన జీవితాన్ని అనుభవించడం, ఇళవరసితో కలిసి బెంగళూరులో షాపింగ్ చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. వారికి ఈ వెసులుబాటు కల్పించిన జైలు ఉన్నతాధికారులకు శశికళ రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లు అప్పటి జైళ్లశాఖ డీఐజీ రూప ఆరోపించారు. దీంతో రిటైర్డు ఐఏఎస్ అధికారి వినయ్కుమార్ నేతృత్వంలో విచారణ కూడా జరిగింది. డీఐజీ రూప చేసిన ఈ ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయ్యాయి. కాగా చెన్నై ఆళ్వార్పేటకు చెందిన గీత అనే సామాజిక కార్యకర్త దాఖలు చేసిన కేసుపై కర్ణాటక హైకోర్టులో గత ఏడాది ఆగష్ట్ 25న తొలివిడత చార్జిషీటు దాఖలైంది. ఈ కేసు కర్ణాటక హైకోర్టులో బుధవారం మరోసారి విచారణ వచ్చింది. ప్రభుత్వ తరపు న్యాయవాది మన్మోహన్ హాజరై జైలు అధికారులకు లంచం ఇచ్చిన కేసులో శశికళ, ఇళవరసికి వ్యతిరేకంగా తుది చార్జిషీటు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద సంబంధిత వ్యక్తులపై చర్య తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిందని తెలిపారు. అవినీతి కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈకేసుపై త్వరలో విచారణ ప్రారంభించనున్నట్లు సమాచారం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement